Nadu Nedu AP
-
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇది కదా జగన్ మార్క్ అంటే.. ప్రభుత్వ స్కూళ్లను చూసి పవన్ ఆశ్చర్యం!
సాక్షి,కాకినాడ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చి వేసిన సంగతి తెలిసిందే.. ఆ మార్పుల్ని చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయంటూ పొగిడారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ బాలుర హైస్కూల్ను పవన్ కల్యాణ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద తీసుకొచ్చిన మౌలిక సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తరగతి గదుల్లో మార్పు చూసి ఇది ప్రభుత్వ పాఠశాలా? లేక ప్రైవేటు పాఠశాల అంటూ పక్కనే ఉన్న అధికారుల్ని అడిగారు. ఆ తర్వాత విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్ని చూసి చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.Feel The Difference pic.twitter.com/bsk9hYHNV6— Graduate Adda (@GraduateAdda) November 4, 2024 ఆ తర్వాత అదే స్కూల్లో పదవ తరగతి గదిలో విద్యార్ధులు కూర్చునే బెంచీలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో కరచాలనం చేస్తూ ఈ బెంచ్లు ఎప్పుడు వచ్చాయని అడగారు. అందుకు పవన్ పక్కనే ఉన్న కలెక్టర్ షాన్ మోహన్ ఇవి నాడు-నేడు పథకం ద్వారా పథకం కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవి అంటూ బదులిచ్చారు. PK: ఇది ZPH స్కూల్ నా ⁉️Some One: అవును సార్ PK: ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంది 👍ఇది కదా @ysjagan మార్క్ 🔥🔥🔥 pic.twitter.com/YXJRuUmVhl— For A Reason (@forareason_in_X) November 5, 20242014-2019 చంద్రబాబు హయాంలో ఈ సందర్భంగా 2014-2019 గత చంద్రబాబు హయాంలో నాడు పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలంలోని దుంబ్రిగుడ గ్రామానికి చెందిన కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను చూసి విచారం వ్యక్తం చేశారు. కూర్చోవడానికి బెంచీలు లేక.. నేల మీద కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థుల్ని పరామర్శించారు. ఆ వీడియోల్ని నెటిజన్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితిని, వైఎస్ జగన్ హయాంలోని మారిన ప్రభుత్వ రూపురేఖలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.చదవండి : ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ -
ఈ విషానికి విరుగుడేదీ?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలి. వారి చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది’ అంటూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు.ఇందుకు తగ్గట్టే దేశవిదేశాలు కీర్తించేలా విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించినా ఈనాడు పత్రిక మాత్రం వాస్తవాలను జీర్ణించుకోలేక మరోసారి వికృత రాతలతో విషం జిమ్మింది. ఐదేళ్ల జగన్ పాలనలో విద్య అస్తవ్యస్తమైపోయిందని.. ‘పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!’ అంటూ తప్పుడు రాతలకు బరితెగించింది. జగన్ ప్రభుత్వం పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించింది.మనబడి నాడు–నేడుతో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా సంస్థలే అసూయచెందేలా కొత్త పాఠశాల భవనాలు, టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత ఏపీకి మాత్రమే దక్కింది.దేశంలోనే అత్యత్తమ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చినా ఈనాడు పత్రిక మాత్రం అంగీకరించలేక తన అల్పబుద్ధిని చాటుకుంటోంది. ఈ విద్యా సంస్కరణలే తప్పు అనేలా వక్రీకరణలు చేస్తోంది. ఏదోలా ఈ సంస్కరణలను రద్దు చేసి, పేదింటి పిల్లలను ఉత్తమ విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా సంస్కరణలు 2019కి ముందు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ బడుల్లో పరిస్థితి దిగజారింది. అదే విషయాన్ని ‘అసర్, నాస్’ వంటి సర్వేలు కూడా స్పష్టం చేశాయి. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ సర్వేల అంశాలను ప్రామాణికంగా తీసుకొని పలు కార్యక్రమాలను అమలు చేసింది. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, సపోరి్టంగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కార్యక్రమాలు అందులో కొన్ని. అసర్ నివేదిక ఆధారంగా రూపొందించిన ‘టీచింగ్ ఎట్ రైట్ లెవెల్’ కార్యక్రమంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పలు నూతన విధానాలతో విద్యాబోధన అమలు చేశారు.ఇందుకోసం ప్రత్యేకంగా ‘ప్రథమ్’ సంస్థతో కలిసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించారు. దీనిద్వారా విద్యార్థుల లెర్నింగ్ ఎబిలిటీ, రీడింగ్ ఎబిలిటీ మెరుగుపడినట్లుగా 2022 బేస్లైన్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ‘లిప్’ ప్రోగ్రాం అమలు చేశారు. విద్యార్థుల క్లాస్ రూమ్ పరీక్షల నిర్వహణలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.గతంలో ఫార్మెటివ్ అసెస్మెంట్స్ను ఎక్కడికక్కడ క్లాస్ రూమ్లో టీచర్ రూపొందించి ఇచ్చేవారు. ఇందులో పరీక్ష, ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో నిపుణులతో ప్రశ్నపత్రాలు రూపొందించి అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా ప్రశ్నపత్రాలు అందించారు. బైజూస్ ఉచితంగా అందించిన ఈ–కంటెంట్తోపాటు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన తెలుగు, ఇంగ్లిష్, హిందీ కంటెంట్ను కూడా ఉపాధ్యాయులకు డీటీహెచ్ చానల్స్ ద్వారా, ఈ–పాఠశాల యాప్ ద్వారా అందజేశారు. ఒకే సిలబస్.. బోర్డుల ప్రకారం పరీక్షలుసెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి రాష్ట్రంలో 1,000 పాఠశాలలను అనుసంధానించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మొదటి బ్యాచ్ సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారు. అందుకు అవసరమైన ప్రణాళికను ముందే అమల్లోకి తెచ్చారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతి నుంచి పేద పిల్లలకు ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) విద్యను అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 44,478 స్కూళ్లలోనూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్నే బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే తరహా సిలబస్ ఉంది. పరీక్షా విధానం మాత్రమే ఆయా బోర్డుల ప్రకారం ఉంటుంది. ఇంగ్లిష్ నైపుణ్యాల పెంపునకు టోఫెల్ విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్, మంచి ఇంగ్లిష్ ఒకాబులరీ నైపుణ్యాలను అందించేందుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారు. అన్ని పాఠశాలల్లో టోఫెల్ బోధనకు ప్రత్యేకంగా పీరియడ్ కేటాయించారు. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైసూ్కళ్లలో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ), 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్పీలు మాత్రమే ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఉండటం విశేషం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది. విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. భావి నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమించారు. పేదలకు ‘ఐబీ’తో అంతర్జాతీయ విద్య పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. సంపన్నులు మాత్రమే చదివించగల ఐబీ చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ వారి కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటరీ్మడియెట్ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3 నుంచి 10 తరగతులకు బోధించాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఆ తరహా సేవలు అందిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,582 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి సబ్జెక్ట్ టీచర్లు(స్కూల్ అసిస్టెంట్లు)గా హైసూ్కళ్లకు పంపించారు. ప్రతి స్కూల్లో ఎంత మంది ఉపాధ్యాయులు తగ్గారో ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించని ‘ఈనాడు’ ఈ విషయంలోనూ కాకి లెక్కలు వేసింది. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 7 వేల వరకు ఉన్నాయి. అవన్నీ ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ విద్యార్థుల సంఖ్య 8 నుంచి 15 మంది లోపే ఉన్నా ప్రతి బడికి ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించింది. ఇప్పటి వరకు పాకల్లోనూ, శిథిల గదుల్లోనూ కొనసాగిన వీటికి ‘నాడు–నేడు’ కింద కొత్త భవనాలను నిరి్మస్తోంది. కానీ ‘ఈనాడు’ నోటికొచ్చిన ఓ అంకెను ముద్రించి అసత్యాలను ప్రచురిస్తోంది. హేతుబదీ్ధకరణపైనా అసత్యాలే..రాష్ట్రంలో 2019 కంటే ముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సంస్థల అధ్యయనాలు తేల్చాయి. దీంతో వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి.. 1, 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి పెట్టింది. 3, 4, 5 తరగతులను హైసూ్కల్ విద్యలోకి తీసుకురావడం ద్వారా బీఈడీ, సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉన్న సబ్జెక్ట్ టీచర్ల ద్వారా పిల్లలకు బోధన అందించి అభ్యసనా సామర్థ్యాలను బలోపేతం చేసింది.ఇందుకోసం ప్రాధమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను హైసూ్కల్కు మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలకు పీపీ–1, పీపీ–2తో పాటు ఒకటి, రెండు తరగతుల బోధన ప్రారంభించింది. దీంతో ఏ స్కూల్ను మూసివేయాల్సిన అవసరం తలెత్తలేదు. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించారు. కానీ గత టీడీపీ ప్రభుత్వం మాత్రం విద్యా సంస్కరణలు చేపట్టకుండా సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేయడం గమనార్హం. ఉన్నత విద్యకు అనువుగా ఇంగ్లిష్ మీడియం పదో తరగతి లేదా ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ముగిసిన విద్యా సంవత్సరంలో 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే పరీక్షలు రాయడం విశేషం. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వీరిలో 1.96 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారంటే ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. -
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
సాక్షి, అమరావతి: ‘జగనన్న అమ్మఒడి’ పథకం నిధులను వచ్చేనెలలో తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. గత నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటి నెలలో ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అందించనుంది. వచ్చేనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.అదేరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న సుమారు 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద నాణ్యమైన యూనిఫారంతో పాటు పుస్తకాలను అందజేయనున్నారు. మన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని, వారు అంతర్జాతీయంగా రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలుచేసింది.‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఐదోసారి రూ.6,400 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు..ఇక నవరత్నాల్లో భాగంగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే 2019–20 విద్యా సంవత్సరంలో తొలిసారి 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు.ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మఒడి అమలుచేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు నాలుగు విడతల్లో రూ.26,067 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇక ఐదోసారి 2023–24 విద్యా సంవత్సరానికి జూన్ నాలుగో వారంలో సుమారు రూ.6,400 కోట్ల నిధులను జమచేయనున్నారు. గత విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరున్న ప్రతి విద్యార్థికీ నగదు జమకానుంది. కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ బడులతో పోటీపడేలా..గత టీడీపీ ప్రభుత్వంలో బడులు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసే ఉండేది కాదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే రూ.2,400 విలువైన జగనన్న విద్యా కానుక కిట్ అందజేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. దీంతో గత నాలుగు విద్యా సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్ ఇబ్బందులు తలెత్తినా సంస్కరణలు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నారు.ప్రతిభావంతులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ సత్కారం..ఇదిలా ఉంటే.. విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యా సంవత్సరంలో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, టెన్త్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలోని విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్ని అత్యధిక మార్కులు సాధించారు.వీరిలో మొదటిస్థానంలో నిలిచిన 22,768 మందికి ‘జగనన్న ఆణిముత్యాలు బ్రిలియన్స్ అవార్డు’లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి విజేతలకు ప్రథమ స్థానంలో ఉన్న వారికి రూ.లక్ష, ద్వితీయ స్థానంలో ఉన్నవారికి రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు నగదు బహుమతిగా అందజేశారు. అలాగే, జిల్లా స్థాయి ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.15 వేలు ప్రదానం చేశారు.ఇక నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున ఇవ్వగా, పాఠశాల స్థాయిలో రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున ప్రదానం చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోను విద్యార్థులు భారీ సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. స్కూళ్లు తెరిచిన అనంతరం వీరిని కూడా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.బడి తెరిచిన తొలిరోజే ‘జగనన్న విద్యాకానుక’ మరోవైపు.. ప్రభుత్వ, ఎయిడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడి తెరిచిన తొలిరోజు జూన్ 12న జగనన్న విద్యా కానుక కిట్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ప్రతి విద్యార్థికీ రూ.2,400 విలువైన కిట్లో బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు), నోట్బుక్స్, వరŠుక్బక్స్, కుట్టు కూలితో మూడు జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ గల కిట్ను మొదటిరోజే అందజేయనుంది.ఇప్పటివరకు ఇలా నాలుగు సార్లు అందజేయగా, గతేడాది రూ.1,042.53 కోట్ల ఖర్చుతో 43,10,165 మంది విద్యార్థులకు విద్యాకానుకను అందించారు. 2024–25 విద్యా సంవత్సరానకి కూడా అంతే సంఖ్యలో కిట్లను సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే పుస్తకాల ముద్రణ దాదాపు పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో రవాణా నిలిపివేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం విద్యాకానుక కిట్లు స్టాక్ పాయింట్లకు చేరుస్తారు.గత విద్యా సంవత్సరాల్లో అమ్మఒడి, విద్యాకానుక పంపిణీ ఇలా..జగనన్న అమ్మ ఒడి.. సంవత్సరం లబ్ధిదారులు నగదు (రూ.కోట్లలో)2019–20 42,33,098 రూ.6,349.62020–21 44,48,865 రూ.6,673.42021–22 42,62,419 రూ.6,393.62022–23 42,61,965 రూ.6,392.9జగనన్న విద్యాకానుక ఇలా..విద్యా సం. లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో)2020–21 42,34,322 రూ.648.102021–22 47,32,064 రూ.789.212022–23 45,14,687 రూ.886.692023–24 43,10,165 రూ.1,042.53 -
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ
గతం ముద్దన్నం...నీళ్ల సాంబారు... అదీ అరకొర... ఇదీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బడిపిల్లలకు అందించే మధ్యాహ్న భోజన తీరు. ఆయన పాలనంటేనే కరువు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య రాష్ట్రంలో చాలావరకు కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలకు ఉపాధి కూడా కరువైంది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే.. అక్కడా ఆకలితో అలమటించేలా చేశారు. రోజూ ఒకేరకమైన మెనూవల్ల దానిని తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఈ అన్నం తిన్నవారికి కడుపునొప్పి సర్వ సాధారణం. కౌమారదశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచి్చన పిల్లల్లో 30 శాతంలోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున రూ.450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించే వారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు రూ.3.59 మాత్రమే కేటాయించారు. అదీ ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. ప్రస్తుతం పాలనపై చిత్తశుద్ధి... విద్యారంగంపై సరికొత్త విజన్గల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు అమలుచేశారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ‘గోరుముద్ద’ పథకాన్ని స్వయంగా రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వంట ఖర్చును రూ.8.57 పెంచారు. బడ్జెట్ కూడా ఏడాదికి సగటున రూ.1,400 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోరి్టఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు ఐదు రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోను శ్రద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలు పిల్లలకు వడ్డిస్తున్నారు. ఉపాధ్యాయులు మొబైల్ యాప్లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. భోజనం చేశాక, వంటపై విద్యార్థులే స్వయంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల్లో 43 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రతిరోజు హాజరైనవారిలో సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ యాప్ ద్వారా తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. సోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం:ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ ‘గోరుముద్ద’కు జాతీయ అవార్డు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద అమలుకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. రక్తహీనత నివారణ, మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయడాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి గతేడాది నవంబర్లో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి రాష్ట్రానికి అందజేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్ల పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ(వేరుశనగ బార్) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ అవార్డు వేడుకలో అభినందించడం గమనార్హం. వంట ఏజెన్సీలకు ఖర్చులు పెంపు గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. 2014–18 వరకు వంటపాత్రల సరఫరా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,617 పాఠశాలలకు రూ.41 కోట్ల వ్యయంతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం 2014–18 మధ్య పిల్లల భోజన ఏడాది వ్యయం రూ.450 కోట్లు అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది సగటున రూ.1449 కోట్లకు పెంచింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ.3.59 నుంచి రూ.6.51 మధ్య మాత్రమే కాగా.. ప్రస్తుతం ఆ ఖర్చు రూ.8.57కు పెంచి చెల్లిస్తున్నారు. ఏటా సగటున రూ.1449 కోట్ల ఖర్చు ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది ఒంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘గోరుముద్ద’కు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు. ప్రభుత్వ బడుల్లోని 43 లక్షల మంది విద్యార్థుల కోసం రోజుకో మెనూ చొప్పున 16 రకాల ఐటమ్స్తో ‘జగనన్న గోరుముద్ద’ అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ‘గుడ్’ అని ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. గత ప్రభుత్వంలో నీళ్ల సాంబారు, ముద్ద అన్నం కోసం ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. గోరుముద్ద కోసం ప్రభుత్వం ఏటా సగటున రూ.1449 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.7,244.6 కోట్ల నిధులు వెచి్చంచింది. పౌష్టికాహారం కోసం ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు వారంలో మూడురోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడురోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే మెనూ పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు, దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీలు పాత్రలు అందించింది. -
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
నాడు చతికిల‘బడి’.. నేడు ఉజ్వలంగా మారి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇలాంటి బడుల్లో ఉండలేక చాలామంది పేదింటి పిల్లలు చదువుకు దూరమయ్యారు. బడులను బాగు చేయాల్సిన ఆ ప్రభుత్వం.. సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సైతం విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా పూర్తిస్థాయిలో అందివ్వలేకపోయింది. పేద పిల్లలకోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతలేకుండా చేసింది. తన వర్గంగా భావించిన నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యా సంస్థలకు మేలు చేసేలా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు. చివరికి ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు అప్పగించేలా దిగజార్చింది. జగన్ హయాంలో బడులకు మహర్దశ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్ల నిధులను వెచ్చింది 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. ఓ పక్క పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు జమ చేసే సంక్షేమ పథకాన్ని అందిస్తూనే మరో పక్క విద్యా సంస్కరణలను అమలు చేసింది. తద్వారా బడిలో హాజరుశాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2021లో విద్యా సంస్కరణలపై అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలతో ‘నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. మూడో తరగతి నుంచే అత్యున్నత ప్రమాణాలను అందిస్తూ సబ్జెక్టు టీచర్లతో విద్యా బోధన చేపట్టింది. ఫలితంగా 3వ తరగతి నుంచే విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. అంతేగాక 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మూసివేసిన 1,785 పాఠశాలలను తిరిగి తెరిపించింది. సర్కారు బడుల నిర్వహణలో ఇద్దరికీ ఉన్న వ్యత్యాసం ఇది. గత ప్రభుత్వం సర్కారు బడులపై చిన్నచూపు చూసింది. ప్రైవేటు యాజమాన్యాల మత్తులో పడి పూర్తిగా నిర్వీర్యం చేసింది. రకరకాల కారణాలతో పెద్ద సంఖ్యలో మూసివేసింది. పైగా విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత కాదంటూ సరికొత్త భాష్యం చెప్పింది. ఫలితంగా వేలాదిమంది నిరుపేదలు చదువులకు దూరమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు విద్యారంగంలో ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దింది. ప్రతి గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ఆకర్షణీయంగా తరగతిగదులను మార్చింది. మూతపడిన పాఠశాలలను తెరిపించడమే గాకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి... జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకు తర్ఫీదునిచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యావిప్లవం నేడు అంతర్జాతీయ వేదికల ప్రశంసలు అందుకునేలా చేసింది. ఉత్తమ ఫలితాల సాధనలో ముందంజ గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ప్రభుత్వ విద్యను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అప్పటికే పలు సంస్థలు చేసిన అధ్యయనాల్లో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయసుకు తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపోతున్నారని, బోధనా ప్రమాణాలు సైతం తక్కువగా ఉన్నాయని తేల్చారు. ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ లెర్నింగ్ స్టాండర్డ్స్తో ఉంటున్నారని, సిలబస్ను సైతం అర్థం చేసుకోలేకపోతున్నారని, బేసిక్స్ కూడా తెలియడం లేదని తెలుసుకున్నారు. అప్పటినుంచి దానిని అధిగమించేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. ► 2021–22 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్లలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ► అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచడంతో పాటు ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్పీ స్క్రీన్స్తో డిజిటల్ విద్యాబోధన ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడిపిల్లలు ఇంగ్లిష్లో రాణించేందుకు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టారు. ► బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టి ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభతరం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించి అందించారు. ‘రోజుకో ఇంగ్లిష్ పదం’ నేర్చుకునే విధానం ప్రవేశపెట్టారు. ► 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమలు చేశారు. ఈ సంస్కరణల ఫలితాలను సైతం తల్లిదండ్రులు చూశారు. 2023–24 విద్యా సంవత్సరంలో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు అన్నీ ప్రభుత్వ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియెట్ బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. -
సర్కార్ బడుల్లో పెరిగిన విద్యార్థుల చేరికలు
-
యువత ‘భద్రత’లో ఏపీ నంబర్ వన్
గుంటూరు ఎడ్యుకేషన్: నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తున్నదని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో సంస్కరణలు–యువతకు సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్ అధ్యక్షత వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్, కె.రామమోహనరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ డిగ్రీ కోర్సులతో యువతకు ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. ఆ.. సంస్కరణలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో నవరత్నాల వంటి తొమ్మిది కార్యక్రమాలను రూపొందించిన సీఎం వైఎస్ జగన్ ఎంతో నిబద్ధతతో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్ షిప్ విధానంలో విద్యార్థులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతో విద్యార్థులు తమలోని సామర్థాన్ని, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకుని ముందుకు వెళుతున్నారని చెప్పారు. రూ.32కోట్లు వెచి్చంచి రాష్ట్రంలోని 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందించడం గొప్ప విషయమన్నారు. బీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కౌసల్యాదేవి, ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ఎం.కుసుమకుమారి, జీఏ షాలిని, బి.విజయకుమార్, అధ్యాపకులు ఎం.రత్నరాజు, సీహెచ్ అనిత, ఎన్జే సాల్మన్బాబు మాట్లాడారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతకు దిశా, దశ నిర్దేశనం ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు యువతకు దిశా, దశ చూపుతున్నాయి. నైపుణ్యాలు లేనిదే సమాజంలో రాణించలేరనే సదుద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా రాణించగల స్థైర్యాన్ని కల్పించడం అభినందనీయం. – కేఎఫ్ పరదేశిబాబు, ఏసీ కళాశాల కరస్పాండెంట్ ఎన్ఈపీ అమల్లో ఏపీ అగ్రస్థానం.. జాతీయ నూతన విద్యా విధానం–2020 అమల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపారు. విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. విజ్ఞానం, నైపుణ్యం, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. – డాక్టర్ కె.మోజెస్, ప్రిన్సిపాల్, ఏసీ కళాశాల ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ఉన్నత విద్యారంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలతో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పరిశ్రమలను విద్యాసంస్థలకు అనుసంధానం చేయడంలో సఫలీకృతమైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతరానికి అందిస్తోంది. – పి.మల్లికార్జునప్రసాద్, ప్రిన్సిపాల్, హిందూ కళాశాల ఊహకందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ సెల్ఫోన్తో మొదౖలెన ఆధునిక సాంకేతికత.. ఇంటర్నెట్తో వేగం పుంజుకుని ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం లేనిదే విద్యార్థులు రాణించలేరు. ఉన్నత విద్య దశలోనే పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. – డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పీజీ కోర్సుల డీన్, ఏసీ కళాశాల -
నాడు నేడు పథకంపై ప్రశంసల జల్లు
-
Visakhapatnam: అరే.. ఇది మన బడేనా!
చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే.... గర్వపడుతున్నా.. నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను. – పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. –పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట -
గిరిసీమలో ‘కొత్త’బడులు
సాక్షి, అమరావతి: గిరిజన స్కూళ్లకు మహర్దశ పట్టింది. ఇప్పటి వరకు చెట్ల కింద, పూరిపాకల్లో కొనసాగుతున్న గిరిజన గ్రామాల్లో చదువులకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. తక్కువ మంది విద్యార్థులున్న బడులకు సైతం పక్కా భవనాలు నిర్మింస్తోంది. మరిన్ని శిథిలమైన భవనాలకు మెరుగులు అద్దుతోంది. ఆరు జిల్లాల్లో 1,331 గిరిజన సంక్షేమ పాఠశాలలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో మైదాన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే.. గిరిజన గ్రామాల్లో పూర్తిగా గాలికి వదిలేశారు. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో విద్యను పట్టించుకోకపోవడంతో అక్కడి పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’తో దాదాపు 1,331 గిరిజన స్కూళ్లను సుమారు రూ.500 కోట్లతో సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. వీటితో పాటు మరో 817 పాఠశాల భవనాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పింస్తున్నారు. ఇప్పటికే నాడు–నేడు మొదటి దశలో 350, రెండో దశలో మరో 74.. మొత్తం 424 గిరిజన సంక్షేమ పాఠశాలలను పూర్తి చేశారు. కొండ ప్రాంతాల్లోని గూడేల్లో ఎన్నో ఏళ్లుగా పాఠశాలలున్నా వాటిలో అత్యధిక ప్రాంతాల్లో పక్కా భవనాల్లేవు. ఇలాంటి చోట బడులు, పాకలు లేదా చెట్ల కింద నామమాత్రంగా నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉన్న పాఠశాలల భవనాలు బీటలు వారి శిథిలమయ్యాయి. ఇలాంటి పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించడంతో పాటు పాత వాటికి మెరుగులు దిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల బడుల్లోనూ సకల సదుపాయాలు తొలి విడతలో 26 జిల్లాల్లోనూ 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 1,331 స్కూళ్లను గుర్తించారు. వీటిలో కొత్త భవనాలు నిర్మించాల్సినవి దాదాపు 500 వరకూ ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి. మొత్తం రూ.500 కోట్లతో ఆయా పనులు చేపట్టారు. ఇప్పటికే 424 స్కూళ్ల పనులు పూర్తిచేయగా, మిగిలిన స్కూళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన విభాగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేవలం భవనాలు నిర్మింంచడమే కాకుండా వాటికి విద్యుత్, తాగునీరు, మరుగు దొడ్లను సైతం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నాడు–నేడు రెండో దశ పనుల్లో భాగంగా ఈ స్కూళ్లను బాగుచేస్తుండగా, మూడో విడతలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
తృప్తిగా.. కడుపు నిండుగా..మధ్యాహ్న భోజనం
నాడు నీళ్ల సాంబారు, ముద్ద అన్నం పప్పుకు, రసానికి తేడానే ఉండదు పేరుకే ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ సరుకులకు డబ్బు చెల్లింపులో తీవ్ర జాప్యం సరుకులు ఎవరెవరో ఇళ్లకు ఎత్తుకుపోయే పరిస్థితి వంట వాళ్లనూ పట్టించుకోని వైనం ఎవరికీ పట్టని భోజనం నాణ్యత వంటశాల లేక స్కూలంతా పొగ సగటున 50 శాతం మంది విద్యార్థులకే భోజనం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనం కోసం ఎండలో క్యూలైన్లో వేచిఉన్న విద్యార్థులు నేడు రోజుకో మెనూ చొప్పున మొత్తంగా 16 రకాల ఐటమ్స్ గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం సగటున 90% మంది విద్యార్థులకు భోజనం భోజనం పూర్తయ్యాక ఆహారంపై ఆరా.. బాగుంటే ‘గుడ్’ లేకుంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ నాణ్యత కోసం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి తినే ఏర్పాటు ఎంత మంది భోజనం చేస్తున్నారో ఆన్లైన్లో పక్కాగా రికార్డు 43 లక్షల మంది ప్రతి రోజూ సంతృప్తికరంగా భోజనం సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ 2019–20లో రూ.979.48 కోట్లు, 2020–21లో రూ.1,187.49 కోట్లు, 2021–22లో రూ.1,840.05 కోట్లు, 2022–23లో రూ.1,548.58 కోట్లు, 2023–24లో రూ.1,689 కోట్లు బడ్జెట్ ప్రత్యేకంగా వంట గది, ఎప్పటికప్పుడు బిల్లులు విద్యార్థులకు తరగతి గది పక్కన వరండాల్లో భోజనం పెడుతున్న దృశ్యం -
AP: ఇదీ మార్పు.. రహదారి రయ్..రయ్..
నాడు ► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం ► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం ► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు ► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు ► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్ లేదు ► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు ► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు ► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే . ► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు నేడు ► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం ► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం ► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు ► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు ► పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు ► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు ► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు ► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు -
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్లు సరికొత్తగా డెస్్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
AP: చక్కదిద్దారు!
బ్లాక్ బోర్డుపై రాసేందుకు నాలుగు సుద్ధ ముక్కల కోసం కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్లు, ఐఎఫ్పీ స్క్రీన్స్, స్మార్ట్ టీవీలతో మన ప్రభుత్వ స్కూళ్లు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. పగిలిన గోడలు.. పెచ్చులూడే శ్లాబులు.. చెట్ల కింద వానాకాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. నాలుగంటే నాలుగేళ్లలోనే సాకారమైన మార్పులు ఇవన్నీ! సాక్షి, అమరావతి: చదువుకునేందుకు లక్షలు ధారపోయాల్సిన పరిస్థితి నుంచి పిల్లలు సర్కారు బడికొస్తే చాలు ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రోత్సహిస్తోందీ వైఎస్ జగన్ ప్రభుత్వం. మనసుంటే మార్పు వచ్చి తీరుతుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణల బాటతో మన విద్యా వ్యవస్థ 2019కి ముందు.. ఆ తర్వాత అని దేశమంతా చర్చించుకునేలా చేశారు. విద్యారంగంపై వెచ్చిస్తున్న వ్యయాన్ని భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పెట్టు పెట్టుబడిగా దృఢంగా విశ్వసించారు. కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ బోధన బాట పట్టించారు. అక్షరానికి అగ్రాసనం వేస్తూ పేదింటి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. నాడు – నేడు ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమైంది. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి సంతృప్తిగా భుజించేలా రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నారు. ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్ల బడ్జెట్ను పిల్లల భోజనం కోసం కేటాయించింది. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు, మూడు రోజులు రాగిజావ, బెల్లం చిక్కీను అందచేస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను అత్యుత్తమ చర్యగా విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. సర్కారు స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే టోఫెల్ శిక్షణతో పాటు 2025–26 నుంచి ఐబీ సిలబస్ను సైతం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ.71 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్య సంస్కరణలను అమలు చేసింది. ‘మనబడి నాడు–నేడు’ ద్వారా మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులను సమకూర్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా మారుస్తూ నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20లోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది. నవరత్నాలు పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి 2022–23 వరకు రూ.25,809.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యా రంగ సంస్కరణల కొనసాగింపు, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివి ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. సదుపాయాలు.. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు ద్వారా శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 సదుపాయాలను కల్పించింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించారు. రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు వడివడిగా చేపట్టారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 33 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. దేశంలో 25 వేల ఐఎఫ్పీలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో విప్లవంగా నిలిచిపోయింది. డిజిటల్ శకం.. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ కంటెంట్ ఉచితంగా అందించేందుకు అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ బైజూస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందిస్తుండడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ లాంటి వాటి ద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది. సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంతో అవసరం. అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం టోఫెల్ శిక్షణ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ బోధన అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాల సంస్కరణ.. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. మూస పద్ధతిలో ఉన్న పాఠాలను 2020–21 నుంచి సమూలంగా మార్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను అమలు చేస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలలను ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలుగా మార్చింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాన్ని తీర్చేలా భారీగా పదోన్నతులు కల్పించారు. బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణనిచ్చింది. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ.. మండలానికో కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను ప్రారంభించింది. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీపై శిక్షణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ లాంటి పది విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆర్టీ, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా నియమిస్తున్నారు. ఐబీ దిశగా అడుగులు.. ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’ అన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధన ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఐబీ’ బోధనను ప్రభుత్వ స్కూళల్లోకి తెచ్చి పేద పిల్లలకు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేశారు. 2025 – 26 నుంచి ఐబీ బోధన ప్రవేశపెట్టి ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుతూ + 2 వరకు అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలకు సాన పెట్టడంతోపాటు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్థాయిలో ఉద్యోగాలుయ పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే ఇన్ని అద్భుతమైన సంస్కరణలు తవిద్యారంగంలో తేవడం చరిత్రాత్మకమని, ఇది ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా సాధికారత.. స్కూళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో పాటు ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాదులను నిర్మిస్తోంది. ఇప్పడు మన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉత్తమ విద్యతో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం సాధ్యమేనని బలంగా నమ్ముతున్నా. – ప్రొఫెసర్ కె.శ్రీరామమూర్తి, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తారు.. గతంలో నేను ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు పుస్తకాలు, యూనిఫారం లాంటివి డొనేట్ చేసేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక నోటు పుస్తకాల నుంచి యూనిఫారం, బూట్లు వరకు ఆ అవసరం లేకుండా అన్నీ ఉచితంగా అందిస్తోంది. స్వేచ్ఛ న్యాప్కిన్స్ ఇస్తున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. పిల్లలకు నేర్పే విధానం, నేర్చుకునే విధానం సంపూర్ణంగా మారింది. ప్రభుత్వ విద్యలో ఇదో గొప్ప సంస్కరణ. కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇన్ని వసతులు లేవు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు మరో 10 ఏళ్లలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. – డాక్టర్ రాజశేఖర్, గైనకాలజిస్ట్, కర్నూలు ఆ ఇబ్బందులు తొలగించారు.. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు లేకపోవడం బాలికలకు అతి పెద్ద సమస్య. ఈ ప్రభుత్వం ఆ సమస్యను దూరం చేసింది. బాలికలకు స్వేచ్ఛ పేరుతో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. నాడు–నేడుతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ శిక్షణ, రక్తహీనత నివారణకు బెల్లం చిక్కీతో పాటు ఐరన్ మాత్రలు ఇవ్వడం ప్రశంసనీయం. – వడిశెట్టి గాయత్రి, పీజీ లెక్చరర్, పిఠాపురం -
అంగన్వాడీలను అందంగా తీర్చిదిద్దాలి
సాక్షి, అమరావతి: ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెండో దశలో అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్(మౌలిక సదుపాయాలు) కె.భాస్కర్ సాంకేతిక మార్గదర్శకాలను సోమవారం జారీచేశారు. ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో రూ.214.22 కోట్లతో 20,534 కేంద్రాల రూపురేఖలు మార్చనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ పనులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లను ఆదేశించారు. మొత్తం 20,534 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రధాన, చిన్న మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న టాయిలెట్లో రన్నింగ్ వాటర్ సమస్యలు, రక్షిత మంచినీటి పైపులు, సంప్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ట్యూబ్లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు, పెయింటింగ్, శ్లాబ్, ఫ్లోరింగ్, గోడలకు మరమ్మతులు వంటివి ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నెల మూడో వారంలో కమిటీల సమావేశాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లులతో కమిటీలు నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక్కో కమిటీలో ముగ్గురు తల్లులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్, మహిళా శిశు సంక్షేమశాఖ సూపర్వైజర్, మహిళా పోలీసు, సమీపంలోని స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉండాలని తెలిపారు. ఆ కమిటీల పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఖాతాలను తెరవాలని సూచించారు. ఈ నెల మూడో వారంలో తల్లుల కమిటీల సమావేశాలను ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతు పనులను గుర్తించడంతోపాటు వాటికి అంచనాలను రూపొందించి తీర్మానం చేసి అంగన్వాడీ సూపర్వైజర్కు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల చివరి వారంలో మరమ్మతు పనుల అంచనాలను సమగ్ర శిక్ష పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అంచనాలకు జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తారని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన మెటీరియల్ను స్థానికంగా కొనుగోలు చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. తలుపులు, కిటికీలు, వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, సంప్లతోపాటు ఏమైనా పరికరాలకు మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోతే కొత్తవి ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మెటీరియల్ కొనుగోలు, పనుల వివరాలను ఎప్పటికప్పుడు ‘ఎం బుక్’లో నమోదు చేయాలని సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శులకు సూచించారు. -
AP: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. వీటిని ఈ నెల 21న విద్యార్థులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే మెరుగైన సామర్థ్యం ఉన్న ట్యాబ్లను ఎంపిక చేసి, వాటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను చేర్చారు. గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 5,18,740 ట్యాబ్లను బైజూస్ కంటెంట్తో పంపిణీ చేసింది. ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, మార్క్ వ్యూ, లావా సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి 2.50 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్ పాయింట్కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో అందనున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ట్యాబ్ల్లో అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. వీటిని మంగళవారం ప్రాంతీయ సంయుక్త అధికారుల కార్యాలయాలకు తరలించారు. రెండు, మూడు రోజుల్లో ఇవి ఉన్నత పాఠశాలలకు చేరనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం అందిస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ)ను సైతం రెండో దశ నాడు–నేడు పనులు పూర్తయిన స్కూళ్లల్లో బిగించనున్నారు. రెండో దఫాలో 30 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు ఈ నెల 21 నాటికి స్కూళ్లకు చేరనున్నాయి. మరింత మెరుగ్గా.. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్, 64 జీబీ ఎస్డీ కార్డు గల ట్యాబ్లను అందించారు. వాటిలో అదే తరగతి పాఠ్యాంశాలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఏడాది ట్యాబ్ల సామర్థ్యం పెంచడంతోపాటు అదనపు తరగతుల డిజిటల్ పాఠాలను సైతం అప్లోడ్ చేయడం విశేషం. వచ్చే వారం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లు 8.7 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్డీ కార్డుతో ఉండనున్నాయి. వీటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల బైజూస్ ఈ–కంటెంట్ను సైతం అప్లోడ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ యాప్ ‘ఈ–ట్యూటర్’ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేసేంత స్పేస్ కూడా ఈ ట్యాబ్ల్లో ఉంది. 30 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు.. గతేడాది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేశారు. ఈ ఏడాది 30 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను ఈ నెల 21 నాటికి అందుబాటులోకి తేనున్నారు. అన్ని ట్యాబ్ల్లో ‘డ్యులింగో’ యాప్ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు, విదేశాల్లో సైతం విజయవంతమైన కెరీర్ను అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విదేశీ భాషలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులకు కూడా వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ అధికారులు హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో విదేశీ భాషలు అందించే యాప్ ‘డ్యులింగో’ను ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్ల్లో ఇన్స్టాల్ చేశారు. గత డిసెంబర్లో ఇచ్చిన 5,18,740 ట్యాబ్లతోపాటు ఈ ఏడాది ఇవ్వనున్న 4.30 లక్షల ట్యాబ్ల్లోనూ ఈ డ్యులింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునే వీలుంది. ఉన్నత తరగతులకు కూడా ఉపయోగపడేలా.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులతోపాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు కూడా వీటిని అందిస్తాం. ఇప్పటికే దాదాపు 2.50 లక్షల యూనిట్లు అందాయి. వారంలోగా మొత్తం 4.30 లక్షల ట్యాబ్లు స్కూళ్లకు చేరతాయి. ఈసారి ట్యాబ్ల సామర్థ్యం పెంచాం. అంతేకాకుండా 8, 9, 10 తరగతుల ఈ–కంటెంట్తోపాటు డౌట్ క్లియరెన్స్ యాప్ను, ఈ–డిక్షనరీని కూడా అప్లోడ్ చేశాం. కొత్త ట్యాబ్ల్లో భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేయొచ్చు. విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు పాత పాఠాలను తొలగించి కొత్త కంటెంట్ను అప్లోడ్ చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్య నాడు–నేడు మౌలిక వసతుల కల్పన -
మాటలు కాదు... మీ రాతలతోనే చేటు
సాక్షి, అమరావతి: ఇదెక్కడి కుట్ర రామోజీ? పేదలంతా వైఎస్ జగన్ పక్షాన నిలుస్తున్నారనే భయంతో వారిలో విభజన తెచ్చేందుకు కులాల పేరిట రెచ్చగొట్టడం అమానుషం కాదూ? ఎస్సీలను రకరకాలుగా తూలనాడి, వారిని కట్టు బానిసల్లా చూసిన చంద్రబాబు నాయుడికి వత్తాసుగా మరీ ఇంతలా దిగజారి రాయాలా? దళితులు శుభ్రంగా ఉండరని.. అసలు దళితుల్లో పుట్టాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారని రకరకాల మాటలు మాట్లాడిన చంద్రబాబును ఎవరైనా మరిచిపోగలరా? పేదల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని భావించి... వారి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం నెలవారీ పింఛన్ను వెయ్యి రూపాయల నుంచి రూ.3వేలకు పెంచుతూ వస్తున్న మాట నిజం కాదా? పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య ఏ మేరకు పెరిగిందో కనిపించటం లేదా? వైఎస్సార్ చేయూత సహా ఇప్పుడు ఎస్సీలకు, ఇతర పేదలకు అందుతున్న పథకం చంద్రబాబు హయాంలో ఒక్కటైనా ఉందా? అసలు పేదల్ని వారి పేదరికం నుంచి బయటపడేసేందుకు బాబు హయాంలో ఒక్క అడుగైనా పడిందా? ఇపుడు ఆ ప్రయత్నం సంపూర్ణంగా జరుగుతుంటే ఒక్కనాడు కూడా కనీసం ప్రశంసించకుండా... పైపెచ్చు వాళ్లలో విభజన తెస్తూ... మాకు అందరికంటే ఎక్కువేం చేశారు? అని ఒకరిద్దరితో అనిపిస్తూ... అదే దళితుల మాటగా రెచ్చిపోయి మీ ఎల్లో ఛానెళ్లలో ప్రసారం చేస్తూ పైశాచికానందం పొందుతున్న మాట నిజం కాదా? దాన్నే మీరు కూడా అచ్చువేస్తూ అబద్ధాలను నిజం చెయ్యాలనుకుంటే సాధ్యమయ్యే పనే అనుకుంటున్నారా? అసలు ఎస్సీలకు, ఇతర బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాన్ని మీరు వేరే ఏ ప్రభుత్వంతోనైనా పోల్చగలరా? ఇంకా ఎన్నాళ్లీ అబద్ధాలు? దళితులు, బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే ఓర్వలేరు!. ఇంగ్లిష్ మీడియం ద్వారా మాతృభాషను దెబ్బతీస్తున్నారంటూ పెడబొబ్బలు పెడతారు. మీ పిల్లలు, మీ చంద్రబాబు పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారు. మీ మంత్రులేమో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు నడుపుతారు. కానీ బడుగుల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దంటూ కోర్టుల్లో మీ వందిమాగధుల చేత పిటిషన్లు వేయించటం నిజం కాదా? ఎందుకంటే బడుగుల పిల్లలు బాగా చదువుకుని మీ పెత్తందార్ల పక్కన దర్జాగా కూర్చుంటానే కదా మీ భయం? ఇళ్లు లేని బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది మీరు కాదా? ఒకో ఇంటి ద్వారా దాదాపు రూ.15 లక్షల విలువైన ఆస్తిని సమకూర్చిన ప్రభుత్వాన్ని పేదలంతా నెత్తిన పెట్టుకుంటుంటే మీరు మాత్రం ఇలా విమర్శలు గుప్పిస్తుండటాన్ని ఏమనుకోవాలి? అమరావతిలో మీ పక్కన బడుగు, బలహీనవర్గాల వారుంటే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టులో చెప్పుకున్నది నిజం కాదా? ఈ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేసింది. మీకు కనీసం అలాంటి ఆలోచన కూడా రాలేదు కదా? ఇవేమీ చెయ్యకున్నా చంద్రబాబును దళితుల పాలిట దేవుడిగా ప్రచారం చేస్తున్న మీ పచ్చమీడియాను అసలు నమ్మే వారెవరైనా ఉన్నారా?ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఏటా రూ.18,750 ఇస్తోంది. బాబు హయాంలో ఇదెప్పుడైనా చూశారా? ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో రాష్ట్రం శ్రీలంకలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోదంటూ గగ్గోలు పెట్టేదీ మరోవైపు చంద్రబాబు ఫ్రీగా బెంజికార్లు ఇస్తామంటుంటే.. అది సాధ్యమేనంటూ డప్పు కొట్టేదీ మీరే. దీన్నేమనుకోవాలి? ‘మాటలే స్వీటు.. చేతలు చేటు’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ వండి వార్చిన దుర్మార్గపు కథనంలో అసలు నిజమేదైనా ఉందా? ఇదిగో చూద్దాం... కుల కార్పొరేషన్ల నిర్వీర్యం ఎక్కడ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని ఈనాడు విషం కక్కింది. వాస్తవానికి టీడీపీ హయాంలో ఒకటే కార్పొరేషన్గా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ను జగన్ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా మార్చింది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్గా విడదీసింది. వీటిద్వారా ఎస్సీల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. టీడీపీ హయాంలో ఒకటే కార్పొరేషన్ కాగా... దీనిద్వారా లబ్ధి కలిగింది అతికొద్ది మందికి. కానీ ఇపుడు సంతృప్త స్థాయిలో... అంటే అర్హతలున్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమవుతోంది. పచ్చ దండుకు మింగుడు పడనిది ఇదే. పింఛన్ వ్యయం 227 శాతం అధికం.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 8,66,835 మంది ఎస్సీలకు నెలకు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.4,415 కోట్లు, 3,01,242 మంది ఎస్టీలకు రూ.1,373 కోట్లు మాత్రమే ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 12,15,030 ఎస్సీలు (గత ప్రభుత్వం కంటే 18.41 శాతం ఎక్కువ)కు నెలకు రూ.2,750 చొప్పున మొత్తం రూ.14,418 కోట్లు (గత ప్రభుత్వం కంటే 227 శాతం అధిక మొత్తం) అందించింది. అలాగే ఎస్టీలకు 3,94,753 మంది (గతం కంటే ఆరు శాతం ఎక్కువ)కు రూ.4,694 కోట్లు (గతం కంటే 241 శాతం అధికం) ఇచ్చారు. దేశంలోనే మొదటి స్థానం ఎస్సీ కాంపొనెంట్ అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ కింద చేసిన ఖర్చు కన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్లో చేసిన ఖర్చే అధికంగా ఉండటం విశేషం. ఎస్సీ కాంపొనెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 12.41లక్షల స్వయంసహాయక సంఘాలు ఏర్పాటైతే, ఒక్క మన రాష్ట్రంలోనే 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి. భూమి కొనుగోలు పథకం ఎత్తివేసింది ఎవరు? వాస్తవం: గత టీడీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే వివరాలే లేవు. దీన్నిబట్టే ఈ పథకాన్ని ఎవరు ఎత్తేశారో తెలుస్తుంది. దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకున్న ఎస్సీల భూమి తనఖాలో ఉండిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అలాంటి రుణాలన్నింటినీ రద్దుచేసి, వారికి ఆ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇదో మైలురాయి. ఈ ప్రభుత్వ మేలుతో 14,223 దళిత మహిళలకు 16,213 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. మరో 3,57,085 మంది ఎస్సీలకు, 1,20,477 మంది ఎస్టీలకు సైతం అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు లభించాయి. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమిని కూడా కొనలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సుమారు 31 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇస్తే అందులో 6,36,732 మంది లబ్ధిదారులు ఎస్సీ అక్కచెల్లెమ్మలే. అంటే లబ్దిదారుల్లో 20.7 శాతం. తద్వారా ఆయా కుటుంబాలకు జగన్ ప్రభుత్వం రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. అంతేకాకుండా వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల మేర కూడా లబ్ధి చేకూరుతోంది. ఇక 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 4.6 శాతం) ఉన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలబడలేదు. ఎస్సీలకు 12,816 ఎకరాలు, ఎస్టీలకు 5,978 ఎకరాల అసైన్డ్ భూములపై ఈ ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. హాస్టళ్లకూ నాడు – నేడు.. ఈనాడు తన కథనంలో ‘హాస్టళ్లు సంక్షోభ వసతి కేంద్రాలు’గా ఉన్నాయంటూ అబద్ధాలను అచ్చేసింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత 168 సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వం మరో 21 స్కూళ్లను మాత్రమే అదనంగా చేర్చగలిగింది. ఇందులో కూడా 15 స్కూళ్లను 2019 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే... అదీ కాగితాలపైనే ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో మరమ్మతుల కోసం ఇప్పటికే 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.1౩౩.90 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. అలాగే 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, ఇందుకు రూ.318 కోట్లు ఖర్చు చేయనుంది. నాణ్యమైన విద్య అందుతోంది ఇప్పుడే.. ‘నాణ్యమైన విద్యకు తిలోదకాలు’ ఇచ్చారంటూ ఈనాడు మరో అబద్ధాన్ని పేర్చింది. వాస్తవానికి ఈ ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించింది. నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వ సదుపాయాలతో తీర్చిదిద్దింది. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి వంటి పథకాలను అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేస్తోంది. ఈ పథకాల వల్ల అత్యధిక శాతం లబ్ధి పొందుతోంది.. బడుగు, బలహీనవర్గాల పిల్లలే. టోఫెల్ లాంటి ఉన్నతాదాయ వర్గాల పిల్లలకే పరిమితమైన వాటిని కూడా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ క్రమంలో మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో జగనన్న అమ్మఒడి కింద ఇప్పటివరకు 8,84,131 మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.15 వేల చొప్పున రూ.5,335.7 కోట్లు అందించింది. అలాగే 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,714.75 కోట్లు జమ చేసింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5.06 లక్షల మందికిపైగా ఎస్సీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.834 కోట్లు నేరుగా వేసింది. 83 వేల మంది ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.135. కోట్లను జమ చేసింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.5.4 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. అలాగే 1.11 లక్షల మంది ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.346 కోట్లు జమ చేసింది. ఈ మొత్తాలన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమయ్యాయి. మరింత మెరుగ్గా విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వం అమలు చేసిన విద్యోన్నతి పథకం రద్దైందని ఈనాడు గగ్గోలు పెట్టింది. కానీ గత ప్రభుత్వం హయాంలో ఈ పథకంలో జరిగిన లోపాలను, అవినీతిని, అక్రమాలను గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు దక్కేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది. 21 కోర్సులలో క్యూఎస్ ర్యాంకింగ్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్ల ప్రకారం టాప్ 50లో నిలిచిన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా 100 శాతం ట్యూషన్ ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు. స్వయం ఉపాధి పథకాల కింద ► టీడీపీ ప్రభుత్వ హయాంలో 2,02,414 మందికి రూ.2,726 కోట్లు ► ఈ ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీల్లో 23,17,558 మందికి రూ.7,075.29 కోట్లు. ఎస్టీలకు 4,72,018 మందికి రూ.1,392 కోట్లు లబ్ధి చేకూరింది. ► ఎస్సీ లబ్ధిదారుల స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను ప్రజా పంపిణీ వ్యవస్థ డోర్ డెలివరీ కోసం అందించింది. జాతీయ ఎస్సీ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా స్వయం ఉపాధి పథకం కింద రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. -
తూర్పుగోదావరి జిల్లాలోని పాఠశాలల్లో నాడు నేడు
-
చకచకా డిజిటలైజేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థిపై చేసే ఖర్చు భవిష్యత్ పెట్టుబడిగా భావించి, అన్ని సదుపాయాలను అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే 30,715 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ)లు అందించగా, ఈ డిసెంబర్లో ఇచ్చే 32 వేల స్క్రీన్లతో కలిపి మొత్తం 63 వేలు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ టీవీలు 33 వేలకు చేరడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను డిజిటలైజేషన్ పూర్తవుతుంది. మరోపక్క ట్యాబ్స్ పంపిణీ 10 లక్షలకు పైగా చేరుకుంటుంది. దీంతో దేశంలోనే ప్రభుత్వ విద్యలో పూర్తిస్థాయి డిజిటల్ టెక్నాలజీని అనుసరించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్పీలు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీల అమరిక డిసెంబర్ 21 నాటికి పూర్తి కానుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖలోని నాడు–నేడు కమిషనరేట్ అధికారులు ప్రణాళికసిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ బోధన చేపట్టారు. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన విషయం తెలిసిందే. రెండో దఫాలో 32 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించనుంది. -
ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు. తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు. నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి. ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి. కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్ స్టార్’.. ‘పంచర్స్టార్’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ బెస్ట్గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు. వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్) ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు. పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ సిలబస్. తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన తర్వాత, ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్మెంట్ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్ కల్యాణ్:ది లాస్ట్ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్తో చదివించారో కూడా పవన్, మనోహర్లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్ హెచ్ఎమ్వి రికార్డులాంటోడు. అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్ టెస్ట్ తల్లీ! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వరల్డ్ క్లాస్ విద్య
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రొఫైళ్లను సంపూర్ణంగా మారుద్దామని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ స్కూళ్ల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దుదామన్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతి గదులు, నాడు–నేడు పనులతోపాటు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ను అందుబాటులోకి తేవడం, నిత్యం టోఫెల్ శిక్షణా తరగతులను నిర్వహించడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలు, పురోగతిపై సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం వారంలో 3 రోజుల పాటు మూడు తరగతుల చొప్పున శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొనగా ఇకపై ప్రతి రోజూ టోఫెల్ శిక్షణకు ఒక పీరియడ్ కేటాయించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. తద్వారా విద్యార్థులు క్రమంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టడంపై సంపూర్ణ మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. దశలవారీగా ఐబీ సిలబస్ను అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న సిలబస్ను ఐబీతో అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ సజావుగా, సులభంగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యాశాఖలో సంస్కరణల అమలు, పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్యాబ్ల పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు, తరగతి ఉపాధ్యాయులకు రెండో విడత ట్యాబుల పంపిణీకి సిద్ధం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటిల్ అసిస్టెంట్లతో డివైజ్ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలి. నాడు–నేడు రెండో దశ పనులు పూర్తయిన అన్ని పాఠశాలల్లో కూడా డిసెంబర్ కల్లా ఐఎఫ్పీ బోర్డులు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు పూర్తి కావాలి. జూనియర్ కాలేజీలుగా మార్చేందుకు గుర్తించిన హైస్కూళ్లలో ఐఎఫ్పీ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. అత్యంత నాణ్యంగా ఆహారం.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నాం. ఆరోగ్యకరమైన, రుచికరమైన మెనూ తీసుకొచ్చాం. రాగిజావ అందిస్తున్నాం. వీటిల్లో ఏ ఒక్కటీ క్వాలిటీ తగ్గకూడదు. విద్యార్థులకు పెట్టే భోజనం నూటికి నూరుశాతం నాణ్యతగా ఉండాల్సిందే. పాఠశాలల్లో విద్యార్థులు తినే భోజనంపై ప్రతి రోజూ అధికారుల పర్యవేక్షణ మరింత మెరుగ్గా ఉండాలి. ఈమేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) పాటించాలి. బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ద్వారా గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిత్యం పౌష్టికాహారం, సమయానికి మందులు అందేలా చర్యలు తీసుకోవాలి. ఫలించిన స్పెషల్ డ్రైవ్ ప్రాథమిక విద్యలో 100 శాతం పిల్లలు బడిలోనే రాష్ట్రంలో చిన్నారులను విద్యవైపు నడిపించేలా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చిందని అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తెచ్చారు. ప్రాథమిక విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు బడిలోనే ఉన్నారని వివరించారు. సీనియర్ సెకండరీ విభాగంలో 96.94 శాతం మంది, హయ్యర్ సెకండరీ విభాగంలో 74.9 శాతం స్కూళ్లలోనే ఉన్నట్టు తెలిపారు. అమ్మఒడి పథకంతోపాటు 10, 12వ తరగతులు ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ అడ్మిషన్, స్కిల్ సెంటర్లలో చేర్పించి వారికి ఓపెన్ స్కూల్ అడ్మిషన్, వలంటీర్లు, సచివాలయాల ద్వారా నిర్వహించిన ప్రచారంతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రస్తుతం 83,52,738 మంది విద్య అభ్యసిస్తున్నట్టు వెల్లడించారు. తొలి విడతగా నిర్దేశించుకున్న మేరకు 4,804 స్కూళ్లలో 30,213 ఐఎఫ్పీ ప్యానళ్లు, 6,515 స్కూళ్లలో స్మార్ట్ టీవీలను బిగించామని అధికారులు వివరించారు. ఇప్పటికే ఐఎఫ్పీ, స్మార్ట్ టీవీల వినియోగింపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. 91.33 శాతం మంది ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు ఐఎఫ్పీ ప్యానళ్లు ఏర్పాటు చేసిన చోట రెండు రకాల ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్మార్ట్ ఫోన్లో, ఫోన్ ఎస్డీ కార్డులో, యూట్యూబ్లో, ట్యాబుల్లో, ఐఎఫ్పీలో, అధీకృత వెబ్సైట్లలో, ఇ–పాఠశాల డీటీహెచ్ల్లో ఇలా ఎందులోనైనా ఒకే విధమైన పాఠ్యప్రణాళిక, ఒకే పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. ఆగస్టులో నిర్వహించిన మొదటి అసెస్మెంట్లో మూడో తరగతి నుంచి 9 వతరగతి వరకూ దాదాపు 91.33 శాతం మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాశారని చెప్పారు. 6 నుంచే ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర అత్యాధునిక టెక్నాలజీపై సమీక్షలో అధికారులు పలు అంశాలను సీఎంకు నివేదించారు. ఆరో తరగతి నుంచి కృత్రిమ మేధను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణ, బోధన కార్యక్రమాలకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలను అనుసంధానం చేయడంతో పాటు ఏఐపై పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నట్టు వివరించారు. అవసరమైన చోట అదనపు గదులు, సదుపాయాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో విడత నాడు–నేడు పనులు చురుగ్గా జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తుండగా వాటిల్లో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 679 మండలాలకుగాను 473 మండలాల్లో బాలికలు, కో–ఎడ్యుకేషన్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మిగిలిన చోట్ల హైస్కూళ్లను ప్లస్ టూగా మార్చేందుకు జాబితా రూపొందిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్ దీవాన్రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నాడు–నేడు’ కళ్లతో చూడు రామోజీ
సాక్షి, అమరావతి: ఒక తప్పుడు ఆరోపణ చేస్తే దాని వెనకున్న నిజాలు బయటకొస్తాయనే భయం లేకుండా రామోజీరావు నిత్యం సిగ్గూఎగ్గూలేని రాతలు రాసూ్తనే ఉన్నారు. రోజూ ఆయన వండి వారుస్తున్న కల్పిత కథల్ని జనం విశ్వసించే రోజులు పోయాయని తెలుసుకోలేని మొద్దు నిద్రలో ఆయనున్నారు. ఎందుకంటే.. పేద విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన పత్రిక ‘ఈనాడు’ విషం కక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలలపైన, ప్రభుత్వ విద్యా వ్యవస్థల మీద నిరంతరం బురద జల్లుతూ వాటి ప్రతిష్టను మసకబార్చేందుకు ఆపసోపాలు పడుతోంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అందులో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. రోజుకో అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అదే నిజమని నమ్మించేందుకు నానాపాట్లు పడుతోంది. ఇందులో భాగమే సోమవారం ప్రచురించిన ‘‘నాడు–నేడు.. నాణ్యతే లేదు చూడు’’.. కథనం. నిజానికి.. గత చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ విద్యను గాలికొదిలేసి.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల చదువు కోసం ఆస్తులను అమ్మే పరిస్థితులను కల్పించింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టింది. ‘నాడు–నేడు’తో మెరుగుపడుతున్న పాఠశాల విద్య.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, ఇంగ్లిష్ డిక్షనరీ, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, ఐఎఫ్పీ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, గోరుముద్ద.. ఇలా అనేక సంస్కరణలను అమలుచేసి కార్పొరేట్ విద్యాసంస్థలు సైతం అనుసరించేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు నిజమైన అభ్యాస కేంద్రంగా పాఠశాలలను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడుతున్నాయి. అలాగే.. ► మనబడి నాడు–నేడు 2020–21 మొదటిదశలో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్ల ఖర్చుతో పది మౌలిక సదుపాయాలు కల్పించారు. ► నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, మరమ్మతులు, ఫ్యాన్లు–ట్యూబ్లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులకు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, వంట గది నిర్మాణం చేశారు. ► ఇక నాడు–నేడు రెండో దశలో (2022–23)లో రూ.8 వేల కోట్ల అంచనాతో 22,344 పాఠశాలలు, అన్ని జూనియర్ కాలేజీలు, ఫౌండేషన్ పాఠశాల (అంగన్వాడీ)ల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాల పాటు మరమ్మతులకు నోచుకోని వేల పాఠశాలలు నాడు–నేడుతో బాగుపడుతున్నాయి. బాగున్న భవనాలకు మరమ్మతులు, శిథిలమైనవాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. రెండోదశలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పనులు చేసేందుకు ప్రభుత్వం సమర్ధవంతమైన విధానాలను అమలుచేస్తోంది. ఆయా స్కూళ్ల నిర్వహణకు నిధిని కూడా ఏర్పాటుచేసింది. నాణ్యతలేని పనులకు బాధ్యత ఎవరిదన్న అంశంలోనూ స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. ప్రతి వస్తువూ వారంటీతో కొనుగోలు.. చాక్బోర్డుల నుంచి, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, తాగునీటి యంత్రాలు.. ప్రతి వస్తువును నిర్దిష్టమైన వారంటీతోనే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎక్కడ నాణ్యత దెబ్బతిన్నా వాటి స్థానంలో సంబంధిత కంపెనీనే కొత్తవి అమర్చేలా కచ్చితమైన ఒప్పందం చేసుకుంది. గ్యారంటీ, వారంటీ నిర్వహణలో ఆయా కంపెనీలన్నీ నిర్దిష్ట కాలపరిమితి వరకూ బాధ్యులుగా ఉన్నాయి. ► పాఠశాలల్లో కల్పించిన సదుపాయాల నిర్వహణ ఖర్చులకు, మొదటిదశలో చేపట్టిన పాఠశాలలకు, మూడో దశలో చేపట్టే పాఠశాలలకు మరమ్మతుల నిమిత్తం 2023–24లో రూ.329 కోట్ల నగదును పాఠశాల తల్లిదండ్రుల కమిటీలకు బదిలీచేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ► అంతేకాక.. ఎప్పటికప్పుడు స్కూళ్ల నిర్వహణ సమాచారాన్ని రియల్ టైమ్ పద్ధతిలో సేకరించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నారు. పాడైతే కంపెనీలతోనే మరమ్మతులు.. ఇక సరఫరా చేసిన వస్తువులు, పరికరాలు ఐదేళ్ల వారంటీలో ఉన్నాయి కాబట్టి, చెడిపోయిన వాటిని ఆయా కంపెనీలే మరమ్మతులు చేస్తాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 18,802 నీటిశుద్ధి యంత్రాల మరమ్మతులకు వినతులు రాగా యంత్రాలను సరఫరా చేసిన కంపెనీలే మరమ్మతులు పూర్తిచేశాయి. మొదటి దశలో పాఠశాలల్లో ఏర్పాటుచేసిన తాగునీటి శుద్ధియంత్రాల నిర్వహణ కోసం ఐఐటీ మద్రాస్ నిపుణుల సూచన మేరకు ఆటో టీడీఎస్ కంట్రోల్, బ్యాక్వాష్ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) యంత్రాలను అన్ని పాఠశాలల్లోని నీటిశుద్ధి యంత్రాలకు ఏర్పాటుచేస్తున్నారు. ► ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లలో అవకతవకలు జరిగాయనడంలో వాస్తవంలేదు. విద్యార్థులకు బెంచీల సరఫరా కోసం టెండర్ల ద్వారా 5.10 లక్షల సరఫరాకు ఒప్పందం జరగ్గా, 3,88,727 బెంచీలు మాత్రమే విద్యాశాఖ తీసుకుంది. ► గ్రీన్ చాక్బోర్డుల విషయంలో కూడా మొదటి కంపెనీ అనుకున్న సమయానికి సరఫరా చేయలేకపోయింది.దీంతో రెండో కంపెనీ సకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించడంతో ఆ కంపెనీతో ఒప్పందం జరిగింది. సీలింగ్ ఫ్యాన్లు విషయంలోనూ కంపెనీ చేసిన పొరపాట్లకు పెనాల్టీలు వేసి ప్రభుత్వం వసూలుచేస్తోంది. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్న జగనన్న
-
సాక్షి రిపోర్టింగ్ ఫ్రం ఐక్యరాజ్యసమితి
అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాలను సాక్షి మీడియా గ్రూప్ తరపున కవర్ చేశారు మంగ వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి. మన దేశం నుంచి ఈ అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో వెంకన్న ఒకరు. తెలుగు మీడియాలో వెంకన్న మాత్రమే ఈ అవకాశం అందుకోగలిగారు. నల్గొండ జిల్లా నుంచి చిన్న విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా ఐక్యరాజ్యసమితి ఈవెంట్ను కవర్ చేయడం జర్నలిస్టుగా వెంకన్న సాధించిన విజయం. కవరేజ్ గురించి వెంకన్న మాటల్లోనే.. "హై-లెవల్ పొలిటికల్ ఫోరమ్ 2023 సమావేశాల్లో సుస్థిర అభివృద్ధి ఎజెండాగా ఉన్నత స్థాయి రాజకీయ వేదిక (HLPF) ఆర్థిక, సామాజిక మండలి ఆధ్వర్యంలో జూలై 10, సోమవారం నుండి 19 జూలై 2023 వరకు జరిగిన సమావేశాలను కవర్ చేయడం నా జర్నలిజం కెరియర్లో దక్కిన అతి పెద్ద అదృష్టం" ప్రపంచ మేధావుల విలువైన పాఠాలు UN కౌన్సిల్ యొక్క ఉన్నత-స్థాయి విభాగంలో భాగంగా సస్టైనబిలిటీ ప్రధాన అజెండా ఫోరమ్ యొక్క మూడు రోజుల మంత్రివర్గ ECOSOC యొక్క ఉన్నత-స్థాయి సెగ్మెంట్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేశాను. "కరోనా వైరస్ వ్యాధి (COVID-19) నుండి ప్రపంచ రికవరీని వేగవంతం చేయడం, అన్ని స్థాయిలలో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడం ఎజెండాగా ఈ సమావేశాలు జరిగాయి. ముఖ్య అజెండా లో పేర్కొన్న అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాను. ఒక్కో భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో ఒక్కొక్కరు వినూత్నమైన, విలువైన విషయాలు ఎన్నో చెప్పారు. (వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చే జర స్టవ్ తో UN స్పెషల్ కన్సల్టేటివ్ మెంబర్ షకీన్ కుమార్) ఎడ్యుకేషన్ లో ఏపీ.. ది బెస్ట్ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ, బాలికల విద్య కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనాల వివరాలను స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషనల్ సస్టైనబులిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రాం హై లెవెల్ పొలిటికల్ ఫోరం కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానాన్ని అందిస్తున్నారని ఏపీ ప్రతినిధులు ప్రజెంట్ చేశారు. ఈ స్టాల్ ను సందర్శించిన వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సభ్యులు విద్యావేత్తలను నేను జర్నలిస్టుగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆయా దేశాల్లో అనుసరిస్తున్న తీరు, విద్యావిధానాలను తెలుగు ప్రజలకు చెప్పే అవకాశం వచ్చింది. నాడు-నేడు స్టాల్ గురించి తెలుసుకున్న పలువురు విదేశీ విద్యావేత్తలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానాన్ని ప్రశంసించినప్పుడు తెలుగోడిగా గర్వపడ్డాను. ఐక్యరాజ్యసమితి ఆశయాలు భుజాల మీద వేసుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు, నవరత్నాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు140 దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో వివరించడం సంతోషం కలిగింది. (కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ) అమెరికాకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్లో జరిగే అమెరికా పర్యటన సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాధిక అయ్యంగార్ను కలిశాను. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్తో కలిసి రాధిక అయ్యంగార్తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుగు పాఠకులకు అందించగలిగాం. ప్రపంచ ఐక్యత కోసం, దేశాల మధ్య సమస్యల పరిష్కారం, ప్రపంచ శాంతి కోసం, పౌర హక్కుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఒక రకంగా ప్రతీ ఒక్కరికి ఎన్నో పాఠాలు చెబుతుంది. అనుభవాలు గొప్పగా అనిపించాయి. మంగా వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి -
నాడు–నేడు రెండో దశ స్కూళ్లలోనూ డిజిటల్ విద్య
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను అత్యున్నత స్థాయి బోధన ద్వారా గ్లోబల్ సిటిజన్లుగా తీర్చి దిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు 30,230 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ)ను ఏర్పాటు చేస్తున్నారు. 1 నుంచి 5 వ తరగతి స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా నాడు–నేడు రెండో దశ స్కూళ్లలో కూడా ఐఎఫ్పీ, స్మార్ట్ టీవీల ఏర్పాటుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ స్కూళ్లలో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవోలు), అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ల (ఏపీవో)కు శుక్రవారం ఆదేశాలిచ్చారు. రెండో దశలో పనులు పూర్తి చేసుకున్న అన్ని స్కూళ్లకు ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలను బోధనా తరగతి గదుల్లో మాత్రమే అమర్చాలన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల పనులను వెంటనే చేపట్టి ఆగస్టు నెలాఖరుకి పూర్తి చేయాలని డీఈవోలు, ఏపీవోలను ఆదేశించారు. ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలకు అవసరమైన కేబులింగ్, ఇతర ఏర్పాట్లకు అంచనాలు రూపొందించాలని, రెండో దశలో అందుబాటులో ఉన్న నిధులతో వాటిని అమర్చాలన్నారు. ఏఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలకు సమీపంలో రెండు సాకెట్లు, స్విచ్లతో కూడిన రెండు సాకెట్ బాక్స్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రాడ్ బ్యాండ్ సిగ్నల్ పాయింట్ అన్ని తరగతి గదుల మధ్యలో ఉంచాలని తెలిపారు. -
10వ తరగతిలో 586 మార్కులు సాధించాను. నాడు-నేడు, అమ్మఒడి, విద్యాకానుక పథకాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
-
మనబడి నాడు-నేడు కింద కోటి 10 లక్షలతో మా పాఠశాలను అభివృద్ధి చేశారు
-
సీఎం వైఎస్ జగన్ నాడు నేడు, అమ్మ ఒడి పథకాలతో విప్లవాత్మకమైన మార్పు
-
2డి, 3డి చిత్రాలు.. డిజిటల్ పాఠాలు
నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: ఒక్కసారి వినగానే, చూడగానే విద్యార్థుల మదిలో నిలిచిపోయేలా.. ఎప్పుడు ఆ అంశం ప్రస్తావన వచ్చినా పుట్టుపూర్వోత్తరాలన్నీ గుర్తుకొచ్చేలా 2డి, 3డి చిత్రాలతో డిజిటల్ పాఠాలు బోధించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో విద్యా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నాడు–నేడుతో సర్కారీ స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటంతోపాటు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లను ఉచితంగా అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. అగ్ర దేశాల్లో విద్యా బోధనకు వినియోగించే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెస్తోంది. తొలివిడత నాడు–నేడు పూర్తయిన 15,713 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని వినియోగించనున్నారు. వీటి వినియోగంపై జేఎన్టీయూ ప్రొఫెసర్లతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థులు కూడా వారానికి ఒకసారి ఆయా స్కూళ్లను సందర్శించి సాంకేతిక సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా సేవలు అందించేలా ఉన్నత విద్యా మండలి ముందుకు వచ్చింది. చదువులకు అండగా నిలుస్తూ, విద్యార్థుల తల రాతను మార్చేలా నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.59 వేల కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. గూగుల్ అసిస్టెంట్ సదుపాయం దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నల్ల బోర్డుపై తెల్ల చాక్ పీస్తో బోధిస్తున్నారు. ఆధునిక విధానాలకు అనుగుణంగా విద్యార్థులు మెరుగ్గా రాణించేలా మనబడి నాడు – నేడు తొలి విడతలో తీర్చిదిద్దిన 5,675 ఉన్నత పాఠశాలలు, ప్లస్ 2 తరగతుల్లో అత్యాధునిక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ) 30,212 తరగతి గదుల్లో అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ అసిస్టెంట్ సదుపాయం కలిగిన ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లను ఆరు నుంచి 10వ తరగతి వరకు క్లాస్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్క్రీన్కు ఇరువైపులా నాలుగు అడుగుల పొడవు, వెడల్పుతో గ్రీన్ చాక్పీస్ బోర్డులను కూడా అమరుస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ల్లో, ఐఎఫ్పీ స్క్రీన్లలో ఒకే కంటెంట్ ఉండడంతో విద్యార్థికి మెరుగైన బోధన అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం నాడు – నేడు రెండో విడతలో మరో 15 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో 3,800 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పనులు పూర్తయిన వాటిల్లో ఐఎఫ్పీ స్క్రీన్లు ఏర్పాటు చేసి డిసెంబర్ నాటికి అన్ని స్కూళ్లల్లోను డిజిటల్ స్క్రీన్లు అందుబాటులోకి తేనున్నారు. మరో 10,038 పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు మనబడి నాడు–నేడు ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యా బోధనను రాష్ట్ర ప్రభుత్వం నవీకరించింది. ప్రాథమిక పాఠశాలకు ఒకటి చొప్పున 10 వేల స్మార్ట్ టీవీలను అందించి గతేడాది ఇంగ్లిష్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చింది. వీడియో పాఠాల ద్వారా బోధనతో మెరుగైన ఫలితాలు రావడంతో ఇప్పుడు కొత్తగా 10,038 ప్రాథమిక స్కూళ్లకు అంతే సంఖ్యలో స్మార్ట్ టీవీలను డిజిటల్ కంటెంట్తో ఏర్పాటు చేస్తోంది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది ‘టోఫెల్– ప్రైమరీ’ శిక్షణ అందిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన కంటెంట్ను వీడియో, ఆడియో రూరంలో స్మార్ట్ టీవీల ద్వారా బోధించనున్నారు. ఇక నాడు – నేడు రెండో దశలో పనులు జరుగుతున్న మరో 11,200 ప్రాథమిక పాఠశాలల్లోనూ డిసెంబర్ నాటికి స్మార్ట్ టీవీలు రానున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం అయోధ్య రామాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని తరగతి గది. తరగతి గదుల్లో బోధన అందిస్తూ, అక్కడే చదువుకుని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చూపించి పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచుతున్నారు. ఇదే మండలంలోని ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం ఐఎఫ్పీ స్క్రీన్ డిజిటల్ బోధన ప్రారంభమైంది. ఇది పల్నాడు జిల్లా క్రోసూరు ఏపీ మోడల్ స్కూల్లోని తరగతి గది. విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన కోసం 165 సెం.మీ వైశాల్యం కలిగిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) బోర్డును సిద్ధం చేశారు. దీనికి 256 జీబీ డేటా పాఠ్యాంశాలతో ఎస్డీ కార్డును అనుసంధానించి స్మార్ట్ బోధన నిర్వహించవచ్చు. ఒకపక్క స్క్రీన్పై వీడియో పాఠాన్ని విద్యార్థులు చూస్తుండగా.. మరోపక్క అదే స్క్రీన్పై సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేయవచ్చు. పాఠాలను రికార్డు చేయవచ్చు. అవసరమైన వాటిని నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. -
నాడు-నేడు పథకానికి అంతర్జాతీయ గుర్తింపు
-
Andhra Pradesh: ఇదిగో మార్పు..
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు అవసరమైన కనీస సామాజిక మౌలిక వసతులను ప్రభుత్వ రంగంలో కల్పిస్తోంది. ఇందుకు ఏకంగా రూ.55,597 కోట్లు వ్యయం చేస్తోంది. తద్వారా గ్రామీణ ముఖ చిత్రంలో సమూల మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక పక్క దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని గత చంద్రబాబు సర్కారు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ఆ రంగాల్లో ప్రైవేట్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కనీస సామాజిక బాధ్యతగా ఆయా రంగాల్లో ప్రజలకు, రైతులకు అవసరమైన సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యయం చేస్తోంది. ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు సచివాలయం కనిపిస్తోంది. అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్ హెల్త్ క్లినిక్.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. మరో నాలుగు అడుగులు వేస్తే డిజిటల్ లైబ్రరీ.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ సాక్షాత్కారిస్తోంది. ఇప్పుడు ఏ గ్రామం వెళ్లినా ఈ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విద్యా రంగంలో రూ.16,450.59 కోట్ల వ్యయం మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 61,661 స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు ఏకంగా రూ.16,450.69 కోట్లు వ్యయం చేసేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే తొలి దశలో 15,713 స్కూళ్లలో రూ.3,697.86 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఈ స్కూళ్లన్నీ 10 రకాల వసతులతో కార్పొరేట్ స్కూళ్లను మించి సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్లలో రూ.8,000 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. తొలి దశలో ఆయా గ్రామాల్లో రూపు రేఖలు మారిన స్కూళ్లను చూస్తే.. గతానికి, ఇప్పటికి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సకల మౌలిక వసతులు సమకూర్చిన స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభిస్తున్నారు. దశల వారీగా గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నారు. తొలి దశలో రూ.575 కోట్ల వ్యయంతో 3,589 డిజిల్ లైబ్రరీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. పట్టణాల నుంచి సొంతూరు వెళ్లినా, అక్కడి నుంచే పనిచేసేలా డిజిటల్ లైబ్రరీలను చేపడుతున్నారు. చూడ ముచ్చటగా స్కూళ్లు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేక ఆడ పిల్లలు అనేక అవస్థలు పడ్డారు. రేకులు, దుప్పట్లు అడ్డుపెట్టుకునే పరిస్థితులుండేవి. శిథిలమైన బడులు ఆ బడులను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా దీర్చిదిద్దుతున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, సురక్షిత మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ఫర్నీచర్తో పాటు ప్రహరీ.. తదితర మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ బడులు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. తొలి దశ స్కూళ్లలో వచ్చే జూన్లో స్కూళ్లు తెరిచే నాటికి స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్తో పూర్తిగా డిజిటల్ క్లాసు రూములుగా దర్శనమివ్వనున్నాయి. నాడు–నేడు పేరుతో విద్యా సంస్థల్లో చేపట్టిన పనుల వ్యయం సామాజిక పెట్టుబడిగా.. ప్రజల ఆస్తులుగా పరిగణించాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చేరికలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయనడానికి పెరిగిన చేరికలే నిదర్శనం. ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియంతో తీర్చిదిద్దుతున్నారు. ఇవి వచ్చే తరం పిల్లల భవిష్యత్ కోసం మన ప్రభుత్వం తీసుకువస్తున్న గొప్ప మార్పుగా విద్యా వేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రజారోగ్యంలో భారీ మౌలిక సౌకర్యాలు ► నాడు–నేడు పేరుతో వైద్య రంగంలోనూ కొత్తగా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల ఆధునికీకరణ, విలేజ్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.16,822 కోట్లు వ్యయం చేస్తోంది. ► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఐదు కాలేజీల నిర్మాణం 90 శాతం పైగా పూర్తయింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ కళాశాలల్లో) ఉంటే కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా 2,100 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ► ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల ఆధునికీకరణతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో గతంలో ఏ సర్కారు కూడా ఇన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ► గ్రామ, వార్డు స్థాయిలో క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రజల ముగింటకే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 528 వార్డు హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్తగా 150 పీహెచ్సీలతో పాటు 992 పీహెచ్సీలు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ► గత చంద్రబాబు సర్కారు వైద్య విద్యా రంగాలల్లో ప్రైవేట్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటే ఇప్పుడు జగన్ సర్కారు ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ సామాజిక బాధ్యను నెరవేరుస్తోంది. రూ.17 వేల కోట్లతో వ్యవ‘సాయం’ ► దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లోని అత్యధిక ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే. అలాంటి రైతులకు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేస్తోంది. విత్తనం నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► రూ.2269.30 కోట్లతో రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 4095 పూర్తయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అన్ని మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.17 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులను చేపడుతున్నారు. మొత్తం 30 రకాల పనులు చేపడుతున్నారు. ► సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్ రూమ్లు, డ్రైయింగ్ ఫ్లాట్ఫాంల నిర్మాణం చేపడుతున్నారు. డ్రై స్టోరేజీ– డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ– మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, వరి పండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్ హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్ఫ్రా, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ల్యాండింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాససింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ► పాడి రైతుల కోసం ఇప్పటికే తొలి దశలో రూ.399.01 కోట్లతో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టారు. అమూల్తో ఒప్పందం ద్వారా పాడి రైతులు పోసే పాల ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. తద్వారా ప్రైవేట్ డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్ధితిని తీసుకువచ్చారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులకు ఇంత వ్యయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. సచివాలయాలు సామాజిక ఆస్తి ► గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందించేందుకు రూ.4,750 కోట్ల వ్యయంతో 10,893 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఇప్పటికే 5,926 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా ఆయా గ్రామాల ప్రజల సామాజిక ఆస్తిగా నిలిచిపోనున్నాయి. ► రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఆయా గ్రామాల్లోని 1.34 లక్షల మంది యువతీ యువకులు శాశ్వత ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ప్రతి సచివాలయంలోనూ గ్రామ స్థాయిలోనే దాదాపు 600 పౌర సేవలు ఎటువంటి లంచాలు, వివక్షకు తావులేకుండా అందుతున్నాయి. అభివృద్ధి వ్యయం రయ్.. రయ్.. రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం ఏటేటా తగ్గుతోంది. సామాజిక, కమ్యూనిటీ సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నేరుగా సంబంధించిన కార్యకలాపాలపై చేసే వ్యయమే అభివృద్ధి వ్యయం. ఉదాహరణకు వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చు అభివృద్ధి వ్యయమే. రాష్ట్రంలో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వల గిడ్డంగులు సామాజిక రంగ సేవల కిందకు వస్తాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య రంగాల వ్యయం పెరుగుతోంది. – 2020–21 ఆర్థిక ఏడాది నుంచి 2022–23 ఆర్థిక ఏడాది వరకు ఆర్థిక సూచికలపై ఆర్బీఐ అధ్యయన నివేదిక -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు, స్కూల్ బెల్ట్, మాస్క్ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
ఏపీలో డిజిటల్ విప్లవం
సాక్షి, అమరావతి: డిజిటల్ డివైడ్ను తొలగించాలన్నా... అంతరాలను తగ్గిస్తూ పోవాలన్నా కావాల్సింది అక్షరాస్యత. అది కూడా... డిజిటల్ అక్షరాస్యత. ఆ సూత్రాన్ని మనసావాచా ఆచరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఇక్కడ డిజిటల్ డివైడ్ తగ్గుతోంది. శ్రీమంతులకు మాత్రమేననుకున్న డిజిటల్ విద్య పేదలకూ అందుతోంది. డివైడ్ను తగ్గిస్తూ డివైజ్లూ అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ఏడాది 8వ తరగతికి వచ్చిన విద్యార్థులకు ట్యాబ్లు అందించారు. మొత్తం 5.30 లక్షల నాణ్యమైన ట్యాబ్లు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థికీ అందుబాటులో ఉండేలా డిజిటల్ క్లాస్రూమ్లను అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. 1వ తరగతి నుంచే స్మార్ట్ టీవీ స్క్రీన్ల ద్వారా డిజిటల్ క్లాస్రూమ్లను అలవాటు చేయటంతో పాటు... ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి, ఆపైన ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను (ఐఎఫ్పీ) ఏర్పాటు చేస్తున్నారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లివ్వటంతో పాటు... 8, ఆ పై తరగతుల వారికి బైజూస్ డిజిటల్ కంటెంట్ను అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనూ పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఉన్న పాఠాలను నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంటర్ విద్యార్థులకు కూడా డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ డిజిటల్ సదుపాయాలతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులూ ఉత్తమ విద్యా ప్రమాణాలను అందుకునే అవకాశముంది. ఐఎఫ్పీలు ఏర్పాటు చేయటమే కాదు. వాటి ద్వారా నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించే చర్యలు చేపట్టారు. దీనికోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ‘నాడు–నేడు’ పూర్తయిన స్కూళ్లన్నింటిలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్పీలు అందుబాటులోకి రానున్నాయి. ఇక పుస్తకాల్లోని అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్పీ కంటెంట్ ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత సమర్థంగా అభ్యసనం కొనసాగించేందుకు ఆస్కారమేర్పడుతోంది. పాలనలోనూ డిజిటల్ సేవలు... విద్యారంగంలోనే కాకుండా ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ డిజిటల్ విధానంలోనే కొనసాగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా అన్ని సంక్షేమ పథకాలనూ అక్రమాలకు, అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా అందజేయగలుగుతున్నారు. గతంలో లక్షల కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల కింద ఖర్చు చేస్తున్నట్లు చూపించటమే తప్ప ప్రజలకు వాటి ఫలాలు అందలేదు. మధ్యవర్తులు, దళారులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారు. డిజిటలైజేషన్ను ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవటంతో ఆ పరిస్థితికి పూర్తిగా చెక్ పడింది. రాష్ట్రంలో గ్రామ, వార్డుల వారీగా 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. తద్వారా అర్హుౖలైన ప్రతి లబ్ధిదారుకూ ప్రభుత్వ పథకాలను నేరుగా అందిస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు, శిశువుల సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు వీలుగా అంగన్వాడీ కార్యకర్తలకూ ఫోన్లు అందించారు. 42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు... 15వేల మందికి పైగా ఏఎన్ఎంలకు ట్యాబులు పంపిణీ చేయటంతో వారి ద్వారా అందజేస్తున్న సేవల్లో పూర్తి పారదర్శకత సాధ్యమయింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయటమే కాక అక్కడ 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించి స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికీ శ్రీకారం చుట్టారు. -
విద్యావిధానం అమలులో ఏపీ భేష్
స్విట్జర్లాండ్లోని జెనీవా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యా విధానం బాగున్నాయని కొనియాడారు. మంచి ప్రాథమిక విద్య, శిక్షణ, స్థిరమైన అభివృద్ధికి కీలకం అనే అంశంపై స్విట్జర్లాండ్ దేశం జెనీవా లో ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యాలాయంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా నుంచి ఐక్యరాజ్య సమితి పర్మినెంట్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ (united nations special consultative status member) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్ధుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న విద్య గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. కరోనా తర్వాత దేశాల్లో ఉన్నటువంటి గడ్డు పరిస్ధితులను మీటింగ్లో పలువురు ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పధకాల స్టాల్ను సందర్శించిన స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ ప్రభుత్వ పధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో విద్య కోసం నాడు-నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విద్యాప్రమాణాలను తెలుసుకుని అభినందించారు. నాడు-నేడులో భాగంగా డిజిటల్ లెర్నింగ్, నాణ్యతమైన విద్యలో భాగంగా విద్యార్ధులకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కంప్యూటర్ ట్యాబ్లు పంపిణీ, శిధిలావస్ధలో ఉన్నటువంటి పాఠశాలలను ఆధునీకరించడం, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతుల్లో నూతన విద్యావిధాన బోధన వంటివి పేదవిద్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందని వారన్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రీషన్ ఫుడ్ అందించడం వంటివి బాగున్నాయన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ఎస్పెషల్లీ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ అనేది చాలా నచ్చిందన్నారు పాట్రిసియా దన్జీ. యూఎన్ఓలో ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాల్ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. లింగ అసమానతలను పోగెట్టేలా ఆడపిల్లకు అందిస్తున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ విధానాన్ని అభినందించారు. దీని ద్వారా అమ్మాయిలకు విద్య అనేది చాలా ముఖ్యమనదన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బెస్ట్ గా ఉందన్నారు. బైజ్యూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో విద్యా విధానం అనేది బాగుందన్నారు. -
అంగన్వాడీలలో నాడు-నేడుపై సీఎం సమీక్ష
-
నాడు - నేడు పథకానికి లారస్ ల్యాబ్స్ భారీ విరాళం
-
మనబడి నాడు-నేడు పనులు.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు–నేడు కార్యక్రమంలో చేపట్టే నిర్మాణ పనుల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కాటమనేని భాస్కర్ అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావుండరాదని పేర్కొన్నారు. నాడు–నేడు రెండోవిడత కింద రూ.8 వేలకోట్లతో 22,344 స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో అదనపు తరగతి గదులు, కిచెన్షెడ్లు, భవనాలు తదితర నిర్మాణ పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి. పాఠశాలల్లో పిల్లలు, ఇతర వ్యక్తులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. నాడు–నేడు కింద చేపడుతున్న పనులు ఇవే.. నాడు–నేడు రెండోవిడతలో ప్రభుత్వం 22,344 స్కూళ్లలో 9 రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ♦నిరంతర నీటిసరఫరాతో మరుగుదొడ్లు ♦ఫ్యాన్లు, ట్యూబులైట్లతో విద్యుత్తు సదుపాయం ♦మంచినీటి సదుపాయం n విద్యార్థులు, టీచర్లకు ఫర్నిచర్ ♦స్కూలు అంతటికీ రంగులు ♦మేజర్, మైనర్ రిపేర్లు n గ్రీన్ చాక్బోర్డులు ♦ఇంగ్లిష్ ల్యాబ్లు, అదనపు తరగతి గదులు n స్కూళ్లకు ప్రహరీలు నాడు–నేడు పనులు జరగుతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు ♦హెడ్మాస్టరు, ఇంజనీర్, పేరెంట్సు కమిటీ సభ్యులు కలిసి పాఠశాల ఆవరణ మొత్తాన్ని తిరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను, వ్యక్తులకు గుచ్చుకునేలా ప్రమాదకరంగా ఉన్న వస్తువులను గుర్తించాలి. ♦నిర్మాణ ప్రాంతం వైపు ఇతరులు వెళ్లకుండా దాన్ని ప్రత్యేకించేలా ఫెన్సింగ్, సేఫ్టీ టేప్లు ఏర్పాటు చేయాలి. ♦విద్యార్థులు, సిబ్బంది స్కూలులోకి సురక్షితంగా వెళ్లేలా మార్గాలు ఏర్పాటు చేయాలి. ♦నిర్మాణ సామగ్రి, మిషనరీ, ఇతర మెటీరియల్ను స్కూలులోకి తెప్పించడం, నిర్మాణ వ్యర్థాలను స్కూలునుంచి బయటకు పంపించడం వంటి పనులను స్కూలు ప్రారంభంగాకముందు లేదా తరగతులు ముగిసిన తరువాత మాత్రమే చేయాలి. ♦ ప్రమాదానికి ఆస్కారముండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ♦పాత నిర్మాణాలను కూల్చే సమయంలో పక్కన ఉన్న భవనాలకు నష్టం జరగని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణాల ప్రాంతాల్లో గుంతలు తవ్వితే వాటిచుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. బ్లూసీట్లు, హోర్డింగులు పెట్టాలి. ♦పనిచేసే ప్రతి కార్మికుడు హెల్మెట్, బూట్లు, గ్లవుజ్లు, మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించేలా చూడాలి. నిర్మాణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. ♦నిర్మాణ ప్రాంతాల్లో గుంపులుగా చేరకుండా చూడాలి. ♦ప్రమాదాలు జరిగే పక్షంలో అత్యవసర నిష్క్రమణ మార్గాలను ముందుగానే ప్లాన్ చేయాలి. -
మనబడి నాడు-నేడుపై కమాండ్ ఐ
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పనులు మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మొదటి విడతలో పలు పాఠశాలలను సుర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం రెండో విడతకు 979 స్కూళ్లను ఎంపిక చేసింది. ఇందులో 960 స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయి. పనులను పర్యవేక్షించేందుకు కలెక్టర్ దినేష్కుమార్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది నిరంతరం పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించనున్నారు. ఒంగోలు: జిల్లాలో మనబడి నాడు–నేడు పనులు వేగవంతమయ్యాయి. కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పనులు ఊపందుకున్నాయి. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ కలెక్టర్ చర్యలు చేపట్టడంతో అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం పనుల్లో పురోగతిపై దృష్టి సారించారు. మొన్నటి వరకు 20వ స్థానంలో ఉన్న జిల్లా ఒక్కసారిగా 5వ స్థానానికి చేరుకుంది. 960 గ్రౌండింగ్ పూర్తి జిల్లాలో నాడు–నేడు రెండో దశలో ఇప్పటికే 979 విద్యా సంస్థలకు 960 గ్రౌండింగ్ పూర్తయింది. వాటిలో అంగన్వాడీ సెంటర్లు, డైట్ కాలేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాలోని ఏపీఈడబ్ల్యూఐడీసీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్, రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్, సమగ్రశిక్ష అభియాన్ ఇంజినీరింగ్ విభాగాలు ఈ పనులను పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం రూ.425 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా తొలుత 15 శాతం నిధులు విడుదల చేసింది. అంచనాలు రూపొందించడం, ఒప్పందాలు చేసుకోవడం, రివాల్వింగ్ ఫండ్ జమ చేయడం, పరిపాలన పరమైన అనుమతులు పొందడం చకచకా జరిగాయి. ఇప్పటి వరకు రూ.81 కోట్లకుపైగా ఖర్చు చేశారు. మొత్తం ప్రక్రియ ఇంకా ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఏపీఎంలకు దిశా నిర్దేశం డలాల్లో నాడు–నేడు పనుల పర్యవేక్షణకు సంబంధించి సెర్ప్లోని ఏపీఎంలను జిల్లా విద్యాశాఖలో అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు కేటాయించారు. ఇప్పటికే వారికి కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. మొత్తం 37 మంది ఈ బాధ్యతలు నిర్వహించనుండగా వీరంతా ప్రస్తుతం బాపట్లలో శిక్షణ పొందుతున్నారు. వారు కూడా వస్తే పనులు మరింత వేగవంతం అవుతాయి. ఆరు నెలల లక్ష్యాని కన్నా ముందే నాడు–నేడు పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ జారీ చేస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నాం. – డీఈఓ బి.విజయభాస్కర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు సమగ్రశిక్ష అభియాన్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో ఐదుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు ప్రతి రోజు పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంటారు. ప్రధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి సిమెంట్, ఇనుము, ఇసుకతో పాటు ఇతర ఫర్నిచర్ రాకపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. పనుల్లో తలెత్తే సమస్యలను తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ ప్రతి రోజు ఉదయాన్నే వాట్సాప్లో పనుల ప్రగతిని సమీక్షించడం, డీఈఓకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి మంగళవారం నేరుగా మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొక్కుబడి సమీక్షలు కాకుండా ప్రత్యేకంగా విద్యాశాఖపై కలెక్టర్ నేరుగా పర్యవేక్షిస్తుండడంతో దిగువ స్థాయిలో కూడా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులిచ్చారు. -
బడికి రప్పించేలా రవాణా చార్జీలు
సాక్షి, అమరావతి: బడి వయసు పిల్లలెవరూ చదువులకు దూరం కాకుండా స్కూళ్లలో చేరేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ పాఠశాల విద్యాశాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి కింద ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లుగా రూ.19,617 కోట్లను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం మూడేళ్లలో రూ.3,117 కోట్లను వెచ్చించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద రూ.48.92 కోట్లతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా రూ.2,324 కోట్లతో కుట్టుకూలీతో 3 జతల యూనిఫారం దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుబుక్కులు, డిక్షనరీతో కూడిన స్టూడెంట్ కిట్లు అందిస్తున్నారు. వీటన్నిటితోపాటు స్కూళ్లు అందుబాటులో లేనివారికి, దూర ప్రాంతాల్లో నివసించే పిల్లలు నడవాల్సిన అవసరం లేకుండా రవాణా చార్జీలను సైతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ట్రాన్స్పోర్ట్ చార్జీల కింద నెలకు రూ.600 చొప్పున 10 నెలల పాటు అందిస్తోంది. 2022–23కిగాను 40 వేల మందికిపైగా రవాణా చార్జీల కింద రూ.24.25 కోట్లు చెల్లించనున్నారు. ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 32,569 మందికి రూ.19.54 కోట్లు, సెకండరీ స్కూలు విద్యార్థులు 7852 మందికి రూ.4.71 కోట్లు రవాణా చార్జీలుగా అందించనున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో బడిబయట ఉన్న పిల్లలకోసం రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వలస వెళ్లిన వారి పిల్లలు, ఇతర ప్రాంతాలనుంచి ఉపాధి కోసం వచ్చిన వారి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు సీజనల్ హాస్టళ్లను విద్యాశాఖ నెలకొల్పింది. అనాథలు, ఆర్థిక పరిస్థితి సరిగాలేని పిల్లల కోసం సమగ్ర శిక్ష (ఎస్ఎస్ఏ) ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేశారు. -
వడివడిగా బడి దిశగా.. 1.43 లక్షల డ్రాపవుట్స్ తిరిగి బడికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరూ మంచి చదువులు చదవాలని, ప్రపంచస్థాయిలో పోటీ పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి బడుల రూపురేఖల్ని మారుస్తోంది. పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో మంచి చదువులు చదివేలా పలు సంస్కరణలు చేపట్టింది. బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడి బాట పట్టించేలా పలు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించి మరీ బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడుల్లో చేర్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనే 4 నుంచి 14 ఏళ్లలోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి, వారిలో 1,43,573 మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించింది. – సాక్షి, అమరావతి సచివాలయాలు కేంద్రంగా డ్రాపవుట్స్ను తిరిగి బడిలో చేర్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా స్కూళ్ల నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ను రూపొందించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి పాఠశాల వయస్సుగల పిల్లలందరూ స్కూళ్లలో చేరారో లేదో పరిశీలిస్తోంది. ఈ సర్వే, పాఠశాల విద్యా శాఖ అందించిన సమాచారం మేరకు బడి మానేసిన పిల్లల ఇళ్లకు సంక్షేమ, విద్యా అసిస్టెంట్, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వలంటీర్ వెళ్తున్నారు. పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. ఎక్కువ కాలం బడికి రాకపోతే అందుకు కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారా, బాల్య వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. వాటికి పరిష్కారాలను చూపి, తల్లిదండ్రులకు నచ్చ చెప్పి మరీ పిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆ వివరాలను, తల్లిదండ్రులతో సిబ్బంది మాట్లాడుతున్న ఫొటోలను ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్ రిథమ్ యాప్లో నమోదు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ పిల్లలు పాఠశాలలకు వస్తున్న తీరును సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా పిల్లలు వరుసగా మూడు రోజులు బడికి హాజరు కాకపోతే తల్లిదండ్రులకు వలంటీర్లు ఫోన్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. తిరిగి వారు బడికి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు హాజరవుతున్నారా లేదా అనే వివరాలను కూడా రిథమ్స్ యాప్లో నమోదు చేస్తున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్ వారంలో ఒక రోజు తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూలు సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. నెలలో ఒక రోజు ఏఎన్ఎం స్కూళ్లను సందర్శించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి, వ్యాక్సినేషన్ వివరాలు సేకరిస్తున్నారు. వారంలో ఒక రోజు మహిళా పోలీసు స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. వీరందరూ తమ పరిశీలనలో వెల్లడైన వివరాలను రిథమ్స్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఆ వివరాలకు అనుగుణంగా ఎక్కడైనా సమస్యలు, లోపాలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రతి గురువారం సీఎస్ సమీక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి పిల్లల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కూళ్లలో పిల్లలు హాజరు, బడి మానేసిన వారిని తిరిగి బడుల్లో చేర్పించడంపై సమీక్షిస్తున్నారు. తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిశీలన సత్ఫలితాలనిస్తోంది. పిల్లల్ని బడి బాట పట్టించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో డ్రాపవుట్స్ తగ్గి, స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరుగుతోంది. -
నాడు- నేడు పనులు అద్వితీయం
కడప ఎడ్యుకేషన్: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు మన బడి నాడు– నేడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాడు– నేడు కింద దశల వారీగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తొలివిడతలో రూ. 270 కోట్లు వెచ్చించి 1000 పాఠశాలలను అభివృద్ధి చేశారు. అలాగే రెండవ విడత మరో అడుగు ముందుకేసి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్వాడీ, జూనియర్ కళాశాలలను కలుపుకుని మొత్తం 1008 సంస్థల్లో నాడు– నేడుతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం రూ. 301.81 కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటి వరకు పలు రకాల అభివృద్ధి పనుల కోసం రూ. 37.73 కోట్లు ఖర్చు చేశారు. నాడు– నేడు పనుల నిర్వహణలో రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. ఈ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. అంగన్వాడీ, జూనియర్ కళాశాలల్లోనూ.. మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేపట్టిన నాడు నేడు పనులను రెండవ విడతలో మరో అడుగు ముందుకేసి అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో కూడా చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీకేంద్రాలు, జూనియర్ కళాశాలలకు సంబంధింది రూ.301.81 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 87 అంగన్వాడీ కేంద్రాలలో అధనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనుల కోసం రూ. 1392 లక్షలను మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.71.78 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 635 ప్రాథమిక పాఠశాలల్లో నాడు– నేడు పనులతోపాటు 135 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.9187 లక్షలు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.1384.51 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 82 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 44 అదనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనులకు రూ.1480 లక్షలు కేటాయించగా ఇప్పటి వరకు రూ.243 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 195 హైస్కూల్స్కు 794 అదనపు తరగతి గదులతోపాటు నాడు నేడు పనులకు సంబంధించి రూ.17410 లక్షలు మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ. 2030.68 లక్షల ఖర్చుచేశారు. 9 జూనియర్ కళాశాలలకు నాడు నేడు పనులకు రూ.712.50 లక్షలు కేటాయించగా రూ.43.56 లక్షలు ఖర్చు చేశారు. 15 మందితో మానిటరింగ్ కమిటీ: ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్వాడీ, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన నాడు– నేడు రెండవ విడత అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా 15 మంది సిబ్బందితో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతోపాటు ఎక్కడైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకుంటుంది. అలా ఏవైనా సమస్యలుంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు. నాడు– నేడు పనుల్లో మన జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. పనులు పారదర్శకంగా చేపట్టాలి జిల్లా వ్యాప్తంగా రెండవ విడత ఎంపిక చేసిన పాఠశాలలతోపాటు అంగన్వాడీ, జూనియర్ కళాశాలల్లో నాడు– నేడు రెండవ విడత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులను పారదర్శకంగా చేపట్టేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలి. – అంబవరం ప్రభాకర్రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి -
AP: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి.. బడికి నిధుల వెల్లువ
టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్కారు పాఠశాలల నిర్వహణను గాలికొదిలేశారు. వాటి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టి బడుల రూపురేఖలు మార్చేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు(టౌన్): పాఠశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఖర్చు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా నిధులు విడుదల చేసేవారు. అది కూడా విద్యాసంవత్సరం ముగిసే సమయంలో వచ్చేవి. ఒక్కోసారి రెండేళ్ల నుంచి మూడేళ్లు వరకు కూడా నిధులు విడుదల చేసేవారు కాదు. దీంతో స్కూళ్ల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో నుంచి డబ్బు తీసి ఖర్చు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పరిస్థితి మారింది. సకాలంలో నిధులను కేటాయించి విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో అండగా నిలిచారు. తక్షణ గ్రాంట్ కింద.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 3,343 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.8,88,45,000 గ్రాంట్ను మంజూరు చేసింది. తక్షణం గ్రాంట్ కింద రూ.1,77,69,000ను ఇటీవల విడుదల చేసింది. కాంపోజిట్ గ్రాంట్స్ను పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. 1 నుంచి 30 మంది ఉండే స్కూల్కి రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది ఉంటే రూ.75 వేలు, 1,000 మందిపైన ఉండే బడికి రూ.లక్ష ఇస్తారు. ఈ నిధులను విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, వాటర్ బిల్లులు, మైనర్ రిపేర్స్ తదితర వాటికి ఖర్చు చేయాలి. ఎమ్మార్సీలకు ఇలా.. మండల రీసోర్స్ సెంటర్లకు నిధులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 47 మండల రీసోర్స్ సెంటర్లున్నాయి. ఒక్కో దానికి రూ.70 వేలు చొప్పున రూ.32.90 లక్షలను ఇచ్చారు. ఎమ్మార్సీల నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, టెలిఫోన్లు, కంప్యూటర్ల నిర్వహణ తదితర వాటికి నగదును ఖర్చు చేయనున్నారు. సీఆర్సీలకు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 318 స్కూల్ కాంప్లెక్స్లున్నాయి. ఒక్కో దానికి రూ.19 వేలు చొప్పున రూ.60.42 లక్షలు నిధులను విడుదల చేశారు. అదే విధంగా ఒక్కో స్కూల్ కాంప్లెక్స్కు మొబైల్ సపోర్ట్ టు సీఆర్సీ కింద రూ.1,000 రూ.3.18 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని మొత్తం 318 స్కూల్ కాంప్లెక్స్లకు రూ.63.60 లక్షల నిధులను విడుదల చేసింది. దీనిపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూసీలు అందజేయాలి పాఠశాలలకు విడుదల చేసిన కాంపోజిట్ గ్రాంట్స్ ఖర్చులపై యుటిలైజేషన్ సర్టి ఫికెట్లను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందజేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మున్సిపల్ స్కూళ్లకు కూడా కాంపోజిట్ నిధులను విడుదల చేశారు. ఇప్పటికే స్కూల్ మెయింటెనెన్స్, టాయ్లెట్ గ్రాంట్స్ను ఆయా పాఠశాలలకు అందజేశాం. స్కూల్ కాంప్లెక్స్ల అభివృద్ధికి దోహదపడాలి. – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష -
AP: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మనబడి నాడు–నేడు కింద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధనా కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు అనువుగా ఉండేందుకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఆంగ్ల మాధ్యమ బోధనకు వీలుగా 1.80 లక్షల మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిలో బోధనకు వీలుగా ఈ–కంటెంట్ను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తోంది. చదవండి: లాస్ట్ జర్నీ.. లాస్ట్ సెల్ఫీ.. కన్నీరు పెట్టించిన ఫొటోలు, వీడియోలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సీమ్యాట్ ద్వారా ఈ కంటెంట్ను రూపొందింపచేసి అన్ని స్కూళ్లకు అందుబాటులోకి తెస్తోంది. తొలివిడతగా నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన 15,715 స్కూళ్లలోని ఇంగ్లిష్ ల్యాబ్లకు ఈ–కంటెంట్ను సిద్ధం చేసింది. ఇంతకుముందు 1,729 వీడియో కంటెంట్లను అందించగా తాజాగా మరో 2,102 వీడియో కంటెంట్లను పాఠశాలలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్ల్లో డిజిటల్ డివైస్లను ఏర్పాటు చేయించి వాటి ద్వారా విద్యార్థులకు ఈ ఈ–కంటెంట్ను సులభమార్గాల్లో బోధన చేయించనుంది. డిజిటల్ తరగతులకు సన్నాహాలు మరోవైపు.. నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో ఆధునిక విజ్ఞాన బోధనకు వీలుగా డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేపట్టారు. మొత్తం 45,328 స్కూళ్లలో రూ. 511.28 కోట్లతో ఈ డిజిటల్ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. మూడు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. తొలిదశలో 15,694 పాఠశాలల్లో ముందుగా ఈ డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ కింద 2023–24 విద్యాసంవత్సరంలో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ బోధనకోసం ఈ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, ఏర్పాటు చేయించనున్నారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయించారు. 2,658 స్కూళ్లలో బ్రాడ్ బ్యాండ్, లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్, పోర్టబుల్ హాట్స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. -
AP: మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు
సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణల్లో భాగంగా రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించి ప్రభుత్వ విద్యా సంస్థలను నాడు – నేడు ద్వారా కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక సమర్థంగా నిర్వహణపై దృష్టి సారించింది. అభివృద్ధి పనులు చిరకాలం మన్నికతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మౌలిక లక్ష్యమైన విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా చర్యలు చేపడుతోంది. అస్తవ్యస్తంగా, దిశానిర్దేశం లేకుండా ఉన్న అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను గాడిలో పెడుతోంది. ఇవి రెండూ ప్రత్యేక పర్యవేక్షణతో ముందుకు సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఇవన్నీ పాఠశాల విద్యాశాఖ అధికారులు, టీచర్లతో సాగగా ఇప్పుడు ఇతర శాఖలకూ బాధ్యతలు అప్పగిస్తోంది. మండల స్థాయిలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను వేర్వేరుగా పర్యవేక్షించేందుకు ఇద్దరు చొప్పున ఎంఈవోలను ప్రభుత్వం నియమిస్తోంది. ఇందుకోసం అదనంగా 692 ఎంఈవో పోస్టులను ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన విషయం తెలిసిందే. టీచర్లకు సాయంగా సచివాలయ సిబ్బంది ఇప్పటివరకు పాఠశాలలకు సంబంధించి విద్యా వ్యవహారాలు, పాలనా వ్యవహారాలను విద్యాశాఖకు చెందిన టీచర్లు, ఎంఈవోలు, ఇతర అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఒకపక్క విద్యా వ్యవహారాలు, మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ అంశాల బాధ్యతల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. మండల విద్యాధికారుల పోస్టులు న్యాయ వివాదాలతో దశాబ్ద కాలంగా భర్తీ కాకపోవడంతో మండల స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వం విద్యారంగంపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ లక్ష సాధనలో కీలకమైన క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరవైంది. ఈ అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో అభివృద్ధి పనులతో పాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ, హాజరు, చదువులపై దృష్టి పెట్టే బాధ్యతను సచివాలయాల సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది. తమ పరిధిలోని పాఠశాలల టీచర్లకు విధి నిర్వహణలో వీరు సహకారం అందించనున్నారు. క్రమ పద్ధతిలో నిరంతరం.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్య, సంక్షేమ సహాయకుడు, ఏఎన్ఎం, మహిళా పోలీసులకు స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తోంది. ఎవరెవరు ఏ పనులు చేయాలి? ఎప్పుడెప్పుడు ఆయా స్కూళ్లను పర్యవేక్షించాలో జాబ్ చార్టు రూపొందించింది. స్కూళ్ల పర్యవేక్షణ ఒక క్రమపద్ధతిలో నిరంతర ప్రక్రియగా కొనసాగేలా దీన్ని సిద్ధం చేశారు. కమాండ్ కంట్రోల్కు సమాచారం.. సచివాలయాల సిబ్బంది స్కూళ్లను పరిశీలించిన అనంతరం ఆయా అంశాలను ఆన్లైన్లో నిర్ణీత లాగిన్ ద్వారా వెబ్సైట్లో పొందుపరుస్తారు. వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేస్తారు. వారిచ్చే సమాచారం ప్రకారం ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారి వాటిని పరిష్కరిస్తారు. అంశాల తీవ్రతను బట్టి పరిష్కారానికి సమయాన్ని నిర్దేశిస్తారు. దీనిపై పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేస్తారు. ఇదంతా ఎడ్యుకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్తుంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నెంబర్ (14417), స్పందన ద్వారా అందే ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. హాజరుపై సంక్షిప్త సందేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరును నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్కూలుకు రాని విద్యార్థుల గురించి తల్లిదండ్రులు, ఆయా తరగతుల టీచర్ల ఫోన్లకు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సంక్షిప్త సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ అందిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు స్కూలుకు రాని విద్యార్థి సమాచారాన్ని వలంటీర్ల ఫోన్కూ సంక్షిప్త సందేశాల ద్వారా చేరవేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి. -
ప్రభుత్వ పాఠశాలలు భేష్
పెనమలూరు/కంకిపాడు: మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారాయని, మౌలిక వసతులు భేషుగ్గా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కితాబిచ్చింది. కృష్ణా జిల్లా కంకిపాడులోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాల, జెడ్పీ పాఠశాల, పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు (ఎస్ఏఎల్టీ) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఈ బృందం వచ్చింది. ఆయా పాఠశాలల్లో భవన నిర్మాణాలు, కల్పించిన మౌలిక వసతులను పరిశీలించి, నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసింది. పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్న సామగ్రిని పరిశీలించింది. తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సాగిస్తున్న బోధన తీరును ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. నాణ్యత, మౌలిక వసతులతో పాఠశాలల రూపురేఖలు మారడంతో విద్యా ప్రమాణాల స్థాయి పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాడు–నేడు ద్వారా తొలి దశ, రెండో దశల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, కేటాయించిన నిధులు, మౌలిక వసతుల కల్పన చర్యలను నాడు–నేడు ప్రత్యేక అధికారి మురళి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలి.. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ టాస్క్ టీమ్ లీడర్ కార్తీక్ పెంతల్ మాట్లాడుతూ.. నాడు–నేడు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పించిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయికి ఎదగాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు, వసతులు బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆకునూరు మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అతుర్పానే, ట్రైసీవిలి కౌష్కి, ఆదిత్య శర్మ, స్వాతి గమేలియల్, సురభి, దీప బాలకృష్ణన్, కాంచన్ రాజీవ్సింగ్, తనూష్ మాధుర్, కృష్ణా డీఈవో తాహేరా సుల్తానా, పలువురు కన్సల్టెంట్లు పాల్గొన్నారు. -
ఏపీలో విద్యా విధానం అద్భుతం
జగ్గయ్యపేట అర్బన్: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం, స్కూళ్ల ఆధునికీకరణ, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర బృంద సభ్యులు కొనియాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్లు కతక్ శుక్లా, దేవస్మిత చక్రవర్తి తదితరులతో కూడిన కేంద్ర బృందం గురువారం జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ను సందర్శించింది. మనబడి నాడు–నేడు, తరగతుల విలీనం చేసిన ప్రక్రియ, ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక తదితర పథకాల అమలు తీరును పరిశీలించారు. నాడు–నేడు ద్వారా చేపట్టిన పనులు, నిధుల వినియోగం, తల్లిదండ్రుల కమిటీ పాత్ర తదితర అంశాలను ఎంఈఓ రవీంద్ర, ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత వారికి వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెనూ గురించి తెలియజేయగా.. రోజుకొక వెరైటీ వంటకమా అంటూ వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, డిజిటల్ రూమ్, తరగతుల నిర్వహణ, భోజనశాల తదితరాలను పరిశీలించారు. 10, 9, 8 తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ప్రొఫెసర్ దేవస్మిత చక్రవర్తి మాట్లాడుతూ.. స్కూల్లోని మౌలిక సదుపాయాలన్నీ బాగున్నాయని.. నాడు–నేడు పనులైతే అద్భుతమని కితాబిచ్చారు. ఈ సందర్శనలో డీఈవో రేణుక, డీవైఈవో బి.గౌరీశంకర్, సీమెట్ ప్రొఫెసర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ నాడు–నేడు స్కూళ్లలో.. నిరంతర పరిశీలన
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు ద్వారా పనులు పూర్తైన పాఠశాలల్లో నిరంతరం ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలని, అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు. నెలకు ఒకసారి తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ను వినియోగించుకుని నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియ చేసేందుకు వీలుగా ఏర్పాటైన టోల్ఫ్రీ నంబర్ను అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తూ పాఠశాలల్లో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 14417 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్య, నాడు–నేడు, విద్యాకానుక, బైజూస్ కంటెంట్తో ట్యాబ్ల పంపిణీ, తరగతి గదుల డిజిటలైజేషన్పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాకానుక కింద పిల్లలకు ఇచ్చే బ్యాగుల నాణ్యతను ఈ సందర్భంగా సీఎం స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందచేసే బ్యాగులు మరింత నాణ్యంగా, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు – నేడు కింద పనులు పూర్తైన స్కూళ్లలో ఆడిట్కు సంబంధించిన వివరాలను అధికారులు అందచేశారు. స్కూళ్లలో సౌకర్యాలకు సంబంధించి గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. స్కూళ్లలో నాడు–నేడు పనులు, ట్యాబ్ల పంపిణీపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ తల్లిదండ్రుల కమిటీలు క్రియాశీలకం స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలను నిరంతరం క్రియాశీలకం చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎంఈవోలకు అకడమిక్, స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు మండల విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈవో) ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాల బాధ్యతలను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములు కానున్నారు. వెల్ఫేర్–ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ప్రతివారం స్కూళ్లను సందర్శించనున్నారు. నెలకు ఒకసారి ఏఎన్ఎంలు సందర్శించనున్నారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోలతో సహా సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేయనున్నారు. అధికారులు వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్దిష్టంగా ఎస్వోపీలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విలేజ్ క్లినిక్ పరిధిలోకి పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణ గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తేవాలని సూచించినట్లు ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్స్ పంపే నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా అంటువ్యాధులు, రోగాలను చాలావరకు నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. 5,18,740 ట్యాబ్ల కొనుగోలు టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వీరి కోసం 5,18,740 ట్యాబ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ట్యాబ్ల్లో 8వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇవ్వనున్నారు. ఏటా స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. యూనిఫామ్స్ కుట్టు కూలీ డబ్బులను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. మార్చికి తొలి దశ తరగతి గదుల డిజిటలైజేషన్ తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలను సమకూర్చటంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 72,481 స్మార్ట్ టీవీ యూనిట్లు అవసరమని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. దశలవారీగా తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.512 కోట్లకుపైగా వ్యయం కానుందని అంచనా. మనబడి నాడు – నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో వచ్చే ఏడాది మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్దేశించారు. అందుకు అనుగుణంగా నవంబర్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అన్ని చోట్లా ఇంటర్నెట్ అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీలతో సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలని సూచించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
AP: జూనియర్ కాలేజీలకు మహర్దశ
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు సంకల్పించింది. నాడు–నేడు రెండో దశ కింద రాష్ట్రంలో 468 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు రూ.280 కోట్ల వ్యయం చేయనుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో కాలేజీ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి.. వీటి ఆధ్వర్యంలో కాలేజీల్లో నాడు–నేడు కింద పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేపట్టే నాడు–నేడు పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా బిల్లుల చెల్లింపులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. మార్గదర్శకాలు ఇవి.. ► ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాడు–నేడు కింద రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా పనులు, ఇతర మేజర్, మైనర్ పనులు, కాలేజీ క్యాంపస్కు పెయింటింగ్, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, క్లాస్ రూమ్ ఫర్నీచర్, గ్రీన్ చాక్బోర్డు, కాంపౌండ్ వాల్ పనులను చేపట్టాలి. ► కాలేజీ ప్రిన్సిపాల్ కన్వీనర్గా.. విద్యార్థుల తల్లిదండ్రులతో మొత్తం 8 మంది సభ్యులతో కాలేజీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. ఇద్దరు కాలేజీ విద్యార్థుల తల్లులు, ఒక విద్యార్థి తండ్రి, క్రియాశీలకంగా ఉండే ఇద్దరు అధ్యాపకులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, ఇంజనీర్, దాతలు ఎవరైనా ఉంటే వారు కమిటీ సభ్యులుగా ఉంటారు. ► కమ్యూనిటీ కాంట్రాక్ట్ విధానంలో అభివృద్ధి కమిటీలు నాడు–నేడు పనులను చేపట్టాలి. ► కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యుల పేరుతో జాయింట్ బ్యాంకు ఖాతాను తెరవాలి. కాలేజీ దగ్గరలో ఏ బ్యాంకులో ఖాతా తెరవాలో కమిటీ సమావేశమై తీర్మానం చేయాలి. దీని ప్రకారం.. కాలేజీ అభివృద్ధి కమిటీ పేరుతో ఆ బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే సంబంధిత కాలేజీ నాడు–నేడు పనులకు నిధులను ఖర్చు పెట్టాలి. చెక్ల ద్వారానే చెల్లింపులు చేయాలి. చెక్లపై ప్రిన్సిపాల్ సంతకంతో పాటు మిగతా ఏడుగురు సభ్యుల సంతకాలు తప్పనిసరి. ► నాడు–నేడు పనులను స్థానిక మేస్త్రీ, కూలీల ద్వారా చేపట్టాలి. అవసరమైన సామగ్రిని కూడా స్థానికంగానే ప్రభుత్వం నిర్ధారించిన ధరకు కొనుగోలు చేయాలి. కమిటీ నిర్ధారించిన ధరలను మినిట్స్ బుక్లో రికార్డు చేయాలి. ఈ విషయంలో ఇంజనీర్.. కమిటీకి తగిన సూచనలు చేయాలి. ► కమిటీ సభ్యులంతా వారంలో ఒక రోజు కాలేజీలో సమావేశం కావాలి. కాలేజీలో చేపట్టాల్సిన పనులు, మౌలిక వసతులపై నిర్ణయం తీసుకోవాలి. కాంట్రాక్టర్కు పనులు అప్పగించకూడదు. ► కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకే సామగ్రి కొనుగోలు, బిల్లుల చెల్లింపులు జరగాలి. ప్రతి చెల్లింపులకు కమిటీ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. ఖర్చు చేసిన ప్రతి రూపాయి, పనులకు సంబంధించిన వివరాలన్నీ పక్కాగా పుస్తకంలో నమోదు చేయాలి. ► పనులకు మెటీరియల్ కొనుగోలు కోసం కమిటీ సభ్యులందరూ మార్కెట్కు వెళ్లి మెటీరియల్ నాణ్యత, ప్రమాణాలను స్వయంగా పరిశీలించాలి. ► నాడు–నేడు కార్యక్రమంలో వినియోగించే మెటీరియల్ కనీసం 75 ఏళ్లపాటు మన్నికతో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యుల సూచనల మేరకు ఇంజనీర్ అంచనాలను రూపొందించాలి. ► పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి. -
నాడు-నేడు పేరుతో విద్యా వ్యవస్థలో సంస్కరణలు
-
ప్రభుత్వ స్కూళ్లకే పట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలలు భారీ సంఖ్యలో మూతపడ్డాయని వెల్లడించింది. ఈ మేరకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 46.27 లక్షల మంది.. 2020–21 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 4.37 లక్షల మంది విద్యార్థులు ప్రవేశం పొందారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 46.27 లక్షలకు చేరిందని వెల్లడించారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో చేరినవారు కేవలం 2.5 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. దీంతో కొత్తగా చేరినవారితో కలిపి ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 35.05 లక్షలకు పడిపోయిందని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 77 దరఖాస్తులు మాత్రమే రాగా 948 ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన చేరికలు. 2020–21 విద్యా సంవత్సరంలో తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో 3.20 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 39.64 లక్షలకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారని.. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 28.96 లక్షలకు చేరిందని తెలిపారు. కాగా తెలంగాణలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 528 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా మూతపడలేదని వెల్లడించారు. పాఠశాల విద్యలో ఎన్నో సంస్కరణలు ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల విద్యపై దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా.. వాటిలో సకల వసతులు ఉండేలా.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడానికి నాడు–నేడు: మనబడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్నారు. అదేవిధంగా తమ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అంతేకాకుండా జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, బెల్టు, షూ, యూనిఫామ్, స్కూల్ బ్యాగు తదితరాలను అందిస్తున్నారు. వీటి ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అమాంతం పెరిగాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావేత్తలు చెబుతున్నారు. -
నాడు– నేడు.. బడి అందం చూడు
కడప ఎడ్యుకేషన్: ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేక సమస్యలతో సతమతమయ్యేవారు. విద్యార్థులకు తగినన్ని తరగతి గదులు లేక చెట్లకింద, వరండాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు సరైన వసతులు లేక.. పాఠశాలకు ప్రహరీలు లేక దారుణంగా ఉండేది. ఇలాంటి దుస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమస్యలన్నింటికి స్వస్తి పలుకుతూ నాడు– నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. దీంతో నేడు చిన్నారులు విరబూసిన నవ్వులతో అక్షరాలు నేర్పే పాఠశాల చెంతకు పరుగులు పెడుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్తుకు పునాది పడే ప్రభుత్వ బడులకే తమ పిల్లలను పంపుతున్నారు. రెండవ విడత.. చకచక ప్రభుత్వం జిల్లాలో రెండో విడత నాడు– నేడు పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పనులు మొదలై పలుచోట్ల చురుగ్గా సాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా పనుల పూర్తికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు, అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో రెండో విడతలో 1028 పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 322.83 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను సత్వరం పూర్తి చేయించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, విశాలమైన తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. రూ. 144.72 కోట్లతో నాడు– నేడు, అదనపు తరగతి గదులు జిల్లావ్యాప్తంగా 18 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 69 ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తంగా 99 పాఠశాలల్లో కేవలం అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. 68 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 ఉన్నత పాఠశాలల్లో నాడు నేడుతోపాటు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారు. ఈ పనులకు రూ. 144.78 కోట్లు కేటాయించారు. కేవలం నాడు – నేడు పనులకు కేవలం నాడు – నేడుకు సంబంధించి జిల్లాలో 461 ప్రాథమిక పాఠశాలలకు, 38 ప్రాథమికోన్నత పాఠశాలకు, 63 హైస్కూల్స్ దీంతోపాటు మరో 203 అంగన్వాడీ కేంద్రాలకు కలుపుకుని రూ. 178.05 కోట్లను కేటాయించారు. పనులను పారదర్శకంగా నిర్వహించాలి నాడు– నేడు రెండవ విడత కింద చేపట్టనున్న పనులను చాలా పారదర్శకంగా, నిక్కచ్చిగా చేపట్టాలి. ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత లోపించకూడదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు అదనపు తరగతులను నిర్మిస్తున్నాం. ఈ పనులను ఆగస్టు చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. – అంబవరం. ప్రభాకర్రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి 8 పది రకాల సౌకర్యాల కల్పన నాడు– నేడు మొదటి విడత పనులకు అదనంగా మరో పని చేర్చి రెండో విడతలో పది రకాల పనులను చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులకు మరమ్మతులు, తాగునీటి వసతి మెరుగుపరిచి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సురక్షిత తాగునీటి శుద్ధి పరికరాలను అమర్చనున్నారు. అన్ని తరగతి గదులకు ట్యూబ్లైట్లు, సిలింగ్ఫ్యాన్లు, బాలబాలికలకు విడివిడిగా నిరంతరం నీటి సౌకర్యంతో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు, బ్లాక్బోర్డు స్థానంలో గ్రీన్బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, తరగతి గదులకు పెయింటింగ్, పాఠశాల ఆవరణంలో గ్రానైట్ పనులు, ఉపాధిహామీ పథకంలో ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. -
Ongole: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఫుల్ డిమాండ్!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు మించి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం, తదితర కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. గతంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు కాదు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల మొదటి వారంలో పాఠశాలలు తెరవగా, రెండు వారాలు గడవకముందే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రస్తుతం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు క్లోజవడంతో వెనుదిరుగుతున్నారు. క్లిక్: మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు -
విద్యారంగంలో జగన్ జైత్రయాత్ర
విద్యా రంగంలో వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుల మీద ఒక ముఖ్యమంత్రిగా ఆయన పెడుతున్న శ్రద్ధ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్షణక్షణానికీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఊహించని స్థాయికి చేరుతున్న విజ్ఞానాన్ని రేపటి తరం పిల్లలు అందిపుచ్చుకోవాలన్న ఆయన సంకల్పం కొనసాగుతోంది. ఉన్నవారితో సమానంగా లేనివారి పిల్లలకూ అన్నీ అందాలన్న ఆయన దృఢ నిశ్చయం కళ్లముందు కనిపిస్తోంది. పేద కుటుంబాల తలరాతలే కాదు, ఒక ప్రజాస్వామ్య దేశంగా, ఉత్తమ విలువలతో కూడిన సమాజంగా వర్థిల్లాలంటే అది కేవలం చదువుల ద్వారానే సాధ్యమనే బలంగా విశ్వసించిన ఆయన, విద్యారంగంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! నిరక్షరాస్యతకు చరమాంకం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 67.35 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత 59.96 శాతం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, గత జనాభా లెక్కలు నాటికి ఆ 55 ఏళ్ల సంవత్సరాల్లో కూడా నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించలేకపోయాం. ప్రగతికి ఇదో పెద్దలోటు. 2019లో వచ్చిన దృఢ సంకల్పంతో కూడిన రాజకీయ నాయకత్వం ఈ పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకుంది. పుట్టిన ప్రతి పిల్లాడు కూడా బడికిపోవాలన్న సదుద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభమైంది. పిల్లల చదువుల కోసం ఏ పేదింటి తల్లీ భయపడవద్దని, కేవలం బడికి పంపితే చాలు రూ.15 వేల ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుచ తప్పక అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. మేనిఫెస్టోలో కేవలం బడికి వెళ్లే పిల్లలకు మాత్రమేనంటూ ఈ పథకాన్ని పేర్కొన్నా తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ చదువుతున్న వారికీ వర్తింపుచేశారు. 2019-2020 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్ల రూపాయలను చిత్తూరులో 2020, జనవరి 9న ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమచేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను నెల్లూరులో 2021,జనవరి 11న సీఎం బటన్ నొక్కి జమ చేశారు. మొదటి ఏడాదిలో పథకం అప్పుడే ప్రారంభం అయిన దృష్ట్యా వారి పిల్లలను బడికి పంపేలా తల్లులను ఉత్సాహపరిచేలా ఎలాంటి హాజరు శాతాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ కూడా అమ్మ ఒడిని జమ చేసింది. రెండో ఏడాది కూడా కోవిడ్ కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు అందరికీ కూడా పిల్లల హాజరుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వర్తింపచేసింది. ఈ ఏడాది మాత్రం 75 శాతం హాజరును పరిగణలోకి తీసుకుంది. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపుచేస్తామని నేరుగా ముఖ్యమంత్రే చిత్తూరు ‘అమ్మ ఒడి’ సభలో స్పష్టం చేశారు. మొత్తంగా మూడేళ్ల కాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కొత్తగా అమ్మ ఒడి పరిధిలోకి 5,48,329 మంది 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా కొనసాగుతుందనేందుకు ఇదొక ఉదాహరణ. వీరంతా కూడా ఒకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులు. 75శాతం హాజరు నిబంధనను వీరు సంతృప్తికరంగా పూర్తి చేయడం మంచి పరిణామం. మొత్తంగా 43,96,402 మంది తల్లులకు సుమారు రూ.6,595 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్నొక్కి జమచేయనున్నారు. తద్వారా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. వివక్షలేదు... అవినీతి లేదు.. అంతా పారదర్శకం: పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తోంది. ఏ పథకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు? ఆ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి? దాఖలు ఎక్కడ చేయాలి? ఇలాంటి ప్రశ్నలు గత ప్రభుత్వాల్లో కోకొల్లలు. వీటికి తావులేకుండా మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. కుటుంబాల వారీగా ఉన్న వాలంటీర్లు అర్హులైన వారిని గుర్తించి వారిచేత దరఖాస్తు చేయిస్తున్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతున్నారు. సామాజిక తనిఖీ సమయంలో అర్హత ఉండి పేరులేకపోతే మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా గ్రామస్థాయిలోనే కచ్చితమైన తనిఖీలతో ముందుకు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి దశలోనూ జవాబుదారీతనం కనిపిస్తోంది. అందుకనే ఇన్ని లక్షలమందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం ఇంత సజావుగా అమలవుతోంది. అమ్మ ఒడి అద్భుత ఫలితాలు: పిల్లలను బడికి పంపేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య దాదాపు రూ.7 లక్షలు పెరిగింది. 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు పెరిగి, 72.7 లక్షలకు చేరుకుంది. మరో వైపు కోవిడ్ లాంటి విపత్తు సమయంలో పిల్లల చదువులకు అందిస్తున్న డబ్బు వారికి ఎంతగానే మేలు చేసింది. విపత్తు సమయంలో ఈ పథకాలు ఒక రక్షణ కవచంలా ఈ పథకాలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహంలేదు. మనబడి-నాడు నేడు: విద్యారంగంలో వైఎస్ జగన్ జైత్రయాత్రలో మరో ఘన విజయం మనబడి నాడు-నేడు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను ఈ ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. బ్లాక్బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్వాల్ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారు. తొలిదశలో 15,715 స్కూళ్లలో సుమారు రూ.3,669 కోట్లు ఖర్చుచేశారు. మరో 22,344 స్కూళ్లలో రూ.8 వేల కోట్ల ఖర్చుతో రెండో దశ పనులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో ఏర్పడిన విద్యా కమిటీల భాగస్వామ్యంతో, వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. స్కూళ్లలో పరిశుభ్రత – సమర్థ నిర్వహణ: వేల కోట్ల పెట్టి పాఠశాలల్లో సౌకర్యాలను, సదుపాయాలను కల్పించుకోవడమే కాదు.. వాటిని కాపాడుకోవడం, సమర్థవంతంగా నిర్వహించుకోవడం కూడా అందరి బాధ్యత. ఇదే వాతావరణం తర్వాత వచ్చే పిల్లలకు కూడా నిరంతరం అందేలా ఈ చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్కు వేయి రూపాయల చొప్పున జమచేస్తున్నారు. అమ్మ ఒడి నుంచి అందించిన డబ్బు ద్వారా రూ.430 కోట్ల టాయిలెట్ మెయింటినెన్స్ నిధి సమకూరింది. తల్లిదండ్రుల కమిటీలు ద్వారా దీన్ని ఖర్చు చేస్తున్నారు. ప్రతి 300 విద్యార్థులకు ఒక ఆయా ఉండేలా చూస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేల రూపాయలు అందిస్తున్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆడపిల్లలు బడిమానేయాల్సిన పరిస్థితులకు లేకుండా చూస్తున్నారు. దీంతోపాటు స్కూళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎప్పుడు ఏ మరమ్మత్తుగా వచ్చినా వెంటనే బాగుచేసేందుకు వీలుగా స్కూలు మెయింటినెన్స్ నిధిని కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నిధిని పెడుతున్నారు. అమ్మ ఒడి నుంచి వేయిరూపాయలను దీనికి జమచేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యత తల్లిదండ్రుల కమిటీలదే. విద్యాకానుక, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ, బైజూస్: పిల్లలకు విద్యాకానుక ద్వారా ప్రతిఏటా వైఎస్.జగన్ సర్కార్ మరికొన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. 3 జతల యూనిఫారంతోపాటు షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, ఇంగ్లిషు నిఘంటువు అందిస్తోంది. విద్యాకానుక కోసం 2020-21లో రూ.648.11 కోట్లు ఖర్చుచేస్తే, 2021-22లో రూ.789.21 కోట్లు ఖర్చుచేసింది. మొత్తంగా రెండేళ్లలో రూ.1,437.32 కోట్లు ఖర్చుచేసింది. ఈఏడాది కూడా భారీ ఖర్చుకు సిద్ధమైంది. మొత్తంగా మూడేళ్లలో రూ.2,324 కోట్లు ఖర్చుచేసింది. పిల్లలను బడికి రప్పించడం, వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే... మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడా ఈ వైయస్.జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా మన పిల్లలను తయారుచేసేందుకు ఇంగ్లిషు మీడియంలోనే బోధన ప్రారంభించారు. పిల్లలు అర్థంచేసుకునేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రించారు. స్కూళ్లన్నింటినీ కూడా సీబీఎస్ఈకు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలు 2025 నాటికి సీబీఎస్ఈలో పరీక్షలు రాస్తారు. వీరిని మరింత సుశిక్షితులుగా తయారుచేయడానికి వీలుగా బైజూస్తో ఒప్పందం కదుర్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ బైజూస్ కంటెంట్ ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరులో 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిలోకూడా టీవీలు వస్తాయి. దీంతో బోధన మరింత సులభంగా ఉంటుంది. పిల్లలకూ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. ఇక్కడితో జగన్ జైత్రయాత్ర ఆగిపోలేదు. జగనన్న విద్యాదీవెన (ప్రతి త్రైమాసికానికీ పూర్తి ఫీజు రియింబర్స మెంట్చెల్లింపు కింద రూ.7678.12 కోట్లు), జగనన్న వసతి దీవెన (వసతి, భోజన ఖర్చుల కింద పిల్లలకు రూ. 3,329.05 కోట్లు), జగనన్న గోరుముద్ద (మెరుగైన, నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం కింద రూ.3,087 కోట్లు), పాఠశాలల్లో నాడు–నేడు (ఇప్పటికే రూ.3,669 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.8వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు), వైయస్సార్ సంపూర్ణ పోషణ(రూ.4,895కోట్లు) ఈ కార్యక్రమంలో అన్నింటికింద రూ.52,600.65 కోట్లు ఖర్చుచేశారు. -పూడి శ్రీహరి, ఏపీ సీఎం సీపీఆర్వో -
మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు
విజయనగరం పూల్బాగ్: జిల్లాలో మనబడి నాడు–నేడు రెండో విడత పనులు చురుగ్గా సాగుతున్నాయి. అనుకున్న సమయానికే పనులు పూర్తిచేసి పాఠశాల అదనపు తరగతి గదులను వినియోగంలోనికి తెచ్చేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లాలో నాడు–నేడు మొదటి విడతలో రూ.238 కోట్లుతో 1,060 పాఠశాలలను ఎంపిక చేసి పూర్తిచేయడం జరిగింది. ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో.. రాష్ట్ర పభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో రెండో విడిత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాఠశాల తల్లిదండ్రులకు కమిటీలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలతో కూడిన బ్యాంకు అకౌంటులో నాడు–నేడు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేస్తున్నారు.ఈ ఫండ్తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాడు–నేడు మొదటి విడతలో పని చేసిన అనుభవం ఉన్న ఎంఈఓ, ఏఈ, హెచ్ఎంలు, పేరెంట్ కమిటీల సభ్యులు, సిఆర్పీలు, ఎమ్మార్సీలో పని చేస్తున్న ఎంఐఎస్, ఎల్డీఏ, మండల లెవెల్ అకౌంటెంట్స్తో పాటు మిగిలిన సిబ్బంది, సచివాలయంలో పని చేస్తున్న ఇంజినీరింగ్ సిబ్బందితో రెండో విడత పనులు పూర్తిచేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. తొమ్మిది రకాల పనులు.. నాడు–నేడు రెండో విడిత కోసం జిల్లాలో ఉన్న మొత్తం 27 మండలాల్లో 451 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ పనుల కోసం ఏపీఈపీడబ్ల్యూఐడీసీకి 160 పాఠశాలలు, ప్రజారోగ్య డిపార్ట్మెంటుకు 33 పాఠశాలలు, గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్మెంట్కు 63 పాఠశాలలు, సమగ్రశిక్షా డిపార్ట్మెంట్కు 195 చొప్పున మొత్తం నాలుగు ఏజెన్సీలకు నిర్మాణ పనుల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రెండో విడతను జాతీయ నూతన విద్యావిధానం ఆధారంగా చేసుకొని పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకోసం కేవలం కంపోనేంట్ పనులు మాత్రమే కాకుండా అదనపు తరగతి గదుల నిర్మాణ పనులతో కూడిన 9 రకాల పనులు జరుగుతున్నాయి. వీటిల్లో అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయి మరమ్మతులు, ఉన్నత పాఠశాలల్లో 10 కాంపోనెంట్స్ పనులు ఉన్నాయి. నిధుల విడుదల.. 451 పాఠశాలలకు (514 ప్రాజెక్టు పను) రూ.68 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. 576 పాఠశాల అదనపు తరగతి గదుల కోసం రూ.69కోట్ల 12 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 439 పాఠశాలల పేరెంట్స్ కమిటీ ఖాతాలకు రివాల్వింగ్ ఫండ్ జమ అయింది. ఇసుక, సిమెంట్కు కొరత లేదు విజయనగరం కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు ఇసుక కోసం ప్రతి మండలంలో 3 స్టాక్ పాయింట్స్ను ఏర్పాటు చేశాం. ఇండెంట్ పెట్టిన పాఠశాలలన్నింటికీ సరఫరా చేస్తున్నాం. ఏ పాఠశాలకు ఎంత మేరకు అవసరం, ఎంత వెళ్తోంది అనే అంశాలను పరిశీలించి రికార్డు నిర్వహించడానికి సీఆర్పీని ఇంచార్జిగా నియమించాం. ఇంతవరకు 2,130 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం ఇండెంట్ పెట్టగా 1,659 మెట్రిక్ టన్నులను సరఫరా చేశాం. – డాక్టర్ వేముల అప్పలస్వామినాయుడు, ఏపీసీ, సమగ్రశిక్ష, విజయనగరం (చదవండి: అందమైన కలలకు రూపం 'నగరవనం') -
22,344 స్కూళ్లలో ‘నాడు–నేడు’ రెండో దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మనబడి నాడు–నేడు కార్యక్రమం రెండో దశలో భాగంగా 22,344 స్కూళ్లలో తలపెట్టిన మౌలిక సదుపాయాల కల్పన పనులను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖపై సమీక్షలో భాగంగా గురువారం ఆయన నాడు–నేడు పనుల ప్రగతితో పాటు పలు కార్యక్రమాలకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా నాడు–నేడు పనులు వేగవంతం చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లలో కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు, విలువైన పరికరాలు ఏర్పాటు చేస్తున్నందున రక్షణ కోసం వాచ్మెన్ నియామకం గురించి ఆలోచించాలని సూచించారు. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ అందించాలని, అప్పుడే మంచి ఫలితాలు పొందగలుగుతామని అభిప్రాయపడ్డారు. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్), స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్)లతో చేపడుతున్న కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. స్కూళ్లలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు–నేడు పనులు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణపై ప్రత్యేక ధ్యాస పెట్టాలని ఆదేశించారు. నిర్వహణ సరిగా లేకపోతే మళ్లీ మునుపటి పరిస్థితి వస్తుందన్నారు. స్కూళ్లు ప్రారంభించే నాటికి విద్యా కానుక వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికల్లా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక అందించాలని సీఎం ఆదేశించారు. విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే వస్తువులన్నీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా హైస్కూల్ ప్లస్ లేదా కేజీబీవీ స్కూలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాలికల కోసం 292 మండలాల్లో ఒక హైస్కూల్ కమ్ జూనియర్ కాలేజీ లేదా హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేస్తున్నామని అధికారులు నివేదించారు. రీడ్ ఎలాంగ్ యాప్ పనితీరును వివరించారు. 57,828 మంది ఆ యాప్ను వినియోగిస్తున్నారన్నారు. ఫొనెటిక్స్ మీద దృష్టి పెట్టాలని, పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలిగేలా తర్ఫీదు ఇవ్వాలని సీఎం సూచించారు. పాస్ పర్సంటేజి తగ్గడం తప్పు కాదు పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడాన్ని తప్పుగా భావించనక్కరలేదని సీఎం అధికారులతో పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, విద్యార్థులలో ప్రమాణాలు పెరిగేలా ముందుకు వెళ్లాలని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెల లోజుల్లోనే మళ్లీ పరీక్షలు పెడుతూ.. వాటిని రెగ్యులర్గానే పరిగణిస్తున్నందున విద్యార్థులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పదో తరగతిలో పాస్ అయిన వారు కూడా ఏవైనా 2 సబ్జెక్టుల్లో బెటర్మెంట్ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. -
నాడు – నేడు రెండో దశ పనులు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు–నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్తో కలిసి విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ నాడు నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని, ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ విడుదలైనందున వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. -
పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపించాలి: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మన బడి నాడు- నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్తో కలిసి విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం నాడు జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నాడు నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని, వీటి కోసం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పనుల నిమిత్తం ఈ పాటికే రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదలైనందున, పనులను ప్రారంభిచాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన ఇసుక, సిమెంట్, వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు కూడా పూర్తి సమన్వయంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ఈ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. చదవండి: (అమలాపురం అల్లర్లు: మరో 20 మంది అరెస్ట్) -
బడి.. బాగుంది
సాక్షి,అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో అనే దయనీయ పరిస్థితుల నుంచి బయటపడి సకల వసతులతో కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా చక్కటి వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ ఫలితాలు ఇవన్నీ. ఇప్పటికే తొలివిడత స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తయి సర్వాంగ సుందరంగా రూపుదిద్దు కోగా ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. తొలుత ప్రభుత్వ స్కూళ్ల వరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళిక తయారైనా తదుపరి ముఖ్యమంత్రి జగన్ సూచనలతో ఇతర విద్యాసంస్థలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. సమున్నత లక్ష్యంతో శ్రీకారం.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు పడుతున్న అగచాట్లను గుర్తించారు. కనీస సదుపాయాలు కరువై విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడాన్ని చూసి చలించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని తెచ్చారు. 45 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో పనులను చేపట్టాలని నిర్దేశించారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్తు సదుపాయం–లైట్లు, ఫ్యాన్లు, డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేశారు. తొలుత 9 రకాల సదుపాయాల కల్పనకే ప్రణాళికలు రూపొందించినా తదుపరి కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ ల్యాబ్స్ కూడా జోడించారు. రూ.16,450 కోట్లతో 61,661 విద్యాసంస్థల్లో నాడు–నేడు నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో వివిధ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్ వీటిని విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేశారు. అనంతరం మలివిడత నాడు–నేడు పనులను చేపట్టాలని ఆదేశించారు. ఇతర విద్యా సంబంధితసంస్థల్లోనూ నాడు–నేడును అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాల(డైట్స్)లతో పాటు ప్రతిష్టాత్మక శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులో చేర్చారు. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. పేదలకు పెనుభారం తప్పింది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరిగాయి. భారీగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించాల్సిన అవస్థలు తల్లిదండ్రులకు తొలగిపోయాయి. ముఖ్యంగా పేద వర్గాలకు పెనుభారం తప్పింది. కార్పొరేట్ స్కూళ్లకు మించిన సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చదువులు కొనసాగుతున్నాయి. పక్కా భవనాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించడంతో విద్యార్ధులు ఉత్సాహంగా బడికి వస్తున్నారు. –పారది జ్యోతి, పెదమేడపల్లి ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యురాలు, విజయనగరం జిల్లా నాడు అంతా అధ్వానం.. మా ఊరిలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆనుకొని ఖాళీ స్థలం అపరిశుభ్రంగా ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్చేవారు. ఇప్పుడు అవస్థలు లేవు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రవేశాలు పెరుగుతున్నాయి. –అల్లు రాము, చైర్మన్, తల్లిదండ్రుల కమిటీ, కొర్లాం ప్రాథమిక పాఠశాల, విజయనగరం జిల్లా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లట్లేదు నాడు–నేడు మొదటి విడతలో మా పాఠశాలను ఆధునీకరించాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు, గ్రామస్తులు సహకరించారు. పాఠశాల చుట్టూ చెట్లు నాటారు. పాఠశాలతో పాటు టీచర్ల ప్రతిష్ట పెరిగింది. చిర‡స్థాయిగా ఉండేలా అభివృద్ధి చేశాం. మొత్తం 63 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎగువపల్లిలో ఏ ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడం లేదు. –పీవీ శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం, ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల, కదిరి -
డీకేడబ్ల్యూకు మహర్దశ
నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఎందరో ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్నారు. నాడు – నేడు కింద డీకేడబ్ల్యూ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు(టౌన్): నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ (డీకేడబ్ల్యూ) కొత్త కళ సంతరించుకోనుంది. ఈ కాలేజీ 25 ఎకరాల్లో 1,400 మందికి పైగా ఇంటర్మీడియట్, 1,200 మందికి పైగా డిగ్రీ విద్యార్థినులతో కళకళలాడుతూ ఉంటుంది. వారికి ఇక్కడే వసతి సౌకర్యాన్ని కూడా కల్పించారు. నాడు – నేడు కింద డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.6.23 కోట్లతో ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్కు పంపించారు. దీంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద రూ.1.87 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఏ పనులంటే.. కళాశాలలో నాడు – నేడు కింద వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో భాగంగా మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్కు రూ.55 లక్షలు, మేజర్, మైనర్ మరమ్మతులకు రూ.1.53 కోట్లు, కాంపౌండ్ వాల్కు రూ.29 లక్షలు, ఫర్నీచర్కు రూ.44 లక్షలు, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్కు రూ.92 లక్షలు, ఆర్వో ప్లాంట్, తాగునీటికి రూ.17 లక్షలు, పెయింటింగ్కు రూ.80 లక్షలు, గ్రీన్ చాక్బోర్డుకు రూ.1.50 లక్షలు, ఇంగ్లిష్ ల్యాబ్, కంప్యూటర్లకు రూ.11 లక్షల వ్యయం కానుందని ఇంజినీరింగ్ విభాగం అధికారులు అంచనా వేశారు. ఎన్ఐఆర్ఎఫ్ నిధులతో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) నిధులతో కాలేజీలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే నిధులు కూడా విడుదలయ్యాయి. కళాశాలలోని 65 అంకణాల్లో కొత్త భవనం, ఉమెన్స్ వెయిటింగ్ హాల్, ఇన్సైడ్లో ఓపెన్ జిమ్ తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో పనులు ప్రారంభం నాడు – నేడు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్కు పంపించాం. ఎన్ఐఆర్ఎఫ్ నిధులతో కూడా కొత్త భవనం నిర్మించనున్నాం. విద్యార్థినులకు అన్ని వసతులను కల్పించనున్నాం. ప్రధానంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి కళాశాలలోని అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందిస్తాం. – గిరి, ప్రిన్సిపల్, డీకేడబ్ల్యూ కళాశాల ఇంకా ఏం చేస్తారంటే.. కళాశాలలో రూ.32 లక్షలతో డిజిటల్ ఎక్విప్మెంట్స్ను ఏర్పాటు చేయనున్నారు. సోషల్ రెస్పాన్స్బులిటీలో భాగంగా సెంబ్కార్ప్æ ద్వారా రూ.15 లక్షలతో పనులు చేపట్టనున్నారు. కళాశాలలో క్లీనింగ్తోపాటు మూడు వేల మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే కొన్ని మొక్కలు నాటారు. వాటికి నీరందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ను ఏర్పాటు చేశారు. ఈ మొక్కల మెయింటినెన్స్ను రెండేళ్లపాటు సెంబ్కార్ప్ నిర్వాహకులు చూసుకోనున్నారు. కొన్ని మొక్కల పెంపకం బాధ్యతను విద్యార్థినులకు అప్పగించారు. -
AP: నాడు–నేడుకు దేవి సీ ఫుడ్స్, అవంతి గ్రూప్ విరాళం
సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టు ఆంధ్రకు, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం, అవంతి గ్రూప్ రూ.2 కోట్ల విరాళం అందించాయి. విరాళానికి సంబంధించిన డీడీలను సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి దేవి సీ ఫుడ్స్ ఎండీ పోట్రు బ్రహా్మనందం, అవంతి గ్రూప్ సీఎండీ అల్లూరి ఇంద్రకుమార్ అందజేశారు. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? -
పనులు చకచకా
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని బొబ్బిలి సామాజిక కేంద్రంలో 30 పడకలు ఉన్నాయి. ఆరు మండలాల పేద రోగులు ఇక్కడికి వస్తుంటారు. పాత భవనంలో అరకొర వసతులతో ఆస్పత్రి నడిచేది. ఈ పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాడు–నేడు కింద ఆస్పత్రి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వం ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన నూతన భవనంలో ఓపీ, ల్యాబ్, సర్జికల్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. వసతులు మెరుగుపడటంతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున 250 నుంచి 300 వరకూ ఓపీలు ఉంటున్నాయి. నూతన భవనంపై మరో అంతస్తు నిర్మించి జనరల్ వార్డుతోపాటు, ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సాక్షి, అమరావతి: నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్సీ), ప్రాంతీయ ఆస్పత్రుల(ఏహెచ్)లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వీటిలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 ఏహెచ్లు, 177 సీహెచ్సీలు ఉండగా.. వీటిలో 11,380 పడకలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఆస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా ఆస్పత్రులు అప్గ్రేడ్ కాకపోవడం, వసతులు అరకొరగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో సీహెచ్సీ, ఏహెచ్ల రూపురేఖలు మారుతున్నాయి. రూ.1,223 కోట్లు వెచ్చించి.. రాష్ట్రవ్యాప్తంగా 45 ఏహెచ్లు, 121 సీహెచ్సీలు, 2 ఎంసీహెచ్/సీడీహెచ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,223.28 కోట్లను వెచ్చిస్తోంది. ఏపీ వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో నాడు–నేడు పనులు చేపట్టారు. మూడు ప్యాకేజీలుగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకు సగటున రూ.60 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. ఆస్పత్రుల అభివృద్ధిలో భాగంగా పలుచోట్ల ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. మరికొన్నిచోట్ల నూతన భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలో అన్ని వసతులతో ఓపీ బ్లాక్, లేబర్ వార్డు, పోస్టుమార్టం యూనిట్, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను అభివృద్ధి చేస్తున్నారు. మూడు దశలుగా వచ్చే డిసెంబర్ నాటికి ఈ పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి 59 ఆస్పత్రులు, అక్టోబర్ నెలాఖరు నాటికి మరో 69, డిసెంబర్ నెలాఖరు నాటికి మిగిలిన 40 ఆస్పత్రుల్లో నిర్మాణాలను పూర్తి చేస్తారు. సకాలంలో పూర్తి చేయకుంటే పెనాల్టీలు ఆస్పత్రుల్లో చేపట్టే పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు పెనాల్టీలు విధిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులన్నీ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంన్నాం. పనుల నాణ్యతలో రాజీపడటం లేదు. డిసెంబర్లోగా మొత్తం పనులు పూర్తి చేస్తాం. – డి.మురళీధర్రెడ్డి, ఎండీ అండ్ వైస్చైర్మన్, ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రి మెరుగుపడింది నాడు–నేడు కింద బొబ్బిలి ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే ఆస్పత్రిలో చాలా మార్పు వచ్చింది. వసతులు మెరుగుపడ్డాయి. గతంలో ఆస్పత్రిలోకి అడుగు పెట్టాలంటేనే అపరిశుభ్రత వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. వాతావరణం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకన్నా బొబ్బిలి ఆస్పత్రి మెరుగ్గా ఉంది. – రేజేటి ఈశ్వరరావు, బొబ్బిలి -
నాడు–నేడుతో విద్యావ్యవస్థలో మహాయజ్ఞం
మంగళగిరి: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో నాడు–నేడుతో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి– తెనాలి రోడ్డులోని ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫాండేషన్కు దాతలు అందజేసిన మధ్యాహ్న భోజన రవాణా వాహనాలను గురువారం ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. వంటశాలను భోజనం తయారీ నాణ్యతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పోషకాహారాన్ని అందించేందుకు జగనన్న గోరుముద్ద పథకంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించడంలో అక్షయపాత్ర అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్ప్రెసిడెంట్ వంశీధరదాసు మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో అక్షయపాత్రకు ప్రభుత్వంతో పాటు దాతలు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. దాతలు ఫ్రీడమ్ ఆయిల్, హెచ్పీ గ్యాస్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ సహకారంతో వాహనాలను అందించారు. అక్షయపాత్ర కో–ఆర్డినేటర్ విలాస విగ్రహదాస, ఐటీ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, అగవతరప్పాడు సర్పంచ్ మురళీకృష్ణారెడ్డి అక్షయపాత్ర సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
కలలో కూడా ఊహించని మహర్దశ
మానవ మనుగడలో సామాజిక, ఆర్థికాభివృద్ధిలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ కారణంగానే 2002వ సంవత్సరంలో ఆరు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు 86 రాజ్యాంగ సవరణ ద్వారా నిర్బంధ విద్యను అమలు పరచాలని కేంద్రం చట్టం చేసింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్యా వ్యవస్థ గత మాడు దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్తం అయ్యింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఆంగ్ల విద్యతో పట్టణాలతో పాటూ గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించాయి. మారిన పరిణామాల దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తుకు ఆంగ్ల విద్య తప్పనిసరి అయ్యింది. డబ్బున్నవారు తమ పిల్లల చదువు కోసం పట్టణాలకు వెళ్లిపోతుంటే... పేదవారు మాత్రం వసతులూ, సిబ్బంది లేమితో కునారిల్లిపోతున్న ప్రభుత్వ పాఠశాలలకే పిల్లల్ని పంపుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయ్యిందో ప్రత్యక్షంగా చూశారు. అందుకే 2019 ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో విద్యపై దృష్టి సారించారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు ‘నాడు–నేడు’లాంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశ శాతం రోజు రోజుకూ క్షీణించడం జగన్ గ్రహించారు. దీనిని అరికట్టేందుకు కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ‘నాడు–నేడు’ పథకానికి రూప కల్పన చేసి 2019, నవంబర్ 14న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను పునర్నిర్మాణం చేయడం, క్షీణ దశకు చేరుకున్న ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ లాంటి అన్ని రకాల డ్యామేజ్లను బాగుచేయడం; టాయ్లెట్లు, కాంపౌండ్ వాల్లను నిర్మించడం, బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రీన్ బోర్డ్లు, వాటర్ ప్లాంట్లు, పటిష్టమైన తలుపులు ఏర్పాటు చేయడం; పాఠశాలకు ఆకర్షణీయమైన రంగులు వేయించడం లాంటి అనేక పనులు పూర్తి చేశారు. మొదటి దశలో రూ. 3,585 కోట్ల ఖర్చుతో 15,715 ప్రభుత్వ పాఠశాలలనూ, రెండో దశలో రూ. 4,732 కోట్ల ఖర్చుతో 14,584 ప్రభుత్వ పాఠశాలలనూ ఆధునికీకరించారు. అదే విధంగా 3వ దశలో రూ. 2,969 కోట్లు ఖర్చు చేసి 16,489 ప్రభుత్వ పాఠశాలలను సుందరీకరించే పని ప్రభుత్వం చేపట్టింది. అదే సమయంలో విద్యార్థుల ప్రవేశ శాతం పెంచేందుకు, తల్లిదండ్రులకు పిల్లల విద్య ఏమాత్రం భారం కాకుండా చూసేందుకు ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాదీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చి అమలు చేస్తున్నది. దేశ రాజకీయాలలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా కేవలం ఈ రెండు సంవత్సరాల పదినెలల కాలంలో ఒక్క విద్య పైనే 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విశేషం. దీని వలన కోటీ ఇరవై లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ పరిణామంతో ఇప్పటి వరకూ ఏడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా అడ్మిషన్లు పొందారు. కొన్ని పాఠశాలల్లో ‘సీట్లు లేవు’ అనే బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. సీట్ల కొరకు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులను సిఫార్సు చేయమని అడుగుతున్నారు. ఈ స్థాయికి మన ప్రభుత్వ పాఠ శాలలు చేరతాయని మూడేళ్ల క్రితం కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. (క్లిక్: అనితర సాధ్య సామాజిక నమూనా!) - కైలసాని శివప్రసాద్ సీనియర్ పాత్రికేయులు -
చరిత్రలో సరికొత్త ‘బాట’
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ, విస్తరణ, కొత్త హైవే ప్రాజెక్టులను చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. 8 వేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్ల మెయింటెనెన్స్ పనులు రూ.2,500 కోట్లతో ముమ్మరంగా జరుగుతుండగా ఇప్పటికే రూ.800 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. ‘నిడా’ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) ద్వారా రూ.1,158 కోట్లు వెచ్చించి 720 కి.మీ. రహదారులను వెడల్పు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.700 కోట్లు బిల్లులు చెల్లించామని, జూన్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మే నెలలో పనులు ప్రారంభం సుమారు రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సహాయంతో మండల కేంద్రాల నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాలకు రోడ్లు వెడల్పు చేస్తున్నాం. మే నెలలో ఈ పనులు ప్రారంభం అవుతాయి. రెండో విడత పనులు డిసెంబరులో మొదలవుతాయి. రూ.1,017 కోట్లతో సుమారు 5 వేల కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్ల పనులను వచ్చే నెలలో ప్రారంభిస్తాం. జాతీయ రహదారుల కింద 99 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 3,079 కిలోమీటర్ల మేర పనులు చేçపడుతున్నాం. దీనికోసం దాదాపు రూ.29,249 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 45 ప్రాజెక్టుల కింద సుమారు మరో 3 వేల కిలోమీటర్ల పనులు డీపీఆర్ దశ దాటాయి. ఇందుకు దాదాపు రూ.29 వేల కోట్లు వ్యయం కానుంది. ఇవికాకుండా ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కింద ఆరు ప్రాజెక్టులకుగానూ నాలుగు ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు డిసెంబరులో ప్రారంభం అవుతాయి. జాతీయ రహదారులు, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసం మొత్తం రూ.90 వేల కోట్ల విలువైన పనులను రాష్ట్రంలో చేపడుతున్నాం. ఉపాధి అవకాశాలు విస్తృతం.. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే భూ సేకరణ సకాలంలో పూర్తి కావాలి. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటివల్ల ఉపాధి మెరుగుపడుతుంది. పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. భూ సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదు. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంత డబ్బు ఇదే తొలిసారి.. పనులు పూర్తి చేసిన రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పరిశీలించాలి. దీనివల్ల నాణ్యతపై పర్యవేక్షణ ఉంటుంది. చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ రోడ్ల కోసం ఖర్చు చేయలేదు. మరమ్మతులు, విస్తరణ, కనెక్టివిటీ... ఇలా పలు రూపాల్లో జరుగుతున్న పనులను ప్రజలకు తెలియచేయాలి. విద్య, ఆరోగ్యంపై రూ.32 వేల కోట్ల వ్యయం నాడు – నేడు పనుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్య రంగంపై దాదాపు రూ.16 వేల కోట్లు, విద్యారంగంలో మరో రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. నాడు –నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. మొత్తం 1,125 పీహెచ్సీల్లో 977 చోట్ల నాడు– నేడు కింద పనులు చేపట్టగా 628 ఆస్పత్రుల్లో పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల వేగవంతం చేయాలి. మరో 148 చోట్ల కొత్తవాటి నిర్మాణం చేపడుతున్నాం. 168 సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా పనులను వేగవంతం చేయాలి. మే 15 కల్లా అన్ని కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్ష నాటికి అన్ని బోధనాసుపత్రుల పనులు ప్రారంభం కావాలి. లేదంటే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 26,451 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ నాడు–నేడు రెండో దశ పనులను 26,451 స్కూళ్లలో చేపడుతున్నాం. దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా నిధులను వెచ్చిస్తున్నాం. మే 2 నుంచి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నాడు– నేడు పనులు పూర్తైన దాదాపు 15 వేల స్కూళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండో దశ పనులను ప్రారంభిస్తారు. ఇందులో కలెక్టర్లు పాలుపంచుకోవాలి. పనులను చేపట్టే స్కూలు కమిటీలకు తోడుగా నిలవాలి. కొత్తగా 28 వేల తరగతి గదులను కూడా నిర్మిస్తాం. ఆస్పత్రులైనా, స్కూళ్లైనా నిర్వహణ బాగుండాలి. దీనిపై ప్రోటోకాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. -
నాడు–నేడు పథకంతో ప్రభుత్వ బడులు తలెత్తుకున్నాయి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, నాడు–నేడు పథకంతో ప్రభుత్వ బడులు తలెత్తుకున్నాయని శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) 75 వసంతాల (ప్లాటినం జూబ్లీ) ఉత్సవం, 19వ విద్యా వైజ్ఞానిక మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. జెడ్పీ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై సభలను ప్రారంభించి మాట్లాడారు. పిల్లల భవితకు బాటలు వేయడంలో తల్లిదండ్రుల కంటే గురువుల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.భానుమూర్తి, పి.పాండురంగ వరప్రసాదరావు, శ్రీకాకుళం ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్, సుభాష్బాబులు 3 రోజుల రాష్ట్ర మహాసభల అజెండా, ఏర్పాట్లను వివరించారు. అనంతరం శ్రీకాకుళం నగరంలో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ఏయూ వీసీ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, డీఈవో పగడాలమ్మ, ఏపీసీ జయప్రకాష్, ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్, జిల్లాల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రెండో దశలో... 25,000 స్కూళ్లు.. రూ. 8,500 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు పది రకాల కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు – నేడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. నాడు – నేడు రెండో దశలో రూ.8500 కోట్ల అంచనా వ్యయంతో 25 వేల స్కూళ్లలో పనులు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే రెండో దశలో కొన్ని పాఠశాలల్లో నాడు – నేడు పనులు ప్రారంభం కాగా మరిన్ని స్కూళ్లను కూడా చేర్చి మొత్తం 25 వేల స్కూళ్లలో పనులను శరవేగంగా పూర్తి చేయాలని బుధవారం విద్యారంగంపై సమీక్ష సందర్భంగా అధికారులకు నిర్దేశించారు. ఈ నేపథ్యంలో రెండో దశలో రూ.8500 కోట్ల అంచనా వ్యయంతో 25 వేల స్కూళ్లలో పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలిదశ విజయవంతంగా పూర్తి ఇప్పటికే నాడు–నేడు తొలిదశలో రూ.3,697.88 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో పనులను పూర్తి చేసి రూపురేఖలను సమూలంగా మార్చడం తెలిసిందే. మిగిలిన విద్యాసంస్థల్లో తరువాత దశల్లో పనులు పూర్తి కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.16,450.69 కోట్ల అంచనా వ్యయంతో 61,661 ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు – నేడు పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. -
రెండో దశ చకచకా
స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు విద్యా కానుక అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యా కానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు అవుతుందని, గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లకుపైగా అదనపు ఖర్చు అవుతోందని అధికారులు చెబుతున్నారు. విద్యా కానుక కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే. వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 వేల స్కూళ్లలో రూ.11,267 కోట్ల అంచనా వ్యయంతో మన బడి నాడు–నేడు రెండో దశ కింద పనులు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రెండో దశ నాడు–నేడు పనుల ద్వారా ఈ ఏడాది స్కూళ్లలో గణనీయంగా మార్పులు కనిపించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు–నేడు కింద పనులు చేపట్టాలని సూచించారు. నాడు–నేడు ద్వారా చరిత్రలో ఈ ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. విద్యా రంగంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతిని ఇంగ్లిష్ మాధ్యమంలోకి తీసుకురావాలని, నాడు–నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. దీనిపై కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. జూలై నుంచి మొదటి విడతలో మ్యాపింగ్ చేసిన స్కూళ్లు ప్రారంభిస్తామని వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తగినన్ని తరగతి గదులుండాలి ► తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కావాల్సిన తరగతి గదులను శరవేగంగా పూర్తి చేయాలి. అవి పూర్తవుతున్న కొద్దీ దశల వారీగా ఆరు రకాల స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియ కొనసాగాలి. ► 2022 .ఊలై, 2023 జూలై, 2024 జూలై.. ఇలా దశల వారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలి. ఇందుకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాలి. ► జూలై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం పూర్తి కావాలి. ప్రతి హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లన్నీ సీబీఎస్ఈ అఫిలియేషన్తో ఉండాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. (ఇప్పటి వరకు 1,310 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తయింది.) ఇంగ్లిష్ పదాల ఉచ్ఛారణపై యాప్ ► ఇంగ్లిష్ పదాల ఉచ్ఛారణపై టీచర్లకు, విద్యార్థులకు అందుబాటులో యాప్ను ఉంచాలి. తల్లిదండ్రుల ఫోన్లలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంచేలా చూడాలి. ► జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించిన మెనూ మేరకు పిల్లలకు ఆహారం అందుతుందా? లేదా? అన్న దానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలి. ► ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రతపై అవగాహన విద్యా వ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించారు. ఇందులో భాగంగా మహిళా పోలీసులు స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై అవగాహన కల్పిస్తారు. మహిళా ఉపాధ్యాయులు, బాలికలకు అన్ని రకాల వేధింపుల నుంచి రక్షణ కోసం దిశ యాప్ను డౌన్లోడ్ చేయిస్తారు. ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పిస్తారు. బాల్య వివాహాల నివారణ, మత్తు మందులకు దూరంగా ఉంచడం, పోక్సో యాక్ట్, ఫిర్యాదుల బాక్స్ నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. -
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య యజ్ఞం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య రంగంలో 39,000 పోస్టుల భర్తీని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, పీహెచ్సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరణ, వైద్య ఆరోగ్య రంగంలో నాడు – నేడు ద్వారా మెరుగైన వసతుల కల్పనకు రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం తదితర రంగాల్లో వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమన్నారు. వైద్య, ఆరోగ్య రంగంపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్ను ఈ సందర్భంగా పరిశీలించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి విడదల రజిని ఆరోగ్యశ్రీ సేవలపై బోర్డులు విలేజ్, వార్డు క్లినిక్స్ దగ్గర నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ నాడు– నేడు కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.5,200 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. గత సర్కారు బకాయి పెట్టిన రూ.680 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. రోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. మరింత సులువుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పొందేలా సూచనలతో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో అవసరం మేరకు ప్రొసీజర్లను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. యజ్ఞంలా పనిచేద్దాం.. రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను నెలకొల్పుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నామన్నారు. భారీ మార్పులను ఆశించి అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య, వైద్యం సహా కీలక రంగాలపై అత్యంత శ్రద్ధ వహిస్తూ అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రిగా తాను నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పని చేయాలని సూచించారు. శాఖాధిపతులు, సిబ్బంది దీన్ని చాలెంజ్గా స్వీకరించి ఆశించిన మార్పుల సాధనకు కృషి చేయాలన్నారు. మే నెలాఖరుకు పోస్టుల భర్తీ పూర్తి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమీక్షలో ముఖ్యమంత్రి ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని, వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని సూచించారు. ప్రజలకు కచ్చితంగా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేలా గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించామన్నారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దు ఆస్పత్రుల్లో నాడు– నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, కొత్త పీహెచ్సీలు, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. వసతులు, సౌకర్యాలకు సంబంధించి ఎక్కడా లోటు రాకూడదన్నారు. జోరుగా 6 కొత్త మెడికల్ కాలేజీల పనులు పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతి గురించి సమీక్షలో అధికారులు వివరించారు. 16 కొత్త మెడికల్ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని చెప్పారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్ కాలేజీల నిర్మాణాల ప్రగతిని తెలియచేశారు. మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పరిశుభ్రతకు పెద్దపీట ఆస్పత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలన్నారు. టాయిలెట్ల దగ్గర నుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాజిటివ్ కేసులు ఐదే రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కేసులు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని, డైలీ యాక్టివిటీ రేటు 0.13 శాతానికి పడిపోయిందని అధికారులు తెలిపారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు వెల్లడించారు. 15 – 17 ఏళ్ల వారికి వంద శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. 12 – 14 ఏళ్ల వారికి మొదటిడోసు 94.47 శాతం వ్యాక్సిన్లు ఇచ్చారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్శర్మ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ డి.మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రలకూ ప్రోత్సాహకాలు ప్రతిభ ఆధారంగా వలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో ఆదేశించారు. దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలను గుర్తించినట్లు అవుతుందన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి నగదు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. -
ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ‘నాడు–నేడు’ కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించడంతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వ డాక్టర్లు సర్కారు ఆసుపత్రుల్లో కంటే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రజలు భావిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ప్రైవేటు ప్రాక్టీస్పై నిషేధం విధిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తారని, తద్వారా ప్రజారోగ్యానికి పూర్తి భరోసా కల్పించవచ్చని మంత్రివర్గం అభిప్రాయపడింది. గురువారం వెలగపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్, అధికారులు సమర్థంగా నిర్వహించారని అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2021–22 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ► కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు చేసిన స్వల్ప సవరణలకు మంత్రివర్గం ఆమోదం. ► కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. వైఎస్సార్ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం కొత్తగా పులివెందుల డివిజన్ ఏర్పాటు. ► 12 పోలీసు సబ్డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. జెడ్పీలు పూర్తి కాలం యథాతథం ► ఇప్పుడున్న జిల్లా పరిషత్లను మిగిలిన కాలానికి యథాతథంగా కొనసాగిస్తూ పంచాయతీరాజ్ చట్టం ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం. ► చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటయ్యే అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మిల్లెట్ మిషన్ (2022–23 నుంచి 2026–27 వరకు)కు ఆమోదం. ► ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 253 పోస్టులు ఇచ్చేందుకు ఆమోదం. 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్టీచింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. ► ప్రకాశం జిల్లా దర్శిలో నూతన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ► శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్. ► పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం. ► సర్వే, సెటిల్మెంట్స్, భూ రికార్డుల విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం. హెల్త్ హబ్స్కు భూములు ► రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటులో భాగంగా కాకినాడ అర్బన్ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం. ► కర్నూలు జిల్లా కల్లూరులో అత్యాధునిక ఆసుపత్రి కోసం 5 ఎకరాల భూమి కేటాయింపు. ► విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు. ► అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే ఆసుపత్రికి కేటాయింపు. ► శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆసుపత్రికి కేటాయింపు. పలు సంస్థలకు భూ కేటాయింపులు ► ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కు హోటల్, కన్వెన్షన్ సెంటర్ కోసం రాజమహేంద్రవరం అర్బన్లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ► కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్. ► కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు 15.31 ఎకరాల భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. ► ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపు. ► అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కు కేటాయింపు. విండ్ టర్బైన్ జనరేటర్లను నెలకొల్పనున్న ఐఓసీఎల్. ► కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఆగ్రో కెమికల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. ► కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్స్టేషన్ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమి ఆర్టీసీకి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ► రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు. ► నిజాంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలు మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ఈ భూమిలో మడ్క్రాప్ హేచరీస్ ప్రాజెక్ట్ను మత్స్యశాఖ చేపట్టనుంది. ► కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కు కోసం 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాల కేటాయింపు. ► గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ కోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. -
ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలు మూసివేస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరో 27 వేల అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఎంఈవో పోస్టుల భర్తీ, పాఠశాలల విలీనం, ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు అనే అంశాలపై శాసనమండలిలో శుక్రవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేష్ బదులిచ్చారు. విద్యాశాఖ అంశాలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతి మండలానికి ఎంఈవో–2ను నియమించాల్సిన అవసరాన్ని సూచించిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న 264 ఎంఈవోలతోపాటు మరో 666 ఎంఈవో–2 పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. దీనివల్ల ఏడాదికి రూ.28 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. వీటితోపాటు 36 డివిజనల్ విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. ఎంఈవో, డివిజినల్ విద్యాశాఖ అధికారుల ఖాళీల భర్తీకి సీనియారిటీ ప్యానల్ రూపొందిస్తామన్నారు. స్వీపర్లను ఆయాలుగా చేసి వేతనాలు పెంచాం.. పాఠశాలల్లో పనిచేసేవారిని గత ప్రభుత్వం స్వీపర్లు అని కించపరిచేలా వ్యవహరిస్తే.. వారికి ఆయాలుగా పేరు మార్చి తమ ప్రభుత్వం గౌరవిస్తోందని మంత్రి సురేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 45,488 మంది ఆయాలకు గత ప్రభుత్వం రూ.2 వేలు వేతనంగా ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.6 వేలకు పెంచిందని మంత్రి గుర్తుచేశారు. -
విద్యా కార్యక్రమాలకు వెన్నుదన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సంక్షేమం దిశగా అమలు చేస్తున్న మన బడి నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద కార్యక్రమాలపై మండల విద్యాధికారుల ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షించనుంది. వీటితో పాటు బోధనాభ్యసన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయించేలా కార్యాచరణను రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎంఈవోలకు విద్యేతర కార్యక్రమాల బాధ్యతలు అప్పగించొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మెమో ద్వారా సూచించారు. పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం రాష్ట్రంలో 61,390 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వాటిలో 72,48,961 మంది విద్యార్థులున్నారు. ఈ స్కూళ్లలో 2,90,662 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పలు పథకాల ద్వారా పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పాఠశాలల పనితీరును క్రమబద్ధీకరించేందుకు.. నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నందుకు అర్హులైన ప్రతి తల్లికీ జగనన్న అమ్మఒడి కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ‘జగనన్న విద్యా కానుక’లు అందిస్తున్నారు. విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తయారు చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యలో సమూలమైన సంస్కరణలు అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఫౌండేషనల్ విద్యకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు ఈ సమగ్ర విద్యా, పరిపాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమర్థంగా వినియోగిస్తారు. ఇకపై విద్యా కార్యక్రమాలపైనే దృష్టి జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు–నేడు వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు విద్యాశాఖలోని క్షేత్ర స్థాయిలో పటిష్ట పర్యవేక్షణకు సిబ్బంది సమస్య ఎదురవుతోంది. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఖరారు కానందున ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసే పరిస్థితి లేకపోయింది. దీంతో మండల విద్యాశాఖ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 264 ఎంఈవో పోస్టులు, 50 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ప్రస్తుతం చాలా మంది మండల విద్యాశాఖాధికారులు మూడు లేదా నాలుగు మండలాలకు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. సాధారణ విధులతో పాటు, అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు మండల విద్యా అధికారులకు ఇతర శాఖేతర పనులు కేటాయిస్తున్నారు. ఆస్పత్రుల్లో కోవిడ్ కోసం నోడల్ అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా, ఎన్ఆర్జీఈఎస్ ఆడిటింగ్ అధికారి పనులు, ఓటీఎస్ పనులకు ప్రత్యేక అధికారులుగా తదితర బాధ్యతలను అప్పగిస్తున్నందున విద్యాశాఖ అధికారులు తగిన సమయాన్ని వెచ్చించలేక, విద్యాశాఖలో ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారని కలెక్టర్లకు పంపిన మెమోలో రాజశేఖర్ వివరించారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖలోని క్షేత్ర స్థాయి అధికారులందరికీ ఇతర శాఖేతర పనులను అప్పగించొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. వారు ఇకపై శాఖాపరమైన పనులకే పరిమితమవుతారు. విద్యా రంగంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం కోసం పనిచేస్తారు. ఇకపై విద్యాభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్ర స్థాయి అధికారుల ద్వారా పర్యవేక్షణ మరింతగా పెరగనుంది. -
AP: ఇది విద్యా విప్లవం
నా చిట్టి చెల్లెళ్లు, తమ్ముళ్లు గొప్ప గొప్ప చదువులు చదవాలి. చదువుల వల్ల అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. పిల్లలు బాగా చదివితేనే వారు పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు. పిల్లలకు మనం ఏదైనా మంచి చేయగలం అనుకుంటే అది చదివించడమే. ఎవరూ దొంగలించలేని ఆస్తి చదువు మాత్రమే. చదువు జీవన ప్రమాణాలను మార్చేస్తుంది. పేద కుటుంబాల్లోని పిల్లలు ఓ డాక్టరో.. ఓ ఇంజినీరో అయితే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి. అందుకే విద్యా దీవెన, వసతిదీవెన పథకాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే వాటిలో ముందుంటాయి. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవు. ఎంత మంది పిల్లలుంటే అంత మందినీ చదివించండి. అందరికీ ఇస్తాం. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి అన్నగా.. తమ్ముడిగా, పిల్లలకు మంచి మేనమామగా ఇచ్చే కానుక ఇది. దీనివల్ల పిల్లలందరికీ సంపూర్ణంగా మంచి జరగాలని మనసారా కోరుతున్నాను. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు ఫలితాలిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లకు ఆరున్నర లక్షల మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించాలని పేద తల్లిదండ్రులకు సూచించారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన ఇస్తామని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయం నుంచి జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇవాళ 100 శాతం అక్షరాస్యత ఉన్న సమాజంలో మాతా, శిశు మరణాలు తక్కువగా ఉంటాయని, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. ‘ఒక ఊళ్లో ఒక పిల్లవాడు డాక్టర్ అయితే ఆ కుటుంబం బాగు పడటమే కాకుండా ఆ గ్రామం కూడా బాగు పడుతుంది. పెద్ద పెద్ద డాక్టర్లు చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చి, పై స్థాయికి వెళ్లిన తర్వాత కూడా ఆ గ్రామాలను గుర్తు పెట్టుకుని మంచి చేయడానికి తాపత్రయ పడతారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్న వాళ్లు.. వాళ్ల గ్రామాలకు మేలు చేయడానికి అక్కడి నుంచి డబ్బులు పంపించడం చూస్తున్నాం. వారు ఉన్నత విద్య అభ్యసించడమే దీనికంతటికీ కారణం’ అని వివరించారు. అందువల్లే మన పిల్లల చదువులకు పేదరికం అడ్డు రాకూడదని, డబ్బులు లేక చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదని గట్టిగా నమ్మి అండగా నిలుస్తున్నామన్నారు. నా కళ్ల ముందు మెదిలే ఘటన ‘ఫీజు రీయింబర్స్మెంట్ అనే అంశం మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా, నా కళ్ల ముందు ఒక ఘటన మెదలుతుంది. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు జరిగిన ఘటన అది. ఓ కాలేజీలో ఫీజు దాదాపు రూ.లక్ష ఉంటే.. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా దాదాపు రూ.30 వేలు మాత్రమే వచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో చదువు సాగించలేనని ఓ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పిల్లాడి తండ్రి నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పారు. ‘రూ.30 వేలు మాత్రమే అందిస్తే, మిగిలిన రూ.70 వేలు ఎక్కడ నుంచి తేగలగాలి.. నా తల్లిదండ్రుల మీద భారం అవుతుంది’ అనుకుని ఆ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక సంవత్సరం కిందా మీదా పడి తండ్రి రూ.70 వేలు సమకూర్చినా, రెండో సంవత్సరం పరిస్థితి ఏమిటి? అని ఆ విద్యార్థి ఆలోచించాడు. తండ్రితో ఆ భారాన్ని మోయించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజుకూ నేను ఆ ఘటనను మర్చిపోలేను. అందుకే ఆ పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదు.. నా చిట్టిచెల్లెళ్లు, తమ్ముళ్లు గొప్పగా చదివేలా చూడాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రాకూడదని ఇంతకు ముందు నాకన్నా గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్నగారు (వైఎస్సార్) అనే చెప్పాలి. ఆ రోజుల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ దిశగా అడుగులు వేశారు’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. జగనన్న విద్యాదీవెన చెక్కుతో సీఎం జగన్. చిత్రంలో మంత్రి సురేష్, అధికారులు, లబ్ధిదారులు తర్వాత పాలకులు మొక్కుబడిగా.. ► నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన పాలకులు మొన్నటి వరకూ.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు మొక్కుబడిగా.. అదీ ఎప్పుడో.. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. ఈ పథకాన్ని మొత్తం నాశనం చేసే పరిస్థితుల్లోకి తీసుకుపోయిన తర్వాత మన ప్రభుత్వ వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ► 2017–18, 2018–19 సంవత్సరాలకు ఏకంగా రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే, పిల్లలకు ఇబ్బంది కలగకూడదని మనం చిరునవ్వుతో చెల్లించాం. ► దేశంలో ఎక్కడా లేని విధంగా, అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను ఇస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒక సారి డబ్బు విడుదల చేస్తున్నాం. ► దీనికితోడు ‘వసతి దీవెన’ అనే గొప్ప ఆలోచన చేశాం. దీని కింద వసతి, భోజనం కోసం పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు చదివే పిల్లలకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదివే పిల్లలకు రూ.10 వేలు ఏడాదికి రెండు దఫాలుగా ఇస్తున్నాం. మన ప్రభుత్వం ఇలా.. ► జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు గత ప్రభుత్వం ఉంచిన బకాయిలతో కలుపుకుని మన ప్రభుత్వం రూ.9,274 కోట్లు ఖర్చు చేసింది. దీంతో పాటు తొలిసారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి, వారిని భాగస్వామ్యులను చేస్తూ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. ► అక్టోబర్, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఇవాళ ఇస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి మే నెలలో చెల్లిస్తాం. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే ఆలస్యం లేకుండా ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం ద్వారా కాలేజీలో జవాబుదారీతనం పెరుగుతుంది. అక్కడ వసతులపై ప్రశ్నించే హక్కు వారికుంటుంది. ► వసతి దీనెన కింద మనం ప్రతి విద్యార్థికి ఇస్తున్న రూ.20 వేలలో ఇప్పటికే రూ.10 వేలు ఇచ్చాం. రెండో విడత ఏప్రిల్ 5న ఇస్తాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా ప్రజల్లోకి వెళ్లి దీన్ని అందజేస్తాం. ఇది కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వేస్తాం. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు ► మనం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లలో 2018–19లో 37.50 లక్షల మంది విద్యార్థులు ఉంటే, ఈ రోజు 43.60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. సీటు కోసం సిఫారసు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ‘నాడు–నేడు’ అనే గొప్ప కాన్సెస్ట్తో సూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ► గతంలో క్లాస్ టీచర్లకే దిక్కు లేని పరిస్థితుల నుంచి ఏకంగా ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేక టీచర్ను తీసుకొచ్చే గొప్ప ప్రక్రియను తీసుకొస్తున్నాం. మొత్తం ఇంగ్లిష్ మీడియం చదువులు తీసుకొస్తున్నాం. సీబీఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నాం. నాడు–నేడుతో క్షేత్ర స్థాయిలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ► ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నో మార్పులు.. సత్ఫలితాలు ► గతంలో పిల్లలకు పుస్తకాలు ఎప్పుడిస్తారో తెలియదు. స్కూళ్లు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత కూడా పుస్తకాలు ఇవ్వని పరిస్థితి. ఇవాళ స్కూళ్లు మొదలయ్యే సమయానికే పిల్లలందరికీ జగనన్న విద్యా కానుక పేరుతో మూడు జతల బట్టలు, స్కూల్ బ్యాగు, బైలింగ్వల్ (ద్వి భాష) టెక్టŠస్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, షూ ఇస్తున్నాం. ► స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్నం పూట జగనన్న గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో బలవర్థక ఆహారం అందిస్తున్నాం. పిల్లల మెనూ గురించి ఇంతగా ఆలోచించిన ముఖ్యమంత్రి బహుశా ఎవరూ ఉండరు. గతంలో మిడ్ డే మీల్ సరుకులకు, ఆయాలకు 7, 8 నెలల వరకు డబ్బులు ఇచ్చేవారు కాదు. ► ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశాం. భోజన పథకానికి గతంలో రూ.600 కోట్లు అయితే, ఈ రోజు రూ.1,800 కోట్లు అవుతోంది. అమ్మఒడి, ఇతర పథకాలన్నింటి వల్ల ఎన్రోల్మెంట్ను గణనీయంగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. ► ఉన్నత విద్యలో జాబ్ ఓరియెంటెడ్ సిలబస్, అప్రంటిస్షిప్ విధానం అమలు దిశగా అడుగులు పడ్డాయి. వీటన్నింటి వల్ల పిల్లలకు మంచి జరగాలని ఆరాటపడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నా విద్యా దీవెనకు రూపకల్పన చేసిన మీకు(సీఎం) ధన్యవాదాలు. మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ కూలీ పనికి వెళ్తోంది. ఇదివరకు మా పెద్దక్కకు ఇలా చదువుకునే అవకాశం లేక మధ్యలోనే ఆపేసింది. ప్రస్తుతం నాతో పాటు మా చెల్లి కూడా చదువుకుంటోంది. తనకు విద్యా కానుక, అమ్మ ఒడి వస్తోంది. ఇతర పథకాలూ అందుతున్నాయి. బాగా చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. – సవర ఇందు, డిగ్రీ థర్డ్ ఇయర్, శ్రీకాకుళం -
నవరత్నాల ద్వారా రూ.1.30 లక్షల కోట్లు బదిలీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభ జరగనివ్వకుండా గందరగోళం సృష్టించారు. స్పీకర్ మీదకు వారు రాకుండా డఫేదార్లు రక్షణ గోడగా నిలబడ్డారు. ఒకపక్క ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నా అధికార పార్టీ సభ్యులు ఎక్కడా స్పందించకుండా సభను కొనసాగించడంతో నినాదాలు నెమ్మదించాయి. ఇక నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు వంటి సభ్యులు నిలబడలేక మెట్లపై కూర్చుండిపోయారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తికాగానే టీ విరామం కోసం సభను 15 నిమిషాలపాటు స్పీకర్ వాయిదా వేశారు. ఈ స్థాయి సంక్షేమం ఎక్కడాలేదు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు నవరత్న పథకాల ద్వారా అర్హులైన పేదలకు రూ.1.30 లక్షల కోట్ల నగదును నేరుగా వారి ఖాతాల్లో జమచేసినట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు కరణం ధర్మశ్రీ, జోగి రమేష్, కాసు మహేష్రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మూలే సుధీర్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. లబ్ధి పొందిన వారిలో అత్యధికంగా 47.93 శాతం బీసీ వర్గాలు ఉండగా.. ఎస్సీలకు 16.30 శాతం, ఎస్టీలకు 5.18 శాతం, మైనారిటీలకు 3.91 శాతం, కాపులకు 8.76 శాతం, ఇతరులకు 17.93 శాతం చొప్పున ప్రయోజనం కలిగినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా తమ ప్రభుత్వం వృద్ధులకు ప్రతీనెలా రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోందని.. దీన్ని క్రమేపీ రూ.3,000కు పెంచనున్నట్లు బుగ్గన తెలిపారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్స అందించడంతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఒక్కో రోగికి రూ.7లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు చేసినట్లు బుగ్గన తెలిపారు. కార్పొరేషన్ల ద్వారా కూడా ‘సంక్షేమం’ రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వాటి ద్వారా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఇప్పటివరకు వివిధ సంక్షేమ, ఇతర కార్యక్రమాలు ద్వారా రూ.86,144.01 కోట్లు అందించామని.. దీని ద్వారా 4,73,83,044 మంది ప్రయోజనం పొందినట్లు ఆయన తెలిపారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. వివిధ చేతివృత్తుల వారికి ఇప్పటివరకు రూ.2,272.31 కోట్లు ఇచ్చామని, దీని ద్వారా 11,73,018 మంది లబ్ధిపొందారన్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా.. ఇక వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ద్వారా 98,00,626 మంది స్వయం సహాయక మహిళలు లబ్ధిపొందినట్లు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభకు వివరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. దీని ద్వారా మొత్తం 9,41,088 స్వయం సహాయక సంఘాలకు రూ.2,354.22 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ► మరో ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బదులిస్తూ.. జగనన్న వసతి దీవెన కింద 19,20,926 మంది విద్యార్థులకు రూ.2,304.97 కోట్లు అందజేశామన్నారు. ► అలాగే, నాడు–నేడు కింద తొలిదశలో 352 గిరిజన సంక్షేమ పాఠశాలలను రూ.137.13 కోట్లతో ఆధునీకరించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ► అలాగే, ఈ కార్యక్రమం ద్వారా మొత్తం రూ.16,000 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని.. రాష్ట్రంలోని 2,530 గిరిజన పాఠశాలలను మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. -
టీచర్ల పని.. చదువు చెప్పడమే
స్కూళ్లలో విద్యార్థులకు ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్ పదాన్ని నేర్పాలి. అలా నేర్పేటప్పుడు డిక్షనరీలో ఆ పదాన్ని చూపించి అర్థం తెలపడంతో పాటు, వాక్యంలో ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలో కూడా వివరించాలి. మొదటి రోజు పదం చెప్పడం, అసైన్మెంట్ ఇవ్వడం.. రెండో రోజు దాన్ని ఉపయోగించడం నేర్పించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గం వేసేలా వారి తల్లిదండ్రులతో హెడ్మాస్టర్లు తరచూ మాట్లాడాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వారి సేవలను బోధన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని, బోధనేతర కార్యక్రమాలకు వినియోగిస్తే విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నారని, వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. అందుకోసమే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించామని, సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెప్పారు. నూతన విద్యా విధానం కింద తీసుకున్న నిర్ణయాలు, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నాటికి సబ్జెక్ట్ టీచర్ల నియామకాలు పూర్తి కావాలని ఆదేశించారు. తద్వారా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంటారని, నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నారంటే.. నూతన విద్యావిధానం అమలు తీరుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ లెర్నింగ్ టు లెర్న్ కాన్సెప్ట్లోకి డిజిటల్ లెర్నింగ్ ► లెర్నింగ్ టు లెర్న్ కాన్సెప్ట్లోకి డిజిటల్ లెర్నింగ్ను తీసుకెళ్లాలి. జిల్లాల పునర్విభజన ద్వారా ఏర్పడనున్న 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న శిక్షణ కేంద్రాలలో నాడు–నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలి. ► స్కూళ్లలో హెడ్ మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో మంచి సంబం«ధాలు నెరుపుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలి. ప్రతి విద్యార్థిని, వారి తల్లిదండ్రులనూ విడివిడిగా కలుస్తూ.. వారి భవిష్యత్తుకు మంచి మార్గం చూపేలా కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం ► స్కూళ్లలో నాడు–నేడు కింద ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి. లేకపోతే ఆ సౌకర్యాలు నిరర్థకమవుతాయి. టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ బాగుండాలి. ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే దాన్ని పరిష్కరించి, సమర్థవంతంగా నిర్వహించాలి. ► ఫిర్యాదు వచ్చిన వారం రోజుల్లోగా పరిష్కారం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని టెక్నికల్, ఇంజనీరింగ్ సిబ్బంది, విలేజ్ క్లినిక్స్లో సిబ్బందికి స్కూళ్లలో వసతుల నిర్వహణపై తగిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ఇవ్వాలి. 15 నుంచి స్కూళ్లలో రెండో విడత నాడు–నేడు ► మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు –నేడు రెండో విడత పనులు మొదలు పెట్టాలి. ప్లే గ్రౌండ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించి మ్యాపింగ్ చేసి, ప్రణాళిక సిద్ధం చేయాలి. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక అందించాలి. ► ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా? చూడాలి. తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కడుతున్నందున, ఆ మేరకు పిల్లలకు సౌకర్యాలు, వసతులందిస్తున్నారో లేదో క్రమం తప్పకుండా పరిశీలించాలి. నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి ► రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకు రావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతి పార్లమెంట్కు ఒక స్కిల్ కాలేజీతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్ సమ్మిళితంగా ఒక స్కిల్ సెంటర్ ఉండాలి. తద్వారా ఎంతో మందికి త్వరితగతిన ఉపాధి కల్పించవచ్చు. ► వీటన్నింటికీ పాఠ్య ప్రణాళికను స్కిల్ యూనివర్సిటీ రూపొందించాలి. దీన్ని తిరుపతిలో పెడతామని ఇదివరకే నిర్ణయం తీసుకున్నాం. దీని ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు రాష్ట్రం చిరునామాగా మారాలి. ► సమావేశంలో విద్యా శాఖ మంత్రి సురేష్, సీఎస్ సమీర్శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రాజశేఖర్, సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్సీఈఆర్టీ) బి.ప్రతాప్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిపోయిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని చెప్పారు. మార్చి 14 నుంచి రోజూ ఒక ఇంగ్లిష్ పదాన్ని నేర్పేలా కార్యాచరణ అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్ ప్రారంభిస్తామని, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూనియర్ కళాశాలలు లేని మండలాలను గుర్తించామని తెలిపారు. ఈ లెక్కన అన్ని మండలాల్లో ప్రస్తుతం ఉన్న 472 జూనియర్ కాలేజీలతో కలుపుకుని 1,300 వరకు ఏర్పాటవుతాయన్నారు. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ సిఫార్సుల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎంకి వివరించారు. -
చదువుకు మంచిరోజులు
-
Andhra Pradesh: మా ఆస్పత్రి మారింది
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక వసతులకు ఏ కొరతా లేకుండా నాడు–నేడు కింద ఆస్పత్రులు సకల హంగులతో రూపు మార్చుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి.. ఏ పీహెచ్సీని చూసినా ఇట్టే తెలుస్తోంది. ఇది వరకు ఆయా గ్రామాల్లోని ఆస్పత్రులు ఎప్పుడు తెరుచుకునేవో.. ఎప్పుడు వైద్యుడుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. వైద్యుడి సంగతి అటుంచితే కనీసం నర్సు కూడా అందుబాటులో లేని దుస్థితి ఇప్పుడు సమూలంగా మారిపోయింది. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో వైద్యం అందుతోందని గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఎస్.శిరీషది మధ్యతరగతి కుటుంబం. ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా శిరీష కుమారుడిని కుక్క కరిచింది. పిల్లవాడికి ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించడానికి వచ్చారు. వైద్య సిబ్బంది వేగంగా వివరాలు నమోదు చేసుకుని టీకా వేశారు. 15 నిమిషాల్లో వైద్య ప్రక్రియ ముగించారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలో వైద్య సేవలపై ఆమెను ప్రశ్నించగా.. ‘ఈ మధ్యే మా ఆస్పత్రి మారింది. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఆస్పత్రి లోపలంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. రోగులు కూర్చోడానికి వీలుండదు. తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. సిబ్బంది కొరత ఉండేది. చిన్న చిన్న జబ్బులకు, వైద్య పరీక్షలకు కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసే వారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండేది కాదు. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వ్యయ ప్రయాసల కోర్చి విజయవాడకు వెళ్లే వాళ్లం. కుక్క కరిచి ఎవరైనా వస్తే ఇక్కడ టీకాలు ఉండేవి కావు. ఇక్కడి నుంచి కంకిపాడుకు వెళితే.. అక్కడా కొన్ని సార్లు టీకాలు ఉండవు. దీంతో విజయవాడకు వెళ్లక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేశారు. తగినన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు బయటకు వెళ్లే అవస్థ తప్పింది’ అని శిరీష సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీలో గతంలో కేవలం ఒకే ఒక్క నర్సు తప్ప ఎవరూ ఉండే వారు కాదని.. ఒంట్లో బాగోలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన కె.శ్యామ్ చెప్పాడు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేసిందన్నాడు. ఇప్పుడు ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్వో/ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది ఉన్నారన్నాడు. ‘గతంలో డాక్టర్లు వేళకు వచ్చే వారు కాదు. వచ్చినప్పుడు కొద్దిసేపు ఉండి వెళ్లిపోయేవారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఈ కష్టాలు పడలేక కంకిపాడు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి’ అని తెలిపాడు. – సాక్షి, అమరావతి అనూహ్య రీతిలో వసతుల కల్పన ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ సహా 12 మంది స్టాఫ్ ప్యాట్రన్ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా ఉప్పులూరు పీహెచ్సీనే తీసుకుంటే ఇద్దరు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ అయ్యాయి. అన్ని వసతులు కల్పించారు. దీంతో ఓపీ (ఔట్ పేషెంట్) సంఖ్య పెరిగింది. త్వరలో దీనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్క్వాస్) గుర్తింపు రానుంది. యూపీహెచ్సీల్లోనూ ఉత్తమ వైద్యం గతంలో 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండేవి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అదనంగా మరో 301 కేంద్రాలు.. మొత్తంగా 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి సొంతంగా భవనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నాడు–నేడులో భాగంగా కొత్త భవనాలు, మరమ్మతుల కోసం రూ.399.2 కోట్లు ఖర్చు చేస్తోంది. 499 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రస్తుతం 10 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్సీల తరహాలోనే యూపీహెచ్సీల్లోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మందులు, వైద్య పరీక్షలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంది. కాగా, రూ.16,255 కోట్ల భారీ నిధులతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన.. 16 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం, 5 గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.663 కోట్లతో నాడు–నేడు పీహెచ్సీల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.663 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 పీహెచ్సీలు ఉండగా, 1,125 ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నారు. 977 పీహెచ్సీలకు మరమ్మతులు, 148 పీహెచ్సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీలలో మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక పీహెచ్సీలకు ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ – కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది) గుర్తింపు ఉన్న రాష్ట్రంగా ఏపీ సత్తా చాటింది. 320 పీహెచ్సీలకు ఈ గుర్తింపుతో ఏపీ తొలి స్థానంలో, 191తో గుజరాత్ రెండో స్థానంలో, 134తో కేరళ మూడో స్థానంలో ఉంది. అందుబాటులో స్పెషలిస్ట్ వైద్యం ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్పెషలిస్ట్ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9 స్పెషాలిటీల్లో 1,278 మంది వైద్యులను నియమిస్తోంది. వీరు వారంలో ఆరు రోజుల పాటు రోజుకు రెండు పీహెచ్సీలకు వెళ్లి స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 276 పోస్టులు భర్తీ అయ్యాయి. ‘నాడు–నేడు’తో మార్పులు ఇలా.. ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ఆస్పత్రిలో వసతులు/గదులకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు ఉన్నాయి. రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి 3–4 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ► చాలా ఆస్పత్రుల్లో గతంలో ఒకే వైద్యుడు ఉండేవాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులను తప్పనిసరి చేసింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే 645 మంది డాక్టర్లు, 1,113 నర్సులు, 403 ల్యాబ్ టెక్నీషియన్లు సహా 2,964 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 264 డాక్టర్, 1,269 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తోంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉండేవి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వస్తారు. ► వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లకు మందుల సరఫరా, వైద్య పరీక్షల శ్యాంపిల్స్ సేకరించి పీహెచ్సీలకు తరలించడం కోసం ప్రతి పీహెచ్సీకి ఒక స్కూటీని త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. ► మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 176 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడు మల్లూరి రాముకు 65 ఏళ్లు. విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. వృద్ధాప్యంలో అంత దూరం ప్రయాణించడం ప్రయాసే. రాము తరహాలో మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్రంలో ఐదు గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంది. రూ. 246 కోట్లతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం జిల్లా దోర్నాలల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇబ్బందులు ఉండవు మా ప్రాంతంలోనే అన్ని వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతుండటం శుభ పరిణామం. తద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక సంభవించే మరణాలు తగ్గుతాయి. – కొవ్వాసి నారాయణ, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా పూర్తి చేస్తాం రాష్ట్రంలో ఐదు చోట్ల గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అవార్డ్ చేశాం. వాళ్లు పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మురళీధర్రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్నదే లక్ష్యం ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. నాడు–నేడు కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అత్యధిక ఎన్క్వాస్ గుర్తింపు కలిగిన పీహెచ్సీలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. దేశానికి ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. – ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు మా ఊళ్లోనే మంచి వైద్యం నాకు 70 ఏళ్లు. మా గ్రామంలోనే పీహెచ్సీ ఉంది. గతంలో ఇక్కడ సేవలు సరిగా లేనందున ఉయ్యూరులో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లే వాడిని. డాక్టర్ ఫీజు, మందులు కలిపి రూ.500 అయ్యేది. ఇప్పుడు మా ఊళ్లోనే ప్రభుత్వ ఆస్పత్రి బాగుండటంతో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. క్రమం తప్పకుండా ఇక్కడికే వచ్చి, మధుమేహం, ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్తున్నాను. వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారు. – బి.కోటేశ్వరరావు, చినఓగిరాల, కృష్ణా జిల్లా ఇదివరకు ఆర్ఎంపీ వైద్యమే గతి గతంలో మా ఊరికి సమీపంలోని రాకోడు పీహెచ్సీలో వైద్యుడు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఊర్లోనే ఆర్ఎంపీతో చూపించుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు వైద్యులను నియమించారు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వెళితే ప్రేమగా పలకరిస్తూ వైద్యం చేస్తున్నారు. – పి.అప్పలనాయుడు, పెదవేమలి, విజయనగరం -
మస్తుమస్తుగా.. మార్కెట్ యార్డులు
సాక్షి, అమరావతి: మార్కెట్ యార్డులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. నాడు –నేడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. మార్కెటింగ్ శాఖ ఆధీనంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటి పరిధిలోని 194 యార్డులున్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన పలు యార్డుల్లోని గోదాములు శిథిలావస్థకు చేరుకు న్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వాటిని ఆధునికీకరించడంతో పాటు, కమిటీలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే నెలాఖరు నాటికి పూర్తి.. గతేడాది కొత్తగా ఏర్పాటైన 14 మార్కెట్ కమిటీలకు పరిపాలన భవనాలతో పాటు ప్లాట్ఫామ్స్, స్టోరేజ్ గోడౌన్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటిలో 137 యార్డుల్లో బాగా దెబ్బతిన్న గోదాములపై కొత్తగా షీట్స్, కవర్డ్ షెడ్లు, శ్లాబ్లు, అప్రోచ్, సీసీ రోడ్లు, కల్వర్టులు, ప్లాట్ ఫామ్స్, కాంపౌండ్ వాల్స్, డ్రైన్స్, మరుగు దొడ్లు, బోర్వెల్స్, విద్యుత్, మంచినీటి పైప్ లెన్స్తో పాటు పరిపాలన భవనాలు, మీటింగ్ హాళ్లు, అదనపు అంతస్తులు, యార్డుల్లోని రైతు బజార్లకు కొత్త షెడ్లు, హమాలీలు, రైతులు విశ్రాంతి తీసుకునే షెడ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నారు. నాడు–నేడు పథకం కింద రూ.249.87 కోట్ల అంచనాతో మొత్తం 589 పనులను ప్రారంభించారు. గతేడాది జూలై 8న రైతు దినోత్సవం నాడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.60.22 కోట్ల విలువైన 204 పనులు పూర్తి కాగా, రూ.189.65 కోట్ల విలువైన మరో 385 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అత్యధికం గా కర్నూలు జిల్లాలో రూ.12.24 కోట్ల విలువైన 42 పనులు, వైఎస్సార్ జిల్లాలో 10.22 కోట్ల విలువైన 15 పనులు పూర్తయ్యాయి. వీటిని ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో మార్కెటింగ్ శాఖ ముందుకుసాగుతోంది. -
దేశంలోనే మేటిగా మన పీహెచ్సీలు
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూదడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగు పెట్టగానే.. కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు కలగాలి. అందుకు తగ్గట్టుగా ఉన్నత ప్రమాణాలు ఉండాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షల్లో అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఆ మాటలను క్షేత్ర స్థాయిలో ఆచరింపజేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. దీంతో మన రాష్ట్రంలోని వైద్య రంగానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) కార్యక్రమం కింద అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆస్పత్రులకు గుర్తింపు ఇస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అత్యధిక పీహెచ్సీలు ఎన్క్వాస్ గుర్తింపు పొందటం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. 320 పీహెచ్సీలకు.. రాష్ట్రంలో 1,145 పీహెచ్సీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 320 పీహెచ్సీలకు ఎన్క్వాస్ గుర్తింపు లభించటంతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. 191 పీహెచ్సీలతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 1,280 పీహెచ్సీలకు గుర్తింపు ఉండగా.. వీటిలో 25 శాతం ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. గుర్తింపు ప్రక్రియ ఇలా.. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రి (డీహెచ్)లకు ఎన్క్వాస్ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతుంటాయి. పీహెచ్సీల్లో 6 డిపార్ట్మెంట్లలో 1,600 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా, సీహెచ్సీ, డీహెచ్లలో 18 డిపార్ట్మెంట్లలో, 6,625 అంశాలను పరిశీలిస్తారు. సంబంధిత ఆస్పత్రికి ఎన్క్వాస్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి ప్రమాణాలన్నింటినీ పరిశీలించిన అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నొస్టిక్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు. నాడు–నేడుతో.. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.663 కోట్లతో 977 పీహెచ్సీలకు మరమ్మతులు, 148 పీహెచ్సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీల్లో నాడు–నేడు కింద మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద పీహెచ్సీల్లో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పన నేపథ్యంలోనే దేశంలోనే అత్యధిక పీహెచ్సీలకు ఎన్క్వాస్ గుర్తింపు కలిగిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలవగలిగింది. -
సరస్వతీ నమస్తుభ్యం!
కోవిడ్ మహమ్మారి సాగించిన ఆర్థిక విధ్వంసంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. సమస్త జీవన రంగాల్లోని ఏ పాయనూ అది వదిలిపెట్టలేదు. మెజారిటీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆక్స్ఫామ్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 శాతం మంది ప్రజలు నష్టపోయారు. వారిలో పేదవాళ్లు మరింత ఎక్కువ నష్టపోయారు. బాగా బలిసినవాళ్లు తెగ బలిశారు. దేశంలోని సూపర్ రిచ్ కుబేరుల సంపద కేవలం ఇరవై మాసాల్లో రెట్టింపయ్యింది. వీళ్లంతా అల్లావుద్దీన్లయితే కోవిడ్ వాళ్ల చేతుల్లో వండర్ ల్యాంప్గా మారింది. 2020 మార్చిలో ఈ నూరుగురు కుబేర పుత్రుల ఉమ్మడి సంపద విలువ 23 లక్షల కోట్లు. నవంబర్ 21 నాటికి అది 53 లక్షల కోట్లకు లాంగ్జంప్ చేసింది. దేశ జీడీపీలో ఇది రమారమి మూడో వంతు. ఆక్స్ఫామ్ లెక్క ప్రకారమే అదే సమయంలో దేశంలో 4.6 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 11 కోట్లమందికి పైగా నమోదయ్యారు. అంతకుముందు సంవ త్సరంలో పోలిస్తే ఇది 4 కోట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరుగుతుందట. సుప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ పరిణామాలపై ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. 1940ల నాటి దారుణమైన బెంగాల్ క్షామం రోజుల్లో నిరుపేదలను ఎవరూ పట్టించుకోలేదు. అట్లాగే ఇప్పటి కోవిడ్ పరిణామాల్లో కూడా అత్యంత నిరుపేదలు అతి దారుణంగా దెబ్బతిన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం, నేటి భారత ప్రభుత్వం నిరుపేదల విష యంలో ఒకేరకంగా వ్యవహరించాయన్నారు. తనతో మాట్లాడిన సందర్భంలో అమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారని సీఎన్బీసీ న్యూస్ యాంకర్ మిథాలీ ముఖర్జీ ఒక వ్యాసంలో వెల్లడించారు. మొదటి లాక్డౌన్ సమయంలో మండుటెండల్లో నడిరోడ్లపై నెత్తురోడుతూ కదిలిన కోట్లాది మాంసపు ముద్దల మహాప్రస్థాన దైన్యాన్ని ఈ దేశం స్వయంగా వీక్షించింది కూడా! ‘ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాకి వాలదు’ అనే సామెత ఉండేది. అదేవిధంగా ఏ సంక్షోభం ముంచుకొచ్చినా ఐశ్వర్యవంతుణ్ణి ఏమీ చేయలేదు. దరిద్ర నారాయణుడిని మాత్రం ఏ మహమ్మారీ వదిలిపెట్టదు. అతడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం లాగా వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో ప్రముఖమైనది విద్యారంగం. ఈ రంగంలో కూడా అతి ఎక్కువగా నష్టపోయినవారు పేదింటి బిడ్డలే. ఇప్పటికే మన విద్యావ్యవస్థలో ప్రమాణాల రీత్యా ధనిక – పేద అంతరం కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండేళ్లలో అంతరం మరింత విస్తరించింది. వసతులున్న పిల్లలు ఆన్లైన్ ద్వారా అంతో ఇంతో మేకప్ చేసుకోగలిగారు. ఏ ఆదరువూ లేని పిల్లలు చదువులకు దూరమై డ్రాపవుట్ అంచున నిలబడ్డారు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధు లుగా, సమాన వాటాదారులుగా ప్రకటించినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి? అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్యను అందివ్వలేకపోవడమే అందుకు కారణమని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పేదరికంపై విజయం సాధించ గలిగే ధనుర్బాణాలను విద్యారంగమే సమకూర్చుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. విద్యారంగం మీద జీడీపీలో కనీసం 6 శాతం ఖర్చుపెడితే తప్ప ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేమని జాతీయ విద్యావిధానంపై వెలువడిన కమిటీ రిపోర్టులన్నీ నొక్కి చెప్పాయి. ఆ లెక్కన గడిచిన బడ్జెట్లో కనీసం 10 లక్షల కోట్లయినా విద్యారంగం పద్దులో పెట్టాలి. కానీ కేంద్రం 99 వేల కోట్లను మాత్రమే కేటా యించింది. వాంఛిత కేటాయింపులో ఇది కేవలం పది శాతం. ఇందులో కూడా వాస్తవానికి ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే సవరించిన అంచనాలు రావాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చిన దగ్గర్నుంచీ విద్యారంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల కథాకమామీషు ఇదే మాదిరిగా ఉన్నది. తొలిరోజుల్లో విద్యాగంధం ఉన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రుల శ్రద్ధ వలన సహజంగానే ముందడుగు వేశారు. వీరికి తోడుగా బడి చదువుతోపాటు ట్యూషన్లు చెప్పించుకునే స్థోమత కలిగిన వాళ్లు మాత్రమే స్కూల్ ఫైనల్ గడప దాటేవాళ్లు. నిరక్షరాస్య కుటుంబాల్లోని పేద పిల్లలు మాత్రం ఆ గడపకు ఆవలనే డ్రాపవుట్లుగా మిగిలిపోయేవారు. ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ల తర్వాత ఈ సామాజిక దుర్నీతి మరింత క్రూరంగా తయారైంది. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు వెళ్లగలిగిన పిల్లలు ముందడుగు వేశారు. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా పాడుపెట్టారు. తొలిదశ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే నాటికే ఉమ్మడి రాష్ట్ర పాలనా పగ్గాలను తస్కరించిన చంద్రబాబు నాయకత్వంలో ఈ సామాజిక విధ్వంసం యథేచ్ఛగా సాగిపోయింది. పేద పిల్లలు వెళ్లగలిగే ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ బడులను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయలేదు. ఇదే సమయంలో ఐటీ విప్లవం ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనుక్కోలేకపోయిన యువతరం ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలమైంది. పేదవర్గాల్లోని ఒక తరం కలలు విద్యావ్యాపారం రథచక్రాల కింద నలిగిపోయాయి. పేదవర్గాల ప్రజలు నాణ్యమైన విద్యకు మూడు దశాబ్దాల పాటు దూరం కావడానికి కారణమైన బాధ్యుల్లో ఒకటో నెంబర్ ముద్దాయిగా చంద్రబాబునే నిలబెట్టవలసి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆయన విద్యారంగం పట్ల తన పాత విధానాలనే కొనసాగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించి అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా చెప్పాలంటే ఆయన విప్లవ శంఖం పూరించారు. విద్యార్జనలో పెరిగిన ధనిక – పేద అంతరాలు, సామాజిక– ఆర్థిక హోదాల ప్రాతిపదికపై పిల్లలు వేర్వేరు బడుల్లో చదవడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ దుష్పరిణామాలను పరిహరించి కుల మత ప్రాంత లింగ వివక్ష లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా పిల్లలంతా ఒక్కటిగా కలివిడిగా చదువుకునే ఒక ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి తయారు చేసుకున్నారు. వెంటనే దాన్ని దశల వారీగా అమలుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో మొదటిది – ‘అమ్మ ఒడి’ పిల్లల్ని స్కూలుకు/ కాలేజీకి పంపించే ప్రతి అర్హురాలైన తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్నది. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపించలేని దుఃస్థితి తొలగిపోవడం మొదటిది. రెండవది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం. అమ్మ చేతిలో డబ్బున్న కారణంగా పిల్లల చదువుకు సంబంధించిన కీలక నిర్ణయాధికారం ఆమెకే ఉంటుంది. సంస్కరణల్లో రెండో ముఖ్యాంశం 16 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమం. కేవలం టాయిలెట్ వసతి లేని కారణంగా ఆడపిల్లలు చదువులు మానేసే దౌర్భాగ్య పరిస్థితి మొన్నటిదాకా మన విద్యావ్యవస్థలో రాజ్యమేలింది. పెచ్చు లూడుతున్న సీలింగ్, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గది గోడలు, విరిగిన కుర్చీలు – బెంచీలు, పగుళ్లుబారిన ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ లేక పశువులకు ఆవాసంగా మారిన ఆవరణ, పిచ్చిమొక్కలతో విషపురుగుల విహారం, శిథిలాలయాలకు రాలేక సెలవులతో నెట్టుకొచ్చే పంతుళ్లూ... ఇది మొన్నటివరకు ప్రభుత్వ బడి దృశ్యం. ఇప్పుడు కళ్లతో చూస్తే తప్ప నమ్మలేనంతగా ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే 16 వేల స్కూళ్లు కార్పొరేట్కు దీటుగా సింగారించు కున్నాయి. ఇప్పుడు పేద పిల్లల్నే కాదు స్థితిమంతుల పిల్లల్ని కూడా అవి రా రమ్మని పిలుస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో లభిస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమం సులభంగా అర్థమయ్యే విధంగా రెండు భాషల్లో ఉండే పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికాహారాన్ని నిత్యం 40 లక్షలమందికి అందజేస్తున్నారు. నాణ్యమైన సీబీఎస్ మూల్యాంకన విధానాన్ని కూడా దశల వారీగా ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల అధ్యయనం తర్వాత ప్రకటించిన ‘నూతన విద్యావిధానం–2020’లో పొందుపర్చిన అంశాల్లో అనేకం ఏడాది ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ప్రకటించడం ఒక విశేషం. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ‘నీతి ఆయోగ్’ ప్రశంసించింది. పేద కుటుంబాల జీవితాల్లో గేమ్ ఛేంజర్ లాంటి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచే అమలుచేయడం ప్రారంభించారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి తొలిదశలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం నిర్ణయం వెనుక దృఢంగా నిలవడంతో రాజకీయ ప్రతిపక్షాలు జడుసుకొని నోరు మూసు కున్నాయే తప్ప కుట్రలను మాత్రం ఆపలేదు. ప్రభుత్వం చేపట్టిన పలురకాల చర్యల వలన స్థోమత కలిగిన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. అన్నివర్గాల పిల్లలూ కలిసి మెలిసి చదువుకోవడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. దేశ సమగ్రత బలపడుతుంది. పేదరిక నిర్మూలనకు, కులమత తారతమ్యాలను అంతం చేయడానికి ఉపయోగపడే ఈ నాణ్యమైన విద్యాయజ్ఞాన్ని పూర్తిచేయడం అంత సులభసాధ్యమైనదేమీ కాదు. యాగ భంగానికి మారీచ సుబాహులు పొంచివున్నారు. కుల మతాలకు అతీతంగా పేదవర్గాల ప్రజలందరూ యాజ్ఞికునికి అండగా నిలబడవలసిన తరుణమిది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంగ్లిషు మీడియాన్ని ప్రకటించడమే గాక సర్కారు బళ్ల రూపురేఖల్ని మార్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఇక స్పందించవలసినది కేంద్ర ప్రభుత్వమే! విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థిక వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయి. నూతన విద్యావిధాన ప్రకటన అభిలషించినట్లుగా 6 శాతం జీడీపీని విద్యా పద్దు కింద ఈ బడ్జెట్లో కేటాయిస్తారో లేదో చూడాలి. విద్యారంగానికి ఆయా దేశాలు చేస్తున్న కేటాయింపుల జాబితాను చూస్తే బాధ కలుగుతుంది. 198 దేశాలున్న జాబితాలో మనది 144వ స్థానం. ప్రపంచం మొత్తంలో ఉన్న పేదల్లో సగంమంది మన దేశంలోనే ఉన్నారు. వీరిని పేదరికం నుంచి బయటపడేసే బ్రహ్మాస్త్రం నాణ్యమైన విద్య. అందువల్ల అన్ని దేశాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయవలసిన అవసరం మన దేశంలో ఉన్నది. కనీసం ఈ రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న రాష్ట్రాలకైనా ప్రోత్సాహకాలను ప్రకటించడం అత్యవసరం. ఈ దేశ ప్రత్యేక అవసరాల దృష్ట్యా, కోవిడ్ మహమ్మారి కలిగించిన విపరి ణామాల దృష్ట్యా ఈ బడ్జెట్లో విద్యారంగానికి పెద్దయెత్తున కేటాయింపులుంటాయని ఆశిద్దాం. ఈ ఆశ నెరవేరినట్లయితే ఈ దేశ పేదింటి బిడ్డలు ప్రభుత్వాన్ని సరస్వతీ దేవిగా భావించి, పూజిస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రేపటి నుంచి విద్యా రంగంపై ఓరియెంటేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు–నేడు, జాతీయ విద్యా విధానం అమలు, స్కూళ్ల మ్యాపింగ్ వంటి అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజుకు కొన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయం ఐదో బ్లాక్లో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలను అధికారులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓరియెంటేషన్ కార్యక్రమానికి సంబంధిత హెచ్వోడీలు, ఇతర ఉన్నతాధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం–2020తోపాటు ఇతర సమాచారానికి సంబంధించి తెలుగు కాపీలు 200, ఇంగ్లిష్ కాపీలు 200 ప్రజాప్రతినిధులందరి కోసం సమకూర్చాలని కోరారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్యాశాఖ)కి లేఖ రాసింది. తేదీలు, జిల్లాల వారీగా ఓరియెంటేషన్ కార్యక్రమం ఇలా.. జనవరి 27: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జనవరి 28: పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జనవరి 29: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం -
స్కూళ్లు కిటకిట..రెండేళ్లలో ఏకంగా 13 లక్షల మంది..
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. గత రెండేళ్లలో ఏకంగా 13లక్షల మంది విద్యార్థుల అడ్మిషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. విద్యారంగానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాల ఫలితంగానే అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈ చేరికలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు కునారిల్లి.. అడ్మిషన్లు తగ్గిపోయి, డ్రాపౌట్లు పెరిగిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు చేరికల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పాఠశాలలకు సంబంధించి అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలు చేపట్టగా.. ఉన్నత విద్యకు సంబంధించి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనతో పాటు నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేయిస్తున్నారు. అకడమిక్ పరంగా సంస్కరణలు ఇవేకాక.. సిలబస్, పాఠ్య ప్రణాళికల సంస్కరణలతో అకడమిక్ పరంగా కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు ప్రధాన లక్ష్యంగా పాఠశాలల్లో అనేక వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. అలాగే, కళాశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు డిగ్రీ హానర్స్ కోర్సులు, ఒక ఏడాదిపాటు ఇంటర్న్షిప్, మైక్రోసాఫ్ట్ తదితర పేరెన్నికగన్న సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగిస్తున్నారు. వీటన్నింటి ప్రభావం కారణంగా రాష్ట్రంలో ప్రతి తల్లి, తండ్రీ తమ పిల్లలను చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో పాఠశాలలకు పంపిస్తున్నారు. గతంలో తమతో పాటు పనులకు పిల్లలను తీసుకువెళ్లే నిరుపేద కుటుంబాలు సైతం ఇప్పుడు తమ పిల్లలను స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నాయి. ఫలితంగానే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. చివరికి ‘సీట్లు లేవు’ అని అనేక పాఠశాలలకు బోర్డులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. రెండేళ్లలో ఎంతో మార్పు ఇక రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో పాఠశాలల అడ్మిషన్లలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల విడుదలైన 2020–21 సామాజిక–ఆర్థిక (సోషియో–ఎకనమిక్) సర్వే గణాంకాల ప్రకారం.. ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో (2018–19లో) రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య 70,43,071 కాగా.. 2020–21 నాటికి ఆ సంఖ్య 83,76,020కి చేరింది. అంటే రెండేళ్ల కాలంలోనే 13,32,949 మంది పిల్లల చేరికలు పెరిగాయి. ► విచిత్రమేమంటే 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతలా చేరికలు ఏనాడూ లేవు. ► ఇక 2000–01 నుంచి చూసుకుంటే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం చేరికల సంఖ్య 75,01,162 మాత్రమే. ► రాష్ట్రం విడిపోయే ముందు ఏడాది 2013–14లో 73,37,267 మాత్రమే విద్యార్థుల చేరికలు ఉన్నాయి. ► 2014–15లో ఇది 72,32,771గా నివేదికల్లో పొందుపరిచారు. ఆ తరువాత నుంచి రాష్ట్రంలో చేరికలు 70 లక్షలలోపు మాత్రమే ఉన్నాయి. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఒక్కసారిగా పాఠశాల విద్యలో మార్పులు చోటుచేసుకుని చేరికలు పెరిగాయి. -
రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం..
-
రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం..
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ కింద పోకర్ణ గ్రూప్ రూ.కోటి విరాళంగా ఇచ్చింది. విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్చంద్ జైన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కనెక్ట్ టు ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
Nadu Nedu: ఏపీలో విద్య భేష్
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు చాలా బాగున్నాయని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), ఇతర రాష్ట్రాల విద్యా రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో పాఠశాల విద్యలో అద్భుతమైన ఫలితాలు సుసాధ్యమని చెప్పారు. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్కుపై ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల విద్యా విభాగాల ప్రతినిధుల రెండు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమలవుతున్న అమ్మ ఒడితో డ్రాపవుట్లు పూర్తిగా తగ్గి, చేరికలు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా వేల కోట్ల ఖర్చుతో పాఠశాలల రూపురేఖలనే మార్చివేసేలా నాడు – నేడు కార్యక్రమాలు అమలు చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సదుపాయాలు సమకూర్చడం గొప్ప విషయమని మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ) ప్రతినిధులు చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి చేయడం, ఆంగ్ల మాధ్యమం, కరిక్యులమ్ సంస్కరణలతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, పేద వర్గాల పిల్లల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్సీఈఆర్టీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి రాకముందే రాష్ట్రంలో పునాది విద్యను బలోపేతం చేయడం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్)లో దేశంలోనే ఏపీ ముందంజలో నిలిచిందన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి జ్ఞాపికలను అందించారు. -
సంస్కరణలకు ఆది గురువు ఏపీ.. నీతి ఆయోగ్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: విద్యా రంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది. విద్యారంగం పురోభివృద్ధికి 11 రకాల సూచనలు చేసిన నీతి ఆయోగ్ ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఆదర్శవంతమని ప్రశంసించింది. హిమాచల్ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్లో అమలవుతున్న కొన్ని కార్యక్రమాలను కూడా నీతి ఆయోగ్ తన సూచనలకు జోడించింది. సుస్థిర చర్యల ద్వారా మానవ వనరుల అభివృద్ధి (ఎస్ఏటీహెచ్–ఎడ్యుకేషన్) కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ను రోల్ మోడల్గా ఎంపిక చేసింది. తద్వారా విద్యా వ్యవస్థలో 20 శాతం మేర మెరుగుదల కనిపించింది. అయితే ఆ రాష్ట్రాల కన్నా మెరుగైన రీతిలో ఏపీలో విప్లవాత్మక సంస్కరణలతో పాఠశాల విద్య పటిష్టతకు బాటలు వేయడాన్ని నీతి ఆయోగ్ గుర్తించింది. ముందుగానే ఏపీలో అమలు విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు ప్రాథమిక, పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విద్య అందుబాటులో ఉండాలని, 96 శాతం మందికి అందాలని నీతి ఆయోగ్ పేర్కొంది. అభ్యాస ఫలితాల ఆధారిత ఫ్రేమ్వర్క్, విద్యా సంస్కరణలు, మానవ వనరులు, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం ముఖ్యమని సూచించింది. మూల్యాంకన ప్రక్రియను పటిష్టం చేయడం, అభ్యసన అంతరాలను తగ్గించి పిల్లలందరినీ ‘ఏ’ గ్రేడ్ స్థాయికి తీసుకురావడం లాంటి సూచనలు చేసింది. అంగన్వాడీలలో ఆటపాటలు, సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం, అక్షరాస్యత, సంఖ్యల పరిజ్ఞానం పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొంది. అయితే అంతకు ముందు నుంచే రాష్ట్రంలో ఈ కార్యక్రమాల అమలుకు సీఎం జగన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇటీవల ప్రధాని ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన విద్యా నివేదికలో సైతం ఏపీ అన్ని రాష్ట్లాలకన్నా ముందంజలో నిలిచిందని అభినందించిన విషయం తెలిసిందే. పటిష్టంగా పునాది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తగిన విధంగా ఉండడం లేదని నేషనల్ అచీవ్మెంట్ సర్వే, అసర్ నివేదికలు స్పష్టం చేసిన నేపథ్యంలో పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విద్య పటిష్టానికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అందించేలా పీపీ–1, పీపీ–2లను ఏర్పాటు చేయడంతోపాటు అందుబాటులో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానించారు. రాష్ట్రంలో 55 వేల వరకు అంగన్వాడీ కేంద్రాలుండగా మన అంగన్వాడీ, నాడు – నేడు కార్యక్రమం ద్వారా రూ.4,442 కోట్లతో అభివృద్ధికి చర్యలు చేపట్టారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో బోధించేలా ఎస్సీఈఆర్టీ ద్వారా ప్రత్యేక సిలబస్తో సచిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. ఫౌండేషన్, పాఠశాల విద్యను పటిష్టం చేయడంలో భాగంగా ఆరంచెల విధానానికి శ్రీకారం చుట్టారు. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ప్రాథమిక ప్లస్, పూర్వ ఉన్నత, ఉన్నత, ఉన్నత ప్లస్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నారు. చదువులకు ప్రోత్సాహం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు లాంటి కార్యక్రమాలను చేపట్టింది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఏటా రూ.15 వేల చొప్పున నేరుగా జమ చేస్తున్నారు. మనబడి నాడు – నేడు ద్వారా రూ.16 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి 57 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మారుస్తున్నారు. జగనన్న గోరుముద్ద రూ.1200కోట్లను,విద్యాకానుక కింద రూ.760 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. అకడమిక్ సంస్కరణలు అకడమిక్ సంస్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు దేశ విదేశాలకు చెందిన నిపుణులతో చర్చించి 1 – 7 తరగతులకు పాఠ్యపుస్తకాల సిలబస్ను అభివృద్ధి చేసింది. ద్విభాషా పాఠ్య పుస్తకాలను మిర్రర్ ఇమేజ్తో పంపిణీ చేసింది. సీబీఎస్ఈ విధానాన్ని 2022–23 నుంచి రాష్ట్రంలో అమలు చేసేలా ఏర్పాట్లు చేసింది. విద్యా ప్రమాణాలు పెంచడం కోసం దేశంలోనే తొలిసారిగా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను ఏర్పాటు చేసింది. నూతన విద్యా విధానం, నీతి ఆయోగ్ సూచనలకు ముందుగానే పాఠశాల విద్యలో పలు సంస్కరణలను సీఎం జగన్ చేపట్టారు. -
దేశానికే ఆదర్శం నాడు–నేడు
ఏఎన్యూ: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నూతన శకానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోటి రూపాయాలతో ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్, రూ.ఏడు కోట్లతో నిర్మించిన క్రీడా వసతి గృహం, అతిథి గృహాన్ని గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణలు ప్రారంభించారని చెప్పారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. భావితరాల ప్రయోజనాల పరిరక్షణకు ముఖ్యమంత్రి దార్శనికతతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అంకితభావంతో అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 16 మెడికల్ కాలేజీల ఏర్పాటు చరిత్రాత్మకమని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ఆచార్య పి.రాజశేఖర్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ సలహాదారు చల్లా మధుసూధన్రెడ్డి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్రెడ్డి, ఏఎన్యూ రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ, ప్రిన్సిపాల్ ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నిష్ట’ మనమే ఫస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వేళ విద్యార్థులకు బోధన కుంటుపడకుండా జాగ్రత్తలతోపాటు ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ‘నిష్ట’ కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలిచిందని కేంద్ర విద్యా శాఖ ప్రశంసించింది. డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనుసరించిన పద్ధతులను కేంద్రం అభినందించింది. డిజిటల్ బోధనకు సంబంధించిన 18 అంశాలనూ అమలు చేసిందని పేర్కొంది. నూతన అంశాలను అన్వయిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించేలా ఆన్లైన్ శిక్షణతో ఏపీలో పలు డిజిటల్ కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడులో భాగంగా లాంగ్వేజ్ లాబ్లు ఏర్పాటుతోపాటు 120 గంటలపాటు ఏకధాటిన ప్రసారమయ్యేలా ఆరు సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ పెన్డ్రైవ్లో 1,610 వీడియోలను పొందుపరిచారని తెలిపింది. వెయ్యి ఆదర్శ గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు లైబ్రరీల డిజిటలైజేషన్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిజిటల్ ఎడ్యుకేషన్పై చేపట్టిన కార్యక్రమాలను విశ్లేషిస్తూ ఇండియన్ డిజిటల్ ఎడ్యుకేషన్ నివేదికను కేంద్రం విడుదల చేసింది. నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► నిష్ట.. ఆన్లైన్ కోర్సులు: కేంద్ర ప్రభుత్వం ‘నిష్ట’ ఆన్లైన్ ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తొలుత ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించింది. ఇందులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 18 మాడ్యూళ్లలో 90 రోజులపాటు ‘నిష్ట’ ఆన్లైన్ కోర్సులు నిర్వహించారు. 1,03,897 మంది ఉపాధ్యాయులు ప్రైమరీ స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు. 97,894 మంది అన్ని మాడ్యూళ్లు పూర్తిచేశారు. వీరందరికీ దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా ధ్రువపత్రాలు అందజేశారు. ► విద్యావారధి... టీవీ పాఠాలు: ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా నిపుణులతో బోధన అందించారు. పాఠశాలల మూసివేత సమయంలో విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలగకుండా 2020 జూన్ 10 నుంచి 2021 జనవరి 31 వరకు బోధన కొనసాగింది. ► జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు శిక్షణ: కరోనా మహమ్మారి సమయంలో ఎలిమెంటరీ, సెకండరీ స్కూళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్త్రృత అవగాహన కల్పిస్తూ వాల్పోస్టర్లు ప్రచురించారు. ఉయ్ లవ్ రీడింగ్ వర్చువల్ ఓరియెంటేషన్ కార్యక్రమం ద్వారా భాగస్వాములకు అవగాహన కల్పించింది. దీక్షతో లెర్నింగ్ సెషన్లు ఆంధ్రప్రదేశ్లో 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై వరకు ‘దీక్ష’లో భాగంగా 12,14,22,509 లెర్నింగ్ సెషన్లు పూర్తయ్యాయి. 1,46,324 ఎలిమెంటరీ లెర్నింగ్ సెషన్లు పూర్తి చేశారు. ► పాఠశాలలకు దూరమైన చిన్నారులకు ఇంటివద్దే సేవలందిస్తున్న ఫిజియో థెరఫిస్ట్ల పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు డాష్బోర్డ్ ద్వారా తెలుసుకుంది. ► టీవీ ద్వారా బోధన అర్థం చేసుకునేందుకు విద్యార్థులకు వర్క్బుక్స్ అందజేసింది. ► తొమ్మిది, పదో తరగతి విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులను ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ–కంటెంట్ను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందజేశారు. ► విద్యార్థులకు సాంకేతిక సదుపాయాలపై సర్వే చేపట్టారు. ► కఠినమైన పాఠ్యాంశాలకు సంబంధించి జూమ్ తరగతులు నిర్వహించారు. ► పాఠశాలు పునఃప్రారంభం కాగానే పాఠశాలల్లో విద్యార్థులను ట్రాక్ చేసేందుకు యాప్ ద్వారా పర్యవేక్షించారు. ► కరోనా సమయంలో వర్చువల్ విధానంలో వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహించారు. ► ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ బోధనపై డైట్ ఉపాధ్యాయులతో సర్వే చేశారు. ► మార్చి 23, 2021 నుంచి ఏప్రిల్ 4, 2021 వరకూ పాఠశాలలకు దూరమైన విద్యార్థులను గుర్తించేందుకు ‘మన బడికి పోదాం మొబైల్ యాప్’ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. బడికి దూరమైన వేల మంది విద్యార్థులు, వలస కార్మికుల పిల్లలను ఇలా గుర్తించి తిరిగి పాఠశాలలకు రప్పించగలిగారు. ► రాజ్యాంగ విలువలను మిళితం చేస్తూ భాష, గణితంలో నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు. -
చిత్తూరు జిల్లాలో రూ.50 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల నాడు నేడు
-
AP: బతుకులు బాగుపడుతున్నాయ్..‘ఇండియా టుడే’ సర్వే
సాక్షి, అమరావతి: గ్రామాల్లోనే పారదర్శకంగా పౌర సేవలన్నీ అందుబాటులోకి తేవడం.. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలవడం.. విద్య, వైద్య రంగాలను సంస్కరించి నాడు – నేడు ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం.. అభివృద్ధి పథంలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయడం.. వివక్ష లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సమగ్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించిందని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే’ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. గతేడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరడం గమనార్హం. 2021 ఏడాదికిగానూ ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ సంస్థ తాజాగా ప్రకటించింది. 2018లో పదో స్థానం నుంచి.. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తోందని ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా 2018లో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల జాబితాలో ఏపీ పదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఇక 2020లో ఏడో స్థానానికి చేరుకున్న మన రాష్ట్రం తాజాగా ఆరో స్థానం సాధించడం విశేషం. 2019 నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందన్నది ‘ఇండియా టుడే’ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. జీవన ప్రమాణాలకు కొలమానం ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు కొలబద్ధ లాంటి సమ్మిళత అభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సమ్మిళిత అభివృద్ధి ప్రధాన సూచిక అని ఇండియా టుడే సర్వే పేర్కొంది. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారానే సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయగలమన్న నిపుణుల అభిప్రాయాలను ఉదహరించింది. ఎలా సాధ్యమైందంటే... రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయడం, ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ, రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనుల కల్పన, పలు పథకాల ద్వారా చిరు వ్యాపారులు, వివిధ వృత్తుల వారికి ప్రభుత్వం అండగా నిలవడం ద్వారా ప్రజలు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతో రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెద్ద ఎత్తున పెరిగింది. రూ.వెయ్యికు మించిన వైద్య చికిత్సలు అన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడం, పథకం వర్తించేందుకు వార్షిక ఆదాయ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా బీమా రక్షణ కల్పించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, ఆరోగ్య రక్షణ, విద్యాభివృద్ధి చర్యలతో ప్రజల జీవన ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయంగా మెరుగుపరిచింది. నిపుణులతో సమగ్ర సర్వే రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వేకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. ఇండియా టుడే సంస్థకు చెందిన ‘మార్కెటింగ్– డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)’ ద్వారా 2003 నుంచి ఏటా ఈ సర్వేను నిర్వహిస్తోంది. 2021కుగాను ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టారు. సర్వే బృందంలో ప్రముఖ విధాన నిర్ణేతలు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, వివిధ పరిశోధన సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నట్లు ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. రాష్ట్రాల పనితీరును మదింపు చేసేందుకు మొత్తం 123 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేపట్టినట్లు వెల్లడించింది. కీలక అంశాలే ప్రామాణికం.. సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించేందుకు పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు తీరు, బ్యాంకు ఖాతాలున్న పేద కుటుంబాలు, వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు, ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్న కుటుంబాలు, ఆరోగ్య బీమా పథకాల పరిధిలోకి వచ్చిన కుటుంబాలు, రేషన్ పంపిణీతో లబ్ధి పొందుతున్న కుటుంబాలు, కుటుంబ సగటు వేతన ఆదాయం, బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ పనితీరు, 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో పాఠశాలలకు వెళ్తున్న వారి శాతం.. ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందంది. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ‘శాచ్యురేషన్ విధానం’లో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందని సర్వే నివేదిక విశ్లేషించింది. -
బాగుందే.. బాగుందే.. మా బడి బాగుందే
-
Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం
సాక్షి, అమరావతి: రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సూచించారు. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానంపై సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. టీచర్లకు అత్యుత్తమ శిక్షణ టీచర్లకు శిక్షణ ఇచ్చే డైట్ సంస్థల సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని, ఈ కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో సమస్యలపై కాల్సెంటర్ పాఠశాలల్లో సదుపాయాలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్ చేసేలా ఒక నంబర్ అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రతి స్కూల్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్ను ప్రదర్శించాలని సూచించారు. ఈ కాల్సెంటర్ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంగ్లీషుపై ప్రత్యేక శ్రద్ధ ఇంగ్లీషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా పాఠ్య ప్రణాళికపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇప్పటికే ఇచ్చిన డిక్షనరీలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి రోజూ కనీసం మూడు కొత్త పదాలు నేర్పించి వాటిని సాధన చేసేలా పిల్లలకు మెళకువలు నేర్పాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్వహణ ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా కోరుకుంటామో విద్యార్థులు చదివే పాఠశాలల్లో కూడా అలాగే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. నాణ్యమైన సదుపాయాలు అందరి లక్ష్యం కావాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్లో ట్యాప్లు పనిచేయక, నీళ్లు రాక దుర్గంధంతో ఎవరూ వినియోగించని పరిస్థితులు గతంలో చూశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అలాంటి దుస్థితిని నాడు – నేడు ద్వారా సమూలంగా మార్చామని ముఖ్యమంత్రి తెలిపారు. క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యారంగంపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెడ్మాస్టర్లే కుటుంబ పెద్దలు పాఠశాలలకు హెడ్ మాస్టర్లే కుటుంబ పెద్దలని సీఎం జగన్ పేర్కొన్నారు. మెరుగైన రీతిలో బోధన దగ్గర నుంచి నాణ్యమైన భోజనం, సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహిస్తూ అంతా సవ్యంగా ఉండేలా హెడ్మాస్టర్లను చైతన్యం చేయాలని సూచించారు. వీటిపై ప్రతిరోజూ పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. గోరుముద్దపై ఫీడ్ బ్యాక్ గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలు, తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య తలెత్తినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని, స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్ లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, ఇతరులకు తెలియచేయడం లాంటి కాన్సెప్ట్ను పిల్లలకు నేర్పాలని అధికారులకు సూచించారు. 1,092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ సీబీఎస్ఈ అఫిలియేషన్పై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 1,092 స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అఫిలియేషన్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఒకే ఏడాది 1092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఇవ్వడం రికార్డని చెప్పారు. ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదో తరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. అంతర్జాతీయంగా 24 వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉందని వివరించారు. మూడు దశలుగా మూడేళ్లలో... శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ ప్లస్ స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లపై సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందచేశారు. 2021–22 నుంచి 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడు దశలుగా నూతన విద్యా విధానం పూర్తిగా అమలు కానుంది. ఇందులో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ (అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేస్తారు. తొలిదశ కింద ఈ విద్యా సంవత్సరంలో 2,663 స్కూళ్లను విలీనం చేసినట్లు అధికారులు తెలిపారు. 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యా విధానాన్ని అనుసరించి విలీనమైనట్లు చెప్పారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనురాధ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (ఎండీఎం అండ్ శానిటేషన్) బి.ఎం.దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు, ఏపీఆర్ఈఐఎస్ సెక్రటరీ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. ఎయిడెడ్పై బలవంతం లేదు ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని చెప్పారు. ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చన్నారు. విలీనం చేస్తే వారి పేర్లు కొనసాగిస్తామన్నారు. తొలుత విలీనానికి అంగీకరించిన వారు నిర్ణయం మార్చుకుని తామే నిర్వహించుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని, అపోహలకు గురి కావద్దని, ఇందులో రాజకీయాలు తగవని సూచించారు. -
బాబుపై మండిపడుతున్న ఎయిడెడ్ అసోసియేషన్
-
‘ఎయిడెడ్’ అప్పగింత స్వచ్ఛందమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వాల నిర్వాకం కారణంగా నిర్వీర్యమైన ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు అత్యధికుల నుంచి మద్దతు లభిస్తోంది. వాస్తవానికి అత్యధిక శాతం సంస్థలు పూర్తిగా అధ్వాన ప్రమాణాలతో కునారిల్లాయి. వీటిలో చదివే విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవు. టీచర్లు, అధ్యాపకులు లేక సరైన బోధన కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగించే విద్యా సంస్థలను ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నది లక్ష్యం. అయితే తెలుగుదేశం, కొన్ని విపక్ష పార్టీలు ఈ విషయాన్ని వక్రీకరిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను రెచ్చగొడుతుండటం వెనుక వారి రాజకీయ స్వార్థమే తప్ప మరేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిపుణుల కమిటీ నివేదిక మేరకే.. ► ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఎక్కడా ఏకపక్షంగా ముందుకు వెళ్లలేదు. ప్రభుత్వం ఈ విద్యా సంస్థలపై అధ్యయనానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ రత్నకుమారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ► ప్రొఫెసర్ డబ్ల్యూ రాజేంద్ర, ప్రొఫెసర్ గొల్ల జ్ఞానమణి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య, ఇంటర్ విద్య, కాలేజీ విద్య కమిషనర్లను సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. ► ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పెద్ద ఎత్తున కొత్త కోర్సులతో అందుబాటులోకి వచ్చినందున ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా తగ్గిపోయాయి. 400కు పైగా ఎయిడెడ్ స్కూళ్లలో ఒక్క విద్యార్థీ లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతోంది. ► ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏటా రూ.1,226.01 కోట్లు వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను కొనసాగించనవసరం లేదని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ సూచనల మేరకు ప్రభుత్వం అన్ని వివరాలతో సమగ్రంగా ఒక జీవో జారీ చేసింది. ఇలా చేయడం ఏ విధంగా తప్పవుతుంది? ► ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్నందున నిబంధనల మేరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. ఆయా సంస్థలను దాతలు ఏ లక్ష్యం మేరకు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం కోసమే సంస్థల ఆస్తులను వినియోగించాలి. ► నిబంధనల మేరకు నడపలేకపోతే తమ సంస్థ కమిటీ అభీష్టం మేరకు సంస్థలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించవచ్చు. లేదా సంస్థలోని ఎయిడెడ్ సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించి, పూర్తి స్థాయి ప్రయివేటు విద్యా సంస్థగా కొనసాగవచ్చు. లేదా ప్రభుత్వ నిబంధనల మేరకు యధాతథంగా కొనసాగవచ్చు. విద్యా సంస్థలు, అధ్యాపకుల అంగీకారం ► రాష్ట్రంలో 2,249 ఎయిడెడ్ విద్యా సంస్థలుండగా అందులో 1,446 సంస్థలు సిబ్బందిని అప్పగించేందుకు అంగీకరించాయి. 101 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వ పరిధిలో చేర్చేందుకు సుముఖత వ్యక్తపరిచాయి. 702 సంస్థలు అంగీకారం చెప్పకుండా యధాతథంగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నాయి. ► సిబ్బంది కూడా ప్రభుత్వంలో కలవడం ద్వారా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమకు అన్ని సదుపాయాలు అమలవుతాయని విలీనానికి ముందుకు వచ్చారు. ► విలీనానికి ఆప్షన్లు ఇచ్చిన సంస్థలు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తే దానికీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ► ఎయిడెడ్ సంస్థలు, సిబ్బంది విలీన ప్రక్రియలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు నుంచి పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఆయా సంస్థలకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను మ్యాపింగ్ చేసి వారిని అందులో చేర్చేలా ప్రతి స్కూలుకూ ఇన్చార్జ్లను నియమించింది. ► ఒకవేళ నిర్ణీత దూరంలో ప్రభుత్వ స్కూలు అందుబాటులో లేకుంటే ఆ ఎయిడెడ్ స్కూలు భవనంలోనే ప్రభుత్వ పరంగా పాఠశాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు అవకాశం లేని చోట భవనాలను అద్దెకు తీసుకొని పాఠశాల నెలకొల్పేలా ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు విద్యార్థుల చేరికలూ సాఫీగా సాగేలా చేశారు. తల్లిదండ్రులను సంప్రదించి వారికి నచ్చిన స్కూలులో పిల్లలను చేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫీజుల భారం లేనే లేదు ► ఎయిడెడ్ విద్యా సంస్థలు, సిబ్బంది ప్రభుత్వంలో విలీనంతో ఫీజులు పెరుగుతాయని తెలుగుదేశం, ఇతర పార్టీలు చేస్తున్న వాదన కేవలం దుష్ప్రచారమే. ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలుగా కొనసాగినా, అవి ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు వీలులేదు. ► పలు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఎయిడెడ్ సెక్షన్లతో పాటు అన్ ఎయిడెడ్ సెక్షన్లు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అన్ ఎయిడెడ్ సెక్షన్ల కోర్సుల ఫీజులను ప్రైవేటు విద్యా సంస్థలకు మాదిరిగానే రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్ణయిస్తుంది. ► ప్రస్తుతం 2020–21 నుంచి 2022–23 వరకు ఫీజులు ఖరారయ్యాయి. ఈ ఫీజులకు మించి ఏ విద్యా సంస్థ కూడా అదనంగా వసూలు చేయడానికి వీల్లేదు. ఈ ఫీజుల భారం కూడా విద్యార్థులపై పడకుండా ప్రభుత్వమే వాటిని జగనన్న విద్యాదీవెన కింద పూర్తిగా రీయింబర్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజుల భారం అనే ప్రసక్తే ఎక్కడా ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ► వాస్తవానికి ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాటిని నిర్వీర్యం చేసింది చంద్రబాబునాయుడే. ఈ విద్యా సంస్థల్లో ఎలాంటి నియామకాలూ చేపట్టడానికి వీల్లేకుండా ఖాళీల భర్తీని తిరస్కరిస్తూ 1999 డిసెంబర్ 17వ తేదీన ఆయన ఉత్తర్వులు జారీ చేయించారు. ఆ తర్వాత 2004, 2017లోనూ అవే ఆదేశాలు జారీ చేయించారు. ఇది చంద్రబాబు నిర్వాకమే ఎయిడెడ్ వ్యవస్థ కుప్పకూలడానికి గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం. నియామకాలు నిలిపివేయించారు. ఇతర సదుపాయాలకు ఇచ్చే నిధులను ఆపేశారు. తనకు సంబంధించిన నారాయణ తదితర కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా ఎయిడెడ్లో టీచర్లు లేక విద్యార్థుల చేరికలూ తగ్గిపోయాయి. – శివశంకర్, విద్యావేత్త ఎక్కడ బలవంతం ఉంది? ప్రభుత్వం మా విద్యా సంస్థల విలీనానికి ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉన్నత ప్రమాణాలతో కొనసాగిస్తామనుకుంటే మీరే నిర్వహించుకోండి.. లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తే అభివృద్ధి చేసి ఉత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తామని చెబుతోంది. ఇందులో ఎక్కడ బలవంతం ఉంది? మేమే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాం. యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చినవే విలీనం అవుతున్నాయి. సిబ్బందిని అప్పగించినా విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ఆ ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయం బాగుండబట్టే సిబ్బందంతా ఆప్షన్లు ఇచ్చారు. – రత్నకుమార్, రాష్ట్ర ఎయిడెడ్ విద్యా సంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు విద్యార్థులకు ఎంతో మేలు ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఎయిడెడ్లో సరైన బోధన చేసేందుకు తగినంత సిబ్బంది లేరు. ప్రభుత్వ సంస్థల్లో మెరుగైన బోధన జరుగుతోంది కనుక విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎయిడెడ్ అధ్యాపకులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వంలో చేరడం ద్వారా ఆ సమస్యలు తీరుతాయి. ప్రభుత్వ విద్యా సంస్థలూ మరింత బలోపేతమై విద్యార్థులకు మంచి విద్య అందుతుంది. – త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు -
వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్ విధానం అమలు
తెనాలి టౌన్: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తెలిపారు. తెనాలి మండలం కొలకలూరులోని జెడ్పీ హైస్కూల్ను పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బిరాజశేఖర్, కమిషనర్ వి.చినవీరభద్రుడు, అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో చేపట్టిన నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించింది. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పడమే ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు. సిలబస్ పూర్తి చేయడం ముఖ్యం కాదని, విద్యార్థులకు చదవడం, రాయడం, అర్థమయ్యేలా బోధించడం ముఖ్యమన్నారు. జనవరి 5వ తేదీన తిరిగి పాఠశాలకు వస్తామని, అప్పటికల్లా విద్యార్థులంతా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో రాసి, చదవగలిగేలా చూడాలన్నారు. వీరి వెంట స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మురళి, సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.సెల్వి, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, సమగ్ర శిక్షా ఏపీసీ ఎం.వెంకటప్పయ్య, డీవైఈవె కె.నారాయణరావు ఉన్నారు. -
‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’
-
‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’
అమరావతి: దేవాలయశాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల భూములు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులను నియమిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి కూడా నాడు-నేడు విధానం రూపొందించామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అదే విధంగా ప్రతి దేవాలయంలోను గోశాలలను ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే.. మా ప్రభుత్వం నిర్మిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే 9 కొత్త దేవాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీం ద్వారా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
CM YS Jagan: మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యా రంగంలో మనబడి నాడు–నేడు, ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమానికి కూడా పెద్దపీట వేయాలని స్పష్టంచేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైఎస్సార్ స్టీల్ప్లాంట్ తదితర కార్యక్రమాలు, అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు–నేడు’ సమర్థవంతంగా సాగాలి విద్యారంగంలో నాడు–నేడు అన్నది అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమమని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఇది సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. మనబడి నాడు–నేడు మొదటి విడతలో ఇప్పటివరకూ రూ.3,650 కోట్లు ఖర్చుచేశారు. రెండో విడత కింద 12,663 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకు దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే, ఆస్పత్రుల నాడు–నేడుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలపైనా సమీక్షిస్తూ.. వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఉద్దానం, పులివెందుల, డోన్లలో కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పనులను వేగంగా పనులు పూర్తిచేయాలని, అలాగే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021–22లో విద్యా కానుకకు రూ.790 కోట్లు విద్యాకానుక కింద పిల్లలకు నోట్ పుస్తకాలు, బూట్లు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 2021–22లో రూ.790 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే.. జగనన్న గోరుముద్ద కోసం 2021–22లో రూ.1,625 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. రోడ్లపై మరింత దృష్టి రహదారుల నిర్మాణం, మరమ్మతులపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని.. ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించగా వీటి టెండర్లపైనా మరింత దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల అమరావతి వెళ్లడానికి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఇక పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయలు కూడా పెద్దఎత్తున ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వీటితోపాటు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్చంద్ర, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శులు ఎన్. గుల్జార్, కేవీవీ సత్యనారాయణ, జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డీ మురళీధరరెడ్డి, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏఎంఆర్డీఏ కమిషనర్ కే విజయ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎయి‘డెడ్’తో రాజకీయాలా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వాల తప్పిదాలు, యాజమాన్యాల స్వప్రయోజనాలతో రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు పూర్తిగా గాడి తప్పాయి. 95 శాతానికిపైగా ఈ సంస్థల్లో కనీస బోధనాభ్యసన కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదు. అనేక స్కూళ్లలో చేరికలు నిలిచి పోవడంతో మూతపడ్డాయి. మరికొన్నింటిలో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యార్థులు లేనందున పలు చోట్ల ప్రభుత్వ వేతనాలు పొందుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు బోధన మానేసి సొంత పనుల్లో ఉంటున్నారు. వీరిలో 90% మంది స్కూళ్లకు సరిగా హాజరు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనలను, సంస్థ విద్యా కార్యకలాపాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా ఇదే తంతు ఉండడంతో ఈ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. దాతలు ఏ ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాలను యాజమాన్యాలు విస్మరించాయి. సంస్థల ఆస్తులు, నిధులను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోవడంపైనే దృష్టి సారించాయి. ఇవీ వాస్తవాలు.. ► బ్రిటిష్ పాలనా కాలంలో ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ప్రారంభమైంది. దాతలు తమ సొంత ఆస్తులు, నిధులు దానంగా ఇచ్చి విద్యా సంస్థలను ఏర్పాటు చేయించారు. కాలక్రమంలో ఈ సంస్థల్లోని టీచర్లకు ప్రభుత్వం తరఫున వేతనాలు అందించడంతో పాటు ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. ► విద్యా హక్కు చట్టం వచ్చాక ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు హైస్కూలు.. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► ప్రభుత్వ స్కూళ్లలో అన్ని అర్హతలతో కూడిన టీచర్లతో బోధన, ఇతర సదుపాయాలతో పాటు పలు పథకాల కింద ఆర్థిక సాయం విద్యార్థులకు అందుతోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చేరికలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఈ విద్యా సంస్థల యాజమాన్యాలు వాటిని తమ వ్యక్తిగత స్వార్థానికి వినియోగించుకుంటున్నాయి. ► నియామకాల్లో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరించి డబ్బులిచ్చిన వారిని నియమించడంతో ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ► ప్రభుత్వ అనుమతులు లేకుండానే సిబ్బందిని నియమించుకుని, ఆ తర్వాత వారిని రెగ్యులర్ చేసేలా పైరవీలు చేస్తున్నాయి. ఈ సంస్థల్లో సిబ్బందికి, ఇతర కార్యకలాపాలకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ► ఎయిడెడ్ సంస్థల్లో సిబ్బంది ఉన్నప్పటికీ పిల్లలు ఉండడం లేదు. దీంతో ఆ సిబ్బందిని అవసరమైన చోట వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచించినా, యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఈ తరుణంలో ఈ సంస్థల్లో నియామకాలు, క్రమబద్ధీకరణలు ప్రభుత్వంపై విపరీత భారాన్ని మోపేవిగా మారాయి. ► అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులను ప్రభుత్వం ఆదుకొంటోంది. నాడు–నేడు కింద ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరగడంతో అక్కడ ఉపాధ్యాయుల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వంలోకి తీసుకున్న విద్యా సంస్థల్లోని విద్యార్థులకూ అన్ని పథకాలను వర్తింప చేస్తుంది. ► రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు 44,639 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 33,774, ప్రాథమికోన్నత పాఠశాలలు 4,198, ఉన్నత పాఠశాలలు 6,667 ఉన్నాయి. ఎయిడెడ్ స్కూళ్లు మొత్తం 2,001 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 1,301, అప్పర్ ప్రైమరీ 258, హైస్కూళ్లు 442 ఉన్నాయి. ► రాష్ట్రంలో చేరికలు లేక 482 ఎయిడెడ్ స్కూళ్లు మూత పడ్డాయి. వీటిలో 262 సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించాయి. నిర్వహణలో ఉన్న 1,988 స్కూళ్లలో 1,302 స్కూళ్లు కూడా ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించాయి. వీటిలో 1,127 సంస్థలను ప్రభుత్వంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 686 సంస్థలు సమ్మతి తెలపలేదు. సిబ్బంది, విద్యార్థుల కోసం ఇలా.. ► విద్యార్థులను వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారు కోరుకునే సమీపంలోని మరో పాఠశాలలో చేర్చించేలా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ► టీచర్లను వారి సీనియార్టీని అనుసరించి ఇతర స్కూళ్లలో నియమించేలా కౌన్సెలింగ్ షెడ్యూలు ఇచ్చింది. నవంబర్7వ తేదీలోగా వీరి నియామకాలు పూర్తి చేయనున్నారు. ► ఎయిడెడ్ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమయ్యాక వారి సేవలను అవసరమైన ఇతర విద్యా సంస్థల్లో వినియోగించుకోనుంది. ఆయా సంస్థలు, అందులోని తాత్కాలిక అన్ఎయిడెడ్ సిబ్బందికీ చట్ట నిబంధనల ప్రకారం ఔట్సోర్సింగ్ విధానం మేరకు వేతనాలు చెల్లిస్తారు. ఇందుకు ప్రభుత్వంపై రూ.95 కోట్ల వరకు భారం పడనుంది. ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ఇదీ పరిస్థితి ► రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 137 ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో 4 ఎండోమెంట్(రిలిజియస్) డిపార్టుమెంటు పరిధిలోవి కాగా 16 మైనార్టీ స్టేటస్తో ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో ఎయిడెడ్ కోర్సులతో పాటు అన్ఎయిడెడ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో సరైన చేరికలు ఉండడం లేదు. 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. ► డిగ్రీ కాలేజీల్లోని ఎయిడెడ్ కోర్సుల్లో 1,02,234 సీట్లుంటే 51,085 మంది, అన్ఎయిడెడ్ కోర్సుల్లో లక్షకు పైగా సీట్లుంటే అందులో సగం మంది మాత్రమే చేరారు. కొన్ని ప్రముఖ కాలేజీల్లో తప్ప తక్కిన వాటిల్లో 30% కూడా సీట్లు నిండడం లేదు. ► 32 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. 33 కాలేజీల్లో చేరికలు 50 శాతానికన్నా తక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల పది శాతం విద్యార్థులు కూడా లేరు. ఈ సంస్థల్లో ఎయిడెడ్ విభాగాల్లో బోధనా సిబ్బంది 1,303 మంది, బోధనేతర సిబ్బంది 1,422 మంది ఉన్నారు. అన్ఎయిడెడ్ కోర్సులకు సంబంధించి 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ► 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లోని 5 జూనియర్ కాలేజీలు.. ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం సిబ్బందిని ఇస్తామని తెలిపాయి. ► ఎయిడెడ్ పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు.. 6,900 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. జూనియర్ కాలేజీల్లో 40 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 10 కాలేజీలు మూత రాజమండ్రిలోని ఏవైఎస్ కాలేజ్, పాలకొల్లులోని ఎస్కేఆర్ఎస్ ఓరియంటల్కాలేజ్, గుడ్లవల్లేరులోని ఎస్సీఎస్కాలేజ్, గుంటూరులోని ఎస్జీహెచ్ఆర్, ఎంసీఎంఆర్ కాలేజ్, నరసారావుపేటలోని ఎన్బీటీ, ఎన్వీసీ కాలేజ్, తెనాలిలోని కేఎల్ఎన్సంస్కృత కళాశాల, పొన్నూరులోని ఎస్బీఎస్సంస్కృత కళాశాల, గుంటూరులోని డా.కేవీకే సంస్కృత కళాశాల, ఎస్జీకే ఓరియంటల్ కాలేజ్లు మూత పడ్డాయి. ఇలా చేయడం మేలేగా.. ► ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రత్నకుమారి నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ► అన్ని విధాలా నిర్వీర్యమైన ఈ సంస్థలకు ప్రభుత్వ ఆర్థిక సాయం కొనసాగించాల్సిన అవసరం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఈ విషయమై ప్రభుత్వం తొలుత ఆయా సంస్థల యాజమాన్యాలు, సిబ్బందితో చర్చించింది. ► ప్రభుత్వానికి ఆయా ఎయిడెడ్ సంస్థలను అప్పగించే విషయంలో నిర్ణయాన్ని యాజమాన్యాల అభీష్టానికే ప్రభుత్వం వదిలేసింది. ప్రభుత్వానికి అప్పగించని సంస్థలు నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నడుపుకోవాలి. ప్రతిపక్షాల దుష్ప్రచారం రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే టీడీపీ సహా కొన్ని రాజకీయ పక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తూ రాజకీయం చేస్తున్నాయని తల్లిదండ్రులు, ఎయిడెడ్ సిబ్బంది నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల విద్యార్థులను రోడ్లపైకి తెస్తూ ఆందోళనలు చేపట్టడం వెనుక వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప మరేమీ లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏకంగా 300 వరకు కోర్టు ధిక్కార కేసులు నమోదవ్వగా వాటిని ప్రస్తుత ప్రభుత్వంలోని అధికారులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాలన్నింటినీ టీడీపీ విస్మరించి ప్రస్తుతం దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్రంలోని ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడాన్ని ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇప్పటికే స్వాగతించింది. పూర్తి స్థాయి వేతనాలు పొందుతున్నా వివిధ కారణాల వల్ల సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నాం. ప్రభుత్వంలో ఎయిడెడ్ కాలేజీలను విలీనం చేయడం వల్ల మేమంతా బాధ్యతాయుతంగా పని చేస్తాం. ఎక్కడ అవసరమో అక్కడ మా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కనుక విద్యార్థులకూ మేలు జరుగుతుంది. – కనపర్తి త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎయిడెడ్పై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం ఎయిడెడ్ విద్యా వ్యవస్థపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి మంచి విద్యా ప్రమాణాలను అందించాలన్న ఆలోచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎయిడెడ్ ఆస్తులు ఇప్పటికే దుర్వినియోగం అయ్యాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాటిని దాతలు ఏ లక్ష్యంతో ఇచ్చారో దానికే వాడాలని ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలపై శ్వేతపత్రం ఇస్తాం. – ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు సబ్జెక్టు నిపుణులు లేరు. అందువల్ల మేము అందరిలా సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. ఎన్టీఎస్ఈ, ఎన్ఎమ్ఎమ్ఎస్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించలేకపోతున్నాం. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో వీలీనం చేస్తే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు వస్తారు. మేమ అన్ని పోటీ పరీక్షల్లోను సత్తా చాటుతాం. – ఎస్.వీరదుర్గ, పదో తరగతి, గిల్డ్ ఆఫ్ సర్వీస్ పాఠశాల, కాకినాడ, తూర్పుగోదావరి -
ఏపీ విద్యా వ్యవస్థ భేష్
కంకిపాడు/సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలు స్ఫూర్తిదాయకమని అస్సాం సమగ్ర శిక్ష మిషన్ డైరెక్టర్, విద్యాశాఖ కార్యదర్శి రోషిణీ అపరంజి కొరాటి ప్రశంసించారు. పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంకిపాడు, కోలవెన్ను మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలను రోషిణీ అపరంజి కొరాటి, అస్సాం రాష్ట్ర ఎలిమెంటరీ విద్య డైరెక్టర్ డాక్టర్ బిజోయా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ నీరదా దేవి, సమగ్రశిక్ష రాష్ట్ర కన్సల్టెంట్ ముజఫర్ అలీతో కూడిన బృందం గురువారం సందర్శించింది. పునాదిపాడు పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో రోషిణీ అపరంజి కొరాటి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత బాగుందన్నారు. కోవిడ్ ప్రభావంతో పాఠశాలలు తెరవడం ఆలస్యం అయినా పాఠశాలల ప్రాంగణం, నిర్వహణ తీరు ఆహ్లాదకరంగా ఉందన్నారు. సీఎం వైఎస్జగన్ విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. సమగ్రశిక్ష రాష్ట్ర అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో పాఠశాలకు రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు వెచ్చించి పాఠశాలల అభివృద్ధి కి కేటాయించారన్నారు. జగనన్న గోరుముద్దతో విద్యార్థులకు రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్న విధానాన్ని అస్సాం బృందానికి వివరించారు. డీఈవో తహేరా సుల్తానా, సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఎ.శేఖర్, విజయవాడ డీవైఈవో రవికుమార్, మధ్యాహ్న భోజన పథకం ఏడీ వేణుగోపాలరావు, ఏఎంవో రాంబాబు, సీఎంవో ఎల్.వెంకటేశ్వరరావు, ఎంఈవో కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖాధికారులతో భేటీ రాష్ట్రంలోని విద్యా పథకాల అమలు తీరును పరిశీలించేందుకు వచ్చిన అస్సాం బృందం సమగ్ర శిక్ష కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యింది. అంతకుముందు బృంద సభ్యులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కూడా రాష్ట్ర విద్యావ్యవస్థను పరిశీలించిన విషయం విదితమే. -
చికిత్సలన్నీ మన వద్దే
జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అమల్లోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. కొత్త పీహెచ్సీల నిర్మాణం, ఇప్పటికే ఉన్న పీహెచ్సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోళ్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఇతర నగరాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు, నగరాలకు వెళ్తున్నారో అలాంటి చికిత్సలు అందించే ఆస్పత్రులను రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసే హెల్త్ హబ్స్లో నిర్మించాలని ఆదేశించారు. హెల్త్ హబ్స్ ఏర్పాటు, మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఏపీ డిజిటల్ హెల్త్, కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ హబ్స్లో ఏర్పాటయ్యేఆస్పత్రుల్లో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండాలని, తద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని చెప్పారు. ఎలాంటి చికిత్స అయినా మన రాష్ట్రంలోనే అందించేలా స్పెషలైజేషన్తో కూడిన ఆస్పత్రులు ఏర్పాటు కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఏమైనా అంశాలు పెండింగ్లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించి, పనులు శరవేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు కావాలని, ఇందుకోసం ఇంకా అవసరమైన 104 వాహనాల కోనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కోవిడ్ నియంత్రణపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు పీహెచ్సీల్లో మహిళా డాక్టర్ల నియామకం ► మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. దీని ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాం. నెలకు ఒకసారి ఈ రకమైన కార్యక్రమం చేపడుతున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఆరోగ్య శ్రీపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్ పెట్టాలి. ఆరోగ్య శ్రీ రిఫరెల్ మీద ప్రచారంతో పాటు ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లను ఈ హోర్డింగ్స్లో ఉంచాలి. ఆరోగ్య శ్రీలో ఎంప్యానెల్ ఆస్పత్రుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. డిజిటల్ పద్ధతుల్లో పౌరులకు ఎంప్యానెల్ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలి. 108 వాహనాల సిబ్బందికి కూడా రిఫరెల్ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలి. బ్లడ్ గ్రూప్ సహా ఆరోగ్య వివరాలన్నీ ఉండాలి ► ఏపీ డిజిటల్ హెల్త్కు సంబంధించి.. హెల్త్ కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలి. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా అన్ని వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలి. దీనివల్ల భవిష్యత్లో ఎక్కడకు వెళ్లినా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ► బ్లడ్ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలి. 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్ కార్డుల్లో పొందుపర్చాలి. (డిజిటిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ హెల్త్ ఐడీలు క్రియేట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.) రాష్ట్రంలో కోవిడ్–19 నివారణ, నియంత్రణ, చికిత్సలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ కేసుల పరిస్థితి ► రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ కేసులు : 9,141 ► రికవరీ రేటు శాతం : 98.86 ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు: 2,201 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 313 ► హోం ఐసోలేషన్లో ఉన్న వారు: 6627 ► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 11,997 ► పాజిటివిటీ రేటు శాతం : 1.62 ► 0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు : 12 ► 3కు పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా: 1 థర్డ్ వేవ్ సన్నద్ధత ► మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ : 20,964 ► ఇంకా రావాల్సినవి : 2,493 ► అందుబాటులో ఉన్న డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లు : 27,311 ► రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు : 140 (ఇవి అక్టోబర్ ఆఖరుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి) -
AP: ఉత్తమ నిర్వహణతో నాణ్యమైన వైద్యం
ఒక్కో టీచింగ్ ఆస్పత్రికి ప్రత్యేకంగా డిప్యూటీ డైరెక్టర్, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఒక్కో జిల్లా, ఏరియా ఆస్పత్రులకు వేర్వేరుగా డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ బిల్డింగ్, వైద్య పరికరాలు, సౌకర్యాలు.. బయో మెడికల్ నిర్వహణ, క్యాంటిన్, లాండ్రి, సెక్యూరిటీ.. విభాగాల్లో 1,150 మంది నిష్ణాతుల నియామకానికి కసరత్తు ఏటా నిర్వహణకు రూ.41.3 కోట్లు రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో వివిధ విభాగాల్లో అపార నైపుణ్యం ఉన్న వైద్యులు.. 24 గంటలూ సేవకు సిద్ధంగా ఉండే నర్సింగ్ సిబ్బంది.. అవసరమైన మేరకు వెనువెంటనే అన్ని పరీక్షలు చేసే ల్యాబ్ విభాగం.. ఇతరత్రా ఏ అవసరం పడినా అందుబాటులో ఉండే ఇతర విభాగాల సిబ్బంది దాదాపు పూర్తి స్థాయిలో ఉన్నారు. అధునాతన పరికరాలు వచ్చి చేరుతున్నాయి. మందులకూ కొరత లేదు. అయితే వచ్చిన సమస్యల్లా నిర్వహణ లోపం. ప్రస్తుతం ఈ రోగాన్ని కుదిర్చి.. రోగులకు సకల సౌకర్యాల మధ్య అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా విభాగాల నిర్వహణ నిపుణులను నియమించడం ద్వారా అందరూ సమన్వయంతో పనిచేసే చక్కటి వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. సాక్షి, అమరావతి: రూ.వేల కోట్లు వెచ్చించి ఒక పక్క ‘నాడు–నేడు’తో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్పుచేసి.. నాణ్యమైన వైద్య సేవలందించడంతో పాటు మరోపక్క ఆస్పత్రుల నిర్వహణ అత్యుత్తమంగా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం సీఎం ఆదేశాల మేరకు ఎయిమ్స్, అపోలో తదితర వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను అధికారులు అధ్యయనం చేశారు. పాదయాత్రలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ లోపాలను స్వయంగా గమనించిన వైఎస్ జగన్.. సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి, అత్యుత్తమంగా ఆస్పత్రులను నిర్వహించడం ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా బెడ్లు, బాత్రూమ్లు, ఆహారం, వైద్య పరికరాలు, బిల్డింగ్, పారిశుధ్యం, సెక్యూరిటీ, లాండ్రీ వంటి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసుల నిర్వహణతో పాటు బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అధికారుల నియామకానికి అధికారులు కసరత్తు చేశారు. వివిధ విభాగాల నిర్వహణకు నిష్ణాతుల నియామకం అత్యుత్తమ నిర్వహణలో భాగంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు.. అని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఏరియా ఆస్పత్రుల నిర్వహణ సిబ్బందే అవసరమైనప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలకు వెళ్లి సేవలందించేలా అధికారులు మ్యాపింగ్ చేశారు. ఒక్కో టీచింగ్ ఆస్పత్రి నిర్వహణ కోసం ప్రత్యేకంగా డిప్యూటీ డైరెక్టర్తో పాటు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లను, ఒక్కో జిల్లా ఆస్పత్రి నిర్వహణ కోసం డిప్యూటీ డైరెక్టర్తో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను, ఒక్కో ఏరియా ఆస్పత్రి నిర్వహణ కోసం డిప్యూటీ డైరెక్టర్తో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను నియమించాలని ప్రతిపాదించారు. వీరి పరిధిలో బిల్డింగ్ సర్వీసు, బిల్డింగ్ మౌలిక సదుపాయాలు–పరికరాలు, మెడికల్ ఎక్విప్మెంట్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసు, బయో మెడికల్ నిర్వహణ, లాండ్రీ, క్యాంటీన్, సెక్యూరిటీ రంగాల వారీగా అర్హతగల నిష్ణాతులను నియమించాలని చెప్పారు. ఆయా రంగాల్లో నియమించిన వారికి అవసరమైన నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను అత్యుత్తమంగా ఎప్పటికీ నాణ్యత, పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు 1,150 మంది అవసరం అవుతారని అధికారులు లెక్క తేల్చారు. ఇందుకోసం ఏడాదికి రూ.41.3 కోట్లు వ్యయం కానుంది. టీచింగ్ ఆస్పత్రుల నిర్వహణ ఇలా.. డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో బయో మెడికల్ ఇంజనీర్, ఇద్దరు టెక్నీషియన్లు, ఒక సివిల్ ఇంజనీర్, ఇద్దరు ప్లంబర్లు, ఇద్దరు ఆక్సిజన్ పైప్లైన్లు నిర్వహించే వారు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ముగ్గురు ఎలక్ట్రీషియన్లు, ఒక ఎస్టీపీ/ఈటీపీ, ఒక ఫైర్ ఫైటింగ్ సిబ్బంది, ఇద్దరు జనరల్ డ్యూటీ టెక్నీషియన్లు ఉంటారు. మరో అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో నలుగురు ఫెసిలిటీ మేనేజర్ల పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఉంటుంది. జిల్లా ఆస్పత్రుల నిర్వహణ ఇలా.. డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక బయో మెడికల్ ఇంజనీర్, ఒక టెక్నీషియన్, ఒక సివిల్ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఆక్సిజన్ పైప్లైన్ నిర్వహణ సిబ్బంది ఒకరు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లు, ఒక ఎస్టీపీ/ఈటీపీ, ఒక ఫైర్ ఫైటింగ్ సిబ్బంది, ఒక ఐటీ అసిస్టెంట్, ఇద్దరు జనరల్ డ్యూటీ టెక్నీషియన్లు, ఇద్దరు ఫెసిలిటీ మేనేజర్ల పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఉంటుంది. ఏరియా, సీహెచ్సీ ఆస్పత్రుల నిర్వహణ ఇలా డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక బయో మెడికల్ ఇంజనీర్, ఒక టెక్నీషియన్, ఒక సివిల్ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఆక్సిజన్ పైప్లైన్ నిర్వహణ సిబ్బంది ఒకరు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఫైర్ ఫైటింగ్ సిబ్బంది, ఒక ఐటీ అసిస్టెంట్, ఒక జనరల్ డ్యూటీ టెక్నీషియన్, ఒక ఫెసిలిటీ మేనేజర్ పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఉంటుంది. నిర్వహణపై పర్యవేక్షణ సీఎం ఆదేశాల మేరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను అధ్యయనం చేశాం. తద్వారా ఇంకా మెరుగ్గా ప్రభుత్వ ఆస్పత్రులను అత్యుత్తమంగా నిర్వహించి, నాణ్యమైన వైద్యం అందించేందుకు విధానాలను రూపొందించాం. బెడ్లు, బాత్రూమ్లు, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత.. ఇలా అన్నీ బావుండాలన్నది సీఎం ఉద్దేశం. ఇందుకు మానవ వనరుల్లో నైపుణ్యతను పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత నిర్వహణ పర్యవేక్షణపై కూడా దృష్టి పెడతాం. – డాక్టర్ బి.చంద్రశేఖర్రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ -
నాడు–నేడు మిగులు నిధులు నాబార్డు స్కూళ్ల పనులకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మనబడి నాడు–నేడు కింద తొలివిడతలో అభివృద్ధి పనులు చేపట్టిన స్కూళ్లకు కేటాయించిన నిధుల్లో మిగిలిన సొమ్మును నాబార్డు ఆర్థిక సాయంతో పనులు చేపట్టిన స్కూళ్లకు వినియోగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లను ఆదేశించారు. నాడు–నేడు తొలివిడతలో 15,715 స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నీటి సదుపాయంతో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు కుర్చీలు, బెంచీలు సహా ఫర్నిచర్, గ్రీన్చాక్బోర్డులు, విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మరమ్మతులు, ప్రహరీలు, కిచెన్షెడ్లు, రంగులు వేయడం వంటి వాటికి రూ.3,669 కోట్ల వరకు వెచ్చించింది. ఈ నిధులను పాఠశాలల వారీగా కేటాయించింది. ఆ స్కూళ్లలో పనులన్నీ పూర్తయిన తరువాత పేరెంట్స్ కమిటీల వద్ద మొత్తం రూ.59 కోట్లు మిగిలాయి. ఈ సొమ్మును నాబార్డు నిధులతో పనులు చేపట్టిన 516 స్కూళ్లలో కార్యక్రమాలు పూర్తిచేసేందుకు బదలాయించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. -
చిత్రం చెప్పే పాఠాలు.. ఒక్కసారి చూస్తే మర్చిపోలేని విధంగా..
ప్రభుత్వ పాఠశాలల్లోకి అడుగుపెడితే చాలు అక్కడ గోడలపై ఉన్న బొమ్మలే విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నట్టు ఉంటాయి. విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంపొందిస్తూ పాఠాలను గుర్తుపెట్టుకునేలా ప్రభావితం చేస్తున్నాయి. అందమైన రంగుల్లో ఒక్కసారి చూస్తే మర్చిపోలేని విధంగా తరగతి గదుల్లో, బయట గోడలపై రూపొందించిన పాఠ్యాంశాల చిత్రాలు ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. నాడు–నేడు పేరుతో అభివృద్ధి చేసిన పాఠశాలలు వీటికి వేదికగా నిలుస్తున్నాయి. భీమవరం(ప్రకాశం చౌక్): ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి వాటి రూపురేఖలనే మార్చేసింది. నాడు అధ్వానంగా ఉన్న పాఠశాలలు నేడు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఏర్పాటుచేసిన అధునాతన వసతులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల గేటు దగ్గర నుంచి తరగతి గదుల వరకు అన్నిచోట్లా వేయించిన పాఠ్యాంశాల బొమ్మలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. నాడు–నేడు ద్వారా తొమ్మిది రకాల పనులు పాఠశాలల్లో చేపట్టగా అందులో ముఖ్యమైనది గోడలపై వేసిన చిత్రాలు. వీటి ద్వారా పాఠశాల తరగతి గదుల్లో, బయట గోడలపై ముఖ్యమైన పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో వేయించారు. విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోకుండా ఈ బొమ్మలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. టీచర్లు కూడా తరగతి గదుల్లోని బొమ్మల ద్వారా పాఠాలను బోధిస్తూ విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఆసక్తి రేకెత్తించేందుకు కృషిచేస్తున్నారు. ఈ బొమ్మలు విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చేలా చేయడంలో ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వ్యయం పశ్చిమ గోదావరి జిల్లాలో నాడు–నేడు ఫేజ్–1లో సుమారు 1100 పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ఒక్కో పాఠశాలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేలతో ఆయా పాఠశాలల్లో గోడలపై చిత్రాలు వేయించారు. అంశాలివీ... పాఠశాలల తరగతి గదుల గోడలపై అక్షరాలు, అంకెలు, మానవ శరీర నిర్మాణం, జీర్ణకోశ, ప్రకృతి, మ్యాప్లు, అంతరిక్షం తదితర వాటిని వేయగా బయట గోడలపై స్వచ్ఛభారత్, కవులు, రచయితలు, క్రీడలు, ట్రాఫిక్, యోగా ఉపయోగాలు, శరీర అంతర్గత భాగాలైన గుండె, ఊపిరితిత్తులు, మెదడు తదితరాల నిర్మాణాలు, జాతీయ జెండా, దేశ నాయకుల చిత్రాలు, జాతీయ చిహ్నాలు తదితరాలను బొమ్మల రూపంలో వేయించారు. ఉపయోగాలివీ... ►పాఠశాలలపై విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెరుగుతుంది ►విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతుంది. ►ఆహ్లాదకర వాతావరణంలో, ఉత్సాహంగా పాఠాలు నేర్చుకుంటారు. ►బోధన, అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయి. ►చదివిన పాఠాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ►విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. ►ముఖ్యంగా ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తిని పెంచుతాయి. ఎంతో ప్రభావితం చేస్తున్నాయి జిల్లాలో నాడు–నేడు ఫేజ్–1లో సుమారు 1100 పాఠశాలలను అభివృద్ధి చేశాం. వాటిలో చేపట్టిన తొమ్మిది కాంపోనెంట్ పనుల్లో ఒకటి గోడలపై చిత్రాలు. తరగతి గదుల లోపల, బయట పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో వేయించాం. అవి విద్యార్థుల్లో సరికొత్త మార్పులు తీసుకువస్తున్నాయి. బొమ్మలు విద్యార్థుల్లో పాఠశాలకు రావాలనే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతూ విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంచుతున్నాయి. చదువుకున్న పాఠాలు ఎప్పటికీ మార్చిపోకుండా గుర్తుండేలా దోహదపడుతున్నాయి. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు పాఠాలను గుర్తుపెట్టుకుంటున్నారు పాఠశాల తరగతి గదుల్లో వేసిన పాఠ్యాంశాల బొమ్మల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటే వారు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. బొమ్మల ద్వారా చెప్పే పాఠాలను ఎప్పటికీ మర్చిపోలేరు. పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను చిత్రాలుగా గోడలపై వేయడం చాలా బాగుంది. విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కొన్ని చిత్రాలు వారిలో విజ్ఞానాన్ని, అవగాహనను పెంచుతుంటే మరికొన్ని మానసిక ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. – ఎ.రాణీ నాగరత్నం, ఉపాధ్యాయురాలు, మహాత్మాగాంధీ ప్రాథమిక పాఠశాల, భీమవరం -
ప్రపంచంతో పోటీ
కోవిడ్ తగ్గుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూళ్లకు వెళ్లే నాటికే విద్యా కానుక అందించాలి. ఇందుకోసం ఇప్పుడే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలి. ఈ కిట్లో వస్తువులు మరింత నాణ్యతగా ఉండేలా దృష్టి సారించాలి. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో భాగంగా మూడు జతల దుస్తులకు అదనంగా స్పోర్ట్స్ డ్రస్, స్పోర్ట్స్ షూ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవి మంచి డిజైన్తో ఉండేలా చూడాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులను తయారు చేసేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు జరిగినప్పుడే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణిస్తారని, వారిని ఆ దిశగా సన్నద్ధం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలన్నారు. చాలా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామని, ఈ దశలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యా శాఖలో నాడు–నేడుతో పాటు ఫౌండేషన్ స్కూళ్లపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల ముద్రణలో నాణ్యత మరింతగా పెంచాలని సూచించారు. ఇప్పటి నుంచే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడంపై దృష్టి సారించాలని చెప్పారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్ఈ అఫిలియేషన్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ.. తొలుత వెయ్యి స్కూళ్లను అఫిలియేషన్ చేస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. అన్ని రకాల స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యాశాఖలో నాడు–నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12,663 స్కూళ్లలో రెండో విడత నాడు–నేడు ► రూ.4,535.74 కోట్ల వ్యయంతో రెండో విడతలో 12,663 స్కూళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, రూపురేఖలు మార్చాలి. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. (రెండో విడతలో 18,498 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. మూడో విడత రూ.7,821 కోట్ల వ్యయంతో 24,900 స్కూళ్లలో నాడు–నేడు చేపట్టనున్నారు.) ► నాడు –నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయి. స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ► ప్రతి స్కూల్లో మరమ్మతుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీనిపై ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలి. అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయి. నాడు–నేడు పనులపై శిక్షణ ► ఈ ఏడాది విద్యా కానుక నూటికి నూరు శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. నాడు–నేడు పనులకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 12 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పేరెంట్స్ కమిటీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. ► స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్లో ఈ కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ► ఈ సమీక్షలో పాఠశాల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభయాన్ స్టేట్ ప్రోజెక్ట్ డైరెక్టర్ వెట్రి సెల్వి, పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఎ.మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్సీఈఆర్టీ) బి.ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి: సీఎం వైఎస్ జగన్
-
నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. రెండో దశ నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచడంతో పాటు, కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీబీఎస్ఈ అఫిలియేషన్పై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ముందుగా వేయి స్కూళ్లను అఫిలియేషన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని రకాల స్కూళ్లు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసీఎస్ఈ అఫిలియేషన్మీద కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: ♦నాడు – నేడు కింద రెండో విడతలో 12,663 స్కూళ్లు ♦రూ. 4535.74 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు ♦18,498 అదనపు తరగతి గదులు ♦మూడో విడతలో నాడు–నేడు కింద 24,900 స్కూళ్లు ♦దీనికోసం రూ.7821 కోట్ల ఖర్చు అంచనా ♦రెండో దఫా నాడు– నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశం ♦నాడు – నేడు పనులకు సంబంధించి సచివాలయంలో ఇంజినీర్లకు శిక్షణ ♦సుమారు 12వేల మందికి శిక్షణ అందించనున్న అధికారులు ♦అనంతరం పేరెంట్స్ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు ♦స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్న సీఎం ♦నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం ♦లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయన్న సీఎం ♦స్కూళ్లలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్ ఒకటి ప్రతి స్కూల్లో ఉంచాలన్న సీఎం ♦దీనిపై ఎస్ఓపీలను తయారు చేయాలన్న సీఎం ♦అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయన్న సీఎం జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్ సమీక్ష ♦ఈ ఏడాది విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని తెలిపిన అధికారులు ♦కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూల్కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలన్న సీఎం ♦వచ్చే ఏడాది విద్యా కానుక కింద ఇవ్వనున్న వస్తువులపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ♦విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని స్పష్టంచేసిన సీఎం ♦వచ్చే ఏడాది నుంచి విద్యాకానుకలో భాగంగా స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ డ్రస్ ♦మంచి డిజైన్, నాణ్యత ఉండేలా చూడాలన్న సీఎం ♦స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం ♦అక్టోబరు మధ్యంతరంలో కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్న అధికారులు ఈ సమీక్షా సమావేశాంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభయాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్సీఈఆర్టీ) బి ప్రతాప్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇవీ చదవండి: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! తాగుబోతు రాతలేల? -
నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై నేడు సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవం: కలెక్టర్
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రాజుపాలెం పాఠశాలలో చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ అన్నారు. స్కూల్ లేని ఆదివారం రోజు ఘటన జరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థి ఆడుకోవడానికి అక్కడకి వెళ్లినట్లు తెలిపారు. ఆ స్కూల్ భవనం వినియోగంలోనే లేదన్నారు. నాడు-నేడు కింద ఆ స్కూల్ను తీసుకోలేదని కలెక్టర్ వెల్లడించారు. పాడైపోయిన భవనాలను గుర్తించి కూల్చివేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చదవండి: పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ -
AP: అట్టడుగు వర్గాలకు అక్షర కాంతులు
ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ సిద్దాంతాన్ని బలంగా విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా రంగ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో 35 శాతం సీట్లు పేదలకు కేటాయింపు చేయాలనే నిర్ణయాలు ఎంతో దార్శనికతతో తీసుకున్నవిగా స్పష్టమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకంలో భాగంగా, పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తంగా అందిస్తున్న జగనన్న కిట్లు మధ్యతరగతి, పేద విద్యార్థులకు వరంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్పుచేసే విధంగా 44,512 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం, తొలి దశలో రూ. 3,625 వేల కోట్లతో 15,715 పాఠశాలలను అద్దంలా, సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు అందించిన విధానం నభూతో న భవిష్యతి అన్న చందంగా సాగింది. ప్రధానంగా గతంలో గ్రామాలలో నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలచిన పాఠశాలలకు నాడు–నేడు పథకంలో పుష్కలంగా నిధులు సమకూర్చి అభివృద్ధి చేసిన విధానం పల్లె ప్రజల మనసులను చూరగొంది. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!) పనుల్లో పారదర్శకతను పాటిస్తూ తమ పాఠశాలను తామే అభివద్ధి చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. పాఠశాల చిన్నారులను ఆకర్షించే విధంగా రంగురంగుల వర్ణ చిత్రాలు, తరగతి గదుల్లో విద్యుత్ దీపాలు, విద్యార్థులు కూర్చునే బెంచీలు వంటి సకల వసతులను కల్పించడంతో పాటు, బాలికలకు అత్యంత ఉపయుక్తంగా నిలిచే శౌచాలయాలను నిర్మించి అందించింది. బాలికల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ, హాజరు శాతం పెంపుదల చేయడానికి ఇది ఒక కారణంగా నిలుస్తుంది. గత పాలకులు పాఠశాల విద్య విషయంలో కాగితాల్లో లెక్కలకే పరిమితం అయ్యారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయివరకు విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నూతన పంథాలో నడిపించడానికి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్ర విద్యార్థులను సమాయత్తం చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) ‘ప్రపంచంలో నిజమైన శాంతిని కోరుకుంటున్నట్లయితే మనం చిన్నారులను విద్యావంతులుగా తయారు చేయాల’న్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను నిజం చేస్తూ పాఠశాల విద్యను అందరికీ చేరువ చేసే ప్రయత్నం ఏపీలో జరుగుతోంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు ఖరారు చేయడం దేశంలోనే ఒక నూతన ఒరవడికి నాందిగా చెప్పవచ్చు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో పాఠశాలల ఫీజులు రూ. 10 వేల నుంచి 18 వేల వరకు, జూనియర్ కాలేజీలకు రూ. 12 వేల నుంచి 20 వేల వరకు ఉండాలని, అదే విధంగా హాస్టల్ రుసుములు సైతం రూ. 18 వేల నుంచి రూ. 24 వేల మధ్యలో ఉండాలని నిర్ణయించారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తూ అందరికీ విద్యను చేరువ చేసే దిశగా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన తరుణమిది. పేద విద్యార్థులకు అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిభ కలిగిన విద్యార్థులు పేదరికం కారణంగా విద్యకు దూరం కారాదనే దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ నిర్ణయం నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు వర్సిటీలలో ప్రవేశం పొందడం వలన పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెనతో వసతి భోజన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తూ విద్యార్థికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యను పొందే వ్యవస్థను కల్పించాలని సంకల్పించారు. ఈ విధానంలో రిజర్వేషన్ అమలు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బాలికలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్ అమలు జరిగి అట్టడుగు వర్గాలకు సంపూర్ణ న్యాయం చేకూరుతుంది. భవిష్యత్తులో జరిగే సంస్కరణలకు కేవలం ఇవి తొలి అడుగుగా భావించాలి. ఎంతో ఆర్థిక భారాన్ని భరిస్తూ రాష్ట్రంలో పేద, అట్టడుగు వర్గాల చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే సమున్నత సంకల్పం ఎంతో అభినందనీయం. ఈ పథకాలను మరో దశాబ్ద కాలం అమలు జరిపితే ప్రతీ కుటుంబం విద్యావంతులతో సుసంపన్నం అవుతుంది. తద్వారా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, మరొకరికి చేయూతనందించే స్థాయికి చేరుకుంటారు. - డా. టి. షారోన్ రాజు వ్యాసకర్త విద్యా విభాగాధిపతి ఆంధ్ర విశ్వవిద్యాలయం -
బాబు సొంత నియోజకవర్గం కుప్పాన్నే మార్చేసిన జగన్
-
టీచర్గా మారిన ఎమ్మెల్యే రోజా
-
గిరిజనగూడెం.. ‘నాడు–నేడు’తో శోభాయమానం
సాక్షి, అమరావతి: వాగు వంకలు.. కొండలు కోనలు గుట్టలు దాటుకొని ఆ గ్రామాలకు మామూలుగా చేరుకోవడమే కష్టం. అటువంటి గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంతో కళకళలాడుతున్నాయి. దశాబ్దాలుగా ఈ స్కూళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పశువుల కొట్టాలకన్నా దారుణమైన పరిస్థితులున్నా వాటిని బాగు చేయాలన్న తలంపు ఏనాడూ చేయలేదు. కానీ నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలను పదిరకాల సదుపాయాలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. సుందరంగా మారిన విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని నల్లగొండ ఎంపీపీ స్కూల్ రూ.312 కోట్లతో 1,226 గిరిజన పాఠశాలల అభివృద్ధి రాష్ట్రంలోని మొత్తం 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లన్నిటినీ నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీటికి శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ స్కూళ్లు కలిపి దాదాపు 57 వేలకు చేరుతున్నాయి. వీటన్నిటినీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూ.16 వేల కోట్లను ఖర్చుచేస్తోంది. ఇప్పటికే తొలిదశలో 15,715 స్కూళ్లను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. 7 జిల్లాల పరిధిలో ఉన్న 1,226 గిరిజన స్కూళ్లను తొలిదశ కింద అభివృద్ధి చేశారు. రూ.312.5 కోట్లతో వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏర్పాటు చేసిన సదుపాయాలివీ.. గతంలో చూడడానికే అందవికారంగా, ఎప్పుడు కూలుతాయో అని లోపలకు వెళ్లడానికే భయపడే విధంగా ఉన్న ఈ స్కూళ్లు ఇప్పుడు గిరిజన తల్లిదండ్రులు, పిల్లలను ఆకర్షిస్తున్నాయి. గతంలో స్కూళ్లకు రావడానికి కూడా మారాం చేసే పిల్లలు ఈనెల 16వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో వాటివైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. మరుగుదొడ్లు, అందమైన ఆవరణ, మంచినీటి సదుపాయం, తరగతి గదుల్లో డ్యూయెల్ డెస్కులు, టీచర్లకు అనువైన కుర్చీలు, అల్మారాలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, పాఠశాలల చుట్టూ ప్రహరీతో స్కూళ్లు కళకళలాడుతున్నాయి. పాఠశాల భవనం మొత్తం ఆకర్షణీయమైన రంగులతో, గోడలపై విద్యార్థులకు విజ్ఞానం అందించే చిత్రాలతో తీర్చిదిద్దారు. విద్యారంగంలో సీఎం కొత్త చరిత్ర సృష్టించారు రాష్ట్ర విద్యా రంగంలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారు. నాడు–నేడు మొదటి దశలో 15,715 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాలలు ప్రారంభించిన రోజే జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, బెల్ట్ అదనంగా ఆంగ్ల నిఘంటువు పంపిణీ చేయడం విద్యార్థులకు జగనన్న అందించిన వరం. – సామల సింహాచలం, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కలలో కూడా ఊహించలేదు మారుమూల ఎక్కడో ఉన్న మా గ్రామంలోని స్కూలు ఇంత అద్భుతంగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు. పాఠశాల అభివృద్ధి పనులు మా కమిటీ చేతనే దగ్గరుండి చేయించారు. మా పిల్లలకు మంచి విద్య అందుతుందన్న భరోసా మాకు కలిగింది. పిల్లలు కూడా ఆనందంగా స్కూలుకు వస్తున్నారు. – ఎం.భాస్కరరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్, మూలిగూడ, గుమ్మలక్ష్మీపురం మండలం, విజయనగరం జిల్లా. విద్యార్థులకెంతో అదృష్టం మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చివేసిన అద్భుత పథకం నాడు–నేడు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అనే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి రావడం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అదృష్టంగా భావిస్తున్నాను. పూర్వం ఇటువంటి సదుపాయాలు లేక విద్యార్థులు చాలా బాధలు అనుభవించారు. – ఆర్.నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు, కొయ్యూరు, విశాఖపట్నం జిల్లా. స్కూలుకు వచ్చి బాగా చదువుకోవాలని ఉంది ఇంతకు ముందు మా స్కూలు అసలు బాగుండేది కాదు. స్కూలుకు రావాలని పించేది కాదు. ఇప్పుడు స్కూలును చూస్తే ఆనందంగా ఉంది. మేము కూర్చొని పాఠాలు వినేందుకు సౌకర్యమైన బెంచీలు, మంచినీరు, మరుగుదొడ్లు అన్నీ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు స్కూలు మానకుండా చదువుకోవాలని ఉంది. – పి.స్వప్న, 5వ తరగతి, మూలిగూడ, విజయనగరం జిల్లా -
మీవాడు సీఎం కాకపోతే.. ఇంత ఫ్రస్ట్రేషనా!
సాక్షి, అమరావతి: ‘మీవాడు ముఖ్యమంత్రి కాకపోతే ఇంత ఫ్రస్ట్రేషనా.. అబద్ధాలు, అసత్యాలతో కూడిన వార్తలను ప్రతిరోజూ ఎల్లో మీడియాలో వండి వారుస్తూ ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లుతారా’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమవాడు సీఎం కాకపోతే వీరి ఫ్రస్ట్రేషన్ ఇంత పీక్లో ఉంటుందా అన్నట్టుగా సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రభుత్వంపైన, సీఎం జగన్పైన పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్న మంచి.. చంద్రబాబు పాలనలో జరిగిన చెడు ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లోనే రూ.1.40 లక్షల కోట్లను పేదవాడి బాగు కోసం ఖర్చు చేస్తే మీకెందుకు కడుపుమంట అని నిలదీశారు. పేదవాడు బాగుపడితే.. రైతు బాగుపడితే.. తద్వారా రాష్ట్రం బాగుపడితే.. చంద్రబాబు అండ్ కో కి నిద్రపట్టదా అని ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. పాఠశాలల దుస్థితికి చంద్రబాబు కారణం కాదా? ‘సీఎం ఇంటి పక్కనే ఇలా..’ అంటూ ఈనాడులో తాడేపల్లిలోని రెండు స్కూళ్ల ఫొటోలతో ఓ వార్త రాశారు. టీడీపీ హయాంలో బడుల్లో కనీసం బెంచీలు, కుర్చీలు, టేబుళ్లు, బ్లాక్ బోర్డులకు కూడా నోచుకోక ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అన్న దానికి ఆ వార్త అద్దం పడుతోంది. పదేళ్ల సైకిల్ కాంగ్రెస్ పాలనలో నాశనమైన ప్రభుత్వ బడులకు ఇది నిదర్శనం. మరోవైపు జగనన్న పాలనలో ఇలాంటి స్కూళ్లకు ఎలా మోక్షం కలుగుతోందో కూడా అందరికీ అర్థమవుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క సర్కారు బడినీ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సీఎం వైఎస్ జగన్ మారుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల ప్రభుత్వ బడులను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో దాదాపు రూ.3,700 కోట్లు ఖర్చు చేసి 15,715 పాఠశాలలను అభివృద్ధి చేశారు. రెండోదశ పనులకూ శ్రీకారం చుట్టారు. స్కూళ్ల అభివృద్ధికి ఏకంగా రూ.16 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. ఇది అభివృద్ధిలా కనిపించటం లేదా. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లి, ప్రతి బిడ్డలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. బహుశా తమ కార్పొరేట్ స్కూళ్ల బేరాల కోసమే ఈ పద్ధతిలో ఎల్లో మీడియా వార్తలు రాస్తుందా. విద్యార్థుల జీవితాలను మార్చేందుకు స్కూళ్లను అభివృద్ధి చేస్తుంటే.. వాస్తవాలు రాయాలని ఈనాడుకు ఎందుకు అనిపించలేదు. కనీసం సూచనలు, సలహాలు ఇస్తూ అన్నా రాశారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఊళ్లో.. నారావారిపల్లె పక్కనే చంద్రబాబు చదువుకున్న స్కూల్ శిథిలావస్థకు చేరితే దాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక తప్ప బాగు పడలేదు. ఇవి ఈనాడుకు, మిగతా ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించవు. అప్పులు పుట్టకూడదని పిటిషన్ వేయించింది వాళ్లు కాదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టకూడదని, స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు బ్యాంకుల నుంచి రుణాలు రాకూడదనే దురుద్దేశంతో నళినీ కుమార్ అనే ఈనాడు అడ్వకేట్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో పిటిషన్ వేయించింది రామోజీ, చంద్రబాబు కాదా. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ రూ.లక్షన్నర కోట్లు అప్పులు చేసి తన కాంట్రాక్టర్లకు, బినామీలకు దోచిపెట్టింది. సీఎం జగన్ రూ.1.40 లక్షల కోట్లను సంక్షేమ కార్యక్రమాల ద్వారా డీబీటీ విధానంలో ఒక్క పైసా అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి అందేవిధంగా చూస్తున్నారు. చేతనైతే వాస్తవాలు రాయండి, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇటీవల కాలంలో మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే మాటలను వక్రీకరించి మిమిక్రీ ఆర్టిస్టులతో రికార్డు చేసి.. వైఎస్సార్సీపీని, ప్రభుత్వాన్ని అభాసు పాల్జేయాలని కొందరు చూస్తున్నారు. మీ కుట్రల అంకంలో ఇదే చిట్ట చివరి మెట్టు. రాజకీయాల్లో ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మారండని హెచ్చరిస్తున్నాం. ఈనాడు రామోజీ పాడు బుద్ధి ‘రైతుల గుండెల్లో మీటర్ల మోత’ అంటూ మరో కథనాన్ని రాశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కరెంటు బకాయిలు కట్టలేదని రైతులపై నిర్దాక్షిణ్యంగా అక్రమ కేసులు పెట్టి, స్పెషల్ పోలీస్ స్టేషన్లు, స్పెషల్ కోర్టులు పెట్టి వేధించినప్పుడు ఒక్క వార్త అయినా రామోజీ రాశారా. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ పగటి పూటే 9 గంటలు ఇస్తుంటే గుండెల్లో మీటర్లు అని రాస్తారా. రాష్ట్రంలోని ప్రతి పొలంలోని ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్ వస్తోందా లేదా అన్నది తెలుసుకునేందుకు మీటర్లు పెడుతున్నాం. లో వోల్టేజీ, హై వోల్టేజీతో మోటార్లు కాలిపోకుండా ఉపయోగపడేందుకు ఫీడర్లు, లోడ్ సరి చూసుకునేందుకే వీటిని పెడుతున్నాం. వీటివల్ల రైతులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుంటే, రైతన్నల కోసం కనీవినీ ఎరగని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే మీకు ఎందుకు నచ్చటం లేదు. -
YS Jagan: మందులపై నిరంతరం తనిఖీలు
నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి. పీహెచ్సీలు మొదలు సీహెచ్సీలు, బోధనాస్పత్రుల్లో 90 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నాణ్యత కలిగిన ఔషధాలే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇందుకోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందుల దుకాణాల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జీఎంపీ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం నిరంతర తనిఖీలు కొనసాగాలని అధికారులను ఆదేశించారు. ఔషధ నియంత్రణ, పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్, వైద్య రంగంలో నాడు–నేడు పనులు, ఆస్పత్రుల్లో నియామకాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాల ఔషధ దుకాణాల్లో తనిఖీలు చేయడంతో పాటు, ఆ సమయంలో గుర్తించిన అంశాలపై ఫాలో అప్ ఉండాలని సూచించారు. ఇచ్చిన సూచనలు, ఆదేశాలను నిర్దేశిత సమయంలో అమలు చేశారా? లేదా? అన్నదానిపై నిర్ణీత కాలం తర్వాత మళ్లీ తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందుల్లో నాణ్యత లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. అందువల్ల అక్కడి డ్రగ్ స్టోర్లలో కూడా తరచూ కచ్చితంగా తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. క్రమం తప్పకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చూడాలని, తద్వారా వారి ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని పేర్కొన్నారు. సమర్థవంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ నిర్వహణపై సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. ఇక నుంచి పిల్లలకు 10 రకాల వ్యాక్సిన్లు పిల్లల్లో న్యుమోనియా నివారణకు ఇకపై న్యూమోకోకల్ కాంజ్యుగట్ వ్యాక్సిన్ను (పీసీవీ) ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వారు సీఎం జగన్కు వివరించారు. ఇప్పటి వరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్నామని, కొత్తగా న్యూమోకోకల్తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలను వినియోగించుకోవాల్సిందిగా సీఎం జగన్ సూచించారు. విలేజ్, వార్డు క్లినిక్లు ఏర్పాటైన తర్వాత అక్కడి నుంచి పిల్లలకు సమర్థవంతంగా వ్యాక్సినేషన్ అందించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు– నేడు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఔషధ వెబ్సైట్లతో ఎంతో ఉపయోగం ► ఔషధాల నాణ్యత, ప్రమాణాలను పాటించేలా చేయడంలో దోహదకారిగా కంప్యూటర్ ఎయిడెడ్ సెలెక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ (సీఏఎస్ఐ) పేరిట ప్రభుత్వం నూతన వెబ్సైట్ను రూపొందించింది. ఔషధ తయారీ సంస్థల నుంచి రిటైల్ దుకాణాల వరకు దీని పరిధిలోకి వస్తాయని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ► టెలిఫోన్, వాట్సాప్, మెయిల్.. ఇతరత్రా మార్గాల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించొచ్చని తెలిపారు. తనిఖీల్లో పారదర్శకత, నాణ్యత, నిరంతర ఫాలోఅప్ కోసం ఈ వెబ్సైట్ బాగా ఉపయోగంగా ఉంటుందన్నారు. ► ఔషధాల్లో కల్తీ నివారించడానికి ప్రివెంటివ్ యాక్షన్ థ్రూ డ్రగ్ సర్వైలెన్స్ (పీఏడీఎస్ – పాడ్స్) పేరిట మరొక వెబ్సైట్ రూపొందించామని తెలిపారు. డ్రగ్స్ తయారీ దారుల నుంచి పంపిణీదారుల వరకు ట్రాకింగ్ ఉంటుందని, ఏ కంపెనీ నుంచి డ్రగ్ తయారైంది.. లైసెన్స్లు ఉన్నాయా? లేవా తదితర అంశాలన్నింటిపైనా తనిఖీ ఉంటుందని వివరించారు. ► గతంలో అజిత్రోమైసిన్ మందును ఉత్తరాఖండ్లో ఒక కంపెనీ తయారు చేసినట్టుగా చెప్పారని, ఆరా తీస్తే అలాంటి కంపెనీయే లేదని, వారు తయారు చేసిన టాబ్లెట్లలో ఎలాంటి డ్రగ్ లేదని తేలిందన్నారు. ఇలాంటి వాటి నివారణకు ఈ వెబ్సైట్ ఉపకరిస్తుందన్నారు. -
కొత్త విద్యా శకానికి నాంది
-
Nadu Nedu: మన అస్త్రం చదువే: సీఎం జగన్
చిరునవ్వుతో చదివించేలా తోడుంటాం.. అక్కచెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా... ప్రతి బిడ్డకు మేనమామగా వారి భవిష్యత్తు బాగుండాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లలు బాగా చదవాలి. వారికి మనం ఇచ్చే ఆస్తి చదువే. వారి కాళ్లమీద వారు నిలబడాలని, పోటీ ప్రపంచంలో రాణించాలని, భవిష్యత్తు బాగుండాలని ఇవన్నీ చేస్తున్నాం. చదువు అనే అస్త్రంతో వారు పేదరికాన్ని జయించాలని కోరుకుంటున్నా. ఏ కష్టం లేకుండా, చిరునవ్వుతో తమ పిల్లలను చదివించేలా అక్కచెల్లెమ్మలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, పి.గన్నవరం (తూర్పుగోదావరి): చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా రాష్ట్రంలో నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వార్షిక విద్యా నివేదిక (అసర్) ప్రకారం మూడో తరగతిలో ఉన్న విద్యార్థుల్లో 22 శాతం మంది మాత్రమే 2వ తరగతి పాఠ్య పుస్తకాలను చదవగలిగే స్థితిలో ఉన్నారని, ఇలాంటి దుస్థితిని తొలగించి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకే విద్యా సంస్కరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో ఆరు రకాలుగా స్కూళ్లు ఉంటాయని, మొత్తం 57 వేల పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు,. ఈ సందర్భంగా నాడు–నేడు ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తొలివిడత స్కూళ్లను విద్యార్థులకు అంకితం చేయడంతోపాటు రెండో విడత పనులను కూడా ప్రారంభించారు. జగనన్న విద్యాకానుక కింద రెండో విడత స్టూడెంట్స్ కిట్లను పంపిణీ చేశారు. నూతన విద్యావిధానం వల్ల చేకూరే ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ విడమర్చి చెప్పారు. ఆ వివరాలివీ.. పి.గన్నవరం పాఠశాలలో..: విద్యార్థినిని ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం జగన్ ఇకపై 6 రకాల స్కూళ్లు ఇక మీదట రాష్ట్రంలో స్కూళ్లన్నీ 6 రకాలుగా ఉంటాయి. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 1వ కేటగిరీలో పంచాయతీలకు అనుబంధంగా ఉండే హామ్లెట్ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్గా ప్రీ ప్రైమరీ 1 (పీపీ–1), ప్రీ ప్రైమరీ 2 (పీపీ–2)లతో ఉంటాయి. కిలోమీటర్ దూరంలోని ఫౌండేషన్ స్కూలుకు అనుబంధంగా ఇవి ఉంటాయి. 2వ కేటగిరీలో గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలోనే ఫౌండేషన్ స్కూలు వస్తుంది. దీనిలో పీపీ –1, పీపీ –2తో పాటు 1, 2వ తరగతులుంటాయి. 3వ కేటగిరీలోని ఫౌండేషన్ ప్లస్ స్కూలులో పీపీ –1, పీపీ –2, 1, 2, 3, 4, 5 తరగతులుంటాయి. 4వ కేటగిరీలో ప్రీ హైస్కూలులో 3 నుంచి 7 లేదా 8వ తరగతుల వరకు ఉంటాయి. 5వ కేటగిరీలోని హైస్కూలులో 3 –10 వరకు తరగతులు ఉంటాయి. 6వ కేటగిరీలోని హైస్కూలు ప్లస్లో 3 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. శాటిలైట్ ఫౌండేషన్ స్కూలుకు కిలోమీటర్ దూరంలోనే ఫౌండేషన్ స్కూలు, 3 కిలోమీటర్ల లోపే హైస్కూలు వ్యవస్థ అందుబాటులో ఉంటాయి. ఇలా ఈ 6 విభాగాల్లోకి వచ్చే 57 వేల స్కూళ్లను నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేస్తాం. దీనికోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలతోపాటు బల్లపై కూర్చొని ముచ్చటిస్తున్న సీఎం దీనివల్ల మేలు ఏమిటంటే... ‘అసర్’ నిర్వహించిన సర్వేలో 3వ తరగతి పిల్లాడికి 2వ తరగతి పుస్తకమిచ్చి చదవమంటే 22 శాతం మంది మాత్రమే చదవగలిగారు. మిగిలిన వారు చదవలేకపోయారు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చడానికే ఈ కార్యక్రమం చేపట్టాం. పేద పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మరి కొద్ది సంవత్సరాల తరువాత గ్రాడ్యుయేట్లు అవుతారు. వీరికి మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు రావాలి. వారి కుటుంబాలు రూపురేఖలు, వారి భవిష్యత్తు మారాలన్న తపన, తాపత్రయంతో చదువులపై ఇంతగా ధ్యాసపెట్టి అడుగులు వేస్తున్నాం. టీచర్, విద్యార్థి నిష్పత్తి సరిగా లేక.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాల్సిన సబ్జెక్టులు 18 ఉండగా ఒక్క టీచరే ప్రతి క్లాసు, ప్రతి సబ్జెక్టుకు చెప్పడం వల్ల టీచర్, విద్యార్థి నిష్పత్తి అమలు కాకపోవడమే కాకుండా సబ్జెక్టులపై ఫోకస్ లేక పిల్లలకు పూర్తి అవగాహన కలగడం లేదు. దీన్ని చక్కదిద్దుతూ ప్రతి సబ్జెక్టుకు, ప్రతి క్లాçసుకు ఒక టీచర్ ఉండేలా మార్పులు చేయడానికి స్కూళ్లను 6 కేటగిరీలుగా మారుస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నాం. విద్యాకానుక బ్యాగును పరిశీలిస్తున్న సీఎం పిల్లల భవిష్యత్తు బాగుండాలని.. అక్కచెల్లెమ్మలకు ఒక తమ్ముడిగా, అన్నగా.. పిల్లలకు మేనమామగా వారి భవిష్యత్తు బాగుండాలని అనేక విద్యాకార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఎస్సీ నియోజకవర్గమైన పి.గన్నవరంలో ఈరోజు మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా దీర్ఘకాలం మూతబడిన బడులు ఈరోజు నుంచి తెరుచుకుంటున్నాయి. డబ్ల్యూహెచ్వో, ఐసీఎంఆర్ లాంటి సంస్థల సూచనలతో పాఠశాలలను తెరుస్తున్నాం. కోవిడ్ ప్రోటోకాల్ పూర్తిగా పాటించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాన్ని యూనిట్గా తీసుకుని పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న చోట స్కూళ్లు తెరవాలని ఆదేశాలిచ్చాం. ఒక్కొక్క గదిలో 20 మందికి మించి విద్యార్థులు ఉండకుండా తరగతులు నిర్వహించాలి. అంతకన్నా ఎక్కువ మంది ఉంటే రోజు విడిచి రోజు వేర్వేరుగా నిర్వహించాలని సూచించాం. టీచర్లందరికీ వాక్సినేషన్ పూర్తి చేశాం. నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, విద్యావ్యవస్థలో మార్పులు, సీబీఎస్ఈ విధానం, ఇంగ్లీషు మీడియం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన లాంటివన్నీ పేద కుటుంబాలకు మేలు జరిగేలా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవే. తాగునీటి స్వచ్ఛతను పరిశీలిస్తూ.. నాణ్యతలో రాజీలేకుండా విద్యాకానుక.. జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువులను నాణ్యతలో రాజీ లేకుండా అందచేస్తున్నాం. 2021 విద్యాసంవత్సరానికి విద్యాకానుక కింద మంచి స్కూలు బ్యాగు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు (ఒక పేజీలో తెలుగు, పక్కనే పేజీలో ఇంగ్లీషులో పాఠం ఉండేలా), నోట్ బుక్కులు, వర్కు బుక్కులు, బెల్టు, 2 జతల సాక్సులు, బూట్లు, కుట్టుకూలీ డబ్బులతో సహా మూడు జతల యూనిఫారంతోపాటు ఈసారి కొత్తగా డిక్షనరీ కూడా ఇస్తున్నాం. ఐదో తరగతి లోపు వారికి బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో డిక్షనరీలో పదాలతో పాటు బొమ్మలు కూడా ముద్రించాం. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డిక్షనరీ సైజ్ పెంచి విద్యాకానుక కిట్లో ఇస్తున్నాం. జగనన్న విద్యాకానుక ద్వారా రెండేళ్లలో రూ.1,380 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది 47.32 లక్షల మంది విద్యార్థులకు రూ.731 కోట్లతో కిట్లు అందిస్తున్నాం నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. లోపాలను సవరించి మంచి నాణ్యతతో కూడిన వస్తువులను పంపిణీ చేయించాం. పిల్లలు మోసేటప్పుడు ఇబ్బంది పడకుండా బ్యాగు బెల్టుల్లో కుషన్ కూడా పెట్టించాం. ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించి మరీ ఇస్తున్నాం. స్కూళ్లలో పలు సదుపాయాలు.. మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ బడులు, హాస్టళ్ల రూపురేఖలు మార్చి కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతున్నాం. పది రకాల అభివృద్ధి కార్యక్రమాలతో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు, టీచర్లుకు మంచి ఫర్నీచర్ ఏర్పాటు చేశాం. గ్రీన్ చాక్ బోర్డులు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మంచినీటి సదుపాయం కల్పించాం. రన్నింగ్ వాటర్తో మంచి టాయిలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చాం. ప్రతి స్కూలుకు రంగులు వేయించి కాంపౌండ్ వాల్, ఇతర మరమ్మతులు చేయించాం. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు, గోరుముద్ద కింద రుచికరమైన, పరిశుభ్రమైన పదార్ధాల తయారీకి కిచెన్షెడ్లు, కట్టించాం. పిల్లల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లీషు ల్యాబ్లను ఏర్పాటు చేశాం. విద్యా కార్యక్రమాలకు రూ.32,714 కోట్లు ఈ రెండేళ్లలో కేవలం విద్యా రంగంలోనే వివిధ కార్యక్రమాల కోసం రూ.32,714 కోట్లు ఖర్చు చేశాం. రెండేళ్లలో జగనన్న అమ్మఒడి ద్వారా 44,48,845 మంది తల్లులకు రూ.13,023 వేల కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన కింద 18,80,934 మంది పిల్లలకు రూ.5,573 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మందికి రూ.2,270 కోట్లు ఇవ్వగలిగాం. గోరుముద్ద కింద 37 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.3,200 కోట్లకుపైగా ఖర్చు చేశాం. విద్యాకానుక కింద 47,32,064 మంది పిల్లలకు రూ.1,379 కోట్లు వ్యయం చేశాం. మనబడి నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్ల అభివృద్ధికి రూ.3,600 కోట్లకుపైగా వెచ్చించాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 30.16 లక్షల మంది కోసం రూ.3,600 కోట్లు వెచ్చించాం. మరుగుదొడ్ల నాణ్యతను వీక్షిస్తున్న ముఖ్యమంత్రి రెండేళ్లలో ప్రత్యక్షంగా ఫలితాలు.. ప్రభుత్వం రెండేళ్లుగా చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అమ్మ ఒడి, గోరుముద్ద, నాడు – నేడు లాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19 వరకు (వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందు) ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల సంఖ్య 70.43 లక్షలు ఉంటే ఇప్పుడది 73.05 లక్షలకు పెరిగింది. కోవిడ్ ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పథకాల వల్లే పెరిగిందని గర్వంగా చెబుతున్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే గత సర్కారు హయాంలోని చివరి సంవత్సరంలో కేవలం 37.20 లక్షల మంది ఉంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 43.43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మన ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల తల్లుల్లో, ప్రతి బిడ్డలోనూ విశ్వాసం పెరిగింది. ఈ ప్రభుత్వం మన మంచి కోసం పనిచేస్తోందన్న భరోసా ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యను హక్కుగా చదువుకునేలా చర్యలు చేపట్టాం. పైలాన్ ఆవిష్కరణ.. రెండో విడతకు శ్రీకారం మనబడి నాడు–నేడు తొలివిడత ద్వారా 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేసిన నేపథ్యంలో సోమవారం నుంచి రెండో విడత స్కూళ్లలో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లను విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా అందచేశారు. విద్యాకానుక వస్తువుల నాణ్యతను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాటు విజ్ఞప్తి మేరకు తొగరపాయ బ్రిడ్జి, అప్పనపల్లి లిఫ్ట్, మొండెపు లంక చానెల్ ఆధునికీకరణ పనులను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అమ్మలా అన్నం.. థ్యాంక్స్ మామయ్యా గతంలో స్కూల్కి వెళ్లేటప్పుడు అమ్మ రోజూ లంచ్ బాక్స్ పెట్టేది. జగన్ మామయ్య సీఎం అయిన తర్వాత మా అందరికీ రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజుకో వెరైటీ ఫుడ్ అందచేస్తున్న జగన్ మామయ్యకు చాలా చాలా థ్యాంక్స్. గతంలో స్కూల్లో బాత్రూమ్కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రన్నింగ్ వాటర్తో పరిశుభ్రంగా ఉన్నాయి. నేను పెద్దయ్యాక మ్యాథ్స్ టీచర్ అవుతా. సీఎం మామయ్య మా కలలను నెరవేరుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. – ప్రణవి, 5వ తరగతి విద్యార్థిని, ఎంపీపీ స్కూల్, మొగలికుదురు అందరికీ నాణ్యమైన విద్య.. జగనన్న విద్యా కానుక కిట్ చాలా బావుంది. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి పథకాలు గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రతీ విద్యార్థి నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. మన బడి ‘నాడు–నేడు’ విద్యార్థులకు కోహినూర్ వజ్రం లాంటింది. బలవర్ధకమైన భోజనం అందిస్తున్నారు. నాన్న టైలర్. వికలాంగుల పింఛన్ వస్తోంది. మా అమ్మకు రెండు సార్లు అమ్మ ఒడి వచ్చింది. ఆన్లైన్ తరగతుల కోసం మొబైల్ ఫోన్ తీసుకున్నాం. థ్యాంక్యూ జగన్ మామయ్యా. – కె.సాయి శరణ్య, 10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పి.గన్నవరం సీఎం చెప్పారంటే.. చేస్తారంతే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏదైనా మాట చెప్పారంటే చేసి తీరుతారన్న నమ్మకం ప్రజలందరిలో బలంగా ఉంది. సీఎం జగన్ ఏపీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపారు. నాడు – నేడు మహాయజ్ఞంలో తొలిఘట్టం పూర్తి చేసి ముందడుగు వేస్తున్న ధీరుడు. విద్య ఆవశ్యకతను చాటిచెప్పిన బీఆర్ అంబేడ్కర్, నెల్సన్ మండేలా, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి మహనీయుల బాటలో సీఎం ముందుకు సాగుతున్నారు. గత పాలకులు ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తే జగనన్న మాట మేరకు పాఠశాలల స్థితిగతులను మారుస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి -
6 రకాల స్కూళ్ళు
-
ప్రతి బడిలో 10 మార్పులు
-
సీఎం జగన్ విద్యారంగంలో పెను మార్పులు తెచ్చారు : మల్లాది
-
వైఎస్సార్ జిల్లాలో 250 కోట్లతో 1048 కొత్త పాఠశాలలు అభివృద్ధి
-
కార్పొరేట్ విద్యను కామన్ మ్యాన్ దగ్గరకి తెచ్చిన చరిత్ర కారుడు జగన్
-
చదువుకోవడానికి మంచి వాతావరణం కలిగిందంటున్న విద్యార్థులు
-
జగన్ మామ అంటూ ఇంగ్లీష్ స్పీచ్ తో అదరకొట్టిన చిన్నారి
-
విద్యా కానుక కిట్స్ అందజేసిన సీఎం వైఎస్ జగన్
-
స్కూళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం
-
‘‘జై జగన్ మామయ్య.. జై జై జగన్ మామయ్య’’
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభించారు. విద్యాకానుక కింద కొంతమంది విద్యార్ధులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పి. గన్నవరం జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. జగన్ మామయ్య మా స్కూల్కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టైలర్, అమ్మ గృహిణి. జగన్ మామయ్య విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అన్ని ప్రభుత్వ పథకాలకు గానూ ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. కొత్త విద్యా విధానం.. కొత్త కొత్త అవకాశాలకు తలుపు తెరుస్తోంది. గతంలో పేద కుటుంబాలనుంచి వచ్చిన వాళ్లు సరైన చదువులు లేక తమ ఆశయాలను సాధించలేకపోయేవారు. కానీ, జగన్ మామయ్య సీఎం అయిన తర్వాత విద్యార్థులు సంతోషంగా తమ చదువుల్ని పూర్తి చేస్తున్నారు. నాణ్యమైన విద్యను పొందుతున్నారు. చాలా మంచి పథకాలను జగన్ మామయ్య ప్రవేశపెట్టారు. ‘జగనన్న విద్యాకానుక’.. ‘అమ్మ ఒడి’.. ‘జగనన్న వస్త్ర దీవెన’.. ‘జగనన్న విద్యాదీవెన’.. ‘జగనన్న గోరుముద్ద’.. వంటి పథకాలు చాలా అద్భుతమైనది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మన బడి నాడు-నేడు ఓ కోహినూర్ వజ్రం. ఈ పథకం ద్వారా స్కూళ్లు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయి. పిల్లలను చూసుకోవటానికి ఆయాలను పెట్టారు. మంచి భోజనం అందిస్తున్నారు. విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా జగన్ మామయ్య పథకాలతో ఎంతో లబ్ధిపొందుతున్నారు. జై జగన్ మామయ్య.. జై జై జగన్ మామయ్య’’ - సాయి శరణ్య, పదవ తరగతి, జెడ్పీపీ హై స్కూల్, పి. గన్నవరం -
దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది: ఆదిమూలపు
సాక్షి, తూర్పు గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలోని స్కూళ్ల రూపురేఖలు మార్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభించారు. విద్యాకానుక కింద కొంతమంది విద్యార్ధులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పి. గన్నవరం జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించాం. తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాల అభివృద్ధి చేశాం. రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాం. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది’’ అని అన్నారు. -
జగన్ మామయ్యకు చాలా చాలా థాంక్స్
-
జగన్ మామయ్యకు చాలా చాలా థాంక్స్
సాక్షి, తూర్పుగోదావరి : ‘‘మల్లె వంటి మనసు కలిగిన జగన్ మామయ్యకు నా హృదయ పూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్న గారు హెచ్ఎమ్గా పని చేస్తున్నారు. ప్రతి రోజు నాన్నతోనే పాఠశాలకు వెళతాను. సెకండ్ క్లాస్ చదివేటప్పుడు 20 మంది స్నేహితులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 88 మంది స్నేహితులయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన చదువుల కోసం జగన్ మామయ్య చేస్తున్న సేవలను మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్నారు. గతంలో బడికి పోయే టప్పుడు అమ్మ లంచ్ బాక్స్ పెట్టేది. అదే స్కూళ్లో తినేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడి పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ‘‘ జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో భాగంగా రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆ భోజనం తినటం వల్ల మేము చాలా యాక్టివ్గా ఉంటున్నాము. రోజుకో వెరైటీ ఫుడ్ తింటున్నాము. ఇలాంటి ఫుడ్ అందిస్తున్న జగన్ మామయ్యకు చాలా చాలా థాంక్స్!’’ అని విద్యార్థిని ప్రణవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. తమకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేసింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పి. గన్నవరం జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగలికుదురు గ్రామానికి చెందిన 5వ తరగతి ప్రణవి ఇలా తన అనుభవాన్ని పంచుకుంది. -
నాడు-నేడు ద్వారా ప్రతి సర్కారు బడిలో 10 మార్పులు: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సీఎం జగన్ సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం. నేడు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటిది ఈ రోజు నుంచి బడులు తెరుస్తుండగా.. మరో రెండు కార్యక్రమాలు జగనన్న విద్యా కానుక, నాడు నేడు రెండోదశ పాఠశాల పనులకు శ్రీకారం చుట్టడం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండేళ్ల నుంచి విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ సూచనల మేరకు బడులు తెరిచాం. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించాం. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాం. టీచర్లు అందరికి టీకాలిచ్చాం’’ అని తెలిపారు. విద్యా కానుక.. ‘‘పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' ఇస్తున్నాం. దీనిలో భాగంగా 47.32 లక్షల మంది విద్యార్ధులకు 731.30 కోట్లతో 'జగనన్న విద్యాకానుక' ఇస్తున్నాం. విద్యాకానుకలో ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్ భాషల్లో ఉన్న బై లింగువల్ టెక్ట్స్బుక్స్, నోట్బుక్స్, వర్క్బుక్స్, డిక్షనరీ ఇస్తున్నాం. ఐదో తరగతి వరకు విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలతో ఇంగ్లీష్ డిక్షనరీ ఇస్తున్నాం’’ అని తెలిపారు. నాడు-నేడుతో మార్పులివే.. ‘‘నాడు-నేడుతో తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి చేశాం. నేడు రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నాం. నాడు-నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 మార్పులు చేస్తున్నాం. వాటిలో భాగంగా స్కూళ్లలో ఫర్నిచర్, నీటివసతి, రక్షిత తాగునీరు, పెయింటింగ్స్.. గ్రీన్ చాక్ బోర్డ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ప్రహరీ గోడ, వంటగది వంటి వసతులు కల్పించాం. నాడు-నేడుతో ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ల్యాబ్ కూడా తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ తెలిపారు. విద్యా వ్యవస్థ 6 విభాగాలు.. ‘‘నాడు-నేడుతో అంగన్వాడీలను కూడా అభివృద్ధి చేశాం. నాడు-నేడుతో 57వేల స్కూళ్ల రూపురేఖలు మారబోతున్నాయి. విద్యా వ్యవస్థ ఆరు విభాగాలుగా మారబోతుంది. శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా మారనున్న పూర్వ ప్రాథమిక విద్య 1, 2 పి.పి(ప్రీప్రైమరీ)... 1, 2 పీపీతో పాటు ఒకటి, రెండు తరగతులుంటే ఫౌండేషన్.. ఒకటి నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్.. 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు.. 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే ఉన్నత పాఠశాలలు.. 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్గా మార్పు చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు. ‘‘ఒక్కో సబ్జెక్ట్కు ఒక టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. గత రెండేళ్లతో పోల్చితే స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్లలోనే రూ.32,714 కోట్లు ఖర్చు చేశాం. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే’’ అన్నారు సీఎం జగన్. -
మనబడి నాడు-నేడు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సీఎం వై ఎస్ జగన్
-
నేడు తూర్పు గోదావరికి సీఎం జగన్
-
‘జగనన్న విద్యా కానుక’ ప్రారంభించిన సీఎం జగన్
అప్ డేట్స్: మనబడి నాడు-నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. తరగతి గదిలోని గ్రీన్ బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి సీఎం జగన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని, కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించామని, పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' కింద బై లింగువల్ టెక్ట్స్బుక్స్, నోట్బుక్స్, వర్క్బుక్స్, డిక్షనరీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ► పి. గన్నవరం హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ.. స్కూళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను రూపొందించామని పేర్కొన్నారు. ► మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ స్కూళ్ల రూపురేఖలు మార్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారని తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని చెప్పారు. తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాల అభివృద్ధి చేశామని, రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్ బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్కు వివరించారు. ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలసుకొని.. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్ను భుజనా వేసుకొని మరీ సీఎం జగన్ పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను సీఎం జగన్ పరిశీలిచారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్ ఆవిష్కరించి సీఎం జగన్ ప్రారంభించారు. ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్ జగన్ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్ ప్రారంభించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మన బడి నాడు - నేడు కార్యక్రమంలో తోలిదశ పనులు పూర్తి
-
నేడు తూర్పు గోదావరికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడే సామర్థ్యాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విద్యార్థుల్లో నెలకొల్పుతున్నారు. వారిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతూ అత్యుత్తమ మానవ వనరుల తయారీయే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వారి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. తొలివిడత పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ వేదికగా నిలుస్తోంది. దీంతోపాటు నాడు–నేడు రెండో విడత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఇలా.. ► సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. ► 11 గంటలకు పి.గన్నవరం మండలం పోతవరం చేరుకుంటారు. ► అక్కడినుంచి పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్కు చేరుకుంటారు. తొలి విడత పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించిన అనంతరం.. రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం శ్రీకారం చుడతారు. ► రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ప్రారంభిస్తారు. 8 పాఠశాల వద్ద ఉన్న భవిత కేంద్రం, గ్రంథాలయం, లేబొరేటరీలు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను జగన్ సందర్శిస్తారు. ► విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. టాయిలెట్లను పరిశీలిస్తారు. అనంతరం నాడు–నేడు పైలాన్ను ఆవిష్కరించి, పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► మ. 1.30 గంటలకు పోతవరం నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇది తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని శింగంశెట్టి ప్రభావతి జెడ్పీ ఉన్నత పాఠశాల. ‘నాడు–నేడు’ ద్వారా ఆధునికీకరించిన పాఠశాలలను సీఎం వైఎస్ జగన్ నేడు ఈ స్కూలు వేదికగా ప్రారంభిస్తున్నారు. 1970లో ఏర్పాటైన ఈ పాఠశాలలో మొత్తం 25 గదులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు ఉండేవి కావు. తాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే. పాఠశాల గదుల్లో విద్యుత్ సౌకర్యం మాటేలేదు. పెచ్చులూడిపోయిన ఫ్లోరింగ్తో విద్యార్థులు నానా అవస్థలు పడేవారు. నాడు–నేడు కార్యక్రమం వల్ల 749 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రూ.64 లక్షల వ్యయంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రతి తరగతి గదికి నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు, టైల్స్తో ఆకర్షణీయంగా ఫ్లోరింగ్ను తీర్చిదిద్దారు. మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశారు.ఆధునిక హంగులతో మరుగుదొడ్లు నిర్మించారు. లైబ్రరీ, ఆధునిక ల్యాబ్ ఏర్పాటు చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో తెరుచుకున్న బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ జాగ్రత్తలు చేపట్టింది. పాఠశాలల వారీగా కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) అమలుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శకాలు ఇవి.. ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతిస్తున్నారు. ఇక విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే తరగతులకు హాజరు కావాలి. విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి. పాఠశాల లోపల, బయట పరిసరాల్లోనూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్ అమలు చేస్తారు. పాఠశాలలు గతంలో నిర్దేశించిన సమయాల ప్రకారమే పని చేస్తాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ స్కూళ్లకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. పిల్లల సంఖ్యకు తగినమేర వసతి లేని పక్షంలో తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. కోవిడ్ లక్షణాలున్న వారికోసం ఐసోలేషన్ విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించే ముందు వారికి థర్మల్ స్కానింగ్ చేశారు. విద్యార్థులలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే వారిని ఇళ్లకు తిరిగి పంపి వైద్య పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ లక్షణాలున్న వారికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఇళ్లలో వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు స్కూలుకు రాకుండా ఇళ్ల వద్దనే ఉండేలా సూచించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. అనారోగ్యంతో ఉండే విద్యార్థులు కూడా స్కూళ్లకు రాకుండా హెచ్ఎంలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థులకు వైద్య పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్సీలను సంప్రదించాలి. ఇద్దరు విద్యార్థులు, సిబ్బందిలో ఒకరికి ప్రతి వారం ర్యాండమ్గా వైద్య పరీక్షలు చేయించాలి. వారిలో ఎవరికైనా పాజిటివ్ ఉంటే కనుక మొత్తం తరగతిలోని విద్యార్థులందరికీ పరీక్షలు జరిపేలా విద్యాశాఖ అన్ని స్కూళ్లకు ఆదేశాలు పంపింది. భౌతిక దూరం తప్పనిసరి తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయించారు. మరోవైపు మధ్యాహ్న భోజనం అందించే సమయంలో అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు తరగతులకు వేర్వేరు సమయాల్లో అందించనున్నారు. స్కూలు వదిలిన సమయంలో అందరినీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధి ఇచ్చి తరగతుల వారీగా బయటకు పంపనున్నారు. స్కూలుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తప్పనిసరిగా స్నానం చేయడమో లేదా చేతులు కడుక్కొని మాత్రమే ఇళ్లలోకి ప్రవేశించాలని సూచిస్తున్నారు. స్కూలులో కూడా కోవిడ్ జాగ్రత్తలపై ఒక పీరియడ్లో అవగాహన కల్పిస్తారు. స్కూలు అసెంబ్లీ, బృంద చర్చలు, గేమ్స్, స్పోర్ట్సు వంటివి పూర్తిగా రద్దు చేశారు. -
నాడు-నేడు : 15 వేలకు పైగా పాఠశాలలు జాతికి అంకితం
-
రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు సీఎం జగన్ కిట్లు పంపిణీ చేయనున్నారు. సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు స్థానిక జెడ్పీ హైస్కూలులో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు శనివారం పరిశీలించారు. అధికారులకు మంత్రులు పలు సూచనలిచ్చారు. తరగతి గదులు, ఫర్నిచర్, పెయింటింగ్స్, మరుగుదొడ్లను, ‘నాడు–నేడు’ పైలాన్ను పరిశీలించారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు సరిపడేలా చిన్న సైజు మాస్కులు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. ‘నాడు–నేడు’లో భాగంగా 10 రకాల మౌలిక సదుపాయాలు బాగా ఏర్పాటు చేశారని మంత్రి సురేష్ ప్రశంసించారు. శుక్రవారం అర్ధరాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షాలు అడ్డంకిగా మారినప్పటికీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పాఠశాల ఆవరణలో భారీ వాటర్ ప్రూఫ్ షెడ్డును నిర్మించారు. షెడ్డు పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మోటార్లు ఏర్పాటు చేసి తోడుతున్నారు. వర్షాలకు పాఠశాల ఆవరణ చిత్తడిగా మారింది. పాఠశాల ముఖద్వారం వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ వరకూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, అమలాపురం ఆర్డీఓ వసంత రాయుడు, డీఎస్పీ వై.మాధవరెడ్డి, డీఈఓ ఎస్.అబ్రహం తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
ఏపీలో విద్య దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి : నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, విద్యా కానుక, నూతన విధానాల్లో బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని విద్యా విధానం దేశానికే ఆదర్శం అని విద్యా రంగం నిపుణులు కొనియాడారు. ‘75 వసంతాల స్వరాజ్యంలో విద్యా సంస్కరణలు– ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో శనివారం మేధావుల వర్చువల్ సమావేశం నిర్వహించారు. పలువురు మేధావులు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గడిచిన రెండేళ్లలో విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయన్నారు. నాడు – నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లిష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు బా టలు వేశారని చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తుండటం మంచి పరిణామం అని ప్రశంసించారు. అమ్మ ఒడి, విద్యా కానుకతో ఎంతో సామాజిక ప్రయోజనం ఉందని విశ్లేషించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభం కానున్న తరుణంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలువురు విద్యావేత్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని సమావేశ సమన్వయకర్త, ఎరుక పత్రిక సంపాదకులు జి.ఆంజనేయులు వివరించారు. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పి.విజయప్రకాష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లకు రెండు కమిషన్లు తేవడం మంచి పరిణామమన్నారు. ఫీజు రీయింబ ర్స్మెంట్ ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు. ఒక్క ఏడాదిలోనే రూ.25,714 కోట్లు 2014– 2019 మధ్య 5.62 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్గా మారితే, గత రెండేళ్లుగా 6.63 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా చేరారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ బాలమోహన్ దాస్ తెలిపారు. విద్య కోసం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రూ. 25,714 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 1,60,75, 373 మంది లబ్ధిదారులకు లాభం చేకూరిందని, 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్లు వారి ఖాతాలలోకి నేరుగా వేశారన్నారు. నీతి అ యోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2016 – 2018 మధ్య కాలంలో దాదాపు ఆరువేల స్కూల్స్ మూతపడ్డాయని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎన్.వెంకట్రావు తెలిపారు. సీఎం జగన్ గొప్ప ఆలోచన తీరు వల్ల నేడు ఆ పరిస్థితి మారి, మూత పడ్డ స్కూల్స్ తెరుచుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పిల్లలు పరుగెత్తుకుంటూ స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ ముత్యాలనాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ లక్ష్యం ఎంతో ఉపయుక్తం సోషల్ జస్టిస్, సమానత్వం అనేది విద్యతోనే సాధ్యం అని, వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ వై.హరగోపాల్ రెడ్డి ప్రశంసించారు. ఈ పరిణామం మంచి విజ్ఞానవంతులను, మంచి పౌరులను అందించి మంచి సమాజాన్ని తయారు చేస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ వర్గాలకు ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్దే అని రాయలసీమ యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ కె.కృష్ణ నాయక్ కొనియాడారు. -
Nadu Nedu: మా బడి భలే భలే
అఖిల్ సిటీలో కాన్వెంట్లో చదువుతున్నాడు. కోవిడ్ టైమ్ కావటంతో అమ్మమ్మ–తాతయ్య ఊరికెళ్లాడు. ఓ రోజు అక్కడి ప్రభుత్వ స్కూలుకు తీసుకెళ్లాడు వాళ్ల తాతయ్య. ఆ స్కూల్లో ఉన్న సౌకర్యాలు చూసి అఖిల్ మైమరచిపోయాడు. అక్కడి ల్యాబ్లో, పచ్చిక బయలులో రెండు మూడు గంటలు గడిపేశాడు. తిరిగి వస్తూ ఆ స్కూల్ గురించి వాళ్ల తాతయ్యతో ఒకటే కబుర్లు. మరి కాన్వెంట్లో చదువుతున్న పిల్లాడికి ల్యాబ్ గురించి తెలీదా? నిజానికి ల్యాబ్ అంటే తెలుసు. కానీ వాళ్ల స్కూల్లో మాత్రం లేదు. ఆ స్కూలు మాత్రమే కాదు. అలా దాదాపు 90 శాతం ప్రయివేటు స్కూళ్ల పరిస్థితి అదే. ఇళ్ల మధ్య.. రణగొణ ధ్వనుల మధ్య చిన్న చిన్న బిల్డింగులే వారి స్కూళ్లు. చదువుకుంటే చాలనే అమ్మానాన్నలు... ఫీజులొస్తే చాలనుకునే యాజమాన్యాలు. మరిక ల్యాబ్లు ఎక్కడ? పచ్చిక బయళ్లు ఇంకెక్కడ? నిజానికి ప్రభుత్వ స్కూళ్లలో చాలా వాటికి ల్యాబ్లు, పచ్చిక బయళ్లు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేక పరికరాలన్నీ మూలన పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చేపట్టిన ‘నాడు–నేడు’ పుణ్యమాని వాటన్నింటికీ మహర్దశ పట్టుకుంది. చాలా వరకు కొత్త పరికరాలు కూడా వచ్చాయి. వీలైన ప్రతి స్కూల్లోనూ పచ్చని చెట్లతో కూడిన ఆవరణ, పచ్చిక బయళ్లను అభివృద్ధి చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో, హైస్కూల్లో, యూపీ స్కూలులో ఇంగ్లిష్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. రన్నింగ్ వాటర్తో కూడిన అధునాతన వాష్ రూమ్లను నిర్మించారు. తాగునీటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో విద్యార్థులెవరూ మధ్యలో ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇలా తొలివిడతలో ముస్తాబయిన స్కూళ్లన్నీ పిల్లల్ని భలేగా ఆకట్టుకుంటున్నాయి. బొమ్మలు చూస్తూ.. ఆహ్లాదకర వాతావరణ మధ్య ఆడుతూ పాడుతూ చదువుకుంటే ఆ మజాయే వేరనేది టీచర్లూ అంగీకరించే మాట. మరో రెండ్రోజుల్లో పిల్లలందరికీ కొత్త స్కూలు అనుభవంలోకి రాబోతోంది మరి! గతంలో మా పాఠశాలలో 1వ తరగతినుంచి 7వ తరగతివరకు 168 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెండింతలు పెరిగి 300కు చేరింది. ఇకపై మురారిపల్లె గ్రామం నుంచి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వారు ఎవరూ ఉండరు. పట్టణాల్లోని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో విద్యార్థులకు కావలసిన వసతులన్నీ కల్పించాం. చిన్న పిల్లలు ఆడుకోవటానికి పార్కుల్లో ఉండే రంగులరాట్నం, జారుడు బండ, ఊయల లాంటివి ఏర్పాటు చేశాము. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మురారిపల్లె యూపీ స్కూల్ స్వాతంత్య్రోద్యమానికి అక్షరాయుధాలు అందించిన గ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని సిద్ధాపురం. ఇంతవరకూ మా పాఠశాలలో కనీస వసతులు లేవు. మరుగుదొడ్డి ఉన్నప్పటికీ పాఠశాలకు వెళ్లిన వెంటనే గుప్పున వచ్చే దుర్వాసనతో ముక్కు బద్దలయ్యేది. గతంలో పిల్లలు చేతులు కడుక్కునేందుకు సౌకర్యమే ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో నాడు–నేడు పథకం మా పాఠశాలకు మంజూరైందనగానే పట్టరాని ఆనందం కలిగింది. ఇప్పుడు ప్రహరీ నిర్మాణం, అధునాతన, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల కల్పనతో సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఎం వైఎస్ జగన్చేపట్టిన ఈ అభివృద్ధి పేద విద్యార్థుల ఆరోగ్య, విద్యా వికాసానికి ఎంతో దోహదపడుతుంది. ప.గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం పాఠశాలలో గతంలో తాగునీటి పరిస్థితి ఇలా..; ప్రస్తుతం పాఠశాలలో ఏర్పాటుచేసిన మంచినీటి కుళాయిలు, హ్యాండ్ వాష్ బేసిన్ ‘వర్షం పడితే మా స్కూల్లో మొత్తం గదులన్నీ నీరు కారి విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థమయ్యేది కాదు. మరుగుదొడ్లు లేక పిల్లల్ని ఇళ్లకు పంపేవాళ్లం. నాడు –నేడు కార్యక్రమంతో పాఠశాలలో గదులన్నీ ఆధునికీకరించారు. ఆట స్థలానికి ఎకరం భూమిని సేకరించాం. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్తో విద్యార్థులకు తాగునీటి కొరత తీరింది. వాష్రూమ్ కోసం పిల్లలు ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అనేది అనంతపురం జిల్లా ఓడీ చెరువు మండలం మిట్టపల్లి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ ఎం.పి.పి.స్కూల్ ఆవరణ కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్లలోని ప్రాథమికోన్నత పాఠశాలలోనూ వర్షం వస్తే అంతా బురదమయమైపోయేది. నాడు–నేడుతో మెరకతోలి ఆవరణంతా ఎత్తు చేశారని, విద్యార్థులను ఆకర్షించేలా తరగతి గదిలో బొమ్మలు వేశారని.. మల్టీప్లెక్స్ థియేటర్లో మాదిరి అధునాతన సౌకర్యాలతో మరుగుదొడ్లను నిర్మించారని విద్యార్థిని తల్లి పల్లగాని వెంకటేశ్వరమ్మ సంబరపడుతోంది. ‘‘ఐదో తరగతి చదువుతున్న మా అమ్మాయి చందన ఇక వాష్రూమ్ కోసం ఇంటికి రానవసరం లేదు. ఆటస్థలం అభివృద్ధి చేశారు. కొంత స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు. మొత్తంగా స్కూలంటే ఇలా ఉండాలనేలా తీర్చిదిద్దారు’’ అంటూ ప్రశంసిస్తోంది. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ గతంలో మా పాఠశాలలో మరుగుదొడ్లు లేక చాలా అవస్థలు పడేవాళ్లం. మూత్ర విసర్జనకు స్కూలు పక్కనే ఉన్న చిన్న స్థలంలో పని కానిస్తుండేవాళ్లం. టీచర్లు, సహచర విద్యార్ధినిలు అటుగా రాకపోకలు సాగిస్తున్నప్పడు మూత్ర విసర్జన చేయడానికి ఇబ్బందిగా ఉండేది. చేతులు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉండేవి కావు. మల విసర్జనకు పరుగెత్తుకుంటూ ఇళ్లకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వం పాఠశాలలో మరుగుదొడ్లను కొత్తగా నిర్మించింది. నీటి వసతి కోసం ట్యాంక్ను కట్టించింది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు సమకూరడం గర్వంగా ఉంది. విద్యార్థులు మూత్ర విసర్జనకు వినియోగించే ఖాళీ స్థలం; సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన వాష్ రూమ్ – సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్ -
రేపటి నుంచే స్కూళ్లు.. పిల్లల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం
►రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తరగతి గదుల్లో, బయట పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. పిల్లల ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసింది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ప్రతి స్కూల్కు ప్రత్యేకంగా ఎస్ఓపీ) రూపొందించి, అమలు చేస్తోంది. సోమవారం నుంచి అన్ని తరగతులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లకు వ్యాక్సినేషన్ దాదాపు పూర్తి చేశారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినందున ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అయినప్పటికీ పిల్లల ఆరోగ్య భద్రత ముఖ్యమైన అంశం కాబట్టి, ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా సెక్షన్కు 20 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకు గదులు సరిపోకపోతే 6, 7, 8 తరగతులకు ఒక రోజు, 9, 10 తరగతులకు మరుసటి రోజు (రోజు విడిచి రోజు) తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమికంగా అంటే 1, 2, 3 తరగతులకు ఒక రోజు, 4, 5 తరగతులకు మరుసటి రోజు తరగతులు ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. పాఠశాల తరగతి గదుల్లోనే కాకుండా ఆవరణలో, బయట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నారు. పిల్లల్లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారిని వేరుగా ఉంచేందుకు ఐసోలేషన్ రూమును ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంటనే సమీపంలోని పీహెచ్సీ, ఆసుపత్రికి తెలియచేసి, వారికి వైద్యం అందేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఫౌండేషన్ విద్యతో అందలం బాల్య దశలోనే విద్యార్థులకు బలమైన పునాది వేయాలన్న లక్ష్యంలో భాగంగానే ప్రభుత్వం ఫౌండేషన్ స్కూళ్ల విధానాన్ని ప్రారంభిస్తోంది. సీఎం వైఎస్ జగన్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపర్చకముందే రాష్ట్రంలో దీనిపై చర్యలు చేపట్టారు. ఫౌండేషన్ విద్య ద్వారా భవిష్యత్తులో మన విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను సులువుగా అందుకోగలిగే స్థాయికి చేరుకుంటారు. ఇప్పటివరకు ఉన్న వ్యవస్థలో ఆ మేరకు ప్రమాణాలు నెలకొల్పే అవకాశం లేనందునే కొత్త విధానం తీసుకొస్తున్నారు. 5+3+3+4 విధానంలో శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ విధానంలో స్కూళ్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి మ్యాపింగ్ పూర్తయింది. తొలుత అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు ఒకే ఆవరణలో లేదా పక్కపక్కనే ఉన్న చోట్ల ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. మిగిలిన చోట్ల అంచెలంచెలుగా రెండేళ్లలో కొత్త విధానం అమల్లోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నాడు–నేడుతో మౌలిక సదుపాయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మనబడి నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఎంఆర్సీ, భవిత కేంద్రాల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. తొలి విడతలో 15,715 స్కూళ్లలో రూ.3,600 కోట్లకు పైగా నిధులతో వివిధ సదుపాయాలు కల్పించింది. ఇదంతా సమాజం ఆస్తి కనుక, వీటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల కమిటీలను ఈ పనుల పర్యవేక్షణలో భాగస్వామ్యం చేసింది. హెడ్మాస్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల కమిటీలు అభివృద్ధి చేసిన స్కూళ్లను జాగ్రత్తగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం పలు సూచనలు చేసింది. మరుగుదొడ్ల నిర్వహణకు ఆయాలను ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు వేతనాన్ని పెంచింది. రెండో విడతలో రూ.4,800 కోట్లతో 16 వేల పాఠశాలల అభివృద్ధి పనులకు ఈనెల 16న శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ చర్యలతో పెరిగిన చేరికలు విద్యారంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. తద్వారా పారదర్శకత ఏర్పడడంతో పాటు రిజర్వేషన్లు తప్పక అమలవుతాయి. ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ చర్యల కారణంగా స్కూళ్లలో విద్యార్థులు గతంలో కంటే 6 లక్షల మందికి పైగా పెరిగారు. కొత్తగా 2.5 లక్షల మంది స్కూళ్లలో చేరారు. డ్రాపవుట్ల శాతం బాగా తగ్గింది. బోధనా సామర్థ్యం పెంపుపై దృష్టి బోధనలో నాణ్యతా ప్రమాణాలను పెంచడం అత్యంత ఆవశ్యకం. ఇందుకు ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించాలి. ఇందుకోసం ప్రభుత్వం వారికి శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం ఒంగోలులో ఏర్పాటు చేస్తున్న ఆంధ్రకేసరి ప్రకాశం యూనివర్సిటీ ద్వారా టీచర్ ఎడ్యుకేషన్పై మరింతగా దృష్టి సారించనుంది. స్కూళ్లు తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు ఇలా.. ►10% కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లోనే స్కూళ్లు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసినందున వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి వారం కోవిడ్ కేసులను గుర్తిస్తుండాలి. ►బోధన, బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ హాజరు కావాలి. రెగ్యులర్ సమయం ప్రకారమే తరగతులు కొనసాగాలి. ►అన్ని విద్యా సంస్థల్లో కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. ►పోర్టబుల్ థర్మల్ స్కానర్తో ప్రవేశద్వారం వద్దే విద్యార్థులను పరిశీలించాలి. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఇంటికి పంపి, పరీక్షలు చేయించుకోమని చెప్పాలి. ►శానిటైజర్ ఏర్పాటు చేసి, తరచూ చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి. స్కూలు అసెంబ్లీ, గ్రూప్ వర్కులు, గేమ్స్ వంటివి నిర్వహించరాదు. ►తరగతి గదుల్లో 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. టాయిలెట్ల వద్ద, భోజనాల సమయంలోనూ ఇది పాటించాలి. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ►ఇళ్లలో వృద్ధులైన తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఉంటే పరిస్థితులు చక్కబడే వరకు ఇళ్ల వద్దనే ఉండాలి. ►రోగగ్రస్థులుగా ఉన్న విద్యార్థులను స్కూళ్లకు అనుమతించరాదు. ►మధ్యాహ్న భోజన పదార్థాలను వేర్వేరు సమయాల్లో వేర్వేరు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలి. పాఠశాల వదిలినప్పుడు గుంపుగా బయటకు పంపకూడదు. ►ప్రతి వారం ప్రతి స్కూలులో ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది నుంచి ఒకరికి ర్యాండమ్ టెస్టులు చేయాలి. ఎవరికైనా పాజిటివ్ లక్షణాలుంటే అందరికీ పరీక్షలు చేయించాలి. ►కోవిడ్పై తీసుకోవలసిన జాగ్రత్తలకు పీరియడ్ను కేటాయించాలి. స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ప్రతి విద్యార్థి స్నానం చేసేలా అవగాహన కల్పించాలి. ►పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, గ్లాసులు ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం. ►టాయిలెట్లను రోజూ శుభ్రం చేయించాలి. స్కూలు బస్సుల్లేని పిల్లలను తల్లిదండ్రులే స్కూళ్ల వద్ద దింపాలి. ►ప్రతి స్కూలులో కోవిడ్ జాగ్రత్తల అమలుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలి. మిగిలిపోయిన టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. కట్టుదిట్టంగా విద్యా కానుక జగనన్న విద్యాకానుక కిట్లను రూ.800 కోట్లతో ఈనెల 16 నుంచి 31వ తేదీలోగా రాష్ట్రంలోని దాదాపు 48 లక్షల మంది విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాగుపై విద్యార్థి పేరు, తరగతి, కిట్లలోని వస్తువులను పొందుపరుస్తున్నారు. 3 జతల యూనిఫాం క్లాత్, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులు, నోట్ బుక్కులు తదితరాలను కిట్ రూపంలో అందిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టినందున పక్కపక్క పేజీల్లో ఇంగ్లిష్, తెలుగులో మిర్రర్ ఇమేజ్లో ఉండే బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. దీనికి తోడు విద్యార్థులకు సులభంగా ఆయా పదాలు అర్థం చేసుకోవడానికి 1–5వ తరగతి వరకు బొమ్మలతో ఉన్న డిక్షనరీలు, 6–10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అందిస్తున్నారు. యూనిఫాం వస్త్రం, షూ కొలత సరిగా లేకున్నా, బ్యాగు నాణ్యత బాగోలేకున్నా వెనక్కు పంపి, మంచివి తెప్పించుకోవాలని చెప్పింది. లోపాలున్న వాటిని సెప్టెంబర్ 15 కల్లా తిరిగి పంపి ఆ విషయాన్ని రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి. టోల్ ఫ్రీ నంబర్ 9154296169కు ఫిర్యాదు చేయొచ్చు. జగనన్న విద్యాకానుకపై యాప్ను కూడా రూపొందించారు. విద్యా రంగానికి వైఎస్ జగన్ పెద్దపీట మంత్రి ఆదిమూలపు సురేష్ పి.గన్నవరం : విద్య మీద పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్కు పెట్టుబడి.. అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్ జగన్ ఏటా విద్యా రంగానికి బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో మొదటి విడతలో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను సీఎం ఈ నెల 16న ప్రజలకు అంకితం చేస్తున్న తరుణంలో ఇక్కడ తలపెట్టిన సభ ఏర్పాట్లను మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. -
టీడీపీ పాలనంతా గ్రాఫిక్స్తో మాయ: మంత్రి ఆదిమూలపు
పి.గన్నవరం: పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏటా విద్యారంగానికి రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. నాడు నేడు మొదటి విడత కార్యక్రమంలో రూ.3,600 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 15,715 పాఠశాలల రూపురేఖలను మార్చివేశామని వివరించారు. పి గన్నవరం ఉన్నత పాఠశాల నుంచి సీఎం జగన్ ప్రజలకు అంకితం చేయనున్నారని ప్రకటించారు. ఈనెల 16వ తేదీన సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హైస్కూల్లో శనివారం అభివృద్ధి పనులు, సభ ప్రాంగణాన్ని మంత్రి సురేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్తో మాయ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ కబంధ హస్తాలు అందించిందని ఆరోపించారు. ఇక రెండో విడతగా రూ.4,800 కోట్ల వ్యయంతో మరో 16 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమం కింద గతేడాది రూ. 650 కోట్లతో 42 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ అందించినట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోవడoతో కొత్తగా ఆరు లక్షల మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. వారందరికీ రూ.800 కోట్ల విలువైన జగనన్న కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. -
నాడు-నేడు: మా తరగతి గది భలే బాగుంది..!
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: బంగ్లామెట్ట మున్సిపల్ స్కూలు భీమిలి నియోజకవర్గం తగరపువలసలో ఉంది. చాలాకాలం ఒకటే తరగతి గది. పిల్లలూ తక్కువే. ప్రైవేటు ఫీజులు కట్టలేనివారు, దూరంగా వెళ్లలేని స్థానికులు మాత్రం దీన్ని ఆశ్రయించేవారు. అలాంటిదిపుడు ఈ స్కూల్లో క్లాస్రూమ్కు డిజిటల్ సొబగులూ వచ్చిచేరాయి. బంగ్లామెట్టకు చెందిన శీల పోలిపల్లి ఈ స్కూలును చూస్తూ... ‘‘‘నేను ఇదే మున్సిపల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశా. ఇప్పుడు నా పిల్లలు భరత్, జ్యోత్స్న ఇక్కడే చదువుతున్నారు. నేను చదువుకునేటప్పుడు ఇరవై మంది కూడా ఉండేవారు కాదు. అందరికీ ఒక్కటే తరగతి గది. నేల చదువులు. వర్షం పడితే బడికి సెలవిచ్చేసేవారు. మా పిల్లలను మంచి స్కూల్లో చదివించాలనుకున్నా. కానీ ఆర్థిక స్థోమత సరిపోక ప్రైవేటు స్కూళ్లకు పంపలేకపోయాం. ఇప్పుడు ఈ పాఠశాల ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా తయారయింది. రూ.19.64 లక్షలతో ఎన్నో సౌకర్యాలు కల్పించారు. తరగతి గదులు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాన్లు, గ్రానైట్ ఫ్లోర్, డిజిటల్ పరికరాలు, అందమైన డ్యుయెల్ డెస్క్లు, గ్రీన్ చాక్బోర్డులు, 53 అంగుళాల టీవీ.. ఇవన్నీ చూస్తుంటే ఇది నేను చదువుకున్న స్కూలేనా అనిపిస్తోంది’’ అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కాశినాయన మండలం రెడ్డికొట్టాల ప్రాథమిక పాఠశాలలో తరగతి గది ఇక వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం రెడ్డికొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న కొండా దీక్షితది కూడా ఇలాంటి సంతోషమే. ‘‘మా స్కూల్లో ఇప్పుడు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బల్లలు భలేగున్నాయి. తరగతి గదులు పూర్తిగా మారిపోయాయి. గదుల్లో దేశ నాయకుల చిత్రాలు వేయించారు. సూక్తులు రాయించారు’’ అంటూ సంబరంగా చెబుతోంది. ఎప్పుడెప్పుడు స్కూలు తెరుస్తారా.. అని ఎదురు చూస్తున్నానని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ నాడు–నేడు కార్యక్రమం పూర్తయిన ప్రతి స్కూల్లోనూ విద్యార్థుల సంబరం ఇలానే ఉంది మరి. ఫ్యాన్లు, లైట్లు, మురిపించే చిత్రాలు.. స్కూళ్లలో బయటకు కనిపించే భవనం... చుట్టూ ఉండే ప్రహరీకి ఎంత ప్రాధాన్యముందో... చదువుతో పాటు ఎన్నెన్నో విషయాలు నేర్చుకునే తరగతి గదికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యముంది. ఎందుకంటే స్కూల్లో ఉన్న సమయంలో విద్యార్థులు ఎక్కువ సమయం గడిపేది క్లాస్ రూమ్లోనే. మరి ఆ క్లాస్ రూమ్ వర్షానికి కారిపోతూనో... పగిలిపోయిన గచ్చుతోనో... విరిగిపోయిన బోర్డుతోనో దర్శనమిస్తే!!. అక్కడ ఎంత మంచి టీచరున్నా అంతగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మంచి టీచరుతో పాటు మంచి వాతావరణమూ ముఖ్యమే. ప్రైవేటు స్కూళ్లు కాస్త స్కోరింగ్ చేసేది ఈ పాయింట్ దగ్గరే. ఎందుకంటే అక్కడ మంచి టీచర్లు లేకున్నా బల్లలు, బోర్డులు బాగుంటాయి. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఇప్పటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశాలు తక్కువే. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లలోని తరగతి గదులు ‘నాడు–నేడు’ కార్యక్రమంతో కొత్త హంగులు దిద్దుకున్నాయి. మొత్తం 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తొలి విడతగా రూపుదిద్దుకున్న 15,715 స్కూళ్లలో తరగతి గదులను తీర్చిదిద్దే పనులు దాదాపు పూర్తయ్యాయి. విద్యార్థి క్లాసులోని వాతావరణం చూసి పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గతంలో బోధన కోసం బ్లాక్ బోర్డులుండేవి. అవి విద్యార్థుల కంటిపై ప్రతికూల ప్రభావం చూపించే విధంగా ఉంటాయని అధ్యయనాలు ఉండడంతో వాటి స్థానంలో గ్రీన్ చాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే జాతీయ నేతలు, స్వాతంత్య్ర ఉద్యమ కారులు, శాస్త్రవేత్తలు, ఇతర రంగాల నిపుణుల ఫొటోలను, వివిధ ప్రయోగశాలల్లో జరిగే కార్యక్రమాలను చిత్రించారు. ఇందుకు నిపుణులైన ఆర్కిటెక్టులు, చిత్రకారులు, ఇతరుల సహకారాన్ని తీసుకున్నారు. ప్రతి స్కూల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, టీచర్లకు సరిపడా బెంచీలు, అల్మారాలు ఇతర ఫర్నిచర్ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే... ఈ నెల 16వ తేదీన ప్రభుత్వ స్కూళ్లను పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో బడికి వెళ్లటానికి మారాం చేసిన పిల్లలు సైతం ఎప్పుడు స్కూలు తెరుస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితులున్నాయనటం అతిశయోక్తేమీ కాదు. పిల్లలు స్కూలు ఆవరణలోకి రాగానే వారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా రాజ మార్గాలు ఏర్పాటు చేశారు. దూరం నుంచి చూడగానే ప్రతి వారికి కనిపించేలా ఆ స్కూలు పేరుతో కూడిన పెద్దపెద్ద బోర్డులను ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేయించారు. తరగతి గదుల్లోనే కాకుండా స్కూలు బయట ఆవరణలో కూడా పిల్లలకు ఉపయోగపడేలా వారి పాఠాలను వారి కళ్ల ముందుంచేలా పలు బొమ్మలను, చిత్రాలను గోడలపై వేయించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల గ్రామంలో చదువులపై నాకంత నమ్మకం ఉండేది కాదు. ఆర్థికంగా భారమైనప్పటికీ బిడ్డల చదువు కోసం నగరాన్ని ఎంచుకున్నా. విజయవాడలో పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉండేవాడిని. నా కొడుకు అశిత్ జైకర్ను అక్కడ ఓ ప్రైవేట్ స్కూలులో చేర్చాను. కొద్దిరోజుల క్రితం సొంతూరు వచ్చినపుడు ఇక్కడి ఎంపీపీఎస్ స్కూలు చూసి నమ్మలేకపోయాను. ప్రహరీ పడిపోయి, వర్షాలకు నీరు నిలుస్తూ, వెలిసిపోయిన గోడలతో కనిపించే స్కూలు స్థానంలో అందమైన భవనం దర్శనమిచ్చింది. లోపలకు వెళ్లి చూస్తే టైల్స్, చక్కటి తరగతి గదులు, వాల్ పెయింటింగ్స్, నీతివాక్యాలు, చాలా బాగుంది. వెంటనే నగరం నుంచి వెనక్కు వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించా. -అశోక్, విద్యార్థి తండ్రి, వల్లభాపురం, కొల్లిపర మండలం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ నగరపాలక బాలికోన్నత పాఠశాల 96 సంవత్సరాల చరిత్ర ఉన్న పీవీఆర్ బాలికోన్నత పాఠశాలకు నాడు–నేడుతో మహర్దశ పట్టింది. ఇక అడ్మిషన్లు లేవు అని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో చిన్న వర్షం కురిసినా పాఠశాల ప్రాంగణంలోకి వర్షపునీరు వచ్చేది. గేటు ఎప్పుడు ఊడిపైన పడుతుందో అనే భయం ఉండేది. ఉపాధ్యాయులకు సైతం అరకొర కుర్చీలే గతి. ఇప్పుడు రూ.61 లక్షలతో కార్పొరేట్ పాఠశాలలను సైతం తలదన్నేలా మారింది. ఫ్యాన్లు, ట్యూబులైట్లు, గ్రీన్చాక్బోర్డులు, డ్యూయెల్ డెస్స్లు వెలిశాయి. వరండాలో సైతం ఫ్యాన్లు బిగించారు. -బంకా ప్రసన్న లక్ష్మి, హెచ్ఎం, పీవీఆర్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా నా సర్వీసులోనే కాదు విద్యాశాఖ సర్వీసులోనే పాఠశాలలకు ఇన్ని నిధులు సమకూర్చి అభివృద్ది చేసిన ధాఖలాలు ఎప్పుడూ లేవు. పట్టణంలో బీవీఆర్ఎం పాఠశాల అంటే ఎంతో పేరుంది. ఇన్నాళ్లూ అసౌకర్యాల మధ్య చదువు కొనసాగింది. ఇప్పుడా పరిస్థితి లేదు. నాడు–నేడులో భాగంగా మా పాఠశాలకు రూ.61.43 లక్షలు ఇచ్చారు. ప్రతి గదికి ఐదు ప్యాన్లు, నాలుగు ట్యూబ్లైట్లు, బెంచీలు, సందేశాత్మక చిత్రాలు, సూక్తులు, ఆకర్షణీయమైన ముఖద్వారం.. ఇలా ఎంతగానో తీర్చిదిద్దారు. 350 మంది విద్యార్థినులు ఉన్న ఈ పాఠశాలలో ఆ సంఖ్య ప్రస్తుతం 670 మందికి చేరింది. హౌస్ఫుల్ బోర్డు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. – వై.ప్రభాకరశాస్త్రి, హెచ్ఎం, బీవీఆర్ఎం బాలికల హైస్కూల్ -
Nadu- Nedu: మా స్కూల్ మారింది చూద్దాం రండి!
ఇది ఎల్.కోట ఎంపీపీ స్కూలు విజయనగరం జిల్లా లక్కవరపు కోటలోనిది.. అదీ ఊరికి మధ్యలో ఉంది. ప్రహరీ లేకపోవటంతో పందులు, కుక్కలు, పశువులు ఆవరణలోకి వచ్చేసేవి. రాత్రిళ్లు తాగుబోతులు, తిరుగుబోతులకది అడ్డా!. ఇక్కడి హెచ్ఎం సింహాద్రి సత్యవతి మాటల్లో చెప్పాలంటే... ‘‘ఉదయం రాగానే మేం చేసే మొదటిపని చెత్త, మద్యం సీసాలు ఎత్తేయించడం, పందులు, కుక్కలు పాడుచేస్తే కడిగించటం. దానికే సగం సమయం పోయేది. కానీ ‘నాడు–నేడు పుణ్యమాని రూ.17 లక్షల నిధులతో బడి రూపురేఖలు మార్చారు. రంగుల తోరణంలాంటి ప్రహరీ వచ్చింది. సౌకర్యాలూ వచ్చాయి. ఉన్న 72 మంది పిల్లలకు తోడు మరింత మంది చేరుతున్నారు. పిల్లలు బాగుపడే రోజులొచ్చాయి.’’ స్కూళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి స్కూలూ.. ప్రతి విద్యార్థీ.. టీచర్లూ ఇదే విధంగా తమ బడి వైభవాన్ని కళ్లకు కడుతున్నారు. వాటిని క్షేత్రస్థాయి నుంచి మీకు వివరిస్తోంది సాక్షి.. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని వెంకటేశ్వరపురం ప్రైమరీ స్కూలుదీ ఇలాంటి కథే. ఆవరణ మొత్తం రాళ్లు రప్పలతో నిండి, చదువుకునే వాతావరణమే కనిపించేది కాదు. ఈ స్కూలు బాగోలేదని రెండేళ్ల కిందట చాలా మంది పిల్లలు చుట్టుపక్కలున్న ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. అలాగని ఆ ప్రైవేటు స్కూళ్లేమీ అద్భుతంగా ఉన్నాయనుకోవద్దు. కానీ గత్యంతరం లేక చేరారంతే. ‘‘నాడు–నేడుతో మా పాఠశాల రూపమే మారిపోయింది. ప్రైవేటు స్కూళ్ల నుంచి ఎంతో మంది వచ్చి, ఇక్కడ చేరారు’’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు ఇక్కడిఉపాధ్యాయురాలు కవితాబాయి. ఇవే కాదు. తొలివిడత నాడు–నేడు అభివృద్ధిని చూసిన ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇపుడిదే సందడి. చదువు విలువ తెలియనిదెవ్వరికి? విలువ తెలుసు కనకే.. మంచి చదువు, నాలుగింగ్లీషు ముక్కల కోసం నిరుపేదలూ వీధి చివరి కాన్వెంట్లకు వెళ్లారు. తలకు మించిన అప్పులూ చేశారు. ‘విలువ’ తెలుసు కనకే..శ్రీమంతులు దీన్ని వ్యాపారం చేశారు. సామ్రాజ్యాలు నిర్మించారు. ‘విలువ’ తెలుసు కనకే గత ప్రభుత్వాలు వీరికి సాగిలపడ్డాయి. ఫలితం... అక్కడక్కడా అప్పుడప్పుడు మెరిసిన నక్షత్రాలు తప్పితే...అందరికీ నాణ్యమైన చదువనేది ఇప్పటికీ అందనిదే!!. చెట్లకింద క్లాసులు... బల్లలు కాదు కదా! బోర్డులూ లేని తరగతులు... ఎండకు, వర్షానికి పనికిరాని భవనాలు... ఆనవాళ్లు లేని ప్రహరీలు... బాత్రూమ్కైనా, మంచినీళ్లకైనా ఇంటికి పరుగెత్తే పిల్లలు.. సంఖ్యకు తగ్గట్టుగా లేని టీచర్లు... కాన్వెంట్లో తప్ప ఇంగ్లిష్ దొరకని సిలబస్!!. చెప్పాలంటే ప్రభుత్వ స్కూళ్లు ఎదుర్కొన్న సమస్యల్లో ఇవి కొన్నే. వీటిని పరిష్కరించే చిత్తశుద్ధి మాత్రం గత ప్రభుత్వాలు చేస్తే ఒట్టు!!. ‘చదువు విలువ తెలిసిన వాడిగా చెబుతున్నా’ అనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం చేపడుతూనే స్కూళ్లపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’ పేరిట ప్రతి స్కూలునూ మార్చే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తేవటమే కాదు... ‘అమ్మ ఒడి’ పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకూ ఆర్థిక ఆసరా కల్పించారు. బళ్లు మొదలైనరోజే పుస్తకాలు, యూనిఫారాలతో సహా మొత్తం కిట్లను ‘జగనన్న విద్యాకానుక’గా అందజేస్తున్నారు. నిజానికి వేరొక ప్రభుత్వంలో అయితే... ఇలాంటివన్నీ వాగ్దానాలు, భవిష్యత్తులో చేస్తారన్న ఆశలుగానే ఉండేవి. అలాగే మిగిలిపోయేవి కూడా!!. కానీ సీఎం జగన్ మాటలకన్నా... చేతలనే నమ్ముతారు. కాబట్టే చేసి చూపించారు. అందుకే తొలివిడతగా రాష్ట్రంలో ఇపుడు 15,715 స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఏకంగా రూ.3,900 కోట్లతో... సమగ్ర మౌలిక సదుపాయాలతో, అందంగా ముస్తాబయ్యాయి. పిల్లల్ని రారమ్మంటున్నాయి. ఈ నెల 16న తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇపుడు ప్రతి స్కూలూ... ప్రతి విద్యార్థీ... తల్లిదండ్రులూ... టీచర్లూ ఓ కథ చెబుతున్నారు. తమ బడి వర్తమాన వైభవాన్ని కళ్లకు కడుతున్నారు. ఆ కథలను క్షేత్ర స్థాయి నుంచి మీకు వివరిస్తోంది ‘సాక్షి’. - సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్ మంచి చదువులకు మార్గం సుగమం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంది. గతంలో స్కూళ్లల్లోని పరిస్థితిని ఫొటోలు తీయించి అవే స్కూళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అలా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా... రాష్ట్రంలో 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను ‘మనబడి నాడు–నేడు’ జాబితాలో చేర్చింది. దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యే ఈ కార్యక్రమంలో తొలివిడతగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసింది. ఎల్.కోట ఎంపీపీ స్కూలు- లక్కవరపు కోట, విజయనగరం జిల్లా. వాటిలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.3,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టి దాదాపు పూర్తి చేయించింది. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ స్కూళ్లను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తూ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు వేరెక్కడా లేవన్నది విద్యా రంగ ప్రముఖుల మాట. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పేదలకు అత్యుత్తమ చదువులను అందుబాటులోకి తేవాలన్న సీఎం జగన్ సంకల్ప యజ్ఞంలో తొలి ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది. ప్రతి స్కూలుకూ ప్రహరీ ►ఒకప్పుడు స్కూలుకు ప్రహరీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ప్రతీ స్కూలుకు ప్రహరీ నిర్మించడమే కాకుండా ఆవరణలో అందమైన మొక్కల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. ►విద్యార్థి స్కూలులో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం చూసి పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా అద్భుతమైన వసతులు కల్పించింది. గతంలో స్కూల్ భవనాలు ఎప్పుడు పడిపోతాయో అన్నట్లుగా శిథిలావస్థలో ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించింది. ►చిన్న చిన్న పనులతోపాటు పెద్ద పనులు కూడా పూర్తి చేయించి పాఠశాల రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చి వేసింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ప్రతి స్కూల్లోనూ అదనపు తరగతి గదులను నిర్మించింది. ►ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే రీతిలో పాఠశాలలకు ఆహ్లాదకరమైన రంగులను వేయించింది. ఈ రంగుల కోసం దాదాపు రూ.412 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే 14,500 స్కూళ్లలో రంగుల కార్యక్రమం పూర్తయింది. కృష్ణా జిల్లా కోట కలిదిండి ఉర్దూ పాఠశాల మా ఇద్దరు పిల్లలను కోట కలిదిండి ఉర్దూ పాఠశాలలో చదివిస్తున్నాను. గతంలో ఈ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, మేకలు తిరిగేవి. ఉదయం స్కూల్కు వెళ్లగానే వాసన వచ్చేది. వాటిని తప్పించుకుంటూ లోపలికి వెళ్లాల్సిన దుస్థితి. నాడు–నేడు పథకం కింద ఇప్పుడు ఈ పాఠశాలను పూర్తిగా మార్చేశారు. రూ.18.18 లక్షలతో కొత్తగా ప్రహరీ, ఇతర వసతులు కల్పించారు. ఎంతో కష్టపడి ఇన్నాళ్లు పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో వేసేవారు. ఇప్పుడా బాధలు తప్పాయి. ప్రభుత్వ స్కూళ్లు అన్ని వసతులతో చక్కగా ఉన్నాయి. పిల్లల చదువు గురించి ఇక దిగుల్లేదు. -ఎండీ. జరీనా, విద్యార్థుల తల్లి, కోట కలిదిండి, కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా వీకే నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేను ఇప్పుడు 4వ తరగతిలోకి వెళ్తున్నా. ఇదివరకు మూడేళ్లు బడికి వెళ్లి మట్టిలోనే ఆడుకునేదాన్ని. కాంపౌండ్ లేకపోవడంతో పరిసరాల్లో వెళ్తున్న వారిని చూస్తూండటంతోనే సమయం గడిచిపోయేది. బాత్రూం కోసం, నీళ్లు తాగడం కోసం తరచూ ఇంటికి పోయేదాన్ని. తిరిగి ఒక్కోసారి బడికి రాబుద్దయ్యేది కాదు. బట్టల నిండా మట్టి అంటుకోవడం వలన అమ్మ చీవాట్లు పెట్టేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా బడి ఇప్పుడు భలేగా తయారైంది. బడి ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నా. మంచి మంచి బొమ్మలతో కాంపౌండ్ వాల్, లోపల మంచి బండలు వేయించారు. అంతా బాగుంది. -ఎం.నివంతి, వీకే నగర్ ఎంపీపీ పాఠశాల, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం తాళ్లూరు ప్రాథమికోన్నత పాఠశాల రోజూ భయపడేవాళ్లం మాపాప చందన శ్రీని చేర్పించేటప్పుడు ఈ పాఠశాల పరిస్థితి అస్సలు బాగోలేదు. భయపడుతూనే చేర్పించా. ప్రహరీ లేకపోవడం, వెనుకవైపునే చెరువు, బావి ఉండటంతో బిక్కుబిక్కుమంటూ పాపను బడికి పంపాల్సి వచ్చేది. ఇలాగైతే పిల్లలు ప్రమాదాల బారిన పడతారని నిత్యం తల్లిదండ్రులం అనుకుంటుండేవాళ్లం. ప్రస్తుతం నాడు–నేడు కింద ప్రహరీ కట్టడంతో పాటు స్కూల్లో వసతులన్నీ కల్పించారు. గవర్నమెంట్ బడికి కూడా ఇలాంటి రోజులు వస్తాయని అస్సలు అనుకోలేదు. – కె.లక్ష్మీప్రసన్న, విద్యార్థిని తల్లి, తాళ్లూరు, బిట్రగుంట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
-
ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లాకు సీఎం జగన్