Melania Trump
-
జైశంకర్కు ముందు సీటు.. మెలానియా తళుకులు.. సందడిగా సాగిన ట్రంప్ ఈవెంట్లో చిత్రాలెన్నో!
-
ట్రంప్ దూకుడు.. తొలి రోజే సంచలన నిర్ణయాలు
President Donald Trump Key Decisions Updates..అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.నలుగురు అధికారులపై ట్రంప్ వేటు..అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ దూసుకెళ్తున్నారు.నలుగురు అధికారులపై ట్రంప్ వేటు వేశారు.అలాగే, ‘వెయ్యి మందికి’ హెచ్చరికలు మంజూరుతన అధ్యక్ష కార్యాలయం ప్రస్తుతం వడపోత పనులు చూస్తోందని ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ట్రంప్మునుపటి అధ్యక్షుడి కాలంలో నియమితులైన వెయ్యి మందిపై వేటు పడనుందని వెల్లడి‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలి’ అనే మా విధానానికి అనుగుణంగా లేని వారంతా విధుల్లో కొనసాగలేరని వ్యాఖ్యలుఖడ్గం పట్టుకుని ట్రంప్ డ్యాన్స్అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్ డ్యాన్స్అమెరికా మిలటరీకి చెందిన ఖడ్గంతో ట్రంప్ డ్యాన్స్ చేశారు.ట్రంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. THE MOST DANGEROUS MAN IN THE WORLD RIGHT NOW...😎🇺🇸🤣🤣🤣 pic.twitter.com/b0MwA5xf2l— il Donaldo Trumpo (@PapiTrumpo) January 21, 2025 భారతీయులకు ట్రంప్ ఝలక్?విదేశీ మహిళలు అమెరికాలో ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్పేరెంట్స్లో ఒకరికైనా యూఎస్ సిటిజన్షిప్, శాశ్వత నివాసి, యూఎస్ మిలిటరీ సభ్యత్వం ఉండాలి.ఇలా ఏదో ఒక గుర్తింపు ఉండాలని నిబంధన విధించిన ట్రంప్2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 5.4 మిలియన్ల భారతీయ అమెరికన్లుయూఎస్ జనాభాలో 1.47 శాతం మంది భారతీయులే. ఇక, చైనీయులు కూడా అమెరికాలో భారీ సంఖ్యలోనే ఉన్నారు. దీంతో, వారు కూడా అమెరికాను వీడే అవకాశం ఉంది. పుతిన్కు హెచ్చరికలు..ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించిన ట్రంప్..రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నారన్న మండిపడిన ట్రంప్.యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు అంగీకరించడం లేదని కామెంట్స్పుతిన్ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని సూచనలేకపోతే రష్యా గొప్ప ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని హెచ్చరిక కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నులు: ట్రంప్కెనడా, మెక్సికో షాకిచ్చిన ట్రంప్.ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధింపు.ఆ రెండు దేశాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయకపోతే పన్నుల విధింపు తప్పదని ఇది వరకే హెచ్చరించిన ట్రంప్ఈ మేరకు తాజాగా ప్రకటనఅయితే, చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపు గురించి వెల్లడించని అమెరికా నూతన అధ్యక్షుడుPresident Trump: 25% tariffs on each of Canada and Mexico beginning February 1st. pic.twitter.com/ncfBmMI242— Stephen Taylor (@stephen_taylor) January 21, 2025క్యాపిటల్ దాడి కేసులు రద్దు.. ట్రంప్ క్షమాభిక్ష2021 జనవరి 6న దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ఉపశమనం కల్పించిన ట్రంప్కార్యాలయంలోకి వచ్చిన మొదటి రోజునే తనకున్న ప్రత్యేక అధికారాల వినియోగంఈ చర్యతో యూఎస్ న్యాయశాఖ చరిత్రలోనే అతిపెద్ద విచారణ, సుదీర్ఘ దర్యాప్తునకు ముగింపుతన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఎన్నికల సమయంలోనే హామీట్రంప్ కీలక సంతకాలు ఇవే..బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన 80 విధ్వంసకర, రాడికల్ పరిపాలనా ఉత్తర్వులు రద్దు చేసిన ట్రంప్ట్రంప్ యంత్రాంగంపై పట్టు సాధించేవరకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్తర్వులుమిలిటరీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలు మినహా అన్ని సమాఖ్య నియామకాలు నిలిపివేతపారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన ట్రంప్వాక్ స్వాతంత్ర్యంపై సెన్సార్ తొలగింపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఔట్..అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. అమెరికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తొలగిస్తూ సంతకం. కోవిడ్ వ్యాప్తి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. President Trump withdraws the United States from the World Health Organization.pic.twitter.com/4vnEJTQQl9— நெல்லை செல்வின் (@selvinnellai87) January 21, 2025 AMERICA IS BACK. 🇺🇸Every single day I will be fighting for you with every breath in my body. I will not rest until we have delivered the strong, safe and prosperous America that our children deserve and that you deserve. This will truly be the golden age of America. pic.twitter.com/cCuSV8Q44Z— President Donald J. Trump (@POTUS) January 20, 2025 మోదీ అభినందనలు..అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు. ట్విట్టర్ వేదికగా మోదీ..‘నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు, ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆయన పదవీకాలం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కామెంట్స్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు.ట్రంప్ రాకతో వైట్హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. BREAKING: President Trump signs an Executive Order designating the cartels as foreign terrorist organizations pic.twitter.com/Pc6pbMsbBo— Libs of TikTok (@libsoftiktok) January 21, 2025 -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
Donald Trump Inauguration Live Updates..10:33PMThe 60th Presidential Inauguration Ceremony https://t.co/kTB4w2VCdI— Donald J. Trump (@realDonaldTrump) January 20, 2025అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారంఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశారు వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనిలో భాగంగా 25వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ముందుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలుట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులు మూసివేయడంతో పాటు మెట్రో సర్వీసులను మళ్లించారు. 9:25PMవైట్హౌస్కు ట్రంప్.. స్వాగతం పలికిన బైడెన్ 👉కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్కు చేరుకున్నారు. డొనాల్డ్ ట్రంప్కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సాదర స్వాగతం పలికారు.Joe y Jill Biden reciben a Donald y Melania Trump antes de su salida de la Casa Blanca.Al mediodía de hoy y siguiendo lo establecido en la Constitución, Donald Trump prestará juramento y asumirá su cargo como presidente de EUA. pic.twitter.com/699c25xd7A— InformaES 🇸🇻 (@InformaESV) January 20, 2025 👉రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ సందడి నెలకొంది. Donald Trump et Melania Trump arrivent à la messe à l'église St. Johns avant la 60e investiture présidentielle.#Trump2025 pic.twitter.com/Sax4VpgfO6— ICÔNE (@IconeMediaFR) January 20, 2025వైట్హౌస్లో బైడెన్ సెల్ఫీ..👉కొద్ది గంటల్లో ముగియనున్న జో బైడెన్ అధ్యక్ష పదవీ కాలం. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సెల్ఫీ. అంతకుముందు వైట్హౌస్కు చేరుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులకు స్వాగతం పలికిన జో బైడెన్, జిల్.For me, the People’s House has always been about welcoming everyone. America, thank you for trusting me with this sacred place. I’ve loved opening the doors to the Oval Office wider than ever these past four years. pic.twitter.com/G3BmVqEEiY— President Biden (@POTUS) January 20, 2025 One more selfie for the road. We love you, America. pic.twitter.com/71k46uGADV— President Biden (@POTUS) January 20, 2025 ట్రంప్కు పుతిన్ అభినందనలు..👉అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు. ఇదే సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్. డొనాల్డ్ ట్రంప్ రాబోయే అమెరికా ప్రభుత్వంతో ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏదైనా పరిష్కారం శాశ్వత శాంతిని నిర్ధారిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రజల చట్టబద్ధమైన ప్రయోజనాలను గౌరవించడం ఆధారంగా శాశ్వత శాంతి నెలకొల్పాలన్నారు.Russian President Vladimir Putin said Monday he was open to talks on the Ukraine conflict with Donald Trump's incoming US administration and hoped any settlement would ensure "lasting peace"."We are also open to dialogue with the new US administration on the Ukrainian… pic.twitter.com/AvkRFAjhhv— Hespress English (@HespressEnglish) January 20, 2025 👉చర్చీలో డొనాల్డ్ ట్రంప్ దంపతులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన నివాసం వద్ద ఉన్న సెయింట్ జాన్స్ చర్చికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్👉ప్రపంచదేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది.🇺🇸TRUMP, MELANIA SPOTTED AT ST. JOHN’S CHURCH AHEAD OF INAUGURATION#Trump2025 #TrumpInauguration2025 #Inauguration2025 #Inauguration pic.twitter.com/ydj19nb4FD— MOHAMMAD AL_ARSHASHAN (@MOHAMMAD_ALARSH) January 20, 2025 తొలిరోజే భారీగా సంతకాలు! 👉మొదటి రోజే తనదైన ముద్ర కనిపించేలా ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1,500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటివాటిని తొలిరోజే మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు.Live from Washington D.C. ‼️Dion Powell MPA is right outside Capital One Arena, mingling with the excited crowds as they await the historic inauguration of Donald Trump as the 47th President of the United States. @DION_POWELL00 #Inauguration2025 #TrumpInauguration pic.twitter.com/waunBxNaMP— LiveONE.TV (@LiveONE_TV) January 20, 2025 ఫలితాల అనంతరం..👉ఫలితాల అనంతరం కూడా ట్రంప్ పలు కీలక ప్రకటనలు చేశారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేయడం, గ్రీన్ల్యాండ్, పనామాలను స్వాధీనం చేసుకోవడం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటి ప్రకటనలు చేసిన ట్రంప్.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపార్టేషన్ ఆపరేషన్ చేపడతామని చెప్పారు.Les gens entrent maintenant dans l’arène Capital OnePour L'investiture de Donald J. Trump en tant que 47e président des États-Unis#Trump2025 #TrumpInauguration #DonaldTrump #DonaldTrump2025 #JDVance2025 #ElonMusk2025 #magaQuebec #maga2025 #ElonMusk pic.twitter.com/rlKRS8ZoWX— LE PRÉSIDENT DONALD TRUMP 2025/2029 (@INFOQUBEC) January 20, 2025 కుటుంబ నేపథ్యం..👉న్యూయార్క్లోని క్వీన్స్లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జూన్ 14, 1946న డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగోవాడు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్లో 1968లో డిగ్రీ పట్టా పొందారు.👉తండ్రి కంపెనీలో 1971లో బాధ్యత స్వీకరించిన ట్రంప్.. అనంతరం ట్రంప్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారు. హోటల్స్, రిసార్టులు, నిర్మాణ రంగం, క్యాసినోలు, గోల్ఫ్ కోర్స్ల్లో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 2004లో ‘ది అప్రెంటిస్’ రియాల్టీ టీవీ షోతో దేశమంతా పాపులర్ అయ్యారు.👉క్రీడాకారిణి, మోడల్ ఇవానా జెలింకోవాను తొలుత వివాహం చేసుకున్న ట్రంప్.. 1990లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్లు సంతానం. ఆ తర్వాత నటి మార్లా మార్పెల్స్ను 1993లో పెళ్లి చేసుకున్న ట్రంప్.. 1999లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె టిఫానీ ట్రంప్. స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్ మెలానియాను 2005లో ట్రంప్ వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు బారన్ విలియమ్ ట్రంప్.👉రిపబ్లికన్ పార్టీ తరఫున 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్.. డెమోక్రటిక్ నేత హిల్లరీ క్లింటన్పై విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి చెందిన ట్రంప్.. 2024లోనూ బరిలోకి దిగారు. డెమోక్రట్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. -
వైట్హౌస్పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్హౌస్లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్హౌస్లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్హౌస్కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్తో విభేదించారు. గత అక్టోబర్లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్్కకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
ట్రంప్పై దాడి చేసినవాడు రాక్షసుడు: మెలానియా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి జరిగిన అనంతరం అతని భార్య మెలానియా తన ఆవేదనను ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల షూటర్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయమయ్యింది.మెలానియా తన భావోద్వేగాలను ఒక ప్రకటనలో పంచుకుంటూ ట్రంప్ను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ఘటనలో గాయపడినవారికి సానుభూతి ప్రకటించారు. ఆమె తన ప్రకటనలో.. ‘డొనాల్డ్ అభిరుచిని, నవ్వును, మాటల చాతుర్యాన్ని, సంగీతంపైగల ప్రేమను, అతని స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక అమానవీయ రాజకీయ ఘటన ఇది. ట్రంప్పై దాడి చేసినవాడు రాక్షసుడు. నా భర్త జీవితంలో నాకు నచ్చిన ప్రధాన అంశం అతని మానవతా దృక్పథం.ఆయన ఉదారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మంచి, చెడు సమయాల్లో నేను అతని వెంట ఉన్నాను. ప్రేమకు భిన్నమైన అభిప్రాయాలు, విధానాలు, రాజకీయ ఆటలు హీనమైనవని మనం మరచిపోకూడదు. మా వ్యక్తిగత, నిర్మాణాత్మక జీవిత కట్టుబాట్లు మా మరణం వరకు అలానే కొనసాగుతాయి. దేశంలో మార్పు పవనాలు వచ్చాయని అంటున్నారు. ఈ మాటకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. రాజకీయ విభేదాలకు అతీతంగా స్పందిస్తున్నవారిని అభినందిస్తున్నాను’ అని మెలానియా పేర్కొన్నారు. pic.twitter.com/IGIWzL6SMJ— MELANIA TRUMP (@MELANIATRUMP) July 14, 2024 -
ట్రంప్ దంపతుల విడాకులు ఖాయమేనా..
వాషింగ్టన్: అమెరికాలో వాళ్ల అధికారం ముగిసియడంతో ట్రంప్ దంపతులు వైట్హౌజ్ వీడి తిరుగు పయనం అయ్యారు. ఈ నేపథ్యంలో విమానంలో ఫ్లోరిడా చేరుకున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్లను మీడియా పలకరించింది. అయితే విమానం నుంచి దిగుతున్న వారికి మీడియా ఎదురుపడి ఫొటోలు తీస్తుండగా ట్రంప్ వారిని గుర్తించి కెమెరాలకు ఫోజ్ ఇచ్చారు. అయితే మెలానియా ట్రంప్ మాత్రం ఆగకుండా తన దారిన సైలెంట్గా వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెలానియా తీరుపై నెటిజన్లు మీమ్స్ క్రియోట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ట్రంప్తో కలిసి ఫోజ్ ఇవ్వడం ఇష్టం లేకే ఆమె ఇలా చేశారంటూ మరోసారి వారి విడాకుల విషయంపై చర్చించుకుంటున్నారు. (చదవండి: వైట్హౌజ్ను వీడిన తర్వాతే.. ఎందుకంటే!) If “I’m over it” were a person. pic.twitter.com/CLA8WucyXX — The Lincoln Project (@ProjectLincoln) January 21, 2021 ‘4 సంవత్సరాల తర్వాత మెలానియా చివరకు మళ్లీ సంతోషంగా నవ్వుకుంటున్నారు. ప్రకృతి తనకు సహకరిస్తోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ట్రంప్ వైట్హౌజ్ను వీడాక మెలానియా విడాకులు ఇవ్వనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా మెలానియా తీరు చూసి నెటిజన్లు త్వరలోనే భర్త డొనాల్డ్ ట్రంప్కు ఆమె విడాకులు ఇవ్వడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ట్రంప్ రాజకీయ సహాయకురాలు ఓమరోసా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే మెలానియా ట్రంప్కు విడాకులు ఇవ్వనున్నారు. తన 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికేందుకు ఎదురుచుస్తున్నారు. ట్రంప్కు భార్యగా తను నిమిషాలు లెక్కబెడుతున్నారు. వైట్హౌజ్ వీడిన అనంతరం విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు’ ఒమరోసా తను రాసిన పుస్తకంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. (చదవండి: విడాకులు : మెలానియాకు భారీ మొత్తంలో..) After 4 long years, @MELANIATRUMP can finally smile again! Nature is healing. pic.twitter.com/bRNoR5PBrh — 🌸Sleepy Moogle🌸 (@BaileysComet_xo) January 22, 2021 -
మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ ఓటమి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విధిలేని పరిస్థితుల్లో శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు బుధవారం ఉదయం ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలు వైట్హౌస్ వీడి ఫ్లోరిడాకు వెళ్లారు. ముందుగా చెప్పినట్టుగానే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరు కాలేదు. అధ్యక్షులు మాత్రమే వినియోగించే మెరైన్ వన్ హెలికాప్ట్టర్లో ఫ్లోరిడాలోని తాను నివాసం ఉండబోయే మార్ ఏ లాగో ఎస్టేట్కి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. వైట్హౌస్లోని సౌత్ లాన్లో మెరైన్ వన్ హెలికాప్టర్లోకి వెళ్లడానికి ముందు ట్రంప్ తనకు వీడ్కోలు చెప్పిన మద్దతుదారులు, సిబ్బందిని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడారు. ఏదో ఒక రూపంలో తాను మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్లు చాలా గొప్పగా గడిచాయన్న ట్రంప్ తాము ఎంతో సాధించామని గర్వంగా ప్రకటించుకున్నారు. ‘‘ఇది నాకెంతో గౌరవం, జీవితకాలంలో లభించిన గౌరవం. ప్రపంచంలోనే మీరంతా గొప్ప ప్రజలు. ఈ జగత్తులోనే గొప్ప ఇల్లు ఇది’’ అని కొనియాడారు. ‘‘నేను మీ కోసం ఇంకా పోరాటం చేస్తాను. ఏదో ఒక రకంగా మళ్లీ వస్తా’’ అని ట్రంప్ అన్నారు. నిండైన ఆత్మవిశ్వాసంతో వెళుతున్నా వైట్ హౌస్ మంగళవారం విడుదల చేసిన ట్రంప్ ప్రసంగం వీడియోలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ‘‘నేను ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నాను. గట్టి పోరాటాలే చేశాను. మీరు అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. ఇప్పుడు నిండైన ఆత్మ విశ్వాసంతో శ్వేతసౌధాన్ని వీడుతున్నా. మా ప్రభుత్వం సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ గర్వంగా మీ ముందు నిలబడ్డాను. వైట్హౌస్ వీడి వెళుతున్నప్పటికీ తాను ప్రజాసేవలోనే ఉంటా’’ అని ట్రంప్ చెప్పారు. ఈ చివరి వీడ్కోలు ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. ట్రంప్ నోట్ న్యూయార్క్: నూతన అధ్యక్షుడి ప్ర మాణస్వీకార సమయంలో పదవి వీడుతున్న అధ్యక్షుడు పాటించాల్సిన దాదాపు అన్ని సంప్రదాయాలను పక్కనబెట్టిన ట్రంప్.. ఒక సంప్రదా యాన్ని మాత్రం పాటిం చారు. కొత్త అధ్యక్షుడి కోసం వైట్హౌస్లోని అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో ఒక సందేశాన్ని ఉంచారు. ఓవల్ ఆఫీస్లోని రెజొల్యూట్ డెస్క్లో ఈ నోట్ను ట్రంప్ పెట్టారు. బైడెన్ ప్రమాణ స్వీకారం కన్నా ముందే ట్రంప్ వాషింగ్టన్ను, వైట్హౌస్ను వీడి ఫ్లారిడాకు పయనమయ్యారు. బైడెన్కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు. -
మీ అందరికీ గుడ్ బై: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడారు. మరికొన్ని గంటల్లో డెమొక్రాట్ జో బైడెన్ అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న వేళ వైట్హౌజ్ సిబ్బందికి ట్రంప్ దంపతులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఈ నాలుగేళ్లు ఎంతో గొప్పగా గడిచాయి. మనమంతా కలిసి ఎన్నో సాధించాం. నా కుటుంబం, స్నేహితులు, నా సిబ్బందికి పేరు పేరునా ధన్యవాదాలు. మీరెంత కఠినశ్రమకోర్చారో ప్రజలకు తెలియదు. అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితకాలంలో లభించిన గొప్ప గౌరవం. అందరికీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నా’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడారు.(చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్) అదే విధంగా.. ‘‘మనది గొప్ప దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి. కరోనా మహమ్మారి మనల్ని దారుణంగా దెబ్బకొట్టింది. అయినప్పటికీ మనమంతా కలిసి వైద్యపరంగా ఒక అద్భుతమే చేశాం. తొమ్మిది నెలల్లో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసుకున్నాం’’ అని ట్రంప్ తమ హయాంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం గురించి చెప్పుకొచ్చారు. ఇక కొత్త పాలనా యంత్రాంగానికి ఆల్ ద బెస్ట్ చెప్పిన ట్రంప్.. ‘‘మీకోసం(ప్రజలు) ఎల్లప్పుడూ నేను పాటుపడతాను. ఈ దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. కొత్త ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలి’’ అని సందేశం ఇచ్చారు. కాగా తన సతీమణి మెలానియా కలిసి ఎర్రటి తివాచీపై నడుచుకుంటూ వచ్చిన ట్రంప్.. మెరైన్ వన్ హెలికాప్టర్లో ఎక్కి ఎయిర్బేస్కు బయల్దేరారు. అక్కడి నుంచి ఎయిర్ఫోర్స్ వన్లో ఫ్లోరిడాకు చేరుకోనున్నారు. -
మిషెల్ మిమ్మల్ని ఎంత గౌరవించారు.. మీరేంటిలా?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం ముగియడానికి మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. వివాదాలు, విమర్శల విషయంలో అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ట్రంప్ రికార్డును సమం చేయలేరు. ఇక అధ్యక్ష ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ట్రంప్ మరిన్ని వివాదాస్పద చర్యలకు పూనుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేయడం.. ఆ తర్వాత ట్రంప్పై అభిశంసన ప్రవేశపెట్టడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక అమెరికా చరిత్రలోనే రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. రేపు జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోవడం లేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రస్తుత ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్పై కూడా నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. వైట్ హౌస్ సంప్రదాయలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘మీ కన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా దంపతులు మీ విషయంలో ఎంత గౌరవంగా.. హుందాగా ప్రవర్తించారు.. మరి మీరేంటిలా’ అని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!) నెటిజనులు మెలానియాను ఇంతటా ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె భవిష్యత్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ను ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్కి ఆహ్వానించలేదు. అధికార పరివర్తనలో భాగంగా ప్రస్తుత ఫస్ట్ లేడి.. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కన్నా ముందే భవిష్యత్ ఫస్ట్లేడీని ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్కి ఆహ్వానిస్తారు. బ్రెస్ ట్రూమన్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం మిషెల్ ఒబామా వరకు అందరు పాటించారు. ఇక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన భర్త పౌరసత్వానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి.. మిషెల్ ఒబామా వాటిని మనసులో పెట్టుకోలేదు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే అప్పటి మొదటి మహిళ మిషెల్ ఒబామా, తన భర్తతో కలిసి వెళ్లి మెలానియాను సాదరంగా ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం మెలానియా ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పటివరకు ఆమె భవిష్యత్ ఫస్ట్ లేడి జిల్ బైడెన్ని కనీస పలకరించిన దాఖలాలు కూడా లేవు. (చదవండి: శ్యామ్ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు) Michelle Obama graciously hosted Melania Trump at the White House immediately after 2016 election to ensure a smooth transition. Melania Trump has done absolutely nothing for Dr. Jill Biden. Some people are givers, others takers: pic.twitter.com/lBYWe32wkR — Michael Beschloss (@BeschlossDC) January 18, 2021 దాంతో నెటిజనలు మెలానియాను విమర్శిస్తున్నారు. కొందరు(ఒబామా లాంటి వాళ్లు) ఇవ్వడానికి ఉంటే.. మరికొందరు(ట్రంప్ ఆయన భార్య మెలానియా) లాంటి వాళ్లు తీసుకోవడానికే ఉంటారని దుయ్యబడుతున్నారు. ఇక తన ఫేర్వెల్ మెసేజ్లో మెలానియా అమెరికన్లు తమ ఉత్తమమైన చొరవను అనుసరించాలని.. హింస ఎన్నడూ సమాధానం కాదని స్పష్టం చేశారు. -
మెలానియా ట్రంప్ ఇంటి చూపులు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తన మొండి వైఖరిని వీడటం లేదు. జో బైడెన్ ఎన్నికను ఒప్పుకోవటం లేదు. కానీ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. వైట్హౌస్ను వదిలి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నారామె. వైట్హౌస్ను వీడిన తర్వాతి పరిస్థితుల గురించి గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. వాషింగ్టన్నుంచి మార్-ఎ-లగోకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత సామాగ్రిని తరలించటానికి ప్రయత్నిస్తున్నారంట. 14 ఏళ్ల కుమారుడు బ్యారన్తో ఆమె మార్-ఎ-లగోకు వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలో తల్లిగా, భార్యగా, అమెరికా ప్రథమ మహిళగా తన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ( వ్యాక్సిన్ మొదట మాకే కావాలి : ట్రంప్ ) కాగా, డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్ను వీడిన తర్వాత మెలానియా ఆయనతో విడాకులు తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్- మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలిసి ఉంటున్నారంటూ గతంలో ఒమరోసా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్.. ఆమెకు భరణం కింద దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించనున్నారని ఆమె తెలిపారు. -
వైట్హౌజ్ను వీడిన తర్వాతే.. ఎందుకంటే!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడిన తర్వాతే ఆయన సతీమణి మెలానియా విడాకుల విషయం గురించి ఆలోచిస్తారని ట్రంప్నకు రాజకీయ సహాయకురాలుగా పనిచేసిన ఒమరోసా మానిగాల్ట్ న్యూమన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న సమయంలో విడిపోవడం గురించి ఆలోచిస్తే ట్రంప్ తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే మెలానియా అధికార ప్రతినిధులు మాత్రం ఒమరోసా వ్యాఖ్యలను ఖండించారు. ఇవన్నీ నిరాధార కథనాలు అంటూ కొట్టిపడేశారు. కాగా ట్రంప్తో 15 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికేందుకు మెలానియా ఎదురుచూస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు) వీరిద్దరి బంధం గురించి ‘అన్హింగ్డ్’ పేరిట రాసిన పుస్తకంలో ఒమరోసా ప్రస్తావించడం వీటికి బలం చేకూర్చింది. ట్రంప్- మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలిసి ఉంటున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక విడాకులు తీసుకుంటున్నందుకు గానూ ట్రంప్.. తన మూడవ భార్య మెలానియాకు భరణం కింద సుమారు రూ. 500 కోట్లు చెల్లించనున్నారని ఓ పత్రికకు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమరోసా పేర్కొన్నారు. కాగా ట్రంప్- మెలానియా దాంపత్యానికి గుర్తుగా వారిద్దరికి బారన్ ట్రంప్ జన్మించాడు. అతడి వయస్సు ఇప్పుడు పద్నాలుగేళ్లు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అన్న ట్రంప్.. మంగళవారం ఎట్టకేలకు అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.( (చదవండి: పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం: జిన్పింగ్) -
విడాకులు : మెలానియాకు భారీ మొత్తంలో..
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు భారీగానే భరణం అందనుంది. కాగా 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పినట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడించింది. ‘ట్రంప్కు విడాకులు ఇవ్వడానికి ఆమె ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’ అని ఒమరోసా తెలిపారు. ఈ విలువ ($68 మిలియన్) దాదాపు 500కోట్లకు పైగానే ఉంటుందని న్యాయనిపుణులు, న్యూమాన్ & రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. (ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే) వారిద్దరికి 14 ఏళ్ల బారన్ ట్రంప్ సంతాపం. కాబట్టి ఆమెకు అందే ప్రాథమిక కస్టోడియల్ హక్కులన్నీ లభిస్తాయని న్యూమాన్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్కు మెలానియా మూడవ భార్య. అయితే ట్రంప్ మాజీ భార్యాల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందనుంది. మొదటి భార్యకు 14 మిలియన్ డాలర్లు, రెండవ భార్యకు 2 మిలియన్ డాలర్లను అప్పజెప్పగా తాజాగా మెలానియాకు మాత్రం 68 మిలియన్ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. (‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ ) -
వైట్హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్తో భార్య మెలానియా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో చాలా స్పష్టమైన మెజారిటీతో గెలుపొంది జోబిడెన్ అధ్యక్ష పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు మొత్తం కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇదిలా వుండగా ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, తాను ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురయ్యింది. ఈసారి ట్విటర్ వేదికగా ట్రంప్ న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఓటమిని అంగీకరించాలని ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా ట్రంప్కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ సన్నిహితులు కూడా ఇంకా అంతా అయిపోయిందని ఓటమిని అంగీకరించాలని ట్రంప్కు హితవు పలుకుతున్నాయి. ఇక ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ గౌరవప్రదంగా వైట్హౌస్ నుంచి బయటకు వెళ్దాం అని ట్రంప్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయాన్ని ఆమె బహిరంగంగా వెలిబుచ్చలేదు. అయితే ట్రంప్ కుమారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో తగ్గటానికి వీలు లేదని మొండిపట్టు మీద ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..! -
ట్రంప్ మెలానియా విడాకులు?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై కొట్టేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడిం చింది. ‘‘ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు వైదొలుగుతారా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోగానే విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’’ అని ఒమరోసా తెలిపారు. చాలా కాలంగా విభేదాలు! అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని ఆ కథనం వెల్లడించింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వెళ్లిన 5నెలలకు వైట్హౌస్కొచ్చారు. తమ కుమారుడు బారెన్ స్కూలింగ్ కోసమే ఆమె వైట్ హౌస్కి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ట్రంప్కున్న ఆస్తిపాస్తుల్లో తనకి, తన కుమారుడు సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చు కున్నారని, అది కుదిరాక శ్వేతసౌధానికి ఆమె వచ్చారని ట్రంప్ అనుచరుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్లడించారు. వారి పడక గదులు వైట్ హౌస్లో వేర్వేరు అంతస్తుల్లో ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. చదవండి: ‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ -
మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ కు దొరికి పోయారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో మెలానియాకు డూప్ను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న తాజా వివాదం వైరల్ అవుతోంది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) వివరాల్లోకి వెళితే గతకొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలి ఉన్న మరో మహిళను తీసుకెడుతున్నారంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్లోని నాష్విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది. ఎయిర్ క్రాఫ్ట్లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదరం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ ‘ఫేక్ మెలానియా’ హ్యాష్ట్యాగ్ను ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని మహిళను తన భార్యగా ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య ప్రథమ మహిళ మెలానియీ ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే మిలటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. విపరీతమైన దగ్గు కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలకమైన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ ఆమె ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. So, why do you think they need a #FakeMelania? pic.twitter.com/XpAJkXZiW8 — Bmar✨🏰🏳️🌈|BLM🌊💙 (@Bmar_Matrix) October 25, 2020 That is the $64,000 question. Can we get #FakeMelania trending? https://t.co/27TgMnZbDR pic.twitter.com/vrjIYmKQn9 — voteblue2020 (@lflorepolitics) October 25, 2020 #fakemelania How it started How it’s going pic.twitter.com/w6sgvv6NqF — TheQueerGuy (@TheQueerGuy) October 25, 2020 She very pretty Melania, da? #FakeMelania #PutinsPuppet pic.twitter.com/lVwfu8NYvB — moonshine blind (@moonshineblind) October 26, 2020 -
ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్
వాషింగ్టన్: కరోనావైరస్ సోకిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎడతెగని దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో రానున్న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అరుదైన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ప్రతినిధి వెల్లడించారు. మెలానియ భర్త, ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని మెలానియా వదులుకున్నారని స్టెఫానీ గ్రిషామ్ ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ నుంచి మెలానియా ట్రంప్ ఆరోగ్యం రోజురోజుకూ చక్కబడుతోంది. కానీ దగ్గు మాత్రం తగ్గడంలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని స్టెఫానీ తెలిపారు ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె, కోలుకుంటున్నప్పటికీ, విపరీతంగా దగ్గుతూ ఉండటంతో ఆమె పెన్సిల్వేనియాలో జరగనున్న ర్యాలీకి వెళ్లడం లేదన్నారు. గత రెండు వారాల్లో ట్రంప్ రోజుకు కనీసం ఒక ర్యాలీతో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. 2019 నుండి తన భార్యతో వేదికపై కనిపించలేదు. మెలానియా పెన్సిల్వేనియాకు వెళ్లి ఉంటే, దాదాపు సంవత్సరం తరువాత భర్తతో కలిసి అతి కీలకమైన ర్యాలీలో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అనారోగ్యం కారణంగా ఆ గోల్డెన్ చాన్స్ ను మెలానియా మిస్ అవుతున్నారని భావిస్తున్నారు. కాగా ఈ నెల ఆరంభంలో ట్రంప్, మెలానియాలతో పాటు వారి కుమారుడు బారోన్ (14) కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. -
డొనాల్డ్ ట్రంప్ కుమారుడికి కరోనా..
వాషింగ్టన్: అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ బుధవారం వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. బారన్ ప్రస్తుతం టీనేజర్ కావడంతో ఎటువంటి లక్షణాలు లేవని మెలానియా తెలిపారు. అక్టోబర్ 2న ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారితో పాటు వైట్ హౌజ్లోని సిబ్బంది కొందరికి కరోనా వచ్చింది. మూడు రోజుల పాటు సైనిక ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం వైట్హౌస్కు చేరుకున్న ట్రంప్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత వారు కోవిడ్ నుంచి కోలుకున్నారు. చదవండి : నేను సూపర్ మ్యాన్ను: ట్రంప్ బుధవారం నాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, "నా చిన్న కుమారుడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని చెప్పారు. వైరస్ తనకు చాలా స్వల్ప కాలం కనిపించిందని, బహుశా అతడికి ఈ వైరస్ సోకిందని కూడా తెలిసి ఉండదన్నారు. బారన్ రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల ప్రమాదం లేదన్నారు. కాగా మెలానియా ట్రంప్ తనకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని, అతి త్వరలోనే ప్రథమ మహిళ బాధ్యతలను తిరిగి మొదలుపెడతానని ఆమె చెప్పారు. కరోనా సోకిన తరువాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని పేర్కొన్నారు. అదే విధంగా ముగ్గురికి ఒకేసారి కరోనా సోకడం ఆనందంగా ఉందని.. ఎందుకంటే ఒకరినొకరు చూసుకుంటామని, కలిసి సమయం గడపవచ్చునని మెలానియా తెలిపారు. చదవండి : ట్రంప్కి కరోనా నెగెటివ్ -
ట్రంప్ దంపతులు కోలుకోవాలని ప్రార్థించిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని కిమ్ ప్రార్థించినట్లు ఉత్తర కొరియా మీడియా శనివారం ప్రకటించింది. ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. (చదవండి: త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ) దీంతో వారి ఆరోగ్యంపై కిమ్ స్పందిస్తూ.. ట్రంప్ దంపతులు త్వరగా మహమ్మారి నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. అయితే ఈ రెండు దేశాల అధ్యక్షులు ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేవారు. ఇటీవల వీరిద్దరూ కలిసి సింగపూర్లోని ఓ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. అయితే సమావేశంలో చర్చలు విఫలమైనప్పటికీ.. వీరి మధ్య మాత్రం మైత్రి బలపడింది. అందుకే గతంలో కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ట్వీట్ చేయగా.. ఇవాళ ట్రంప్ ఆరోగ్యంపై కిమ్ స్పందించారు. (చదవండి: కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు) -
నేను బాగానే ఉన్నాను: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోవిడ్ బారిన పడిన ట్రంప్కి ప్రస్తుతం ప్రయోగాత్మక చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తమకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన తర్వాత ట్రంప్ దంపతులు బహిరంగంగా కనిపించలేదు. శుక్రవారం మాత్రం అధ్యక్షుడు మాస్క్ ధరించి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చి వాషింగ్టన్ బయట ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. తాను ఆస్పత్రి పాలయ్యానని.. కానీ బాగానే ఉన్నానని తెలిపారు. అన్ని సక్రమంగా జరిగేలా చూస్తానన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా బాగానే ఉన్నారని తెలిపారు ట్రంప్. (కోవిడ్-19 : ట్రంప్ ముందున్న ముప్పు ఇదే!) pic.twitter.com/B4H105KVSs — Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020 వైద్యుల సూచన మేరకు ఇక రాబోయో కొద్ది రోజులు ట్రంప్ వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్నానీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవడానికి ఈ ప్రయత్నం అన్నారు. ట్రంప్ సహాయకులు మాట్లాడుతూ.. ఆయన తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని.. కానీ మంచి ఉత్సాహంతో ఉన్నారని.. ఆయన చాలా శక్తివంతుడు అని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్లో ఉన్న రెజెనెరాన్ యాంటీబాడీ కాక్టెయిల్ డోస్ ట్రంప్కిచ్చారని వైట్ హౌస్ వైద్యుడు సీన్ కొన్లీ కీలక ప్రకటన చేశారు. (చదవండి: కరోనాతో 500 మంది వైద్యులు మృతి) ట్రంప్ కోసం ప్రార్థించిన బైడెన్ ఇక ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ మాస్క్ ధరించకపోవడం వల్లే ట్రంప్కు ఈ పరిస్థితి తలెత్తిందని.. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక మంగళవారం క్లీన్ల్యాండ్లో జరిగిన తొలి చర్య సందర్భంగా దాదాపు 90 నిమిషాల పాటు ట్రంప్తో సన్నిహితంగా ఉన్నారు. దాంతో బైడెన్, ఆయన భార్య జిల్ శుక్రవారం పరీక్షలు చేయించుకున్నారు. తమకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అంతేకాక ట్రంప్, అతని కుటుంబం కోసం తాను ప్రార్థిస్తున్నానని బైడెన్ తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, కరోనావైరస్ని తీవ్రంగా పరిగణించినందుకు తాను దాని బారిన పడలేదని అమెరికన్లకు గుర్తుచేశాడు, తన ప్రత్యర్థిలా కాకుండా, తాను మాస్క్ని ఖచ్చితంగా వాడానన్నారు. ఇక మాస్క్ ధరించడం అంటే దేశభక్తి కలిగి ఉండటమేనని.. ఎవరికోసమే కాక మీ కోసం ఈ పని చేయాలని కోరారు బైడెన్ -
ట్రంప్కు కరోనా!
విధిరాతకు చిన్నా పెద్దా, పేదా గొప్పా తారతమ్యం లేదని కరోనా మరోమారు రుజువు చేసింది. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి స్వయంగా దాని బారిన పడ్డారు. మాస్కు పెట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన పెద్దన్న చివరకు క్వారంటైన్ గూటికి చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోవిడ్ బారిన పడటం ట్రంప్నకు షాక్ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్తో డిబేట్లో పాల్గొన్న బైడెన్కు కూడా కరోనా వస్తుందా? ఒకవేళ వస్తే ప్రధాన అభ్యర్థులిద్దరూ క్వారంటైన్లో ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయి? నూతన అభ్యర్థులు రంగంలోకి వస్తారా? ఎన్నికలు వాయిదా పడతాయా? ఇలాంటి పలు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.. వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్ ఆరంభిస్తున్నామని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్, మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్హౌస్లోనే వారి క్వారంటైన్ జరుగుతుందని చెప్పారు. వైట్హౌస్ వైద్యుల బృందం, తాను ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామన్నారు. రికవరీ దశలో అధ్యక్షుడు తన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తాను వెల్లడిస్తానని చెప్పారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్కు ఒక్కరోజు క్రితమే కరోనా సోకినట్లు పరీక్షలో వెల్లడయింది. హోప్ ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నదని, తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. హోప్కు కరోనా రావడంతో తను, మెలానియా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే ప్రెసిడెంట్తో కలిసి హోప్ ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయా ణం చేసింది. ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతున్న తరుణంలో ట్రంప్నకు కరోనా సోకడం ఆయన ప్రచార కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కరోనా సోకడంతో ట్రంప్ బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనేకమంది తోటి అమెరికన్లు కరోనా బారిన పడ్డట్లే తామూ కరోనా బారినపడ్డామని, ఇద్దరం కలిసి దీన్ని జయిస్తామని మెలానియా ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో పలువురు వైట్హౌస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు యూఎస్లో కరోనా కారణంగా దాదాపు 2 లక్షల మరణాలు సంభవించాయి. వయోభారం, భారీ కాయం.. అమెరికా అధ్యక్షుల్లో దశాబ్దాల కాలంలో ఎవరూ ఎదుర్కోని సీరియస్ ఆరోగ్యసమస్యను ట్రంప్ ఎదుర్కొంటున్నారని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది. 74 ఏళ్ల వయసు, ఒబేసిటీతో ఆయన కరోనా బాధితుల్లో అత్యధిక రిస్కు జోన్లో ఉన్నారని తెలిపింది. వయసు పెరిగే కొద్దీ కరోనా బాధితుల్లో రిస్కు పెరుగుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్లైన్స్ చెబుతున్నాయి. ఉదాహరణకు 50ల్లో ఉన్న వారికి 40ల్లో ఉన్నవారితో పోలిస్తే తీవ్ర అస్వస్థతకు గురయ్యే చాన్స్ అధికమని, అదేవిధంగా 60, 70ల్లో ఉన్నవాళ్లకు మరింత రిస్కని తెలిపింది. ట్రంప్ ఆరోగ్యం గానే ఉన్నా, అధిక బరువు ఉన్నందున కరోనా సోకితే ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీనికితోడు ట్రంప్ మాస్కు వాడకానికి వ్యతిరేకి. కానీ, ర్యాలీల అనంతరం ప్రతిసారీ ట్రంప్ కోవిడ్ పరీక్ష చేయించుకునేవారు. త్వరలో ఈ సమస్య సమసిపోతుందని చెప్పేవారు. అనూహ్యంగా ఆయనే కరోనా బారిన పడ్డారు. ప్రముఖుల పరామర్శ అగ్రరాజ్యాధిపతికి కరోనా రావడంపై వివిధ దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘నా స్నేహితుడు, ఆయన భార్య తొందరగా రికవరీ కావాలి, మంచి ఆర్యోగంతో ఉండాలి’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లక్షలాది మంది అమెరికన్లతో పాటు తాను కూడా ట్రంప్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు. ఈ కష్టకాలంలో ట్రంప్నకు తన పూర్తి మద్దతు ఉంటుందని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ట్రంప్ వేగంగా రికవరీ కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆస్ట్రేలియా వ్యవసాయ మంత్రి, టోక్యో గవర్నర్, ప్రపంచ మీడియా సంస్థలు ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించాయి. కరోనాపై ట్రంప్ మొదటినుంచీ విరుచుకుపడుతున్నా చైనా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చైనా సోషల్ మీడియోలో మాత్రం ట్రంప్పై వ్యంగ్యాస్త్రాలు కనిపించాయి. ట్రంప్ పూర్తిగా కోలుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గ్యుటెర్రస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆకాంక్షించారు. కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మాస్కు ధరించడం ఇష్టపడని ట్రంప్ను కరోనా ఇష్టపడిందంటూ కొందరు వెటకారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విమర్శించే ట్రంప్ ఎట్టకేలకు ఒక విషయాన్ని ‘పాజిటివ్’గా ట్వీట్ చేశారని ఓ చైనీయుడు జోక్ చేశారు. కోవిడ్ బాధితులకు క్రిమిసంహారక(డిస్ఇన్ఫెక్టెంట్) మందులు ఇంజెక్షన్ చేయాలని ట్రంప్ గతంలో అన్నారు కనుక ఇప్పుడు వాటిని తీసుకునే సమయం ట్రంప్నకు వచ్చిందని జపాన్ ఇంటర్నెట్ వ్యాపారి హిరోయుకి నిషిమురా వ్యాఖ్యానించారు. తొలి నుంచీ నిర్లక్ష్యమే! కరోనా విపత్తు ఆరంభం నుంచి ట్రంప్ నిర్లక్ష్య వైఖరినే చూపుతూ వచ్చారు. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని, మాస్కు అవసరం లేదని, ఎకానమీని షట్డౌన్ చేయక్కర్లేదని చెప్పడమే కాకుండా కరోనాపై జాగ్రత్తలు చెప్పినవాళ్లను ఎగతాళి చేశారు. కానీ చివరకు తానే దాని బారిన పడ్డారు. ప్రజలు ఎక్కువగా భయపడకుండా ఉండేందుకే తాను కరోనాను తక్కువ చేసి చూపానని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. జనవరి 21న యూఎస్లో తొలి కరోనా కేసు నమోదయింది. అప్పటి నుంచి కరోనాపై ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు.. జనవరి: కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారదు. అమెరికాలో కరోనా పూర్తి నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి: ఏప్రిల్ కల్లా వేసవి ఆరంభం కాగానే కరోనా మాయమవుతుంది. కరోనా మహ్మమారి తాత్కాలికమే. ఒక్కమారుగా మాయమవుతుంది. మార్చి: అమెరికన్లకు కరోనా రిస్కు చాలా తక్కువ. జాతీయ ఎమర్జెన్సీ అనవసరం. కానీ విధించక తప్పట్లేదు. ఏప్రిల్: కరోనా వైరస్ సోకినవారు డిస్ఇన్ఫెక్టెంట్ను ఇంజెక్షన్గా తీసుకుంటే చాలా వేగంగా మళ్లీ ఆరోగ్యవంతులుగా మారడం ఖాయం మే: పిల్లల్లో కరోనా ప్రభావం చాలా తక్కువ. షట్డౌన్ కొనసాగిస్తే కోవిడ్ మరణాల కంటే ఇతర కారణాలతో∙ ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. జూన్: కరోనా మరణాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంది. కరోనా కేసుల్లో 99% ప్రమాదరహితాలు. జూలై: ప్రపంచంలో అమెరికాలోనే కరోనా మరణాలు తక్కువ. సెప్టెంబర్: మాస్కు పెట్టుకొని దేశాధినేతలను కలవడం అమర్యాద. అధ్యక్ష పోటీదారు బైడెన్లాగా నేను మాస్కు ధరించను. పెన్స్ చేతికి పగ్గాలు?? ప్రస్తుత అధ్యక్షుడు కరోనా బారిన పడడంతో అమెరికా రాజకీయరంగంలో మార్పులు జరగవచ్చని రాజకీయ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలైతే యూఎస్ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చు. వైస్ప్రెసిడెంట్ కూడా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితులుంటే, స్పీకర్ ఆఫ్ హౌస్ తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. అయితే, ఒకపక్క అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది, కీలక పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతల బదిలీ ఉండకపోవచ్చని మరికొందరి అంచనా. అధ్యక్ష అభ్యర్ధులు ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలై నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వస్తే పార్టీలకు సైతం అగ్ని పరీక్ష ఎదురుకానుంది. కొత్తగా మరో అభ్యర్థిని ఎంచుకొని, వారితో ప్రచారం నిర్వహించాల్సి వస్తుంది. ఇవన్నీ కలగలసి అమెరికా రాజకీయ యవనికపై పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలేనని, పరిస్థితి అంతదూరం రాకపోవచ్చని ఎక్కువమంది అంచనా. ట్రంప్ వేగంగా కోలుకోకపోతే మాత్రం పెన్స్ చేతికి పగ్గాలు తాత్కాలికంగానైనా వచ్చే అవకాశాలున్నాయి. రాజ్యాంగానికి జరిపిన 25వ సవరణ ప్రకారం అధ్యక్షుడు తాను బాధ్యతలు నిర్వహించలేనని ప్రకటిస్తే ఉపాధ్యక్షుడు తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. తిరిగి అధ్యక్షుడు తాను బాగానే ఉన్నానని స్వయంగా చెప్పేవరకు ఉపాధ్యక్షుడు అధ్యక్ష వ్యవహారాలు చూస్తాడు. గతంలో ఎప్పుడు? ► 1985లో రొనాల్డ్ రీగన్ శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జార్జ్ డబ్లు్య బుష్ను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించారు. ► 2002, 2007లో కొలనొస్కోపి చేయించుకోవాల్సిన సమయంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ తన బాధ్యతలు, అధికారాలను డిక్ చెనీకి తాత్కాలికంగా బదలాయించారు. రెండో ఆప్షన్ అధ్యక్షుడు తన బాధ్యతలు, అధికారాలు స్వయంగా తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదలాయించడం కాకుండా కేబినెట్లో మెజార్టీ సభ్యులు, ఉపాధ్యక్షుడు తమకు తామే ఇలాంటి బదలాయింపును ప్రకటించవచ్చని యూఎస్ రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. అధ్యక్షుడు బాధ్యతలు నిర్వహించలేడని భావించిన పక్షంలో కేబినెట్లో అధికులు, ఉపాధ్యక్షుడు కలిసి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యూఎస్లో ఇలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగించాలంటే పెన్స్తో సహా కేబినెట్లోని సీనియర్స్ 15 మందిలో 8మంది ట్రంప్ బాధ్యతలు నిర్వహించలేరని భావించాల్సిఉంటుంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ అంగీకరించకున్నా సెనేట్, హౌస్లు ఆమోదిస్తే వాస్తవ రూపం దాలుస్తుంది. పెన్స్ యత్నాలను ట్రంప్ ముందే గమనిస్తే ట్రంప్ తనను ముందే డిస్మిస్ చేయవచ్చు. మరోవైపు ట్రంప్ అనారోగ్యంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటికే ఓటింగ్ ఆరంభమైనందున వాయిదా సాధ్యం కాదని ఎక్కువమంది అంచనా. రాజ్యాంగంలో ఎన్నికల తేదీ గురించి ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల ఎన్నికలు వాయిదా వేయాలంటే అటు సెనేట్, ఇటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపాల్సిఉంటుంది. ఎన్నికలతో సంబంధం లేకుండా ట్రంప్ పదవీ కాలం వచ్చే జనవరి 20తో ముగియనుంది. బైడెన్కు నెగెటివ్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జో బైడెన్కు, ఆయన భార్య జిల్ ట్రేసీ జాకొబ్ బైడెన్కు శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో ఇద్దరికీ నెగటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్నకు కరోనా సోకినట్లు తేలడంతో బైడెన్ దంపతులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ట్రంప్, బైడెన్ల మధ్య చర్చా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కరోనా నెగటివ్ అని తేలడంతో ప్రచార కార్యక్రమాలను కొనసాగించాలని బైడెన్ నిర్ణయించారు. ప్రచారంలో భాగంగా ఆయన మిషిగన్కు వెళ్లనున్నారు. -
కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు
-
కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు
వాషింగ్టన్ : ప్రపంచాన్ని వణిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పించుకోలేకపోయారు. తాజాగా ఆయనకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. దీంతో ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ట్వీట్ చేశారు. తాము క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించి తగిన చికిత్స తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్కు కరోనా పరీక్ష) కాగా ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ తాజాగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే తాను కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోనున్నట్టు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్ కేసులతో అమెరికా అతలాకుతలమవుతున్నతరుణంలో మాస్కును ధరించాలని, వైద్య సిబ్బంది, అధికారులు హెచ్చరించినా అధ్యక్షుడు బేఖాతరు చేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ ఆసుపత్రి సందర్శన సందర్భంగా నలుపు రంగు మాస్క్ ధరించి అందర్నీ విస్మయపర్చారు. కాగా కరోనాకు అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7.31 మిలియన్ల మంది వైరస్ బారిన పడగా, మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. -
వైట్హౌస్ ఒరలో ఇమడరనీ!
ఏ విధంగానూ తక్కువ కాదు. ఎందులోనూ.. ఎక్కువ కాదు. ఇద్దరిలా కనిపించే ఒకే ఒకరు. ఒకే మాట మీద ఉండే ఇద్దరు. మరేంటి.. పడదనీ.. వైట్హౌస్ ఒరలో ఇమడరనీ! సమ ఉజ్జీలంటే ఎవరికి మాత్రం.. పోరు పెట్టాలని ఉండదు? పోటీ చూడాలని ఉండదు? వయసులో పన్నెండేళ్ల వ్యత్యాసం అక్కాచెల్లెళ్ల మధ్య ఉంటే వాళ్లు తల్లీకూతుళ్లలా ఉంటారు. అదే వ్యత్యాసం తల్లీకూతుళ్ల మధ్య ఉంటే వాళ్లు అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. ట్రంప్ భార్య మెలానియా వయసు 50 ఏళ్లు. ట్రంప్ కూతురు ఇవాంక వయసు 38 ఏళ్లు. అయితే వీళ్లు మాత్రం ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నారు. ‘కనిపిస్తున్నారు’ అంటే ప్రత్యర్థులుగా ఉన్నట్లు కాదు. చూసే వారికి అనిపించడం. ఇందుకు కారణం ఉంది. ట్రంప్ ప్రస్తుత సతీమణి, మూడో భార్య మెలానియా. ట్రంప్ మొదటి భార్య కూతురు ఇవాంక. వైట్హౌస్లో ట్రంప్ తర్వాత వీళ్లిద్దరే ముఖ్యులు. మెలానియా ‘ప్రథమ మహిళ’ అయితే, ఇవాంక.. ట్రంప్ ప్రధాన సలహాదారు. రెండు కత్తులు అనుకోవచ్చా! అలా అనుకుంటే కనుక ట్రంప్ను ఒక ‘ఒర’ అనుకోవాలి. ట్రంప్ను ఒర అనుకుంటే.. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అని కూడా అనుకోవాలి. నిజానికి వీళ్లిద్దరూ ఇమడకుండానే ఉంటున్నారా, ఇమడటం లేదని ప్రపంచం అనుకుంటోందా?! అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి ఎవరైనా తన కుటుంబంలోని ముఖ్యుల్ని తొలి ప్రసంగపు వేదిక మీదకు తీసుకొస్తారు. ‘నేషనల్ కన్వెన్షన్’ అంటారు ఆ వేదికను. ట్రంప్ది రిపబ్లికన్ పార్టీ కనుక అది ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’. నాలుగు రోజుల కన్వెన్షన్ చివరిరోజు.. గురువారం రాత్రి స్టేజి మీద ట్రంప్తోపాటు మెలానియా, ఇవాంక ఉన్నారు. ట్రంప్ తర్వాత వేదికపైకి మొదట మెలానియా చేరుకున్నారు. తర్వాత ఇవాంక వచ్చారు. ఇవాంక నవ్వుతూ వచ్చి, తల్లికి విష్ చేసి, నవ్వుతూ వెళ్లి తండ్రికి అటువైపున నిలుచున్నారు. తనకు విష్ చేసిన ఇవాంకకు మెలానియా కూడా నవ్వుతూ విష్ చేసి, ఆమె అటు వెళ్లగానే ఇటు సీరియస్గా ముఖం పెట్టేశారు. ‘సీరియస్గా కాదు.. అది ఏవగింపు’ అంటోంది మీడియా! మర్నాడు మీడియాలో, సోషల్ మీడియాలో అంతా.. మెలానియా లుక్ గురించే! ‘స్టింక్ ఐ’ అన్నారు. అయిష్టం అన్నారు, అన్ ఇన్వైటింగ్ అన్నారు.. ఏవో చాలా పేర్లు. మొత్తానికి ఆ అమ్మాయంటే ఆమెకు పడటం లేదని ప్రపంచం అంతటా ఫోకస్ అయింది. నిజమా అది! పడట్లేదని చెప్పడానికి చాలా థియరీలు ఉన్నాయి. పడుతుందని చెప్పడానికీ? అందుకు థియరీలు అక్కర్లేదు కదా. ఈ తాజా ‘స్టింక్ ఐ’ థియరీ పైన కూడా ఎప్పట్లా మెలానియా, ఇవాంక ఏమీ కామెంట్ చేయలేదు. అమెరికన్ శ్వేతసౌథంలో గానీ, బ్రిటన్ బకింగ్హామ్ ప్యాలెస్లో గానీ ఏ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకోరు. నేరుగా దూషించుకోరు. వ్యంగ్యాస్త్రాలను సంధించుకోరు. బ్రిటన్ రాణి, ఆమె చిన్న మనవడు హ్యారీ భార్య మేఘన్ అలాగే ఉన్నారు. ఇక్కడ అమెరికాలో మెలానియా, ఇవాంకా కూడా ఒకరికొకరు అన్నట్లుగానే ఉన్నారు. వీళ్లమీద పుస్తకాలు రాసేవాళ్లే ఒకర్నొకరు ఇలా అన్నారని, అలా అన్నారని రాసేస్తుంటారు. ‘మెలనియా అండ్ మీ’ అని సెప్టెంబర్ 1న ఒక పుస్తకం విడుదల అవుతోంది. రాసింది మెలానియా పూర్వపు స్నేహితురాలు స్టెఫానీ విన్స్టన్. ఇవాంకను, ఆమె టీమ్ను మెలానియా ‘స్నేక్స్’ అన్నట్లు స్టెఫానీ అందులో రాశారు. నాలుగేళ్ల క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం లో ఉన్నప్పుడు ఇదే నేషనల్ కన్వెన్షన్లో మెలానియా ఇచ్చిన ప్రసంగం అచ్చు గుద్దినట్లు 2008లో మిషెల్ ఒబామా చేసిన ప్రసంగమేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వాటి గురించి మెలానియా తనతో మాట్లాడుతూ.. ‘ఇవాంక, ఆమె బృందం ఇచ్చిన టెక్స్ట్నే నేను ఆరోజు చదివాను. వాళ్లే నన్ను తప్పుదారి పట్టించారు. వాళ్లు పాములు’ అని అన్నారని స్టెఫానీ ఈ పుస్తకంలో రాశారు. మెలానియాకు, ఈ రచయిత్రికి సత్సంబంధాలు చెడిపోయాక రాయడం మొదలు పెట్టిన పుస్తకం కాబట్టి స్టెఫానీ తల్లీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని వైట్హౌస్ అంటోంది. అంతేకాదు.. మెలానియా, ఇవాంక రోజూ చక్కగా మాట్లాడుకుంటారని కూడా లోపలి వాళ్లు చెబుతున్నారు. ప్రథమ మహిళగా మెలానియా వైట్హౌస్లో అడుగు పెట్టిన నాటి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలున్నాయి అంటూ గత జూన్లో మార్కెట్లోకి వచ్చిన ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పుస్తకంలో మేరీ జోర్డాన్ అనే వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ రాశారు. వైట్హౌస్ లో ‘ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్’ అని ఉంటుంది. అయితే మెలానియా.. ట్రంప్ మొదటి భార్య కాదు. అలాంటప్పుడు ఆ ఆఫీస్ ఆమెది ఎలా అవుతుందని ఇవాంకా అడ్డుపుల్ల వేశారట! ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్ని ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీసుగా మార్పించాలని ఇవాంకా చాలా ప్రయత్నించారని, ఆ ప్రయత్నాన్ని మెలానియా సమర్థంగా ఎదుర్కొన్నారని మేరీ రాసుకొచ్చారు. పుస్తకం వచ్చి రెండు నెలలు దాటిపోయింది. అందులోని తల్లీకూతుళ్ల సంవాదాలపై ఇప్పటివరకు ఇద్దరూ ఏమీ వ్యాఖ్యానించలేదు. ఒకళ్ల పట్ల ఒకళ్లు గౌరవంగా, బాధ్యతగానే ఉంటూ వస్తున్నారు. ఈ సంగతిని స్వయంగా స్టెఫానీ (‘మెలానియా అండ్ మీ’ రాసిన స్టెఫానీ కాదు. మెలానియా అధికార ప్రతినిధి స్టెఫానీ ఈవిడ) 2017లో ‘వ్యానిటీ ఫెయిర్’ పత్రికు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ‘వాళ్లిద్దరూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు’ అని ఆమె తెలిపారు. మరి ఈ ‘పడకపోవడం’ అనే ప్రచారం ఏమిటి? వాళ్లిద్దరి మధ్యా అలాంటిదేమైనా ఉంటే బాగుండునని ఆశిస్తున్న వాళ్లు, ఉండే ఉంటుందని ఊహిస్తున్నవాళ్లు చేస్తున్నదే. -
ఇవాంక వర్సెస్ మెలానియా.. వీడియో వైరల్
వాషింగ్టన్: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె అయిన ఇవాంక ట్రంప్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్(ఆర్ఎన్సీ) చివరి రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండో సారి ట్రంప్ అమెరికా అధ్యక్ష్య పదవికి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంక, ట్రంప్ను పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియాతో కలిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంక.. తన తండ్రిని, మెలానియాను నవ్వుతూ విష్ చేశారు. బదులుగా ప్రథమ మహిళ కూడా చిరునవ్వులు చిందించారు. కానీ సెకన్ల వ్యవధిలోనే ఇవాంకను చూసి మూతి ముడుచుకున్నారు మెలానియా. ఇవాంక అక్కడ నుంచి వెళ్లగానే ప్రథమ మహిళ ముఖం చిట్లించుకున్నారు. ప్రస్తుతం ఈ మూడు సెకన్ల వీడియో ఎంతగా వైరలవుతుందంటే.. ఇప్పటికే దీన్ని 5 మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: అవన్నీ ట్రంప్ కోతలేనా!) This was so weird. #RNC2020 pic.twitter.com/YHReTl0bfT — Dana Goldberg (@DGComedy) August 28, 2020 ఇప్పటికే ఇవాంకకు, మెలానియా ట్రంప్కు పడటం లేదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మెలానియా తన స్నేహితురాలు, ఒకప్పటి సిబ్బంది అయిన స్టెఫానీ విన్ స్టన్ వాకాఫ్ రాసిన పుస్తకంలో మెలానియా ట్రంప్ తన సవతి కుమార్తె అయిన ఇవాంక ట్రంప్పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రస్తావించారని ఆ దేశ మీడియా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లను సైతం చేశారు. ‘మెలానియా అండ్ మీ’:ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ’ అనే పుస్తకంలో మెలానియా తన సవతి పిల్లల గురించి ముఖ్యంగా ఇవాంక తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా రాశారని సమాచారం. మెలానియా ట్రంప్కు తెలియకుండా ఆమె స్నేహితురాలు స్టెఫానీ విన్ స్టన్.. మెలానియా వ్యాఖ్యలను రికార్డు చేసినట్లుగా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె ట్రంప్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారని వాటిని బహిర్గతం చేయలేదని రాసుకొచ్చారు -
ఫిల్లీ గర్ల్
ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ‘ఫిల్లీ గర్ల్’! అమెరికా ఎన్నికలు అయ్యాక.. ట్రంప్ (ఒకవేళ) ఓడిపోయాక.. బైడెన్ కొత్త అధ్యక్షుడయ్యాక.. ఫిల్లీ గర్ల్ అనే మాట మీరు వింటారు. ఆ ఫిల్లీ గర్ల్.. జిల్ బైడెన్. యు.ఎస్. కొత్త ప్రథమ మహిళ! జిల్ ట్రేసీ పవర్ గర్ల్. ఫిలడెల్ఫియా మెట్రోపాలిటన్ ఏరియాలో పెరిగిన అమ్మాయిల్నెవర్నీ ఆ పట్టణం ఎంతోకాలం పూర్తి అమాయకత్వంతో ఉంచదు. జిల్ ట్రేసీలా న్యూజెర్సీలో పుట్టి వచ్చిన అమ్మాయిల్నైనా సరే, వాళ్లెప్పుడు టీనేజ్లోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పదహారేళ్లు వచ్చేటప్పటికే జిల్ ట్రేసీ కూడా ఫిల్లీ గర్ల్ అయిపోయింది. అంటే.. ఫిలడెల్ఫియా సమర్పించిన పవర్ గర్ల్ అన్నమాట! ఆ వయసుకే ఫిలడెల్ఫియా స్పోర్ట్స్ టీమ్లోని కళ్లన్నీ జిల్ ట్రేసీ మీద పడ్డాయి. కాస్త తొందరపాటు ఉత్సాహంతో ముందుకు వచ్చిన ప్లేబాయ్ చూపుల్ని ట్రేసీ తన నొప్పించని తృణీకారపు నవ్వుతో పక్కకు తోసేసేది. అందం కాదు ఆ అమ్మాయిలోని గురుత్వాకర్షణ. టఫ్గా ఉంటుంది. అది నచ్చేది అబ్బాయిలకు. ‘టఫ్ కుకీ ఫిల్లీ గర్ల్’ అని పేరు కూడా పెట్టేశారు. ఫిజికల్గా, క్విజికల్గా ఉన్నవాళ్లను.. ముఖ్యంగా అమ్మాయిల్ని.. ‘టఫ్ కుకీ’లు అనడం ఫిలడెల్ఫియా పరాజిత బాలుర నిస్సహాయ నైజం. పదిహేనేళ్ల వయసులో ట్రేసీ న్యూజెర్సీలో వెయిట్రెస్గా చిన్న ఉద్యోగాన్ని వెతుక్కున్నప్పుడే స్లాట్లాండ్ యాస లో ఆమె మాట్లాడే ఫిలడెల్ఫియా ఇంగ్లిష్కు సహచరులు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టీ పెట్టగానే భగ్న హృదయులైపోయారు. ట్రేసీకి తల్లి నుంచి వచ్చిన ఆకర్షణీయమైన యాస అది. గృహిణి ఆమె. తండ్రి బ్యాంకు ఉద్యోగి. ట్రేసీ తర్వాత నలుగురూ చెల్లెళ్లే. పద్దెనిమిదేళ్లకే ట్రేసీ డిగ్రీ పూర్తయింది. పందొమ్మిదేళ్లకు పెళ్లి చేసుకుంది. బిల్ స్టీవెన్సన్ అతడి పేరు. ఫుట్బాల్ ప్లేయర్. ఫిలడెల్ఫియా స్పోర్ట్ టీమ్లో ఆమె మనసును గెలిచినవాడు. మనసును గెలిచాడే గానీ, మనసును తెలుసుకోలేకపోయాడు! పెళ్లయ్యాక ఐదేళ్లే కలిసి ఉన్నారు! మూడో వ్యక్తి ప్రవేశం తన భార్యను తన నుంచి వేరుచేసిందని నాలుగు రోజుల క్రితం కూడా అన్నాడు స్టీవెన్సన్. ఆ మూడో వ్యక్తి.. జో బైడెన్. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్పై అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి. స్టీవెన్సన్తో విడాకులు తీసుకున్న రెండేళ్లకే జో బైడెన్ను పెళ్లి చేసుకున్నారు జిల్ ట్రేసీ. ఈ ఎన్నికల్లో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. జిల్ ట్రేసీ అమెరికా ప్రథమ మహిళ అవుతారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రార్థనామందిరంలో (చాపెల్) 1977 లో జో బైడెన్, జిల్ ట్రేసీల పెళ్లి జరిగింది. బైడెన్కు అప్పటికే పిల్లలు ఉన్నారు. భార్య, కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయి, ఇద్దరు కొడుకులతో ఒంటరిగా ఉన్న సమయంలో ట్రేసీ అతడికి పరిచయం అయ్యారు. రెండోసారి పెళ్లి అయేనాటికి ఆమె వయసు 26. బైడెన్కు 34 ఏళ్లు. వీళ్లిద్దరికీ ఒక కూతురు. ఇప్పటికి ముగ్గురు పిల్లల పెళ్లిళ్లూ అయిపోయాయి. పెద్దకొడుకు బ్యూ బైడెన్ పేరున్న లాయర్. బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయాడు. చిన్నకొడుకు హంటర్ బైడెన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్. కూతురు ఆష్లీ సోషల్ వర్కర్. ట్రేసీతో పెళ్లయ్యేనాటికే జో బైడెన్ కౌంటీ కౌన్సిల్ సభ్యుడు. ఈ నలభై మూడేళ్ల కెరీర్లో అతడి అత్యున్నత స్థాయి అమెరికా ఉపాధ్యక్ష పదవి. బరాక్ ఒబామాతో కలిసి ఎనిమిదేళ్లు ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. జిల్ ట్రేసీ మాత్రం తనకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉండిపోయారు. బైడెన్ ఉపాధ్యక్షుడు అయ్యాక కూడా ‘ద్వితీయ మహిళ హోదా’ను వార్డ్రోబ్లో పడేసి, రోజూ కాలేజ్కి వెళ్లి రావడం మాత్రం ఆమె మానలేదు. విల్లింగ్టన్లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ గా ఆమె ఉద్యోగ జీవితం మొదలైంది. ప్రస్తుతం ఆమె నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్లో ఇంగ్లిష్ ప్రొఫెసర్. బైడెన్ ఒక్కో మెట్టూ రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే జిల్ ట్రేసీ అధ్యాపక వృత్తికి అవసరమైన ఒక్కో డిగ్రీ పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆమె.. తన భర్త అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా తను మాత్రం కాలేజ్కి వెళ్లొస్తుంటాననే చెబుతున్నారు! ఆమెలోని ‘ఫిల్లీ గర్ల్’.. తనను ఆరాధించిన వారిని సున్నితంగా నిరాకరించిన విధంగానే వైట్ హౌస్ ఇచ్చే గొప్ప హోదా కన్నా, ఇంగ్లిష్ ప్రొఫెసర్ అనే గుర్తింపునే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. -
మెలానియా ట్రంప్ విగ్రహానికి నిప్పు
స్లొవేనియా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ స్వస్థలం స్లొవేనియాలో ఏర్పాటైన ఆమె విగ్రహానికి కొందరు నిప్పుపెట్టిన ఘటన వెలుగుచూసింది. జులై 4న అమెరికన్లు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న రోజునే చెక్కతో తయారైన మెలానియా విగ్రహానికి నిప్పంటించారని ఈ విగ్రహం రూపొందించిన కళాకారుడు వెల్లడించారు. ఈ ఘటనపై జులై 5న పోలీసులు తనకు సమాచారం ఇవ్వగానే దెబ్బతిన్న విగ్రహాన్ని తొలగించానని బెర్లిన్కు చెందిన అమెరికన్ ఆర్టిస్ట్ బ్రాడ్ డౌనీ తెలిపారు. వారు ఇలా ఎందుకు చేశారో తాను తెలుసుకోవాలని భావిస్తున్నానని డౌనీ అన్నారు. ఈ ఘటన అమెరికాలో రాజకీయ చర్చకు తెరలేపుతుందని ఆయన భావిస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపిన అధ్యక్షుడిని వివాహం చేసుకున్న వలసదారుగా మెలానియా ట్రంప్ పరిస్థితికి ఇది అద్దం పడుతోందని డౌనీ వ్యాఖ్యానించారు. కాగా మెలానియా ట్రంప్ విగ్రహం ధ్వంసం ఘటనపై వాషింగ్టన్లోని ఆమె కార్యాలయ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. డౌనీ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా పూర్తికానందున ఎలాంటి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. కాగా స్లొవేనియాలో స్దానిక ఆర్టిస్ట్ డిజైన్ చేసిన డొనాల్డ్ ట్రంప్ వుడెన్ విగ్రహాన్ని కూడా ఈ ఏడాది జనవరిలో దుండగులు దగ్ధం చేశారు. చదవండి : మెలనియా ఫస్ట్ లేడీ ఎలా అవుతారు?.. ఇవాంక -
మెలనియా ఫస్ట్ లేడీ ఎలా అవుతారు?.. ఇవాంక
ట్రంప్ వంటి మహానుభావులు పూర్వాచారాలకు కొత్త నిర్వచనాలను కల్పించుకోవలసిన పరిస్థితులను తెచ్చి పెడుతుంటారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిని ‘ఫస్ట్ లేడీ’ అంటారు. వైట్ హౌస్లో ఆమెకు ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ ఉంటుంది. అయితే ట్రంప్కు ఇప్పుడు భార్యగా ఉన్న మెలనియా మూడో సతీమణి. మరి ఈవిడ ఫస్ట్ లేడీ ఎలా అవుతారు? ఈ సందేహం రావలసిన వాళ్లకే వచ్చింది. ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంక తన తల్లికి దక్కవలసిన ‘ఫస్ట్ లేడీ’ టైటిల్ ను మారుతల్లి మెలనియాకు చెందకుండా ఉండటం కోసం ‘ఫస్ట్ లేడీ’స్ ఆఫీస్’ పేరును ‘ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీస్’ గా మార్పించేందుకు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని మెలనియా విజయవంతంగా అడ్డుకున్నారట! ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పేరుతో మెలనియా జీవిత చరిత్రను రాసిన వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ మేరీ జోర్డాన్ ఈ సంగతిని పుస్తకంలో వెల్లడించారు. ట్రంప్కి ‘సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అడ్వయిజర్’ గా కూడా మెలనియాను జోర్డాన్ అభివర్ణించారు. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకంలో అభివర్ణనలు, అవాస్తవాలు తప్ప వేరే ఇంకేమీ లేవని ఇవాంకను సమర్ధించేవారు అంటున్నారు. -
హ్యాండ్సప్.. డోంట్ షూట్!
హ్యూస్టన్: జార్జ్ ఫ్లాయిడ్కు సంఘీభావంగా హ్యూస్టన్లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్ గ్రీన్లతోపాటు కొంతమంది ర్యాప్ గాయకులు ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్ అప్.. డోంట్ షూట్’, ‘నో జస్టిస్, నో పీస్’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్ నగరం గుండా సాగింది. డిస్కవరీ గ్రీన్ పార్క్ నుంచి సిటీహాల్ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది. అయితే సూర్యాస్తమయం తరువాత ఈ ర్యాలీ కాస్తా ఆందోళనలకు దారితీసిందని, ఖాళీ నీటిబాటిళ్లతో విసరడంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్ పోలీస్ అధికారులు ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్ అధికారి ఆర్ట్ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది. వీధుల్లో ప్రశాంతత.. వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. పౌరహక్కుల విచారణ.. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్ పలీస్ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్ రెబెకా లూసిరో, గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు. శాంతియుతంగా ఉండాలి: మెలానియా ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్ చేస్తూ.. ఫ్లాయిడ్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో ట్రంప్ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. -
మీకోసం మాదేశం ప్రార్థిస్తోంది: మెలానియా
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలను, దేశాధినేతలను కూడా వదిలిపెట్టట్లేదు. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో సెయింట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. పదిరోజుల పోరాటం అనంతరం ఆయన కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అతని సతీమణి సైమండ్ ప్రస్తుతం గర్భిణీ. ఆమెకు కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. (అమెరికాలో భారీగా కోవిడ్ మృతులు) ఈ నేపథ్యంలో ఈ దంపతులను ఉద్దేశించి అమెరికా ప్రథమ మహిళ, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా వైట్హౌస్ నుంచి లేఖ రాశారు. వారి ఆరోగ్యం కుదుటపడాలని, దంపతులిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి బాగు కోసం తమ దేశమంతా ప్రార్థనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. కాగా అమెరికాలో గురువారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,343కు చేరుకోగా, మరణాలు 33 వేల మార్కును దాటేశాయి. ఒక్క న్యూయార్క్లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. (ఇంటి నుంచి ఇలా సులువు) -
హ్యాపీనెస్ క్లాస్పై మెలానియా ట్వీట్..
వాషింగ్టన్ : ఇటీవలి భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని సర్వోదయ స్కూల్లో హ్యాపీనెస్ క్లాస్ సెషన్కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్ అభివర్ణించారు. తనకు స్కూల్లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు, ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషఃల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. తన భర్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంట భారత్ పర్యటనకు వచ్చిన మెలానియా ఢిల్లీలోని సౌత్ మోతీబాగ్లోని సర్వోదయ పాఠశాలను మంగళవారం సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించిన సంగతి తెలసిందే. ఇరు దేశాల జెండాలను చేబూనిన విద్యార్ధులు ఆమెకు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. చదవండి : బాంగ్రా డ్యాన్స్కు మెలానియా ట్రంప్ ఫిదా -
తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించాను
-
'తాజ్ అందాలు నన్ను మైమరిపించాయి'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయి రెండు రోజులవుతుంది. అయినా ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వారి పర్యటనపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తాజ్ అందాలను ఆస్వాదించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశారు. ' ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్మహల్ను దగ్గర నుంచి చూడడం ఆనందం కలిగించింది. తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించానంటూ' క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మొత్తం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తన భర్త ట్రంప్ ట్రంప్తో కలిపి చేతిలో చేయి వేసుకొని తాజ్మహల్లో కలియ తిరగడం కనిపించింది. నితిన్ కుమార్ గైడ్గా వ్యవహరిస్తూ తాజ్మహల్ విశిష్టతను, దానియొక్క చరిత్రను వారికి వివరించారు. కాగా డేవిడ్ ఐసనోవర్, బిల్ క్లింటన్, తర్వాత తాజ్ మహల్ను వీక్షించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గుర్తింపు పొందారు. (‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు) -
భారత్ గొప్ప దేశం: ట్రంప్
వాషింగ్టన్: భారత్ ఎంతో గొప్ప దేశమని, తన పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి భారత్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ఆయన బుధవారం అమెరికాకు చేరుకున్నారు. స్వదేశానికి వెళ్లిన వెంటనే ట్రంప్ ‘భారత్ చాలా గొప్ప దేశం. నా పర్యటన విజయవంతమైంది’అని ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలయ్యాక రావాలనుకున్నా.. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక భారత పర్యటనకు రావాలని భావించానని ట్రంప్ చెప్పారు. మోదీకి ఆ ఆలోచన నచ్చకపోవడంతో ముందే వచ్చానన్నారు. రాష్ట్రపతి భవన్లో మంగళవారం విందులో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ‘భారత్కి మళ్లీ మళ్లీ వస్తూ ఉండాలని ఆశపడుతున్నాను’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్లేటర్ను ఆస్వాదించిన ట్రంప్ ట్రంప్, భార్య మెలానియా భారత్ పర్యటనలో బస చేసిన ఐటీసీ మౌర్యలో వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ట్రంప్ ప్లేటర్ భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. టేబుల్ సైజ్లో ఉండే నాన్, మటన్ లెగ్తో తయారు చేసిన సికందరి నాన్ రుచికి వారు ఫిదా అయ్యారని హోటల్ వర్గాలు వెల్లడించాయి. వారు వెళ్లేటపుడు ఎంఎఫ్ హుస్సేన్ గుర్రం చిత్రం ముద్రించిన అప్రాన్లను హోటల్ యాజమాన్యం అధ్యక్షుడికి కానుకగా ఇచ్చింది. -
బాంగ్రా డ్యాన్స్కు మెలానియా ట్రంప్ ఫిదా
న్యూఢిల్లీ : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్తో కలిసి వచ్చిన ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం రాత్రి తిరిగి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో తన డ్రెస్సింగ్, హావభావాలు, మాట్లాడే తీరుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మెలానియా వెళ్తూ వెళ్తూ ఎన్నో మధుర స్మృతులను తన వెంట తీసుకెళ్లారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని నానక్పూర్లో ఉన్న సర్వోదయా ప్రభుత్వ పాఠశాలను అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న హ్యాపినెస్ విద్యా విధానాన్ని మెలానియా స్వయంగా పరిశీలించారు. క్లాస్రూంలో చిన్నారులతో ముచ్చటించిన మెలానియా.. విద్యార్థులు వేసిన సూర్య నమస్కారాలు ఆసక్తిగా తిలకించారు. తరగతి గదిలో టీచర్గానూ మారిన మెలానియా చిన్నారులతో ముచ్చటించారు. (అందరి చూపులు ఆమె వైపే..!) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల డ్యాన్స్ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు. తర్వాత పాఠశాల ఆవరణలో స్టేజ్పైన కొంతమంది విద్యార్థినులు పంజాబీ పాటకు నృత్యం చేస్తుండగా మెలానియా విద్యార్థుల పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఒక పిల్లాడు యూఎస్ జెండాను తన చేతిలో పట్టుకొని బాంగ్రా డ్యాన్స్ చేయడం మెలానియాను విశేషంగా ఆకర్షించింది. మెలానియా ఒక గంట పాటు సర్వోదయా స్కూల్ విద్యార్థులతో ఆనందంగా గడిపారు. కాగా మెలానియా పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలను ఏఎన్ఐ సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 'హ్యాపినెస్ విద్యా విధానాన్ని' అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్కు ఆహ్వానం లేకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్లో ఇవాంకా) #WATCH Delhi: First Lady of the United States, Melania Trump watches a dance performance by students at Sarvodaya Co-Ed Senior Secondary School in Nanakpura. pic.twitter.com/dBCuTzvymF — ANI (@ANI) February 25, 2020 -
ట్రంప్కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?
-
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా
-
పాఠశాల విద్యావిధానం నాకు నచ్చింది
-
సర్వోదయ విద్యాలయాన్ని సందర్శించిన మెలానియా ట్రంప్
-
చిన్నారుల స్వాగతానికి మెలానియా ఫిదా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్లో ‘హ్యాపినెస్ క్లాసు’లను ఆమె పరిశీలించారు. హైదరాబాద్ హౌజ్లో భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మెలానియాకు సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ పద్దతిలో బొట్టు పెట్టి మంగళ హారతులతో మెలానియాను స్వాగతం పలికారు. చిన్నారుల స్వాగతానికి మెలానియా మురిసిపోయారు. అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లిన మెలానియా విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ‘హ్యాపీనెస్ క్లాస్’ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు మహిళా టీచర్లు మెలానియా వెంట ఉన్నారు. టీచర్లు అడిగిన ప్రశ్నలకు చిన్నారులు చక్కగా సమాధానం చెప్పారు. పాటలు, సంగీతం, ఆటలపై తమకు ఉన్న మక్కువను వివరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు చేసిన నృత్యాలను మెలానియా తిలకించారు. అనంతరం మెలానియా మాట్లాడుతూ.. పాఠశాల విద్యావిధానం చాలా బాగుందని కితాబిచ్చారు. విద్యార్థులు తనపై చూపించిన ప్రేమ, అప్యాయత మరవలేనిదన్నారు. ఈ పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మంచి నడవడికను నేర్పించడం బాగుందని మెలానియా పేర్కొన్నారు. (చదవండి : సైనిక వందనం స్వీకరించిన ట్రంప్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రంప్కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?
ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియాలు తాజ్ మహల్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. వారు తాజ్ అందాలను వీక్షిస్తున్న సమయంలో గైడ్గా నితిన్ కుమార్ సింగ్ వ్యవహరించారు. ఆయన ట్రంప్కే కాకుండా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు తాజ్ గొప్పతనాన్ని వివరించి చూపారు. ఆగ్రాలోని కట్రా ఫులెల్కు చెందిన నితిన్ తాజ్ మహల్ ఘనతను, దాని వెనుకనున్న ప్రేమ కథను ట్రంప్కు వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్, మెలానియాలు అతను చెబుతున్నదానిని శ్రద్ధగా విన్నారు. దీనిపై నితిన్ మాట్లాడుతూ.. ట్రంప్ దంపతులు తాజా మహల్ను చూసి సంతోషం వ్యక్తం చేశారన్నారు. అదొక అద్భుత కట్టడం అని ట్రంప్ దంపతులు పేర్కొన్నట్లు నితిన్ కుమార్ సింగ్ తెలిపారు. మరొకసారి తాజ్ మహల్ను వీక్షించడానికి వారు వస్తామని తెలిపారన్నారు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్మాగిన్ బతుల్గా, బెల్జియం రాజు ఫిలిప్లకు తాజ్ మహల్ గురించి వివరించిన ఘనత నితిన్ కుమార్ సింగ్ది. ప్రధాన నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన నితిన్ సింగ్.. ఎక్కువ శాతం ప్రముఖులకే గైడ్గా వ్యవహరిస్తారు. ఆగ్రాకు చెందిన నితిన్ సింగ్ తాజ్ మహల్ విశిష్టత గురించి తెలపడంలో అతనికే అతనే సాటని స్థానికుల మాట. (ఇక్కడ చదవండి: చేతిలో చెయ్యేసి) -
తాజ్మహల్ వీక్షించిన ట్రంప్ దంపతులు
-
తెల్లని దుస్తుల్లో రాజహంసలా..
అహ్మదాబాద్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. భారత్ పర్యటన సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వస్తారా లేదానని యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అమెరికా నుంచి అహ్మదాబాద్కి వచ్చిన ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో ఒక రాజహంసలా కిందకి దిగారు. తెల్లని జంప్ సూట్ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్ (ఫ్యాషన్ కోసం ధరించేది) అందంగా చుట్టుకున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా, మన దేశీ టచ్తో రూపొందించిన డ్రెస్ ధరించడం అందరినీ ముగ్ధుల్ని చేసింది. జుట్టును లూజ్గా వదిలేసి అతి కొద్దిగా మేకప్ వేసుకొని తన సహజ సౌందర్యంతోనే ఆమె మెరిసిపోయారు. స్వయంగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మెలానియా సాధారణంగా తన దుస్తుల్ని తానే డిజైన్ చేసుకుంటారు. కానీభారత్ పర్యటన కోసం ప్రముఖ ఫ్రెంచ్ అమెరికన్ డిజైనర్ హెర్వ్ పెయిరె డిజైన్ చేసిన సూట్ని ధరించారు. పాల నురుగులాంటి తెల్లటి జంప్ సూట్ వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టు మీద బంగారం జరీ ఎంబ్రాయిడీతో చేసిన దుప్పట్టాను చుట్టుకున్నారు. భారత్ వస్త్ర పరిశ్రమకు చెందిన 20 శతాబ్దం నాటి తొలి రోజుల్లో డిజైన్లను ఆకుపచ్చ రంగు దుప్పట్టాపై చిత్రీకరించినట్టుగా హెర్వ్ పెయిర్ తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో వెల్లడించారు. తన మిత్రులు పంపించిన కొన్ని డాక్యుమెంట్లని చూసి అత్యంత శ్రద్ధతో ఆకుపచ్చ రంగు సాష్ను తయారు చేసినట్టు తెలిపారు. మెలానియా ధరించిన డ్రెస్పై ట్విటర్లో ప్రశంసలే వచ్చాయి. కొందరు హాస్యఛలోక్తుల్ని కూడా విసిరారు. అందానికే అందంలా ఉండే మెలానియా కొంటె కుర్రాళ్ల బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి కరాటే డ్రెస్ తరహాలో దుస్తులు ధరించారని కామెంట్లు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ డార్క్ కలర్ సూట్ , పసుపు రంగు టై ధరించారు. మన భారతీయు వాతావరణానికి తగ్గట్టుగా వారి దుస్తుల్ని డిజైన్ చేశారు. -
చేతిలో చెయ్యేసి
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో చల్లని సాయంత్రం సమయంలో చిరుగాలులు మోముని తాకుతూ ఉంటే తన నెచ్చెలి మెలానియా చేతిలో చెయ్యేసి వెండికొండలా మెరిసిపోయే ప్రపంచ అద్భుతాన్ని తనివితీరా చూసి తన్మయత్వం చెందారు అగ్రరాజ్యాధీశుడు ఆగ్రా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి ప్రఖ్యాతివహించింది. తాజ్మహల్ని సందర్శించడమంటే అదో అద్భుతమైన ప్రేమ భావన. అమెరికా ఇతర అధ్యక్షుల్లా మాదిరి కాదు.. ట్రంప్, మెలానియా ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని కనిపించరు. కానీ ఈ తాజ్ ఏ మాయ చేసిందో ఏమో మెలానా చేతిలో చెయ్యి వేసుకుంటూ తాజ్ ఉద్యానవనంలో కలియతిరుగుతూ అలౌకికమైన ఆనందానికి లోనయ్యారు ట్రంప్. ఆ తన్మయత్వంలోనే సందర్శకుల పుస్తకంలో ‘‘తాజమహల్ వావ్ అనిపించింది. సుసంపన్నమైన, విలక్షణ విభిన్నమైన భారతీయ సంస్కృతికి ఈ కట్టడం కాలాతీతంగా నిలిచిన పవిత్ర శాసనం. థాంక్యూ ఇండియా’’అని రాశారు. ట్రంప్ దంపతులు తాజ్మహల్లో గంటకు పైగా కలియతిరుగుతూ అణువణువు సౌందర్యంతో నిండిపోయిన ఆ కట్టడం అందాలను ఆస్వాదించారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన తాజ్మహల్ గొప్పతనాన్ని ఒక గైడ్ వారికి వివరించి చెప్పారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ కూడా వారి వెంట ఉన్నారు. అయితే ఇతర ప్రతినిధుల బృందంతో పాటు వారు దూరం నుంచి తాజ్మహల్ అందాలను వీక్షించారు. తాజ్ అందాలను ఇవాంకా తన మొబైల్ ఫోన్లో బంధిస్తూ కనిపించారు. ఆగ్రా వీధుల్లో ఘన స్వాగతం అహ్మదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రా ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా ట్రంప్ కారు బీస్ట్ క్షణ కాలమైనా కనిపిస్తుందని ఆత్రుతగా ఎదురుచూశారు. అహ్మదాబాద్ నుంచి ఆగ్రాలో ఖేరియా ఎయిర్బేస్కి చేరుకున్న ఆయనకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తాజ్మహల్కి సమీపంలోని ఓబరాయ్ అమర్విలాస్ హోటల్కి తన కాన్వాయ్లోనే చేరుకున్నారు. మొత్తం 13కి.మీ. దూరం ఉన్న ఈ ప్రయాణంలో 15 వేలకు మందికి పైగా విద్యార్థులు, సాధారణ ప్రజలు రోడ్డుకిరువైపులా అమెరికా, భారత్ జెండాలు పట్టుకొని ఉత్సాహంతో చేతులు ఊపారు. ఆ హోటల్ నుంచి తాజ్మహల్కి తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లో వెళ్లారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాజ్మహల్ గేటు నుంచి 500 మీ పరిధి వరకు పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ తన బీస్ట్ కారుని హోటల్ ఆవరణలో ఉంచి ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లోనే వెళ్లారు. తాజ్ కట్టడం దగ్గర మెలానియాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు వస్తూ ఉండడంతో తాజ్ని అద్దంలా ఉంచడానికి మరింత మెరుగులు దిద్దారు. వందలాది మంది పనివాళ్లు ముల్తానీ మిట్టీతో తాజ్ని శుభ్రం చేశారు. తాజ్మహల్ని సందర్శించిన అధ్యక్షుల్లో చివరి వాడు బిల్ క్లింటన్. 2000 సంవత్సరంలో తన కుమార్తె చెల్సీతో కలిసి ఆయన తాజ్ని సందర్శించారు. 2015లో బరాక్ ఒబామా తాజ్ని చూద్దామని భావించారు కానీ, భద్రతా కారణాల రీత్యా సందర్శించలేదు. ఇవాంకా మళ్లీ అదే డ్రెస్ సాధారణంగా సెలిబ్రిటీలు ఒకసారి వేసుకున్న డ్రెస్తో మళ్లీ బయట ప్రపంచానికి కనిపించరు. పూటకో ఫ్యాషన్తో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు. కానీ ఇవాంకా గత ఏడాది ఫ్యాషన్నే మళ్లీ కొనసాగించారు. 2019 సెప్టెంబర్ అర్జెంటీనా పర్యటనలో ఏ మిడీ అయితే వేసుకున్నారో అదే మళ్లీ భారత పర్యటనలోనూ ధరించారు. బేబి బ్లూ రంగు పైన ఎరుపు రంగు పెద్ద పెద్ద పువ్వులున్న వీ నెక్ డ్రెస్ వేసుకున్నారు. ఇలా మళ్లీ అదే డ్రెస్ వేసుకోవడానికీ ఒక కారణం ఉంది. ఒక చిన్న వస్త్రం తయారు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో సహజవనరుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహజవనరుల్ని కాపాడాలంటే సెలిబ్రిటీలు కూడా వేసుకున్న డ్రెస్లే మళ్లీ ధరించాలన్న సందేశాన్ని పంపడానికే ఇవాంకా అదే డ్రెస్ ధరించారు. ఈ విధంగా ప్రకృతి పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజ్ వద్ద ఇవాంకా, కుష్నర్ దంపతులు సాధారణ టూరిస్టులకు నో ట్రంప్ రాక సందర్భంగా సోమవారం ఆగ్రాలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్మహల్లో సాధారణ టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ట్రంప్ తాజ్మహల్ రాగా.. ఉదయం 11.30 గంటలకే తాజ్ను సాధారణ సందర్శకులకు దూరం చేశారు. ట్రంప్ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ రాకను పురస్కరించుకుని తాజ్మహల్ను అందం గా అలంకరించామని, ఉద్యానవనంలో మరిన్ని పూలమొక్కలు నాటడంతోపాటు ఫౌంటేన్లు మరమ్మతు చేయించామన్నారు. ట్రంప్ దంపతులకు సీఎం యోగి బహుమతి -
రాట్నం తిప్పి.. నూలు వడికి
అహ్మదాబాద్ : భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ సోమవారం అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకు కొద్ది నిముషాల ముందే ఆశ్రమానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్ దంపతులకు ఆశ్రమం అంతా తిప్పి చూపించి దాని విశిష్టతను తెలియజేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఈ ఆశ్రమంలో గాంధీజీ, ఆయన భార్య కస్తూర్బా 1917–1930 మధ్య కాలంలో నివసించారు. వారిద్దరూ నివసించిన గది హృదయ్ కుంజ్ లోపలికి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి చూపించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి, గాంధీజీ పోరాట స్ఫూర్తి గురించి వివరించారు. ఆశ్రమంలో ఉన్న చరఖాను ట్రంప్, మెలానియా కూడా తిప్పుతూ, నూలు వడకడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆశ్రమ నిర్వాహకులు రాట్నాన్ని ఎలా తిప్పుతూ నూలు వడకాలో వారికి వివరించి చెప్పారు. ట్రంప్ చరఖా తిప్పుతున్నప్పుడు మెలానియా ఆయనకు సహకరించారు. మహాత్ముడిని ప్రస్తావించని ట్రంప్ దాదాపు 15 నిముషాల సేపు ఆశ్రమంలో గడిపి తిరిగి వెనక్కి వెళుతున్నప్పుడు సందర్శకుల పుస్తకంలో ట్రంప్ ‘‘నా గొప్ప స్నేహితుడైన ప్రధానమంత్రి మోదీ – అద్భుతమైన ఈ పర్యటనకు ధన్యవాదాలు’’అని తన సందేశాన్ని రాశారు. ట్రంప్, మెలానియాలు ఇద్దరూ సంతకాలు చేశారు. గాంధీజీ బోధనల గురించి కానీ, ఆయన ప్రపంచానికి అందించిన స్ఫూర్తి గురించి నామ మాత్రంగా కూడా ట్రంప్ ప్రస్తావించలేదు. దీనిపై ట్విటర్లో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. సబర్మతి ఆశ్రమానికి వెళ్లి కూడా గాంధీ గురించి రెండు ముక్కలు రాయకపోవడమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. 2015లో బరాక్ ఒబామా ఢిల్లీ రాజ్ఘాట్ను సందర్శించినప్పుడు ‘‘డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలు ఇప్పటికీ వాస్తవం. గాంధీ స్ఫూర్తి భారత్లో అణువణువు జీర్ణించుకొని ఉంది. అది ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బ హుమతి’’అని రాయడంతో పోలుస్తూ కామెంట్లు ఉంచారు. సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ అసలు రూపం తెలిసిందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పోస్టు పెడితే, త్రిపుర మాజీ ఎమ్మెల్యే తపస్ దే మోదీపై తన ప్రేమను ట్రంప్ ఒలకపోశారని విమర్శించారు. అల్పాహారం తీసుకోని ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన పూర్తిగా శాకాహారంతో హై టీ ఏర్పాటు చేశారు. కానీ వారిద్దరూ వాటిని తీసుకోలేదని ఆశ్రమ ట్రస్టీ వెల్లడించారు. ట్రంప్ కోసం ప్రత్యేకంగా హోటల్ ఫార్చూన్ ల్యాండ్మార్క్కు చెందిన చెఫ్ సురేష్ ఖన్నా ఆధ్వర్యంలో తయారు చేసిన గుజరాతీ స్పెషల్ ఖమాన్, బ్రాకొలిన్–కార్న్ బటన్ సమోసా, మల్టీ గ్రెయిన్ కుకీస్, కాజూ కత్లీ యాపిల్ పేస్ట్రీ, తాజా పండ్లు, గుజరాతీ అల్లం టీ ఉంచారు. అయినా వాటినేమీ వాళ్లు రుచి చూడలేదు. ట్రంప్ మాంసాహార ప్రియుడు. కానీ సబర్మతి ఆశ్రమంలో మాంసం నిషిద్ధం కావడంతో శాకాహారంతో తయారు చేసిన స్నాక్స్ ఉంచారు. గాంధీజీ మూడు కోతుల బహుమానం చెడు వినకు , చెడు కనకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనని చాటి చెప్పే మూడు కోతుల బొమ్మల్ని ట్రంప్, మెలానియాలకు మోదీ కానుకగా ఇచ్చారు. ఇక ఆశ్రమం తరఫున ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ ట్రంప్ దంపతులకు మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ పుస్తకం, గాంధీజీ, చరఖా పెన్సిల్ డ్రాయింగ్లను బహూకరించారు. అంతకు ముందు ఆశ్రమం ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ ట్రంప్, మెలానియాలకు ఖద్దరు శాలువా కప్పి స్వాగతం పలికారు. ట్రంప్ సందర్శన పూర్తయిన తర్వాత కార్తికేయ విలేకరులతో మాట్లాడుతూ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు. ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఎనలేని మనశ్శాంతి తనకు కలిగిందని, ఆ ఆశ్రమం ప్రాధాన్యత అర్థమైందని ట్రంప్ తనతో చెప్పారని కార్తికేయ వెల్లడించారు. మూడు కోతుల ప్రతిమతో బహూకరిస్తున్న మోదీ -
మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : మోదీ
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుపొందిన మొతెరా క్రికెట్ స్టేడియం ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తింది. లక్షా 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం జనంతో కిక్కిరిపోయింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను సభకు పరిచయం చేసిన అనంతరం ప్రధాని మోదీ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభికులతో సమస్తే ట్రంప్ అంటూ పలికించారు. అమెరికా, భారత్ జాతీయా గీతాలాపన అనంతరం ‘భారత్ మాతాకీ జై’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించారు. నమస్తే ట్రంప్ అంటూ సభికులను పలకరించారు. భారత్-అమెరికా స్నేహం పరిఢవిల్లాలని నినదించారు. ఆయన మాట్లాడుతూ... (చదవండి : ట్రంప్ టూర్ : వావ్ తాజ్ అంటారా..?) ‘మొతెరా క్రికెట్ స్టేడియంలో ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ట్రంప్, ఆయన కుటుంబం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఇది గుజరాతీ గడ్డ అయినా యావత్తు దేశమంతా దీన్ని స్వాగతిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి ఇదే నిదర్శనం. ట్రంప్ ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, అమెరికా యావత్తు భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటోంది. (చదవండి :ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు..) అహ్మదాబాద్కు ఎంతో చరిత్ర ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ నదికి విశిష్టపాత్ర ఉంది. మనం అనుసరిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ అమెరికాలను కలుపుతుంది. స్టాచ్యు ఆఫ్ లిబర్టీ - స్టాచ్యూ ఆఫ్ పటేల్ మధ్య సంబంధముంది. ఇరు దేశాల స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడాలి. ట్రంప్ రాక దీనికి కచ్చితంగా దోహదపడుతుది. అభివృద్ధి, సౌభ్రాతృత్వానికి బాటలు వేస్తుంది. అమెరికాలో సమాజాభివృద్ధికి మెలానియా కృషిని ప్రశంసిస్తున్నాం. బాలల సంక్షేమానికి మెలానియా చేసిన కృషి అభినందనీయం. ఇవాంక రెండేళ్ల క్రితం భారత్కు వచ్చారు. మరోసారి ఇవాంకకు స్వాగతం పలకడానికి సంతోషిస్తున్నా’అని మోదీ పేర్కొన్నారు. -
సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ దంపతులు
-
నూలు వడికిన అమెరికా ప్రెసిడెంట్
అహ్మదాబాద్ : భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన ఇరు దేశాధినేతలు మోతేరాలో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియం వరకు 22 కి.మీ రోడ్ షోలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సదర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని మోదీ, ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. గాంధీజీ గురించిన విశేషాలను ప్రధాని మోదీ వారికి వివరించారు. చరఖాపై నూలు వడకడం ఎలానో చెప్తుండగా వారు ఆసక్తిగా గమనించారు. ట్రంప్ చరఖాపై కాసేపు నూలు వడికారు. అనంతరం సందర్శకుల పట్టికలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’అని విజిటర్స్ బుక్లో ట్రంప్ పేర్కొన్నారు. ‘త్రీ మంకీస్’ ప్రతిమ ద్వారా గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని వారికి ప్రధాని మోదీ వివరించారు. అనంతరం వారు మోతేరాకు బయల్దేరారు. -
ట్రంప్ పర్యటన : సీక్రెట్ ఏజెన్సీ పనేంటంటే..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో గుజరాత్లోని అహ్మదాబాద్లో నేటి(సోమవారం) మధ్యాహ్నం అడుగిడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికాకు చెందినసీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన భద్రతా సిబ్బంది సీక్రెట్ ఏజెన్సీ. అమెరికా అధ్యక్షుడి రక్షణ విషయంలో సీక్రెట్ ఏజెన్సీ పాత్ర ఏంటో తెలుసుకుందాం.. ►అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ► ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. ► అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ►ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. ► అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. ►అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. ►అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. ►చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. ►1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. ►సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుంటారు. ► ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. ► సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. ►వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! ట్రంప్ నేటి షెడ్యూల్.. ఉదయం.. 11:40.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ మధ్యాహ్నం 12:15.. ట్రంప్, మోదీలు కలసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు 01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 03:30.. ఆగ్రాకు ప్రయాణం సాయంత్రం 04:45.. ఆగ్రాకు చేరుకుంటారు 05:15.. తాజ్మహల్ సందర్శన 06:45.. ఢిల్లీకి ప్రయాణం 07:30.. ఢిల్లీకి చేరుకుంటారు చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ మోదీ, నేను మంచి ఫ్రెండ్స్! ‘అగ్ర’జుడి ఆగమనం నేడే -
అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్ : అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలి భారత పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. కుటుంబంతో సహా ట్రంప్ గుజరాత్లోని అహ్మదా బాద్లో నేటి మధ్యాహ్నం అడుగిడనున్నారు. దేశ రాజధానికి కాకుండా.. నేరుగా ఒక రాష్ట్రంలోని ప్రధాన నగరానికి అమెరికా అధ్యక్షుడు వస్తుండటం ఒక విశేషమైతే.. ప్రొటొకాల్కు విరుద్ధంగా దేశ రాజధానిలో కాకుండా మరో నగరానికి వెళ్లి మరీ భారత ప్రధాని ఆయనకు స్వాగతం పలుకుతుండటం మరో విశేషం.భారత పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ట్రంప్ కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా భారత్ వస్తున్నారు. కీలక అంశాల్లో భారత్తో జరిగే చర్చల్లో పాలు పంచుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఇండియా వస్తోంది. (ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) 36 గంటలు.. ముఖ్యమైన కార్యక్రమాలు భారత్లో తొలుత ట్రంప్ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్లో రోడ్ షోలో పాల్గొంటారు. ఎయిర్పోర్ట్ నుంచి వారు నేరుగా ఈ రోడ్ షోలో పాలుపంచుకుంటారు. దాదాపు 22 కి.మీ.లు ఈ రోడ్ షో జరుగుతుంది. వేలాది మంది ఈ రోడ్ షోలో ట్రంప్నకు స్వాగతం పలుకుతారు. రోడ్ షో పొడవునా 28 వేదికలను ఏర్పాటు చేసి, భారతీయ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అనంతరం, కొత్తగా నిర్మించిన మొతెరా క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’కార్యక్రమం ఉంటుంది. ట్రంప్నకు స్వాగతం పలుకుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ కైలాశ్ ఖేర్ నేతృత్వంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంతో పాటు భారతీయత ఉట్టిపడే పలు ఇతర కార్యక్రమాలుంటాయి. గత సంవత్సరం మోదీ అమెరికా వెళ్లినప్పుడు.. హ్యూస్టన్లో అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోదీ’కార్యక్రమం తరహాలో ఈ ‘నమస్తే ట్రంప్’ఉంటుంది. ఆ కార్యక్రమం తరువాత ట్రంప్ దంపతులు ఆగ్రా వెళ్లి, ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్మహల్ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఆగ్రాను, తాజ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు నేరుగా ఢిల్లీ వెళ్లి హోటల్ మౌర్య షెరాటన్లో సేద తీరుతారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడికి అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత రాజ్ఘాట్కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పిస్తారు. అనంతరం, హైదరాబాద్ హౌజ్లో ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రధాని మోదీతో కలిసి పాలుపంచుకుంటారు. ఆ తరువాత, అమెరికా అధ్యక్షుడు, తన స్నేహితుడు ట్రంప్ గౌరవార్ధం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఉంటుంది. అనంతరం, యూఎస్ ఎంబసీలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొంటారు. వాటిలో ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక భేటీ కూడా ఉంటుంది. మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతిని రామ్నాథ్ కోవింద్ను ట్రంప్ కలుస్తారు. అక్కడ విందు కార్యక్రమంలో పాల్గొని, అమెరికాకు పయనమవుతారు. దాదాపు 36 గంటల పాటు ట్రంప్ భారత్లో గడపనున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్లో స్వాగతం పలికేందుకు చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ చర్చల్లో కీలకం ట్రంప్ పర్యటన భారత్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలను మేలిమలుపు తిప్పనుంది. ముఖ్యంగా, రక్షణ, వ్యూహాత్మక సంబంధాల్లో గణనీయ స్థాయిలో సహకారం పెంపొందనుంది. అయితే, వాణిజ్య సుంకాల విషయంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి నిర్ధారిత ఫలితాలేవీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, ఈ ప్రాంతంలో ఆర్థికంగా, సైనికంగా చైనా విస్తృతిని అడ్డుకునే దిశగా ఇరు దేశాల సంబంధాల మధ్య కీలక సానుకూల ఫలితాలు ఈ పర్యటన ద్వారా వెలువడే అవకాశముంది. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరుదేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విద్యుత్, మత స్వేచ్ఛ, అఫ్గనిస్తాన్లో తాలిబన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో పసిఫిక్ ప్రాంత పరిస్థితి.. తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని భారత్, అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మత స్వేచ్ఛపై కామెంట్స్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ పర్యటన జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. భారత్లో మత స్వేచ్ఛపై ట్రంప్ తన అభిప్రాయాలను వెల్లడిస్తారని వైట్హౌజ్లోని ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇరుదేశాల విలువలైన ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛకు సంబంధించి బహిరంగంగాను, వ్యక్తిగత చర్చల్లోనూ ప్రస్తావన తీసుకువస్తారు. అన్ని అంశాలు, ముఖ్యంగా మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని ప్రెసిడెంట్ తప్పక లేవనెత్తుతారు’అని ఆ అధికారి తేల్చిచెప్పారు. ఐదు ఒప్పందాలు! ఇరు దేశాల మధ్య ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వాణిజ్యం, అంతర్గత భద్రతలకు సంబంధించి ఐదు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా, అమెరికా నుంచి 260 కోట్ల డాలర్లను వెచ్చించి 24 ఎంహెచ్–60 రోమియో హెలీకాప్టర్లను, 80 కోట్ల డాలర్లతో 6 ఏహెచ్ 64ఈ అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందాలు కుదిరే అవకాశముంది. భారత్కున్న పలు అభ్యంతరాల రీత్యా.. భారత పౌల్ట్రీ, డైరీ మార్కెట్లలో ప్రవేశించాలన్న అమెరికా ఆశలు ఈ పర్యటన సందర్భంగా కుదిరే అవకాశం కనిపించడం లేదు. ట్రంప్ నేటి షెడ్యూల్.. ఉదయం.. 11:40.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ మధ్యాహ్నం 12:15.. ట్రంప్, మోదీలు కలసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు 01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 03:30.. ఆగ్రాకు ప్రయాణం సాయంత్రం 04:45.. ఆగ్రాకు చేరుకుంటారు 05:15.. తాజ్మహల్ సందర్శన 06:45.. ఢిల్లీకి ప్రయాణం 07:30.. ఢిల్లీకి చేరుకుంటారు -
ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ
మెలనియా గ్లామర్ మోడల్. ట్రంప్ తొలిసారి 1998లో మెలనియాను న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో చూశాడు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అతడి వయసు 52 ఏళ్లు. ఇద్దరికీ ఇరవై నాలుగేళ్లు తేడా. బిజినెస్మ్యాన్. టెలివిజన్ పర్సనాలిటీ. అప్పటికే రెండో భార్యతో వేరుగా ఉంటున్నాడు. ‘వావ్.. ఎవరీ అమ్మాయి!’ అని ఆరా తీశాడు. మనమ్మాయి కాదు, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. అంతకు రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు న్యూయార్క్ వచ్చినట్లు చెప్పింది మెలనియా. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలనియా ఇవ్వలేదు! అతడి పక్కనే సెలీనా మిడెల్ఫార్ట్ అనే అమ్మాయి ఉంది. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి ఫోన్ నెంబర్ అడుగుతాడేంటి అని కోపం వచ్చి నెంబర్ ఇవ్వలేదు. ట్రంప్ వదిలిపెట్టలేదు. మెలనియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. చివరికి ‘ఎస్’ అంది. తర్వాత కొన్నాళ్లకు ‘నో’ అంది. అలా కొంతకాలం ‘ఎస్’లు, ‘నో’ లతో వాళ్ల రిలేషన్ నడిచింది. ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తర్వాత ఇద్దరూ పక్కపక్కనే బహిరంగంగా నడుస్తూ బయటపడ్డారు. తమ రిలేషన్ గురించి ట్రంప్ 2005లో ఓ టీవీ చానెల్లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. ఆ ముందు ఏడాదే వీళ్ల ఎంగేజ్మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలనియా తల్లి అయింది. కొడుకు పుట్టాడు. మెలనియాకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. ఆమె తండ్రి స్లొవేనియా ప్రభుత్వ మోటార్ వెహికల్స్ డీలర్. స్లొవేనియా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. తల్లికి బట్టల కంపెనీ ఉంది. మెలనియాకు ఒక చెల్లి ఉంది. అన్న ఉన్నాడు. సొంత అన్న కాదు. తండ్రి మొదటి భార్య కొడుకు. మెలనియా ఆ అన్నను ఎప్పుడూ చూడలేదు. మెలనియా డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఫ్యాషన్ మోడలింగ్లోకి వచ్చేశారు. స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్.. భాషలు మాట్లాడతారు మెలనియా. ఇన్ని భాషలు వచ్చినా... ట్రంప్పై వస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టడానికి ఆమెకు ఏ భాషలోనూ బలం సరిపోయేది కాదు. నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్పై దాడి మొదలైంది. ముఖ్యంగా అమెరికన్ మహిళల వైపు నుంచి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో మహిళా వచ్చి ట్రంప్ తమతో ఎంత అసభ్యంగా ప్రవర్తించిందీ మీడియా ముందు వెళ్లగక్కారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని మెలనియా ఆయన వైపు స్థిరంగా నిలబడ్డారు. ‘‘నా భర్త గురించి నాకు తెలుసు. ఆడవాళ్ల విషయంలో అబ్బాయిలు చెప్పుకునే గొప్పల్లాంటివే ఆయన మాటలు’’ అని వెనకేసుకొచ్చారు. ఎంత వెనకేసుకొచ్చినా.. మొదటి భార్య కూతురు ఇవాంక విషయంలో తన భర్త చేసిన కామెంట్లను మాత్రం ఆమె నిజాయితీగా ఖండించారు. కూతురు గురించి ఒక తండ్రి అనవలసిన మాటలు కాదని కూడా అన్నారు. (‘ఇవాంకా నా కూతురు కాకపోయుంటే నేను తనతో డేటింగ్కి వెళ్లేవాడిని. అంత అందంగా ఉంటుంది తను’ అని ట్రంప్ అన్నాడని వచ్చిన వార్తలపై). ట్రంప్ ధోరణి గురించి అడిగితే ఆమె ఎప్పుడూ ఒకే మాట చెబుతారు: ‘సెన్సేషన్ కోసం ఆయన్ని మాట్లాడిస్తారు తప్ప, సెన్సేషన్ కోసం ఆయనకై ఆయన మాట్లాడరు’ అని. ఆ మధ్య ఇంకో ఒక అందమైన మాట కూడా అన్నారు మెలనియా. ఇంట్లో తనకు ఇద్దరు కొడుకు లట. తన కొడుకు. తన భర్త. -
నమస్తే ట్రంప్
-
ఫ్యాషన్ డిజైనర్ నుంచి ఫస్ట్ లేడీ
అయిదు అడుగుల 11 అంగుళాల ఎత్తు, పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు, చురుగ్గా చూసే కళ్లు.. అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనర్, ఆ తర్వాత సూపర్ మోడల్. మోడలింగ్ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. ఆరు భాషల్లో మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్ బాగా వచ్చు. కానీ ఇంగ్లిష్ మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే. తను, తన కొడుకు బారన్లే ఆమెకు లోకం. కమ్యూనిస్టు దేశానికి చెందిన ఫస్ట్ లేడీ స్లొవేనియాలో చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్ న్వాస్ కారు డీలర్. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్ డిజైనింగ్పై మక్కువ ఏర్పడింది. 16వయేటే మోడలింగ్ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్లో ఒక యాడ్ ఏజెన్సీకి మోడల్గా పని చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్లో బ్రేక్ వ చ్చింది. స్లొవేనియా మ్యాగజీన్ ‘జానా’లో ‘లుక్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్లను తానే డిజైన్ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి. ట్రంప్తో డేటింగ్, పెళ్లి 1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్తో ఒక పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్తో డేటింగ్ చేశారు. 2005లో ట్రంప్తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్ పుట్టాడు. ట్రంప్ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్లో కొడుకు చదు వు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్హౌస్కు మారారు. వైట్హౌస్లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి. -
హౌడీ X నమస్తే
సారొస్తున్నారు... మాటల తూటాలతో జాతీయ భావాన్ని రెచ్చగొట్టినా .. ప్రపంచ దేశాలపై నోరు పారేసుకొని వివాదాల కుంపట్లు రాజేసినా..దూకుడు నిర్ణయాలతో సొంత పార్టీలోనూ, మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొన్నా.. అదరలేదు. బెదరలేదు. ఎప్పుడూ తలవంచలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ .. చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో.. ఎన్నారైలు హెచ్1బీ వీసా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో.. కశ్మీర్ అంశంలో మూడోవ్యక్తి జోక్యాన్ని సహించబోమని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెడుతున్నారు. విపక్షాల అభిశంసన తీర్మానాన్ని దీటుగా ఎదుర్కొన్న విజయ దరహాసంతో సారొస్తున్నారొస్తున్నారు. మరి ట్రంప్ ఏం చేస్తారు? మన ప్రధానికి షేక్ హ్యాండిస్తారా? హ్యాండ్నే షేక్ చేస్తారా? ఏమో? ఎవరు చెప్పగలరు? వస్తున్నది ట్రంప్ కదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ ఆరు నెలలు తిరిగిందో లేదో మళ్లీ భారీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో అమెరికాలోని హూస్టన్లో జరిగిన హౌడీ మోదీ తరహాలో ఇప్పుడు నమస్తే ట్రంప్ కార్యక్రమానికి అహ్మదాబాద్ ముస్తాబైంది. హౌడీ మోదీకి కొనసాగింపుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతవరకు ప్రయోజనం? హౌడీ మోదీ వేదిక: టెక్సాస్ హూస్టన్లో ఎన్ఎస్జీ స్టేడియం తేదీ: 2019 సెప్టెంబర్ 23 హాజరైనవారు: 50 వేల మంది ప్రవాస భారతీయులు ఎందుకీ కార్యక్రమం? ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికా గడ్డపై అడుగు పెట్టినందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్లో ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేలా, ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిచ్చేలా తన పర్యటన సాగాలని మోదీ అనుకున్నారు. ఇంధనం, వాణిజ్య రంగాల్లో సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం బాటలు వేస్తుందని ఇరుపక్షాలు భావించాయి. ఇరాన్తో అమెరికా అణు ఒప్పందం రద్దు తర్వాత అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో టెక్సాస్ ఇండియా ఫోరమ్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి మోదీతో పాటు ట్రంప్ హాజరుకావడం నాడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగతంగానూ బంధం బలపడి వాణిజ్య, రక్షణ, ఇంధన రంగాల్లో అడుగులు ముందుకుపడ్డాయి. ఆ కార్యక్రమమే ఇప్పుడు ట్రంప్ భారత పర్యటనకు దోహదపడింది. నమస్తే ట్రంప్ తేదీ: 2020 ఫిబ్రవరి 24 వేదిక : గుజరాత్లోని అహ్మదాబాద్లో మొటెరా స్టేడియం హాజరయ్యే వారు: లక్ష మందికి పైగానే.. ఎందుకీ కార్యక్రమం? అమెరికాకు అధ్యక్షుడయ్యాక ట్రంప్ భారత్కు రావడం ఇదే తొలిసారి. అందుకే హౌడీ మోదీ కార్యక్రమాన్ని మించి భారత్లో ఘన స్వాగతం తెలపడానికి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డు సృష్టించనున్న మొటెరా స్టేడియంలో లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్, మోదీలు ప్రసంగించనున్నారు. తనపై అభిశంసన తీర్మానంలో నెగ్గి నవంబర్లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో ప్రవాస భారతీయులందరూ డెమొక్రాట్లకే అండగా నిలిచారు. ఆసియా అమెరికన్ సర్వే ప్రకారం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు 84 శాతం మంది ఓటు వేస్తే, ట్రంప్కు భారతీయుల ఓట్లు 14 శాతమే పడ్డాయి. ప్రస్తుతం అధ్యక్ష అభ్యర్థుల ఎన్నిక కోసం రాష్ట్రాల స్థాయిలో ప్రాథమికంగా ఓటింగ్ కొనసాగుతోంది. 2018 నాటికి అమెరికాలో 26.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అమెరికాలోని విదేశీయుల్లో 5.9 శాతం మంది భారతీయులే. గత సారి ఓటు వెయ్యని వారిని ఈ సారి తన వైపు తిప్పుకోవడానికి, చైనాతో వాణిజ్యపరమైన యుద్ధం నడుస్తూ ఉండడంతో, భారత్కు తాము ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పడానికి ఈ పర్యటన సాయపడుతుందనే ట్రంప్ భావిస్తున్నట్లు రాజకీయ పండితుల విశ్లేషణ. విదేశంలో లక్ష మంది హాజరయ్యే ఒక భారీ కార్యక్రమంలో మాట్లాడే తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు. అధ్యక్ష ఎన్నికలవేళ ఇవన్నీ తనను ‘ప్రపంచంలో అగ్రనేత’గా నిలబెడతాయని ట్రంప్ భావిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు సమదూరం పాటిస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో ఆర్థికమందగమన పరిస్థితుల్లో రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల్లో భారత్కు అమెరికా సాయం చాలా అవసరం. అలా ‘విన్ అండ్ విన్’ పాలసీతో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వంలో కన్సల్టెంట్గా పనిచేసిన ఆత్మన్ ఎం త్రివేది అభిప్రాయపడ్డారు. మోదీ కలల ప్రాంగణం నరేంద్ర మోదీ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) చీఫ్గా ఉండగా భారీ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న తలంపు ఆయనకు వచ్చింది. 2014లో మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్షా జీసీఏ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న స్టేడియాన్ని కూల్చేసి ఈ నూతన స్టేడియాన్ని నిర్మించారు. మోదీ కలగన్న ఆనాటి క్రికెట్ క్రీడా మైదానంలో ఈ రోజు పెద్దన్నకు ఘనస్వాగతం లభిస్తోంది. ఈ అందమైన, అధునాతనమైన, అతిపెద్ద క్రికెట్ స్టేడియంపై ఓ లుక్కేద్దాం. స్టేడియం పేరు: సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ స్టేడియం గతంలో పేరు: సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం ఎగ్జిక్యూటివ్ సూట్స్: 76 సీటింగ్ కెపాసిటీ: 1,10,000 విస్తీర్ణం: 63 ఎకరాలు తొలిసారి నిర్మాణం: 1982 పాత స్టేడియం కూల్చివేత: 2015 పునర్నిర్మాణం ప్రారంభం: 2017– 20 ఆర్కిటెక్ట్: పాపులస్ (కొత్త నిర్మాణం), శశి ప్రభు (పాత నిర్మాణం) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ మైదానంకన్నా పెద్దది. నిర్మాణం ఖర్చు: రూ. 800 కోట్లు పార్కింగ్ ఏరియా: ఏకకాలంలో 3000 కార్లను, 10 లక్షల ద్విచక్ర వాహనాలను పార్క్ చేయొచ్చు. శనివారం పూరిలోని సముద్రతీరంలో రూపొందించిన డొనాల్డ్ ట్రంప్, మెలానియాల సైకత శిల్పం. -
మెలానియా కార్యక్రమానికి కేజ్రీకి పిలుపేది?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా చేపట్టనున్న పాఠశాల సందర్శన కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఆహ్వానం అందలేదు. ఆ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించినట్లు అమెరికా ఎంబసీ శనివారం సాయంత్రం ఢిల్లీ యంత్రాంగానికి తెలియజేసింది. కేజ్రీవాల్ ప్రారంభించిన ‘హ్యాపీనెస్ క్లాసెస్’ను పరిశీలించేందుకే మెలానియా పాఠశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్శనకు కేజ్రీవాల్ హాజరై హ్యాపీనెస్ క్లాసెస్ గురించి వివరించాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన పేరును తొలగించడంతో వాటి గురించి ఎవరు చెబుతారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది తామేనంటూ సిసోడియా వరుస ట్వీట్లు చేశారు. తాము ప్రారంభించిన హ్యాపీనెస్ క్లాసులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రపంచమే ఉబలాటపడుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం గురించి ప్రభుత్వం కాకపోతే మరెవరు చెబుతారంటూ ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది బీజేపీ పనే: ఆప్ కార్యక్రమం నుంచి కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించడంపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినపుడు స్థానిక అధికారులు హాజరు కావడం ప్రొటోకాల్ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉండటం వల్లే వారిద్దరి పేర్లు తొలగించినట్లు ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించాల్సిందిగా తాము యూఎస్ ఎంబసీని కోరలేదని బీజేపీ అంటోందని, అలా చెప్పడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు. -
ట్రంప్ పర్యటన : కేజ్రీవాల్కు అవమానం..!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఆహ్వానం అందలేదు. భారత్ పర్యటనలో భాగంగా ఈ నెల 25న మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే ‘ హ్యాపీనెస్ క్లాస్’ గురించి అడిగి తెలుసుకుంటారు. అయితే మెలానియా ట్రంప్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కూడా భాగస్వాములు అవుతారని వార్తలు వచ్చాయి. కాగా, కేజ్రీవాల్కు కానీ, మనీష్ సిసోడియాలకు కానీ అలాంటి ఆహ్వానం ఏమీ లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఢిల్లీ సీఎంను పక్కనపెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్ మండిపడింది. మెలానియా ట్రంప్ కార్యక్రమానికి తమ సీఎంను ఆహ్వానించనప్పటికీ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కేజ్రీవాల్ గురించి బెబుతాయని ప్రీతిశర్మ మీనన్ ట్వీట్ చేశారు. (చదవండి : ట్రంప్కి విందు: సీఎం కేసీఆర్కు ఆహ్వానం!) ఇక ఆప్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆప్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేత సంబిత్ పత్రా విమర్శించారు.‘కొన్ని విషయాలపై రాజకీయాలు చేడయం సరికాదు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం ప్రారంభింస్తే భారతదేశం అపఖ్యాతి పాలవుతుంది. భారత్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు. ఎవరిని ఆహ్వానిస్తారనేది ఆ దేశం చేతుల్లో ఉంది. దీనిపై రాజకీయాలు చేయడం మంచిది కాదు’ అని సంబిత్ అన్నారు. (చదవండి : ట్రంప్ వెంటే ఇవాంకా..) కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) భారత్కు చేరుకుంటారు. వాషింగ్టన్ నుంచి ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ వస్తారు. అక్కడ మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్మహల్ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్ఘాట్ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ భవన్లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. -
ట్రంప్ వెంటే ఇవాంకా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు ఇవాంకా కూడా భాగం కానున్నారు. ట్రంప్ సీనియర్ సలహాదారుల హోదాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ భారత్కు వస్తున్నారు. ట్రంప్తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత పర్యటనలో పాలుపంచుకుంటోంది. ఫిబ్రవరి 24న ఫస్ట్ లేడీ మెలానియా తన భర్త ట్రంప్తో పాటు భారత్ వస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. తాజాగా ట్రంప్తో పాటు వస్తున్న ఉన్నత స్థాయి అధికారుల బృందం వివరాలను ప్రకటించింది. వారిలో ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, విద్యుత్ శాఖ మంత్రి డాన్ బ్రౌలిటీ, జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రీన్ తదితరులున్నారు. 24న తాజ్ మహల్ ఫిబ్రవరి 24న వాషింగ్టన్ నుంచి ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్మహల్ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. 25న రాజ్ఘాట్ ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్ఘాట్ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ భవన్లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదంపై పోరులో సహకారం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం, హెచ్1బీ వీసా విషయంలో భారత్ ఆందోళనలు.. మొదలైనవి వారి చర్చల్లో భాగం కావచ్చని సమాచారం. అలాగే, అమెరికా నుంచి 24 ఎంహెచ్–60 రోమియో హెలికాప్టర్లు, 6 అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశముంది. సర్వం వచ్చేసింది ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయనకు అవసరమైన సమాచార, రక్షణ వ్యవస్థలను, ట్రంప్ అధికారిక హెలికాప్టర్ మెరైన్ వన్, రోడ్ షోలో పాలు పంచుకునేందుకు భారీ రక్షణ వ్యవస్థతో కూడిన ఎస్యూవీ తరహా వాహనం(డబ్ల్యూహెచ్సీఏ రోడ్రన్నర్. దీన్నే మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్ అంటారు).. మొదలైన వాటిని తీసుకుని మూడు సీ 17 గ్లోబ్మాస్టర్ కార్గో విమానాలు అహ్మదాబాద్ చేరుకున్నాయి. అమెరికా నుంచి పలువురు సుశిక్షిత భద్రత సిబ్బంది కూడా వచ్చారు. ఢిల్లీలో భద్రత ఏర్పాట్లు ట్రంప్ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వారు ఉండే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్ అందులోని చాణక్య సూట్లో ఉంటారని సమాచారం. గతంలో అందులో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జిబుష్లు సేదతీరారు. ట్రంప్ బృందం వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్లో గదులను కేటాయించరు. హోటల్లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్ చేశారు. కాగా, ఇరాన్– అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారని, బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని భద్రత ఏర్పాట్లలో పాలుపంచుకున్న వర్గాలు వెల్లడించాయి. సాదర స్వాగతం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా క్రికెట్ స్టేడియం వరకు.. ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షో మార్గంలో 28 వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేదికలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. అయితే, కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ఫిబ్రవరి 24న ప్రారంభించే కార్యక్రమం ఉండబోదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) స్పష్టం చేసింది. కేవలం నమస్తే ట్రంప్ కార్యక్రమం మాత్రమే జరుగుతుందని పేర్కొంది. సబర్మతి ఆశ్రమం సందర్శనపై సందిగ్దం అయితే ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. -
ట్రంప్తో పాటు ఇవాంకా కూడా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ కూడా భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు అధికారులు సహా అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ కూడా భారత్కు వస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. వీరితో పాటు ఇవాంకా, ఆమె భర్త జారేద్ కుష్నర్ కూడా వస్తున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్, మెలానియా, ఇవాంకా తొలుత అహ్మదాబాద్ వెళ్లి.. ఆ తర్వాత ఆగ్రాలో తాజ్మహల్ను సందర్శించి.. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా మెలానియాతో కలిసి ఇవాంకా విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక 2017లో ఇవాంకా భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు. చదవండి: భారత పర్యటన: ట్రంప్ నిష్ఠూరం మరోవైపు.. ట్రంప్ తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యపరంగా భారత్తో పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారని భావిస్తున్న తరుణంలో.. వాణిజ్యం విషయంలో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. -
భారత్కు ట్రంప్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్లో అమెరికా అధ్యక్షుడి పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో భారత్ రానున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ల్లో పర్యటించనున్నారు. భారత్లో ట్రంప్ మొదటిసారిగా జరిపే ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను, ప్రజల మధ్య స్నేహాన్ని మరింత పెంచుతాయని అమెరికా తెలిపింది. ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా ఉంటారని అధ్యక్షభవనం శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ తెలిపారు. గత వారం ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా ఈ మేరకు ఖరారైనట్లు వెల్లడించారు. పరస్పర విశ్వాసం, ఒకే విధమైన విలువలు, గౌరవం, అవగాహనల ప్రాతిపదికగా భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతోంది’ అని శ్వేతసౌధం వివరించింది. ‘ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు కృషి చేస్తారు’ అని భారత్ తెలిపింది. ప్రధాని మోదీ ఆహ్వానంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య ఈనెల 24, 25వ తేదీల్లో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్ పర్యటనల సమయంలో ట్రంప్ దంపతులు వివిధ రంగాల వారితో ముచ్చటిస్తారని తెలిపింది. రూ.13,500 కోట్ల విలువైన సమగ్ర గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టం)ను భారత్కు విక్రయించేందుకు విదేశాంగ శాఖ అంగీకరించిన కొద్దిగంటల్లోనే ట్రంప్ పర్యటన ఖరారైనట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ట్రంప్ కంటే ముందు 2010–2015 సంవత్సరాల మధ్య అధ్యక్షుడిగా ఉన్న ఒబామా భారత్లో పర్యటించారు. గత ఏడాది మేలో రెండోసారి ప్రధాని అయిన మోదీ ట్రంప్తో 4 పర్యాయాలు భేటీ అయ్యారు. -
మెలానియా, ట్రూడో ఫొటోపై విపరీతపు కామెంట్లు!
పారిస్ : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోల ఫొటోపై నెటిజన్లు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మెలానియా చూపు ట్రూడోపై ఉందని...చాలా మంది అమ్మాయిల్లాగే ఆమె కూడా కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ #మెలానియాలవ్స్ట్రూడో అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఫ్రాన్స్లోని బియార్రిట్జ్లో జరుగుతున్న జీ 7 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు పలువురు వారి జీవిత భాగస్వాములతో హాజరైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం దేశాధినేతల కుటుంబాలు ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. ఫొటోలు దిగుతున్న సమయంలో మెలానియా తన పక్కనే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను మర్యాదపూర్వకంగా ముద్దుపెట్టుకున్నారు. ఇక అదే సమయంలో పక్కనే ఉన్న ట్రంప్ కళ్లు కిందకు వాల్చుకున్నట్లుగా ఉన్న ఫొటోను రాయిటర్స్ ట్విటర్లో షేర్ చేసింది. ‘ జీ7 ఫ్యామిలీ ఫొటోషూట్లో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ముద్దాడారు. అప్పుడు ట్రంప్ కిందకు చూస్తుండిపోయారు’ అంటూ జీ 7 సదస్సు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మెలానియా-ట్రూడో-ట్రంప్ల ఫొటోపై స్పందించిన నెటిజన్లు...‘ట్రంప్నకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మెలానియా రిస్క్ చేయడానికి వెనుకాడటం లేదనుకుంటా’ అంటూ విపరీర్థాలతో కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది గతంలో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రూడో పక్కన కూర్చున్న ఫొటోను, ప్రస్తుతం మెలానియా ఫొటోను పోలుస్తూ...‘ ఇవాంకా, మెలానియా ట్రూడో వైపు ఎలా చూస్తున్నారో గమనించండి. మీ జీవితంలో అట్లాంటి వ్యక్తి రావాలని కోరుకోండి. ఎంతైనా ట్రూడో భలే అందగాడు. ఇదే కాదు గతంలో ఎన్నోసార్లు మెలానియా ట్రూడోను ఇలాగే చూశారు. అసలు విషయం ఏమిటో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. First lady Melania Trump kisses Canadian Prime Minister Justin Trudeau during the #G7 family photo as President Trump looks on. More of today’s top photos: https://t.co/xLPy8OSSmW pic.twitter.com/m5285qjAFr — Reuters Top News (@Reuters) August 26, 2019 -
అమెరికాను గొప్పగా చేస్తా
వాషింగ్టన్: దేశాభివృద్ధికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న తన అజెండాను పూర్తి చేయడం కోసం తనకు మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్ మంగళవారం ఫ్లోరిడాలో జరిగిన భారీర్యాలీలో అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలకు ‘కీప్ అమెరికా గ్రేట్’ అన్న కొత్త నినాదాన్ని ట్రంప్ ఖాయం చేశారు. ‘అమెరికాకు రెండో సారి అధ్యక్షుడు కావడం కోసం అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం మీ ముందుకొచ్చా. మిమ్మల్ని ఎన్నడూ తలదించుకునేలా చేయనని హామీ ఇస్తున్నా’ అని 73 ఏళ్ల ట్రంప్ తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ఈ ర్యాలీకి 20 వేల మందికిపైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికే కన్నుకుట్టేంతగా ఎదిగిందని అన్నారు. దేశాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్ష డెమోక్రాట్లను హెచ్చరించారు. మూడేళ్ల క్రితం తాను సాధించిన విజయం అమెరికా చరిత్రలోనే సువర్ణ ఘట్టమన్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని కొనసాగిస్తానని, వలస విధానాలను కఠినతరం చేస్తానని, రక్షణ వ్యయాన్ని పెంచుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. తన హయాంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆ అభివృద్ధి అంతా ఆగిపోతుందని 80 నిముషాల తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ‘మనం నిరంతరం ముందుకెళ్తున్నాం. పోరాడుతున్నాం. గెలుస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సతీమణి మెలానియాసహా ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ‘మరో 4 సంవత్సరాలు’ అన్న నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. దేశాన్ని సామ్యవాదంవైపు నెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాను ఎప్పటికీ సామ్యవాద దేశం కానీయనని హామీ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లతో తాము చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయలేదన్నారు. అక్రమల వలసలను కఠినంగా అణిచివేస్తామని ఉద్ఘాటించారు. ‘తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు డెమోక్రాట్లు అక్రమ వలసలను చట్టబద్ధం చేయాలంటున్నారు. డెమోక్రాట్లు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు’ అని అన్నారు. ట్రంప్ వైఫల్యాలను తాము ఎత్తిచూపుతామని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ సభ్యుడు జాన్ సాంతోస్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వలసవిధానాలు, ముస్లింలపై నిషేధం వంటి ట్రంప్ నిర్ణయాలు ఇక్కడి దక్షిణాసియా ప్రజల జీవితాల్ని దుర్భరం చేశాయన్నారు. 2020 నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోయ్ బిడెన్సహా దాదాపు పాతిక మంది ప్రయత్నిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రైమరీ ప్రక్రియ వచ్చే ఏడాది మొదలుకానుంది. -
కన్ను కొట్టిన కెమిల్లా !
ప్రియా వారియర్.. రాహుల్ గాంధీ.. తాజాగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా పార్కర్ కన్ను కొట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్తో సంబంధాలు బలోపేతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా లండన్కి వచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్స్ చార్లెస్ వారికి ఆతి«థ్యమిచ్చారు. వారితో కలసి ఫొటో దిగాక చార్లెస్ భార్య కెమిల్లా పార్కర్..ట్రంప్ వెనుక నడుస్తూ పక్కకి తిరిగి కన్ను కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆమె ఎందుకు కన్ను గీటారనేది అర్ధం కాని విషయంగా మిగిలింది. బ్రిటన్ రాజకుటుంబీకురాలు కెమెరాల సాక్షిగా కన్ను కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు చెబుతున్నారు. మలయాళీ కుట్టి ప్రియా వారియర్ ఓ సినిమా కోసం కన్ను కొట్టే ఒకే ఒక్క సీన్ దేశం మొత్తాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఏడాది పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీని కౌగిలించుకొని వచ్చి తన సీట్లో కూర్చొని జ్యోతిరాదిత్య సింధియావైపు చూస్తూ కన్ను కొట్టడం కూడా చర్చనీయాంశమయ్యింది. -
‘తప్పు చేశాం.. క్షమించండి’
లండన్ : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ గురించి అవాస్తవాలు ప్రచురితం చేసినందుకు గానూ యూకేకు చెందిన వార్తాపత్రిక ‘ది టెలిగ్రాఫ్’ శనివారం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. జనవరి 19న మెలానియా జీవితం గురించి ప్రచురించిన ఆర్టికల్లో తప్పులు దొర్లినందుకు తమను క్షమించాలని మెలానియాను కోరింది. ఈ మేరకు ఆమె లీగల్ టీమ్ కోరిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మెలానియా విజయవంతమైన మోడల్ అని, ఎవరి సహాయం లేకుండానే తన కెరీర్లో అగ్రపథాన నిలిచారని పేర్కొంది. కాగా ‘ది మిస్టరీ ఆఫ్ మెలానియా’ పేరిట ప్రచురించిన మ్యాగజీన్ కవర్ పేజీలో.. ‘మోడల్గా ఎదిగే క్రమంలో మెలానియా ఎన్నో కష్టనష్టాలను చవిచూశారు. డొనాల్డ్ ట్రంప్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన రాత్రి మెలానియా భావోద్వేగానికి లోనయ్యారు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. తన తల్లిదండ్రులు, సోదరిని 2005లో న్యూయార్క్కు తీసుకువచ్చిన మెలానియా..భర్త ట్రంప్నకు చెందిన భవనాల్లో వారిని ఉంచారు. ఆమె తండ్రి తన కుటుంబాన్ని చెప్పుచేతల్లో ఉంచలేకపోయారు’ అంటూ ది టెలిగ్రాఫ్ అసత్య కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తడంతో మెలానియాను క్షమాపణ కోరుతూ ప్రకటన విడుదల చేసింది. -
నేను వేధింపులకు గురయ్యాను : మెలానియా ట్రంప్
వాషింగ్టన్ : ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వేధింపులకు గురవతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అంటున్నారు అమెరికా ఫస్ట్ లేడి మెలానియా ట్రంప్. ఆఫ్రికా పర్యటన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెలానియా ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నేను అత్యుత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ దాన్నే సోషల్ మీడియాలో, ఆన్లైన్లో చర్చిస్తుంటారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు. గత వారం ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియ ఘనా, మళావి, కెన్యా , ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో, మీడాయాలో జనాలు ఆమె వస్త్రధారణ గురించే ఎక్కువగా పరహసించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ మెలానియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్ను ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. అంతేకాక గత జూన్లో టెక్సాస్లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే వాక్యాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. అంతేకాక ఈజిప్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మెలానియా మైకెల్ జాక్సన్ ఆహార్యాన్ని తలపించేలా వైట్ షర్ట్, ప్యాంట్, బ్లాక్ టై ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా మెలానియా ‘నా వస్త్రధారణ గురించి కాకుండా నేను చేసిన పనుల గురించి మాట్లాడితే మంచిది’ అన్నారు. -
స్త్రీలోక సంచారం
ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ‘పిత్ హెల్మెట్’ (బ్రిటిష్ టోపీ) పెట్టుకోవడంపై తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వలస పాలనకు సంకేతమైన బ్రిటిష్ టోపీని.. అమెరికన్ ప్రథమ మహిళగా ఆమె ఎలా ధరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెలానియా గత శుక్రవారం కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్ను «ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. మెలానియా ఇలా పొరపాటుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్లో టెక్సాస్లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే అక్షరాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. ఇప్పుడిక ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మెలానియాపై (నేటితో పర్యటన ముగుస్తుంది).. ఆఫ్రికన్లంతా ‘ఫ్లోటస్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బింగో’ అనే హ్యాష్ట్యాగ్తో ట్రోలింగ్ జరిగిపుతున్నారు. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. బింగో అంటే ఆట. ఆఫ్రికన్ల మనోభావాలతో మెలానియా ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నవారు నెట్లో ఈ హ్యాష్ట్యాగ్ సృష్టించి ఆమెను తలా ఓ మాట అంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య కీచులాటల్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. టీవీ సీరియళ్లు కూడా కీచులాటలు పెట్టడానికి సాధారణంగా అత్తాకోడళ్లనే ఎంచుకుంటాయి. నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఓ అత్త తన కోడలికి కిడ్నీ ఇచ్చి ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా గాంధీనగర్లో ఉంటున్న గనీ దేవి (60) కోడలు సోనికా (32) ఏడాదిక్రితం వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయాయని, కనీసం ఒక కిడ్నీనైనా మార్చందే ఆమెను కాపాడుకోవడం అసాధ్యం అని వైద్యులు సోనికా కుటుంబ సభ్యులకు తెలిపారు. సోనికా తల్లి కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యులు చెప్పారు కానీ, సోనికా తల్లి భన్వారీదేవి.. భయంతో అందుకు అంగీకరించలేదు. తమ్ముడి కిడ్నీ గానీ, తండ్రి కిడ్నీ గానీ పనికొస్తుందని తెలిసినప్పుడు వాళ్లిద్దరు కూడా కిడ్నీ ఇవ్వడానికి విముఖత చూపారు. చివరికి అత్తగారు ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానన్నారు. ఆమె కిడ్నీ పనికొస్తుందని వైద్యులు చెప్పిన వెంటనే ఆమె తన కోడలికి కిడ్నీ ఇచ్చేందుకు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముందుకు వచ్చారు. గత నెల 13న ఢిల్లీలో సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. సోనికా ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఉన్నారు. ‘మా అత్తగారికి నేను జీవితాంతం, జీవితానంతరం కూడా రుణపడి ఉంటాను’ అని ఆమెకు చేతులు జోడించి మరీ చెబుతోంది సోనికా. కిడ్నీ ఇచ్చిన విషయం అత్తగారు చెప్పుకోలేదు కానీ.. ఆసుపత్రిలోని వారెవరో మీడియాతో చెప్పడంతో ఈ అత్తగారి త్యాగ గుణం గురించి బయటికి తెలిసింది. ప్రసవమంత అందమైన అనుభవం లేదని కొత్త తల్లులను మభ్యపెట్టే విధంగా బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్డన్ (36) తనకు కాన్పు జరిగిన ప్రతిసారీ హాస్పిటల్ నుంచి అందంగా తయారై, బిడ్డను చేత్తో పట్టుకుని నడుస్తూ టీవీలో కనిపించడం బాధ్యతారహిత్యమని హాలీవుడ్ స్టార్ కైరా నైట్లీ (33) కొత్తగా తను రాసిన ‘ది వీకర్ సెక్స్’ అనే వ్యాసంలో విమర్శించారు. ‘‘చూస్తున్నాను కదా. తన మూడు ప్రసవాలలోనూ కేట్ ఇలాగే చేశారు. జన్మనిచ్చాక కూడా తల్లులు ఇలాగే తాజాగా ఉంటారని అనుకునేలా ప్రసవం అయిన కొన్ని గంటలకే ముస్తాబై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. ఇదంతా నేను టీవీలో చూశాను. ఎందుకింత అబద్ధం. స్త్రీకి కాన్పు ఎలాంటిదో నాకు తెలుసు. ఆ షిట్టు, ఆ రక్తం, ఆ వాంతులు, ఆ కుట్లు.. అసలు జన్మనివ్వడం అనేది సాఫీగా, సవ్యంగా జరిగే విషయం కాదు. ఇవన్నీ ఎందుకు దాస్తున్నావ్ కేట్. అమాయకపు ఆడపిల్లలు నమ్మేందుకా? ఉన్న సంగతి చెప్పేందుకు బలం కావాలి. ఇప్పుడు చెప్పు.. ఒక బాధాకరమైన స్థితి గురించి అందమైన అబద్ధం చెబుతున్న నువ్వు వీకర్ సెక్సా? ఉన్నది ఉన్నట్లుగా బయట పెడుతున్న నేను వీకర్ సెక్సా?’ అని తన వ్యాసంలో కేట్కు ప్రశ్నలు సంధించారు కైరా. 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన కైరా.. తన దారుణమైన ప్రసవ వేదనను ‘ఫెమినిస్ట్స్ డోన్ట్ వేర్ పింక్’ (అండ్ అదర్ లైస్) అనే పుస్తకంలో వర్ణించారు. ఇప్పుడీ వ్యాసంలో ఆనాటి చేదు అనుభవాన్ని పునర్లిఖించారు. -
స్త్రీలోక సంచారం
ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ‘పిత్ హెల్మెట్’ (బ్రిటిష్ టోపీ) పెట్టుకోవడంపై తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వలస పాలనకు సంకేతమైన బ్రిటిష్ టోపీని.. అమెరికన్ ప్రథమ మహిళగా ఆమె ఎలా ధరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెలానియా గత శుక్రవారం కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్ను «ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. మెలానియా ఇలా పొరపాటుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్లో టెక్సాస్లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే అక్షరాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. ఇప్పుడిక ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మెలానియాపై (నేటితో పర్యటన ముగుస్తుంది).. ఆఫ్రికన్లంతా ‘ఫ్లోటస్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బింగో’ అనే హ్యాష్ట్యాగ్తో ట్రోలింగ్ జరిగిపుతున్నారు. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. బింగో అంటే ఆట. ఆఫ్రికన్ల మనోభావాలతో మెలానియా ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నవారు నెట్లో ఈ హ్యాష్ట్యాగ్ సృష్టించి ఆమెను తలా ఓ మాట అంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య కీచులాటల్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. టీవీ సీరియళ్లు కూడా కీచులాటలు పెట్టడానికి సాధారణంగా అత్తాకోడళ్లనే ఎంచుకుంటాయి. నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఓ అత్త తన కోడలికి కిడ్నీ ఇచ్చి ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా గాంధీనగర్లో ఉంటున్న గనీ దేవి (60) కోడలు సోనికా (32) ఏడాదిక్రితం వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయాయని, కనీసం ఒక కిడ్నీనైనా మార్చందే ఆమెను కాపాడుకోవడం అసాధ్యం అని వైద్యులు సోనికా కుటుంబ సభ్యులకు తెలిపారు. సోనికా తల్లి కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యులు చెప్పారు కానీ, సోనికా తల్లి భన్వారీదేవి.. భయంతో అందుకు అంగీకరించలేదు. తమ్ముడి కిడ్నీ గానీ, తండ్రి కిడ్నీ గానీ పనికొస్తుందని తెలిసినప్పుడు వాళ్లిద్దరు కూడా కిడ్నీ ఇవ్వడానికి విముఖత చూపారు. చివరికి అత్తగారు ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానన్నారు. ఆమె కిడ్నీ పనికొస్తుందని వైద్యులు చెప్పిన వెంటనే ఆమె తన కోడలికి కిడ్నీ ఇచ్చేందుకు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముందుకు వచ్చారు. గత నెల 13న ఢిల్లీలో సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. సోనికా ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఉన్నారు. ‘మా అత్తగారికి నేను జీవితాంతం, జీవితానంతరం కూడా రుణపడి ఉంటాను’ అని ఆమెకు చేతులు జోడించి మరీ చెబుతోంది సోనికా. కిడ్నీ ఇచ్చిన విషయం అత్తగారు చెప్పుకోలేదు కానీ.. ఆసుపత్రిలోని వారెవరో మీడియాతో చెప్పడంతో ఈ అత్తగారి త్యాగ గుణం గురించి బయటికి తెలిసింది. ప్రసవమంత అందమైన అనుభవం లేదని కొత్త తల్లులను మభ్యపెట్టే విధంగా బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్డన్ (36) తనకు కాన్పు జరిగిన ప్రతిసారీ హాస్పిటల్ నుంచి అందంగా తయారై, బిడ్డను చేత్తో పట్టుకుని నడుస్తూ టీవీలో కనిపించడం బాధ్యతారహిత్యమని హాలీవుడ్ స్టార్ కైరా నైట్లీ (33) కొత్తగా తను రాసిన ‘ది వీకర్ సెక్స్’ అనే వ్యాసంలో విమర్శించారు. ‘‘చూస్తున్నాను కదా. తన మూడు ప్రసవాలలోనూ కేట్ ఇలాగే చేశారు. జన్మనిచ్చాక కూడా తల్లులు ఇలాగే తాజాగా ఉంటారని అనుకునేలా ప్రసవం అయిన కొన్ని గంటలకే ముస్తాబై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. ఇదంతా నేను టీవీలో చూశాను. ఎందుకింత అబద్ధం. స్త్రీకి కాన్పు ఎలాంటిదో నాకు తెలుసు. ఆ షిట్టు, ఆ రక్తం, ఆ వాంతులు, ఆ కుట్లు.. అసలు జన్మనివ్వడం అనేది సాఫీగా, సవ్యంగా జరిగే విషయం కాదు. ఇవన్నీ ఎందుకు దాస్తున్నావ్ కేట్. అమాయకపు ఆడపిల్లలు నమ్మేందుకా? ఉన్న సంగతి చెప్పేందుకు బలం కావాలి. ఇప్పుడు చెప్పు.. ఒక బాధాకరమైన స్థితి గురించి అందమైన అబద్ధం చెబుతున్న నువ్వు వీకర్ సెక్సా? ఉన్నది ఉన్నట్లుగా బయట పెడుతున్న నేను వీకర్ సెక్సా?’ అని తన వ్యాసంలో కేట్కు ప్రశ్నలు సంధించారు కైరా. 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన కైరా.. తన దారుణమైన ప్రసవ వేదనను ‘ఫెమినిస్ట్స్ డోన్ట్ వేర్ పింక్’ (అండ్ అదర్ లైస్) అనే పుస్తకంలో వర్ణించారు. ఇప్పుడీ వ్యాసంలో ఆనాటి చేదు అనుభవాన్ని పునర్లిఖించారు. -
పుతిన్ను చూసి వణికిపోయిన ట్రంప్ భార్య..!
ఫిన్లాండ్: అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిత్ పుతిన్ను చూసి భయంతో వణికిపోయారు. అతనితో కరచాలనం చేయగానే ఒక్కసారిగా భయంతో బిక్కచచ్చిపోయారు. రష్యా, అమెరికా దౌత్య సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ ఫిన్లాండ్లో మంగళవారం సమావేశమయ్యారు. కార్యక్రమంలో భాగంగా పుతిన్తో చేయికలిపిన అనంతరం మెలానియా ముఖంలో అదో రకమైన హావభావాలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్విటర్లో కామెంట్ల వర్షం కురుస్తోంది. బహుశా పుతిన్కి షేక్ హాండ్ ఇవ్వడం ఆమెకు ఇష్టం లేదేమోనని కొందరు ట్వీట్ చేయగా.. క్షణ కాలంలో ముఖంలో ఎన్ని భావాలు వ్యక్తం చేయొచ్చో మెలానియాను చూసి నేర్చుకోవచ్చని మరికొందరు అంటున్నారు. తనను పుతిన్ చంపేస్తాడా అన్నంత భయంగా మెలానియా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయని ఇంకో ట్విటరటీ పేర్కొన్నారు. తన చేతిలో ఉన్న చాకొలేట్ను పుతిన్ లాక్కొంటాడేమోనని మెలానియా భయపడుతోంది కావొచ్చని మరో వ్యక్తి జోక్ పేల్చారు. కాగా, ట్వీటర్లో ఈ వీడియో వైరల్ అయింది. ఫ్రీమెలానియా అనే హాష్టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. -
నిర్బంధ కేంద్రాల్లో భారతీయులు
వాషింగ్టన్/హూస్టన్: ఇటీవల అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధానికి గురైన వారిలో వంద మంది వరకు భారతీయులు కూడా ఉన్నారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని నిర్బంధ కేంద్రంలో 40 నుంచి 45 మంది, ఓరెగాన్ రాష్ట్రంలోని కేంద్రంలో మరో 52 మంది భారతీయులు ఉన్నారనీ, ఆ రెండు నిర్బంధ కేంద్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 52 మందిలో అత్యధికులు సిక్కులు, క్రైస్తవులేనని అధికారులు చెప్పారు. ‘ఓరెగాన్లోని నిర్బంధ కేంద్రాన్ని ఇప్పటికే మా అధికారి సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూ మెక్సికోలోని కేంద్రానికి కూడా మరో అధికారి వెళ్తారు’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్లో అత్యధికులు సిక్కులే ఉంటున్నారు. 2013–17 మధ్యలో దాదాపు 27 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ నిర్బంధానికి గురవ్వగా, చాలామంది ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. నిర్బంధ కేంద్రం సందర్శించిన మెలానియా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ శుక్రవారం టెక్సాస్లోని నిర్బంధ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రంలో హొండురాస్, గ్వాటెమాలా, ఎల్సాల్వడార్ దేశాలకు చెందిన 55 మంది చిన్నారులు ఉండగా వారితో మెలానియా నేరుగా మాట్లాడారు. అక్కడి సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ.. పిల్లలను తమ తల్లిదండ్రుల వద్దకు వీలైనంత తొందరగా చేర్చడానికి తన నుంచి ఎలాంటి సాయం కావాలో చెబితే చేస్తానని ఆమె హామీనిచ్చారు. అయితే నిర్బంధ కేంద్రానికి బయల్దేరే ముందు మెలానియా ధరించిన వస్త్రాలపై ‘ఐ రియల్లీ డోంట్ కేర్. డూ యూ?’ (నేను ఏ మాత్రం లెక్కచేయను. మీరు చేస్తారా?) అని రాసి ఉండటం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య ధరించిన వస్త్రాలపై స్పందిస్తూ ‘ఆమె వస్త్రాలపై రాసిన వ్యాఖ్యలు నకిలీ వార్తల మీడియాను ఉద్దేశించినవి’ అని ట్వీట్ చేశారు. -
మీ పాలసీ బాలేదు
వాషింగ్టన్: అమెరికా సరిహద్దుల్లో వలసదారుల నుంచి వారి పిల్లల్ని వేరుచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ‘జీరో టాలరెన్స్’ ఇమిగ్రేషన్ పాలసీగా అమెరికా పేర్కొంటున్న ఈ విధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో పాటు మాజీ ప్రథమ మహిళలు కూడా తప్పుపట్టారు. వేలాది మంది చిన్నారుల్ని తల్లిదండ్రుల నుంచి విడదీయడం అమానుషమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.‘జీరో టాలరెన్స్’ వలస విధానం అమల్లో భాగంగా.. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోని అక్రమ వలసదారుల నుంచి చిన్నారుల్ని బలవంతంగా వేరు చేసి వివిధ వసతి కేంద్రాల్లో ఉంచారని అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగమే స్వయంగా వెల్లడించింది. అయితే ట్రంప్ వివాదాస్పద వలస విధానానికి చిన్నారుల్ని బలిపశువుల్ని చేయడం అన్యాయమని మానవతావాదులు మండిపడుతున్నారు. పసివారిని వేరు చేయొద్దు పిల్లల హక్కులకు భంగం కలిగించే ‘జీరో టాలరెన్స్’ వలస విధానాన్ని ట్రంప్ భార్య మెలానియా సైతం తప్పుపట్టారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తోన్న మెక్సికన్ల నుంచి వారి పిల్లలను వేరుచేయడంపై ఆమె స్పందించారు. ‘చట్టప్రకారం వ్యవహరించండి, కానీ మానవత్వంతో వ్యవహరించండి’ అని అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. తల్లిదండ్రుల నుంచి పసివారిని వేరు చేయడాన్ని సహించలేనని మెలానియా వ్యాఖ్యానించారని, రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఏకమై ఉన్నతమైన వలస సంస్కరణల్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారని మెలానియా ప్రతినిధి స్టిఫాని గ్రీషం వెల్లడించారు. మెలానియా కూడా అమెరికాకు వలస వచ్చి ఆ దేశ పౌరసత్వం పొందడం గమనార్హం. జీరో టాలరెన్స్ దారుణం: లారా బుష్ అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ భార్య లారా బుష్ స్పందిస్తూ.. ‘ఈ జీరో టాలరెన్స్ విధానం అమానుషం. అనైతికం. ఇది విన్నాక నా గుండె బద్దలైంది’ అని వాషింగ్టన్ పోస్టు పత్రికలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘నేను కూడా సరిహద్దు రాష్ట్రంలోనే నివసిస్తున్నాను. మన అంతర్జాతీయ సరిహద్దుల్ని కాపాడాల్సిన అవసరాన్ని, ప్రయత్నాల్ని నేను అభినందిస్తున్నాను. అయితే ఈ జీరో టాలరెన్స్ విధానం దారుణం’ అని పేర్కొన్నారు. పిల్లల్ని వేరుగా ఉంచడం వంటి చర్యలకు అమెరికా ప్రభుత్వం పాల్పడకూడదని లారా బుష్ చెప్పారు. పిల్లల పట్ల అలాంటి చర్యలకు పాల్పడడం అనైతికమని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ హై కమిషనర్ జైద్ రాద్ అల్ హుస్సేన్ అన్నారు. అనుమతించేది లేదు: ట్రంప్ అయితే జీరో టాలరెన్స్ విధానాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఇకపై అమెరికా వలసదారుల శిబిరంగా, శరణార్థుల కేంద్రంగా ఉండబోదని తేల్చి చెప్పారు. యూరప్, ఇతర దేశాల్లో వల్లే అమెరికాలో జరిగేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు దూరంగా... అమెరికా సరిహద్దుల నుంచి మెక్సికో చొరబాటుదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలను కట్టుదిట్టం చేస్తూ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో వారిని ఉంచుతున్నారని అమెరికా మహిళా శరణార్థుల కమిషన్ డైరెక్టర్ మైఖేల్ బ్రేన్ తెలిపారు. ఈ అమానుషంపై అమెరికా వెలుపల, లోపల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అమెరికా ప్రతినిధి జాన్తన్ హాఫ్మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా నూతన వలస విధానం అమలులోకి వచ్చాక.. ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు 2వేల మంది పసివారు తల్లిదండ్రులకు దూరమయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన విధానాన్ని సమర్థించారని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ మే 7న ప్రకటించారు. మెక్సికన్ చొరబాటుదారుల పిల్లల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న అమెరికాపైనా, ఆ దేశ భద్రతా దళాల విధానాలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇరు దేశాల్లోనూ ఉద్యమాలు పెల్లుబికాయి. -
ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మిసెస్ ట్రంప్
వాషింగ్టన్ : డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వలసదారుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలిసిన విషయమే. మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసదారులను అరికట్టేందుకు ఏకంగా మెక్సికో - అమెరికా సరిహద్దులో గోడ నిర్మిస్తానన్న సంగతి విధితమే. గోడనైతే నిర్మించలేదు కానీ అంతకంటే కఠిన చట్టాలు చేసి వలసదారులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న ‘కఠిన సరిహద్దు భద్రతా విధానం’ పట్ల అమెరికాలోని అన్ని రాజకీయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షం నుంచే కాక స్వయంగా స్వపక్షం నుంచి కూడా విమర్శలు ఎదురవుతుండటం గమనార్హం. చివరకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా వలసదారుల పట్ల ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరును తప్పు పట్టారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా ‘ఫాదర్స్ డే’ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెలానియా ట్రంప్...‘చట్టాలు నిక్కచ్చిగా అమలు చేసే దేశం, అమెరికా అంటే నాకు నమ్మకం ఉంది. కేవలం చట్టాలతో మాత్రమే కాక హృదయంతో కూడా పాలన కొనసాగడం మరింత శ్రేయస్కరం. వలసదారులను వెనక్కి పంపించే క్రమంలో చాలామంది పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ఈ జఠిల సమస్య పరిష్కారానికి ఇరు రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. ఇరువురు ఉమ్మడిగా ఆలోచించి సరైన వలసదారుల విధానాన్ని రూపొందించాలి’ అన్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ‘వలసదారుల అమెరికా విడిచి పోవాల్సింది’గా ఆదేశాలు జారీ చేయడమే కాక అందుకు ఆరు వారాల గడువు విధించింది. ఇచ్చిన గడువు లోపు వలసదారులు వారి దేశాలకు తిరిగి వెళ్లాలి. లేదంటే వారిని అరెస్టు చేస్తామని ఆదేశించింది. అంతేకాక వలసదారుల పిల్లలకు అమెరికాలోనే ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన నేపధ్యంలో దాదాపు 2 వేల మంది మైనర్ పిల్లలను వారి కుటుంబం నుంచి వేరు చేసి, వారిని శరణార్ధుల శిబిరానికి తరలించారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ చర్యలు పిల్లలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని...ఈ చర్యలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. -
ట్రంప్ భార్య మెలానియ (48)
మెలానియ గ్లామర్ మోడల్. ట్రంప్ తొలిసారి 1998లో ఆమె 28 ఏళ్ల వయసులో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో చూశాడు. అప్పటికి అతడు రెండో భార్యతోనూ విడిపోయాడు కానీ, విడాకులు తీసుకోలేదు. ఎవరీ అందగత్తె అని ఆరా తీశాడు. దేశవాళీ యువతి కాదు, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. అంతకు రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు న్యూయార్క్ వచ్చినట్లు చెప్పింది మెలానియ. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలానియ ఇవ్వలేదు! అప్పటికే అతడి పక్కన సెలీనా మిడెల్ఫార్ట్ అనే అమ్మాయి ఉంది. మెలానియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు ట్రంప్. ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తర్వాత ఇద్దరూ పక్కపక్కనే బహిరంగంగా నడుస్తూ బయటపడ్డారు. తమ అనుబంధం గురించి ట్రంప్ 2005లో ఓ టీవీ చానెల్లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. 2004లో వీళ్ల ఎంగేజ్మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలానియ తల్లి అయింది. కొడుకు పుట్టాడు. మెలానియకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. మెలానియ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఫ్యాషన్ మోడలింగ్లోకి వచ్చేశారు. స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్.. భాషలు మాట్లాడతారు మెలానియ. ట్రంప్కి, మిలానియకు ఒకడే సంతానం. బ్యారన్ ట్రంప్. ఇవాంక ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు. -
ఆమె మాత్రం స్పందించరేం?
వాషింగ్టన్: ఓ వైపు నుంచి లైంగికపరమైన ఆరోపణలు .. మరోవైపు మాజీ ఉద్యోగుల తీవ్ర విమర్శలు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఊపిరి సలపనివ్వటం లేదు. వేటిపై కూడా స్పష్టత ఇవ్వకుండా ‘నో’ ఒక్క సమాధానంతోనే దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ మీడియా ఛానెళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ భార్య- అమెరికా ప్రప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటిదాకా పెదవి విప్పకపోవటం గమనార్హం. ఈ వ్యవహారాలపై మీడియాకు తారసపడినప్పుడల్లా ఆమె మౌనంగా ఉండటమో లేక తప్పించుకుని తిరగటమో లాంటివి చేస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె హాజరుకాగా.. మీడియా తారసపడకుండా భద్రతా సిబ్బంది గట్టి ప్రయత్నాలే చేశారు. గతంలో ట్రంప్ వ్యాపార విషయాల్లో.. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. మెలానియా చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. అలాంటిది పోర్న్ స్టార్ స్ట్రోమీ డేనియల్స్ వ్యవహారం, తాజాగా ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమే.. ట్రంప్పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఆమె స్పందించటం లేదు. ఒకానోకదశలో కనీసం సోషల్ మీడియా మాధ్యమంగా ఆమె ఖండించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ట్రంప్ బాగోతాల గురించి పూర్తిగా తెలిసిన ఆమె తన మౌనంతోనే భర్తకు శిక్ష విధించేసి ఉంటుందంటూ అమెరికన్ మాగ్జైన్లు వరుస కథనాలు ప్రచురించేస్తున్నాయి. -
10 నెలల బంధం మాది : ట్రంప్ భార్యకు సారీ
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో తనకు పది నెలల శారీరక సంబంధం ఉందని ప్రముఖ మేగిజిన్ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ చెప్పారు. 2006లో తమ మధ్య సంబంధాలు ఏర్పాడ్డాయని, ఆ బంధం పెళ్లి వరకు తీసుకెళుతుందని కూడా తాను భావించినట్లు తెలిపారు. అయితే, ఇప్పుడు తానేదో ఆశించి ఈ విషయం చెప్పడం లేదని అన్నారు. ట్రంప్తో తనకు శారీరక సంబంధం ఉందని ప్రకటించిన తర్వాత తొలిసారి సీఎన్ఎన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆండర్సన్ కూపర్ నిర్వహించే 360 డిగ్రీస్ అనే కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు విషయాలు తెలిపారు. ‘అప్పుడు నేను ట్రంప్తో గాఢంగా ప్రేమలో మునిగిపోయాను. ట్రంప్ కూడా తన ప్రేమను ఎన్నోసార్లు చెప్పారు. ప్రతిసారి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ట్రంప్ చెప్పేవారు. పది నెలలపాటు మా సంబంధం కొనసాగింది. అది పెళ్లి వరకు వస్తుందని కూడా నేను ఆశపడ్డాను’ అని చెప్పారు. అంతేకాదు, తాను ట్రంప్ భార్య మిలానియాకు క్షమాపణలు చెప్పారు. ‘ఇంతకంటే నేను ఏం చెప్పగలను.. అందుకే నన్ను క్షమించు.. నన్ను క్షమించు..ఇలా నేను ఇంకెప్పుడు చేయకూడదని అనుకుంటున్నాను’ అని దౌగల్ తెలిపారు. -
ట్రంప్ సంసారంలో పోర్న్స్టార్ నిప్పులు పోసిందా?
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఆయన సతీమణి మెలానియా ట్రంప్ అలకబూనారా? లేదా ఆయనను అసహ్యించుకుంటున్నారా? లేక ట్రంప్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారా? ఇప్పుడు అమెరికాలోని సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ట్రంప్ ఎటు వెళ్లినా పక్కనే వెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆమె ఇటీవల ట్రంప్కు దూరంగా ఉంటున్నారు. ఎంత అంటే ఈ మధ్యకాలంలోనే వైట్ హౌస్లోకి షిప్ట్ అయిన ఆమె తిరిగి వెళ్లిపోయారట. వాషింగ్టన్లోని ఓ హోటల్లో ఆమె ఉంటున్నారని సమాచారం. అందుకు ప్రధాన కారణం ట్రంప్కు ఉన్న అక్రమ సంబంధం అది కూడా ఓ పోర్న్స్టార్తో అని తెలియడంతో తనకు ఇబ్బందిగా అనిపించి ట్రంప్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని మెలానియా హోటల్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల స్టార్మీ డానియెల్ అనే ఓ పోర్న్స్టార్తో ట్రంప్కు అక్రమ సంబంధం ఉందని, ఆ విషయం ఆమె ఎక్కడా ప్రస్తావించకుండా ఉండేందుకు ట్రంప్ తరుపు న్యాయవాది ఒకరు ఆమెకు దాదాపు లక్షా 30వేల డాలర్లు ఇచ్చారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలిసి ట్రంప్పై మెలానియాకు మరింత ఆగ్రహం వేసినట్లు సమాచారం. అందుకే, ఇటీవల ట్రంప్ ఎక్కడకు వెళుతున్నా పక్కన వెళ్లకుండా ఆఖరికి దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కూడా ఆమె ట్రంప్తో రాకుండా దూరంగా ఉండిపోయారు. ఈ విషయం కూడా ట్రంప్పై మెలానియా ఆగ్రహంతో ఉన్నారనే వార్తను ధ్రువీకరిస్తున్నాయని నెటిజెన్లు అనుకుంటున్నారు. మరోపక్క, మెలానియా అధికారిక ప్రతినిధి మాత్రం దీనిపై నేరుగా స్పందించలేదు. ట్విటర్ ద్వారా మాత్రం అవన్నీ ఊహాగానాలేనని పేర్కొన్నారు. -
ట్రంప్పై బాంబు పేల్చిన పోర్న్స్టార్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్తో ఉన్న లైంగిక సంబంధాన్ని వెల్లడించకూడదని ఓ పోర్న్స్టార్కు ట్రంప్ వ్యక్తిగత లాయర్ ముడుపులు చెల్లించాడనే ఆరోపణలు కుదిపేస్తున్న నేపథ్యంలో అమెరికన్ టాబ్లాయిడ్ ‘ఇన్ టచ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ట్రంప్తో శృంగారంలో పాల్గొన్నట్టు భావిస్తున్న అడల్ట్ సినీతార స్టెఫానీ క్లిఫార్డ్ ఇంటర్వ్యూను ప్రచురించింది. మెలానియా బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ఆమె ధ్రువీకరించింది. అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘అప్రెంటిస్’ షోలో తనకు పాత్ర ఇస్తానని ఆఫర్ కూడా చేశాడని ఆమె తెలిపింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్గా తాను ఉంటానని ట్రంప్ తనకు కితాబిచ్చాడని ఆమె చెప్పుకొచ్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్టార్మీ డానియెల్గా పేరొందిన క్లిఫర్డ్ తమ ఎఫైర్ బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు చెల్లించాడని, తద్వారా రాజకీయ విమర్శలు రాకుండా ట్రంప్ ముందుజాగ్రత్తలు తీసుకున్నాడని వాల్స్ట్రీట్ జర్నల్ గతవారం కథనాన్ని ప్రచురించగా.. ఈ కథనాన్ని వైట్హౌస్ ఖండించింది. -
ఫస్ట్ లేడీ.. నువ్వా నేనా?
అమెరికా ఫస్ట్లేడీని నేనంటే నేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యలు మీడియాకెక్కారు. ఈ గొడవకు ట్రంప్ మాజీ(మొదటి)భార్య ఇవానా ఆజ్యం పోయగా.. ప్రస్తుత భార్య మెలానియా ఘాటుగా బదులిచ్చారు. నిజానికి ఫస్ట్ లేడీని నేనే అంటూ ఇవానా రెచ్చ గొట్టగా.. పుస్తకాలు అమ్ముకునేందుకు కొంద రు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వాషింగ్టన్లో ఉండడమే నాకిష్టం అంటూ మెలానియా దీటుగా సమాధానమిచ్చారు. సవతుల పోరులో ఇరుక్కున ట్రంప్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిగా ‘ఫస్ట్ లేడీ’కి ఉండే హోదా, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ హోదా నాదంటే నాది అని మెలానియా, ఇవానాలు మీడియాకెక్కడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తాను మళ్లీ ఫస్ట్లేడీ కావచ్చునేమోనంటూ ట్రంప్ మొదటి భార్య ఇవానా ఈ చర్చకు తెరలేపారు. ట్రంప్తో ప్రేమ, పెళ్లి, విడాకుల్ని ప్రస్తావిస్తూ ఆమె రాసిన ‘రైజింగ్ ట్రంప్’ పుసక్తం ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వైట్ హౌస్ డైరెక్ట్ నంబర్ నా దగ్గరున్నా ట్రంప్తో మాట్లాడేందుకు అక్కడకు ఫోన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ∙మెలానియా ఉంది. ఆమెకు ఎలాంటి అసూ యను కలిగించాలని అనుకోవడం లేదు. వాస్తవంగా నేనే ట్రంప్ మొదటి భార్యను.. అప్పుడు నేనే ఫస్ట్ లేడీని కదా ?’ అంటూ 68 ఏళ్ల ఇవానా ఈ వివాదానికి ఆజ్యం పోశారు. వివాదాలకు దూరంగా ఉండే మెలానియాకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ‘మెలానియా వాషింగ్టన్లో ఉండడానికి ఇష్టపడతారు. అమెరికా ఫస్ట్ లేడీగా తన బాధ్యతల్ని నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తారు. తన హోదాను, సమయాన్ని పిల్లలకు సాయపడటానికి ఉపయోగిస్తారే తప్ప పుస్తకాలు అమ్ముకోడానికి కాదు’’ అని మెలానియా అధికార ప్రతినిధి స్టిఫేని గ్రీషమ్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ రాసలీలల ప్రస్తావన మొదటి నుంచి జల్సారాయుడిగానే ట్రంప్ పేరుతెచ్చుకున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన మొదటి ఇద్దరికీ విడాకులిచ్చి ప్రస్తుతం మెలానియాతో ఉంటున్నారు. చెకొస్లోవియా మోడల్ ఇవానాను 1977లో ట్రంప్ మొదటి వివాహం చేసుకున్నారు. 1992లో వారిద్దరు విడిపోయారు. వారి సంతానమే డొనాల్డ్ ట్రంప్ జూనియర్(38), ఇవాంకా ట్రంప్ (34), ఎరిక్ ట్రంప్ (32). 1980లలో ట్రంప్, ఇవానాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.ట్రంప్ను ‘ది డొనాల్డ్’ అని ముద్దుపేరుతో పిలుచుకునేది ఇవానా. అయితే ఇప్పుడు ట్రంప్తో ప్రేమ, పెళ్లి, విడాకులు సహా పలు ఆసక్తికర అంశాల్ని ‘రైజింగ్ ట్రంప్’ పుస్తకంలో ఇవానా బయటపెట్టారు. ట్రంప్ వివాహేతర సంబంధాల బాగోతాన్ని అందులో వివరించారు. ‘మా వివాహ బంధం ముగిసిందని 1989లోనే నాకు అర్థమైంది. ఒక యువతి నా దగ్గరకు వచ్చి తన పేరు మార్లా అని, నా భర్తను ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను వెంటనే బయటకు పో.. నేను నా భర్తను ప్రేమిస్తున్నానని గట్టిగా సమాధానమిచ్చాను’ అని పాత సంగతుల్ని పుసక్తంలో ఇవానా గుర్తుచేసుకున్నారు. మార్లా మేపుల్స్తో వివాహేతర సంబంధాన్ని 1990లో న్యూయార్క్ పోస్టు పత్రిక ‘బెస్ట్ సెక్స్ ఐ హావ్ ఎవర్ హాడ్’ పేరుతో ప్రకటించడంతో ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2005లో మెలానియాతో పెళ్లి 1993లో మార్లా మేపుల్స్ (52)ను ట్రంప్ వివాహం చేసుకున్నారు. వారిద్దరి సంతానమే టిఫాని ట్రంప్ (22). ఆరేళ్ల వైవాహిక జీవితం అనంతరం 1999లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక 2005లో మెలానియా(46)ను ట్రంప్ పెళ్లిచేసుకున్నారు. స్లొవేనియాలో పుట్టిన ఆమె పలు పత్రికలకు మోడల్గా పనిచేశారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. ప్రముఖ పత్రికలు వోగ్, హార్పర్స్ బజార్, బ్రిటిష్ జీక్యూ, ఓషియన్ డ్రైవ్ తదితర పత్రికల కవర్పేజీలపై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. వారిద్దరి సంతానమే బర్రోన్ ట్రంప్ (10). –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ట్రంప్ ముగ్గురు భార్యల పంచాయితీ..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చుట్టూ భార్యల పంచాయితీ తిరుగుతోంది. ఇప్పటికే ఆయన మొదటి భార్య పుస్తక రూపంలో గొంతును వినిపించడంతో భారీ చర్చ జరుగుతుండగా ఆమెకు ఇప్పుడు మరో భార్య తోడయ్యారు. ట్రంప్ ప్రస్తుత భార్య(మూడో భార్య) మెలానియా ట్రంప్ తాజాగా బరిలోకి వచ్చారు. ఇవానా ట్రంప్ను, ఆమె తర్వాత వచ్చిన మార్లా మ్యాపిల్స్ను పరోక్షంగా విమర్శించారు. 'రైజింగ్ ట్రంప్' అనే పేరిట ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఆ పుస్తకంలోని ప్రమోషన్లో భాగంగా సోమవారం 'గుడ్ మార్నింగ్ అమెరికా' అనే కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా 'నేనే ట్రంప్కు అసలైన భార్యను. అమెరికా ప్రథమ పౌరురాలిని నేనే' అని ఇవానా ట్రంప్ ప్రకటించుకున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేట్ విషయాలు చెప్పారు. వారిద్దరికి కలిగిన ముగ్గురు సంతానం పెంపకం గురించి కూడా వెల్లడించారు. అంతేకాదు, తనకు శ్వేత సౌదానికి వెళ్లేందుకు నేరుగా మార్గం ఉందని, తన మాజీ భర్తను ఎప్పుడంటే అప్పుడు కలుసుకోగలనని అన్నారు. టెలిప్రమోటర్ లేకుండానే 45 నిమిషాలపాటు ప్రసంగం చేయగలనని, చర్చలు జరపగలనని, ఎంటర్టైన్ చేయగలనని ఇలా ఎన్నో చేసే అవకాశం తనకు ఉందని చెప్పారు. కానీ, తనకు తన స్వేచ్ఛను అనుభవించడమే ఇష్టమని, అందుకే అలా చేయలేనని అన్నారు. పైగా వాషింగ్టన్లో ఉండేందుకు మెలానియా తెగ భయపడుతున్నట్లుందంటూ విమర్శించారు. దీంతో మెలానియా ట్రంప్ రంగంలోకి వచ్చారు. శ్వేతసౌద అధికారిక ప్రతినిధి ఒకరు మెలానియా తరుపున ఓ ప్రకటన చేశారు. 'వాషింగ్టన్లో ఉండటం అంటే మెలానియా ట్రంప్కు ఎంతో ఇష్టం. పైగా అమెరికా ప్రథమపౌరురాలిగా తనకు దక్కిన పాత్రను మెలానియా ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. ఆమె తనకు దక్కిన గౌరవంతో చిన్నారులకు సహాయం చేసే పనుల్లో ఉన్నారు.. పుస్తకాలు అమ్ముకునే విషయంలో కాదు(ఇవానా ట్రంప్ను ఉద్దేశించి)' అని ఓ ప్రకటన విడుదల చేశారు. -
నా భార్య ఏ తప్పు చేయలేదు: ట్రంప్
వాషింగ్టన్ : తన భార్య మెలానియా ట్రంప్ హై హీల్స్పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దేశ ప్రథమ పౌరురాలైన మెలానియాతో పాటు తనకు అధ్యక్ష భవనం అంటే ఎంతో గౌరవమని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెలానియా ఎప్పుడూ సంప్రదాయ వేషధారణలో ఉంటారని ఆమెకు మద్ధతుగా నిలిచారు. వైట్ హౌస్ నుంచి టెక్సాస్కు బయలుదేరే ముందు అందరూ మహిళల తరహాలోనే తన భార్య పద్ధతిగా దుస్తులు వేసుకున్నారని, హైహీల్స్ ధరించారని తెలిపారు. విమానంలో ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని మెలానియా స్నికర్స్ మార్చుకున్నారని చెప్పారు. హరికేన్ హార్వే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకునేందుకు మేము వెళ్లగా తన భార్యపై అనవసరంగా విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తులకు, వీఐపీలకు వేషధారణలో ఎలాంటి మార్పులు ఉండవని.. అందరూ సమానమేనని భావించాలన్నారు. వాస్తవానికి మెలానియా సంప్రదాయంగానే కనిపించారని, ఆమె హై హీల్స్ లేదా స్నికర్స్ ధరించడమనేది తప్పిదమే కాదన్నారు. అసలు మెలానియా ఏం తప్పు చేసిందో చెప్పాలని ట్రంప్ ప్రశ్నించారు. విమానం నుంచి దిగే సమయంలో మెలానియాకు తెలియకుండానే సౌకర్యంగా ఉంటాయని హై హీల్స్ నుంచి స్నికర్స్కు మారారని విమర్శలకు బదులిచ్చారు. గత ఆగస్టులో విధ్వంసం సృష్టించిన హరికేన్ హార్వే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించగా మెలానియా ఆహార్యంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
వరద కష్టాల్లోనూ.. మెలానియా సోకులు!
వాషింగ్టన్: వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మరీ సోకులకు పోవడం విమర్శలపాలైంది. ఇటీవల తీవ్ర వర్షాలు, వరదలతో ఛిన్నాభిన్నం అయిన టెక్సస్ను మంగళవారం ట్రంప్, ఆయన భార్య మెలానియా సందర్శించారు. ట్రంప్ హయాంలో అతిపెద్ద విలయంగా భావిస్తున్న టెక్సస్ విపత్తు నేపథ్యంలో అధ్యక్షుడు, ఆయన సతీమణి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత ఫ్యాషనబుల్గా కనిపించడానికి ట్రంప్, మెలానియా ప్రయత్నించడం అమెరికన్లను విస్తుపోయేలా చేసింది. ముఖ్యంగా మెలానియా మరీ ఎత్తుగా ఉన్న హైహిల్స్ వేసుకోవడం అందరి దృష్టి ఆకర్షించింది. టెక్సస్ వరద కష్టాలు ముంచెత్తిన సందర్భంలోనూ ట్రంప్, మెలానియా ఇలా సోకులకు పోవడం ఏమిటని అమెరికన్ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టైలర్డ్ కాప్రి ప్యాంట్, ఆర్మీ ఆకుపచ్చ రంగు బాంబర్ జాకెట్, ఏవియేటర్ సన్గ్లాసెస్, స్కై-హై హిల్స్ షూస్ను మెలానియా ధరించగా.. ట్రంప్ హుడెడ్ రెయిన్ జాకెట్, ఖాకీ రంగు ప్యాంటు, ముదురురంగు బూట్లు వేసుకున్నారు. వీరి సోకులపై ట్విట్టర్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మెలానియా అచ్చం వరదలను చూస్తున్న బార్బీలా ఉంది' అని రచయిత మారియా డెల్ రుసో ట్వీట్ చేయగా.. 'టెక్సస్ వాసులారా ఆందోళన చెందకండి. సాయం అందుతుంది. మెలానియా తుఫాన్ అంత ఎత్తున హైహీల్స్ వేసుకుంది' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. Melania over here looking like Flood Watch Barbie. Pretty sure Loubs aren't waterproof, babes. https://t.co/XCAexsWpsc — Maria Del Russo (@maria_delrusso) August 29, 2017 And here we have Melania Trump modeling what NOT to wear to a hurricane: 5-inch stilettos. How out of touch can you be? pic.twitter.com/tZR8o3dYxY — Holly O'Reilly (@AynRandPaulRyan) August 29, 2017 -
ఇరుక్కుపోయిన ట్రంప్ భార్య.. బయటలొల్లి
హాంబర్గ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ హాంబర్గ్లోని అతిథి గృహంలో ఇరుక్కుపోయారు. హాంబర్గ్లో జీ 20 శిఖరాగ్ర సమావేశానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె బయటకు రాలేక లోపలే ఉండిపోయారు. ఒక్క ట్రంప్ భార్య మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రతినిధుల సతీమణులు కూడా అందులోని ఉండిపోవాల్సి వచ్చిందట. అయితే, జీ 20 సదస్సులో భాగంగా వారికి పలు కార్యక్రమాలు ఉండగా ఆందోళన కారణంగా బయటకు రాకుండానే ఉండాల్సి వచ్చిందని అక్కడి మీడియా తెలిపింది. ‘ఆందోళనల కారణంగా అతిథి గృహం నుంచి బయటకు వెళ్లేందుకు హాంబర్గ్ పోలీసులు మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు’ అని ట్రంప్ అధికారిక ప్రతినిధి స్టీఫెన్ గిరీషం మీడియాకు చెప్పారు. వాతవరణ కేంద్రానికి వారు వెళ్లకుండానే నేరుగా వాతావరణ శాస్త్రవేత్తలే హాంబర్గ్లో హోటల్లో వారికి ప్రసంగాలు ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.