new
-
'కలర్స్ హెల్త్ కేర్'లో ఐశ్వర్య రాజేష్ సందడి
-
మలైకా అరోరా కొత్త రెస్టారెంట్.. లోపల ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్పై మరో కేసు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మరో కొత్త సమస్యలో చిక్కుకున్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ కేసు నమోదు చేసింది. సోషల్ మీడియాను ఉపయోగించి, ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించారంటూ ఖాన్పై ఈ కేసు నమోదు చేశారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో వివాదాస్పద పోస్ట్కు సంబంధించి ప్రశ్నించడానికి దర్యాప్తు, సాంకేతిక అధికారులతో కూడిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) బృందం అడియాలా జైలును సందర్శించింది.ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించినందుకు ఖాన్పై ఎఫ్ఐఏ కేసు నమోదు చేసిందని ‘డాన్’ వార్తాపత్రిక తెలిపింది. అయితే తన న్యాయవాదులు లేకుండా తాను విచారణకు సహకరించనని ఖాన్ వారికి తెలిపారు. దీంతో ఎఫ్ఐఏ సిబ్బంది వెనుదిరిగారు. గత ఏడాది నుంచి అడియాలా జైలులో ఉన్న ఖాన్ తరచూ 'ఎక్స్'వేదికగా సైన్యాన్ని విమర్శిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి -
కొత్తగా.. కొంగొత్తగా గాంధీ ఆస్పత్రి (ఫొటోలు)
-
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
-
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
-
ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్
వెరైటీ ఫుడ్ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్ ఉంటే ఆ టెన్షన్ ఎందుకు? ఈ ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్ వైర్లెస్ మెషిన్గా పని చేస్తుంది ఇది. డివైస్కి ముందు వైపు పవర్ ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్లెస్ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్(హోల్స్తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్! -
యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’
సమాజ్వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ పేరు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ (ఆర్ఎస్ఎస్పీ). పార్టీ జెండా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడి ఉంటుంది. అయితే ప్రసాద్ మౌర్యను బుజ్జగించి, ఆయన ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఎస్పీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: అఖిలేష్పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ? -
కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకుంటే తిరుగుండదు!
Index funds: సులువుగా అర్థమయ్యేలా ఉంటూ, పెట్టుబడులను సులభతరం చేసే చక్కని వ్యూహంగా ఇండెక్స్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? నిర్దిష్ట ప్రామాణిక సూచీని ట్రాక్ చేసే ఒక తరహా మ్యుచువల్ ఫండ్స్ను ( mutual fund ) ఇండెక్స్ ఫండ్స్ అంటారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి విస్తృత సూచీలను లేదా నిర్దిష్ట రంగానికి చెందిన నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ వంటి సూచీలను ట్రాక్ చేసేలా ఇవి ఉండొచ్చు. సదరు సూచీలోని కంపెనీల షేర్లను, అదే వెయిటేజీతో ఈ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాలకు చెందిన కొన్ని కీలక స్టాక్స్ సమూహాన్ని ఇండెక్స్గా వ్యవహరిస్తారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వీటిలో ఉంటాయి. ఇవి రెండూ కూడా నిర్దిష్ట సూచీని ట్రాక్ చేసేవే అయినా వీటి పని తీరులో మార్పులు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే పని చేస్తాయి. రోజు ముగిసే నాటి ఎన్ఏవీ ప్రకారం వీటి యూనిట్లను ఏఎంసీల్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇక ఈటీఎఫ్లు పేరుకు తగ్గట్లే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి, షేర్ల తరహాలోనే ట్రేడ్ అవుతుంటాయి. ఏఎంసీ ప్రస్తావన లేకుండా ఇన్వెస్టర్లు వీటిని నేరుగా ఎక్సే్చంజ్ నుంచే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ప్రయోజనాలు ఏమిటి? సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యూహం. వ్యక్తిగతంగా ఏ ఒక్క స్టాక్ పైనో పక్షపాతం చూపించే పరిస్థితి లేకుండా ముందుగానే నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టాక్స్ ఎంపిక ఉంటుంది. మార్కెట్ను బట్టి పని చేస్తుంది. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా ఉండరు కాబట్టి సాధారణంగా యాక్టివ్ మ్యుచువల్ ఫండ్తో పోలిస్తే వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. వ్యయాలు తక్కువ ఎందుకంటే? ముందే చెప్పుకున్నట్లు ఇండెక్స్ ఫండ్స్లో ఫండ్ మేనేజరు ప్రత్యేకంగా స్టాక్స్ ఎంపిక చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పని ఉండదు. కాబట్టి పరిశోధనలపరమైన వ్యయాలూ ఉండవు. పైగా యాక్టివ్ ఫండ్స్తో పోలిస్తే పోర్ట్ఫోలియోలో మార్పులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అందుకే వీటి వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఎవరికి అనువైనవి? సులభతరమైన, సమర్ధమంతమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఎవరికైనా అనువైనవే. సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఇక అనుభవమున్న ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ క్యాప్వ్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసేందుకు, నిర్దిష్ట ఇండెక్స్ వ్యూహాలను అమలు చేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ట్రాకింగ్ వ్యత్యాసాలు అంటే? బెంచ్ మార్క్, ఫండ్కి సంబంధించి పనితీరు అలాగే రాబడుల్లో వ్యత్యాసాలను ట్రాకింగ్ ఎర్రర్గా వ్యవహరిస్తారు. ఇది ఫండ్ పనితీరు సమర్ధతను సూచిస్తుంది. ఇక, ఫీజులు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల బెంచ్మార్క్తో పోలిస్తే ఫండ్ అందించే రాబడులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏఎంసీకి (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ) ఆన్లైన్లో లేదా ఫిజికల్గా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తమ డిస్ట్రిబ్యూటర్ లేదా రిలేషన్షిప్ మేనేజర్ను సంప్రదించడం ద్వారా కూడా చేయొచ్చు. అలాగే లేటెస్ట్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా చేసేందుకు వీలుంది. ఏమేమి రిస్కులు ఉంటాయి? సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహా రిస్కులన్నీ ఇండెక్స్ ఫండ్స్కి కూడా ఉంటాయి. వాటికి అదనంగా ట్రాకింగ్ ఎర్రర్, ట్రాకింగ్ డిఫరెన్స్, సూచీ ఆధారిత రిస్కులు, నిర్వహణపరమైన రిస్కులు మొదలైనవి ఉంటాయి. పథకానికి సంబంధించిన రిస్కులను గురించి తెలుసుకునేందుకు స్కీమ్ సమాచారపత్రాన్ని ముందుగానే క్షుణ్నంగా చదువుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్పై పన్ను విధానం ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్ని బట్టి ఇండెక్స్ ఫండ్స్పై పన్నులు వర్తిస్తాయి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్కి ఈక్విటీ ట్యాక్సేషన్, అలాగే డెట్ ఇండెక్స్ ఫండ్స్కి డెట్ ట్యాక్సేషన్ విధానం ఆధారంగా పన్నులు ఉంటాయి. ఏదైనా సరే, ఇన్వెస్ట్ చేసే ముందుగానే స్కీమ్ వివరాలతో కూడిన డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. - సమాధానాలు - నీరజ్ సక్సేనా ఫండ్ మేనేజర్, బరోడా బీఎన్పీ పారిబాస్ -
ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?
ఛత్తీస్గఢ్కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్లను బీజేపీ ఛత్తీస్గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్ రామ్’ -
సొగసైన కారుపై 'సాహో' భామ
-
కొత్త జిల్లా ఎలా ఏర్పాటవుతుంది? గవర్నర్ పాత్ర ఏమిటి?
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో పంచాయతీ, తహసీల్, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విభాగాలు ఉన్నాయి. ఇందులో జిల్లాను అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 800 దాటింది. తాజాగా మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త జిల్లాలను మైహార్, పంధుర్ణగా పిలవనున్నారు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన స్థానిక పరిపాలన, ఎన్నికైన ప్రతినిధులు, ఇతర సంస్థల నుంచి వస్తుంది. తరువాత దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం కొత్త జిల్లా ఆవశ్యకతపై సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ దశలో ఆ ప్రాంత జనాభా, భౌగోళిక పరిసరాలు, పరిపాలనా సౌకర్యాలు, వనరుల లభ్యతతో పాటు, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు మొదలైనవాటిని పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన సరైనదని భావించినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తుంది. ఈ సమయంలో అందరి అంగీకారం మేరకు కొత్త జిల్లాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనంతరం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనతో పాటు జిల్లా సరిహద్దులను తెలియజేస్తారు. జిల్లా సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త జిల్లాకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం కొత్త జిల్లాకు అధికారిక రూపం వస్తుంది. కొత్త జిల్లా ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ముందుగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) ఎస్పీలను నియమిస్తుంది. తరువాత క్రమంగా ఇతర అధికారులను నియమిస్తారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అవసరమైన సేవలు, ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు, పాత, కొత్త జిల్లాల మధ్య వనరులు, ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది కూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్కు బైడెన్ ఎలా చేరారు? -
పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక?
నూతన పార్లమెంట్ హౌస్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్లోని ఆరు ద్వారాలకు జంతువుల పేర్లు పెట్టారు. వీటిలో కొన్ని మనకు కనిపించేవి. మరికొన్ని పౌరాణిక సంబంధమైనవి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ ద్వారాలకు ఉన్న చిహ్నాలు వివిధ అంశాలను తెలియజేస్తాయి. నేటి కథనంలో ఆ ద్వారాలకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. గజ ద్వారం నూతన పార్లమెంట్ ప్రాగణ ద్వారానికి గజ ద్వార్ అనే పేరు పెట్టారు. ఈ ద్వారం జ్ఞానం, జ్ఞాపకశక్తి, సంపద, తెలివితేటలను సూచిస్తుంది. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపున ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ బుధునికి సంబంధించినది. దీనిని మేధస్సుకు కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ద్వారంపై ఏనుగు బొమ్మలు కనిపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి శ్రేయస్సును, సంతోషాన్ని అందిస్తాయి. అశ్వ ద్వారం పార్లమెంట్లోని మరో ద్వారానికి అశ్వ ద్వారం అని పేరు పెట్టారు. అశ్వం అంటే గుర్రం. ఇది శక్తి, బలం, ధైర్యానికి చిహ్నం. గరుడ ద్వారం మూడవ ద్వారానికి పక్షుల రాజైన గరుడుని పేరు పెట్టారు. గరుడుని విష్ణువు వాహనంగా భావిస్తారు. త్రిమూర్తులలో రక్షకునిగా పేరొందిన విష్ణువుతో అనుబంధం కలిగిన గరుడ పక్షి.. శక్తి, కర్తవ్యాలకు చిహ్నమని చెబుతారు. గరుడ ద్వారం నూతన పార్లమెంటు భవనానికి తూర్పున ఉంది. మకర ద్వారం మకర ద్వారం అనేది పురాణాలలో పేర్కొన్న సముద్ర జీవిని గుర్తుచేస్తుంది. ఇది వివిధ జంతువుల కలయిక. మకర శిల్పాలు దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించిన హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో కనిపిస్తాయి. మకరం అనేది వివిధ జీవుల కలయికతో దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. ద్వారాల వద్ద కనిపించే మకర విగ్రహాలను రక్షకులని చెబుతారు. మకర ద్వారం పాత పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వైపు కనిపిస్తుంది. శార్దూల ద్వారం ఐదవ ద్వారానికి పురాణాల్లో పేర్కొన్న శార్దూలం అనే పేరు పెట్టారు. ఇది సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది. గుర్రం, ఏనుగు, చిలుక తలను కలిగి ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం గేటు వద్ద శార్దూలం ఉండటం దేశ ప్రజల బలానికి ప్రతీక అని ప్రభుత్వ నోట్లో పేర్కొన్నారు. హంస గేట్ నూతన పార్లమెంటులోని ఆరవ ద్వారానికి హంస గేట్ అనే పేరు పెట్టారు. జ్ఞాన దేవత అయిన సరస్వతీమాత వాహనంగా హంస గుర్తింపు పొందింది. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుండి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హంస విగ్రహం స్వీయ సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్ మీడియాలో సంబరాలు!
ఇటీవల సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన పోస్ట్ వైరల్గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రొఫెసర్ తన కొత్త ఉద్యోగం గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. దీనిని చూసినవారు తొలుత ఆశ్చర్యపోయారు. తేరుకున్నాక కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ పోస్ట్ను చూసిన యూజర్లు వివరీతంగా ఎంజాయ్ చేస్తూ, రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు యూజర్స్ తమకు కొత్త ఉద్యోగం రాగానే ఇలాంటి పోస్ట్లు పెడతామని చెబుతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో @akaPrateekshit అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. దీనిలోని వివరాల ప్రకారం ప్రతీక్షిత్ కాను పాండే అనే యువకునికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. అతను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరనున్నారు. Happy to officially announce that I am joining the Department of Communication at UC Santa Barbara @CommUcsb as an Assistant Professor, starting January 2024. आइ वडिलांच्या आशीर्वाद आहेत भारी. https://t.co/BmGve47WYG pic.twitter.com/MiG4Y5v670 — Kanu (@akaPrateekshit) October 2, 2023 వైరల్గా మారుతున్న ఈ పోస్టులో ప్రతీక్షిత్ ఓ నాయకుని మాదిరిగా పూలదండలు వేసుకుని కనిపిస్తున్నారు. అలాగే భారీ ఓట్ల మెజారీతో గెలిచినట్లు విజయ సంకేతం చూపిస్తున్నారు. పోస్ట్లోని వివరాల ప్రకారం కాను పాండే జనవరి 2024లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరనున్నారు. ఒక యూజర్ ‘నేను చదువు పూర్తిచేసి, ఉద్యోగం సంపాదించినప్పుడు ఈ విధంగా అందరికీ తెలిసేలా ప్రకటిస్తాననని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘నా జీవితంలో ఎప్పుడూ నేను ఇలాంటి వృత్తిపరమైన ప్రకటనను చూడలేదు’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఐ డ్రాప్స్ స్థానంలో జిగురు.. యువతి విలవిల! -
కంపెనీలు తేవడం ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్ / శామీర్పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు. జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్గుల్ పాల్గొన్నారు. యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదుకి చేరిన నిఫా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్లో 706 మంది..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కోజికోడ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా 24 ఏళ్ల యువకుడు వైరస్తో చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 706 మంది కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారు. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. ఆస్పత్రిలో 13 మంది స్వల్ప లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హై రిస్క్ జోన్లో ఉన్నవారందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్ కమిటీలను ఏర్పరిచింది. ఐసోలేషన్లో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడానికి వాలంటీర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. నిఫా వైరస్తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిఫా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: భారత్లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి! -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
Oxygen-28: కొత్త రకం ఆక్సిజన్ను గుర్తించిన శాస్త్రవేత్తలు
టోక్యో: భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరం. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ప్రకృతిలో కొత్త రకం ఆక్సిజన్ను గుర్తించింది. జపాన్లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ‘ఆక్సిజన్–28’ అనే కొత్తరకం ప్రాణవాయువును గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక ఐసోటోప్ అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఆక్సిజన్–28 ఐసోటోప్ 20 న్యూట్రాన్లు, ఎనిమిది ప్రోటాన్లను కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఇది పరిమాణంలో భారీగా ఉన్నట్లు తేల్చారు. ఈ ఆక్సిజన్ ఐసోటోప్ కొంత తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉందని గమనించారు. ప్రకృతిలో ఇది అసాధారణమైన ఆక్సిజన్ అని శాస్త్రవేత్తలు అభివరి్ణస్తున్నారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్కు ఉండే సిగ్నల్స్పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
Kamal Haasan Indian 2 New Poster: ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ విడుదల
కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. లైకా ప్రోడక్షన్స్, ది రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
పేరు మార్చుకోనున్న కేరళ!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం అధికారికంగా పేరు మార్చుకోనున్నట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం ప్రస్తుతం ఉన్న కేరళ పేరును 'కేరళమ్'గా మారుస్తారు. అసెంబ్లీ మద్దతు లభించడంతో ఈ బిల్లును కేంద్ర ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సీఎం పినరయ్ విజయన్ కేంద్రాన్ని కోరారు. ఇంగ్లీష్తో సహా అన్ని భాషల్లో రాష్ట్ర పేరను కేరళమ్గా మార్చాలని అన్నారు. సభ్యులు తీర్మాణాన్ని అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శంషీర్ కూడా ఆమోదించారు. కేరళ రాష్ట్ర పేరును మలయాళంలో కేరళమ్ అనే అంటారు. కానీ, మిగిలిన అన్ని భాషల్లో కేరళగానే పిలుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి మలయాళ భాష మాట్లాడే వారందర్ని కలిపి ఒక రాష్ట్రంగా పరిగణించారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రం పేరును కేరళగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పేరును రాష్ట్ర సర్కార్ మార్చాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: మరో వివాదంలో రాహుల్ గాంధీ -
‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్షాపులో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఆ మోసాలను బయట పెట్టండి కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవదు ‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలవలేదు.. భవిష్యత్లో కలవబోదు.’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్లో కేసీఆర్తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్లో
తమిళ నటి షాలు షమ్ము అంటే తెలుగువారు ఎవరైన టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ కోలీవుడ్లో పాపులర్ నటి. అక్కడి సోషల్ మీడియాలో తనపేరు ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటుంది. గతంలో టాలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శకుడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణ చేయడంతో అప్పట్లో ఆమె పేరు తెలుగునాట కూడా వైరల్ అయింది. శివకార్తికేయన్ హీరోగా మిస్టర్ లోకల్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. తర్వాత తనకు పలు సినిమా అవకాశాలు వచ్చినా అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో షాలు షమ్ముకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఆమె షోషల్మీడియాకే పరిమితమై తన వర్కౌట్ వీడియోలతో పాటు సల్సా డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసేది. అంతే కాకుండా చాలా ఆకర్షణీయమైన తన ఫోటోలను కూడా షేర్ చేసేది. అలా ఆమె పేరు అందరిలో ఉండేలా జాగ్రత్తపడేది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ) తర్వాత తనకు తమిళ్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. తాజాగా తను కోటి రూపాయల లగ్జరీ కారును తక్కువ ధరకు కొనుగోలు చేసిందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. షాలూ షమ్ము తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రూ.1 కోటి విలువ చేసే జాగ్వార్ కారును సెకండ్ హ్యాండ్లో రూ. 50 లక్షలకు కొన్నట్లు తెలిపింది. ఆ కారు కొనడం తన చిరకాల కోరికని తెలిపింది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఓ వైపు సినిమా అవకాశాలు లేనప్పుడు ఇంత డబ్బు ఎలా వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాలేనా? మరేదైనా చేస్తున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆమె తిరిగి ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. కానీ నటి షాలు షమ్ము స్కిన్ కేర్ క్లినిక్ కూడా నడుపుతున్నట్లు గతంలో తెలిపింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన మొత్తంతోనే ఆమె ఈ కారును కొనుగోలు చేసి ఉంటుందని పలువురు అంటున్నారు. విజయ్ దేవరకొండతో సినిమా.. గతంలో ఇలాంటి కామెంట్ చేసింది గతంలో తను చేసిన ఆరోపణలు ఇవే.. తెలుగు పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడు తనకు విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తామని ఆఫర్ చేశాడు, అయితే ఆ సినిమాలో ఆఫర్ రావాలంటే.. తన కోరిక తీర్చాల్సి ఉంటుందని కండీషన్ పెట్టినట్లు అప్పట్లో కామెంట్ చేసింది. ఆ కారణంతో విజయ్తో వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆ దర్శకుడెవరో మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు తమిళ్, తెలుగు పరిశ్రమలో సంచలనంగా మారిపోయింది. View this post on Instagram A post shared by ❣️ ஷாலு ஷம்மு ❣️ (@shalushamu) -
తెలుగు రాష్ట్రాల్లో NS ఏవియేషన్ విమానం ఎగరవేస్తాం
-
క్రైమ్ థ్రిల్లర్గా 'ఎవోల్' (EVOL)
టాలీవుడ్లో ఒక్కోసారి చిన్న చిత్రాలే మెప్పిస్తుంటాయి. ఇదే కోవలో సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్’. దాని ట్యాగ్ లైన్ (a love story in reverse) రామ్యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో కన్నా సౌత్లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్) దర్శక నిర్మాత రామ్యోగి మాట్లాడుతూ 'ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ జానర్ అంశాలతో పాటు వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతుంది. కథ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో సెన్సార్కు ఈ చిత్రం వెళ్లనుంది. ఈ లోపు ఫస్ట్ లుక్, టీజర్ను విడుదల చేస్తాం. దర్శక నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నమిది. ప్రేక్షకుల ఆదరణ కావాలని కోరుతున్నా' అని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జజర్దస్త్ కమెడియన్) -
32 ఏళ్ల తర్వాత మిత్రుడితో నటించేందుకు రెడీ అయిన రజినీ?
భారతీయ సినిమా రంగంలో ఇద్దరు దిగ్గజాలు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. వీటికి ప్రధాన మూలం తన 170వ సినిమాకు 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారని రజనీ ప్రకటించడమే. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు కూడా ఆయన తెలిపాడు. (ఇదీ చదవండి: కాబోయే తోడి కోడలికి ఉపాసన గ్రాండ్ వెల్కమ్!) జైలర్ తర్వాత షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని దర్శకుడు ప్రకటించాడు. దీంతో నటీనటుల ఎంపికపై రోజుకో వార్త వస్తుంది. ఈ స్టార్స్ కలిసి తక్కువ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్య మంచి స్నేహం, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రచారం నిజం కావచ్చనడంలో సందేహం లేదు. మూడు దశాబ్దాల క్రితం హమ్, అంధ కానూన్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను ఈ దిగ్గజ నటులు అందించిన విషయం తెలిసిందే. యదార్థ సంఘటనలే కథకు మూలం రజినీ కాంత్ 170 ఫిల్మ్ యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడుతున్నట్లు సమాచారం. ఇందులో పోలీసు ఆఫీసర్గా ఆయన నటించనున్నారట. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2024 చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: సమంత నవ్వులు.. మృణాల్ బోల్డ్ క్యాప్షన్) -
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపధ్యంలో వారి మధ్య చర్చలు నిర్వహించి సమన్వయము కుదిర్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు. అయినా కూడా సమస్య పరిష్కారం కాని కారణంగా సచిన్ పైలట్ వేరుకుంపటి పెట్టనున్నారని ఈ మేరకు తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగి సచిన్ పైలట్ కొత్త పార్టీ పుకార్లను కొట్టి పారేశారు. అవన్నీ సత్యదూరమైన ప్రచారాలని తేల్చి చెప్పారు. కలిసే ఉన్నాం.. కలిసే పోటీ చేస్తాం.. త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉండి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని అన్నారు కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్. ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. " నేను ఈ పుకార్లను నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరితో జరిపిన చర్చల్లో మనం కలిసే పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు వారిద్దరూ సానుకూలంగా స్పందించారు. నాకు తెలిసి సచిన్ కొత్త పార్టీ అనేది పూర్తిగా అవాస్తవం. మా పార్టీ ఐక్యంగానే ఉంది మేము వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని కరాఖండిగా తేల్చిచెప్పారు. సచిన్ అసంతృప్తి.. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సచిన్ పైలట్ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి అంశాలతో పాటు పేపర్ లీకేజీ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పునర్వ్యవస్థీకరణ అంశాలపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ అంశాలనే అదనుగా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయని సచిన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని వదంతులు పుట్టుకొచ్చాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
ఒడిశా రైలు ప్రమాద బాధితులకే ఈ డబ్బు: నిర్మాత
తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక నిమిషం 46 సెకన్ల నిడివిగల ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇదీ చదవండి: Jr NTR: ఎన్టీఆర్ కోసం క్రేజీ హీరోయిన్ను ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అని చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు. ‘‘మా తండ్రి సివిల్ కాంట్రాక్టర్. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. దాంతో సినిమాలలో నటించాలనే బలమైన కోరిక ఉండడంతో రామ్చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ తరువాత ‘చెక్’, రాంగోపాల్ వర్మ ‘కొండా’ సినిమాలో నక్సలైట్ నాయకుడు ఆర్.కె. పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువచ్చింది. దయచేసి అందరూ థియేటర్స్లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు. (ఇదీ చదవండి: Custody Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?) -
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
Parliament : పార్లమెంట్ నూతన భవనం (ఫొటోలు)
-
పార్లమెంటు భవనం ప్రారంభంపై రాదంతం అంత అవసరమా
-
యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
Manchu Manoj: కొత్తింట్లో సాయి ధరమ్ తేజ్కు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్ (ఫొటోలు)
-
డిగ్రీలో కొత్త పాఠ్యప్రణాళిక
-
జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు!
మారుతి సుజుకి జిమ్నీ ప్రియులకు నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. మహీంద్రా థార్ కు పోటీగా వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ కోసం కొనుగోలుదారులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే జిమ్నీ భారత్ లో మే నెలలో విడుదల కావడం లేదని తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో అరంగేట్రం చేసింది. ఈ SUV మే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. అయితే తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 24,500 పైగా బుకింగ్లు దేశంలో జిమ్నీ కోసం ఇప్పటి వరకు 24,500 కుపైగా బుకింగ్లు వచ్చాయి. జూన్ మొదటి వారంలో లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 5-డోర్ల జిమ్నీ కంపెనీ.. మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంట్లో తయారవుతోంది. ఆటోమొబైల్ సమాచార సంస్థ కార్టాక్ ప్రకారం, దేశీయ, విదేశీ డిమాండ్కు అనుగుణంగా ప్రతి నెలా 7,000 యూనిట్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో ఆల్ఫా ట్రిమ్ వేరియంట్ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జిమ్నీ రంగుల విషయానికి వస్తే కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్ కలర్లను చాలా మంది ఇష్టపడుతున్నారు. రూ. 10 లక్షల నుంచి ప్రారంభం లీక్ అయిన డీలర్ ఇన్వాయిస్ ప్రకారం.. భారత్ లో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ భారత్ లో నెక్సా షోరూమ్ల ద్వారా బుకింగ్లకు అందుబాటులో ఉంది. రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
రెండో కుమారుడికి శాంతి పూజ చేయించిన యాంకర్ లాస్య (ఫోటోలు)
-
‘న్యూసెన్స్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సరికొత్త లుక్లో తెలంగాణ నూతన సచివాలయం (ఫోటోలు)
సరికొత్త లుక్లో తెలంగాణ నూతన సచివాలయం(ఫోటోలు) -
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
Anchor Syamala Photos: ఏడాది తిరగకముందే మరో ఇల్లు కడుతున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
శిథిలాల కిందే ఊపిరిపోసుకుంది..'ఆ జననం ఓ అద్భుతం'
తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసింది. ఆ ప్రకృతి విలయం ఇరుదేశాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. దీంతో ఎటూ చూసిన పేకమేడల్లా కూలిని భవనాల కింద చితికిన బతుకులే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్ని అక్కడ ప్రజలకు అంత తేలికగా మర్చిపోలేని ఘోర విషాదాన్ని మిగిల్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులో సిరియాలోని జెండెరిస్ పట్టణంలో శిథిలా కింద ఓ ఆడ శిశువు జన్మించడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఇలాంటి విషాద సమయంలో జన్మించిన ఆ శిశువు జననం ఒక కొత్త ఆశను రేకెత్తించింది. సోమవారం సంభవించిన భూకంపం తదనంతరం భద్రతా బలగాలు రెస్క్యూ చర్యలు చేపడుతుండగా..సిరియాలో శిథిలాల కింద ఓ తల్లి ఒక ఆడబిడ్డకి జన్మినిచ్చిన సంగతి తెలిసింది. ఆ శిశువు తల్లి బొడ్డు తాడుకు జత చేయబడి ఉండటంతో సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్లు అందరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆ శిథిలాల కింద గజగజలాడే చలిలో ఓ చిన్నారి ఏడుపును గమనించి రెస్క్యూ టీం అప్రమత్తమై రక్షించారు. The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake. May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW — Talha Ch (@Talhaofficial01) February 6, 2023 ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో పాపను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఓ వైద్యుడి భార్య ఆ చిన్నారికి పాలందించింది. ప్రస్తుతం ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. ఐతే ఆ చిన్నారి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి తీసుకువెళ్తానని ఆమె మేనమామ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో పుట్టడం విశేషం అంటూ.. ఆ చిన్నారికి అయా అని పేరు పెట్టారు. 'అయా' అనగా అరబిక్లో 'అద్భుతం' అని అర్థం. ఆమె జననం ఓ అద్భుతం అంటూ అక్కడ ప్రజలు ఆ శిశువుకి ఈ పేరు పెట్టారు. (చదవండి: 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్గేట్స్) -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
తెలంగాణ కొత్త పోలీస్ బాస్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్
-
డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నారా?... కొత్త రూల్స్ ఇవే
-
కొత్త సెక్రటేరియట్ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
-
జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా...కానీ ఇక్కడో ట్విస్ట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది...కాదు కాదు..మరో కొత్త స్కీంతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ నేపథ్యంలోనే లాయల్టీ ప్రోగ్రామ్ ‘జొమాటో ప్రో’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం కింద ఇక కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఫ్రీడెలివరీ లాంటి ఫెసిలిటీలు రద్దు అన్నమాట. కస్టమర్ అడిగిప్రశ్నకు సమాధానంగా ట్విటర్లో స్పందించిన జొమాటో ‘జొమాటో ప్రో’ సేవలపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. గడువు ముగిసిన ప్రో మెంబర్షిప్ను రెన్యువల్ చేయడం కుదరదని జొమాటో తెలిపింది. దీనికి వెనుకకారణాలను మాత్రం జొమాటో స్పష్టం చేయలేదు. జొమాటో ప్రో, ప్లస్ లకు కొత్తగా సభ్యత్వం ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే మెంబర్షిప్ వాలిడిటీ ఉన్నవారు తమ ప్రయోజనాలు యధావిధిగా పొందుతారు. సభ్యత్వ గడువు ముగిసిన తర్వాత, దాన్ని పొడిగించలేరు/ పునరుద్ధరించలేరు అని జొమాటో ప్రతినిధి తెలిపారు. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ఇటీవలికాంలో జొమాటో రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. నిన్నగాక మొన్న హృతిక్ రోషన్ యాడ్కు సారీ చెప్పిన జొమాటో 'ప్రో' అనే మెంబర్షిప్ ప్రోగ్రామ్ను నిలిపివేయడం విశేషం. ఇప్పటికే ప్రో ప్లస్కు గుడ్ బై చెప్పేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా సవరించిన సంగతి తెలిసిందే. (పండుగ సీజన్: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్) మరోవైపు తన వినియోగదారుల కోసం "కొత్త ప్రోగ్రామ్"ను లాంచ్ చేయనుందట. అప్డేట్ చేసిన ప్రోగ్రామ్తో మెరుగైన సేవలందిస్తామని, మరిన్ని ఆఫర్లు/అప్డేట్స్ కోసం వేచి ఉండాలంటోంది. దీనికోసం కస్టమర్లతో, రెస్టారెంట్ భాగస్వాములతో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని పేర్కొంది. కొత్త ప్రోగ్రాం టైమ్లైన్ను పేర్కొనలేం గానీ రావడం పక్కా అని తెలిపింది. (ఇదీ చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) Hi there, we regret hearing this from you. Please be informed that Zomato Pro Plus is unavailable for renewal as we are working on a new experience for you. We will get back with an update soon. We'd also like to thank you for being a part of the Zomato Pro program.[1/2] — zomato pro (@ZomatoProHelp) August 22, 2022 -
సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కొత్త కమిటీ చర్చలు జరపనుంది. చర్చల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. చదవండి: సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం -
విశాఖ జూకు కొత్త జంతువులు వచ్చాయోచ్.. అవేమిటంటే..?
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గురువారం మరికొన్ని వన్యప్రాణులు వచ్చాయి. జంతు మార్పిడి పద్ధతిపై ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు కొత్త వన్య ప్రాణులను అధికారులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని వేంకటేశ్వర జూ పార్కు నుంచి గురువారం మూడు గ్రే జంగిల్ ఫౌల్(మగ–1, ఆడ–2), జత వైల్డ్ డాగ్స్, అడవి దున్న, జత చౌసింగా తీసుకొచ్చారు. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు వీటికి బదులుగా విశాఖ జూ నుంచి జత హైనాలు, మగ అడవి దున్న, రెండు ఆడ నక్కలు పంపించినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ నెల 13న చండీగఢ్లోని ఛత్బీర్ జూ పార్కు నుంచి మొసలి జాతికి చెందిన ఘరియల్స్(2 మగవి), రెడ్ జంగిల్ ఫౌల్స్(మగవి–2, ఆడవి–4), లెసర్ విజ్లింగ్ టీల్స్(మగది–1, ఆడవి–2), బార్న్ ఔల్స్(మగ–1, ఆడవి–2), హైనా( మగది–1) ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
కొత్త సంవత్సరం వచ్చేసింది.. అయితే ఇలా చేయండి!
పాత భావాలు... పారేయము. అటక మీద పాత సరుకు.. పారేయము. పంచేయము. పాత బట్టలు, బూట్లు... పారేయము. పంచేయము. అవసరం లేని ఇంటిని ఆక్రమించిన చెడిపోయిన వస్తువులు? పారేయము. పంచేయము. కొత్తవి రావాలంటే పాతవి ఖాళీ చేయాలి. కొత్త సంవత్సరం వచ్చేసింది. పాతవి పారేయండి. లేదా అవసరం ఉన్నవారికి పంచేయండి.కొత్తకు దారివ్వండి. కొత్త సంవత్సరం వస్తుంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. దానికి ముందు పాతవి పారేయాలి కదా. పాతను తీసేయాలి కదా. అక్కరలేని పాతవి అక్కర ఉన్నవారికి కనీసం పంచేయాలి కదా. ఆ పని చేయము. కొత్త సంవత్సరానికి రెడీ కావడం అంటే కొత్తగా రెడీ కావడమే. కొత్త సంవత్సరంలో తేలిగ్గా ప్రవేశించాలి. పాత లగేజ్తో కాదు. ఎన్ని ఉంటాయి పాతవి ఇళ్లల్లో. పేరబెట్టుకొని. అడ్డంగా. స్పేస్ ఆక్యుపై చేసి. ఇంట్లో ఏయే పాత వస్తువుల బరువు దించుకోవాలో చూద్దామా? ఆ భారీ పాత సోఫా మన ఇంటి సోఫా జన్మ సంవత్సరం ఏమోగాని దాని ఆయుష్షు తీరి చాలా రోజులై ఉంటుంది. కవర్లు మార్చి, చిరిగిన చోట ప్యాచ్ వేసి, కిరకిరమంటుంటే మానేజ్ చేస్తూ, చిల్లులు పడుంటే పైన బెడ్షీట్ వేస్తూ... డబ్బులు లేకపోతే సరే. ఉంటే కొత్త సోఫా తెచ్చుకోండి. ఇల్లు కొత్తదిగా కనిపించాలంటే మారే కాలంతో పాటు వచ్చే ఫర్నీచర్ తెచ్చుకోవాలి. ఖరీదైనదే అక్కర్లేదు. రోడ్సైడ్ కూడా మోడరన్ ఫర్నీచర్ దొరుకుతుంది. ఆ పాత సోఫాను వాచ్మన్కు ఇచ్చేయండి. దానిని పెన్నిధిగా భావించే ఏ కారు డ్రైవర్కో లేదంటే అవసరం ఉన్నవారికో ఇచ్చేయండి. ఇల్లు బరువు తగ్గుతుంది. కొత్త కళ వస్తుంది. పాత బట్టలు, పుస్తకాలు ప్రతి ఇంట్లో ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఇవి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. భర్తవి, భార్యవి, పిల్లలవి మళ్లీ పొరపాటున వేసుకోరు అని తెలిసినా ఆ బట్టలను కూరి కూరి బీరువాలలో నింపి ఉంటారు. వాటిని ఈ చలికాలంలో పేదవారికి పంచేస్తే ఎంత గుండె తేలిక. ఇల్లు తేలిక. పిల్లలు స్కూలు పుస్తకాలు కూడా దాచి ఉంటారు. పాత క్లాసులవి ఎందుకు. ఎవరికైనా ఇచ్చేయొచ్చు. ఇంట్లో ఎప్పటెప్పటివో పుస్తకాలు ఉంటాయి. వాటిలో కొన్నే విలువైనవి. కొన్ని ఒకసారి చదివితే చాలనిపించేవి. ఆ ఒకసారి చదవదగ్గ పుస్తకాలను వేరేవాళ్లకు ఇచ్చేయాలి. హ్యాపీగా ఉంటుంది. షూ ర్యాక్ క్లీన్ చేయండి ప్రతి ఇంటి షూ ర్యాక్ పాత చెప్పులు, బూట్లు దుమ్ముపట్టి పోయి ఉంటాయి. వాటిని వాడేది లేదు. అలాగని పారేసేది లేదు. పిల్లల షూస్ కూడా ఉంటాయి. వాటిని పేద పిల్లలకు ఇచ్చేస్తే సంతోషంగా వేసుకుంటారు. చెప్పులు నిరుపేదలకు ఇచ్చేస్తే వేసుకుంటారు. పాతవి పోతే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. ఈ న్యూ ఇయర్కి కొత్త చెప్పులు తొడుక్కోండి. అటక మీద ఉంటుంది రహస్యం అటక మీద తోసేస్తాం చాలా. పాత తపేలాలు, కీబోర్డులు, చెంబులు, కుర్చీలు, మిక్సీలు, గ్రైండర్లు... అవన్నీ ఎందుకు దాస్తామో తెలియదు. వాటిని ఎవరికైనా ఇస్తే సరి చేయించుకుని వాడుకుంటారు. లేదా పాత సామాన్లవాడికి వేస్తే మనకే కొద్దిగా చిల్లర వస్తుంది. అవి బూజుపట్టి వికారంగా కనిపిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణంగా తిరుగాడదు. ఇంకా బాల్కనీల్లో అక్కర్లేని సామాన్లు ఉంటాయి. వాష్ ఏరియాల్లో బోలెడన్ని పనికిరాని వస్తువులు ఉంటాయి. మిద్దె మీద కొందరు పనికి రానిదంతా దాస్తారు ఎందుకో. అన్నీ పారేయండి. పంచేయండి. కొత్త సంవత్సరం కోసం ఇంటిని మీ మనసును తేలిగ్గా చేసుకోండి. కొత్త వెలుతురు కు దారి ఇవ్వండి. అదిగో ఇవాళ మీరు ఫలానా వస్తువు ఇచ్చారన్న ఆనందంతో కొంతమంది అయినా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేలా చేయండి. సరేనా? -
ఆంధ్ర ప్రదేశ్ స్పీడ్ న్యూస్ @ 7pm September 2021
-
తెలంగాణ నూతన ఐటి పాలసీ 2.0 ఆవిష్కరణ
-
వ్యాక్సిన్ తయారీలో విప్లవాత్మక అభివృద్ధి
-
ఒక్కో కాలేజీకి.. 20 ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వేగం పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభ మయ్యేలా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాలలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు రెండు నెలల్లో వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని సమకూర్చాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి వైద్య పరికరాలు, సామగ్రిని అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలం గాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ ఐడీసీ) ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. అలాగే విద్యార్థులకు హాస్టళ్ల వసతిని అద్దె భవనాల్లో కల్పించాలని నిర్ణ యించారు. దీని కోసం ఆ కాలేజీలకు సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు కూడా ఆ పనిలో నిమగ్నమయినట్లు అధికారులు తెలిపారు. టీఎస్ఎంఎస్ఐడీసీ అసంతృప్తి... రాష్ట్రంలో ఒకేసారి ఏడు కాలేజీలు, 1,050 సీట్లు పెరగడం ఇదే తొలిసారి. కొత్త కాలేజీ భవనాలను నిర్మించే బాధ్యత రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. వాస్తవంగా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టీఎస్ఎంఎస్ఐడీసీ ఉన్నా, దాని సామర్థ్యం ఆ మేరకు లేకపోవడంతో ఆర్అండ్బీకి అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో టీఎస్ఎంఎస్ఐడీసీలో అసంతృప్తి నెలకొంది. కాగా, ఒక్కో కాలేజీ కోసం 20 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అందుకోసం భూ సేకరణ జరుగుతోంది. జగిత్యాలలో గోదాముల స్థలాన్ని తీసుకోవాలని నిర్ణయించి, ఫైలు ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. తొలి ఏడాది తరగతుల ప్రారంభానికి ముందే జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు చేస్తుంది. కాబట్టి ఆ తనిఖీల నాటికి లెక్చరర్ హాళ్లు, లైబ్రరీ, డెమో రూములు, పరిపాలనా కార్యాలయం తదితరాలను సమకూర్చాలి. అదనపు పడకల ఏర్పాటుపై దృష్టి... ఇక మెడికల్ కాలేజీలకు అనుబంధ ఆసుపత్రులను స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేస్తారు. అయితే ప్రతీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రికి తప్పనిసరిగా 330 పడకలు ఉండాలి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలోనే 400 పడకలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పడకల సమస్య లేదు. వనపర్తి, జగిత్యాల ఆసుపత్రుల్లో 150 పడకల చొప్పున, మహబూబాబాద్లో 170, నాగర్కర్నూలులో 120, కొత్తగూడెంలో 100, మంచిర్యాలలో 200 మాత్రమే ఉన్నాయి. వీటన్నింటిలో అదనంగా పడకలను నెలకొల్పాల్సి ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వాటిల్లో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి పడకల ఏర్పాటు పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. అందుకు సంబంధించిన ఆదేశాలను జారీచేసేందుకు ఆర్థికశాఖకు ఫైలు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇక కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి కోసం దరఖాస్తు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 9 కొత్తగా వచ్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 7 మొత్తం ప్రభుత్వ కాలేజీల సంఖ్య 16 వీటిల్లోని ఎంబీబీఎస్ సీట్లు1,640 వీటిల్లో 150 చొప్పున అందుబాటులోకి వచ్చే ఎంబీబీఎస్ సీట్లు 1,050 మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య : 2,690 ఒక్కో ఆసుపత్రికి సిబ్బంది ఇలా... కావాల్సిన ప్రొఫెసర్ల సంఖ్య 6 అసోసియేట్ ప్రొఫెసర్ల సంఖ్య 17 అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్య 31 7 మెడికల్ కాలేజీలకు కావాల్సిన వారు 377 పలుచోట్ల నుంచి సరెండర్ ద్వారా సమకూరినవారు 115 కాంట్రాక్టు పద్ధతిన నియమించు కోనున్నవారు 262 -
మిషన్ ‘ఆయిల్ పామ్’.. సబ్సిడీ తీరు ఇలా..
సాక్షి, అమరావతి: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పామాయిల్ సాగును జాతీయ వంట నూనెల మిషన్ (ఎన్ఎంఈవో)లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. వంట నూనెల దిగుమతిని తగ్గించడం, ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఆయా పంటలు, ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, పంచదారలో మనదేశం స్వయం సమృద్ధి సాధించి ఎగుమతి దిశగా సాగుతుండగా వంటనూనెల్ని మాత్రం పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిని నివారించేలా ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతుల్లో 56 శాతం పామాయిలే... మనదేశం ఏటా సుమారు 133.5 లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుండగా దీని విలువ సుమారు రూ.80 వేల కోట్లు ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57 శాతం పామాయిల్ కాగా 27 శాతం సోయా, 16 శాతం సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఒక్క పామాయిల్పైనే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్ తదితర చోట్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత 3.28 లక్షల హెక్టార్లలో సాగులో ఉండగా 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు, 2029–30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని నిర్దేశించారు. నూనె దిగుబడిని 3.15 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందంటే... సాగు విస్తరణలో భాగంగా జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–ఓపీ) కింద మొక్కలకు 85 శాతం సబ్సిడీని ఉద్యాన శాఖ ఇస్తుంది. నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. తోటల నిర్వహణ, అంతర పంటలు, గొట్టపుబావులు, పంపు సెట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, మెషినరీ, ఇతర పరికరాలకు 50 శాతం సాయం అందిస్తుంది. తోటల సాగుపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. రైతులకు లాభసాటిగా ఉండేలా ధరల ఫార్ములాను నిర్ణయిస్తుంది. ఏటా రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. వంట నూనెల దిగుమతులపై కేంద్రానికి ఏటా పన్నుల రూపంలో రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.5 వేల కోట్లను వెచ్చిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయని, రైతులు కూడా పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని ఆయిల్ పామ్ రైతుల జాతీయ సంఘం నేతలు క్రాంతి కుమార్ రెడ్డి, బి.రాఘవరావు పేర్కొన్నారు. దేశంలో నంబర్ వన్ ఏపీ.. ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం 1.62 లక్షల హెక్టార్లలో 1.14 లక్షల మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. సాలీనా హెక్టార్కు 19.81 టన్నుల ఆయిల్ దిగుబడి వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తూనే పామాయిల్ రైతులను ఆదుకునేలా పలు చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు పెరుగుతోంది. 9 జిల్లాల్లో 229 మండలాలలో ఈ పంట సాగవుతోంది. -
అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు..! త్వరలోనే..!
ముంబై: ది ఇండియన్ వారెన్ బఫెట్గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా పలు రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తాజాగా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు 70 ఎయిర్క్రాఫ్ట్లతో కొత్త ఎయిర్లైన్ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్ జున్జున్వాలా ప్రకటించారు. భారత్లో తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్న విమానయాన రంగంలో సుమారు 35 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నారు. ఎయిర్లైన్ కంపెనీలో సుమారు 40 శాతం మేర వాటాను రాకేష్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే పదిహేను రోజుల్లో భారత విమానయాన శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓ సీ ) రానుందని బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ జున్జున్వాలా పేర్కొన్నారు. కాగా రాకేష్ మొదలుపెడుతున్న సొంత ఎయిర్లైన్ ‘ఆకాశ ఎయిర్’ అని తెలుస్తోంది. గతంలో డెల్టా ఎయిర్ లైన్స్లో పనిచేసిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, పలు సభ్యులు కూడా కంపెనీలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొనబోయే ఎయిర్క్రాఫ్ట్స్ సామర్ధ్యం 180 ప్యాసింజర్ల వరకూ ఉండబోతోంది. అత్యంత చౌక ధరలకే విమాన సర్వీసులను అందించే లక్ష్యంతో మార్కెట్లోకి రానుంది. కోవిడ్ మహమ్మారి రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యింది. అయితే రాబోయే రోజుల్లో భారత్లో విమానయాన రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని రాకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి ముందే, భారతదేశంలోని విమానయాన సంస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఒకప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2012 లోనే తన కార్యకలాపాలను ముగించింది. దాంతో పాటుగా ఇటీవల జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ విమాన ప్రయాణాలను ఆమోదం వచ్చిన కొన్ని రోజులకే 2019లో తన ఆపరేషన్లను నిలిపివేసింది. -
హబుల్ టెలిస్కోప్ స్థానంలో మరో కొత్త టెలిస్కోప్..!
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. కాగా తాజాగా టెలిస్కోప్లో నెలకొన్న సాంకేతిక లోపంతో పలు పరిశోధనలకు ఆటంకం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం హబుల్ టెలిస్కోప్ పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నామని నాసా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. హబుల్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) హబుల్ టెలిస్కోప్ను మొట్టమొదటి సారిగా 1990 ఏప్రిల్ 25న స్పేస్ షటిల్ డిస్కవరీ నిర్మించారు. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్పరాల దూరంలోఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలను చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. హబుల్ స్థానంలో మరో టెలిస్కోప్..! సుదీర్ఘ సర్వీస్ను అందించిన హబుల్ టెలిస్కోప్ స్ధానంలో మరో టెలిస్కోప్ను లాంచ్ చేయాలని నాసా భావిస్తోంది. తరచూ హబుల్ టెలిస్కోప్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను హబుల్ స్థానంలో రానుంది. అందుకు సంబంధించిన ప్రయోగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31 న జరిపే అవకాశాలు ఉన్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..! -
చిన్నారి పెళ్ళి కూతురు ఫేమ్ అవికా గోర్ ఫోటోలు
-
రాజన్న ఫేమ్ మల్లమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
-
ఇప్పుడు అంతా వెతుకుతున్న కొత్త పదాలు
కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తున్న పేరు ఇది. మనం ఏ విషయం గురించి మాట్లాడాలన్న కరోనాకి ముందు కరోనాకి తరువాత అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కరోనా వల్ల కేవలం ఆర్ధిక పరంగా, మార్కెట్ల పరంగా మాత్రమే కాదు, మనుషులు వాడే పదాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా చాలా పదాలు ఇప్పుడు డిక్షనరీలో చేరాయి. 2020 సంవత్సరంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పదాలు ఏంటి? గూగుల్లో ఎక్కువ మంది ఏ పదాలను వెతుకుతున్నారో చూద్దాం. వైద్య పరిభాషకి సంబంధించి మాస్క్లు, పీపీఈ కిట్లు లాంటి పదాలను ఎక్కువగా వెతుకుతున్నారు. అలాగే ఎక్కువగా ఉపయోగిస్తున్న పదాల విషయానికి వస్తే (టిక్టాక్కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!) సోషల్ డిస్టెన్సింగ్ (సామాజిక దూరం): మనకి చిన్నప్పుడు స్కూల్లో అసెంబ్లీ జరిగే సమయంలో ప్రతి ఒక్కరు చేయి అంత దూరంలో ఉండాలి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు కేవలం అసెంబ్లీ సమయంలో మాత్రమే కాకుండా ప్రతి చోట దానినే తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా మహమ్మారి కట్టడికి మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం చాలా అవసరం. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్!) గ్లోబల్ పండమిక్ (మహమ్మారి): ఒక వ్యాధి ప్రపంచమంతా వ్యాపిస్తూ, అనుకున్నదాని కన్నా దాని తీవ్రత ఎక్కువగా ఉండి ఊహించనదాని కన్నా ఎక్కువ మంది ఆ వ్యాధి బారిన పడుతుంటే దానిని మహమ్మారిగా వ్యవహరిస్తారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్లాటన్ ది కర్వ్ : ఈ పదాన్ని వ్యాధిని వేగంగా విస్తరించిన తరువాత వ్యాధిని నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, వ్యాధిన పడిన వారి సంఖ్య రోజు రోజు తగ్గించడం, మెరుగైన వైద్యం అందిస్తూ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాము. ఇన్ఫోడెమిక్: ఒక విషయానికి సంబంధించి అధికంగా సమాచారం లభించడాన్ని ఇన్ఫోడెమిక్ అంటాం. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో, వాట్సప్లో అన్నింటిలో కరోనాకు సంబంధించిన సమాచారాన్నే ఎక్కువగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఫేక్ న్యూస్లు కూడా ఎక్కువగానే పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తాము. డబ్ల్యూఎఫ్హెచ్: వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచి పని చేయడం) ఇప్పుడు ఈ పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. లాక్డౌన్ కారణంగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించాయి. అందుకే ఇప్పుడు ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. లాక్డౌన్: ఈ పదానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిని అవసరం లేదు. కరోనాను కట్టడి చేయడానికి అన్ని దేశాలు లాక్డౌన్ను విధించాయి. ఆయా దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో అన్ని కార్యకలాపాలతో పాటు ప్రజలు ఎక్కడ వారక్కడే స్ధంబించిపోయారు. ఈ కరోనా కాలంలో మొదటి నుంచి వినిపిస్తూ ప్రజలని భయపెడుతున్న పదం లాక్డౌన్. క్వారంటైన్ అండ్ చిల్: దీని అర్ధం కరోనా సమయంలో విధించిన అన్ని నిబంధనలను అనుసరిస్తూ ఇంట్లో సౌకర్యవంతంగా ఉండటం. లాక్డౌన్ కారణంగా చాలా మందికి విశ్రాంతి దొరికింది. వారందరికి తమ తమ కుటుంబాలతో గడపడానికి ఒక అవకాశం లభించింది. -
కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్ ఇదే..!
హైదరాబాద్ : సైరాలో స్వాతంత్ర సమరయోధుడిగా వెండితెరపై అద్భుత నటనను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే తన 152వ సినిమాలో నక్సలైట్ పాత్ర పోషిస్తారనే ప్రచారం ఊహాగానమేనని వెల్లడైంది. కొరటాల మూవీలో మెగాస్టార్ లెక్చరర్ పాత్రలో అభిమానులను ఆకట్టుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదలైన సైరా రూ 250 కోట్ల కలెక్షన్లతో చిరు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంలా నిలిచింది. ఇక కొరటాల శివ మూవీలో తమ హీరోను కొరటాల ఎలా ప్రజెంట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో చిరును స్లిమ్గా కనిపించాలని దర్శకుడు కోరడంతో మెగాస్టార్ జిమ్ చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. క్లాస్ లుక్తో తనదైన మాస్ స్టైల్తో మెగా స్టార్ ఈసారి దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొరటాల మూవీలో మెగాస్టార్ 30 సంవత్సరాల యువకుడిగా, పెద్దవయసు వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. అయితే చిరంజీవి యువకుడిగా ఉన్న పాత్రలో దర్శకుడు కోరిన మీదట ఆయన కుమారుడు రామ్చరణ్ పోషస్తారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గోవింద్ ఆచార్య, గోవింద హరి గోవింద టైటిల్స్ను చిత్ర బృందం పరిశీలిస్తోంది. -
మెక్సికన్ గల్ఫ్లో అరుదైన షార్క్ చేప..
అమెరికాలోని గల్ఫ్ మెక్సికోలో ఓ కొత్త షార్క్ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేవలం 5.5 అంగుళాలు మాత్రమే ఉండి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. గత కొన్నెళ్లుగా షార్క్ చేపలపై, సముద్రాలలోని ప్లాస్టిక్పై అధ్యయనం చేస్తున్న తులనే విశ్వవిద్యాలయం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 1979 అనంతరం తొలిసారి అతి చిన్న షార్క్ చేపను గుర్తించినట్టు తెలిపారు. గతంలో 2010, 2013లలో దీనిని గుర్తించామని కానీ తమకు చిక్కలేదన్నారు. ఈ షార్క్ చేప దాని శరీరం నుంచి వచ్చే కాంతితో ఎదుగుతుందని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తెలుపుతోంది. దీంతో పాటు ఇతర జీవులను ఆకర్షించడానికి, వీటిపై దాడి చేసేవారిని దూరంగా ఉండమని హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2010 లో గల్ఫ్ ప్రాంతంలో తిమింగలాలపై అధ్యయనం చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు కాంతిని ప్రసరించే మగ కైట్ఫిన్ షార్క్ కనుగొన్నారు. ఆ తర్వాత నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకుడు మార్క్ గ్రేస్ కాంతితో మెరిసే షార్క్ చేపను కనుగొన్నారు. ఎక్కువగా లోతు ఉండే సముద్ర జీవులపై పరిశోధనలు చాలా తక్కువగా జరుగుతున్నాయంటూ.. సముద్ర పైభాగంలోని నీటిలో నివసించే జంతువుల్లో 90 శాతం కాంతిని ప్రసరిస్తాయని ఎన్ఓఏఏ అంచనా వేసింది. -
ప్రతిభ వలసల వీసాలు 57 శాతం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సరికొత్త వలసవిధానంపై దృష్టి సారించింది. ప్రతిభ ఆధారిత వలసలకు మొత్తం వీసాల్లో 57 శాతం కేటాయించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీనియర్ సలహాదారు, అల్లుడు జరెడ్ కుష్నర్ నేతృత్వంలోని కమిటీ నూతన వలస విధానాన్ని రూపొందించింది. ఈ విషయమై వైట్హౌస్లో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కుష్నర్ మాట్లాడుతూ..‘నూతన ప్రతిభ ఆధారిత వలసవిధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను, ప్రతిభావంతులను అమెరికావైపు ఆకర్షించవచ్చు. దీనివల్ల మన దేశానికి రాబోయే పదేళ్లలో పన్నులరూపంలో 500 బిలియన్ డాలర్ల(రూ.34.41 లక్షల కోట్ల) ఆదాయం సమకూరుతుంది. మన సామాజికభద్రత పథకాలకు చెల్లింపులు జరుపుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల అమెరికన్లు లబ్ధి పొందుతారు. మనతోటి దేశాలను పోల్చుకుంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు కాలంచెల్లింది. కెనడాలో 53 శాతం విదేశీ నిపుణులు, ప్రతిభావంతులకు వీసాలు జారీచేస్తున్నారు. ఈ సంఖ్య న్యూజిలాండ్లో 59 శాతం, ఆస్ట్రేలియాలో 63 శాతం, జపాన్లో 52 శాతంగా ఉంటే, అమెరికాలో మాత్రం 12 శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నూతన వలసవిధానం ప్రకారం మొత్తం వీసాల్లో 57 శాతం ప్రతిభ ఆధారంగా జారీచేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. దీనివల్ల మిగతా దేశాలతో అమెరికా పోటీపడగలుగుతుంది’ అని కుష్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల వలస చట్టాలను అధ్యయనం చేసిన ఈ నూతన వలస విధానాన్ని రూపొందించామనీ, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న దీన్ని త్వరలోనే ప్రజలముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. -
రైతు రాజ్యం
-
17వ లోక్సభకు.. కొత్త ముఖాలు!
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన ఏడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారవడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారన్నది స్పష్టమయింది. లోక్సభ లోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 8,048 మంది పోటీ చేస్తున్నారు(గత ఎన్నికలో 8,794 మంది పోటీ చేశారు). అయితే, వీరిలో 85 శాతం అంటే 6,819 మంది ఎన్నికలకు కొత్త వారే. అంటే మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు. మిగతా వారిలో 8 శాతం రెండోసారి, 3.2 శాతం మూడోసారి, 1.5 శాతం నాలుగోసారి పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లకు మించి పోటీ చేస్తున్న వారు 2.2 శాతం ఉన్నారు. అభ్యర్థుల్లో 85 శాతం కొత్త వారే కాబట్టి ఎన్నికల తర్వాత ఏర్పడబోయే 17వ లోక్సభలో కొత్త ముఖాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున మొత్తం 2,163 మంది బరిలో దిగారు. 2,445 మంది చిన్న చిన్న పార్టీల తరఫున, 3,440 మంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల గోదాలో కలబడుతున్నారు. ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టేశాయి. 2014 ఎన్నికల్లో 73 శాతం సిట్టింగు ఎంపీలకు టికెట్లు లభిస్తే, ఈ సారి 59 శాతం సిట్టింగులకే మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. అంటే ప్రతి పది మంది సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు నలుగురు పోటీ చేసే అవకాశం కోల్పోయా రు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 275 మం ది ఎంపీలుంటే వారిలో 156 మందికే ఈ సారి పోటీ చేసేందుకు టికెట్టు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 48 మంది సిట్టింగ్ ఎంపీల్లో 28 ఎంపీలకే మళ్లీ అవకాశం ఇచ్చింది. ప్రాంతీయ పార్టీలదీ అదే దారి ప్రాంతీయ పార్టీలు కూడా ఈ సారి ఎక్కువ మంది కొత్త వారిని ఎన్నికల్లో నిలబెట్టాయి.ప్రస్తుత లోక్సభలో ప్రాంతీయ పార్టీల ఎంపీలు మొత్తం 139 మంది ఉంటే, వారిలో 63 మంది(45.5%) మాత్రమే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంటే 50 శాతానికిపైగా కొత్త ముఖాలే ప్రాంతీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే 37 మంది ప్రస్తుత ఎంపీల్లో కేవలం ఆరుగురికే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఒడిశా లోని బీజేడీ 20 మంది సిట్టింగులకుగాను నలుగురినే తిరిగి బరిలో దింపింది. ఏపీలో తెలుగు దేశం పార్టీ 16 మంది సిట్టింగు ఎంపీల్లో పది మందినే మళ్లీ పోటీ చేయిస్తోంది. వైఎస్సార్సీపీ తొమ్మిది మంది సిట్టింగు ఎంపీల్లో ఏడుగురికి టికెట్ ఇవ్వలేదు. తెలంగాణలోని టీఆర్ఎస్కున్న 11 మంది సిట్టిం గ్ ఎంపీల్లో ఏడుగురు మళ్లీ పోటీ చేస్తున్నారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ ఏడుగురిలో నలుగురినే మళ్లీ పోటీ చేయిస్తోంది. ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కూడా ఈ సారి కొత్త వారినే ఎక్కువ మందిని ఎన్నికల్లో నిలబెట్టా యి. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, యూపీఏ సర్కారు వచ్చినా కూడా చాలా మంది ఎంపీలు కొత్తవారే అవుతారు. 90వ దశకం నుంచీ.... 1990 దశకం చివరి నుంచి ఎన్నికల్లో సిట్టింగులను పక్కన పెట్టడం పెరుగుతూ వస్తోంది. ప్రధాన పార్టీలు సిట్టింగు ఎంపీలను మార్చడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడం.అధికార పార్టీపై ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు అధికారంలో కొనసాగిన పార్టీలపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. అలాంటి పార్టీ మరోసారి అధికారం కైవసం చేసుకోవానుకున్నప్పుడు ప్రజా వ్యతిరేకతను అధిగమించడం కోసం కొత్త వారికి టికెట్లు ఇస్తుంది. సిట్టింగ్ల పనితీరు, నియోజకవర్గాల్లో సదరు వ్యక్తికున్న బలం, ఆర్థిక పుష్టి వంటి అంశాలు కూడా అభ్యర్థి మార్పుకు దారి తీస్తాయి. మోదీ అయితే, ప్రతి ఎన్నికల్లో దాదాపు 50 శాతం కొత్త వారికి టికెట్లు ఇవ్వడమన్నది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తున్న వ్యూహం. ప్రధాని అయ్యాక లోక్సభ ఎన్నికల్లో కూడా దీనినే అమలు పరుస్తున్నారు. అభ్యర్థులను మార్చే విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ వెనకబడి ఉందని చెప్పాలి. చాలా ఏళ్లుగా ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకే పెద్దపీట వేస్తూ వచ్చింది. కాబట్టి పనితీరు, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉన్నా చాలా మంది సిట్టింగులకే టికెట్లు లభించేవి. అయితే, ఈ సారి ఆ పార్టీ కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టడం పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెచ్చిన మార్పుగా పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగులు,అనుభవజ్ఞులకు బదులు కొత్త వారు ఎన్నికవడం శుభసూచకమే అయినా, పాత వారి రాజకీయ, పరిపాలన అనుభవం వ్యర్ధమయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా కొత్తగా ఎన్నికయిన వారు కూడా రెండో దఫా మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో విధి నిర్వహణపై శ్రద్ధ చూపించలేరని వారు అభిప్రాయపడుతున్నారు. -
తెరపైకి కాంగ్రెస్ కొత్త ముఖాలు
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం పేరు ప్రముఖంగా వినిపించగా, తాజాగా రహీంసైఫీ పేరు తెరపైకి వచ్చింది. అనూహ్యంగా ఈ పేరు వినిపిస్తుండటంతో ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వాలను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీకి టీపీసీసీ పంపిన జాబితాలో గంగారాంతో పాటు, రహీంసైఫీ పేరును చేర్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రహీం చాలా ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో రహీంసైఫీకి సంబంధాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అభ్యర్థిత్వం ఎంపికలో రహీంసైఫీ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం వెనుక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు సీనియర్ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రహీంసైఫీ పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం నేతలు రగులుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవా రం ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిం ది. మిగిలిన తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితాను శనివారం ఖరారు చేసే అవకాశాలున్నాయని భావించారు. కానీ ఎలాం టి ప్రకటన రాలేదు. ఆది, సోమ వారాల్లో ప్రకటించే జాబితాలో నిజామాబాద్ అభ్యర్థి పేరు ను ప్రకటిస్తారా.? లేక మరో ఒకటీ రెండు రో జులు వాయిదా వేస్తారా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చివరకు మధుయాష్కియేనా..? నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. భువనగిరి నుంచి బరిలోకి దిగాలని భావించిన ఆ యన ఆ స్థానం టికెట్ కోసం ప్రయత్నాలు చే శారు. అయితే భువనగిరి స్థానం కోమటిరెడ్డికి ఖరా రయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నా యి. అక్కడి అభ్యర్థిత్వం దక్కకపోతే నిజా మాబాద్ బరిలో మళ్లీ మధుయాష్కే ఉండే అవకా శాలున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. తా ను భువనగిరి నుంచి పోటీ చేస్తున్నానని, నిజా మాబాద్ స్థానం క్యాడర్కు ప రోక్షంగా సంకేతాలు పంపానని, ఇప్పుడు తి రిగి నిజా మాబాద్ నుంచి పోటీ చేయాల్సిన ప రిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది.. అని మధుయాష్కి ఆ యన సన్నిహితులతో చర్చించినట్లు తెలు స్తోం ది. ఈ స్థానం అభ్యర్థిత్వం కోసం మధుయాష్కికి ప్రత్యామ్నాయంగా ప్రారంభంలో మాజీ మంత్రి పి సుదర్శన్రెడ్డి, టి జీవన్రెడ్డి, మహేష్ కుమార్గౌడ్, షబ్బీర్అలీ తదితరుల పేర్లు వినిపించాయి. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరంతా చేతులెత్తేయడంతో అధిష్టానానికి అభ్యర్థిత్వం ఎంపిక సవాల్గా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ ఒకటీ రెండు రోజుల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఫుల్ స్పీడ్
మొదటి చిత్రం సెట్స్పై ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించారు శివ కందుకూరి. ‘పెళ్ళి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడే శివ కందుకూరి. ఈరోజు శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త చిత్ర విషయాలను ప్రకటించారు. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన భరత్ ఈ చిత్ర దర్శకుడు. ఈ ప్రేమ కథను నరాల శ్రీనివాస రెడ్డి, పుత్తాకర్ రోన్ సన్ నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని వేసవి తర్వాత రిలీజ్కు రెడీ అవుతోంది. శేష సింధు ఈ చిత్రానికి దర్శకురాలు. ఫస్ట్ సినిమా పూర్తి కాకుండానే రెండో సినిమా అంగీకరించి ఫుల్ స్పీడ్లో ఉన్నారు శివ కందుకూరి. భరత్ దర్శకత్వంలో చేసే ప్రేమకథా చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
సుజుకి హయబుసా -2019 ఎడిషన్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీదారుమారుతి సుజుకి అనుబంధ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంఐపీఎల్) తన పాపులర్ బైక్లో కొత్త ఎడిషన్ను విడుదల చేసింది. ఖరీదైన స్పోర్ట్స్ బైక్ హయబుసా 2019 ఎడిషన్ను గురువారం ప్రారంభించింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అప్డేటెడ్ గ్రాఫిక్స్తో మెటాలిక్ ఓర్ట్ గ్రే , గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ రెండు కొత్త రంగులలో హయాబూసా 2019 ఎడిషన్ను సుజుకి తీసుకొచ్చింది. దీని ధరను రూ. 13.74 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ) నిర్ణయించింది. తమ అన్ని డీలర్షిప్ల ద్వారా ఈ బైక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాలుగా స్పోర్ట్స్ బైక్లలో సుజుకి హయాబూసాకు భారతదేశంలో అద్భుతమైన స్పందన లభించిందనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా వెల్లడించారు. ఇండియాలోని బైక్ లవర్స్కోసం 2019 ఎడిషన్ను రెండు కొత్త రంగుల్లో,మరింత ఆకర్షణీయంగా తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. -
విరుష్క చిలిపి తగాదా ముచ్చట చూశారా?
ముచ్చటైన జంట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నటించిన మన్యవార్-మాహే ప్రకటన గుర్తుందా..ఈ స్వీట్ అండ్ సెలబ్రిటీ కపుల్ పెళ్లికి ముందు చేసిన ఈ యాడ్తో అందరి చూపులనూ కట్టిపడేశారు. అన్యోన్యమైన జంట అంటే ఇలా ఉండాలి అన్నట్టు నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా పెళ్లి తరువాత..వీరి వివాహ వార్షికోత్సవానికి కేవలం కొన్ని వారాల ముందు చేసిన అదే మన్యవర్-మోహే ప్రకటన ఇపుడు హల్చల్ చేస్తోంది. పెళ్లికి ముందు ప్రమాణాలు, పెళ్లి తరువాత ప్రయాణం..ఈ చిలిపి తగాదాలతో చూడముచ్చటగా అద్భుతంగా ఉన్న ఈ యాడ్ను చూసి ఆనందించాల్సిందే.. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్లో ఈ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో లక్షలాది లైక్లు, కమెంట్ల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా ఈ యాడ్ చూసిన అభిమానులు ‘బెస్ట్ కపుల్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ తెగ మురిసిపోతున్నారు. అటు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, ధడక్ దర్శకుడు శశాంక్ ఖైతాన్ కూడా తాజా ప్రకటన చూసి విరాట్-అనుష్క జంటపై ప్రశంసలు కురిపించారు. వ్యాపార ప్రమోషన్లో వాణిజ్య ప్రకటనలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. ఇక సదరు యాడ్లకు సెలబ్రిటీల స్పెషల్ ఎట్రాక్షన్ తోడైతే వినియోగదారులను ఆకట్టుకోవడం చాలా సులువు. ఆ కోవలోనిదే. ఇండియన్ సల్వార్ సూట్, సాంప్రదాయ, డిజైనర్ వివాహ దుస్తులకు పెట్టింది పేరైన మాన్యవర్-మాహే ప్రకటన కూడా. View this post on Instagram Celebrating love everyday #SaathSaathHamesha ✨🌟 @manyavarmohey @virat.kohli A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Nov 19, 2018 at 8:42pm PST -
బీఎస్ఎన్ఎల్: కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది.ఒకటి కాదు రెండు ఏకంగా ఆరు ప్లాన్లను తీసుకొచ్చింది. సరసమైన ధరలో రూ.118 ప్రారంభ ప్యాక్గా, రూ.379, రూ. 551 సహా ఇతర ప్రీపెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. అలాగే రూ.339 ప్లాను రివ్యూ చేసి అదనపు సౌకర్యాలను జోడించింది. ముఖ్యంగా రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలీకాం సంస్థల పోటీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఈ కొత్త టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చింది. దీంతోపాటు ఈ అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో వినియోగదారులు వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్బీటీ) కు ఉచితంగా అందిస్తోంది. రూ. 118 ప్లాన్: 1జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజులు వాలిడిటీ. ఈ ప్లాన తమిళనాడు సర్కిల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రూ.379ప్లాన్: రోజుకు 4జీబీ 4జీ/3జీ డేటా .. బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ రోజుకు 30 నిమిషాల వాయిస్ కాల్స్, 30రోజులు వాలిడీటీ. అయితే ఈ ప్లాన్ కేరళ సర్కిల్లో మాత్రమే. రూ.551ప్లాన్: రోజుకు 1.5జీబీ 4జీ డేటా , కేరళకు మాత్రమే ప్రత్యేకం. రూ. 444 ప్లాన్:1.5జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్కాల్స్, 60 రోజులు వాలిడిటీ. రూ.666 ప్లాన్: 1 జీబీ 4జీడేటా, అన్లిమిటెడ్కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు,129 రోజులు వాలిడిటీ. రూ.485 ప్లాన్: రోజుకు1 జీబీ 4జీడేటా, రోజుకి వంద ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్కాల్స్, 90 రోజులు వాలిడిటీ. దీంతోపాటు రూ.799ల మరో ప్రీమియం ప్రీపెయిడ్ ప్లాన్లో 30జీబీ డేటా, అన్లిమిటెడ కాల్స్ ఆఫర్ చేస్తోంది.అ లాగే ఇటీవల లాంచ్ చేసిన రూ.399 ప్లాన్ను మోడిఫై చేసి ఇపుడు అన్ లిమిటెడ్కాల్స్ అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఇవిఅమల్లోకి రానున్నాయి. మరోవైపు మిగతా ప్రాంతాల్లో ఈ ప్లాన్లను ఎపుడు అమలు చేసేదీ బీఎస్ఎన్ఎల్ వెల్లడిచేయలేదు. -
కొత్తగా ఎంపికైన ఎంపీలకు అభినందనలు
ఢిల్లీ: కొత్తగా రాజ్యసభకు ఎంపికైన ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో కొందరు మళ్లీ ఎంపికయ్యారని అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యులు దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. సభలో పలు రంగాల్లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సభను హుందాగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..విశ్రాం జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ ఛైర్మన్గా కురియన్ సేవలు మరువలేనివన్నారు. ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు మరోసారి అభినందనలు చెప్పారు. -
శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎ.. త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ త్వరలోనే తన పాపులర్ గెలాక్సీ ఏ సిరీస్లో కొత్త ఎడిషన్లను లాంచ్ చేయనుంది. జనవరిలో రెండవ వారంలో 2018 ఎడిషన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం ఆన్లైన్ లోనే మాత్రమే ఇవి లభ్యంకానున్నాయి. ఆన్లైన్ ప్లాట్ ఫామ్లో అందుబాటులో ఉన్న 'ఎ' సిరీస్ ఈ డివైస్ మొదటిది. గెలాక్సీ ఎ8,గెలాక్సీ ఎ8 + గెలాక్సీ ఎస్8, ఎస్8 + నోట్ 8 2018ఎడిషన్లను గత నెలలో గ్లోబల్గా ప్రారంభించింది. జనవరి 10వ తేదీన వీటిని లాంచ్ చేయనుంది. అయితే ఇండియాలో అమెజాన్లో ప్రత్యేకంగా ఒక వేరియంట్ను మాత్రమే అందించనుందట. ఇన్ఫినిటీ డిస్ప్లే, ఫస్ట్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ,లైవ్ ఫోకస్ లాంటి ఆకర్షణీయ ఫీచర్లతో తీసుకొస్తున్నట్టు శాంసంగ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్, మొబైల్ కమ్యునికేషన్స్ బిజినెస్ జున్హో పార్కు ఒక ప్రకటనలో తెలిపారు. డస్ట్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్, మొబైల్ పేమెంట్ డిజిటల్ వాలెట్, యూఎస్బీ టైప్ సీ( ఫాస్ట్ చార్జింగ్)ను కూడా వీటిల్లో జోడించినట్టు వెల్లడించారు. -
జియోని స్మార్ట్ఫోన్: భారీ బ్యాటరీ, సెల్ఫీ కెమెరా
సాక్షి, న్యూఢిల్లీ: జియోనీ ఇండియా కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్ను కొనసాగించిన కంపెనీ ఎక్స్ 1 ఎస్ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను మంగళవారం లాంచ్ చేసింది. రూ.12,999 ధరలో బ్లాక్, గోల్డ్ కలర్స్లో సెప్టెంబర్ 21నుంచి ఈ డివైస్ అందుబాటులో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, అతిపెద్ద బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెప్పింది. ఆధునిక వినియోగదారులకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా మెరుగైన సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలను అందించే లక్ష్యంతో ఎక్స్ 1ఎస్ ను విడుదల చేశామని బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ అలోక్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే ఎయిర్టెల్ వినియోగదారులకు వరుసగా 6 రీచార్జ్లకు 10 జీబీ డేటా అదనం. ఎక్స్ 1 ఎస్ ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.0.1 ఆపరేటింగ్ సిస్టం 1.5 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ గొరిల్లా గ్లాస్ ప్రొ టెక్షన్ 3 ఫింగర్ ప్రింట్ సెన్సర్ 13 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 వరకు విస్తరించుకునే అవకాశం 4000 ఎంఏ హెచ్ బ్యాటరీ సామర్ధ్యం -
ఆర్థిక సేవల కార్యదర్శిగా రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సేవల కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్కుమార్ ఎంపికయ్యారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) కార్యదర్శిగా అంజిలీ చిప్ దుగ్గల్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ కుమార్ కు పరిపాలనా విభాగంలో 30 ఏళ్ళ కుపైగా అనుభవం ఉంది. ముఖ్యంగా తన సొంత రాష్ట్రం జార్ఖండ్ పరిపాలనా విభాగంలో కీలకబాధ్యతలు నిర్వహించారు. తాజా నియామకానికి ముందు, పర్సనల్ పబ్లిక్ గ్రీవ్వెన్సెస్ అండ్ పెన్షన్ మంత్రిత్వశాఖ, స్పెషల్ సెక్రటరీ, ఎస్టాబ్లిష్ మెంట్ అధికారిగా ఉన్నారు. సిబ్బంది, శిక్షణ శాఖ. అతను కేంద్ర ప్రభుత్వంలో వివిధ సామర్థ్యాలలో పనిచేశారు. మార్చి 19, 2012 - మార్చ్ 12, 2015 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిత్వశాఖలోని వ్యయాల విభాగానికి జాయింట్ సెక్రటరీగా, అనంతరం అడిషనల్ సెక్రటరీ గా తన సేవలందించారు. -
మన్యంలో.. కొత్త గ్రామం
♦ అవాక్కైన ఎంపీడీఓ విజయ ♦ ఆ గ్రామంలో రోగాలతో అల్లాడుతున్న గిరిజనం రాజవొమ్మంగి (రంపచోడవరం) : రోగాలు రొస్టులతో అల్లాడుతూ ఎటువంటి అభివృద్ధికీ నోచుకోని ఓ గ్రామం గురువారం రాజవొమ్మంగి మండలంలో వెలుగులోకి వచ్చింది. జ్వరాలతో బాధ పడుతోన్న ముగ్గురు పిల్లలను చంకనెత్తుకొని లాగరాయి పీహెచ్సీకు ఓ ఆదివాసీ వచ్చాడు. అతడు చూపిన దారి వెంబడి ఎంపీడీఓ కేఆర్ విజయ ఆ గ్రామానికి వెళ్లారు. తాగునీరు, రోడ్డు లేని చాపరాయి వంటి కొత్తపాలెం.. అనే ఓ గ్రామాన్ని అక్కడ చూసి అవాక్కయ్యారు. అనంతరగిరి నుంచి లోతట్టుకు కాలినడకన వెళ్లిన ఎంపీడీఓ.. లాగరాయి పీహెచ్సీ వైద్యాధికారి సూసాన్, సిబ్బంది సహాయంతో వైద్యశిబిరం ఏర్పాటు చేసి మలేరియా తదితర రోగాలతో బాధ పడుతోన్నవారికి చికిత్స అందేలా చర్యలు తీసుకొన్నారు. ఎంపీడీఓ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 15 మంది పిల్లలతో, సుమారు 35 మంది పెద్దవారితో ఉన్న కొత్తపాలెం అనే గ్రామంలో కోదుజాతి ఆదివాసీలు కొండపోడు చేస్తూ నివసిస్తున్నారు. ఈ గ్రామం ఉందని ఇంతవరకు అధికారిక లెక్కల్లో లేదు. తాగునీటికి ఓ నేలబావిపై ఆధారపడి జీవిస్తుండడంతో గిరిజనులు రోగాల బారిన పడ్డారని ఎంపీడీఓ చెప్పారు. ఈ గ్రామం ఇటు లబ్బర్తి పంచాయతీకు మరో వైపు కిండ్ర పంచాయతీ సమీపంలో ఉందన్నారు. పిల్లల పౌష్టికాహారం కోసం అనంతరగిరిలోని అంగన్వాడీ సెంటర్కు నెలకు ఒకసారే వస్తున్నారని వివరించారు. ఇక్కడ నివశించే గిరిజనులు మొక్కజొన్న, గంటెలు, సామలు వంటి సంప్రదాయ పంటలు పండిస్తూ జీవిస్తున్నారని, మరుగున పడిన ఈ గ్రామం వివరాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళతానని ఎంపీడీఓ స్థానిక విలేకరులకు తెలిపారు. మరో చాపరాయి కాకుండా చూడాలి ఇటువంటి గ్రామాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీలకు చేయూత ఇవ్వాలి. ప్రస్తుతం వారికి తాగునీరు, రహదారి, వైద్యం, పౌష్టికాహారం అందజేసి కొత్తపాలెం మరో చాపరాయి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. – అనంత ఉదయ భాస్కర్ వైఎస్సార్ సీపీయువజన విభాగం జిల్లా అధ్యక్షులు -
అన్నవరానికి త్వరలో కొత్త ఈఓ!
రెవెన్యూశాఖకు ప్రస్తుత ఈఓ నాగేశ్వరరావు సరెండర్? ప్రచారంలోకి త్రినాథరావు, రఘునాథ్ పేర్లు అధికారపార్టీ నేతల ముమ్మర ప్రయత్నాలు అన్నవరం : అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును ఆయన మాతృ విభాగం రెవెన్యూ శాఖకు సరెండర్ చేయాలా లేక మరో ఆరు నెలలు ప్రస్తుత పదవిలోనే కొనసాగించాలా అనే దానిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికారపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయనను పంపించి, దేవాదాయశాఖకు చెందిన అధికారిని ఈఓ గా నియమించాలని సీఎంను కోరగా, ఆయన అందుకు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ శాఖలో స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను 2015 జూలై రెండో తేదీన దేవస్థానం ఈఓగా ప్రభుత్వం నియమించింది. 2016 జూలై రెండో తేదీకి ఏడాది కాలపరిమితి పూర్తవడంతో మరో ఏడాది డెప్యుటేషన్ పొడిగించింది. దీంతో వచ్చే జూలై రెండో తేదీతో ఆయన కాలపరిమితి ముగియనుంది. తన డెప్యుటేషన్ పూర్తవుతున్నందున తనను రెవెన్యూ విభాగానికి సరెండర్ చేయాలని ఆయన దేవాదాయశాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ, కమిషనర్ ను గతంలో కోరారు. అయితే 2018 మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆయన మరో ఆరు నెలలు ఇక్కడే కొనసాగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. పంపించేయాలని నేతల ప్రయత్నాలు: అయితే ఇటీవల కాలంలో ఈఓ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడం, అధికారపార్టీకి చెందిన మెజార్టీ నేతలు కూడా తమకు సరైన గౌరవ మర్యాదలు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఆయనను కొనసాగించే విషయమై అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి తోడు రెవెన్యూ విభాగానికి చెందిన అధికారి ఈఓగా వస్తే దేవస్థానంలో ఎటువంటి అభివృద్ది జరగడం లేదని, ఏడేళ్లుగా ఇదే పరిస్థితి అని కొంతమంది అధికారపార్టీ నాయకులు సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈఓగా త్రినాదరావు లేదా రఘునాద్..? ద్వారకా తిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావు లేదా పెనుగంచిప్రోలు దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎం.రఘునాథ్ ఇద్దరిలో ఒకరిని అన్నవరం దేవస్థానం ఈఓగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. త్రినాథరావు గతంలో జిల్లాలో డీసీ పనిచేయగా, రఘునా«థ్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓ గా పనిచేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధకశాఖ గతంలో దాడులు చేసింది. ఆ కేసులో ఆయనకు క్లీన్చిట్ లభించిందని చెబుతున్నారు. -
'స్మార్ట్ టి-షర్టు..ఏం చేస్తుందో తెలుసా?
టొరంటో: శాస్త్రవేత్తలు వినూత్నమైన టీ షర్ట్ను రూపొందించారు. ధరించిన వారి శ్వాసను మానిటర్ చేసే స్మార్ట్ టి-షర్టును పరిశోధకులు సృష్టించారు. ఎలాంటి వైర్లు లేదా సెన్సర్ల అవసరం లేకుండానే రియల్ టైంలో ధరించిన వారి శ్వాస రేటును ఇది పర్యవేక్షిస్తుందట. శ్వాసకోశ వ్యాధులను నిర్ధారించడానికి లేదా ఉబ్బసం, స్లీప్ అప్నియా లేదా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి బాధపడుతున్న వ్యక్తులను పర్యవేక్షించడానికి ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. కెనడాలోని లావాల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ 'స్మార్ట్ టీ షర్టును రూపొందించారు. దీని అంతర్గత ఉపరితలంపై పలుచటి వెండి పొరతో కప్పబడిన బోలుగా ఉండే ఆప్టికల్ ఫైబర్తో తయారు చేసిన యాంటెన్నాను షర్ట్ కాత్లో ఛాతీ స్థాయిలో అమర్చారు. ఇలా ప్రత్యేకంగా అమర్చిన ఈ యాంటెన్నా ధరించిన వ్యక్తి శ్వాస సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఇలా పంపిన డేటా యూజర్ యొక్క స్మార్ట్ఫోన్ లేదా సమీప కంప్యూటర్ చేరుతుంది. శ్వాసకోశ రేటు కొలిచే ఇతర పద్ధతుల మాదిరిగా కాకుండా, ఎలాంటి తీగలు, ఎలక్ట్రోడ్లు, లేదా సెన్సార్లతో సంబంధం లేకుండా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. బాహ్య పరిస్థితులకు తట్టుకునేలా ఈ ఫైబర్ను పాలిమర్ తో కవర్ చేసినట్టు యూనివర్శిటీ ప్రొఫెసర్, పరిశోధకుల్లో ఒకరు యునెస్ మెస్సడేక్ చెప్పారు. దీన్ని ధరించిన వ్యక్తి కూర్చున్నా, పడుకున్నా, నిలబడినా సెన్సింగ్ అండ్ ట్రాన్సిమిటింగ్ అనే రెండు విధులును ఇది విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే ఈ స్మార్ట్ టీ షర్టు అందించే డేటా విశ్వసనీయమైనదిగా తేలిందని చెప్పారు. అంతేకాదు 20 ఉతుకుల తరువాత కూడా ఈ యాంటెన్నా నీరు, డిటర్జెంట్ను తట్టుకోగలిగి, మంచి పని పరిస్థితిలో ఉందని ప్రొఫెసర్ చెప్పారు. ఈ అధ్యయనం సెన్సర్స్ జర్నల్ లో ప్రచురించబడింది. -
కాకినాడకు కొత్త మాస్టర్ప్లాన్
కాకినాడ (కాకినాడ సిటీ) : స్మార్ట్ సిటీ కాకినాడలో కొత్త మాస్టర్ప్లాన్కు ఆమోదం లభించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోదావరి అర్బన్ డవలప్మెంట్ అధారిటీ (గుడా)లో పరిధిలోకి కాకినాడ ఇప్పటికే చేరిన విషయం విదితమే. 1975లో 20 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో మాస్టర్ప్లాన్ రూపొందించారు. 1.64 లక్షల జనాభాకు తగ్గట్టుగా రూపుదిద్దుకున్న ఆ మాస్టర్ప్లాన్ను 1995లో సవరించారు. ఆ తరువాత అనేక సవరణలు చేశారు. 2011లో 3.26 లక్షల మంది జనాభాతో కొత్త మాస్టర్ప్లాన్కు రూపకల్పన చేశారు. ఎట్టకేలకు 2016లో కౌన్సిల్ తీర్మానం ద్వారా ఈ మాస్టర్ప్లాన్ను ప్రభుత్వానికి నివేదించారు. కాకినాడ పరిసరాల్లోని సుమారు 32 గ్రామాలను కూడా మాస్టర్ప్లాన్లో కలుపుతూ ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్కు చెందిన ఆర్వీ అసోసియేట్ సంస్థ ఈ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చింది. 2035 నాటికి 10.93 లక్షల మంది జనాభా ఉంటుందన్న అంచనాతో చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొత్త మాస్టర్ప్లాన్ అమలులోకి వస్తే కాకినాడలో ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాంతంగా ఉన్న మెయిన్రోడ్డు కమర్షియల్ జోన్గానూ, ఇండస్ట్రియల్ జోన్, స్కూల్ జోన్, గ్రీన్బెల్ట్ ప్రాంతాలను వేర్వేరుగా కేటాయించనున్నారు. -
కొత్త కలెక్టర్గా కార్తికేయ మిశ్రా
- అరుణ్కుమార్ బదిలీ - కర్నూలు కలెక్టర్గా జేసీకి పదోన్నతి సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ను ప్రభుత్వం సోమవారం రాత్రి బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా నూతన కలెక్టర్గా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశం ఉంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా పని చేసిన కార్తికేయ మిశ్రా 2009 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. రాష్ట్రంలో పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లుగా డైరెక్ట్ ఐఏఎస్లను నియమించాలనే సీఎం చంద్రబాబు ఆలోచనల్లో భాగంగానే ఈ నియామకం జరిగింది. కాగా, బదిలీ అయిన కలెక్టర్ అరుణ్కుమార్ సెర్్ప సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణను పదోన్నతిపై కర్నూలు కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం రాత్రి ‘సాక్షి’కి ధ్రువీకరించారు. బదిలీ అయిన కలెక్టర్, జేసీలు ఇద్దరూ కన్ఫర్డ్ ఐఏఎస్లు. వీరిద్దరూ జిల్లాకు వచ్చి సుమారు రెండేళ్లు పూర్తవుతోంది. వారిద్దరినీ ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. జిల్లా జేసీగా ఎవరిని నియమిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. -
ఒక పేజీలో టాక్స్ ఫైలింగ్ ఎలా?
ఒకపుడు ఆదాయ పన్ను దాఖలు చేసే పద్ధతి చాలాకష్టంగా ఉండేది. సామాన్య మానవుడికి మరీ కష్టంతో కూడుకున్న పని. పన్ను రిటర్న్స్ దాఖలులో ఈ-ఫైలింగ్ ఈ ప్రక్రియ కొంత సులభమైందనే చెప్పాలి. తాజాగా ప్రవేశపెట్టిన ఒక పేజీలో వ్యక్తిగతంగా ఆదాయం పన్ను దాఖలు చేసే పద్ధతి మరింత సులభం. మొదట14 పేజీలుగా ఈ ఫైలింగ్ విధానాన్ని మార్చి గతంలో మూడు పేజీలకు తగ్గించారు. ఇక ఇప్పటినుంచి ఆన్లైన్లో టాక్స్ ఫైలింగ్ చేసేవారు కేవలం ఒక పేజీలో వివరాలు పూర్తి చేస్తే చాలు. వారి పాన్కార్డు నంబర్, వ్యక్తిగత వివరాలు, పన్నుల చెల్లింపు వివరాలు తెలిపితే సరిపోతుంది. మిగితా సమాచారం తనంతట తానే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ సమకూర్చుకుంటుంది. ఏప్రిల్ 1,2017, ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ముఖ్యంగా సాలరీడ్ వ్యక్తులకు గణనీయంగా సులభతరమైంది. ఐటిఆర్ ఫాం నింపేందుకు సింపుల్ స్టెప్స్ ఇపుడు చూద్దాం. 1) ఐటి శాఖ పన్ను దాఖలు వెబ్ సైట్ లో ముందుగా రిజిస్టర్ కావాలి. 2) మీ పాన్ కార్డ్, ఆధార్ నంబర్ను పూరించాలి. తాజా నిబంధనల ప్రకారం ఆధార్ నెంబరు దాఖలు తప్పనిసరి. 3) మీ వ్యక్తిగత వివరాలు మరియు పన్నులు చెల్లించిన సమాచారాన్ని పూరిస్తే..టీడీఎస్(టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాలు ఆటోమేటిగ్గా పూర్తవుతాయి. 4) దీంట్లో రెండు మార్గాలు ఉన్నాయి. వివరాలు పూరించి ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు లేదా సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. 5) ఒకవేళ ఆఫ్లైన్ లో అయితే సంబంధిత ఐటి రిటర్న్స్కు కావాల్సిన పత్రాల ఎక్స్ఎంఎల్ వెర్షన్ కాపీలను అప్లోడ్ చేయాలి. 6) ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, ఐటి ఫైలింగ్ ను నిర్ధారిస్తూ ఒక మెసేజ్ వస్తుంది. -
అత్యవసర వేళల్లో సత్వరసేవలకు చర్యలు
-పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం -జీజీహెచ్ కొత్త సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు కాకినాడ వైద్యం : ప్రాణాపాయస్థితిలో అత్యవసర విభాగంలోకి వచ్చే క్షతగాత్రులు, రోగులకు సత్వర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. బుధవారం ఆయన జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ వై.నాగేశ్వరరావు నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర విభాగంలో ఎమ్మెల్సీ, నాన్ ఎమ్మెల్సీ వార్డుల్లో షిఫ్టుకి ప్రస్తుతమున్న ఒక్క సీఎంవోలకు బదులు ఇద్దరు సీఎంవోలను నియమించనున్నట్లు తెలిపారు. జీజీహెచ్లో వైద్యసేవలు పొందేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖజిల్లా సరిహద్దు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. ఇక్కడకు నూటికి 80 మంది నిరుపేదలే వస్తారని, వీరికి కాలయాపన లేకుండా, సకాలంలో నాణ్యమైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకుంటున్నటు తెలిపారు. రోగ నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామని, నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించకపోయినా, సకాలంలో రిపోర్టులు ఇవ్వకపోయినా సిబ్బందిని ఎంత మాత్రం ఉపేక్షించబోమన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, విభాగాధిపతులతో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి అభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జీజీహెచ్లో వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటానన్నారు. పారిశుద్ధ్య సక్రమ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, పలువురు వైద్య విభాగాధిపతులు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీలు, హౌస్ సర్జన్లు డాక్టర్ రాఘవేంద్రరావును కలసి, పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. పలు వార్డుల తనిఖీ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాఘవేంద్రరావు నేరుగా ఈఎన్టీ వార్డు, ఆప్తాల్మాలజీ పైన ఏర్పాటు చేసిన స్వైన్ప్లూ వార్డును సందర్శించారు. వెంటిలేటర్లు, మాస్క్లు, మందులు, పరికరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అత్యవసర విభాగాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడిసిన్, సర్జికల్, టీబీ వార్డులను, మాతా,శిశు విభాగంలోని లేబర్ రూమ్లను సందర్శించారు. చిన్నారుల సంరక్షణపై సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సక్రమ పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కంటాక్స్ రూల్స్..
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థికబిల్లును బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 1, 2017 నుండి కొన్ని ఆదాయ పన్ను చట్టాలు మారనున్నాయి. 2017 ఆర్థిక బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివిధ ఆదాయ పన్ను చట్ట సవరణలను ప్రకటించారు. వీటికి అదనంగా, కొన్ని సవరణలను కూడా లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇన్కంటాక్స్ రూల్స్ ఇలా ఉండనున్నాయి. 1. రూ. 2.5 లక్షలు- రూ. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి పన్ను శాతం తగ్గనుంది. అలాగే మొత్తం ఆదాయం రూ.1 కోటి లోపు ఉంటే, ఆదాయపు పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. దీంతో ఏడాదికి రూ. 12, 500 పన్ను తగ్గనుంది. సర్ఛార్జ్, సెస్లతో కలుపుకుని రూ. 14, 806 రూపాయలు ఆదా కానుంది. రూ.3-5లక్షల ఆదాయం ఉన్నవారు రూ.7700, రూ. 5-50 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.12,900 ఆదా కానున్నాయి. 87ఎ సెక్షన్ ప్రకారం ఈ తగ్గింపు లభించనుంది. అయితే రూ.3.50 లక్షలు ఆదాయ పన్నుచెల్లించేవారికి మాత్రం ఈ రిబేటు వర్తించదు. 2. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఆదాయం ఉన్న సంపన్నులకు పన్నుపై పది శాతం సర్ఛార్జ్ విధింపు. ఇదిగతంలో 15 శాతంగా ఉంది. అయితే రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం గల కుబేరులపై మాత్రం ఈ సర్ఛార్జ్ విధింపులో మార్పులేకుండా 15 శాతంగా ఉండనుంది. ఆదాయం రూ. 3.5 లక్షల ఉన్న వారికి పన్ను రిబేటును రూ. 5000ల నుంచి రూ. 2,500కు తగ్గించారు(గతంలో ఇది రూ.5 లక్షలుగా ఉండేది). ట్యాక్స్, రిబేట్లలో మార్పుల ఉమ్మడి ప్రభావంతో గతంలో రూ. 3.5 లక్షల ఆదాయంలోపు ఉన్నవారు రూ. 5,150 పన్ను చెల్లించగా.. ఇప్పుడు రూ. 2,575 చెల్లిస్తే సరిపోతుంది. 3. రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్న వారికోసం సింపుల్ వన్ పేజీ ఫాంను కొత్తగా పరిచయం చేసింది. అంటే రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు (వ్యాపార ఆదాయం కాకుండా) సులభమైన ఒకటే పేజ్తో పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఈ విభాగంలో మొదటిసారిగా దాఖలు చేసే పన్ను రిటర్న్లపై సహజంగానే స్క్రూటినీ ఉండదు. 4. నేషనల్ పెన్షన్ స్కీం విత్ డ్రాలపై ఎలాంటి పన్ను వుండదు. ఖాతాదారులకు 25 శాతం అత్యవసరాలకోసం విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే రిటైర్మెంట్ తర్వాత విత్డ్రాలపై వచ్చే మొత్తంగా 40శాతానికి ఎలాంటి టాక్స్ ఉండదు. 5. లిస్టెడ్ ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్లో లిక్విడ్ యూనిట్స్లో మొదటిసారి పెట్టుబడులకు మినహాయింపును ఇచ్చే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ను 2017-18 నుంచి ఉపసంహరిస్తున్నారు. చిన్న ఆదాయ దారులను పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో ప్రోత్సహించేందుకు గాను 2012-13 లో ప్రత్యేకంగా పరిచయం చేసిన ఈ విధానంలో మార్పుల ద్వారా 2018-19 నుంచి ఎలాంటి మినహాంపులు లభించవు. 6. స్థిరాస్థులపై పెట్టుబడులను లాంగ్టెర్మ్గా పరిగణిచేందుకు అవసరమైన కాలపరిమితిని 3 ఏళ్ల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో స్థిరాస్తులపై 2 సంవత్సరాలకు మించిన పెట్టుబడులపై పన్ను 20 శాతానికి పరిమితం చేయడంతో పాటు, తిరిగి పెట్టుబడులు చేయడంపై పలు మినహాయింపులకు అర్హత లభిస్తుంది. 7. ప్రతిఫలంలో సవరణల్లో మార్పుల కారణంగా.. లాంగ్టెర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తక్కువ పేఅవుట్స్కు కారణం కానుంది. ధర ఇండెక్సేషన్కు బేస్ ఇయర్ను 1981 ఏప్రిల్ 1 నుంచి, 2001 ఏప్రిల్ 1 కి మార్చారు. దీంతో అమ్మకాలపై లాభాలు తగ్గనున్నాయి. 8.అంతే కాకుండా, నోటిఫైడ్ రెడీమబుల్ బాండ్లలో కేపిటల్ గెయిన్స్పై రీఇన్వెస్ట్మెంట్కు పన్ను మినహాయింపు వర్తిస్తుంది(ఎన్హెచ్ఏఐ, ఆర్ఈసీ బాండ్లలో పెట్టుబడులకు అదనంగా). 9. ఆదాయ పన్ను చట్టంప్రకారం దీనిపై ట్రాన్సాక్షన్ మొత్తంపై 100శాతం జరిమానా. ట్యాక్స్ రిటర్న్ పునస్సమీక్షించేందుకు కాలపరిమితిని రెండేళ్ల నుంచి అదే ఆర్థిక సంవత్సరం చివరకు లేదా అసెస్మెంట్ ఏడాది చివరకు.. ఏది త్వరగా ముగియనుంటే దానికి పరిమితం చేశారు. 10. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ను ఆలస్యంగా.. అంటే 2018 డిసెంబర్ 31వరకూ దాఖలు చేసినవారు రూ. 5,000వేలు, ఆ తర్వాత దాఖలు చేసే వారు రూ. 10వేలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులపై మాత్రం ఈ పెనాల్టీని రూ. 1000కి పరిమితి విధించారు. అలాగే నల్లధనాన్ని నిరోధించే ఉద్దేశంతో నగదులావాదేవీలపై పరిమితి విధించింది. ఈ పరిమితిని బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.3లక్ష నుంచి రూ. 2 లక్షలకు తగ్గించింది. రూ. 2లక్షల పైన లావాదేవీలపై ఆంక్షలు. దీని ప్రకారం లావాదేవీలపై 100శాతం జరిమానా. పాన్ కార్డు దరఖాస్తుకు , ట్యాక్స్ రిటర్న్కు ఆధార్ కార్డు తప్పనిసరి. జులై 2017నుంచి ఈ నిబంధన అమలుకానుంది. -
ఎన్నికలెప్పుడొచ్చినా విజయం మనదే
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు జిల్లా యాదవ సంఘ నాయకులు పార్టీ చేరిక పెద్దాపురం/సామర్లకోట : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీ జిల్లా అ«ధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా యువజన అధ్యక్షులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆయన అనుచరులు సుమారు 500 మంది పార్టీ చేరిక సందర్భంగా శుక్రవారం పెద్దాపురం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నబాబు మాట్లాడుతూ శ్రీనివాస్యాదవ్ చేరికతో పెద్దాపురం నియోజకవర్గంలో ఉత్సాహకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ యాదవ సంఘ నాయకులు పార్టీలో చేరుతున్న సందర్భంగా విజయోత్సవ సభలా ఉందన్నారు. నాటి రాజశేఖరరెడ్డి పాలన జగన్తోనే సాధ్య పడుతుందని మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ టీడీపీని నిలదీసినా, ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మండపేట, రాజమండ్రి, జగ్గంపేట, కాకినాడ టౌన్ కో ఆర్డినేటర్లు లీలాకృష్ణ, ఆకుల వీర్రాజు, ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, సభాధ్యక్షులు తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకులు నియోజకవర్గంలో దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారావు మిడుగుదింటి మోహన్, రాష్ట ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంతబాబు, రాష్ట్ర కార్యదర్శి కర్రి వీర్రెడ్డి, రాజమండ్రి ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి ప్రసంగించారు. అనంతరం కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ అరుణ దంపతులతో పాటు సుమారు 500 మంది యాదవ సోదరులకు పార్టీ కండువాలు కప్పి కన్నబాబు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి తోట సత్య, రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు. జిగిని వీరభద్రరావు. కౌన్సిల్ ప్రతిపక్ష నేతలు, ఆయా వార్డుల కౌన్సిలర్లు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ఇదేం విధానం?
ఏప్రిల్ 23తో ముగిసే విద్యా సంవత్సరం మార్చి 20తోనే ముగియనుంది... జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21 నుంచే ఆరంభం పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు అందిచగలరా..? ఏ పుస్తకం లేకుండానే తరగతులు నిర్వహించాలా...? ఇదేం నిర్ణయమంటూ మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు రామచంద్రపురం రూరల్ : ప్రతి ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో ముగిసే విద్యా సంవత్సరం ఈసారి మార్చి 20తో ముగియనుంది. అలాగే జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచే మొదలు కానుంది. ఏటా ఏప్రిల్ 23 వరకూ వార్షిక పరీక్షలు నిర్వహించి 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చేవారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది పద్ధతి మార్చారు. సెలవుల్లో మార్పు ఉండదు కానీ వార్షిక పరీక్షలు మాత్రం ముందుగానే నిర్వహిస్తారు. అవి ముగియగానే వెంటనే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత నెల రోజులకు వేసవి సెలవులు ఇస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1– 9వ తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్–3) షెడ్యూల్లో మార్పులు చేసింది. ఆ ప్రకారం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మార్చి 6న ప్రారంభమై 20న ముగుస్తాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మార్చి 15న ప్రారంభమై 18న ముగుస్తాయి. ఆ మేరకు షెడ్యూలు, టైంటేబుల్ జిల్లా విద్యాశాఖకు చేరింది. ఇక్కడి నుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చేరవేశారు. ఈ నిర్ణయంపై తలలు పట్టుకుంటున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను ముందస్తు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. సిలబస్ సంగతేంటి... 6–10 తరగతులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైంది. ఈ విధానం ఉపాధ్యాయులకు అర్థమయ్యేందుకే బాగా సమయం పట్టింది. విద్యార్థులు ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రాజెక్టు పనులకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విషయంలో కాస్త ముందున్నారు. వారు ఇప్పటికే అన్ని తరగతులకు దాదాపు సిలబస్ పూర్తి చేసి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు సిలబస్ ఇంకా 30 శాతంపైనే పెండింగ్ ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు నెల రోజుల ముందు పరీక్షలు పెట్టడం తమకు ఇబ్బందికరమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేసి ఉంటే బాగుండేదంటున్నారు. పుస్తకాలు ఎలా? మార్చి 21 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైతే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఎలా అందుతాయన్న సందేహం తలెత్తుతోంది. పోనీ పుస్తకాలు లేకుండా కేవలం తరగతులతో ఎలాగోలా కాలక్షేపం చేద్దామంటే విద్యార్థులు తీవ్ర ఎండల్లో ఏ మేరకు పాఠశాలలకు వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
త్వరలో కొత్త రూ. 100 నోట్లు
-
త్వరలో కొత్త రూ. 100 నోట్లు
ముంబై: త్వరలోనే కొత్త రూ. 100 నోట్లను చలామణీలోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకంతో విడుదల చేసే ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ – 2005 తరహాలోనే ఉంటాయని, రెండు నంబర్ ప్యానెల్స్లో ఇన్సెట్ లెటర్ ‘ఖ’ ఉంటుందని పేర్కొంది. కొత్త వంద నోటు వెనుకవైపున ముద్రణ సంవత్సరం ’2017’ ఉంటుంది. పాత రూ. 100 నోట్లు ఇకపై కూడా చలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ వివరించింది. -
రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్
ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ దూసుకువచ్చింది. వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్ చేసింది. ఏ నెట్వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ అందించే సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ. 23లతో మొదలయ్యే రీచార్జ్ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ23, రీఛార్జ్ పై వినియోగదారులు ఒక రోజు ఒక చెల్లుబాటుతో ఏ నెట్ వర్కుకైనా అపరిమిత స్థానిక , ఎస్టీడీ కాలింగ్ అవకాశాన్ని అందిస్తున్నట్టు ఎయిర్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ . 348 రీఛార్జ్ (స్థానిక మరియు ఎస్టీడీ) అంతటా ఉచిత కాల్స్ అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటూ 500 ఎంబీ 3జీ డేటా , 4జీ వినియోగదారులకు 1.5జీబీ 3జీ డేటా ఉచితంగా అందిస్తోంది.వాలిడిటీ 28 రోజులు. వినియోగదారులను సంతోషపెట్టేందుకు ఉచిత కాలింగ్, డాటా సదుపాయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఎయిర్సెల్ లిమిటెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ తెలిపారు. వినియోగదారులకు ఆహ్లాదం, కాల్ మరియు డేటా ప్రయోజనాలు అందించేందుకు , అందుబాటుధరల్లో ఆన్ లైన్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ రెండు పథకాలను లాంచ్ చేసినట్టు పేర్కొన్నారు. -
కొత్త ఉద్యాన వంగడాల సాగుకు ప్రోత్సాహం
కలెక్టర్ అరుణ్కుమార్ గండేపల్లి : ఉద్యాన పంటలలో కొత్త వంగడాలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహం అందించనున్నట్టు కలెక్టర్ అరుణ్కుమార్ చెప్పారు. మండలంలోని సూరంపాలెం వద్ద ఏడీడీ రోడ్డు సమీపంలో జరుగుతున్న ఎనిమిది ఎకరాల బొప్పాయి సాగును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీ పరిధిలో రంపచోడవరంలో, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ డివిజన్ ఉద్యాన పంటల రైతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో మామిడి, జీడిమామిడి మూడువేలకు పైగా ఎకరాల్లో పండిస్తున్నట్టు తెలిపారు. మెట్ట ప్రాంతంలో బొప్పాయి, అరటిలో బుషావళి తదితర పంటలను సుమారు వంద హెక్టార్ల వరకు సాగవుతుండగా యాభైశాతం సబ్సిడీ కల్పించనున్నట్టు వివరించారు. మామిడి తాండ్ర తయారీదారులకూ ఈ అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం పామాయిల్తోటలో చాప్ కట్టర్ పని విధానాన్ని పరిశీలించారు. ఐదు అంచెల ఉద్యాన పంటల సాగును సందర్శించారు. ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు గోపికుమార్, ఉద్యానాధికారి సిహెచ్. శ్రీనివాస్, ఎంపీఈఓ రామకృష్ణ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఆవిష్కరణకు నాంది పలకండి
ఏఎన్యూ వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ తెనాలిఅర్బన్ : కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ సూచించారు. జేఎంజే కళశాలలో స్మార్ట్ మెటీరియల్స్ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రసాంకేతిక విజ్ఞానం పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నాగరికతకు తగినట్లుగా మేధస్సును పెంపొందించుకోవాలని తెలిపారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వీరయ్య మాట్లాడుతూ మనం ఉపయోగించే వస్తువులలో ఎక్కువ భాగం నానోటెక్నాలజీ కలిగి ఉంటున్నాయని తెలిపారు. సైన్స్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు మార్పు చెందాలన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం చిల్లర నోట్లను వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకోరావాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన పెద్దనోట్ల స్థానంలో కొత్తవాటిని విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధం చేసేందుకు తాను సిద్ధమని హెచ్చరించారు. అనంతరం స్మార్ట్ మెటీరియల్ బుక్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సిస్టర్ స్టెల్లా మారీసు, ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైనీ, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ అమూల్మేరి, సదస్సు కన్వీనర్, భౌతికశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సరస్వతీదేవి, అనిత, పి.సతీష్కుమార్, కె.అరుణోదయ, తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలో ‘పది’లమేనా!
మారిన విద్యావిధానంపై తర్జనభర్జన ఫలితాల్లో జిల్లా స్థానంపై పెరుగుతున్న ఆసక్తి నూతన విధానంపై ఉపాధ్యాయుల భిన్నాభిప్రాయాలు భానుగుడి (కాకినాడ) : దశాబ్దాల కాలంగా పాఠశాల విద్యా విధానంలో ప్రశ్న సమాధానాల పద్ధతిని పాటిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పద్ధతి నుంచి మూల్యాంకనానికి పరీక్ష విధానం మార్పు చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు తొలిసారి నిరంతర సమగ్రమూల్యాంకన విధానంలో నిర్వహించనున్నారు. ఈ విధానం విద్యార్థుల మాటెలా ఉన్నా నిర్వహణ ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా ఉంది. దీనిపై ఉపాధ్యాయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు 2013–14 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 2014–15లో రెండో స్థానం, 2015–16లో మూడో స్థానం దక్కించుకుంది. గత ఏడాది 67,493 మంది విద్యార్థులు రెగ్యులర్గాను, 3 వేల మంది ప్రైవేట్గాను పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం 68 వేల మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది పరీక్షలను సీసీ కెమెరాల మధ్య నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థానం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ జరిగిన మార్పు గతంలో ప్రశ్నపత్రం ఆధారంగా విద్యార్థులు జవాబులు రాసేవారు. రాసిన జావాబులు ఆధారంగా మార్కులు వేసేవారు. విషయాన్ని ఆకళింపు చేసుకోకుండా బట్టీపట్టి జావాబులు రాస్తున్నారన్న విమర్శలతో దీనికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని ఈ ఏడాది అమలులోకి తెచ్చింది. వంద మార్కుల ప్రశ్న పత్రంలో 80 మార్కులు పరీక్ష పత్రానికి, మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్స్గా నిర్ణయించింది. ఈ 20 మార్కుల్లో 10 మార్కులు 8 నుంచి 10 వరకూ విద్యార్థి పరీక్షల్లో సాధించిన ప్రగతిని, (4 నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలకు+2 సంగ్రహణ మూల్యాంకన పరీక్షలకు) వెరసి 360 మార్కులకు ప్రగతిని గణిస్తారు. ఈ మార్కులతో పాటు తరగతిలో విద్యార్థి స్పందన, ప్రాజెక్టు తయారీలకు గాను 20 మార్కులు కేటాయించారు. మిగిలిన 80 మార్కులను పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. ఇందులో 35 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్టు. -
సత్యగిరి ప్రదక్షిణకు కొత్త రహదారి
అన్నవరం : కార్తికమాసం పౌర్ణమి పర్వదినం ఈ నెల 14న అన్నవరంలో సత్యగిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం కొత్త రహదారిని సిద్ధం చేశారు. సత్యదేవుడు, అమ్మవార్లను రత్నగిరి, సత్యగిరి కొండల చుట్టూ భక్తులు సుమారు 12 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తుంటారు. గతేడాది నిర్వహించిన గిరి ప్రదక్షిణకు సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. సోమవారం రావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ గిరి ప్రదక్షిణకు వస్తారన్న అంచనాతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొత్త రహదారిని నిర్మించారు. ఇంతవరకూ ఈ ప్రదక్షిణ సత్యగిరి కొండల వెనక పంపా నదీ గర్భం నుంచి సాగేది. అయితే ఈ సారి పంపా నదిలో నిండుగా నీరు ఉండడంతో నదికి ఎగువ ఉన్న మామిడి తోట నుంచి ఉండేలా రహదారిని నిర్మించారు. ఈసారి గిరి ప్రదక్షిణకు ఒక కిలోమీటర్ తగ్గిందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ రోడ్డు పనులను దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని డీఈ రామకృష్ణ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ రహదారిని చదును చేసే పనులు రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. ఆ రోడ్డు మధ్యలో పొలాలు, తోటలు ఉన్న రైతులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. -
కొత్త చట్టం ప్రకారమే పోలవరం ప్యాకేజి
మరో 90 గ్రామాలను ముంపులో చేరుస్తూ త్వరలో జీవో సర్వే పనులు వేగవంతం చేస్తాం పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్ నెల్లిపాక : కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి , పునరావాసం కల్పిస్తామని పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ) భానుప్రసాద్ స్పష్టం చేశారు. ఎటపాక మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా నాలుగు విలీన మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నెల్లిపాకలో నిర్వాసితులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. గోదావరి వరదల సమయంలో నెల్లిపాక జలదిగ్బంధంలో ఉంటుందని 90 శాతం భూములు ముంపునకు గురవుతాయని గ్రామస్తులు వివరించారు తమ గ్రామాన్ని కూడా పోలవరం ముంపు జాబితాలో చేర్చాలని వారు కలెక్టర్ను కోరారు. ఇందుకు భానుప్రసాద్ బదులిస్తూ నాలుగు మండలాల్లో 191 హేబిటేషన్లు ముంపునకు గురవుతున్నట్టు ఇరిగేష¯ŒS శాఖ గుర్తించిందన్నారు. వాటిలో పూర్తిగా, పాక్షికంగా ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మొదట గెజిట్లో ఉన్న ముంపు గ్రామాల్లో భూసేకరణ సర్వేను వేగవంతం చేయనున్నామని చెప్పారు. మరో 90 గ్రామాలు ముంపు జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కొత్తగా జీఓ విడుదల చేయనుందని ప్రకటించారు. ఎఫ్ఆర్ఎల్ ప్రకారం బౌండరీ నుంచి 100 మీటర్ల దూరం వరకు భూసేకరణ చేస్తామని చెప్పారు. గిరిజనేతరులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించి గృహాలు నిర్మించి కాలనీల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ముంపునకు గురయ్యే గిరిజనుల రెండున్నర ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని ఇస్తామన్నారు. మిగిలిన భూమికి పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటూ డి పట్టాలు పొందిన రైతులకు కూడా పరిహారం వర్తిస్తుందన్నారు. నిర్వాసితుల కోసం రూ. 27 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ 36 వేల కోట్లయితే, అందులో 370 ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ 27 వేల కోట్లను పరిహారం, ప్యాకేజి, పునరావాసాలకు ఖర్చవుతుందని అంచనా అని భానుప్రసాద్ తెలిపారు. ఈ జిల్లాలోని నిర్వాసితులు కోరుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పునరావాసం, భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 2018 నాటికి పోలవరం కుడి, ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో మొదటి ఫేజ్లో వీఆర్పురం మండలంలో 11, కూనవరం మండలంలో ఒక గ్రామంలో సర్వే పనులు ప్రారంభించామని తెలిపారు. సమావేశంలో ఎస్డీసీ ఎల్లారమ్మ, తహసీల్దార్లు చిట్టిబాబు, నర్శింహులు, జీవీఎస్ ప్రసాద్ ఉన్నారు. -
ఎయిర్ ఏషియా మరో ప్రమోషనల్ ఆఫర్
న్యూఢిల్లీ : బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త ఆఫర్ను ప్రకటించింది.తన కొత్త ప్రమోషనల్ స్కీంలో భాగంగా తగ్గింపు ధరల ఆఫర్ కింద విమాన టిక్కెట్లను రూ.899లకే ( అన్నీ కలుపుకొని) అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 23తో ముగియనున్న ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లు 2017 మార్చి 31 మధ్య ప్రయాణాలకు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. రూ. 899 ధరలు గౌహతి-ఇంఫాల్ మధ్య ప్రయాణానికి వర్తించనున్నట్టు తెలిపింది. అలాగే ఈ ఆఫర్ కింద కొచ్చి- బెంగుళూరు టిక్కెట్టు ధర రూ.999ల నుంచి ప్రారంభమవుతాయి. కొచ్చి-హైదరాబాద్ 2,699గా, గోవా- రూ.3199గా, జైపూర్ - పుణే రూ. 2399 గా ఉండనున్నాయి. మరిన్ని వివరాలు ఎయిర్ ఏషియా వెబ్ సైట్ లో.. -
కంప్యూటర్లు, ఫర్నీచర్ల కొనుగోళ్లకు టెండర్లు
వారం రోజుల్లో సామగ్రి సరఫరా ఇందూరు: కొత్తగా ఏర్పడనున్న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్కు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నీచర్ కొనుగోలు కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి అధ్యక్షతన బుధవారం టెండర్లు నిర్వహించారు. ఆయా శాఖల నుంచి పాత ఫర్నీచర్, కంప్యూటర్లను అధికారులు విభజించి కామారెడ్డికి తరలిస్తున్నారు. అయితే కొత్త జిల్లా కలెక్టరేట్ పరిపాలన విభాగంతో పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో చాంబర్లతో పాటు ఆర్డీవో కార్యాలయాలకు కొత్త కంప్యూటర్లు, ఫర్నీచర్ అవసరం ఉండడంతో వాటి కొనుగోళ్ల కోసం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం టెండర్ల ప్రక్రియ చేపట్టారు. సుమారు 50లక్షల వ్యయంతో కొనుగోళ్లు చేపడుతున్నారు. వీలైనంత ఖర్చు తగ్గించాలన్న కలెక్టర్ సూచన మేరకు ఏసీల కొనుగోళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 53 కంప్యూటర్లు, మూడు ల్యాప్టాప్లు, 14 లేజర్ ప్రింటర్లు, 18 మల్టీఫంక్షన్ ప్రింటర్లు, 3 ఫ్యాక్స్ మెషిన్లు, 2కేవీ యూపీఎస్లు 16, 5కేవీ యూపీఎస్ 1, పెద్ద జిరాక్స్ మెషిన్లు 5, ప్రొజెక్టర్లు 2, 62 కేవీ జనరేటర్ 1, 30 కేవీ జనరేటర్లు 3, కొనుగోలు చేయడానికి టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు వారం రోజుల్లో సామగ్రిని కామారెడ్డి కలెక్టరేట్కు తరలించాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మాకర్, కలెక్టరేట్ ఏవో గంగాధర్ పాల్గొన్నారు. -
అన్ని సేవలు ఒకే యాప్ తో..త్వరలో
న్యూడిల్లీ: రైల్వే ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని మిగిల్చేందుకు రైల్వే శాఖ తన యాప్ ను సరికొత్తగా సిద్ధం చేస్తోంది. తన ప్రయాణీకుల అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు మొబైల్ అప్లికేషన్ ను పునరుద్ధరిస్తోంది. టికెట్ బుకింగ్ దగ్గర్నుంచి, భోజనం, క్యాబ్ లతో పాటు పోలీస్, వైద్యం లాంటి అత్యవసర సేవలను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం ఒక సమగ్ర (ఇంటిగ్రేడెట్) మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ ఫేర్ డైరెక్టరేట్ అధికారి ఒకరు తెలిపారు. టాక్సీ, టికెట్ బుకింగ్ నుంచి మొదలు భోజనం ఆర్దరింగ్, పోర్టర్ సేవలు, రిటైర్ రూం లాడ్జింగ్, బెడ్ రోల్ ఆర్డర్, కోచ్ లో అపరిశుభ్రత పై ఫిర్యాదు, డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్, హోటల్ రిజర్వేషన్లు, వెయిటింగ్ లిస్ట్ రైలు టికెట్ విషయంలో ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ తదితర ఇతర సేవలు ఈ యాప్ ద్వారా లభించనున్నాయని ఆయన తెలిపారు. రైల్వేల కోసం ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఈ యాప్ ను ప్రతిపాదించినట్టు సమాచారం. అలాగే వైద్య సౌకర్యాలను, అత్యవసర విషయంలో పోలీసులకు ప్రయాణీకులు కనెక్ట్ అయ్యేలా మూడు దశల్లో ఈ అప్లికేషన్ విస్తరించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా సంవత్సరానికి సంస్థ డిజిటల్ ఆస్తుల విలువ రూ.500 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నామన్నారు. కాగా రైల్వేల మొత్తం ఆదాయంలో 5 శాతంగా ఉ న్న నాన్ ఫేర్ ఆదాయాన్ని 10 -20 శాతానికి పెంచే లక్ష్యంతో ఉన్నట్టు బడ్జెట్ ప్రసంగంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ముక్కలపై ఉప్పెన
భద్రాచలం కోసం ఆఖరి పోరాటం నేడు డివిజన్ బంద్కు పిలుపు అఖిలపక్షం అత్యవసర సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చ సీపీఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం ఏజెన్సీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య భద్రాచలం : భద్రాచలం పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, వర్తక, వాణిజ్య సంఘాలన్నీ ఏకమైయ్యాయి. మంగళవారం భద్రాచలంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కమిటీ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ లతో పాటు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు పాలకుల తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో భద్రాచలం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. నాడు నాలుగు మండలాలు, నేడు రెండు మండలాలు పోతే ఇక భద్రాచలం డివిజన్లో మిగిలేవి మూడేనని, ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. దీనిపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. బుధవారం భద్రాచలం బంద్కు పిలుపునిస్తున్నట్లుగా ప్రకటించారు. బంద్కు అన్ని వర్గాల ప్రజానీకం మద్దతు తెలుపాలని వారు కోరారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ, టీడీపీకి చెందిన కొమరం ఫణీశ్వరమ్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, బీజేపీ నాయకులు ఆవుల సుబ్బారావు, నాగబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కంభంపాటి సురేష్, చారుగుళ్ల శ్రీనివాస్, టీవీ, నరేష్, సుబ్బారావు, ఉపేంద్రవాసు, దేశప్ప, సురేష్నాయుడు,, కృష్ణ, సాయి, రాజు పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మంగళవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించటం సరైంది కాదని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. ఖమ్మంలో భద్రాచలంను మూడో జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సారెడ్డి, నూకరత్నం, శ్రీను, కృష్ణార్జునరావు, రాఘవయ్య, కొండలరావు, ముక్తేశ్వరి, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే రాజయ్య, ఎన్డీ నేత కెచ్చెల రంగారెడ్డి భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మంగళవారం చేపట్టిన బంద్లో భాగంగా భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ధర్నా చేశారు. ఆదివాసీ ప్రాంతాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భద్రాచలం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, భవిష్యత్లో మనుగడ ప్రశ్నార్థకం కాబోతుందని న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీల స్వయం పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో కెచ్చెల కల్పన, ప్రసాద్, జోగారావు, ప్రమోద్, జీఎస్పీ నుంచి చలపతి, ప్రకాష్, సత్యనారాయణ, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేష్ పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు -
బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో పోటీని తట్టుకొనే క్రమంలో తమ కొత్త కస్టమర్లకోసం మరో నూతన పథకాన్ని గురువారం ప్రకటించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త వినియోగదారులను ఆకట్టుకునే యోచనలో 'ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడ్ బీబీ249' గా చెబుతున్న ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా కేవలం రూ 249 చెల్లించి అపరిమిత బ్రాడ్ బ్యాండ్ డేటాను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటి ఆరునెలలు నెలల వరకూ రూ.249 ల చార్జ్ తో అపరిమిత డాటా డౌన్ లోడ్ అనుభవాన్ని అందించనుంది. సెప్టెంబర్ 9వతేదీనుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు వివరించింది. ఎ) అయితే ఇది ఆఫర్ కొత్త బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే బి) ఇదే టారిఫ్ తో ఎఫ్టీటీహెచ్ అందుబాటులో ఉంటుంది. సి) ప్రమోషన్ పీరియడ్ లో ఎలాంటి ఇన్ స్టలేషన్ చార్జీలు ఉండవు. డి) మిగతా అన్ని చార్జీలు ప్రస్తుతం అమలుచేస్తున్న టారిఫ్ ప్రకారమే ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చార్ట్ ను పరిశీలించండి. -
నూతన కార్యాలయాలకు ఫర్నిచర్ కొనుగోలు
ఫైల్స్ అప్లోడింగ్ పూర్తి చేయండి కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : కొత్త జిల్లాల్లో నూతన ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సిన ఫర్నిచర్, ఏసీ తదితర పరికరాలను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ కొనుగోలు చేస్తుందని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షించారు. వివిధ శాఖలు జగిత్యాల, పెద్దపల్లిలో తమకు కేటాయించిన కార్యాలయ భవనాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ప్రతి శాఖ కొత్త జిల్లాకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్స్ తదితర వివరాలను ఇవ్వాలని కోరారు. తమ వద్దనున్న ఫర్నిచర్ను జగిత్యాల, పెద్దపల్లిలకు కేటాయించాలని తెలిపారు. నిధులు ఉన్న శాఖలు నూతన కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్ను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కామన్ ఫైల్స్ స్కానింగ్ వేగవంతం చేయాలన్నారు. అన్ని శాఖలు తమ కార్యాలయంలోని ఫైల్స్ను వెంటనే అప్లోడింగ్ పూర్తి చేయాలన్నారు. జగిత్యాల కలెక్టరేట్ భవన మరమ్మతులకు ఇతర సదుపాయాలకు రూ.45 లక్షలు, పెద్దపల్లి భవన మరమ్మత్తు పనులకు రూ.41 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రెండు ప్రాంతాలలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపడతారన్నారు. సంబంధిత సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షించాలన్నారు. నూతన భవనాల కేటాయింపు ప్రొసీడింగు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. కొత్త జిల్లాలో నూతన బ్యాంకు ఖాతాలు అక్టోబర్ 5లోగా తెరవాలని అధికారులను ఆదేశించారు. ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, జిల్లా అధికారులున్నారు. -
కొత్త జిల్లాకు కొత్త స్టేషన్లు
ఎస్పీ షానవాజ్ ఖాసీం పాల్వంచ:కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా లో కొత్తగా ఆరు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఎస్పీ షానవాజ్ ఖాసీం చెప్పారు. పాల్వంచ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి, మహిళ, సీసీఎస్ (సిటీ క్రైం స్టేషన్), పాల్వంచ టూ టౌన్, ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని వివరించారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ను కిన్నెరసాని స్టేషన్గా పేరు మార్చి అక్కడికి తరలిస్తామన్నారు. కొత్త జిల్లా లో పోలీస్ శాఖకు కల్పించాల్సిన ప్రాథమిక, మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలను డీజీపీకి పంపుతామన్నారు. అన్ని ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారిం చామన్నారు. ‘‘చోరీల నివారణ, దొంగల గుర్తిం పు కోసమే కాదు. పోలీస్ సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు; ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు జరుగుతున్న సమయంలో వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో గమనించేందుకు.. పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయి’’ అని వివరించారు. తాగుబోతుల వీరంగం, ఈవ్ టీజింగ్, స్పీడ్ డ్రైవింగ్, అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయన్నారు. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు సత్ఫలితాలిస్తున్నదని అన్నారు. సమావేశంలో ఓఎస్డీ భాస్కర్, డీఎస్పీ సురేంద్ర రావు, సీఐ షుకూర్, ఎస్ఐలు పి.సత్యనారాయణ రెడ్డి, బి.సత్యనారాయణ, కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జలగంతో ఎస్పీ భేటీ కొత్తగూడెం: కొత్త జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై శనివారం స్థానిక ఇల్లెందు అతిధి గృహంలో ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో ఎస్పీ షానవాజ్ ఖాసీం సమావేశమయ్యారు. కొత్త జిల్లాల సరిహద్దులు, ప్రస్తుత పోలీస్ స్టేషన్లు, సర్కిల్స్పై చర్చించారు. టూరిజం హబ్గా కిన్నెరసాని అభివృద్ధవుతున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని; పోలీస్ శాఖకు ప్రస్తుతమున్న సిబ్బంది, ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించాలని ఎస్పీకి జలగం సూచించారు. పోలీసు శాఖకు కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ బి.సురేందర్రావు పాల్గొన్నారు. -
కొత్త ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు
రంపచోడవరం : డీఈఓ పూల్ ద్వారా 2014 డీఎస్సీలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు విడుదలవుతాయని డీఈఓ ఆర్.నరసింహరావు తెలిపారు. పాఠశాలల్లో రసాయన రహిత పోషక విలువలతో కూడిన కూరగాయల పెంపకంపై మండల రీసోర్స్ సెంటర్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు శనివారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2014 డీఎస్సీలో ఎంపికైన 200 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ ప్లేస్ లేకపోవడంతో జీతాల విడుదలకు సంబంధించి ఇబ్బంది ఉందని అన్నారు. వచ్చే నెలలో జీతాలు విడుదల చేస్తామన్నారు. జిల్లాలోని 400 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు అవకాశం ఉందన్నారు. అయితే నిధుల కొరతతో కంప్యూటర్ బోధకులను నియమించకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడం లేదన్నారు. జిల్లా పరిషత్ నుంచి నిధులిస్తే ఔట్సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ విద్యాబోధన సాధ్యమవుతుందన్నారు. పాఠశాలల వాచ్మన్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో నిధులు సమకూర్చుకుని వాచ్మన్ను నియమించుకోవాలని ఆయన సూచించారు. -
విజ్ఞానశాస్త్రాల అనుసంధానంతో నూతన ఆవిష్కరణలు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : విజ్ఞానశాస్త్రాల అనుసంధానంతో మెరుగైన ప్రయోగాలు చేస్తూ ఎన్నో నూతన అంశాలను ఆవిష్కరించవచ్చని శ్రీసత్యసాయి విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.బాపిరాజు అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సదస్సులో ‘స్ఫటిక విజ్ఞాన శాస్త్రం యొక్క వివిధ అనువర్తన అంశాల’ను దృశ్య రూపంలో ఆయన వివరించారు. స్ఫటిక విజ్ఞాన శాస్త్రం, నానో సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఆవిçష్కరణలు జరుగుతున్నాయన్నారు. భౌతిక, జీవ, వృక్ష, రసాయన శాస్త్రాల అనుసంధాన పరిశోధనల ద్వారా కొత్త ఆవిష్కరణలు చేయవచ్చన్నారు. ఆయనను వీసీ ముత్యాలునాయుడు దుశ్శాలువతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి గురుకులం ఇన్చార్జ్ శ్యాంసుందరం, రిజి్ర్టార్ డాక్టర్ కేఎస్ రమేష్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్వర్మ, డాక్టర్ మట్టారెడ్డి, డీన్ డాక్టర్ ఎస్.టేకి, డాక్టర్ పెర్సిన్ పాల్గొన్నారు. -
‘ఛీఛీ’ కెమేరాలు
గత ఏడాది పుష్కరాల్లో ఏర్పాటు చేసిన 171 సీసీ కెమేరాలు ఏమైనట్టు? తొక్కిసలాట లోగుట్టును అవెందుకు విప్పలేకపోయాయి? అజ్ఞాతంలోకి ఎందుకు నెట్టేశారు? గుట్టురట్టవుతుందనే భయమే దీనికి కారణమా? పాతవి వదిలేసి కొత్తవాటితో మళ్లీ కసరత్తు సీసీ కెమేరాలు ... పోలీసు యంత్రాంగానికి ఇవి మూడో కన్ను. కానీ ఆ కన్ను రాజకీయాల ఒత్తిళ్లతో మూతపడింది. ఎక్కడ తమ లోగుట్టు బట్టబయలవుతుందోనని బలవంతంగా కెమేరా కను రెప్పలను మూతేసేశారు. ఆ సాక్షా్యలు బయట పెట్టాలని స్వయంగా ఏకసభ్య కమిషన్ ఆదేశించినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా తయారైందే గానీ ఫలితం మాత్రం కనిపించలేదు. సీసీ కెమేరాల్లో ఏముందో బయటపెట్టాలని ... çఫుటేజీలను బహిర్గతం చేయాలని విపక్షాలు ... ప్రజా సంఘాలు గగ్గోలు పెట్టినా దున్నపోతు మీద వర్షం పడిన చందంగా దులుపేసుకున్నారుగానీ వాస్తవాలతో జనం ముందుకు రాలేకపోయారు. ఏడాది అయిపోయింది... అంత్య పుష్కరాలు వచ్చేశాయి. మళ్లీ సీసీ కెమేరాల అంశం తెరపైకి వచ్చింది. జనం మాత్రం ఛీ...ఛీ కెమేరాలంటూ ఎగతాళి చేస్తున్నారు. సాక్షిప్రతినిధి–కాకినాడ : గోదావరి పుష్కరాలు వచ్చి ఏడాదైపోయింది. అంత్య పుష్కరాలు మరో 24 గంటల్లో ప్రారంభంకానున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా రూ.1400 కోట్లకు పైనే ఖర్చుచేసింది. ఆ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల విజ్ఞప్తిని పెడచెవిన పెట్టింది. గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తుండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా ఇట్టే పసిగట్టేందుకు భారీగా సీసీ కెమేరాలను ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు నగరంలో 171 సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. అదలా ఉంచితే తాజాగా అంత్య పుష్కరాలకు 40 సీసీ కెమేరాలను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉన్న నిర్వాహకులకే రెండు లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ లెక్కన చూసుకుంటే 171 కెమేరాలకు సుమారు రూ.16 లక్షలు వెచ్చించి ఉంటారనే అంచనాలున్నాయి. ఈ ఖర్చు విషయాన్ని పక్కనబెడితే వాటి ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడమేమిటనేదే జనం ప్రశ్న. ఆ విషాద ఘటనకు సాక్షా్యలేవీ... గోదావరి పుష్కరాల తొలిరోజు రాజమహేంద్రవరం పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందడం ఎప్పటికీ మరిచిపోలేని విషాద ఘటనే. ఆ ఘటనకు సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్లో కాకుండా సామాన్య భక్తులతో రద్దీగా ఉండే పుష్కరఘాట్లో కుటుంబ సమేతంగా పూజలు చేయడమే కారణమని సంఘటన జరిగిన మరుక్షణం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిపోయిన ఆ ఘటనలో మృతులను తిరిగి తీసుకురాలేంగానీ లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన 171 సీసీ కెమేరాల పనితీరే వివాదాస్పదంగా మారింది. అసలు ఆ కెమేరాలు పనిచేయ లేదా, లేక ఆ ఘటన తరువాత ఉద్ధేశ్యపూర్వకంగా పనిచేయకుండా చేశారా అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ ఘటన ఎలా జరిగిందని తెలుసుకోడానికి సీసీ కెమేరాలు ..., సీసీ ఫుటేజీలే ఆధారం. అన్ని లక్షలు వెచ్చించి సీసీ కెమేరాలు ఏర్పాటుచేసి, అంత మంది పోలీసు, రెవెన్యూ అధికారులుండి కూడా ఏకసభ్య కమిషన్కు ఒక్కగానొక్క ఆధారాన్ని కూడా అందచేయలేకపోయారు. అవేవీ పని చేయలేదని దర్యాప్తులో తేల్చేశారు. ఆ కెమేరాలను ఎందుకు వాడడం లేదు... గత ఏడాది ఉపయోగించిన సీసీ కెమేరాలను పునరుద్ధరించి అంత్య పుష్కరాల్లో వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆ ఆలోచనే చేయడం లేదన్న విమర్శలున్నాయి. అంత్య పుష్కరాలు ఏడాదిలో వస్తాయని ప్రభుత్వానికి, అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఘాట్లలో నామమాత్రంగా 40 సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమేరాల్లో 27 అధునాతనమైన కెమేరాలు శాశ్వతంగా ఘాట్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఏడు లక్షలు ఖర్చు అవుతోంది. సీపీజెడ్ కెమేరాలు, మినీ సీపీజెడ్ కెమేరాలు వీటిలో ఉన్నాయి. -
అభినవ ఇంజనీర్లు ..గిజిగాళ్లు
-
కొత్త మలేరియా వ్యాక్సిన్ కనిపెట్టారు..
మెల్బోర్న్ః మలేరియా నివారణకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ఎర్ర రక్తకణాలను హరించి మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కొనేందుకు నూతన యాంటీ మలేరియా చికిత్సను అభివృద్ధి చేశారు. వాల్తేర్ అండ్ ఎలీజా హాల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ అలాన్ కౌమాన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో, ఎర్ర రక్తకణాల్లోకి కీ ప్రొటీన్లు పంపించడం ద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములు లోపలికి చొచ్చుకొని వెళ్ళలేవని తెలుసుకున్నారు. దోమకాటుద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 30 కోట్ల నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా సోకినవారిలో ప్రతియేటా 4.5 లక్షలమంది దాకా చనిపోతున్నారు. అంతేకాక చిన్నపిల్లల్లో పెరుగుదలను కూడ దెబ్బతీసే ఈ వ్యాధి... గర్భిణీలకు మరింత ప్రమాదకరం. అటువంటి వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చని అధ్యయనకారులు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మలేరియా నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను అందించడమే కాక, పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతపై కూడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ళలోపు వయసున్న పిల్లలపై మలేరియా ప్రభావం అధికంగా ఉంటోందని, దోమల్లో గ్రహణ శక్తి పెరగటంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న యాంటీ మలేరియల్ మందులు ప్రభావం తగ్గుతోందని, అందుకే కొత్త పరిశోధనలద్వారా మలేరియా క్రిములను ఎదుర్కొనే మందులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. కౌమాన్ బృందం తాజాగా ఆర్ హెచ్ 5, ఆర్ ఐపీఆర్, సీవై పీఆర్ ఏ మొదలైన మూడు ప్రొటీన్లను కలిపి, ఆరోగ్యంగా ఉన్న మానవ రక్త కణాల్లోకి పంపించడంద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కోవచ్చునని కనుగొన్నారు. ఇలా చేయడంవల్ల మలేరియా క్రిములు ఎర్ర రక్తకణాలను హరించలేకపోయాయని తమ పరిశోధనలద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రొటీన్లతో టీకాలు వంటివి అభివృద్ధి చేసి, వ్యాక్సిన్లుగా ఇవ్వొచ్చని కౌమాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మలేరియాకు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి పరిచే పరిశోధనలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక వ్యాక్సిన్లకు మలేరియా క్రిములు అలవాటు పడిపోయాయని, ఈ పరిస్థితుత్లో కొత్త చికిత్సల అవసరం ఎంతైనా ఉందన్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్ లో కౌమాన్ బృందం.. తమ తాజా పరిశోధనలను నివేదించారు. -
కొత్త క్రికెట్ 'లా' యాప్!
న్యూ ఢిల్లీః క్రీడాభిమానులకు ఓ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. క్రికెట్ చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ఈ కొత్త అనువర్తనాన్ని ఓ క్రికెట్ క్లబ్ రూపొందించింది. ఢిల్లీలోని పురాతన క్రికెట్ సంస్థ క్రీడాభిమానుల హైటెక్ అవసరాలకు అనుగుణంగా కొత్త అప్లికేషన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. అత్యంత పురాతన క్రికెట్ ఇనిస్టిట్యూట్ మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) క్రికెట్ క్రీడకు సంబంధించిన చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కొత్త యాప్ విడుదల చేసింది. ఈ నూతన ఆవిష్కారం యాండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 'ఎంసిసి లాస్ ఆఫ్ క్రికెట్' పేరున అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త యాప్ లో... క్రికెట్ చట్టాలు క్రీడాభిమానులకు, వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేందుకు వీలుగా ఫొటోలు, క్విజ్, యానిమేషన్ రూపంలో ప్రత్యేక వివరణలతో విడుదల చేసింది. క్రికెట్ కు సంబంధించిన 42 చట్టాలను ఎంసీసీ యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. ఆట సెట్ ఆప్ దగ్గరనుంచీ ప్రతి విషయాన్ని అర్థమయ్యే రీతిలో వివరిస్తూ చట్టాలను ఎనిమిది విభాగాలుగా విభజించి యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. -
ఈ 'నగ్న రెస్టారెంట్'లో బట్టలిప్పి భోజనం చేస్తారు!
లండన్: భోజన ప్రియులకోసం లండన్ లోని ఓ హోటల్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. విభిన్నరుచులను చవిచూడాలనుకునే వారికోసం కొత్త పోకడకు తెరతీసింది. ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు ప్రత్యేక టాప్ అప్ లతో ఆహ్వానం పలుకుతోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభానికి స్థానిక ఔల్ కేఫ్.. శ్రీకారం చుట్టింది. లండన్ ప్రజలకు మరింత చేరువవ్వాలన్న ఉద్దేశంతో ఔల్ కేఫ్.. కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు 'నేకెడ్ రెస్టారెంట్' (నగ్న రెస్టారెంట్)ను ప్రారంభిస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఎక్కడా లేని అదనపు సౌకర్యాలను వినియోగదారులకు అందించేందుకు ఈ హోటల్ ముందుకొచ్చింది. ఇంతకుముందు కడిల్ కేఫ్ లో కాఫీ, స్నాక్స్, టీతోపాటు కౌగిలింతల సౌకర్యాన్ని కూడా అందుకున్న లండన్ ప్రజలకు, ఇప్పుడు ఔల్ కేఫ్ బర్త్ డే డ్రెస్ (నగ్నంగా) తో భుజించే ఆఫర్ను తెరపైకి తెచ్చింది. నగరంలోని భూగర్భ రైల్వే నెట్వర్క్ లండన్ ట్యూబ్.. కూడా ప్రస్తుతం పాప్ అప్ రెస్టారెంట్ గా మారిపోయింది. బ్రిటన్ రాజధానిలో భోజన ప్రియులకు ప్రత్యేక అనుభూతులను అందించేందుకు విభిన్నంగా ఆలోచించిన ఈ సంస్థ.. దుస్తులు తొలగించి మరీ (నగ్నంగా) భోజనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. విడిచిన దుస్తులు, ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకొనేందుకు హోటల్ ప్రత్యేక లాకర్ల వసతిని కల్పిస్తుందట. భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా, ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. గోప్యతకు వీలుగా రెస్టారెంట్లో బ్యాంబూ పార్టిషన్లతోపాటు ప్రత్యేక స్థలాన్ని కేటాయించిందట. ఇక్కడి సభ్యులు, సిబ్బంది కూడా కురుచ దుస్తులు ధరించి ఈ రెస్టారెంట్కు వచ్చేసారి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. బున్యాది పేరుతో ఈ కొత్త రకం రెస్టారెంట్ సెంట్రల్ లండన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ లభించే ప్రత్యేక సౌకర్యాలు, డిన్నర్లు, వంటి అనుభవాలను రుచిచూసేందుకు ముందుగా బున్యాది డాట్ కామ్ (thebunyadi.com) లో రిజిస్టర్ చేసుకోవచ్చట. ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు ఈ కొత్త భోజనశాలను పరీక్షించేందుకు సైన్ అప్ చేశారట. దుస్తుల సంకెళ్ళనుండి విముక్తులను చేయడం, ఆధునిక జీవితంలో సరికొత్త అనుభవాలను చవి చూసేందుకు వీలుగా ఈ రెస్టారెంట్ ఉంటుందట. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదట. ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాదు పూర్వకాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం, మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి కూడ ఇక్కడి సౌకర్యాల్లో భాగమే. ఈ రెస్టారెంట్లో 'నేకెడ్'' మాత్రమే కాదు 'నాన్ నేకెడ్' సెక్షన్ కూడ వేరుగా ఉంటుందట. -
ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు!
భువనేశ్వర్: ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నాయి. మహా విషుభ సంక్రాంతిగా పిలిచే ఒడిశా కొత్త సంవత్సర పండుగ సందర్భంగా వివిధ దేవాలయాల్లో పూజలతోపాటు పూరి జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మహావిషుభ సంక్రాంతికి స్వాగతం పలుకుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విషుభ సంక్రాంతి లేదా పాన సంక్రాంతిగా పిలిచే పండుగను ఒడిశా ప్రజలు సంవత్సరాదిగా జరుపుకుంటారు. కొత్త ఒడియా అల్మానాక్ అమల్లోకి వచ్చే ఈ రోజును ప్రత్యేక వేడుకగా నిర్వహిస్తారు. తెలుగు ప్రజలు సంవత్సరాదినాడు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని తయారుచేసి తినే ఆచారం ఉన్నట్లుగానే ఒడిశాలోనూ నూతన సంవత్సరారంభం రోజున పానా గా పిలిచే పచ్చిమామిడి, చక్కెర కలిపిన రసాన్ని తాగుతారు. మరోవైపు అనేకమంది రాజకీయ పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు, విపక్షాల నాయకులు, ప్రముఖులు ఒడిషా ప్రజలకు కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. దీంతో పాటు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడ నిర్వహించారు. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948 ఏప్రిల్ 13న రాష్ట్ర రాజధానిగా భువనేశ్వర్ నగరానికి తొలి పునాది రాయి వేశారు. -
గ్రేటర్లో 5 కొత్త మున్సిపాలిటీలు
పురపాలికలుగా జల్పల్లి, జిల్లేలగూడ, మీర్పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో ఐదు కొత్త మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్, ఘట్కేసర్ మండలాల పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు విలీన ప్రక్రియ ద్వారా ఐదు కొత్త మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకున్నాయి. సరూర్నగర్ మండలంలోని జిల్లేలగూడ, మీర్పేట్ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా లభించింది. ఇదే మండల పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల విలీనంతో జల్పల్లి మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఘట్కేసర్ మండల పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. ఈ 11 గ్రామ పంచాయతీల హోదాను రద్దు (డీనోటిఫై) చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేయగా వాటి విలీనంతో ఐదు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆ వెంటనే మరో ఉత్తర్వు జారీ చేసింది. కొత్తపేట్, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలతోపాటు బాలాపూర్ గ్రామ పంచాయతీలోని సర్వే నం. 142, 253ల విలీనంతో జల్పల్లి మున్సిపాలిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోడుప్పల్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. మీర్పేట్, జిల్లేలగూడ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి మున్సిపాలిటీ హోదా కల్పించింది. మేడిపల్లి, పర్వతపూర్ గ్రామ పంచాయతీల విలీనంతో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీగా అవతరించింది. మున్సిపల్ ఎన్నికల నిబంధనల మేరకు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన నాటి నుంచి రెండేళ్లలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి మొత్తం 68 నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉండగా తాజాగా ఐదు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఈ సంఖ్య 73కు పెరిగింది. -
నీలివజ్రం కొత్త రికార్డు!
హాంకాంగ్: వేలం పాటలో ఓ నీలి వజ్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ వజ్రం సోథెబేస్ట్ మార్కెట్లో 205 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి జ్యువెలరీ మార్కెట్లో ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రికార్డును సాధించింది. అలాగే మరో పెయింటింగ్ కూడా వందలకోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. డీబీర్స్ మిలీనియమ్ జ్యువెల్ 4 లో 10.10 క్యారెట్ల గోళాకార ఫాన్సీ వివిద్ బ్లూ డైమండ్... ఆసియాలో మరే ఇతర ఆభరణాల వేలంలోనూ తెచ్చి పెట్టని అత్యధిక డబ్బును తెచ్చిపెట్టిందని ఆక్షన్ హౌస్ వెల్లడించింది. ఆ అరుదైన నీలి వజ్రాన్ని ఓ బిడ్డర్ ఫోన్ ద్వారా వేలంలో కొనుగోలు చేసినట్లు దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనీస్ కళాకారుడు ఝాన్ డాక్వియన్ సృష్టించిన 'పీచ్ బ్లౌజమ్ స్పింగ్' కళాత్మక పెయింటింగ్ .. అసలు ధర 8.3 మిలియన్ డాలర్లు ఉండగా... అంచనాలను అధిగమించి సుమారు 230 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ కళారూపం కేవలం 50 నిమిషాల్లో 100 కంటే ఎక్కువ బిడ్లను పొంది.. షాంఘై లాంగ్ మ్యూజియంకు అత్యంత అధిక ధర పలికింది. ఝాన్ వేసిన ఈ పెయింటింగ్ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి. -
సెల్ఫీ వ్యామోహం ఉన్నవారికి 'టీ రెక్స్ హ్యాండ్'
సెల్ఫీల వ్యామోహం ఉన్నవారికి ఇదో మంచి అవకాశం. అనేక వినూత్న భంగిమల్లో ఫొటోలు తీసుకోవాలని మనసు పడేవారికి, ఎప్పుడూ విభిన్నంగా కనిపించాలని ఇష్టపడేవారికి లేటెస్ట్ ట్రెండ్గా టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) హ్యాండ్స్ పోజును లండన్ కు చెందిన ఓ బ్యూటీ బ్లాగర్ పరిచయం చేసింది. చేతి వేళ్లను ముఖానికి దగ్గరగా అనేక భంగిమల్లో ఉంచుతూ ఫొటోలు తీసుకొని ఆ అందాలను మీరే స్వయంగా చూసుకోవాలని సలహా ఇస్తోంది. సెల్ఫీల ధోరణి ఎక్కువైన నేటికాలం జనానికి కొత్త రకం సెల్ఫీ స్టైల్ ను పరచయం చేసింది.. లండన్ కు చెందిన బ్యూటీ బ్లాగర్, ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ హుడా కట్టమ్. థైబ్రోస్, డక్ ఫేస్ లాంటి విభిన్న చిత్రాలను తీసుకోవడం సైతం పాత పద్ధతిగా మారిన నేపథ్యంలో... వినూత్నంగా టీ రెక్స్ ప్రయోగాన్ని ఆమె తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది. మీరు సెల్ఫీ తీసుకునే సమయంలో రెండు చేతులను ఉపయోగించి, ముఖానికి దగ్గరగా ఉంచుకొని ఫొటో తీసుకుంటే టీ రెక్స్ ప్రభావం మీకే తెలుస్తుందంటూ ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించిన సదరు మహిళ వివరించింది. తాను స్వయంగా ఆ అనుభవాన్ని ఆస్వాదించినట్లు కట్టమ్ ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది. ఓ కొత్త పోజులో మీరు కనిపించాలనుకున్నపుడు కెమెరా పట్టుకున్న మీ చేతులను కళాత్మకంగా ముడుస్తూ.. ముఖం దగ్గర, గడ్డం మీద, జుట్టు మీద ఉంచి చూడమంటోంది. మీరు చేతిని, చేతి వేళ్లను కదులుస్తూ, ముఖంలోని ఒక్కో భాగంపై పెడుతూ టి రెక్స్ ను ఉపయోగించి చూస్తే సెల్ఫీ మజా ఏమిటో తెలుస్తుందంటోంది. ముఖ్యంగా వేళ్లను నుదుటిపై ఉంచినపుడు టి రెక్స్ అద్భుతంగా కనిపిస్తుందని, అలాగే ముఖంలోని ప్రతి భాగం విభన్నంగా కనిపిస్తుందని కట్టమ్ చెప్తోంది. టి రెక్స్ థెరోపాడ్ డైనోసార్ హ్యాండ్ పద్ధతిలో తీసుకున్న సెల్ఫీలు సెలబ్రిటీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో హల్ చల్ చేస్తున్నాయి. -
తల్లిదండ్రులకు ఇక భయం లేదు..!
పిల్లలు స్కూలుకు వెళ్ళి ఇంటికి చేరే వరకూ కాస్త ఆలస్యం అయితే చాలు ఎక్కడ ఉన్నారో నని తల్లిదండ్రులు తెగ భయపడిపోతుంటారు. టైం దాటిన తర్వాత స్కూలుకు ఫోన్ చేసినా ఉపయోగం ఉండదు. బస్సులో బయల్దేరిన పిల్లలు ఇప్పటిదాకా రాకపోవడమేమిటి అంటూ కంగారు పడిపోతారు. అటువంటి భయం అక్కర్లేకుండా పిల్లల జాడ సులభంగా తెలుసుకునేందుకు ఓ పదోక్లాస్ విద్యార్థి కొత్త యాప్ ను కనుగొన్నాడు. స్కూల్ బస్ ట్రాఫిక్ లో ఇరుక్కున్నా... ఇంకేమైనా అవాంతరాలు వచ్చినా పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు. చెన్నై వెలమ్మల్ విద్యాశ్రమ్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న పదిహేనేళ్ళ ఎస్. అర్జున్... కొత్త యాప్ ను సృష్టించాడు. 2012 లో చైన్నైలో తుఫాన్ వచ్చిన సమయంలో అర్జున్ కు ఈ కొత్త ఐడియా వచ్చింది. స్కూల్ బస్ ఆలస్యం కావడంతో ఇంటికి లేటుగా వచ్చిన అర్జున్ కు తల్లిదండ్రుల కంగారు చూసి బాధేసింది. అప్పుడే మెదడులో వచ్చిన ఆలోచనతో అటుదిశగా అడుగులు వేయడం ప్రారంభించాడు. యాప్ ను సృష్టించడం, యాండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ వంటివి నేర్చుకోవడం మొదలు పెట్టాడు. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో తాను అనుకున్న పని సాధించగలిగాడు. స్వంతంగా లొకేటరా(LOCATERA) పేరున ఓ కొత్త యాప్ ను సృష్టించాడు. అర్జున్ తండ్రికి ఇంట్లో కంప్యూటర్ ఉండటంతో రెండేళ్ళ వయసునుంచే దానిపై అర్జున్ ఎంతో ఇష్టం చూపించేవాడు. అతడి ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు వయసుకు తగ్గట్టుగా కంప్యూటర్ టెక్నాలజీ గురించీ నేర్పిస్తూ వచ్చారు. ఈ జెడ్ స్కూల్ బస్ లొకేటర్ (Ez school bus locator) పేరున అర్జున్ మొదటిసారి ఓ యాప్ ను రూపొందించాడు. ఇందులో తన స్కూల్ తో పాటు స్థానికంగా ఉన్న మరిన్ని స్కూళ్ళ వివరాలను కూడ పొందుపరిచాడు. మెల్లమెల్లగా విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలతోపాటు, స్కూళ్ళ యాజమాన్యాలు, సిబ్బంది వివరాలను అందులో చేరుస్తూ ప్రస్తుతం లొకేటరా పేరున మాడిఫైడ్ వర్షన్ ను అందుబాటులోకి తెచ్చాడు. మిగిలిన యాప్ లకు భిన్నంగా ఈ యాప్ కోసం కొంత హార్డ్ వేర్ ను కూడ ఉపయోగించాడు. స్కూల్ బస్ లో హార్డ్ వేర్ ను ఇన్ స్టాల్ చేసి... తల్లిదండ్రులకు బస్ గమనం తెలిసేలా చేశాడు. ఈజెడ్ స్కూల్ బస్ లొకేటర్ ఉచిత వెర్షన్ ను ఇప్పటికే పది దేశాల్లో వాడకంలోకి తెచ్చారు. ఇండియాలో కూడ ఈ యాప్ త్వరలో పూర్తిశాతం వినియోగంలోకి రాగలదని అర్జున్ తండ్రి సంతోష్ కుమార్ ఆశిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరం పాటు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన యాప్ కు అనంతరం నెలవారీ ఫీజును వసూలు చేసేట్టుగా నిర్ణయించారు. కొత్త యాప్ ను ప్రస్తుతం తన స్కూల్లో అందుబాటులోకి తెచ్చిన అర్జున్ త్వరలో నగరంలోని అన్ని స్కూళ్ళలో పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు. అర్జున్ రూపొందించిన యాప్ లో మూడు యాప్ లు ఒకేసారి పనిచేస్తుంటాయి. అడ్మిన్, అటెండెంట్, పేరెంట్ యాప్ లను కలిపి ఈ లొకేటరాను తయారు చేశాడు. విద్యార్థులతోపాటు, స్కూల్ సిబ్బంది, బస్ డ్రైవర్ కూడ వారికి సంబంధించిన బార్ కోడ్లతో వారి వారి ఫోన్లలో స్కాన్ చేసుకోవడంతో సమాచారం తెలిసే వీలుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులతోపాటు, స్కూల్ యాజమాన్యం, డ్రైవర్ కూడ ఈ యాప్ ను వినియోగించుకొని బస్ జాడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాప్ ను తయారు చేసేందుకు అర్జున్.. ఎంఐటి ప్రోగ్రామింగ్ టూల్ ను వినియోగించాడు. గూగుల్ ఇండియా కోడ్ టు లెర్న్ కాంటెస్ట్ 2015 లో పాల్గొని గెలుపొందాడు. అలాగే ఎంఐటి యాప్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడ గెలుచుకున్నాడు. కంప్యూటర్ టెక్నాలజీలో ప్రత్యేకతలు కలిగిన పిల్లలకు భారత ప్రభుత్వ ఉమెన్ అండ్ ఛైల్డ్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేకంగా ఇచ్చే.. 2014 నేషనల్ ఛైల్డ్ అవార్డును సాధించాడు. తమ ప్రతిభను వినియోగించి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు అర్జున్ సూచిస్తున్నాడు. -
మీ స్కైప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయా?
కొత్త కొత్త మాల్వేర్లను (మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్) ఉపయోగించి ఖాతాల్లో డబ్బు తస్కరించే హ్యాకర్లనే ఇప్పుటి దాకా చూస్తున్నాం. ఇప్పుడు వారి దృష్టి ఆన్లైన్ సంభాషణలపై పడింది. ఆన్లైన్ లోనే అన్ని రకాల సంభాషణలు జరుపుతున్న నేటి తరుణంలో రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకు హ్యాకర్లు సిద్ధమౌతున్నారు. తాజాగా స్కైప్ లో జరిగే సంభాషణలను రికార్డు చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెరికా వంటి దేశాల్లో కొత్త మాల్వేర్ ను ఉపయోగించి సైబర్ దాడులకు పాల్పడినట్లు వివరిస్తున్నారు. ఏ దేశంలో నివసిస్తున్న వారితోనైనా మన ముందున్నట్లే మాట్లాడేందుకు స్కైప్ను ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నాం. ఇష్టమొచ్చినట్లు అదీ ఇదీ అని లేకుండా ప్రతి విషయాన్నీ స్కైప్ కాల్స్లో షేర్ చేసేసుకుంటున్నాం. ఆఫీస్ మీటింగ్లు, రహస్య సంభాషణలు అన్నీ స్కై ప్ లో జరిగిపోతున్నాయి. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన స్కైప్లో మాట్లాడేప్పుడు ఏవైనా రహస్య సంభాషణలు ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందేనంటున్నారు సైబర్ నిపుణులు. స్కైప్ లో జరిగే రహస్య సమాచారాన్ని T9000 మాల్వేర్ను ఉపయోగించి తస్కరించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీడియో సంభాషణలను రికార్డు చేసేందుకు, స్క్రీన్ షాట్లు తీసేందుకు ఈ శక్తివంతమైన T9000 మాల్వేర్ ను వినియోగిస్తున్నట్లు సైబర్ రక్షణాధికారులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ఇప్పుడు ఎటువంటి యాంటీ వైరస్ కు దొరక్కుండా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ కు చెందిన వీడియో ఛాటింగ్ ప్రోగ్రామ్ స్కైప్ ను ప్రతిరోజూ సుమారు 4.9 మిలియన్ల మంది వాడుతున్నట్లు గతేడాది జరిపిన సర్వేలు చెప్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లకు పోటీగా స్కైప్ ను వినియోగదారులు వాడటం కనిపెట్టిన హ్యాకర్లు... ఇప్పుడు రహస్య వీడియో సంభాషణల తస్కరణపై దృష్టి పెట్టారు. కొత్తగా వచ్చిన ఈ T9000 మాల్వేర్ మార్కెట్లోని ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ లను తప్పుదోవ పట్టించగలదని పాలో ఆల్టో నెట్ వర్కింగ్ సంస్థ చెప్తోంది. ఈ వైరస్.. సిస్టమ్ లో పనిచేసే సుమారు 24 రకాల సెక్యూరిటీ విభాగాలను దాటి వ్యాపించగలదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. మనం వాడే కంప్యూటర్, లేదా మొబైల్ యాండ్రాయిడ్ పరికరాల్లోని వేటిలోనైనా ప్రవేశించి అందులోని సమాచారాన్ని చోరీ చేయగల శక్తి ఈ వైరస్ కు ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ను ఇప్పటికే అమెరికాలోని పలు సైబర్ దాడుల్లో వినియోగించినట్లు సంస్థ తెలుపుతోంది. స్కైప్ వినియోగించేందుకు explorer.exe పేరుతో వచ్చే ఫైల్స్ ను నమ్మొద్దని సంస్థ హెచ్చరిస్తోంది. దీన్ని వీడియో ఫైల్స్ ను తస్కరించేందుకు హ్యాకర్లు వాడుతున్నట్లు పాలో ఆల్టో నెట్వర్కింగ్ సంస్థ చెబుతోంది. -
ఉండేదెవరు?.. ఊడేదెవరు?
-
రైతులకు సమగ్ర పంటల భీమా పథకం
-
గులాబీ గ్రేటర్ ఆపరేషన్
-
ఏపీలో నూతన ఇసుక పాలసీ!!
-
టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణం
హైదరాబాద్: ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నూతన ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. పురాణం సతీష్, భూపతి రెడ్డి, భాను ప్రసాద్, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కొండా మురళి, లక్ష్మినారాయణ ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. -
గ్రేటర్ పీఠం కోసం గ్ర్రేటర్ కసరత్తు
-
కొత్త జీవితం కావాలి
కొత్తదనం అంటే పైపై అలంకారాలు, పేరులు మార్చడం కాదు, వస్తువు నాణ్యతలో మార్పు రావాలి. మన జీవితంలో నూతనత్వం అన్నది తన సంవత్సర ప్రవేశంతో కలుగదు. నూతనత్వం ఓ ప్రత్యామ్నాయం కాదు, అది ఓ పరిష్కారం. ప్రతి నూతన సంవత్సరం మనమొక నూతనత్వాన్ని కోరుకోవటం పరిపాటి. నూతనత్వాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. నేటి ప్రపంచంలో కొత్తదనమన్నది ప్రతి రంగంలో అవసరం. పాతవి గతిస్తేనే గాని కొత్తదనానికి నాంది పలకలేము. గతం పాత అయితే రాబోతున్నది ఏదో అది కొత్తది. కాలం ఒక ప్రయాణమైతే జరిగిపోయే ప్రతి విషయం మనం దాటి వెళ్లే ఓ మైలురాయి అవుతుంది. ఇలా సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు, తరాలు మన జీవితంలో దొరలిపోతాయి. ఈ ప్రయాణంలో జరిగినవన్ని మంచివి కాకపోవచ్చు. అవి మేలు-కీడుల, లాభ-నష్టాల, సుఖ-దుఃఖాల సమ్మిళితం. గతంలో కొందరి జీవితంలో ఒక గాయం, కాని అట్టి గాయం కొందరి జీవితాలలో ఒక పాఠమే నేర్పుతుంది. మన గతమంతా జ్ఞాపకాలే. వాటిని తలంచినంతా గుండెల్లో బాధ, కళ్లల్లో కన్నీళ్లు. అలా జీవితంలో గాయపడిన, దగాపడిన, నిరాశ నిసృ్పహల్లోకి దిగజారిన వారినుద్దేశించి ఆ దేవాదిదేవుడు ఇలా సెలవిచ్చాడు ‘‘మునుపటి వాటిని జ్ఞాపక ం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును మీరు దాని నాలోచింపరా?’’ - (యెషయా 43:18:19) గతం ఓ జ్ఞాపకాల సుడిగుండం. నిరాశ నిర్లిప్తతల వలయం. అట్టి చేదు గతం నుండి నూతనత్వంలోనికి రావాలని ఆ దేవాదిదేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ‘ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను’ అంటూ మనలో ధైర్యాన్ని, ఒక కొత్త ఆశని కలుగచేయుచున్నాడు. గతాన్ని, పూర్వాన్ని జ్ఞాపక చేసుకొనకుడి, తలంచుకొనకుడి అని ఆ దేవుడు తెలియ చేస్తున్నాడు. అనగా పాత జ్ఞాపకాలకు స్వస్తి పలకాలి. మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఒక నూతన ఆరంభం అవసరమవుతుంది. పౌలు అను భక్తుని జీవితంలో తన గతం ఓ హింసాయుత జీవితం. తన భక్తి, తన మతం, అభిమతం అంతా గతి తప్పిన స్థితి. నేటి పరిభాషలో చెప్పాలంటే అతడు ఓ మత ఉగ్రవాది, చాంధసవాది. తన విద్య, మతనిష్ట, తన జాతి, పౌరసత్వం, తన కుటుంబ నేపథ్యం అంతా భ్రష్టత్వానికి, స్వార్థానికి, దురహంకారానికి ఉపయోగించాడు. చివరకు సత్యం తెలుసుకున్నవాడుగా -‘‘పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను’’ - (1 తిమోతి 1:15) అని ప్రకటించాడు. తన పాప జీవితమును, పాత జీవితం నుండి మారిన నూతన జీవితంలోనికి వచ్చాడు. ‘‘మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి, నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి,’’- (యెహెజ్కేలు 18:31) అని బైబిలు బోధిస్తుంది. నూతనత్వానికి నిర్వచనం మారిన మన మనసు కావాలి. సంవత్సరాలు మారినా, మనిషి మనసు మారనిచో మనిషి ప్రవర్తనలో మార్పు రాజాలదు. కొత్తదనం అంటే పైపై అలంకారాలు కాదు. పేరులు మార్చడము కాదు, వస్తువు యొక్క నాణ్యతలో మార్పు రావాలి. అలాగే మన జీవితంలో నూతనత్వం అన్నది తన సంవత్సర ప్రవేశంతో కలుగదు. నూతనత్వం ఓ ప్రత్యామ్నాయం కాదు, అది ఓ పరిష్కారం. మన జీవితంలో నూతన నిర్ణయాలతో, తన ప్రమాణాలతో సరియైన ప్రాధాన్యాలతో దృఢ సంకల్పంతో ముందుకు అడుగు వేయాలి. ఇట్టి ప్రక్రియలోనే మన జీవితం నూతన పరచబడుతుంది. అలాంటి కొత్త జీవితం మనకు కావాలి. మనందరిలో రావాలి. - రెవ.పి.ఐజాక్ వరప్రసాద్ -
రెండు సీట్ల గెలుపు ఎవరి ఖాతాలో..?
-
విశాఖలో న్యూ ఇయర్ జోష్
-
ఆదిలాబాద్ హెడ్పోస్టాఫీస్లో ఏటీఎం ప్రారంభం
-
'ఆయన పేరు పెట్టడం ఆనందం కలిగిస్తోంది'
-
ఫేస్బుక్లో మాజీలను తొలగించే అవకాశం.!
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 కోట్ల వినియోగదారులున్న ఫేస్బుక్ సంస్థ యూజర్లకు ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ లోని ఫ్రెండ్స్ లిస్టులో విసుగు కలిగిస్తున్న, పాత స్నేహితులను లిస్టు నుంచి తొలగించేందుకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ కొత్త సౌకర్యాన్ని పొందే ముందు వినియోగదారులు కాస్త అసౌకర్యాన్ని కూడా భరించాల్సి వస్తుందని ఆ సంస్థ చెబుతోంది. కొత్త టూల్ ను ప్రారంభించిన తర్వాత అందుబాటులోకి ఓ కొత్త మొబైల్ యాప్ ను తెస్తామని, ఈ కొత్త యాప్... యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫేస్బుక్ నిర్వాహకులు చెప్తున్నారు. కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేస్బుక్ లో మీ స్థితి మార్చినపుడు ఇంతకు ముందు మీ ఫ్రెండ్స్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు.. మెసేజ్ లు డిలీట్ చేయాలా? వద్దా? అన్నది అడుగుతుంది. ఇలా చేసిన తర్వాత మీ వాల్ పై మీ పోస్ట్ లు, మెసేజ్ లు, ఫొటోలు మీరు లిస్టు నుంచి తొలగించిన వారికి కనిపించే అవకాశం ఉండదు. అలాగే గత పోస్ట్ వివరాలను కూడా చూసే సామర్థ్యాన్ని పరిమితం చేసుకునే అవకాశాన్ని ఈ కొత్త యాప్ కలిగిస్తుంది. అలాగే కొంతమందికి మాత్రమే మీ వివరాలు, పోస్ట్ లు కనిపించేట్టుగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఫేస్బుక్ ద్వారా తమ వినియోగదారుల జీవితాల్లో కలుగుతున్నకష్టాలను తీర్చేందుకు ఓ ప్రయత్నమని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ కెల్లీ వింటర్స్ తన బ్లాగ్ స్పాట్ లో తెలిపారు. ఈ సౌకర్యం ప్రజలకు కలిగిస్తున్న అసౌకర్యాలను కూడా సులభంగా తొలగిస్తుందని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. అయితే మీ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో... మీ స్నేహితులు, పార్టనర్ కు తెలిసే అవకాశం కూడా ఉండదన్నారు. ఈ కొత్త టూల్ వల్ల ప్రజలు మరింత సౌలభ్యం, సౌకర్యం పొంది, ఫేస్బుక్ తో మంచి సంబంధాలను కొనసాగించేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు కెల్లీ వింటర్ తెలిపారు. -
గలాపగస్ లో మరో భారీ తాబేలు!
తాబేళ్లలో ఇంచుమించుగా అన్నింటి జీవితకాలం వంద ఏళ్లకు పైనే ఉంటుంది. అయితే వాటిల్లో జెయింట్ టార్టాయిస్లు అయితే ఏకంగా రెండు వందల ఏభై ఏళ్లు కూడా బతుకుతాయి. తాజాగా సైంటిస్టులు ఫసిఫిక్ మహా సముద్రంలోని గాలాపగస్ దీవుల్లో ఓ భారీ తాబేలు జాతి ఉన్నట్లుగా గుర్తించారు. నెమ్మదిగా కదిలే సరీసృపాల సమూహాల్లో మరొక రకమైన ఈ తాబేలు.. శాంటా క్రజ్ ద్వీపంలో ఇంతకు ముందున్న తాబేళ్ళ జాతికి భిన్నంగా, వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జన్యు సమాచారాన్ని సేకరిస్తన్నారు. ఈ ద్వీప సమూహంలో ఉన్న మొత్తం 15 తాబేళ్ళ జాతుల్లో నాలుగు అంతరించిపోగా ఇది 15 వ జాతిగా సైంటిస్టులు చెప్తున్నారు. గాలాపగస్ రిటైర్డ్ పార్క్ రేంజర్... చెలోనాయిడిస్ డాన్ ఫాస్టియో అని ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. గాలాపగస్ లో నివసించే భారీ తాబేళ్ళు 250 కేజీల వరకు బరువుండి, వందేళ్ళకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే శాంటా క్రూజ్ ద్వీపంలో ఉన్న రెండు అతిపెద్ద తాబేళ్ళు ఒకే జాతికి చెందినవిగా ఉన్నప్పటికీ, అవి జన్యు పరీక్షల్లో తేడాలు ఉన్నట్లు తేలిందని ఈ క్వెడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్తగా కనుగొన్న జాతులను తూర్పు శాంటా క్రుజ్ తాబేళ్ళుగా పిలుస్తారని, ఇవి ద్వీపంలోని తూర్పువైపు నివపిస్తాయని, అయితే ఇతర ద్వీపాల్లోని అతిపెద్ద తాబేళ్ళతో పోలిస్తే వీటిలో విభిన్నమైన జన్యువులు ఉన్నట్లు గుర్తంచారు. ఈ అతిపెద్ద తాబేలు యొక్క షెల్ ఆకారం మాత్రం ఇతర జాతులకంటే మరింత కుదించినట్లుగా ఉందని, యేల్ విశ్వవిద్యాలయం జీవశాస్త్రవేత్త గిసెల్లా కాక్సియాన్ అన్నారు. 250 దాకా ఉన్న ఈ భారీ తాబేళ్ళ జాతుల పరిరక్షకులు, వీటి జాతులు అంతరించిపోకుండా, వీటికి హాని కలగకుండా పునరుద్ధరించడానికి సహాయపడగలరని వీరు ఆశతో ఉన్నారు. ఇతర తాబేళ్ళకంటే ఎక్కువగా.. రెండువేలకు పైగా అతిపెద్ద తాబేళ్ళ జాతులు ఈద్వీపంలో నివసిస్తున్నట్లు వీరు చెప్తున్నారు. గాలాపగస్ ద్వీపంలో 1830 నాటికే జెయింట్ టార్టాయిస్ ఉన్నట్లు ప్రముఖ బ్రిటిష్ అధ్యయన వేత్త ఛార్లెస్ డార్విన్ అధ్యయనాల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్దం కన్నా ముందు గాలాపాగస్లో తాబేళ్ల సంఖ్య రెండున్నర లక్షల వరకు ఉండేదిట. అయితే 17వ శతాబ్దం నుంచి వీటిని వేటాడి తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈ దీవుల్లో ఉండే ఒక జాతి ఎలుకలు తాబేళ్ల గుడ్లను తినేస్తుండేవట. ఇటువంటి అనేక కారణాలతో 1970 కల్లా ఈ భారీ తాబేళ్ల సంఖ్య కేవలం 3000కు చేరింది. -
ఏది చెత్త? ఏది కొత్త? మహాత్మా!
అక్షర తూణీరం చెత్త... చెత్త... ఎక్కడ విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఇదే మాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మోదీ ప్రధాని గా వచ్చాకనే ‘చెత్త స్పృహ’ దేశంలో పెరిగింది. అయితే అన్ని చెత్తలూ వ్యర్థాలు కావు. అన్ని వ్యర్థాలు చెత్తకావు. అసలు చెత్తంటే ఏంటి? దీన్ని అద్వైత సిద్ధాంతానికి అన్వ యించి వింగడిస్తే, చెత్త మూలాలు మనల్ని ఆశ్చర్య పరుస్తాయి. రేడియోని చెత్తగా భావించి అటకల మీద పారేశాం. ‘మనసులో మాట’ అంటూ మోదీ, బ్రదర్ ఒబామా రేడియోలో తెగ మాట్లాడేసుకోవడం విని, అట కల మీంచి దింపి రేడియోల దుమ్ము దులిపాం. ఇప్పుడు పున్నమికీ, అమావాస్యకీ మోదీ రేడియోలోనే మనసు విప్పుతున్నారు. దాంతో చెత్త కాస్తా కొత్తగా మారింది. ‘చెత్త’ సాపేక్షం. అప్పటిదాకా ఒక పార్టీలో కింగ్పిన్గా ఉన్నాయన పార్టీ ఫిరాయించగానే ఉత్త చెత్త మూట అవుతాడు. అదే చెత్త మూట మారిన పార్టీలో జాకబ్ వజ్రంలా మెరుస్తుంటాడు. ఒక సాములారు ఎదురైతే చెత్త ప్రస్తావన తెచ్చి, అనుగ్రహ భాషణానికి అర్థిం చాను. స్వామి చిరునవ్వు నవ్వి, ఈ సృష్టిలో సత్యం, అసత్యం తప్ప ఇంకోటేమీ లేదన్నారు. ఇంతకీ మీరు సత్యమా, అసత్యమా అంటూ తెగించి అడిగాను. ‘‘అస త్యం’’ అంటూ కదిలారు స్వామి. రూపం నాకు కనిపిం చలేదు. అసలిదంతా నా భ్రమ కావచ్చు, పరమ చెత్త కావచ్చు. కొన్ని చెత్త ఉదాహరణల్ని పరిశీలిద్దాం. చదివేసిన పేపర్లు మనకు పరమ చెత్త. పాత పేపర్ల వ్యాపారికి అదే బతుకు. టన్నుల కొద్దీ తలనీలాలు శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకుంటారు. కేశాలను స్వీక రించి, క్లేశాలను తొలగిస్తాడని నమ్మకం. అవి శ్రీవారికి కోట్ల ఆదాయాన్నిస్తాయి. ప్రసిద్ధ సాహితీవేత్త వేటూరి ప్రభాకరశాస్త్రి ఇంటికి ఆయన శిష్యుడు వెళ్లాడు. మాటా మంచీ అయ్యాక శిష్యుడు రాత్రి భోజనం చేశాడు. ఎంగిలి విస్తరి పారెయ్య డానికి ఇంటి వెనక్కి వెళ్లి చీకట్లో చూడక గుంటలో దభేల్ మని పడ్డాడు. గురువు గారు సంగతి గ్రహించి ‘‘మా చెత్తగుంట ఇలా ఒక్కసారి నిండుతుందనుకోలేదోయ్!’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారట. సాహిత్య విష యంలో ‘చెత్త’ని బాగా వాడతారు. జీవితకాలంలో చాలా చెత్త ఉత్పత్తి చేశాడు. ‘అగ్ని దహించలేదు. జల ము హరించలేదు. చెదలారగించలేవు’’ అంటూ హాలా హలం లాంటిదని చెబుతారు. కొన్ని గొప్ప గొప్ప మ్యూజియమ్స్లో చాలా ఖరీదైన చెత్త ఉంటుందని ఒక పెద్దాయన అనుభవం మీద చెప్పాడు. నిజానికి చెత్తలోనే వ్యాపారం నడుస్తుంది. ‘‘పాత చెత్త కుక్కర్, చెత్త గ్యాస్ స్టౌ, చెత్త మిక్సీలను సగౌర వంగా స్వీకరిస్తాం. కొత్త వాటిని సమర్పిస్తాం’’ అనే ప్రకటన కనిపిస్తే చాలు. కేక! ఆఖరికి పాత లోఉడుపులు తీసుకురండి, సరికొత్తవి తీసుకువెళ్లండి అనగానే భూకంపం వచ్చినట్టు ఇంట్లోంచి పరుగులు పరుగులు. చెత్తని ఎవ్వరూ భరించరు. పక్కింటి హద్దులో పడేసి చేతులు దులుపుకుంటాం. తిరిగి వాళ్లూ అంతే చేస్తారు. సృష్టిలో ఏ పదార్థాన్నీ సృష్టించలేం, నాశనం చేయలేం. అది మాత్రం సత్యం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
లక్ష్మి హత్య కేసులో కీలకమలుపు
దుమ్ముగూడెం, న్యూస్లైన్: మండలంలోని పెదనల్లబల్లిలో ఇటీవల హత్యకు గురైన లక్ష్మి కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. లక్ష్మిని సొంత మరిదే మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిని గురువారం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పెదనల్లబల్లికి చెందిన బోడా లక్ష్మి(50)ని గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకా రం హత్య చేసిన విషయం విదితమే. తొలుత ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు భావించారు. కానీ విచారణ చేపట్టిన పోలీసులు మాత్రం లక్ష్మి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. అందులో భాగంగా గ్రామానికి చెంది న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి విచారణ చేపట్టినట్లు తెలిసింది. హత్య జరిగిన రోజు రాత్రి ఇంటికి ఎవరెవరు వచ్చారు... ఆమె గుడుంబా తయారు చేసేప్పుడు అక్కడ ఎ వరెవరు ఉన్నారు..? అనే విషయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. లక్ష్మి చెల్లె భర్తే పథకం పన్ని ముగ్గురు అనుచరులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. లక్ష్మి చెల్లెలు భర్త ఇటీవల వరికోత యంత్రం కొనుగోలు కోసం లక్ష్మి వ ద్ద డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బు కోసం లక్ష్మి ఒత్తిడి చేస్తున్న క్రమంలో హత్యకు ప్రణాళిక రచించినట్లు వి చారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. లక్ష్మి చెల్లెలిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
భూమన కరుణాకర్ రెడ్డితో సాక్షి న్యూస్ మేకర్