Psycho
-
బొరుసు పడుంటే ఆమె బతికి ఉండేదేమో!
మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే.. ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ముఖ్యంగా లైంగిక దాడుల విషయంలో మరీ ఘోరాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి. 18 ఏళ్ల ఓ యువతి నైట్క్లబ్లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. హ్యాండ్సమ్గా ఉండడంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది.కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఐడెంటిటీని మిస్సింగ్ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘మా పరిచయం బస్సులో జరిగింది. కాసేపు ఇద్దరం మాటలు కలిపాం. ఇంటికి వెళ్తావా? నాతో వస్తావా? అని ఆమెను అడిగా. ఆమె నాతో రావడానికి ఇష్టపడింది. నా ఇంట్లో ఏం మాట్లాడకుండా ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఉన్నట్లుండి ఆమె పడుకుని పోయింది... నాకేం చేయాలో పాలుపోలేదు. ఆమెను నిద్ర లేపేందుకు యత్నించా. కానీ, ఆమె లేవలేదు. నా చేతిలో ఉన్న కాయిన్ను ఎగరేశా. బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నా. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నా. ఆమె దురదృష్టం.. బొమ్మ పడింది. అందుకే ఆమెను చంపేశా. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. అది అలా జరిగిపోయిందంతే..!.. నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించినప్పుడల్లా నేను అలా కాయిన్ ఎగరేస్తుంటా. ఆరోజూ అలానే చేశా. బొమ్మ పడ్డాక.. ఆమె ఛాతీపై కూర్చుకున్నా. నా రూంలోని నైలాన్ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించా. ఊపిరాడక ఆమె విలవిలలాడింది. తిరిగి పోరాడలేని శక్తి ఆమెది. అప్పటికే ఆలస్యమై ఆమె ప్రాణం పోయింది. రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలని అనుకున్నా.. అలాగే చేశా. .. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె దుస్తులు తొలగించి అనుభవించా. ఆపై మళ్లీ దుస్తులు తొడిగి ఓ బ్యాగ్లో ఆమె శవాన్ని పార్శిల్ చేశా. ఒక దుప్పట్లో చుట్టేసి తగలేయాలని అనుకున్నా. కానీ, ఎందుకనో అలా చేయలేకపోయా!. అందుకే ఆ రాత్రి బయట పారేసి వచ్చా. ఆమెను చంపేశాక ఎందుకనో హాయిగా అనిపించింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, నా వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నా’’ అని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు.కేసు విచారణ పూర్తయ్యాక.. బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ.. దాడికి మృతురాలి స్నేహితులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడ్ని అక్కడి నుంచి తరలించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఆ విచారణలోనే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.పోలాండ్(Poland) నగరం కటోవీస్లో 2023లో జరిగిన దారుణ ఘటన ఇది. నిందితుడి పేరు మెటాయుజ్ హెపా(20). బాధితురాలి పేరు విక్టోరియా కోజిఎలెస్కా(18). దాదాపు నేరం జరిగిన ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. గ్లివిస్ కోర్టు ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ చర్చనీయాంశమైంది. -
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్గా కనిపించిందట. ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!) -
చంద్రబాబే కదా సిసలైన సైకో!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరచు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని సైకో పాలన అని, జగన్ సైకో అని దారుణమైన విమర్శలు చేస్తుంటారు. రాష్ట్రం నాశనం అయ్యిందని ప్రచారం చేస్తారు. వారికి డబ్బా కొట్టే ఎల్లో మీడియా ఉంది కనుక అదే పనిగా వాటిని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఎవరిని సైకో అనాలి?అసలు అలాంటి పదాలు వాడడమే తప్పు కదా!. అందులోను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా దిగజారుడుగా మాట్లాడడం అంటే తనను తాను కించపరచుకోవడమే. ఆయన(నారా చంద్రబాబు నాయుడు) పాలనను, జగన్ పాలనను విశ్లేషిస్తే ఎవరిది సైకో పాలనో అర్దం అవుతుంది. చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు , 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 కి ముందు పలు ఎన్ కౌంటర్లు జరిగాయి. బెంగుళూరులో పట్టుబడిన కొందరు నక్సల్ ప్రముఖులను జగిత్యాల ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేశారన్న ఆరోపణ కూడా వచ్చింది. ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిగాయి. ఈ మధ్య గద్దర్ సంతాప సభలో సోమన్న అనే గాయకుడు పాట పాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నయీం, నాగరాజు, సమ్మిరెడ్డి వంటి మాఫియాలను తయారు చేసింది చంద్రబాబేనని అతను ఆ పాటలో విమర్శించాడు. ఆ వీడియో వైరల్ అయింది.ఇలా పాలన చేసినవారిని కదా సైకో అనాల్సింది. విశేషం ఏమిటంటే ఆ తర్వాత గద్దర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు తన లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒకటే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అలాగైతే ఆయన హయాంలో అన్ని ఫేక్ ఎన్ కౌంటర్లు ఎందుకు జరిగాయన్నదానికి జవాబు దొరకదు. ✍️ అంతేకాదు.. 2014 తర్వాత చంద్రబాబు పాలనలో తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ ల పేరుతో తమిళ కూలీలు ఇరవై మందిని ఎన్ కౌంటర్ చేసిన చరిత్ర కూడా ఉంది. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఇవి నకిలీ ఎన్ కౌంటర్లని ప్రకటించి, సంబంధిత కూలీల కుటుంబాలకు పరిహారం ఇచ్చింది. ఇంతమందిని ఒకేసారి ఎన్ కౌంటర్ చేసినా ఒక్క పోలీసు అదికారిపై చర్య తీసుకోలేదు. వీటినే రాజ్య హింస అని గతంలో అనేవారు. ముఖ్యమంత్రిగా జగన్ బాద్యతలు చేపట్టిన తర్వాత ఒక్కటైనా ఎన్ కౌంటర్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయా?. మరి అలాంటప్పుడు ఆయన ఎలా సైకో అవుతారు?. అంటే చంద్రబాబు తన లక్షణాన్ని ఎదుటి వారికి ఆపాదిస్తారన్నమాట. ✍️ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎన్ని కార్యక్రమాలకు హాజరైనా ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు. ప్రజలు ఎక్కడ ఆపినా ఆగి వారి బాధలు విని సాధ్యమైన పరిష్కారాలు చూపుతుంటారు. అయినా ఆయనది సైకో పాలన అని చంద్రబాబు ఆరోపిస్తారు. మరి ఆయన సీఎంగా ఉండి గోదావరి పుష్కరాలకు వెళ్లి, సామాన్య భక్తుల ఘాట్ లో కుటుంబంతో స్నానమాచరించి, సినిమా తీయడం కోసం సామాన్యులను నిలువరించిన వైనం కదా సైకో పాలన అని అనిపించేది. అప్పట్లో ఈ పబ్లిసిటీ పిచ్చి వల్ల 29 మంది మరణిస్తే ఆయన ఏమన్నారు? కుంభమేళాలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో మృతి చెందడం లేదా? అని ఏ మాత్రం దయ లేకుండా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిని కదా సైకో భావజాలం అని అనాల్సింది. ✍️ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి ఎందుకు దేవాలయం వంటి ప్రదేశానికి వచ్చారని గదమాయించిన చంద్రబాబును ఏమంటారు! ప్రభుత్వం నడిపినప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉండి కూడా తన సభకు జనం బాగా వచ్చారని చెప్పుకోవడం కోసం ఇరుకు రోడ్లపై సభలు పెడుతున్నారు. అదే క్రమంలో కందుకూరులో ఎనిమిది మంది మరణిస్తే, అది పోలీసుల బాద్యత అని ఎదురు దబాయించారు. దానిని కదా సైకో తత్వం అనవలసింది. తన సభకు కానుకలు ఇస్తామని చెప్పడం, జనం ఎగబడి తొక్కిసలాటలో ముగ్గురు మరణించడాన్ని కదా సైకో శైలి అని అనవలసింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా అవమానించింది చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా! ఆయనను బలవంతంగా రాజమండ్రి ఆస్పత్రికి తరలించి ఎవరిని కలవకుండా చేయలేదా?ఆయన కుటుంబాన్ని నానా బూతులు తిట్టింది ఆయన పాలనలోని పోలీసులే కదా! దానిని కదా సైకో వ్యవహార శైలి అనవలసింది. ✍️ తుని వద్ద రైలు దగ్దం అయితే దానిని ఆర్పే పని మానేసి రాయలసీమ నుంచి, కడప నుంచి గూండాలు వచ్చారని మీడియా ముందుకు వచ్చి ఆరోపించడాన్ని ఏమంటారు. పద్దతైన పాలన అని అంటారా?. ఆ తర్వాత ఆ ప్రాంతం వారిని కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపువర్గం వారినే అరెస్టు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారని వారు ఆరోపించేవారు. దానిని ఏ తరహా పాలన అని అంటారు. కానీ, జగన్ ప్రభుత్వం వారిపై కేసులు ఎత్తివేస్తే అది సైకో పాలన అవుతుందా? సానుభూతితో వ్యవహరించినట్లా? అమరావతి రాజధాని పేరుతో వందలాది మంది రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకోవడం, ఇవ్వడానికి ఇష్టపడనివారిని, కోర్టులకు వెళ్లినవారిని ఎన్ని విదాలుగా కష్టాలు పెట్టింది తెలియదా?. దానిని కదా సైకో పాలన అని అనవలసింది. జగన్ పాలనలో ఆయనకు వ్యతిరేకంగా నిత్యం ఒక వంద మంది కూర్చుని ఆందోళన చేస్తున్నా ఎన్నడైనా వారిని అడ్డుకున్నారా?. రాజధానికి పొలాలు ఇవ్వనివారి పైర్లు తగులబెట్టించడమే కాకుండా, వైఎస్సార్సీపీ ప్రస్తుత ఎంపీ నందిగం సురేష్ను ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి నానా విధాలుగా హింసలు పెట్టించింది ఎవరు?. అప్పుడు ఆయన దళితుడుగా కనిపించలేదా?జగన్ పాలనలో అలా కావాలని ఎవరైనా చేశారా?ఒకవేళ ఎక్కడైనా పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నది జగన్ ప్రభుత్వం కాదా? ✍️ ఒక డాక్టర్ తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే అడ్డుపడి చేతులు వెనక్కి కట్టేస్తేనే ఇంకేముంది ‘దళిత డాక్టర్ ను హింసించారు ..’అంటూ చంద్రబాబు బృందం గోల చేస్తే, అప్పట్లో న్యాయస్థానం వారు దానిపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత రోజుల్లో అది ఏమైందో తెలియదు. కానీ, చంద్రబాబు టైమ్ లో జరిగిన ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణకు, సిబిఐ విచారణకు ఎందరు డిమాండ్ చేసినా, కోర్టుకు వెళ్లినా పెద్దగా ఫలితం లేకపోవడం కూడా ఆసక్తికరమైన అంశమే.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో హామీలు ఇచ్చి అమలుచేయనివారిని నడిరోడ్డుపై కాల్చాలని అన్నందుకు ఎంత పెద్ద గొడవ చేశారు. ఇంకేముంది .. ముఖ్యమంత్రిని పట్టుకుని అంత మాట అంటారా?అంటూ విపరీత ప్రచారం చేశారు. అలాంటి మాటలు చంద్రబాబు అంటే మాత్రం వాటిని కప్పిపెట్టేస్తారు. జగన్ తదుపరి కాలంలో ఎన్నడూ అలాంటి మాటలుమాట్లాడలేదు. కానీ.. ఇటీవలికాలంలోచంద్రబాబు ఇష్టం వచ్చినట్లు కార్యకర్తలను రెచ్చగొట్టి ‘‘తరమండిరా? నా... ’’అంటూ బూతులు మాట్లాడడం, అంతుచూస్తా.. అంటూ బెదిరించడమే కాకుండా, టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసు వాహనాలను దగ్దం చేస్తే, పోలీసులపై దాడి చేస్తే, ఒక కానిస్టేబుల్ కన్ను పోతే కనీసం సానుభూతి చెప్పని చంద్రబాబును ఏమనాలి? అలాంటివారిని కాదా సైకో అని అనవలసింది. జగన్ ఎప్పుడైనా అలా దురుసుగా వ్యవహరించారా?రెచ్చగొట్టారా?రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే గొడవలు సృష్టించాలనుకోవడం సైకోల పని అవుతుంది కాని, శాంతి భద్రతలు కాపాడే జగన్ ప్రభుత్వం సైకో పాలన ఎలా అవుతుంది.కేవలం ఏవో కొన్ని పిచ్చి డైలాగులు చెబుతూ ప్రజలను మభ్య పెడుతూ రాజకీయం చేయడం అన్నిటిని మించిన సైకోల పని అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా?. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాలీవుడ్ మూవీలో విలన్గా కరీంనగర్ కుర్రాడు.. ట్రైలర్ విడుదల
‘‘కాలా బార్ బేరియన్’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ప్రజ్ఞన్ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. ప్రజ్ఞన్, వరుణ్ సింగ్ రాజ్పుత్, స్థుతి చయనిక ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలా బార్ బేరియన్’(చాప్టర్ 1). జింటో చాకో శామ్యూల్ దర్శకత్వంలో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు హిందీ, తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. పరుపాటి శ్రీనివాస రెడ్డి ఈ మూవీని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఎన్. శంకర్ రిలీజ్ చేశారు ‘‘ఈ సినిమాలో ఒక సైకో, మల్టీ పర్సనాలిటీ... ఇలా చాలా వేరియషన్స్ ఉన్న పాత్రలు చేశాను’’ అన్నారు ప్రజ్ఞన్. ఇతను తెలంగాణలోని కరీంనగర్కు చెందిన కుర్రాడు. నటన మీద ఆసక్తితో పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. -
ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నగరంలోని పుట్టేనహళ్ళి పొలీస్ స్టేషన్ పరిధిలో నిహారిక అనే యువతి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాలు... స్థానికంగా ఉండే నిహారిక (25), కార్తీక్లు గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలు మాట్లాడుకుని ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఘనంగా పెళ్లి జరిపించారు. నిహారిక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పని చేస్తుండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త నిత్యం వేధింపులు కోటి ఆశలతో కాపురానికి వచ్చిన నిహారికకు భర్త, అత్తమామల నిజస్వరూపం కొద్దిరోజులకే అర్థమైంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ సైకో మాదిరిగా ప్రవర్తించేవాడు. అత్తమామలు కూడా అతనికే వంత పాడేవారు. దీంతో విరక్తి చెంది ఆదివారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పుట్టేనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపుల వల్లనే తమ బిడ్డ చనిపోయిందని నిహారిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
తిరుపతిలో సైకో హల్చల్.. అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని..
సాక్షి, తిరుపతి: నగరంలో ఓ సైకో అర్ధరాత్రి హల్చల్ చేశాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సైకో వీరంగం స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. కాగా, తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి పీఎస్ పరిధిలో శ్రీనగర్కాలనీలో ఓ సైకో అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని హల్చల్ చేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ నాలుగు ఇళ్ల తలుపులు, కిటికీలను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన ఫుటేజీ స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఇక, కొద్దిరోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న తరుణంలో ఇతను కూడా ఆ గ్యాంగ్కు చెందినవాడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసుల అదుపులో కీచక ఉపాధ్యాయుడు
-
విజయవాడ పడమట లో సైకో కలకలం
-
గుంటూరులో సైకో వీరంగం
గుంటూరు ఈస్ట్: కొరిటెపాడు పార్కు ఎదురుగా ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం వద్ద సైకో వీరంగం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరండల్పేట ఎస్హెచ్ఓ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం... సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ శివ మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం తిరుపతమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. తొలుత రెండు సీసీ కెమెరాలు పగుల కొడుతుండగా స్థానికులు గమనించి అడ్డుకోబోయారు. అయినా వారిని లెక్క చేయకుండా ఆలయం గేటు దూకి లోపలకు వెళ్లి చేతితో అద్దాలు పగులకొట్టాడు. గుడిలోని గంటలను ఊడపీకేందుకు ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన వారందరినీ కొడుతూ ఉన్మాదిలా కేకలు వేస్తూ నానా రభస చేశాడు. గర్భగుడి తలుపులను సైతం పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు. శివ చేతి నుంచి కారిన రక్తం గుడి గంటలకు , గోడలకు అంటుకుంది. అరండల్పేట ఎస్హెచ్ఓ నరేష్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గర్భగుడి తలుపులు బలవంతగా తెరిచేందుకు ప్రయత్నించిన శివను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇటీవల ఇదే ఆలయంలో హుండీని సైతం దొంగలు అపహరించారు. సీసీ కెమెరాలున్నా చోరీ వాటిలో రికార్డుకాకపోవడం విశేషం. చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. ఆ కుటుంబంపై కరోనా పడగనీడ -
తండ్రిని కొట్టి చంపిన తనయుడు
సోన్ (నిర్మల్): నడిరోడ్డుపై తండ్రిని బండరాయితో కొట్టి చంపాడో కొడుకు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లిలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. డీఎస్పీ ఉపేందర్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగని పెద్ద రాజన్న, లింగవ్వ దంపతుల రెండో కుమారుడు రవి వారం క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి తాను పంపిన డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం సోదరుడు రాజు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు రవిని పోలీసులు స్టేషన్కు తరలించి.. అర్ధరాత్రి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపై బండరాయితో కొట్టి చంపాడు. మృతదేహాన్ని తరలించే క్రమంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, సోదరుడిపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని రాత్రి వేళ పోలీస్స్టేషన్ నుంచి ఎందుకు పంపిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని డీఎస్పీ శాంతింపజేశారు. సైకోగా మారిన రవి రవి సైకో మారాడని గ్రామస్తులు పేర్కొన్నారు. వేధింపులు భరించలేక నాలుగేళ్ల క్రితం భార్య విడాకులు తీసుకుంది. మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన రవి.. అక్కడా సహచరులతో గొడవ పడేవాడని తెలిసింది. వారి ఫిర్యాదుతో రవిని వారం క్రితం కంపెనీ ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరుడితో గొడవ పడుతున్నాడు. మూడు రోజుల క్రితం తల్లి లింగవ్వపై కొడవలితో దాడి చేయగా.. చేతికి గాయమైంది. -
మద్యం మత్తులో సైకో వీరంగం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మధురవాడ, కొమ్మాదిలో గల అమరావతి కాలనీలో సైకో వీరంగం చేశాడు. స్థానిక మహిళ మీద కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన చుట్టుపక్కల వారిని భయాందోళనకు గురి చేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం బీ బ్లాక్ 19 లో ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం 10:30 గంటలకి అతడు, అతని స్నేహితునితో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో వారిలో వారికే గొడవలు మొదలయ్యాయి. అరుపులు రావడంతో ఆ బ్లాక్ లోని వారు తలుపులు బిగించుకుని భయం భయంగా గడిపారు. ఈలోగా ఆ ఇంటికి వచ్చిన వ్యక్తి మరొక మిత్రుడితో కలిసి కారులో పారిపోయాడు. మరో వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో సైకోలా ప్రవర్తించాడు. నాలుగు సంవత్సరాల చిన్నారిపై దాడి చేయబోయాడు. (చదవండి: బ్యాంక్లో సైకో వీరంగం) అటువైపు వెళ్తున్న టీ షాప్ యజమానురాలు లక్ష్మి ఆ దాడిని అడ్డుకోబోయింది. దాంతో సైకో ఆమెపై కూడా దాడి చేసి, మెడపై గాయాలు చేశాడు. ఒంటి మీద ఏవి లేకుండా, వింత వింతగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. స్థానిక ఏసీపీ రవిశంకర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశిలించారు. పీఎం పాలెం సీఐని కేసు దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు -
సైకో సందేశం
కార్తీక్ సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైకో’. అటు హీరోగా, ఇటు డైరెక్టర్గా ఇదే ఆయనకు తొలి చిత్రం. లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ కొత్త పాయింట్కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుంది. మా చిత్రం సమాజానికి ఓ కొత్త సందేశం ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలం’’ అన్నారు కార్తీక్ సాయి. డాలి షా, నేహా దేశ్పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్యన్, సంగీతం: సిద్దార్ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రియా, సంతోష్ కుమార్. -
సైకో స్వైర విహారం
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఒక వ్యక్తి సైకోలా వీరంగం చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. విచక్షణారహితంగా పలువురిపై దాడికి పాల్పడటంతో స్థానికులు కర్రలతో అతడిని కట్టడి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడు తంజావూరు నుంచి వచ్చిన కొందరు యువకులు పాలకొల్లులో జ్యూస్ సెంటర్ నడుపుతున్నారు. వారిలో ఒకడైన సులేన్ అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆదివారం మిత్రులతో గొడవ పడి జ్యూస్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు. యడ్లబజారు సెంటర్లోని కనకదుర్గమ్మ ఆలయంలోకి వెళ్లి శంభోశంకర అంటూ అరుచుకుంటూ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి అక్కడున్న వస్తువులను గిరాటు వేశాడు. ఇద్దరు భక్తులు, అర్చకునిపై దాడికి పాల్పడ్డాడు. అక్క డి నుంచి బయటకు వచ్చిన సులేన్ రోడ్డుపై వెళుతున్న పలువురిపై దాడులకు దిగాడు. అటుగా వచ్చిన కానిస్టేబుల్పై కూడా దాడి చేశాడు. రోడ్డుపై కనిపించిన వ్యక్తులను ఇష్టమొచ్చినట్లు కొడుతూ తన చేతులను కత్తితో చీరేసుకున్నాడు. ఎంఎంకేఎన్ఎం హైస్కూల్ వద్ద మరో వ్యక్తిపై పైసాచికంగా దాడి చేస్తుండగా స్థానికులు సులేన్ను కర్రలతో కట్టడి చేశారు. అనంతరం అతడిని తాళ్లతో నిర్బంధించి పోలీసుల సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సులేన్ మానసిక స్థితి సరిగా లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం సులేన్ను మిత్రులకు అప్పగించామని పోలీసులు చెప్పారు. -
బ్యాంక్లో సైకో వీరంగం
చాంద్రాయణగుట్ట: బ్యాంక్లోకి ప్రవేశించిన ఓ సైకో వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. శంషీర్గంజ్లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) లోకి గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిక్చావునీకి అల్లావుద్దీన్(40) ప్రవేశించి ఒక్కసారిగా కేకలు వేస్తూ తనకు తాను బ్లేడ్తో గాయపరుచుకున్నాడు. ఒక చేతిలో బ్లేడ్, మరో చేతిలో రాయి పట్టుకొని బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న శాలిబండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అల్లావుద్దీన్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను కూడా దగ్గర రానివ్వకుండా హంగామా సృష్టించాడు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించాడు. వారం రోజుల నుంచి ఇతడు వైట్నర్ సేవించి అలియాబాద్ ప్రధాన రహదారిపై తిరుగుతూ బ్లేడ్తో గాయం చేసుకోవడం, రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ చేస్తున్నాడని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పేర్కొన్నారు. బ్యాంక్లోకి కూడా తరచూ వస్తుండడంతో డబ్బులు విత్డ్రా చేసుకోవద్దని, అతడు లాక్కెలుతాడని ఏకంగా బ్యాంక్ అధికారులే తమకు సూచిస్తున్నారని ఖాతాదారులు వాపోయారు. -
సికింద్రాబాద్లో సైకో ఉన్మాదం
-
నగరంలో సైకో ఉన్మాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సైకో వీరంగ సృష్టించాడు. సిక్రింద్రాబాద్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై బలమైన కర్రతో దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడే రోడ్డుపై పడిపోయాడు. రోడ్డుపై కిందపడ్డా ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు. సైకో దాడిని గమనించిన అక్కడివారు అతడ్నిపట్టుకునే ప్రయత్నం చేసే లోపు పరారయ్యాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కొద్దిసేపటి క్రితం సైకోను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని నర్సిరెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం నర్సిరెడ్డి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘ఇళయరాజా నాకు తల్లి,తండ్రి’
తన చిత్రాలు కత్తిపై నడకలానే ఉంటాయి అని దర్శకుడు మిష్కిన్ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దర్శకులు చిత్రాలకు భిన్నంగానే ఈయన చిత్రాలు ఉంటాయి. అంతేకాదు మిష్కన్ మాటలు, చేతలు అలానే ఉంటాయి. తొలి నుంచి తనదైన శైలితోనే చిత్రాలు తెరకెకిక్కస్తున్న ఈయన ఆ మధ్య పిశాచు, తుప్పరివాలన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటి నిత్యామీనన్, అదితిరావ్ నాయికలుగా తెరకెక్కించిన చిత్రం సైకో. ఈ చిత్రం ప్రారంభం నుంచి విడుదలకు ముందు, ఆ తరువాత కూడా సంచలనంగా మారింది. సైకో చిత్రం గత నెల 24న తెరపైకి వచ్చింది. అయితే చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందననే వస్తోంది. ఉదయనిది స్టాలిన్తో మిష్కిన్ కానీ టాక్కు సంబంధం లేకుండా థియేటర్లలో రెండో వారంలోకి చేరుకుంది. సాధారణంగా ఒక వారం పూర్తిగా చిత్రం థియేటర్లలో ఉంటేనే సక్సెస్ అనుకుంటున్న రోజులివి. కాబట్టి సైకో చిత్ర యూనిట్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని శుక్రవారం మీడియాతో పంచుకున్నారు కూడా. స్థానిక ప్రసాద్ల్యాబ్లో సైకో చిత్ర సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ సంగీతదర్శకుడు ఇళయరాజా తనకు తల్లిదండ్రులు మాదిరని అన్నారు. ఆయన అందించిన సంగీతం, పాటలు సైకో చిత్ర విజయానికి కారణంగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే సైకో చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటుడు ఉదయనిదిస్టాలిన్ను తన తల్లి కడుపున పుట్టిన తన తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే తాను ఆయన చిత్రాలేవీ చూడలేదన్నారు. సైకో 2 చిత్రం చేస్తారా? అని అడుగుతున్నారని, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉదయనిధిస్టాలిన్ తనతో చిత్రం చేయమని కోరితే చేయడానికి సిద్ధం అని అన్నారు. ఇకపోతే సైకో చిత్రం గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయని, అయితే ఇది చెడ్డ చిత్రం కాదని అన్నారు. తన చిత్రాలన్నీ కత్తిపై నడిచినట్లే ఉంటాయన్నారు. చదవండి: అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’ -
సైకో వీరంగం.. గాజు ముక్కలతో..
సాక్షి, అనంతపురం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ సైకో వీరంగం సృష్టించారు. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకుంటూ హల్ చల్ చేశాడు. బస్టాండ్లో సెల్ఫోన్లు చోరీ చేస్తూ పట్టుబడ్డ నాని అనే సైకోను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని ఆర్టీసీ బస్టాండ్లోని అవుట్ పోస్ట్కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన నాని.. అవుట్ పోస్ట్లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులను దుర్భాషలాడుతూ.. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ పోలీసులపై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం సృష్టించాడు. బస్సులోని మహిళ కండక్టర్పై దాడికి యత్నించడమే కాకుండా, ఒక ప్రయణికున్ని కూడా గాయపరిచాడు. జిల్లాలోని దమ్మపేట మండలం మండలపల్లి, ముష్టిబండా మధ్య ఈ ఘటన చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట రింగ్రోడ్డు వద్ద బస్సు ఎక్కిన సైకో.. సత్తుపల్లికి టికెట్ ఇవ్వమని కండక్టర్ను అడిగాడు. అందుకు కండక్టర్ డబ్బులు అడగ్గా.. డబ్బులు లేవని చెప్పి దాడికి యత్నించాడని ప్రయాణికులు చెబుతున్నారు. పైగా కత్తితో బెదిరిస్తూ హల్చల్ చేసిన సైకో.. కొద్దిసేపటికే బస్సు దిగి పారిపోయాడు. తర్వాత సైకోను వెంబడించిన ప్రయాణికులు అక్కడికి దగ్గర్లోని మామిడి తోటలో సైకోను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న రాజుకు స్వల్ప గాయలైనట్టు గా తెలుస్తోంది. -
విజయవాడలో సైకో వీరంగం
సాక్షి, విజయవాడ : నగరంలోని పంజా సెంటర్ వద్ద సైకో వీరంగం సృష్టించాడు. ఆ ప్రాంతంలో రెచ్చిపోయిన సైకో మనుషులపై కర్రలతో, సీసాలతో దాడికి యత్నించారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సైకోను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల రాకను చూసిన సైకో అక్కడే ఎదురుగా ఉన్న అండర్ డ్రైనేజీలోకి వెళ్లి దాక్కున్నాడు. దీంతో సైకోను బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. -
హత్య చేశా..దమ్ముంటే పట్టుకో
కర్ణాటక, కృష్ణరాజపురం: పోలీస్స్టేషన్లోని ల్యాండ్లైన్ ఫోన్కు కాల్ చేసి మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్న వ్యక్తిని సోమవారం బాగలకుంటె పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చిన రమేశ్ అనే వ్య క్తి చాలాకాలంగా బాగల్కుంటెలో ఉం టున్నాడు. మూడు నెలలుగా అక్కడి ల్యాండ్లైన్కు ఫోన్ చేయడం, ఫోన్ తీసిన మహిళా కానిస్టేబుల్తో అసభ్యంగా మాట్లాడడం పనిగా పెట్టుకున్నారు. హత్య చేశాను, వచ్చి అరెస్ట్ చేయం డి, అత్యాచారం చేశాను, దమ్మంటే పట్టుకోండి, ఒక్కోసారి నాకు సహక రించు..అని అతడు సైకో మాదిరిగా మహిళా పోలీస్ను సతాయిస్తున్నా డు.రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో పోలీసులు అతని ఫో న్ నంబర్, టవర్ లొకేషన్ ఆధారంగా రమేశ్ను గుర్తించి అరెస్ట్ చేశారు. -
ప్రేమించలేదని టెన్త్ బాలిక నరికివేత
అభంశుభం తెలియని పదో తరగతి బాలిక ప్రేమోన్మాది కొడవలికి బలైంది. బాలిక తనతో మాట్లాడడం లేదని, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్న ఓ యువకుడు వెంటాడి ప్రాణాలు తీశాడు. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా దాడి చోటుచేసుకుంది. కర్ణాటక, దొడ్డబళ్లాపురం: బాలికను ఓ సైకో పట్టపగలు నడిరోడ్డుమీద తెగనరికి చంపాడు. తన ప్రేమను కాదన్నందుకు అమాయకపు బాలికను నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నాడు. బ్యాగ్ తగిలించుకుని ఉత్సాహంగా పాఠశాలకు బయలుదేరిన ముద్దుల కూతురు దారుణ హత్యకు గురైందని తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘోర విషాదం దొడ్డ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఎలా జరిగిందంటే.. పట్టణ శివారులోని బసవేశ్వర నగర్లో నివసిస్తున్న నందీశ, లలిత దంపతుల రెండవ కూతురు కీర్తన (15) హత్యకు గురైన చిన్నారి. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న గార పని చేసే నవీన్ (28) ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కీర్తన పట్టణంలోని బీఎస్ఏ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి ఇంటికి సమీపంలోనే టీకొట్టు నడుపుకుంటూ ముగ్గురు కూతుర్లను చదివిస్తున్నాడు. బుధవారం ఉదయం 8–30 సమయంలోకీర్తన పాఠశాలకు బయలుదేరింది. అక్కడే కాపు కాసిన నవీన్.. కొడవలితో బాలికను తీవ్రంగా నరికాడు. కీర్తన అక్కడే కుప్పకూలి ప్రాణం వదిలింది. దుండగున్ని అడ్డుకోబోయిన స్థానికులను నవీన్ కొడవలితో బెదిరించాడట. పెళ్లి చేయాలని ఒత్తిళ్లు కీర్తన అక్క వైశాలి, హంతకుడు నవీన్ తమ్ముడు ప్రవీణ్కుమార్ ఏడాది క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. అలా ఇరు కుటుంబాలకు బంధుత్వం ఏర్పడింది. తరచూ కీర్తన ఇంటికి వచ్చే నవీన్ బాలికలను తనకిచ్చి వివాహం చేయాలని వారిని ఒత్తిడి చేసేవాడు. అతడు చెడు వ్యసనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతుండడంతో కీర్తన తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. అయినా అతడు బాలికను పాఠశాలకు వెళ్లేసమ యంలో వెంటాడి వేధించేవాడు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని స్థానికులు కొన్నిసార్లు దేహశుద్ధి చేశారు. ఒకసారి పోలీస్స్టేషన్కు కూడా పిలిపించి వార్నింగ్లు ఇప్పించారు. అతని వ్యవహారాలు తెలిసి బాలిక కూడా ఇష్టపడేది కాదు. దీంతో కసి పెంచుకున్నారు. విషం తాగినట్టు డ్రామా హత్య చేసిన నవీన్ బసవ భవనం వద్దకు వెళ్లి (ఇంటికి సమీపంలోనే) విషం తాగినట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.కుటుంబ సభ్యులు వచ్చేసరికి నవీన్ సొమ్మసిల్లి పడిపోయినట్టు నటించాడు. తక్షణం అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పోలీసులు చికిత్స చేసి ప్రమాదమేమీ లేదని తేల్చిచెప్పారు. పోలీసులు ఆ మృగాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాకుళంలో సైకో వీరంగం
సాక్షి, శ్రీకాకుళం : పట్టణంలోని డీసీసీబీ కాలనీలో సైకో వీరంగం సృష్టించాడు. విజయ విహారి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కె. సత్యనారాయణ అనే వ్యక్తి ఇరుగుపొరుగు వారిని కత్తులతో బెదిరిస్తూ ఉన్మాదిలా ప్రవర్తించాడు. దీంతో కొంతమంది స్థానిక యువకులు అతడిని పట్టుకుని చేతులు కట్టేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సత్యనారాయణ నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా భార్యా, తల్లిదండ్రులు తనను విడిచి పెట్టారన్న మనస్తాపంతో మద్యం మత్తులో అలా ప్రవర్తించానని సత్యనారాయణ పోలీసులకు తెలిపాడు. -
అదితీ సైకో!
ఈ రోజు ఓ ముగ్గరి కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది. అందులో ఒకరు ‘సైకో’. మరి ఆ సైకో పర్సన్ నుంచి మిగతా వారు ఎలా తప్పించుకున్నారు అనేది తెలియాలంటే బోలెడంత టైమ్ ఉంది. ‘డిటñ క్టివ్’ ఫేమ్ మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సైకో’. ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావ్ హైదరీ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ‘‘తమిళంలో ‘సైకో’ చిత్రంలో నటిస్తున్నాను అని చెప్పడానికి ఆనందంగా ఉంది. మంచి టీమ్ కుదిరింది’’ అని పేర్కొన్నారు అదితి. ‘‘సైకో’ టైటిల్ లోగో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శుక్రవారం నుంచి షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు ఉదయ్. ఇందులో సైకో ఎవరంటే అదితీరావ్ అని కోలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో అదితీ రావ్ చేస్తోన్న ‘అంతరిక్షం 9000 కీమీ’ డిసెంబర్ 21 రిలీజ్ కానుంది. -
ఇద్దరు అందాల భామలతో ‘సైకో’
సాక్షి, తమిళ సినిమా : ఇద్దరు అందాలభామలతో కలిసి ఆడిపాడేందుకు ‘సైకో’ సిద్ధమవుతున్నడు. ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు మిష్కిన్ ‘సైకో’ తెరకెక్కిస్తుండగా.. దీనికి మేస్ట్రా ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయనిధికి జోడీగా ఇద్దరు నటించబోతున్నారు. మణిరత్నం కంపెనీ హీరోయిన్గా ముద్రపడిన అదితిరావ్ హైదరి, సంచలన నటి నిత్యామీనన్లే ఉదయనిధితో రొమాన్స్ చేయనున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్. ఇటీవల తుప్పరివాలన్ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ మధ్య పిశాచి అనే థ్రిల్లర్ కథను సక్సెస్ఫుల్గా తెరకెక్కించారు. సవరకత్తి అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇతివృత్తంతో సినిమా రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సైకో అంటూ భయ పెట్టడానికి మిష్కిన్ రెడీ అవుతున్నారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్ జంటగా అదితిరావ్ హైదరి, నిత్యామీనన్ను ఎంచుకున్నారు. మరో దర్శకుడు రామ్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ. శ్రీరామ్, ఇళయరాజా పనితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్మొళి మాణిక్యం నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ సాధారణ చిత్రాలకు భిన్నంగా మంచి క్లాసికల్ చిత్రాలు చేయడంలో దర్శకుడు మిష్కిన్ దిట్ట అన్నారు. అదే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలన్నది తెలిసిన దర్శకుడాయన అని పేర్కొన్నారు. సైకో చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత అరుణ్మొళి మాణిక్యం తెలిపారు. చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుందని చెప్పారు. -
డేంజరస్ మ్యాన్ ఎట్టకేలకు దొరికాడు!
టిరానా : తన బంధువుల కుటుంబంలోని 8 మందిని దారుణహత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతడు సైకోలా మారి ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హత్యల ఉదంతం అల్బేనియాలో ఇటీవల చోటుచేసుకుంది. రిడ్వాన్ జైకాజ్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన బంధువుల కుటుంబంపై పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో రాజధాని టిరానాకు 90 కిలోమీటర్ల దూరంలోని రెస్యూలాజ్ అనే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి ఏకే-47తో వెళ్లాడు. ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయి తన తాతను ఆపై ఆమె భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఆ ఫ్యామిలోని మరో ఆరుగురు సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ నిందితుడి చేతిలో హత్యకు గురైన వారిలో 9 ఏళ్ల చిన్నారి, ఓ టీనేజీ బాలిక సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిడ్వాన్ జైకాజ్ ఫొటోను చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతడు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 24 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు ఆ కరడుగట్టిన నిందితుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై ప్రశ్నిస్తున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
దొడ్డబళ్లాపురం: తనను ప్రేమించలేదని కసి పెంచుకున్న యువకుడు ఉన్మాదిగా మారాడు. బాధిత యువతి తన చెల్లెలితో కలిసి ఆటోలో వెళ్తుండగా వాహనంతో ఢీకొని తర్వాత ఆ ఇద్దరిపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళ్తంగడి తాలూకా గండిబాగిలు గ్రామం వద్ద చోటుచేసుకుంది. థామస్ అనే యువకుడు కొంతకాలంగా ఓ యువతి వెంటపడి తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. అయితే ఆ యువతి తిరస్కరిస్తూ వస్తోంది. ఈక్రమంలో సదరు యువతి చెల్లెలతో కలిసి అణెయూరు నుంచి గండిబాగిలు గ్రామానికి ఆటోలో వెళ్తుండగా థామస్ గమనించాడు. తన పికప్ వాహనంలో కొంతదూరం వెంబడించాడు. ఆటో నిర్జనప్రదేశానికి చేరుకున్నాక వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా కొట్టించాడు. ఈ సంఘటనతో ఆటో డ్రైవర్ నిశ్చేశ్టుడయ్యాడు. థామస్ ఒక్కసారిగా యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకోబోయిన యువతి చెల్లెలిపై కూడా అత్యాచారానికి యత్నించాడు. ఎట్టకేలకు యువతి, ఆమె చెల్లెలు అతనిబారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు థామస్ను అరెస్ట్ చేశారు. -
అర్ధరాత్రి సైకో హల్చల్..
సాక్షి. నెల్లూరు: నగరంలోని బొడిగాడి తోట రోడ్డు వద్ద ఓ సైకో హల్చల్ చేశాడు. గురువారం అర్ధరాత్రి ఎవరూలేని సమయంలో ఓ ఇంట్లోకి చోరబడి వీరంగం సృష్టించాడు. అది గమనించిన స్థానికులు సైకోని పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. -
నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం
-
సైకో వీరంగం
కోసిగి: ఉపాధ్యాయుడిని చంపుతానంటూ అగసనూరులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. చివరకు గ్రామస్తులంతా కలిసి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం మేరకు..గ్రామానికి చెందిన రాముడు నిత్యం మద్యం సేవించి అందరినీ బెదిరించేవాడు. చివరకు ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములను కూడా కొడుతుండడంతో వారు గ్రామం విడిచివెళ్లారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం పాఠశాల వదిలిన సమయంలో సైకో పూటుగా మద్యం తాగి పాఠశాల ప్రహరీ బండలను వేటకొడవలితో పగులగొడుతుండగా ఉపాధ్యాయుడు శరత్ అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన రాముడు ఉపాధ్యాయుడి గొంతుపై వేటకొడవలి పెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఉపాధ్యాయుడు అతడి నుంచి తప్పించుకుని వెంటనే తరగతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఉపాధ్యాయుడు గ్రామంలోని యువకులకు ఫోన్ చేయడంతో వారంతా వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసుకున్నట్లు ఏఎస్ఐ ఫజిల్ఖాన్ తెలిపారు. -
సైకో భయం!
కొడవలూరు: కోవూరులో సంచలనం సృష్టించిన సైకో భయం ఇప్పటికీ వీడలేదు. మతిస్థిమితం లేని వ్యక్తిని సైకోగా భావించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటన మండలంలోని గుండాలమ్మపాళెం గాంధీ గిరిజన కాలనీలో గురువారం చోటుచేసుకొంది. కాలనీలో మహిళలు దుస్తులు ఉతుక్కొంటుండగా వారున్నచోటుకు ఓ మతిస్థిమితం లేని యువకుడు వెళ్లి హిందీలో బెదిరించినట్లు మాట్లాడాడు. మహిళలు భయాందోళనకు గురై సైకో అంటూ కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ యువకుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి అక్కడే కట్టేశారు. నంబర్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ సమాచారం తెలుసుకున్న దగదర్తి ఎస్సై విజయకుమార్ స్థానిక పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి చేతిలో బ్లేడు కూడా ఉందని మహిళలు తెలియజేయడంతో యువకుడ్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. ఎలాంటి ఆయుధాలు లేకపోగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుండటంతో స్టేషన్కు తరలించి వివరాలు రాబట్టేందుకు యత్నించారు. హిందీలో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడే తప్ప పేరు కూడా చెప్పలేకపోయాడు. దీంతో ఇతర రాష్ట్రానికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. స్థానికులు చితకబాదడంతో యువకుడికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆ యువకుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. కోవూరులో అలజడి సృష్టించిన సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం ఉన్నా పోలీసు వర్గాలు అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో సైకో భయం ప్రజలను వీడలేదు. రోజూ ఏదోఒక చోట సైకో పేరుతో మద్యంప్రియులు, మతిస్థిమితం లేని వ్యక్తులను ఆయా ప్రాంతాలవారు చితకబాదుతూనే ఉన్నారు. -
సైకో కిల్లర్ ఆటో శంకర్ ఆత్మహత్య
-
కర్నూలులో సైకో వీరంగం
కర్నూలు (హాస్పిటల్): తల్లి మరణంతో విషాదంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను మద్యానికి డబ్బులు అడిగాడు. వారు ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయిన ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇద్దరిపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలులో గురువారం ఈ ఘటన జరిగింది. దళితపేటకు చెందిన రవికొండలరావు, అతడి బావమరిది సెంట్రింగ్ బాబూరావు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రవికొండలరావు తల్లి లింగాయమ్మ అనారోగ్యంతో గురువారం ఉదయం చనిపోయారు. ఆమె అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఎదురింటిలో నివసించే యుగంధర్బాబు అనే వ్యక్తి వచ్చి మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని రవికొండలరావును అడిగాడు. బాధలో తాముంటే మధ్యలో నీ గొడవేందంటూ పంపించేశారు. దీంతో యుగంధర్బాబు అసహనంతో ఇంట్లోకి వెళ్లి వేటకొడవలి తీసుకొచ్చి ఒక్కసారిగా రవికొండలరావుపై దాడి చేశాడు. దీంతో అక్కడున్నవారు నిర్ఘాంతపోయి పరుగులు తీశారు. అడ్డుకోబోయిన బాబూరావుపై కూడా సైకో దాడి చేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి కత్తితో గొంతుకోసుకున్నాడు. వెంటనే స్థానికులు వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవికొండలరావు, బాబూరావులకు చెవి, చెంపలపై గాయాలు కాగా, యుగంధర్బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. -
ఉన్మాదిని కాల్చి చంపిన పోలీసులు.. ఎందుకు?
-
ఉన్మాదిని కాల్చి చంపిన పోలీసులు.. ఎందుకు?
సాక్షి, మాస్కో: రష్యాలో సుర్గుత నగరంలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. రోడ్డుపై నడిచివెళ్తున్నవారిపై కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా ఎనిమిది మందిని పౌరులను గాయ పరిచాడు. అడ్డుకోపోయిన పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి అదుపు తప్పతోందని భావించిన పోలీసులు నిందితుడిని కాల్చిచంపారు. ఈ సంఘటన రాజధాని మాస్కోకు సుమారు 2100 కిలోమీటర్ల దూరం ఉన్న చైన్మన్సీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 11.20 గంటల సమయంలో నగరం రద్దీగా ఉన్నవేళ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రయాణికులపై దాడులకు పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఎదరుదాడికి దిగాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు ఇన్వెస్టిగేషన్ కమిటీ ఉన్నాధికారులు తెలిపారు. నిందితుడు దాడి చేసిన వారిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది. మరో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలిని పిలుపునిచ్చింది, సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకూ దేశ పౌరులు, మీడియా సహకరించాలని కోరింది. -
ఆ టీవీ నటి సైకో: మాజీ ప్రియుడు
లాస్ ఏంజిల్స్: బ్రిటన్ టీవీ రియాలిటీ స్టార్ క్లోహి ఫెరీపై ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ మండిపడ్డాడు. క్లోహి పచ్చి సైకో అని, ఆమెతో తాను గడిపిన ఆరు నెలల్లో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఎంటీవీ ’జార్డీ షోర్’ షోతో ఫేమస్ అయిన క్లోహి ఫెరీ తాజాగా తన మాజీ ప్రియుడు సామ్ స్కాట్ను ఫేస్ చేయబోతున్నది. ’ఎక్స్ ఆన్ ద బీచ్’ షోలో భాగంగా ఈ ఇద్దరు ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా స్కాట్ మాట్లాడుతూ ’నా మాజీ ప్రియురాలు పూర్తి సైకో. ఆమెతో ఆరు నెలల నా అనుబంధం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మార్టి మెక్కెన్నాతో ఆమె సన్నిహితంగా గడుపడంతో ఇక మా అనుబంధం కొనసాగించడం కష్టంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. ’జార్డీ షోర్’ షోలో ఉండగా క్లోహి ఫెరీస్ మెక్కెన్నాతో సాన్నిహిత్యం నెరిపింది. మెక్కెన్నాతో గడుపడమే కాకుండా మాజీ ప్రియులతోనూ సన్నిహితంగా ఉండటంతోనే ఆమెతో బ్రేకప్ చేసుకున్నానని స్కాట్ చెప్పాడు. -
నెల్లూరులో సైకో హల్చల్
-
సైకో వీరంగం
– కత్తి చేతపట్టుకుని, రాళ్లు విసురుతూ వీరంగం – నాలుగు గంటలపాటు ఉద్రిక్తత – అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు చింతకుంట (ఆళ్లగడ్డ): నగర పంచాయతీ పరిధిలోని చింతకుంట గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామానికి చెందిన పుల్లిగాల్ల మహమ్మద్వలికి మానసిక స్థితి సరిగా లేదు. దీంతో గత కొంత కాలం క్రితం భార్య, పిల్లలు అతడిని వదిలి వెళ్లి పోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే గ్రామంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజాము నుంచి మహమ్మద్వలి మానసిక పరిస్థితి అదుపు తప్పి సైకోగా మారాడు. చేతిలో కత్తి పట్టుకుని వీధుల్లో తిరుగుతూ గ్రామస్తులపై రాళ్లు రువ్వుతూ, బూతులు తిడుతూ దాడి చేసెందుకు వెంట పడ్డాడు. ప్రజలు భయపడి ఇంటికి తలుపులు వేసుకున్నారు. పని మీద బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డారు. ఈ క్రమంలో ఐదారు మందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి యత్నించాడు. దాదాపు నాలుగు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సైకోను కోర్టు అనుమతితో మెంటల్ ఆసుపత్రికి తరలిస్తామని ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. -
సైకో.. దెబ్బకు రైల్ రోకో
గుంతకల్లు: ఓ సైకో తన విపరీత చేష్టలతో రైల్వే పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని చేష్టల కారణంగా గుంతకల్లు రైల్వే జంక్షన్ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సికింద్రాబాద్ నుం చి బయల్దేరిన ప్యాసింజర్ రైలు మంగళవారం రాత్రి 10.30 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరింది.ఈ రైలును యార్డులో క్లీనింగ్ నిమిత్తం నిలిపారు. బోగీలు, బాత్రూంలను శుభ్రపరచడానికి వెళ్లిన క్లీనింగ్ బాయ్స్ ఓబోగీలోని బాత్రూం లోపలివైపున గడియ వేసుకొని ఓ వ్యక్తి కేకలు పెడుతుండటాన్ని గుర్తించారు. అతని చేతిలో ఇనుపరాడ్, కత్తి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచా రమిచ్చారు. వారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సైకో ఉన్న లావెట్రీ తలుపులు తీయడానికి ప్రయత్నించారు. స్పందన రాలేదు. దీంతో పోలీసులు కిటికీ వద్దకు చేరుకొని అతని వివరాలు ఆరా తీశారు. తన పేరు నరసింహ అని, సికింద్రాబాద్లోని కొత్తపేట అని చెప్పాడు. బుధవారం ఉదయం కూడా అదే పరిస్థితి ఉండడంతో చివరకు ఓ పోలీసును బోగీ వద్ద కాపలా ఉంచి వెళ్లిపోయారు. అతనికి ఆకలిగా ఉందని చెప్పడంతో టిఫిన్ తీసుకొచ్చి కిటికీలో నుంచి సైకోకు అందించాడు. టిఫిన్ తిన్నాక... కానిస్టేబుల్ ఒక్కరే ఉన్నారని గుర్తించిన సైకో బాత్రూమ్ తలుపు తీసుకొని బయటికి వచ్చాడు. అప్పటికే బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఎక్కి ఉడాయించాడు. -
హడలెత్తిస్తున్న సైకో
రాజరాజేశ్వరినగర్లో భయం భయం ఎఫ్బీలో హెచ్చరికలు బనశంకరి : కామాంధుడు ఉమేశ్ రెడ్డి పోలికలతో ఉన్న ఓ సైకో ఇక్కడి రాజరాజేశ్వరి నగరలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆరు నెలలుగా మహిళలను టార్గెట్ చేసుకుని అర్ధరాత్రి వేళలల్లో ఇళ్లల్లోని కిటికిల్లో నుంచి బెడ్రూమ్లు, బాత్రూమ్ దృశ్యాలను వీక్షించడం పనిగా పెట్టుకున్నాడు. ఇది కేవలం వదంతులు కావు అంటూ ఫేస్బుక్లో రాజరాజేశ్వరీ నగర ప్రజలకు ఎదురైన అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులను హెచ్చరిస్తున్నారు. ‘ అందరికి హాయ్.. రాజరాజేశ్వరినగర ప్రజలకు ఓ హెచ్చరిక సందేశం. బీఈఎమ్ఎల్ 5వ స్టేజ్ న్యూహారిజన్ వద్ద సైకో ఒకరు కనబడ్డాడని, ఈ ఏరియాలో అన్ని ఇళ్లల్లోకి చొరబడ్డారని బెడ్రూమ్, వాష్రూమ్ల్లో మహిళలను చూడటం ఇతని పనిగా మారింది. అర్ధరాత్రి 11 నుంచి 2 గంటల మధ్య ఇళ్లల్లోకి చొరబడుతారని, పట్టుకోవడానికియతి్నంచినప్పటికి సాధ్యం కాలేదు. ఇతడు కాంపౌండ్ గోడల నుంచి దూకడం, పారిపోవడంలో సిద్ధహస్తుడు. ప్రమాదకరంగా మారిన ఇతని సీసీటీవీ ఫుటేజీనికూడా అటాచ్ చేశాము, మీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వండి అంటూ సందేశాలను ఎఫ్బీలో పోస్టు చేస్తున్నారు. ఈ విషయం కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా రాజరాజేశ్వరినగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాత్రిసమయంలో గస్తీని పెంచి అనుమానస్పద వ్యక్తులను విచారణ చేస్తున్నారు. కాని సైకోమాత్రం మళ్లీ, మళ్లీ ఇదే ఏరియాలో కనబడి మహిళలను హడలెత్తిస్తున్నాడు. పోలీసులు ఇతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
గుళ్లదూర్తిలో సైకో వీరంగం
– పైర్లు, కుళాయిలు, మోటార్లు ధ్వంసం – చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు కోవెలకుంట్ల: మండలంలోని గుళ్లదూర్తిలో గురువారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన పుల్లయ్య, పుల్లమ్మ పదేళ్ల క్రితం గ్రామంలో స్థిరపడి రైతుల వద్ద వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరి కుమారుడు రమేష్ టిప్పర్ డ్రైవర్గా పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం నుంచి ఈ యువకుడికి మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో పుల్లయ్య కుటుంబం గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి రమేష్ గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. మినరల్ వాటర్ప్లాంట్ పైపులు, కుళాయిలు, వ్యవసాయ మోట్లార్లు, ట్రాక్టర్ పరికరాలు పగులగొట్టడంతోపాటు రైతులు సాగుచేసిన మిరప, పత్తి, తదితర పైర్లను నాశనం చేశాడు. సైకో తిరుగుతున్నాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఓ పొలంలో పత్తిమొక్కలు పీకేస్తుండగా చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి నుంచి విడిపించుకునేందుకు విశ్వప్రయత్నం చేయగా గ్రామస్తులు ముందు జాగ్రత్తతో తాడుతో రెండు చేతుల బంధించి బస్టాఫ్ సమీపంలో చెట్టుకు కట్టేశారు. గ్రామంలో రమేష్ సృష్టించిన బీభత్సాన్ని పోలీసులకు తెలియజేశారు. -
ఎస్ఐ హోంగార్డుపై సైకో దాడి
-
సైకో బీభత్సం..ప్రజల దేహశుద్ధి
-
ఉన్మాది బీభత్సం.. ప్రజల దేహశుద్ధి
► విశాఖలో ఏడుగురిని కత్తి, బ్లేడుతో గాయపరిచిన సైకో ► కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులతో ప్రజలను భయభ్రాంతులను చేసిన ఉన్మాదికి దేహశుద్ధి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. వివరాలు.. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతంలో బిహార్కు చెందిన ఓ ఉన్మాది (సైకో) శుక్రవారం రాత్రి స్థానిక ప్రజలపై చిన్నపాటి కత్తి, బ్లేడుతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. ఐటీఐ కూడలి నుంచి కంచరపాలెం ఫ్లైఓవర్ వంతెన కూడలి వరకు ఏడుగురికి గాయాలు పడేలా కత్తులతో పొడుచుకుంటూ వీరంగం సృష్టిం చాడు. దీంతో ప్రజలు తలోదిక్కు పారిపోయారు. వారిని తరుముకుంటూ కంచరపాలెం మెట్టు వరకూ వెళ్లిన ఉన్మాదిపై స్థానిక ప్రజలు, పాదచారులు, వాహనదారులు కర్రలతో దాడి చేశారు. దీంతో ఉన్మాది స్పృహతప్పి కుప్పకూలి పోయాడు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదో పట్టణ, ఎయిర్పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న అతనిని 108 లో కేజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్మాది మృతి చెందాడు. -
సైకో వీరంగం.. 8 మందికి గాయాలు
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఓ సైకో వీరంగం చేశాడు. జిల్లాలోని కంచరపాలెంలో చేతిలో కత్తితో సైకో వీర విహారం చేస్తూ.. శుక్రవారం చాలా మందిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైకో దాడికి పాల్పడటంతో దాదాపు ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన కంచరపాలెం గ్రామస్తులు సైకో గురించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సైకోను అదుపులోకి తీసుని విచారణ చేస్తున్నారు. అతడి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడా.. లేక అతడు నిజంగానే సైకోనా అని అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెరియపాలెంలో బాలుడి హత్య
గుమ్మిడిపూండి: సైకో చేతిలో బాలుడు హత్యకు గురైన సంఘటన గురువారం పెరియపాలెంలో జరిగింది. పెరియపాలెం సమీపంలోని అవాంజివాక్కం గ్రామానికి చెందిన మురుగన్ కుమారుడు హేమనాథ్కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. బుధవారం రాత్రి మురుగన్ ఇంట్లో నిద్రపోయారు. ఇదిలాఉండగా అర్ధరాత్రి సమయంలో లేచిన మురుగన్కు పక్కనే పడుకున్న కుమారుడు హేమనాథ్ కనపడలేదు. దీంతో ఆయన చుట్టుపక్కల వారి సహాయంతో వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోవడంతో బంధువుల అబ్బాయి తమిళ సెల్వన్పై అనుమానం వచ్చి విచారించారు. ఇందులో తానే హత్య చేసి ఇంటి వెనుక భాగంలోని మరుగుదొడ్డి గుంటలో పడ వేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పెరియపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం నేరం ఒప్పుకున్న తమిళసెల్వన్ను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తమిళసెల్వన్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అంతకు ముందే అదే గ్రామానికి చెందిన ఒక యువతిపై హత్యాయత్నం, లారీపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలిసింది. -
సైకో సంచార వార్తలతో ఆందోళన
సోంపేట : తమ ప్రాంతంలో సైకో సంచరిస్తున్నట్టు వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్నామని తగు చర్యలు తీసుకోవాలని పలాసపురం పంచాయతీ లక్కవరం గ్రామస్తులు ఎస్ఐ కె.భాస్కరరావును కోరారు. ఈ మేరకు అదృశ్య వ్యక్తి సంచారంపై వారు శుక్రవారం ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అదృశ్య వ్యక్తి సంచరిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో పాఠశాల విద్యార్థుల వినియోగ వస్తువులను తస్కరించడం, వాటిని దూరంగా విసిరేయడం, విద్యార్థులు వినియోగించే చెప్పులు కత్తిరించడం, సైకిల్ సీట్లు కోసేయడం వంటి చర్యలకు పాల్పడుతూ భయపెడుతున్నాడని అందులో పేర్కొన్నారు. ఈ సంఘటనలు కొద్ది రోజులుగా జరుగుతున్నాయని, ఈ నెల 21న వికృత చేష్టలు మరింత పెరిగాయని తెలిపారు. దీంతో ప్రశాంతంగా ఉండే లక్కవరంలో ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. పోలీసు అధికారులు స్పందించి గ్రామంలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఐను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో బావన శ్రీకాంత్, మార్పు కృష్ణారావు, సనపల విశ్వనాధం, తేజేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
బాలుడిపై సైకో లైంగిక దాడి
* తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న వైనం * మరో నలుగురి పైనా లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం తెనాలి రూరల్: నియోజకవర్గంలోని ఓ మండల కేంద్రంలో సైకోగా మారిన కామాంధుడు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ఐదుగురు బాలలపై దుశ్చర్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇటీవల మరో బాలుడిపై దాడి చేయగా, ప్రస్తుతం ఆ బాలుడు తీవ్ర అస్వస్థతతో తెనాలిలోని ప్రైవేటు వైదశాలలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కొల్లిపర గ్రామానికి చెందిన సుమారు 40 ఏళ్ల వివాహితుడు సైకోగా మారాడు. స్వయానా అక్క కూతురినే వివాహం చేసుకున్న అతనికి పిల్లలు లేరు. ఆది నుంచి కొంత వికృత చేష్టలు చేస్తుండేవాడు. రాను రాను ఇది విపరీత ధోరణిగా మారింది. ఎనిమిది నుంచి 17 ఏళ్లలోపు వయసున్న బాలురను ఎంచుకుని వారిని చంపుతానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని తెలిసింది. బాలురను ఎంచుకుని, వారికి మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఐదుగురు బాలురపై లైంగికదాడి చేశాడని తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన కొల్లిపర పరిధిలో కృష్ణానది ఏరులో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తున్న 15 ఏళ్ల వయసున్న బాలుడిని అటకాయించి, గడ్డి మోపు ఉంది ఎత్తడానికి సాయం కావాలంటూ అరటి తోటలోకి తీసుకెళ్లాడు. ఎక్కడా గడ్డిమోపు ఆనవాళ్లు కనబడకపోవడంతో బాలుడు ప్రశ్నించాడు. దీంతో తన వెంట తెచ్చిన కత్తితో చంపుతానని బెదిరించి, బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. విషయం ఎవరికైనా చెబితే హతమారుస్తానని బెదిరించడంతో బాలుడు ఆ రోజు మిన్నకుండి పోయాడు. మరుసటి రోజు అదే బాలుడు తన స్నేహితుడితో కలసి సైకిల్పై వెళుతుంటే ‘సైకో’ కొద్ది దూరం వెంబడించాడు. రెండు రోజుల అనంతరం బాధిత బాలుడి మెడ చుట్టూ వాపు వచ్చి, తీవ్ర జ్వరం రావడంతో గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి మెడ చుట్టూ గోళ్లతో రక్కి ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించగా, బాలుడు జరిగినదంతా వారికి తెలియజేశాడు. బాలురపై లైంగిక దాడి విషయం పోలీసుల దృష్టికి వెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే సదరు సైకో తమను ఏం చేస్తాడో అన్న భయంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదు రానప్పుడు ఏం చేస్తాం అన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తుండడంతో సైకో ఆగడాలకు అంతే లేకుండా పోయిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నాదెండ్లలో ఉన్మాది వీరంగం
గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్లలో శుక్రవారం ఉన్మాది వీరంగం సృష్టించాడు. స్థానికంగా నివసిస్తున్న ఇద్దరు మహిళలపై కత్తితో దాడి చేశాడు. దీంతో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... ఉన్మాదిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. -
కరీంనగర్లో సైకో వీరంగం
-
నెల్లూరు సైకో బాబుగారి వీరాభిమాని
-
అమ్మ, నాయనమ్మలను చంపి.. కళ్లు పీకేశాడు!
మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోని ఓ కుర్రాడు.. తన తల్లిని, నాయనమ్మను పొడిచి చంపేసి.. వాళ్ల కనుగుడ్లు బయటకు పీకేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే.. దెయ్యం తనను అలా చేయమందని చెప్పాడు. జీసస్ గ్వాడాలుపే మెడ్రానో అల్వరాడో (18) అనే ఈ కుర్రాడు తన తల్లి అమలాలియా పాలోమరెస్ అల్వరాడోను ఏకంగా 44 సార్లు పొడిచి పొడిచి మరీ చంపాడు. ఆ తర్వాత ఆమె కనుగుడ్లు బయటకు పీకేశాడు. సరిగ్గా అదే సమయంలో అతడి తండ్రి జేమీ మెడ్రానో గుటైరెజ్ (43) అక్కడకు వచ్చి అదంతా చూసి స్టన్ అయ్యారు. అదే గదిలో చక్రాల కుర్చీలో ఉన్న నాయనమ్మను కూడా అల్వరాడో దారుణంగా పొడిచి చంపాడు. ఆమె చెవులు, కళ్లు కనిపించడం లేదు. ఆ తర్వాత కుర్రాడు తన తండ్రి మీద కూడా కత్తి దూశాడు. కొంతసేపు ఇద్దరూ పెనుగులాడారు. ఇంతలో పొ రుగువారు ఇంట్లోంచి వస్తున్న అరుపులు విని పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లొచ్చి విడదీశారు. కుర్రాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన గాడ్ ఫాదర్ ఇలా చేయమన్నాడని తొలుత చెప్పాడు.. ఎవరా గాడ్ ఫాదర్ అని గట్టిగా ప్రశ్నిస్తే, దెయ్యమని అన్నాడు. తన తల్లి, నాయనమ్మలను చంపి వాళ్ల కళ్లు తీసుకురమ్మని దెయ్యం తనకు చెప్పిందని అతడు సమాధానం ఇవ్వడంతో అంతా విస్తుపోయారు. ఈ దారుణ ఘటన ఈశాన్య మెక్సికన్ రాష్ట్రమైన టామౌలిపాస్లోని రియో బ్రావో నగరంలో జరిగింది. -
కరీంనగర్లో సైకో హల్చల్
కరీంనగర్: కరీంనగర్లో సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కత్తి తీసుకుని ఎదురుగా వచ్చిన ఆటో డ్రైవర్ అంజయ్యపై దాడి చేశాడు. దీంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సైకో రాళ్లతో ఆటోలపై దాడి చేయడంతో పది ఆటోలు ధ్వంసమయ్యాయి. దీంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సైకో దాడితో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. -
‘సీఎం ఫిరాయింపుల పథకం’ అని పెట్టుకో..
బాబుకు రామచంద్రయ్య సూచన సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నాడని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఘాటుగా విమర్శించారు. ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి పేరిట ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని, అయితే ప్రస్తుతం ఆయన బతికుండగానే చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న బీమా ఇలా ప్రతి పథకానికి చంద్రబాబు పేరు పెట్టుకోవడం శోచనీయమన్నారు. ఇలా సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టుకున్న ఆయన.. ఇలాగే ముఖ్యమంత్రి ఫిరాయింపుల పథకం, చంద్రబాబు అవినీతి పథకం లాంటి పేర్లు పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. అవినీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పీకల్లోతు కూరుకొనిపోయాడని, అందుకే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదని ఆరోపించారు. సోమవారం ఇందిర భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. -
సికింద్రాబాద్లో సైకో హల్చల్
కంటోన్మెంట్: తాగిన మైకంలో ఓ సైకో హల్చల్ సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తాలోని యూకో బ్యాంకు బయట ఓ వ్యక్తిని కొరికి గాయపరిచిన సైకో అనంతరం బ్యాంకులోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు తలతో బాదుతూ భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో ప్రధాన ద్వారాన్ని గుద్దుకోవడంతో గాయాలయ్యాయి. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా బ్యాంకు కస్టమర్లు, సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకుని తాళ్లతో బంధించి 108కి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది తాగిన మైకంలో ఉన్న అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సైకో దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. సైకోను సురేశ్గా గుర్తించారు. తలతో గుద్దుతూ గాయపరిచాడు తాగిన మైకంలో ఉన్న సైకో తొలుత యూకో బ్యాంకు ఎదురుగా ఓ వ్యక్తిని రూ.10 ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో తలతో గట్టిగా బాది బ్యాంకులోకి చొరబడ్డాడు. బ్యాంకులోనూ ఓ పక్క కస్టమర్లు, సిబ్బందిని డబ్బులు ఇవ్వాల్సిందిగా అడుగుతూనే మరోపక్క తలతో బాదుతూ గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలోనే గ్లాసు డోర్ను బలంగా ఢీకొట్టడంతో అది పగిలిపోగా, సైకోకు గాయాలై రక్తం కారినట్లు తెలిపారు. 90 నిమిషాలు హంగామా 12.10- 12.25: గురువారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో యూకో బ్యాంకు సమీపంలోకి వచ్చిన సురేశ్ (సైకో) బ్యాంకు కాంప్లెక్స్లోని మరో కార్యాలయ వాచ్మెన్ గోపిని డబ్బులు ఇవ్వాల్సిందిగా (రూ.10) డిమాండ్ చేశాడు. సురేశ్ను చూసిన గోపి తప్పుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గోపి కుడి చేతిని సురేశ్ బలంగా కొరికి గాయపరిచాడు. 12.25-12.45 : యూకో బ్యాంకులోకి చొరబడ్డాడు. అక్కడ ఇద్దరు ఖాతాదారులను డబ్బులు అడిగాడు. నిరాకరించడంతో కొరికి గాయపరిచాడు. దీంతో ఖాతాదారులు, సిబ్బంది భయంతో బయటకి పరుగులు తీశారు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో బ్యాంకు గ్లాస్ డోరును బలంగా గుద్దుకున్నాడు. గ్లాసు పగిలిపోవడంతో సురేశ్కు వెన్ను, తలపై తీవ్ర గాయమైంది. 12.45-1.10: రక్తం మడుగులో పడిపోయినా అరుస్తూ దగ్గరికి వచ్చిన వారిపై దాడికి యత్నించాడు. స్థానికులు, బ్యాంకు సిబ్బంది అతడిని తాడుతో కట్టేశారు. 108కి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. 1.10-1.40: మత్తు దిగేందుకు 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. దాదాపు అరగంట బ్యాంకు ఆవరణలోనే ఉంచి పోలీసుల సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
సైకో వీరంగం.. కత్తితో ముగ్గురిపై దాడి
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతలకుంటలో సైకో వీరంగం సృష్టించాడు. కత్తితో ముగ్గురు వ్యక్తులపై విచక్షణ లేకుండా దాడి చేశాడు. సైకో దాడిలో ఆ ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సైకో వీరంగంతో అక్కడి స్థానికులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంతో ఆందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సైకో వీరంగం
104 వాహనంపై దాడి.. అద్దాలు ధ్వంసం చివ్వెంల: సైకో వీరంగం సృష్టించాడు. 104 వాహనంపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు కొద్ది నెలలుగా మతిస్థిమితం సరిగా లేక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2 నెలల క్రితం పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్పై వచ్చిన నాగరాజు.. తిరిగి గ్రామస్తులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరుస్తున్నాడు. సోమవారం గ్రామంలోకి వచ్చిన 104 వాహనంపై కర్రతోదాడి చేసి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పేట్రేగిన ఉన్మాది: కత్తితో చిన్నారులపై దాడి
పౌరులకు తుపాకులిచ్చే విషయంలో ఆంక్షలు లేకపోయేదుంటే సామూహిక హత్యాకాండల్లో చైనా అమెరికాను ఎప్పుడో దాటిపోయేది. వ్యవస్థపై ఉన్న కోపంతో అమాయకులపై దాడులకు పాల్పడుతోన్నవారి సంఖ్య కమ్యూనిస్ట్ దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. సోమవారం హైనన్ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన అందుకు మరో ఉదాహరణ.. మటన్ కొట్టే కత్తిని చేతబట్టుకున్న ఉన్మాది.. ఓ ప్రైమరీ స్కూల్ లోకి చొరబడి చేతికందిన పిల్లలను నరికేప్రయత్నం చేశాడు. లంచ్ టైమ్ కావడంతో విద్యార్థులంతా గ్రౌండ్ లోకి వచ్చారు. అదే అదనుగా వాళ్లపై విచక్షణా రహితంగా దాడిచేశాడా ఉన్మాది. హైకూ నగరంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్మాది దాడితో స్కూల్ ఆవరణలో ఎటుచూసినా రక్తపు మరకలే అగుపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకునేలోపే ఉన్మాది పరారయ్యాడు. కాసేపటి తర్వాత స్కూల్ పక్క సందులో విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసులు కాల్చి చంపారా అన్నది తెలియాల్సిఉంది. గాయపడ్డ విద్యార్థుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఉన్మాదిని హాంకాగ్ జాతీయుడైన లీ గా గుర్తించామని, ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. చైనాలో సామాజిక ప్రతీకార(సోషల్ రివేంజ్) దాడులకు దిగుతోన్నవారు ప్రధానంగా చిన్నపిల్లల్నే టార్గెట్ చేసుకుంటుండటం గమనార్హం. గత ఏడాది మార్చిలో షాంఘైలో చోటుచేసుకున్న దాడిలో ఓ ఉన్మాది ఆరుగురు పిల్లలు సహా 11 మందిని కత్తితో పొడిచి చంపేశాడు. అంతకు ముందు ఏడాదిలో సోషల్ రివేంజ్ దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 17గా ఉంది. కత్తులతోనే తాక చిన్నతరహా పేలుళ్ల ద్వారాను అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నారు ఉన్మాదులు. -
ఆత్మకూరులో ఇద్దరిని నరికిన సైకో
కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం బావనంతాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సైకో వీరంగం సృష్టించాడు. శివ(35) అనే యువకుడు వేటకొడవలితో ఇద్దరు వ్యక్తులను నరికి చంపాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. గాయపడినవారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శివ అప్పులు విపరీతంగా చేశాడు. అవి తీర్చలేక సైకోగా మారాడు. కనిపించినవారిపై దాడిచేయడం ప్రారంభించాడు. బుధవారం మధ్యాహ్నం కర్నూలు నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి తమ అప్పు చెల్లించమని కోరడంతో రెచ్చిపోయిన శివ వేటకొడవలితో వారిపై దాడిచేశాసి పరారయ్యాడు. ఆత్మకూరు పోలీసులు కేసి నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. -
పశ్చిమ గోదావరిలో సైకో టెర్రర్..
-
చర్చిలో ఉన్మాది బీభత్సం
కర్నూలు : చర్చిలో ప్రార్థనలు జరుగుతన్న సమయంలో అక్కడకు వెళ్లిన ఓ సైకో తన చేతిలో ఉన్న సుత్తితో ఓ వైద్యురాలిపై దాడి చేశాడు. దీంతో తలకు బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన కర్నూలులోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న హిమబిందు(45) సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ప్రదీప్ కుమార్ అనే ఉన్మాది సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన తోటివాళ్లు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లందులో సైకో కలకలం
ఖమ్మం జిల్లా ఇల్లందులో గత ఐదు రోజుల నుంచి ఉన్మాది సంచారం కలకలం రేపుతోంది. అర్థరాత్రి దాటిన తర్వాత ఇళ్ల తలుపులను గొడ్డలితో పగులగొట్టి పరార వుతున్నాడంటూ పుకార్లు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి 16వ నంబర్ బస్తీలోని ఓ ఇంటి తలుపును ఆగంతకుడు బాదుతుండగా లోపలున్న వారు కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. దీనిపై స్థానికులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. -
తిరుమలలో సైకో వీరంగం
-
తిరుమలలో సైకో వీరంగం
తిరుమలలోని యాత్రీసదన్లో (ప్రయాణికుల ఉచిత వసతి సముదాయం) ఆదివారం ఉదయం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి భక్తులపై దాడికి పాల్పడ్డాడు. పలువురిపై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీ భారీగా ఉంది. సర్వదర్శనం భక్తులకు స్వామి దర్శనానికి 15 గంటలు పడుతోంది. కాలిబాట భక్తులకు 10 గంటల సమయం తీసుకుంటోంది. ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల్లో పూర్తవుతోంది. -
వేడి వేడి ఛాయ్ మీద పోస్తా: సైకో
-
'ఉన్మాది'
-
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైకో ఎందుకయ్యాడు?
-
విశాఖలో సైకో సూదిగాడు
-
సైకో వీరంగం: గుడి పందిరికి నిప్పు
రాజుపేట (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా రాజుపేట మండలం రేణిగుంట గ్రామంలో ఆదివారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మహిళలపై దాడి చేయడమేకాక దుర్గమ్మ గుడిలోని పందిరికి నిప్పు పెట్టాడు. దాంతో పందిరి మొత్తం కాలిబూడిదైంది. గమనించిన స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రేణిగుంటకు చెందిన నల్ల భాస్కర్(18) అనే యువకుడు గత కొంతకాలంగా ఊరిలో అర్ధనగ్నంగా తిరుగుతూ మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామస్తులు ఎన్నిసార్లు చితకబాదినా ప్రయోజనం లేదు. ఆదివారం ఉదయం కూడా ఊరిలో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. చివరకు దుర్గమ్మ గుడి ప్రాంగణంలో వేసిన చలువ పందిరికి నిప్పుపెట్టాడు. ఫలితంగా పందిరి కాలిబూడిదైంది. ఆగ్రహించిన గ్రామస్తులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఉన్మాది దాడి - ఐదుగురికి గాయాలు
రైల్వే స్టేషన్లో అన్నం తింటున్న వారిపై ఓ ఆగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొందరు బిచ్చగాళ్లు స్థానిక రైల్వేస్టేషన్లో అన్నం తింటుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వారిని కర్రతో విపరీతంగా కొట్టాడు. దీంతో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రయాణికులు రైల్వే పోలీసులకు చెప్పటంతో ఉన్మాదిని అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తరలించారు. -
బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి
-
బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడు శనివారం గుంటూరు జిల్లాలో ప్రత్యక్షమైయ్యాడు. బాపట్లలో ఓ విద్యార్థిపై ఇంజక్షన్తో దాడి చేశాడు. శనివారం ఉదయం కృష్ణ అనే విద్యార్థి స్కూల్కి వెళ్తున్న సమయంలో... బైక్పై వచ్చిన ఆగంతకుడు అతడికి ఇంజక్షన్ గుచ్చి పరారైనట్టు తెలిసింది. బాధితుడు కృష్ణను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. సైకో సూదిగాడి దాడులతో మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ఘటనతో బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్షుద్రపూజల కోసం చిన్నారి బలి
సైకోకు దేహశుద్ధి చేసి నిప్పంటించిన గ్రామస్థులు సాక్షి, వలేటివారిపాలెం: క్షుద్ర పూజల కోసం చిన్నారిని ఓ సైకో కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రకా శం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరులో బు దవారం జరిగింది. గ్రామానికి చెందిన లింగాబత్తిన మహేంద్ర, ఆదిలక్ష్మమ్మల రెండో కుమారుడు మనుసాగర్(4) రోజూలాగే బుధవారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు.మధ్యాహ్నం రాకపోవడంతో తల్లి వెతుకుతుండగా పెయ్యల తిరుమలరావు అనే వ్యక్తి తీసుకెళ్లాడని స్థానికు డు తెలిపాడు. దీంతో ఆమె అతని ఇంటికి వెళ్లి గట్టిగా నిలదీసింది. తాను తీసుకువచ్చానని, కొడవలితో చిన్నారిని నరికి లోపల పెట్టానంటూ పారిపోయాడు. ఆదిలక్ష్మమ్మ భర్త మహేంద్రకు ఈ విషయం తెలిపింది. అతను నిందితుడ్ని వెతికి పట్టుకొని అతని ఇంటికి తెచ్చి తలుపులు తీసి చూడడంతో రక్తపు మడుగులో తల లేకుండా ఉన్న కొడుకు మొండెం కనిపించింది. దీంతో సైకోను స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. క్షుద్రపూజలు చేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. ఆగ్రహంతో సైకో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.పోలీసులు సైకోను మంటల నుంచి కాపాడారు. -
వాలేటివారిపాలెంలో దారుణం
-
వాలేటివారిపాలెంలో దారుణం
వాలేటివారిపాలెం మండలం పోకూరి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ సైకో నాలుగేళ్ల బాలుడి గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహేంద్ర, ఆదిలక్ష్మిల రెండో కుమారుడు మను సాగర్(4) ఇంటి దగ్గర ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు. తిరుమలరావు(35) అనే వ్యక్తి మనుసాగర్ ను తీసుకెళ్లాడని స్థానికులు చెప్పడంతో.. అతడి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్లబోయిన తిరుమల రావును తల్లిదండ్రులు ప్రశ్నించగా.. ఇంట్లో ఉన్నాడు చూసుకోండని సమాధానమిచ్చాడు. తలుపులు తెరిచి చూడగా.. బాలుడి తల వేరుచేసి ఉంది. ఇది చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు తిరుమల రావు ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తిరుమలరావును కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో వీరంగం : ఇద్దరికి తీవ్ర గాయాలు
అనంతపురం : అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం ఓబుళాపురంలో మంగళవారం తెల్లవారుజామున సైకో వీరంగం సృష్టించాడు. రహదారిపై వెళ్తున్న ఇద్దరిపై సైకో బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ మహిళతో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సైకో పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బళ్లారిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సైకో కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
బాన్సువాడలో సైకో కలకలం
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపూరలో సోమవారం నాడు ఓ సైకో కలకలం సృష్టించారు. రోడ్డు వెంబడి ఉన్న వాహనాలను గొడ్డలితో ధ్వంసం చేస్తూ, అద్దాలను పగులగొడుతూ వీరంగం చేశాడు. అడ్డుకొనేందుకు యత్నించిన వ్యక్తులపై దాడిచేశాడు. దీంతో కాలనీవాసులందరూ అత న్ని వెంబడించి అతికష్టంగా పట్టుకొన్నారు. అనంతరం స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మతిస్థిమితం లేకనే అతను ఇలా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. -
సైకో సూదిగాడు
-
నల్లగొండలో సూదిసైకో కలకలం.
-
నల్లగొండలో సూదిసైకో కలకలం
నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో సూదిగాళ్ల కలకలం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. నల్లగొండ జిల్లాలో కోదాడలో రెండు రోజుల కింద జరిగిన సూది దాడి మరవకముందే సూదిసైకో శనివారం మరో దాడి చేశాడు. మోళ్ల చెర్వు మండలం రామాపురం వద్ద బైక్ పై వెళ్తున్న నర్సింహా రావుకు సూదిగుచ్చి సైకో పరారయ్యాడు. బైక్ పై హెల్మెట్ పెట్టుకొని వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం. బాధితున్ని హుజూర్ నగర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సూది సైకో కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.