swimming pool
-
స్విమ్మింగ్ పూల్లో గంతులేస్తూ..
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతిచెందిన సంఘటన మంగళూరు శివారులోని ఉచ్చిల బీచ్ను ఆనుకుని ఉండే వాజ్కో బీచ్ రిసార్ట్లో చోటుచేసుకుంది. మైసూరుకు చెందిన ఎన్. నిశిత (21), పార్వతి (20), ఎండీ కీర్తన (21) మృతులు. వీకెండ్ కావడంతో వీరు శనివారం నాడు రిసార్ట్కు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికే నీట మునిగిపోయారు. యువతులకు ఈత రాకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు. గంతులేస్తూ ఆడుతూనే..మొదట అందరూ ఈత కొలనులో గంతులేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోతైన చోట నిశిత మునిగిపోవడంతో ఆమెను కాపాడాలని పార్వతి ముందుకు వెళ్లింది. ఇదంతా చూస్తున్న కీర్తన కూడా వెళ్లింది. ఇలా వరుసగా మునిగి చనిపోయారని కమిషనర్ చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలలో ఈ ఘోరం దృశ్యాలు నమోదయ్యాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మధ్యాహ్నం కల్లా చేరుకుని విగతజీవులుగా ఉన్న కూతుళ్లను చూసి పెద్ద పెట్టున రోదించారు. వేలకు వేల ఫీజులు వసూలు చేసి రిసార్టులు, హోటళ్లలో కనీస భద్రతా వసతులు లేవని, ఫలితమే ఈ ఘోరమని ఆరోపణలున్నాయి. -
అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి
ఆత్మకూర్ (ఎస్): అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్కుమార్ (39) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతిచెందాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రవీణ్కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు అతడి భార్య శాంతి ఆదివారం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాద్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆ్రస్టేలియా ఇతర దేశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదేళ్ల క్రితం మిత్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్కుమార్ అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్కుమార్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది. -
8 రోజుల అనంతరం తెనాలికి చేరిన రవితేజ మృతదేహం
తెనాలిరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్కు చెందిన తాడిబోయిన రవితేజ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. అమెరికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రవితేజ భౌతికకాయాన్ని అంబులెన్స్ ద్వారా తెనాలి తీసుకు వచ్చారు. ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి రవితేజ మృతి చెందిన విజయం తెలిసిందే. రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి కొడుకుకు మంచి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసింది. ఓవైపు చదువుకుంటూనే కోకోకోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడపెట్టుకున్న రవితేజ ఎంఎస్ కోసం గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. అక్కడ టెక్సాస్లో ట్రైన్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్నేహితులతో కలిసి అక్కడ స్విమ్మింగ్పూల్లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాదాపు ఎనిమిది రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం రవితేజ భౌతికకాయం తెనాలి చేరుకుంది. తెనాలిలో భారీ ఊరేగింపుగా రవితేజ భౌతికకాయాన్ని ఐతానగర్లోని నివాసానికి తీసుకువెళ్లారు. రజక చెరువు సెంటర్ నుంచి లింగారావు సెంటర్ మీదుగా రవితేజ నివాసానికి రాత్రికి భౌతికకాయం చేరుకుంది. రవితేజ భౌతిక భౌతికకాయాన్ని చూసి తల్లి జయలక్ష్మి, సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబానికి చెందిన తాము కొడుకు ప్రయోజకుడవుతాడని అమెరికా పంపిస్తే అనుకోని ప్రమాదంలో అతడు మృతి చెందాడంటూ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి జయలక్ష్మి గుండెల విసేలా రోదించారు. శనివారం ఉదయం రవితేజ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. -
స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే బాలుడు మృతి!
ఓ టీనేజ్ బాలుడు(15) స్విమ్మింగ్ చేసి.. పూల్ నుంచి పైకి ఎక్కి నడుస్తునే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో విషాదం చోటు చేసుకుంది. బాలుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవటంతో అక్కడ ఉన్నవారు.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.In UP’s meerut a 17-Year-old collapses and dies after coming out of the swimming pool. The teenager played cricket before coming for swimming and after swimming for sometime the boy collapses as soon as he steps out and was later declared dead at the hospital. pic.twitter.com/qIFWLSX8Kz— Tanishq Punjabi (@tanishqq9) June 21, 2024 దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిమ్మింగ్ పూల్ మేనెజర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతిపై తల్లిదండ్రులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటన చోటు చేసుకున్న వెంటనే స్విమ్మింగ్ పూల్ వచ్చేవారి రాకను మూసివేశారు. -
Swimming Pool: అయ్యో శివశౌర్య
మొయినాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని.. ఆటలో మెలకువలు నేర్చుకుందామని వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారాడు. స్విమ్మింగ్పూల్లో మునిగి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం సుజాత స్కూల్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్కు చెందిన గాండ్ల విక్రమ్ చిన్న కుమారుడు గాండ్ల శివశౌర్య (7) నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్కూల్లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, యోగాతో పాటు స్విమ్మింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విక్రమ్ తన కుమారుడు శివశౌర్యను బ్యాడ్మింటన్ నేరి్పంచేందుకు క్యాంపులో చేరి్పంచాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శివÔౌర్య స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగాడు. సిబ్బంది గమనించి విద్యారి్థని బయటకు తీశారు. నీళ్లు మింగి అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నాలుగు రోజులుగా పిల్లల స్విమ్మింగ్ పూల్ రిపేర్లో ఉంది. దీంతో పెద్దల స్విమ్మింగ్ పూల్లోనే పిల్లలను స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పిల్లలకు సేఫ్టీ బెలూన్స్ లేవని.. అవి తేవాలని కోచర్లు యాజమాన్యానికి సూచించినా వారు పట్టించుకోలేదని తెలిసింది. గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణకు పంపామని.. స్విమ్మింగ్ చేయిస్తున్నట్లు తమకు తెలియదని చిన్నారి తండ్రి విక్రమ్ రోదించారు. తమ కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని వాపోయారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. -
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్పూల్కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్ పూల్లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్కుమార్ -
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
ఉదయం ఎనిమిది గంటలకే వేడి గాలులు వణుకు పుటిస్తున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటేనే పెద్ద వాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితి. ఇక పిల్లల్ని బడికి పంపించాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కనౌజ్లోని ఒక స్కూలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో స్విమ్మింగ్ పూల్ పిల్లలు సంబరపడిపోతున్న వీడియో వైరల్ గా మారింది.Vaibhav Kumar, Principal says, " As the weather department informed about the heat wave, we were asking students to drink water and cool drinks...we also told them that people in cities bathe in swimming pools. Students asked us what swimming pools look like and when will they… pic.twitter.com/oyFqbpTI5V— ANI (@ANI) May 1, 2024 రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య పిల్లల్ని బడికి రప్పించేందుకు, వారి సౌకర్యార్థం ఒక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎండలు, వడగాల్పుల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రిన్సిపాల్ వైభవ్ కుమార్.క్లాస్ రూంలో, స్మిమ్మింగ ప్రస్తుతం గోధమ పంటపనులు నడుస్తున్నాయి కనుక చాలా కుటుంబాలు విద్యార్థులను పాఠశాలకు పంపడం లేదు. వారిని తిరిగి పిలవడానికి వెళ్ళాము, కానీ సరైన స్పందన లభించలేదు అందుకే ఈ వినూత్న ఆలోచనతో చేశాం. దీంతో హాజరు శాతం పెరిగింది. .. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.#WATCH | Uttar Pradesh: A govt school in Kannauj makes a swimming pool inside the classroom, amid rising temperature. pic.twitter.com/rsXkjDFa7a— ANI (@ANI) May 1, 2024 ఎండలనుంచి ఉపశమనం పొందేలా నీళ్లు, చల్లని పానీయాలకు తాగమని విద్యార్థులకు చెప్పాం. అయితే నగరాల్లో మాదిరిగా తమకు స్విమ్మింగ్ పూల్ కావాలని పిల్లలు అడిగారు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తసీఉకొని క్లాస్రూమ్ లోపల ఈత కొలను ఏర్పాటు చేశమన్నారు అసిస్టెంట్ టీచర్ ఓం తివారీ. -
తరగతి గదిని స్విమ్మింగ్ ఫూల్ చేసిన హెడ్మాస్టర్!
ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడి గాలులకు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు.ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదిని స్విమ్మింగ్ పూల్గా మార్చివేశారు. ఇది విజయవంతమయ్యింది. దీంతో చిన్నారులంతా పాఠశాలకు క్రమంతప్పక వస్తున్నారు. తరగతి గదిలోని స్విమ్మింగ్ పూల్లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది కన్నౌజ్ జిల్లాలోని మహసోనాపూర్లోని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉందంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపడం లేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్పుత్ మీడియాతో మాట్లాడుతూ ‘పాఠశాలలోని ఒక తరగతి గదిని నీటితో నింపేసి, స్విమ్మింగ్ పూల్గా మార్చివేశాం. దీనిని చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. ఆ స్విమ్మింగ్ ఫూల్లో ఆడుకోవడం మొదలు పెట్టారు. వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. ఆ నీటిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఇలా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో విద్యార్థులకు వేసవి సెలవులు మే 21 నుంచి జూన్ 30 వరకూ ఉంటాయి. -
మద్యం మత్తు.. సిమ్మింగ్ పూల్లో పడి యువకుడి మృతి
అచ్యుతాపురం(అనకాపల్లి): మద్యం మైకంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో తోటి స్నేహితుని మరణానికి కారణమయ్యాడు మరో స్నేహితుడు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొండకర్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో శనివారం రాత్రి స్విమ్మింగ్ పూల్లో పడి విజయనగరానికి చెందిన సాయివర్మ అనే యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది స్నేహితులు కొండకర్లలో ప్రైవేట్ రిసార్టులో శనివారం సందడి చేశారు. స్నేహితుల్లో కొందరు మద్యం సేవించి స్విమ్మింగ్ పూల్ వద్ద నృత్యాలు చేశారు. ఆ సమయంలో సాయివర్మను మరో స్నేహితుడు సిమ్మింగ్ పూల్లోకి తోసేశాడు. నీటిలో పడిపోయిన సాయివర్మకు ఈత రాకపోవడమో లేక మద్యం మత్తు కారణమో గానీ కొంత సేపటికి స్విమ్మింగ్ పూల్లో తేలిపోయాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సాయివర్మను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత అతిగా మద్యం సేవించడం వల్లే నీటిలో మునిగి చనిపోయాడని భావించినప్పటికీ సీసీ ఫుటేజ్ దృశ్యాలను చూసిన తర్వాత పోలీసులు ఘటనకు కారణాన్ని గుర్తించారు. పార్టీలో ఎంజాయ్ చేస్తూ స్నేహితుడే సాయివర్మను నీటిలోకి తోసేసినట్టు గుర్తించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటన కాదని భావించిన పోలీసులు సాయంత్రం తర్వాత కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇక్కడి రిసార్ట్లో గతంలోనూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకొన్న తర్వాత ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు. అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి సీసీ ఫుటేజ్లు లేకపోవడంతో కేసు తీవ్రత గుర్తించలేకపోయారు. తాజా ఘటనతో కొండకర్ల పరిసరాల్లో జరిగే పార్టీలపై నిఘా పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
స్విమ్మింగ్తో ఓ మహిళ కంటి చూపు మాయం!
చాలామందికి ఈత కొట్టడం సరదా. నదుల్లోనూ, చిన్ని చిన్న కాలువాల్లో పిల్లలు, పెద్దలు ఈత కొడుతుంటారు. నిజానికి అలాంటి నీటిలో అమీబా వంటి పరాన్న జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అవే ఓ మహిళ కంటి చూపు పోవడానికి కారణమైంది. సాధారణ నొప్పిగా మొదలై ఏకంగా కంటిలోని కార్నియాను తినేసింది. దీంతో ఆమె శాశ్వత అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకెళ్తే..ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలో కెంట్కు చెందిన 38 ఏళ్ల షెరీన్ ఫే గ్రిఫిత్ ఎప్పటిలానే పబ్లిక్ స్మిమ్మింగ్పూల్లో ఈత కొట్టింది. ఐతే రెండు రోజుల తర్వా నుంచి కంటి ఇన్ఫెక్షతో విలవిలలాడింది. తొలుత సాధారణమైందిగా భావించి ఐ డ్రాంప్స్ వంటివి వేసుకుంది. వైద్యులు కూడా నార్మల్ ఇన్ఫెక్షన్గానే పరిగణించారు. కానీ రోజురోజుకి ఇన్ఫెక్షన్ తీవ్రమైందే గానీ తగ్గలేదు. పైగా కన్ను చుట్టూ ఉన్న ప్రాంతమంతా వాచి కనురెప్ప తెరవలేని స్థితికి వచ్చేసింది. దీంతో వైద్యులు కంటికి సంబంధించిన అని వైద్య పరీక్షలు నిర్వహించగా అకాంతమీబా కారణంగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ నొప్పి, దురద, పుండ్లు కూడిని ఇన్ఫెక్షన్న వస్తుందని బాధితురాలు షెరీన్కి తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ వంటివి ఇచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దురద నొప్పి ఎక్కువై విలవిలలాడింది. ఎందువల్ల ఇలా అయిందని పరీక్షించగా ఆ పరాన్న జీవి అకాంతమీబా షెరీన్ కంటిలోని కార్నియాను తినేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కంటి చూపుని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆమె నొప్పి, దురద పుండ్లు వంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను కంటి చూపుని కోల్పోడం వల్ల తన దైనందిన కార్యక్రమాలను వేటిని చేసుకోలేకపోతున్నట్లు ఆవేదనగా వివరించింది. కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అకాంతమీబా సాధారణంగా సరస్సులు, మహాసముద్రాలు, మట్టి వంటి నీటి వనరుల్లో కనిపిస్తుంది. ఇది పంపు నీరు, వెంటిలేటింట్ , ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కొలనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కంటికి కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల గానీ చిన్న చిన్న కంటి గాయాల ద్వారా గానీ కన్నులోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని పేర్కొంది. ఇవి నేరుగా కళ్లపై దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదని, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. ఐతే ఈ ఇన్ఫెక్షన్కి చికిత్స అందించడం చాల కష్టమని అన్నారు. ఈ ఇన్షెక్షన్ సోకే ముందు కనిపించే లక్షణాలు.. అస్పష్టంగా కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం మేఘావృతమైన కార్నియా తీవ్రమైన కంటినొప్పి కళ్లలో ఎరుపు నీళ్లు నిండిన కళ్లు కంటి ఉపరితలంపై తెల్లటి వలయాలు అయితే అకాంతమీబా కంటిలోకి ప్రవేశించిన చాలా రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవని వైద్యుల చెబుతున్నారు. (చదవండి: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..) -
ప్రాణాలు కాపాడే.. ప్రపంచంలోనే తొలి ‘AI’ కెమెరా.. ధర ఎంతంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే తొలి అండర్వాటర్ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్ డిటెక్షన్ సిస్టమ్ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్లోను ఉండే స్విమింగ్పూల్స్లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది. అమెరికన్ గృహోపకరణాలు, స్విమింగ్పూల్ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్’ ఈ అండర్వాటర్ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్పూల్ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్ఫోన్లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). -
ఈత రావాలి ప్రాణం నిలవాలి
ఇది వానల కాలం. వరదల కాలం. కేరళలో ఈ సమయంలో పడవ ప్రమాదాలు సాధారణం. ప్రమాద తీవ్రత కంటే ఈత రాకపోవడం వల్ల జనం మరణిస్తున్నారని సాజి వెలస్సిరల్ అనే వ్యక్తికి అనిపించింది. చిన్న ఫర్నిచర్ షాపు నడుపుకునే ఇతడు గొప్ప ఈతగాడు కూడా. ఇంకేముంది. ఊళ్లో ఉన్న పెరియార్ నదిని స్విమ్మింగ్ పూల్గా చేసుకుని అందులోనే ఈత నేర్పుతున్నాడు. ఇప్పటికి 6000 మంది ఈత నేర్చుకున్నారు. వీళ్లందరి ప్రాణాలను నీళ్ల నుంచి ఇతడు రక్షించినట్టే. ప్రతి చోటా ఇలాంటి వాళ్లుంటే వేల ప్రాణాలు బతుకుతాయి. గత మే నెలలో కేరళలోని తానురు దగ్గర బ్యాక్ వాటర్స్లో పడవ మునిగి 27 మంది చనిపోయారు. ‘వాళ్లకు ఈత వచ్చి ఉంటే అందరూ బతికి ఉండేవారు. తుఫాను లేదు.. సముద్రమూ కాదు. ఈత వచ్చి ఉంటే పడవ బోల్తా పడినా ఆ బ్యాక్ వాటర్స్లో హాయిగా ఈదుకుంటూ గట్టెక్కవచ్చు. లేదా సహాయకబృందాలు చేరేవరకూ మెల్లగా తేలుతూనే ఉండొచ్చు’ అంటాడు సాజి వెలస్సిరల్. ఈ ప్రమాదం కాదు ఇరవై ఏళ్ల క్రితం ఇతడు చూసిన ప్రమాదమే ఇతడి మనసు మార్చింది. కుమర్కోమ్లో పడవ బోల్తా పడి 29 మంది చనిపోయారు. అప్పుడు సాజి యువకుడు. తండ్రి మంచి స్విమ్మర్ కావడంతో ఆయన నుంచి ఈత నేర్చుకుని అద్భుతంగా ఈదుతున్నాడు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారికి ఈత వచ్చి ఉంటే ప్రాణాలు మిగిలి ఉండేవి అనిపించింది. ‘ఈత ఎందుకు రాదు’ అని ప్రశ్నించుకున్నాడు. ‘నేర్పేవారు లేకపోవడం వల్ల’ అనే జవాబు వచ్చింది. ‘నేనెందుకు నేర్పకూడదు’ అనుకున్నాడు. అలా అతని ఈత సేవ మొదలైంది. పెరియార్ నదిలో సాజి వెలస్సిరల్ అలువా అనే చిన్న ఊరిలో ఉంటాడు. ఇది ఎర్నాకుళంకు 40 నిమిషాల దూరం. ఆ ఊళ్లో చిన్న ఫర్నీచర్ షాపు నడుపుకుంటూ జీవిస్తుంటాడు సాజి. అయితే అదే ఊరి నుంచి పెరియార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు నిలువ నీరులా ఉంటుంది ప్రవాహం. ‘దీనినే స్విమ్మింగ్పూల్గా చేసుకుని ఈత నేర్పిస్తాను’ అని నిర్ణయించుకున్నాడు సాజి. ‘ముందు నా కుటుంబం నుంచే మొదలెట్టాలి’ అనుకుని తన ఇద్దరు పిల్లల్ని, స్నేహితుడి పిల్లల్ని తీసుకుని నదిలో ఈత నేర్పడం మొదలెట్టాడు. మూడు వారాల్లోనే పిల్లలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు (780 మీటర్లు) ఈదడం నేర్చుకున్నారు. దాంతో ఊరి దృష్టి సాజి మీద పడింది. అతడి దగ్గర ఈత నేర్చుకోవడానికి అందరూ క్యూ కట్టారు. వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ నేర్చుకునేవారు పెరిగే కొద్దీ సాజికి ఉత్సాహం వచ్చింది. తన ఈత కేంద్రానికి వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ అనే పేరు పెట్టాడు. ప్రత్యేక దినాల్లో, పండగ వేళల్లో సామూహిక ఈత కార్యక్రమాలు నిర్వహిస్తాడు. నది ఈదే పోటీలు నిర్వహిస్తాడు. విశేషం ఏమిటంటే 70 ఏళ్ల ఆరిఫా అనే మహిళ ఇతని దగ్గర ఈత నేర్చుకుని చేతులు వెనక్కు కట్టుకుని మరీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదింది. శారీరకమైన అవకరాలు ఉన్నవారికి కూడా ఈత నేర్పే టెక్నిక్స్ ఇతని దగ్గర ఉన్నాయి. ఇతను ఈత నేర్పేటప్పుడు ఒక అంబులెన్సు ఒడ్డున, నదిలో రక్షణకు ఒక పడవ సిద్ధంగా ఉంటాయి. ‘ఈత నేర్వాలి. ప్రాణాలు నిలుపుకోవాలి. ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడితే ఈదలేక మరణించడం దురదృష్టకరం’ అంటాడు సాజి. అతని హెచ్చరిక వినదగ్గది. -
గంటపాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జలాసనాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గంట పాటు నీటిపై తేలియాడుతూ..పలు యోగాసనాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి(64) అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరించుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్విమ్మింగ్ పూల్లో మంగళవారం ఆయన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రదర్శనను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించారు. నిర్విఘ్నంగా గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోలగట్లను సత్కరించారు. చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..! -
64 ఏళ్ల వయసులో... డిప్యూటీ స్పీకర్ సాహసం! గంట పాటు నీటిపై తేలియాడుతూ..
సాక్షి, విజయనగరం: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వయసును సైతం లెక్క చేయకుండా సాహసం చేశారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ యోగ సాధన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా సాగింది. జాతీయ స్విమ్మింగ్ పూల్ డే సందర్భంగా మంగళవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని స్విమ్మింగ్ పూల్లో డిప్యూటీ స్పీకర్ జలాసన ప్రక్రియ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల ఆవశ్యకతను తెలుపుతూ డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భావితర క్రీడాకారుల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతుందని.. చైతన్యం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక చైతన్యానికి, ప్రజల ఆరోగ్యానికి ఇలాంటి ప్రక్రియలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ చేపట్టిన సాహసాన్ని ఈ సందర్భంగా అభినందించారు. అట్టహాసంగా కార్యక్రమం కాగా వందలాది మంది ప్రజలు, ఆయన అభిమానులు విచ్చేసి వీక్షించారు. కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజలు, అభిమానుల సౌకర్యార్థం ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సు ఆవరణలో, నగరంలో పలు చోట్ల ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్రీడల ప్రాధాన్యతను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం జలాసనం వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అందుకే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాన్ని చేశానని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, టీవీల మోజులో పడి యువత క్రీడలకు దూరం అవుతున్నారని వాటి ఆవశ్యకతను తెలుసుకొని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వంతుగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ నిత్యం క్రీడా సాధన చేయాలని డిప్యూటీ స్పీకర్ హితవు పలికారు. వయసుతో సంబంధం లేని క్రీడ.. స్విమ్మింగ్ అని దీనిని రోజూ సాధనం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజన్నదొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎం. దీపికా, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్
ముంబై: కొద్దిరోజులుగా ఆగకుండా కురుస్తున్న వానలకు నవీ ముంబైలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానిక యువత అక్కడ నీటిలో జలకాలాడుతూ వీడియో తీసి వర్షం పడితే ఆ లోకల్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటనేది కళ్ళకు కట్టారు. రుతుపవనాల రాకతో కొద్ది రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదనీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా నవీ ముంబైలోని ఉరాన్ లోకల్ రైల్వే స్టేషన్ ఐతే స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తూ నిండుగా నీళ్లు చేరాయి. దీంతో యువత అందులో హాయిగా జలకాలాడారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడెక్కడో విహరిస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్లో నీరు లీక్ అవుతుండడంతోనే ఇంతగా నీరు చేరిందంటున్నారు స్థానికులు. పైగా ఇక్కడి డ్రైనేజి వ్యవస్థ అయితే అత్యంత అధ్వానంగా ఉండడంతో నీరు బయటకు పోయే మార్గమే లేదంటున్నారు స్థానికులు. ఈ వీడియో చూసైనా సిగ్గు తెచ్చుకోండని అధికారులని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. नवीन नेरूळ - उरण लोकल रेल्वे स्टेशन बोकडविरा @CMOMaharashtra @PMOIndia @AshwiniVaishnaw @Dev_Fadnavis @mieknathshinde #uran_local_navi_mumbai pic.twitter.com/mb0Wp5fF1j — Jeetendra N. Thale (@JeetendraThale) July 4, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
Anchor Anasuya : స్విమ్మింగ్ పూల్లో ఫ్యామిలీతో అనసూయ, మొదటిసారి బికినీలో (ఫొటోలు)
-
తీవ్ర విషాదం: చిన్నారిని మింగేసిన స్విమ్మింగ్ పూల్.. తండ్రి కళ్లెదుటే
మునగపాక/అనకాపల్లి టౌన్ (విశాఖ): వేసవి సెలవుల్లో సరదాగా పిల్లలను స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు క్షణాల్లో కుమారుడిని కోల్పోయారు. భగవంతుడా.. ఏమిటీ ఘోరమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మునగపాక మండలం అరబుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బుధవారం ఈతకు దిగి, నీట మునిగారు. అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో అన్న రాపేటి పవన్ (8) తిరిగిరాని లోకాలకు చేరుకోగా తమ్ముడు చరణ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. ఆటో డ్రైవర్ రాపేటి గంగునాయుడు (చంటి) దంపతులు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని అనకాపల్లి బైపాస్ దరి స్విమ్మింగ్ పూల్కు వెళ్లారు. తన పిల్లలకు ఈత నేర్పించేందుకు తండ్రి పూల్లోకి దిగారు. సరదాగా ఆడుకుంటున్న పిల్లలు అంతలోనే నీట మునిగి ప్రమాదానికి లోనయ్యారు. సంఘటన జరిగిన సమయంలో ఒడ్డున ఉన్న తల్లి మాధవి ఏం చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంది. కళ్లెదుటే చనిపోయిన కుమారుడిని చూసి బోరున విలపించడంతో స్థానికులు కూడా కంటతడి పెట్టారు. ఫిర్యాదు చేయకుండా పవన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో.. పట్టణ ఎస్ఐలు దివాకర్, సత్యనారాయణ, ఎస్.ప్రసాద్ అరబుపాలెం గ్రామానికి చేరుకొని పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఈ ఘటనతో అరబుపాలెంలో విషాదం నెలకొంది. -
‘పార్వతి’ కోసం స్విమ్మింగ్ పూల్
సాక్షి, చైన్నె : మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఏనుగు పార్వతి కోసం అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ను నిర్మించారు. రూ. 23 లక్షలతో 3,500 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పార్వతి ఆనంద తాండవం చేస్తూ జలకాలాటలో మునిగింది. వివరాలు.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆలయం ప్రవేశ మార్గంలో పార్వతి అనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణతో కనిపిస్తుంటుంది. 2000 సంవత్సరంలో ఈ ఏనుగును ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. అమ్మవారి సేవలో నిమగ్నమైన ఈ ఏనుగు ఆరోగ్య సంరక్షణలో అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. పార్వతిలో మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపేవిధంగా ఆలయం తూర్పు గోపురం ప్రవేశ మార్గం సమీపంలోని స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ. 23 లక్షల వ్యయంతో 3,500 చదరపు అడుగుల స్థలంలో ఐదు అడుగుల లోతులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. ఆదివారం జరిగిన పూజాది కార్యక్రమాలతో ఈ స్విమ్మింగ్ పూల్ను ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ప్రారంభించారు. ఆలయ ఏనుగుకు ప్రత్యేకపూజలు , ఆహారం అందజేశారు. అనంతరం స్విమ్మింగ్ పూల్లోకి ఏనుగును పంపించారు. స్విమ్మింగ్ పూల్లో అటు ఇటు చక్కర్లు కొడుతూ ఆనంద తాండవంతో గజరాజు జలకాలాటలలో మునిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో నిర్మించిన షెల్టర్ను మంత్రి ప్రారంభించారు. -
ఆమె పోరాడింది.. టాప్లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్లెస్గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్లెస్గా సన్బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్లెస్గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
విజయవాడలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి శ్రీకారం
-
షర్ట్ లేకుండా షాకిచ్చిన మహేశ్ బాబు.. క్షణాల్లో ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త లుక్లో దర్శనమిచ్చారు.గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా మహేశ్ భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో ఈ పోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. సాధారణంగా మహేశ్ తన బాడీని ఎక్స్ పోజింగ్ చేయరు. సినిమాల్లోనూ షర్ట్లేకుండా కనిపించాలని మేకర్స్ కోరినా మహేశ్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. చదవండి: మహేశ్ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ! ఇలాంటి లుక్లోనూ మహేశ్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో తన లుక్పై ఫుల్ ఫోకస్ పెట్టారు మహేశ్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్లో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఫైనల్లీ.. మహేశ్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్లో బాయ్కాట్ 'లైగర్' View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వివాదంలో రిషి సునాక్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
లండన్: యూకే ప్రధాని ఎన్నికలకు మరో నెలరోజుల టైం కూడా లేదు. మాజీ చాన్స్లర్ రిషి సునాక్, యూకే ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్ ప్రధాని రేసులో తుదిగా మిగిలారు. లిజ్ ట్రస్ పైచేయి సాధిస్తూ వెళ్తుండగా.. ఈలోపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ చుట్టూ వివాదాలు, విమర్శలు అల్లుకుంటున్నాయి. యూకే ప్రధాని రేసులో నిలిచిన రిషి సునాక్ని ఇరకాటంలో పడేసేందుకు అక్కడి మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన లైఫ్ స్టైల్లోని ప్రతీ అంశాన్ని తెర మీదకు తెస్తోంది. తాజాగా.. ఆయన తన మాన్షన్లో ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్పూల్ను వివాదానికి కేంద్రంగా మార్చేశాయి అక్కడి మీడియా హౌజ్లు. ఇందులో వివాదం ఏముంది అంటారా? ప్రస్తుతం యూకేలో వడగాల్పులు, కరువుతో తీవ్ర నీటిఎద్దడి తాండవిస్తోంది కాబట్టి. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్షైర్లో సునాక్కు ఓ మాన్షన్ ఉంది. వీకెండ్లలో ఆయన, భార్య అక్షత మూర్తి, పిల్లలతో కలిసి అక్కడికి వెళ్తుంటారు. అయితే ఏరియల్ ఫుటేజీల ద్వారా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది ది ఇండిపెండెంట్. అంతేకాదు ఆ ఫొటోలు సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ పట్టణంలోని స్విమ్మింగ్ పూల్స్ను బలవంతంగా అధికారులు మూసేసిన విషయాన్ని సైతం లేవనెత్తుతున్నారు కొందరు. నీటి కొరత ఉన్న సమయంలో.. ఇలా భారీగా ఖర్చు చేపట్టి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడం పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. RIshi Sunak's huge swimming pool, gym and tennis courts are nearing completion in the grounds of his Manor House near Northallerton. @RishiSunak @trussliz @yorkpress @TeessideLive #Ready4Rishi pic.twitter.com/QlqgNVcLCJ — TeesPix.Photos - Teesside Photos (@TeesPix) August 12, 2022 అయితే ఈ కుటుంబం ఈమధ్యకాలంలో ఇలా వరుసగా వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటోంది. రిషి సునాక్ భార్య అక్షత మూర్తి.. తన ఇంటికి వచ్చిన జర్నలిస్టులకు టీ ని స్వయంగా ఇచ్చారు. అయితే అందుకోసం కాస్ట్లీ కప్పులు, ట్రేను ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పన్నుల పెంపు వల్ల ప్రజా జీవనం భారంగా మారిన ఇలాంటి సమయంలో.. ఇలాంటి కాస్ట్లీ చేష్టలు అవసరమా? అంటూ నిందించారు ఆమెను. ఇదీ చదవండి: భార్యకాని భార్య.. భర్తకానీ భర్త.. ఇదేం పెళ్లి!! -
కోకాపేటలోని ఓ అపార్ట్ మెంట్ స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి
-
నార్సింగిలో విషాదం: ఫంక్షన్కు వచ్చి స్విమ్మింగ్పూల్లో పడిపోయిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ స్విమ్మింగ్పూల్లో పడి శ్యామ్ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వచ్చిన శ్యామ్... స్విమ్మింగ్పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. (చదవండి: మహిళా సర్పంచ్కు వరకట్న వేధింపులు) -
షాకింగ్ వీడియో.. వ్యక్తిని లాగేసిన స్విమ్మింగ్పూల్ సింక్హోల్!
జెరుసలేం: ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదాంతంగా మారింది. ఆనందంగా గడుపుతున్న బంధువులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. స్విమ్మింగ్పూల్లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మధ్యలో సింక్హోల్ ఏర్పడింది. పూల్లోని నీరు వేగంగా సింక్హోల్లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్హోల్ లాక్కెళుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్లోని కర్మీ యోసెఫ్ నగరంలో గురువారం జరిగింది. సింక్హోల్ తెరుచుకున్న ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు 30 ఏళ్ల కిమ్హీగా పోలీసులు గుర్తించారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే.. మిగిలిన వారు ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి హాని జరగలేదు. “One man has been injured and another is missing after a sinkhole opened up in a inground pool at a home in central Israel. The incident occurred during a pool party." pic.twitter.com/S9cByAFebx — natureismetal (@NIMactual) July 21, 2022 నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఆ విల్లా యజమానులైన ఆరవై ఏళ్ల దంపతులను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదురోజుల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. వృద్ధ దంపతులు తమ ఇంట్లో గురువారం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆరుగురు స్విమ్మింగ్పూల్లో ఈత కొడుతూ సరదాగా గడిపారు. అయితే.. ఒక్కసారిగా పూల్ మధ్యలో భారీ గొయ్యి ఏర్పడటం వల్ల వారు గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: డ్రైవర్ తప్పిదం.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు 24 మంది విద్యార్థులు.. -
పట్టుకో...పట్టుకో చూద్దాం! వైరల్ వీడియో
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చీటికిమాటికి దేనికో దానికి కొట్టుకుంటారు. అలానే కొంతమంది రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. అవి కూడా అంతే కొట్టుకుంటూ పెద్ద హడావిడే చేస్తుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక యజమాని పెంపుడు జంతువులు కూడా అలానే కొట్టుకుంటాయి. ఐతే ఇక్కడ కుక్క, పిల్లిని తరుముతుండటేమే కాకుండా వెంటాడుతుంది. కానీ ఆ పిల్లి ఎంత తెలివిగా ఆ కుక్క నుంచి తప్పించుకుందో చూడండి. వివరాల్లోకెళ్తే....కుక్కులు సహజంగానే తమ కన్న చిన్న జంతువులను తరుముతూ వెంటపడుతుంటాయి. పైగా ఆ రెండు జాతులకు సాధారణంగా పడదు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి కుక్క పిల్లిని తరుముతుంది. దాడి చేసేందకు వెంటపడి మరీ తరుముతుంటుంది. దీంతో ఆ పిల్లి చక్కటి ట్రిక్ ఉపయోగించి కుక్క అవాక్కయ్యేలా తప్పించకుంటుంది. ఇంతకీ పిల్లి ఏం చేసిందంటే...పరుగెడుతున్నప్పుడూ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న తెడ్డుపైకి ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుకుని తప్పించుకుంటుది. కానీ కుక్క పాపం ఆ పిల్లి స్విమ్మింగ్ పూల్లో పడిపోతుందనుకుంది. పిల్లి అలా తెలివిగా తప్పించుకునేటప్పటికీ కుక్కకి ఏం చేయాలో తోచక చూస్తుండిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. In a brilliant move, cat outsmarts puppy..🐈🐾🐕💨🏄😅 pic.twitter.com/k517VkJCPe — 𝕐o̴g̴ (@Yoda4ever) June 4, 2022 -
అండర్వాటర్ వాక్యూమ్ క్లీనర్.. నీటి అట్టడుగు వరకు
భారీ నీటి తొట్టెలు, ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి శుభ్రం చేయడం ఆషామాషీ పని కాదు. ఎంతగా శుభ్రం చేశామనుకున్నా, సూక్షా్మతి సూక్ష్మమైన నలకలు, నాచు మొలకలు ఎక్కడో చోట ఇంకా మిగిలే ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ గనుక ఉంటే, వీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. ఇది నీటి అట్టడుగు వరకు ప్రయాణించగలదు. మూల మూలల్లోని చెత్తను, 180 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే సూక్షా్మతి సూక్ష్మమైన నలకలను కూడా ఇట్టే ఒడిసి పట్టుకుని, తిరిగి నీట్లోకి చేరకుండా చూస్తుంది. ‘ఎయిపర్ సీగల్–3000’ పేరుతో జపాన్కు చెందిన ఎయిపర్ ఇంటెలిజెంట్ కంపెనీ రూపొందించిన ఈ అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. -
సరదాగా ఈతకు వెళ్ళిన నలుగురు చిన్నారులు విద్యుత్ షాక్తో మృతి
-
Suryapet: స్విమ్మింగ్ పూల్ బాత్రూమ్లో రహస్య కెమెరాలు.. 41 నిమిషాల..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల పరిధిలో దారుణం జరిగింది. కుడకుడ రోడ్లో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ బాత్రూమ్లో ఓ రహస్య కెమెరా అమర్చినట్లు వెలుగులోకి వచ్చింది. స్విమ్మింగ్ పూల్కి వచ్చే యువతులు, మహిళల వీడియోస్ను సిబ్బంది రహస్యంగా రికార్డు చేస్తున్నారు. బాత్రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉండగా ఓ యువతి వీడియో రికార్డు గమనించింది. మిగతా స్నేహితులతో కలిసి కెమెరాను తీసి చూడగా అప్పటికే 41 నిమిషాల వీడియో రికార్డయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్ ఫూల్లో పనిచేసే మహేశ్ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
షాక్: స్కూల్ నల్లా బిల్లు రూ. 20 లక్షలు!
ఓ టీచర్ చేసిన పనికి.. ఊళ్లో ఏకంగా మంచి నీటికి ఇబ్బంది ఏర్పడడంతో పాటు స్కూల్ నల్లా బిల్లు యాజమాన్యానికి దిమ్మ తిరిగిపోయేలా చేసింది. ఇంతకీ అంత బిల్లు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎప్పుడూ మంచి నీటి నల్లాలను ఆన్ చేసి ఉంచడం మూలంగా! స్విమ్మింగ్ పూల్ నిర్వాహణను చూసుకునే ఆ టీచర్.. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నిరంతరం మంచి నీటి ట్యాప్లను కట్టేయకుండా ఉంచింది. ఆ నీటిని స్విమ్మింగ్పూల్లోకి మళ్లించింది. తద్వారా నిరంతరం ప్రవాహంతో ఆ పూల్ ఉండిపోగా.. ఇప్పుడు బిల్లు రూపంలో మోత మోగిపోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. నీటి కొరత ఏర్పడినందుకుగానూ పౌరులకు క్షమాణపణ చెప్పారు. ఇక ఈ బిల్లుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. కరోనా టైంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ముందు జాగ్రత్త కోసమే తాను స్విమ్మింగ్పూల్లో మంచి నీటి ప్రవాహాన్ని అలా ఉంచానని, తద్వారా స్టూడెంట్స్ కరోనా బారిన పడకుండా ఉంటారన్న ఆలోచనతోనే ఆ పని చేశానని ఆమె వివరణ ఇచ్చుకుంది. కేవలం రెండు నెలల కాలంలోనే పదులు సంఖ్యలో స్విమ్మింగ్పూల్లకు సరిపడా నీటిని ఆ టీచరమ్మ వేస్ట్ చేసిందట. సాధారణంగా పూల్స్కు సపరేట్గా క్లోరిన్, ఫిల్టరింగ్ మెషిన్స్ ఉంటాయి. కానీ, వాటికి బదులుగా మంచి నీటితో ఇలా నింపి పడేసింది ఆమె. అయితే మధ్యలో కొందరు స్కూల్ సిబ్బంది అది గుర్తించినా.. ఆమె మళ్లీ వెళ్లి ఆ ట్యాప్లను ఆన్ చేయడం, నీళ్లు వృథాగా పోవడం జరిగిందన్నమాట. ఈ ఘటన జపాన్ యోకోసుకాలో జరిగింది. బిల్లు 3.5 మిలియన్ యెన్(27,000 డాలర్లు.. మన కరెన్సీలో 20 లక్షల 60 వేల రూపాయలకు పైనే) రాగా.. అందులో సగమైనా కట్టాలంటూ ఆ టీచర్కు ఇరిగేషన్ అధికారులు నోటీసులు పంపించారు. చదవండి: రోడ్డు పక్కన డబ్బు సంచి! చూసి ఏం చేశాడంటే.. -
డాక్టర్లు సూచించారని స్విమ్ చేశాడు... అదే అతనికి మృత్యువైంది
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో స్విమ్మింగ్ పూల్లో పడి నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రెజిమెంటల్బజార్కు చెందిన శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు సాయిసూర్యతేజ 2019లో ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. చదువు పూర్తి కావడంతో రెండు నెలల క్రితం సివిల్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ నెల 7న ఆస్ట్రేలియా బ్రిస్బన్ లోని తాను నివాసం ఉంటున్న గోల్డెన్ కాస్ట్ రిసార్ట్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. డాక్టర్ సూచనలతో.. 2020లో సాయి సూర్యతేజ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి కాలు ప్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. వచ్చే నెలలో మరో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. శస్త్ర చికిత్స చేయాలంటే స్విమ్మింగ్ చేస్తే బాగుంటుందని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న తన అపార్ట్మెంట్ కింద ఉన్న పూల్కు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా.. వచ్చే నెలలో సాయి సూర్యకు శస్త్ర చికిత్స జరుగనుండటంతో తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఏప్రిల్ 2న ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంతలో కుమారుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో వారు బోరున విలపిస్తున్నారు. మృతుడి స్నేహితు లు సాయి మృతదేహాన్ని నగరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో మృతదేహం నగరానికి చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు తెలిపారు. (చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ) -
'పిచ్చి ప్రశ్నలు వేస్తోంది.. స్విమ్మింగ్ఫూల్లో పడేయండి'
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తనను ఇంటర్య్వూ చేయడానికి వచ్చిన యాంకర్కు అక్తర్ వార్నింగ్ ఇచ్చాడు. పిచ్చి ప్రశ్నలతో సమయం వృధా చేసింది.. వెంటనే ఆమెను స్విమ్మింగ్ఫూల్లో పడేయండంటూ పేర్కొన్నాడు. అయితే ఇది నిజమైన వార్నింగ్ అనుకుంటే మీరు పొరబడ్డట్టే. విషయంలోకి వెళితే.. ఇండియన్ టెలివిజన్ యాంకర్ షఫాలీ బగ్గా షోయబ్ అక్తర్ను ఫన్నీ ఇంటర్య్వూ చేసింది. చదవండి: కప్పలా నోరు తెరిచాడు.. ఏమైంది గిల్లీ! ఈ సందర్భంగా ఆమె.. అక్తర్ను తన ఫన్నీ ప్రశ్నలతో నవ్విస్తానని చాలెంజ్ చేసింది. షఫాలీ బగ్గా అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అక్తర్ నవ్వలేదు. అయితే చివరి ప్రశ్నకు మాత్రం అక్తర్ నవ్వేశాడు. దీంతో యాంకర్ బగ్గా మీరు ఓడిపోయారని ఒప్పుకోండి.. అని అడిగింది. దీనికి అక్తర్ నవ్వుతూ.. ''ప్రొడ్యూసర్! ఆమె ప్రశ్నలయిపోయాయిగా.. స్విమ్మింగ్ఫూల్లో పడేయండి'' అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ షఫాలీ బగ్గా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Mohammad Rizwan: రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్... ముల్తాన్ సుల్తాన్ ఘన విజయం View this post on Instagram A post shared by Shefali Bagga (@shefalibaggaofficial) -
స్విమ్మింగ్పూల్లో రాసలీలలు: రెడ్హ్యాండెడ్గా దొరికిన డీఎస్పీ
జైపూర్: ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్ అర్ధనగ్నంగా స్విమ్మింగ్పూల్లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో రిసార్ట్పై పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒక పోలీస్ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి వివరాలు ఇలా ఉన్నాయి. అజ్మీర్ జిల్లాలోని డీఎస్పీ హీరాలాల్ సైనీ. జైపూర్ కమిషనరేట్లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్తో కలిసి ఆయన జూలై 13వ తేదీన ఉదయ్పూర్లోని ఓ రిసార్ట్కు వెళ్లాడు. రిసార్టులోని స్విమ్మింగ్పూల్లో ఇద్దరూ ఆడుకుంటున్నారు. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరూ సన్నిహితంగా కలిశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కానిస్టేబుల్ వాట్సప్ స్టేటస్గా పెట్టుకుంది. ఆ వీడియోలో ఇద్దరూ జలకాలాడుతూ మైకంలో మునిగి తేలుతున్నట్లు ఉంది. ఆ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు స్పందించారు. వెంటనే రిసార్ట్పై దాడి చేసి ఆ అధికారితో పాటు కానిస్టేబుల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కన్న కొడుకు (6) కళ్లెదుటే ఆ కానిస్టేబుల్తో ఆయనతో సన్నిహితంగా మెలగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరినీ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. నాగౌర్ జిల్లాలోని చిట్టావా పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ భర్త ఫిర్యాదు చేశాడు. చదవండి: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం -
బ్లాక్ బికినీలో కాజల్ అగర్వాల్: స్టన్నింగ్ ఫోటోస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హాలిడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్బంగా స్విమ్మింగ్ పూల్లో బ్లాక్బికినీలో దర్శనమిచ్చి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసింది. ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి...స్విమ్మింగ్ పూల్లో సేదతీరకుండా హాలీడే ఎలా పూర్తవతుందంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానుల లైక్ల సందడి జోరుగా సాగుతోంది. కాగా వివాహం అయిన తరువాత తొలిసారిగా హర్యాలీ తీజ్ వేడుకను జరుపుకుంది. దీనికి సంబంధించి అందమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ఆరువావారాలు, రోజులు 16 గంటలు పనిచేసి అలసిపోయానని, భర్తతో కలిసి హాలీడే ట్రిప్కు వెళ్లాలని ఉందంటూ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ప్రారంభం
మీకు ఈత కొట్టడం అంటే ఇష్టమా.. అయితే ఇప్పుడు మీరు ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయండి. ఇందులో ఈత కొడితే మాత్రం మీకు పాతాళలోకానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఈ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడితే వేరే సరికొత్త లోకంలో అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ అడుగు భాగంలో గేమ్స్ ఆడుకోవడానికి, కూర్చొడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ‘డీప్ డైవ్ దుబాయ్’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ను దుబాయ్ ప్రభుత్వం నిర్మించింది. అంతేగాకుండా ఈ పూల్ గిన్నిస్ రికార్డ్ సైతం సొంతం చేసుకుంది. 60 మీటర్ల లోతు నాడ్ అల్ షెబా ప్రాంతంలో నిర్మితమైన ఈ స్విమ్మింగ్పూల్ను దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మొహమ్మద్ బుధవారం ప్రారంభించారు. ఈ పూల్ కి సంబంధించిన వీడియోలను మొహమ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘60 మీటర్ల లోతున్న (196 అడుగులు) ప్రపంచంలో కెల్లా అత్యంత లోతైన పూల్ ‘డీప్ డైవ్ దుబాయ్’ మీ కోసం ఎదురుచూస్తోందని’’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో లక్షల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పూల్లో ఇండోర్ స్కూబా డైవింగ్ సదుపాయంతో పాటు విద్య, వినోదం కోసం ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. An entire world awaits you at Deep Dive Dubai the world’s deepest pool, with a depth of 60 meters (196 feet) #Dubai pic.twitter.com/GCQwxlW18N — Hamdan bin Mohammed (@HamdanMohammed) July 7, 2021 ఈ ఇండోర్ పూల్ 1,500 చదరపు మీటర్ల పరిమాణంలో ఓయిస్టర్ ఆకారంలో ఉన్న నిర్మాణం లోపల ఉంది. ఈ పూల్ను ముఖ్యంగా డైవింగ్లో శిక్షణ తీసుకునే వారికోసం, నీటి లోతట్టు ప్రాంతాల్లో డైవింగ్ చేసే ఆసక్తి కలిగిన వాళ్ల కోసం ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీనిలో పాడుబడిన నగరం ఆకృతులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ పూల్లో ఉన్న అండర్ వాటర్ 56 కెమెరాలు డైవింగ్ చేస్తున్న వారిని నిరంతం పర్యవేక్షిస్తుంటాయి. ఇందులోని నీటిని 6 గంటలకు ఒకసారి శుద్ధి చేస్తారు. దీన్ని నింపడానికి 1.4 కోట్ల లీటర్ల నీటిని వినియోగించారు. ఈ నీటి కొలను అడుగున చదరంగం, టేబుల్ ఫుట్ బాల్ కూడా అడుకోవచ్చు. చాలా మంది ఈ పూల్ విషయంలో ఫాంటసీ సినిమాలో పూల్ ఎలా కనిపిస్తుందో అలా ఉంది అని చాలా మంది వ్యాఖ్యానించారు. -
‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’
న్యూయార్క్: విడాకుల ప్రకటన తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు జేమ్స్ వాల్లేస్. జేమ్స్ వాల్లేస్.. గేట్స్ మీద రెండు బయోగ్రఫీలు రాశాడు.అందులో 80, 90 దశకాల్లో మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో గేట్స్.. విపరీతంగా పార్టీలు నిర్వహించేవాడని, ఆ టైంలో తన పదిహేడు గంటల పని తీరును పక్కనపెట్టాడని వాల్లేస్ పేర్కొన్నాడు. గేట్స్ లోకల్ నైట్ క్లబ్ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడు. నగ్నంగా వాళ్లతో కలిసి ఈతలు కొట్టేవాడు. వాళ్ల చుట్టూ తిరిగేవాడు. తప్పతాగి జల్సాలు చేసేవాడని వాల్లేస్ ఆరోపించాడు. కొమ్డెక్స్, డెమో లాంటి సదస్సుల తర్వాత గేట్స్.. పార్టీల్లో పాల్గొనేవాడు. ఆ టైంలో బిల్గేట్స్ తప్పతాగే వాడని గతంలో రాబర్ట్ క్రింగ్లే అనే బ్లాగర్ రాసిన కథనాన్ని ప్రస్తావించాడు వాల్లేస్. ఇక ఈ ప్రకటనపై.. బిల్ గేట్స్ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు వెలువడడం దారుణమని ఆక్షేపించారు. స్త్రీ లోలుడు : మాజీ ఉద్యోగి ఆరోపణ ఇక బిల్గేట్స్(65)పై మాజీ ఉన్నత ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలకు దిగారు. ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగి.. 1988లో ఓరోజు ఉదయం ఓ మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిండా గేట్స్తో ఆయన ప్రేమాయణం కొనసాగుతోందని ఆ ఉద్యోగి గుర్తు చేసుకున్నారు. ఇక మరో ఉద్యోగి బిల్గేట్స్ ఉద్యోగులందరితో సమానంగా ఉండేవాడు కాదని, తనకు నచ్చని వాళ్లపై అరిచేవాడని ఆరోపించారు. చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు ఎందుకు? -
స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి
జీడిమెట్ల: అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్పూల్లో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, దంతెరపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి అపురూపాకాలనీలో ఉంటున్నాడు. రామిరెడ్డి భార్య విజయలక్ష్మి అదే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆఫీస్ క్లర్క్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు రంజిత్ రెడ్డి(5), రిత్విక్రెడ్డి(3). శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన చిన్న కుమారుడు రిత్విక్రెడ్డితో సహా స్కూల్కు వెళ్లింది. మధ్యాహ్నం కుమారుడికి భోజనం పెట్టేందుకు చూడగా రిత్విక్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఇద్దరు కలిసి కుమారుడి కోసం గాలించినా ఆచూకీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి పాఠశాల అవరణలోని స్విమ్మింగ్పూల్ వద్దకు వెళ్లి చూడగా రిత్విక్ నీటిపై తేలుతూ కనిపించడంతో అతడిని సమీపంలోని అస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. -
బర్త్డే పార్టీ: వ్యక్తికి తీవ్ర గాయాలు
మాస్కో: పుట్టినరోజు అంటే శుభాకాంక్షలతో సరిపెట్టుకునే రోజులు పోయాయి. హంగూఆర్భాటాలతో గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేయాలి. ఎక్కువ సంఖ్యలో అతిథులను పిలవాలి. వచ్చిన వాళ్లు ఆ పార్టీ కోసం గొప్పలు చెప్పుకునేటట్లు ఏదైనా కొత్తగా చేయాలి. పుట్టిన రోజు వేడుకల్లో ఈ కొత్త పోకడలు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో బర్త్డే జరుపుకుంటున్న ఓ వ్యక్తి చేసిన స్టంటు అతన్ని ఆసుపత్రిపాలయ్యేలా చేసిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. మాస్కోకు చెందిన డిమిర్టీ ప్రిగారోడోవ్ అనే బ్యాంకు ఉద్యోగి తన 30వ పుట్టినరోజున స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. (25 మందికి వైరస్ పంచిన చిరు పార్టీ) ఈ క్రమంలో అతను కిటికీలో నుంచి స్విమ్మింగ్ పూల్లో దూకి జలకాలాడాలన్న ఆలోచన పుట్టింది. తాగిన మైకమో, లేదా పార్టీలో మునిగి ప్రపంచాన్ని మర్చిపోయాడో కానీ పూల్ మీద గాజు ఫలకం ఉందని గుర్తించలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా అందులోకి దూకడంతో గాజు పలిగిపోయి అతని శరీరానికి గుచ్చుకుంది. ముఖం, ఛాతీపై తీవ్ర గాయాలలవడంతో పాటు ఎడమ చేయి, కాలు పనిచేయడం లేదు. బర్త్డే మిగిల్చిన విషాదాన్ని గురించి డిమిట్రీ మాట్లాడుతూ.. "నేను పుట్టినరోజు జరుపుకునేందుకు మంచి ప్లేస్ ఎంచుకుని దాన్ని అద్దెకు తీసుకున్నాం. అక్కడ మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నాం. కానీ ఆ స్విమ్మింగ్ పూల్ను చూస్తే దూకడానికి అనుగుణంగానే ఉందనిపించింది" అని పేర్కొన్నాడు. (వూహాన్లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్) -
బర్త్డే స్టంటు.. ఆస్పత్రిపాలైన బర్త్డే బాబు
-
ఎంత బాగా ఈత కొట్టాయో
-
'కోతుల జలకాలాటలు చూసి తీరాల్సిందే'
ముంబై : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు అడవుల్లో కనిపించే జంతువులు జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపై మనుషులెవరు కనిపించకపోవడంతో ఈ జనాలకు ఏమైయుంటదబ్బా అని బహుశా జంతువులు అనుకొని ఉంటుండొచ్చు. అయినా లాక్డౌన్ మనుషులకే కానీ మాకు కాదన్నట్లు అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసంలోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న నొయిడాలోని ఒక ప్రాంతంలో ఆహార అన్వేషణకు నీల్గాయ్ రోడ్డుమీదకు రావడం, ఉత్తారఖండ్లో సాంబార్ డీర్లు యదేచ్చగా సంచరిస్తున్న వీడియోలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలోని ఒక అపార్ట్మెంట్ జలకాలటలు ఆడుతున్న కోతుల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైకి చెందిన తిస్కా చోప్రా అనే అమ్మాయి కోతులు స్విమ్మింగ్ ఫూల్లో దిగి ఈత కొడుతున్న వీడియోనూ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 'లాక్డౌన్ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితమవడంతో జంతువులు యదేచ్చగా తిరుగుతున్నాయి. కోతులు స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేసిన విధానం చూసి చాలా సంతోషించాను. ఈరోజు ఆ కోతులకు ఒక ప్రత్యేక రోజుగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. నేను మాత్రం కోతుల స్విమ్మింగ్ను చూస్తూ ఉండిపోయానంటూ ' క్యాప్షన్ షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో మొదట ఒక కోతి బాల్కని నుంచి కిటికి రెయిలింగ్ వద్దకు చేరుకొని అమాతంగా స్విమ్మింగ్ ఫూల్లోకి దూకేసి సరదాగా కొద్దిసేపు ఈత కొట్టింది. ఆ తర్వాత అటు ఇటూ కలియతిరుగుతూ ..చివరకు స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డుకు చేరుకుని అక్కడ కాసేపు కూర్చొంది. అనంతరం మిగతా కోతులు కూడా స్విమ్మింగ్ ఫూల్లోకి దూకి జలకాలాడుతూ ఎంజాయ్ చేశాయి. కాగా ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. -
కార్ వాష్ ఇలా చేస్తారా..?
-
కార్ వాష్ ఇలా చేస్తారా..?
ఫ్లోరిడా : స్విమ్మింగ్ పూల్లో కారు మునిగిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కారు డ్రైవర్ అనుకోకుండా ఫ్లోరిడా హోటల్లోని స్విమ్మింగ్పూల్లోకి కారును వెనక్కి తీసుకున్నాడు. దీంతో వాహనం స్విమ్మింగ్ పూల్లో పూర్తిగా నీట మునిగింది. కారు నుంచి ప్రయాణీకుడు, డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. వెస్ట్పామ్ పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో హాలిడేఇన్ ఎక్స్ప్రెస్ హోటల్ స్విమ్మింగ్పూల్లో మునిగిన కారు ఫోటోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వైరల్గా మారిన ఈ ఫోటోలపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. కార్పూలింగ్కు వినూత్న నిర్వచనం ఇచ్చారని ఓ ఫేస్బుక్ యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు పూల్సైడ్ పార్కింగ్కు ఇదే సరైన నిర్వచనమని వ్యాఖ్యానించారు. కార్వాష్కు వెళ్లారని మరో యూజర్ కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కృత్రిమ సునామీ
-
అసంపూర్ణమైన సంపూర్ణం
‘‘సినిమా స్టార్స్ని చూసి అలానే ఉండాలనే ఆలోచనను సమాజం ఏర్పరచుకుంది. దీని ద్వారా చాలా మంది అనవసరమైన ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారు. ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టాలనుకుంటున్నాను’’ అన్నారు సమీరా రెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఈత కొలనులో ఫొటోషూట్ చేయించుకోవడమే. గర్భంతో ఉండి, ఇలా పొట్ట కనిపించేట్లు ఫొటోలు దిగుతారా? అని కొందరు సమీరాను విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు సమీరా సమాధానం ఇచ్చారు. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకున్నారామె. రెండోసారి తల్లి కాబోతున్న సమీరా రెడ్డి బాడీ పాజిటివిటీ, మనల్ని మనం ప్రేమించుకోగలగడం, మూస ధోరణి ఆలోచనల గురించి అవగహన కలిగించాలనుకున్నారు. ఈ విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ – ‘‘బాడీ షేమింగ్ ఎదుర్కొన్నవాళ్ల కోసమే అండర్ వాటర్ ఫొటోషూట్ చేసుకున్నాను. ఇంతకు ముందు బికినీ ధరించాలంటే ఎంతో ఆలోచించేదాన్ని. ఎన్నో ఆలోచనలు. కానీ తొమ్మిదో నెల ప్రెగ్నెంట్గా ఉంటూనే బికినీలో ఎంత కంఫర్ట్బుల్గా ఉన్నానో చెప్పలేను. మొదటిసారి గర్భవతిని అయినప్పుడు నా వంతు ట్రాలింగ్ (విమర్శలు) ఎదుర్కొన్నాను. ‘ప్రెగ్నెంట్ అయినప్పుడు సమీర బరువు పెరిగింది. గ్లామర్ తగ్గింది’ అనే కామెంట్స్ విన్నాను. కానీ ఈసారి దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. వాటిని తిప్పికొట్టి కాన్ఫిడెంట్గా ఉండాలనుకున్నాను. మన శరీరాన్ని మనమే అంగీకరించకపోతే ఎలా? అన్ని వయసుల ఆడవాళ్లకు చెప్పేది ఏంటంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకొని, అంగీకరించండి’’ అన్నారు. -
స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంకు చెందిన బాలుడు సింగపూర్లో ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. వనామాడ శ్రీనివాసరావు సింగపూర్లో ఓ ప్రైవేట్ కంపెనీలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అక్కడ తన 3 ఏళ్ళ చిన్నకుమారుడు వనామాడ హార్దిక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్లో జారిపడ్డాడు. తలకు తీవ్రగాయమవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. హార్దిక్ పార్థివ దేహాన్ని సోమవారం స్వస్థలానికి బంధువులు తీసుకు వచ్చారు. -
హైదరాబాద్ తారామతి బారామతిలో విషాదం
-
పూల్.. థ్రిల్
సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ఎంచక్కా టెర్రస్పై స్విమ్మింగ్ చేయొచ్చు. మీకు నచ్చిన రీతిలో అత్యాధునిక స్విమ్మింగ్పూల్ను పైఅంతస్తులో నిర్మించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు భూమిపై టాట్లాట్ ఏరియాను మినహాయించి మిగతా ప్రాంతంలో పూల్ నిర్మాణానికి అనుమతి ఉంది. కొత్త నిబంధనల మేరకు యజమానులు తమ ఇంటి పైఅంతస్తులో స్విమ్మింగ్పూల్ నిర్మించుకోవచ్చు. అయితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు మాత్రం పక్కాగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు భవన నిర్మాణ అనుమతుల నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్–2016కు అనుగుణంగా భవన నిర్మాణ నిబంధనలు రూపొందించాలన్న బిల్డర్స్, డెవలపర్స్ అసోసియేషన్ల కోరిక మేరకు ప్రభుత్వం ఈ సవరణలు చేసింది. తద్వారాఎక్కువ ఎత్తు, అంతస్తులు నిర్మించే వారికి ప్రయోజనం కలగనుంది. ప్రస్తుత నిబంధనల మేరకు భవనం ఎత్తు 50–55 మీటర్ల వరకుంటే మూడు వైపులా 16మీటర్ల సెట్బ్యాక్ వదలాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎత్తులో నిర్మిస్తే ప్రతి 5మీటర్ల ఎత్తుకు అదనంగా 0.5 మీటర్ (అర మీటర్) సెట్బ్యాక్ వదలాలి. అంటే 55–60 మీటర్ల వరకు 16.5 మీటర్లు, 65–70 మీటర్ల ఎత్తులో నిర్మించాలంటే 17.5 మీటర్ల మేర సెట్బ్యాక్ విడిచిపెట్టాలి. కానీ నూతన నిబంధనల మేరకు వీరు 17మీటర్లు వదిలితే సరిపోతుంది. అంటే భవనం మూడు వైపులా సెట్బ్యాక్లో అరమీటరు మేర కలిసొస్తుంది. కొత్త నిబంధనల మేరకు 70–120 మీటర్ల ఎత్తులో భవనం నిర్మిస్తే 18మీటర్లు సెట్బ్యాక్ వదిలితే సరిపోతుంది. అలాగే 120 మీటర్లకు మించి నిర్మిస్తే 20 మీటర్ల సెట్బ్యాక్ వదిలాల్సి ఉంటుంది. దీంతో నగరంలో హైరైజ్ బిల్డింగ్ (ఎత్తైన భవనాలు)ల నిర్మాణం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. నగరంలో ప్రస్తుతం వ్యక్తిగత నివాసాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. కొత్త నిబంధనలతో బిల్డర్లు ఎక్కువ ఎత్తులో అధిక అంతస్తులతో భవనాలు నిర్మించే అవకాశం ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ 17,838 వ్యక్తిగత నివాస భవనాలకు అనుమతులివ్వగా, 2,328 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్కు అనుమతులిచ్చింది. కొత్త నిబంధనలతో ఎత్తయిన అపార్ట్మెంట్స్కు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే భవనాల భద్రత దృష్ట్యా సెల్లార్లు ఎక్కువ లోతుకు వెళ్లే కొద్దీ సెట్బ్యాక్స్ ఎక్కువగా వదలాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. బిల్డర్లకు మేలు... అదే విధంగా రోడ్ల విస్తరణలో స్థలం కోల్పోయే వారికి తొలుత ఎంత బిల్టప్ ఏరియాకు అవకాశం ఉంటుందో? రోడ్ల విస్తరణకు స్థలం ఇచ్చిన తర్వాత మిగతా స్థలంలోనూ అంత బిల్టప్ ఏరియా మేరకు భవనాన్ని తమకు నచ్చిన విధంగా కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ మేరకు వెంటిలేషన్ తదితర సదుపాయాలు కల్పించడంతో కొత్త ని బంధనల వల్ల బిల్డర్లకు ప్రయోజనకరమని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం అపార్ట్మెంట్స్కు అప్రోచ్ రోడ్డు ఎలా ఉ న్నా అనుమతులిచ్చేవారు. కొత్త నిబంధనల మేర కు బీటీ లేదా సీసీతో అప్రోచ్ రోడ్ ఉండాలి. లేని పక్షంలో సొంత ఖర్చుతో డెవలపర్నే నిర్మించాలి. లేకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) ఇవ్వరు. ప్రస్తుత నిబంధనల మేరకు శాశ్వత విద్యుత్, వాటర్లైన్ కనెక్షన్ కావాలంటే భవనానికి ఓసీ జారీ అయ్యాకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కొత్త నిబంధనల మేరకు ఓసీకి దరఖాస్తు చేసినప్పుడే ఈ కనెక్షన్లకు సైతం చేసుకోవచ్చు. ఈలోగా దరఖాస్తు ప్రాసెస్ చేస్తారు. ఓసీ జారీ అయ్యాక ఎక్కువ జాప్యం లేకుండా కనెక్షన్లు ఇస్తారు. -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్నెస్... అంతులేని ప్రేమ.. అయాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్నెస్... అంతులేని ప్రేమ.. అయాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
చల్లచల్లని.. కూల్ కూల్...
ఎండల నుంచి ఉపశమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఏసీలు, కూలర్లు, ఇంటి పైకప్పుపై కూల్ పెయింటింగ్ ఇలా ఒక్కటేమిటి.. ఎండాకాలం రాగానే మనలో ఉన్న ఐడియాలన్నీ బయటకు వస్తుంటాయి. మనలాంటి ఓ అర్కిటెక్చర్కు కూడా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ చక్కటి ఇంటి డిజైన్ను రూపొందించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంటి పైకప్పులో స్విమ్మింగ్ పూల్ ఉండేలా డిజైన్ చేశారు. దీంతో ఎండాకాలంలో ఇంటిలోపల చల్లదనంతో పాటు స్విమ్మింగ్పూల్లో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. సముద్రపు ఒడ్డున ఇలాంటి ఇల్లు కట్టుకుంటే.. ఉషోదయ వేళ స్విమ్మింగ్ పూల్లో నిలబడి ఉంటే భానుడి వెచ్చటి కిరణాలు శరీరాన్ని స్పృశిస్తూ ఉంటే ఆహా.. ఒళ్లు పులకరించకుండా ఉంటుందా చెప్పండి. ఈ అనుభూతి దక్కాలంటే ‘సమ్మర్ హౌజ్’ను నిర్మించుకోవాల్సిందే. 85 చదరపు మీటర్ల స్థలంలో ఓ పెద్ద రాయిపై ఈ నిర్మాణం ఉంటుందని, ఇంటిపై ఉన్న స్విమ్మింగ్పూల్లోకి నేరుగా నీరు చేరేందుకు సముద్రపు నీటిలో అనుసంధానం చేసినట్లు ‘యాంటీ రియాలిటీ’ఆర్కిటెక్చర్ సంస్థ వెల్లడించింది. త్రికోణాకృతిలో ఇల్లు ఉంటుందని, ఇంటిలో హాల్, కిచెన్, బాత్రూం ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇంటికి ఒకవైపు సముద్ర తీరం ఉంటుందని, ఆ అందాలను వీక్షిస్తూ ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చని వివరించారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఊహాత్మకమైన ఇంటి డిజైన్ల యాంటీ రియాలిటీ వద్ద ఉన్నాయట. -
స్విమ్మింగ్ పూల్లో మునిగి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద A to Z ఈత కొలనులో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటమునిగి మృత్యువాతపడ్డాడు. గత కొంతకాలంగా విద్యార్థి ఈత నేర్చుకోవడం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. శనివారం ఉదయం కూడా రోజులానే స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. సమయానికి అక్కడ కోచ్ లేకపోవడంతో కొంత దూరం వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. బాలుడి మృతికి స్విమ్మింగ్ పూల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్లో కోచర్ లేకపోవడంతో పాటు అక్కడ సరియైన నిర్వహణ లేని కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు. అప్పటి వరకు తమ ముందు ఆడుకున్న తన కొడుకు విగత జీవిలా పడి వుండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై రాజేంద్రనగర్ పోలీసులకు తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు యాజమాని అక్కడి నుంచి అదృశ్యమయ్యరు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
అమెరికాలో 11 ఏళ్ల ‘తెలుగు’ సాహస బాలుడు
కర్నూలు(హాస్పిటల్): అమెరికాలోని ఈగన్ ప్రాంతంలో స్విమ్మింగ్పూల్లో మునిగిపోతున్న 34 ఏళ్ల వ్యక్తిని కాపాడిన 11 ఏళ్ల బాలుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని సాహసానికి మెచ్చిన అమెరికా పోలీసులు ‘లైఫ్ సేవింగ్ అవార్డు’ కోసం అక్కడి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన రఘు ఎన్. నటరాజ్, లలిత దంపతులు మూడేళ్ల క్రితం వారు ఉద్యోగరీత్యా అమెరికాలోని ఈగన్కు వెళ్లి..అక్కడున్న ఆక్వా టాట్స్ ప్రాంతంలోని టౌన్ సెంటర్ అపార్ట్మెంట్ హోమ్స్లో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న బంధువులను చూసేందుకు డిసెంబర్లో శ్రీనివాస ఆర్.ఎల్లావర్తి(34) అనే వ్యక్తి వచ్చాడు. అక్కడే ఉన్న ఇండోర్ స్విమ్మింగ్పూల్లో గత డిసెంబర్ 31న దూకాడు. ఈత రాక అతను మునిగిపోతుండటాన్ని చూసిన రఘు నటరాజ్ కుమారుడు అద్వైక్ ఎన్. విశ్వామిత్ర(11) స్విమ్మింగ్పూల్లోకి దూకి 8 అడుగుల లోతులో మునిగిపోయి ఉన్న శ్రీనివాస ఆర్.ఎల్లావర్తిని బయటకు తీసుకొచ్చాడు. -
ఇనాయాతో కలిసి తైమూర్, వైరల్
బాలీవుడ్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ మరుసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఈ బుడతడు పుట్టినప్పటి నుంచి తనకంటూ ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకు వెళుతున్నాడు. తైమూర్ ఏం చేసినా, ఎక్కడ కనిపించినా అభిమానులకు మాత్రం పండుగే. దీంతో అతగాడు కనిపించడం ఆలస్యం కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ కావడం తెలిసిందే. తాజాగా తైమూర్ తన మేనత్త (సోహా అలీ ఖాన్) కూతురు ఇనాయా నౌమితో కలిసి ఉన్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. తైమూరు కూడా తన ఇంట్లోని స్మిమ్మింగ్ పూల్ వద్ద ఇనాయా నౌమితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్గా మారాయి. -
అమీర్పేట స్విమ్మింగ్పూల్ ప్రారంభం
హైదరాబాద్: క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పాడిపరిశ్రమ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట గురుగోవింద్ సింగ్ ఆడిటోరియంలోని స్విమింగ్పూల్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్విమ్మింగ్పూల్లో నీరు లేక సకాలంలో ప్రారంభానికి నోచుకోలేదని తెలిపారు. ఈసారి ప్రత్యేక పైప్లైన్ ద్వారా నిరంతరం నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ ద్వారా జలమండలికి 22 లక్షల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. నగరంలో ఎక్కడా లేని విధంగా అమీర్పేట స్టేడియంలో స్విమ్మింగ్పూల్తో పాటు స్కేటింగ్, బ్యాడ్మింటన్, కరాటే, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, యోగా, జిమ్ సౌకర్యాలను కల్పించామని తెలిపారు. 50 మందికి ఒకేసారి స్విమ్మింగ్లో శిక్షణ ఇచ్చేలా సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట కార్పొరేటర్ నామన శేషు కుమారి, పలువురు జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో
సిడ్నీ : ఓ తల్లి తన నెలల బుజ్జాయి ఈత కొలనులో చేసిన అద్భుత విన్యాసాన్ని ఫేస్ బుక్లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెర్త్కు చెందిన రోక్షాన్నే టర్నర్ కు సంతానం తొమ్మిది నెలల బాబు మ్యాక్స్. తన బాబుకు స్మిమ్మింగ్ నేర్పించాలని భావించిన టర్నర్ స్మిమ్మింగ్ పూల్ కు మ్యాక్స్ ను తీసుకెళ్లింది. ఈత నేర్పించే ట్రైనర్ డైరాకు చిన్నారి మ్యాక్స్ కు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల స్మిమ్మింగ్ కు తల్లితో కలిసి వెళ్లాడు మ్యాక్స్. పుల్లో పడేసిన తర్వాత సొంతంగా వెల్లకిలా ఎలా మారాలో, నీటిపై ఎలా తేలియాడాలో ట్రైనర్ డైరా నేర్పించారు. ట్రైనర్ రెండు చేతులతో మ్యాక్స్ను కొలనులో వేయగా తన కుమారుడు చేసిన విన్యాసాన్ని వీడియో తీసి ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. పేరెంట్స్ అందరూ ఈ వీడియో చూడాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో
-
బాయ్ఫ్రెండ్ కారును స్విమ్మింగ్పూల్లో దింపి..
-
బాయ్ఫ్రెండ్ కారును స్విమ్మింగ్పూల్లో దింపి..
లండన్ : తన బాయ్ఫ్రెండ్పై కోపాన్ని ఓ గర్ల్ఫ్రెండ్ వెరైటీగా తీర్చుకుంది. బ్రేకప్ అయిన తర్వాత ఆగ్రహంతో అతడి కారును ఏకంగా స్విమ్మింగ్పూల్లో పార్కింగ్ చేసింది.. ఇంతల ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించగా 'నేను నాగర్ల్ప్రెండ్ను డంప్ చేశాను.. ఆమె నా కారును స్విమ్మింగ్పూల్లో డంప్ చేసిందంతే' అంటూ అతడు తాఫీగా సమాధానం ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. రష్యాన్ మోడల్ అయిన క్రిస్టినా కుచ్మా(24) జెంటిల్(41) అనే వ్యక్తి ఎప్పటి నుంచో గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఫుల్గా డేటింగ్ కూడా చేశారు. అయితే, తొలుత తన వ్యాపారానికి పెట్టుబడి తానే పెడతానని నమ్మబలికిన జెంటిల్ ఆ తర్వాత హ్యాండిచ్చాడని, కావాలని బ్రేకప్ చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. అతడు వాల్ స్ట్రీట్లో ఓ బ్యాంకర్ కావడంతో అతడి మాటలు నమ్మానని, చివరకు మోసపోయానని వాపోయింది. దీంతో అతడిపై ఆగ్రహంతో అతడి లక్ష డాలర్ల విలువైన మెర్సిడేస్ బెంజ్ కారును కనిపించకుండా చేసింది. అయితే, అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు గాలింపులు జరిపిన తర్వాఆ ఆ కారు ఓ స్మిమ్మింగ్లో కనిపించింది. అతడిపై కోపంతో ఆమెనే ఇలా చేసినట్లు తెలిపింది. -
కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్
- మహిళ అధికారిని కాపాడబోయి శవమైన ఐఏఎస్ న్యూఢిల్లీ: దేశంలో ఐఏఎస్లు వరుసగా మత్యువు బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న ఓ యువ ఐఏఎస్ అధికారి ఉత్తరప్రదేశ్లో శవమై కనిపించగా.. మంగళవారం దేశ రాజధానిలో ఓ ట్రైనీ ఐఏఎస్ మహిళా అధికారిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ట్రైనింగ్లో ఉన్న ఆశీష్ దహియా(30) సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇనిస్టిట్యూట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. ఇంతలో ఓ మహిళా అధికారి జారి స్విమ్మింగ్పూల్లో పడిపోవడంతో ఆమెను కాపాడటానికి కొందరు ట్రైనీ ఐఏఎస్లు అందులోకి దూకారు. వారిలో ఆశీష్ కూడా ఉన్నారు. ఆమెను రక్షించి మిగిలిన అధికారులు ఒడ్డుకు చేరుకోగా.. ఈత తెలియని ఆశీష్ నీటిలో మునిగిపోయారు. ఇది గుర్తించిన మిగిలిన వారు మరలా ఆశీష్ కోసం నీటిలోకి దూకారు. ఆశీష్ను ఒడ్డుకు చేర్చి మెడికల్ ఆఫీసర్కు సమాచారం అందించారు. ఈలోగా ప్రాథమిక చికిత్స అందించినా ఆశీష్ ప్రాణాలు కాపాడులేకపోయారు. ఆసుపత్రికి చేరుకునే లోపే ఆశీష్ మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సమయంలో ఆశీష్ మద్యం సేవించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆశీష్ తోటి అధికారులు, స్నేహితుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఈతపై అప్రమత్తత.. లేకుంటే గుండెకోత
చిత్తూరు ఎడ్యుకేషన్/తిరుపతి మంగళం: బయట భానుడు ఉగ్రరూపం.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. పైగా వేసవి సెలవులు. దీంతో ఎండ నుంచి ఉపశమనం కోసం యువకులు, విద్యార్థులు చెరువులను, స్విమింగ్ పూళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈత సరదా వారి ప్రాణాలను తీస్తోంది. చెరువుల్లో, స్విమింగ్ పూళ్లలో, కుంటల్లో లోతును అంచనా వేయలేక మృత్యువాత పడుతున్నారు. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. చెరువుల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ప్రమాదాల నివారణ ఇలా.. చిన్నారులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, వాగులు, కాలువలు, కుంటల్లోకి వెళ్తామంటే తల్లిదండ్రులు అనుమతించకూడదు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పాలి. స్నేహితులు, బంధువులు, ఇతరులతో ఈతకు పంపకూడదు. ప్రాక్టీసు లేకుండా స్విమ్మింగ్ పూల్లో దూకకూడదు. ఒంటరిగా ఈతకు వెళ్లకూడదు. నీటి అడుగు భాగంలోకి వెళ్లి మట్టిని తీసుకురావడం వంటి çపనులు చేయకూడదు. స్విమ్మింగ్ పూళ్లలో సురక్షితుడైన ఈతగాడి ఆధ్వర్యంలోనే ఈత నేర్చుకోవాలి. పిల్లల వెంట తప్పకుండా పెద్దలు ఉండాలి. తీర్థయాత్రలకు, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈత వచ్చినప్పటికీ నీటి లోపలికి పిల్లలను పంపకూడదు. వీటిని పాటిస్తే మంచిది.. ఈత కొట్టేటప్పుడు శరీర నిర్మాణానికి అనువైన స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలి. తల వెంట్రుకలు తడవకుండా మాస్క్ ధరించాలి. వాతావరణానికి అనుకూలంగా డార్క్, క్లియర్ కళ్లజోళ్లను వాడాలి. చెవిలోకి నీరు వెళ్లి ఇన్ఫెక్షన్ కాకుండా సిలికాన్ ఇయర్ ఫ్లగ్స్ను వాడాలి. నీటిలో తడవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వాజిలిన్ వంటిది పూయాలి. ముఖాన్ని పైకి ఉంచి ఈదాలి. ఊపిరీ పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ⇒దూకేటప్పుడు కాళ్లు మొదట నీళ్లను తాకేలా చూసుకోవాలి. డైవింగ్ చేయవద్దు. తలకిందులుగా దూకొద్దు. ⇒క్వారీ గుంతల అడుగుభాగంలో బండలు, రాళ్లు ఉంటాయి. లోతును ముందుగానే అంచనా వేయకపోతే ప్రమాదం. ⇒ఈతలో ఎంతటి నిపుణుడైనా ఇతరులు మునిగిపోతున్నప్పుడు వారిని రక్షించేందుకు నీళ్లలోకి దూకొద్దు. కర్రలు, తాడు, ఇతర పరికరాలను ఉపయోగించాలి. ⇒ఒకే సారి ఇద్దరు, ముగ్గురిని రక్షించకూడదు. ఎంతటి గజ ఈతగాడైనా సరే వారితోపాటే మునిగిపోయే ప్రమాదం ఉంది. ∙అరగంట కంటే ఎక్కువ సేపు ఈత కొట్టకూడదు. గంటల కొద్దీ ఈదడం వల్ల ఊపిరాడదు. నీటిలో మునిగిన వారిని రక్షించే విధానం ఆకస్మికంగా నీటిలో ఎవరైనా మునిగిపోతే వారిని రెండు పద్ధతుల్లో రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రత్యక్ష పద్ధతి మొదటిది. ఈ పద్ధతిలో రక్షించే వారికి ఈత వచ్చి ఉండాలి. మునిగిపోతున్న వ్యక్తి వెనుక నుంచి మాత్రమే వెళ్లాలి. మునిగిపోతున్న వ్యక్తి మొలతాడు లేదా జట్టు పట్టుకుని బయటకు తీసుకురావాలి. రెండవది పరోక్ష పద్ధతిః ఈ పద్ధతిలో ఈతరాని వారు కూడా రక్షించవచ్చు. ఒడ్డుకు దగ్గరగా ఉండే కర్ర, టవల్, ప్యాంట్లను వారికి అందించి బయటకు లాగాలి. బుర్రకాయ, థర్మాకోల్, మూతబిగించిన నీటి క్యాన్ వంటి నీటిపై తేలే వస్తువులను బాధితుడి వద్దకు చేర్చాలి. అవగాహన అవసరం.. ఈతకు వెళ్లే వారికి చెరువులు, కుంటలు, స్విమింగ్ పూళ్లలో నీటి మట్టంపై అవగాహన ఉండాలి. నీటిలో సంభవించే ప్రమాదాల బారి న నుంచి బయటపడేందుకు అవసరమైన మెళకువలను కూడా నేర్చుకోవా లి. అలా కాకుండా నీళ్లు చూడగానే లోతు ఎంత ఉందని తెలుసుకోకుండా దూకడం వల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. – బి.చక్రవర్తి (ఆది), స్విమ్మింగ్ కోచ్ -
ఈడ్చి..స్విమ్మింగ్ పూల్లో పడేశారు
-
ఈడ్చి.. స్విమ్మింగ్పూల్లో పడేశారు
పార్టీలో శబ్దాన్ని కొంచెం తగ్గించాలని కోరిన ఓ మహిళను కొంతమంది తీవ్రంగా అవమానించారు. రిసార్ట్లో పార్టీ చేసుకుంటున్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిల బృందం పెద్ద శబ్దంతో మ్యూజిక్ను పెట్టింది. దీంతో మిగిలిన వారికి అది ఇబ్బందిగా మారడంతో వారి వద్దకు వెళ్లిన మహిళ సౌండ్ తగ్గించాలని కోరింది. అందుకు మిగిలిన వారు సమాధానం చెప్పేలోపే గ్రూప్లోని ఓ వ్యక్తి ఆమెను స్విమ్మింగ్ పూల్లో పడేసేందుకు ఎత్తుకుని జారి పడ్డాడు. ఈ ఘటనలో మహిళ మొహానికి గట్టి దెబ్బ తగిలింది. ఆ తర్వాత వెంటనే లేచిన వ్యక్తి మళ్లీ ఆమెను ఈడ్చుకుంటూ పూల్లోకి దూకేశాడు. దీంతో ఒక్కసారిగా మిగతావారంతా అటూఇటూ పరిగెత్తడంతో రిసార్ట్లో గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్ వైరల్ అవుతోంది. స్నేహితుల బృందం మహిళ పట్ల ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. -
కింద సరస్సు... పైన కొలను
ఫొటో చూడగానే విషయం అర్థమైపోరుుందా! సరే... ఈ వై ఆకారపు ఇంటిని త్వరలో తైవాన్లో నిర్మించనున్నారు. నెదర్లాండ్సకు చెందిన ఎంఆర్వీడీవీ అనే సంస్థ డిజైన్ చేసిన ఈ వినూత్నమైన ఇల్లు దాదాపు 330 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం నాలుగు బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూమ్తోపాటు గ్రౌండ్ లెవెల్లో అందమైన చిన్న సరస్సు, లాన్, పార్క్లు ఉంటాయి. అంతేనా... అనకండి.. ఫొటోను కొంచెం జాగ్రత్తగా చూస్తే... ఇంటిపైభాగంలో అందమైన ఓ స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది. ఆ రూఫ్టాప్పైనే... పూల్కు పక్కన చిన్న చిన్న పార్టీలు చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నారుు. భలే ఉంది కదూ...! -
క్రీడలూ ముఖ్యమే..
గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య గుంటూరు రూరల్: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. మండలంలోని నల్లపాడు గ్రామంలో గల లయోలా పబ్లిక్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్, ప్రథమ చికిత్స కేంద్రాలను శనివారం ఆయన రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల కోసం స్విమ్మింగ్ పూల్, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. కేవలం చదువుతోనే కాకుండా క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తాను విద్యలో సాధారణ విద్యార్థినేనని, క్రీడల్లో మాత్రం ఫుట్బాల్, 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో ఎప్పుడూ అసాధారణ ప్రతిభతో ముందుండేవాడినని తెలిపారు. ఎంసెట్ ద్వారా గుంటూరు మెడికల్ కళాశాలలో సీట్లు పొందిన పాఠశాల పూర్వ విద్యార్థులను, తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ అమరరావు, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ఆంథోని తదితరులు పాల్గొన్నారు. -
ఆ స్విమ్మింగ్ పూల్ను మూసేశారు..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్న స్విమ్మింగ్ పూల్ ను మూసేశారు. సాధారణంగా ఈత కొలను అనేది నీలి రంగులో దర్శనమిస్తూ ఉంటుంది. అయితే రియో ఒలింపిక్స్ ఆరంభమయ్యాక మారియా లెంక్ అక్వాటిక్స్ సెంటర్ లోని ఒక స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు ఆకుపచ్చ రంగులో మారడం వివాదస్పదమైంది. అయితే దీన్ని తొలుత తేలిగ్గా తీసుకున్న రియో యాజమాన్యం, ఆ తరువాత నీటిలో నాణ్యత లేకపోవడాన్ని గ్రహించి దాన్ని ఎట్టకేలకు మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నీళ్లను నీలి రంగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిని శుద్ధిచేయడానికి, స్విమ్మర్లకు ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రకాల రసాయనాలు అందులో కలపడంతోనే రంగు మారినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ స్విమ్మింగ్ పూల్ లో పీహెచ్ స్థాయి సమతౌల్యం దెబ్బతినడం వల్లే నీళ్ల రంగులో మార్పు సంభవించి ఉండొచ్చునని వారు విశ్లేషించారు. -
బాగా.. డీ..ఈఈ..ప్గా ఈదండి!
ఈ స్విమ్మింగ్పూల్ చాలా లోతు గురూ..! ఈత.. కొందరికి ఎక్సర్సైజ్.. ఇంకొందరికి అడ్వెంచర్! మీరు రెండో కేటగిరీకి చెందిన వారైతే ఈ వార్త మీ కోసమే. ఫొటోలో కనిపిస్తున్నదే.. దీని పేరు ‘వై 40 ది డీప్ జాయ్’. ఇటలీలోని మోంటేగ్రొట్టోలో ఉండే హోటల్ మిలిపినీ టెర్మేలో ఉంటుంది ఇది. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్గా దీనికి పేరుంది. ఎంత లోతు అంటారా? పేరులో ఉందిగా.. 40 అని అన్ని మీటర్లు! అడుగుల్లో చెప్పుకోవాలంటే దాదాపు 132 అడుగులన్నమాట! పై నుంచి చూస్తే సాధారణ స్విమ్మింగ్ పూల్ మాదిరిగా కనిపించినా.. లోతుకు వెళ్లే కొద్దీ దీంట్లోని అందాలు అటు థ్రిల్.. ఇటు ఆనందాన్ని ఇస్తాయి. ముందుగా చెప్పుకోవాల్సింది డైవ్ కొట్టడం గురించి. వై 40లో ఏకంగా 36 అడుగుల ఎత్తు నుంచి డైవ్ కొట్టే సౌకర్యముంది. అంతేకాకుండా స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్లను కూడా అనుభవించేందుకు దీంట్లో మూడు గుహల్లాంటి ఏర్పాట్లూ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి కానీ నాకు ఈత రాదే.. అంటున్నారా? నో ప్రాబ్లెమ్. మీలాంటి వారి కోసం ఇందులో ఓ సొరంగం లాంటి నిర్మాణముంది. పూర్తిగా పారదర్శకమైన గాజుతో కట్టిన ఈ సొరంగంలోకి నడిస్తే వై 40లో జరుగుతున్న అన్ని రకాల కార్యకలాపాలను చూసేయవచ్చు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడైనా దాదాపు 43 లక్షల లీటర్ల నీళ్లు ఉంటాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నీళ్లు క్లోరిన్ కంపు కొట్టవు. అంత లోతులో నీళ్లు మరీ చల్లగా ఉంటాయి అనుకోవద్దు. వై 40లో నీటి ఉష్ణోగ్రత రోజంతా 34 సెల్సియస్. డిగ్రీలు అంటే బయట వణికించే చలి ఉన్నా.. లోపల మాత్రం వెచ్చగానే ఉంటుందన్నమాట! -
ఊసరవెల్లిలా రంగులు మార్చుతోంది!
సాధారణంగా ఈత కొలను(స్విమ్మింగ్ పూల్) అనగానే మనకు నీలి రంగులో ఉండే నీళ్లు గుర్తొస్తాయి. వాస్తవానికి ప్రతి కాంపిటీషన్లోనూ స్విమ్మింగ్ పూల్ లో ఉపయోగించే వాటర్ నీలి రంగులో దర్శనమిస్తుంది. అయితే రియోలో మాత్రం కాస్త విచిత్రం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తెల్లారేసరికల్లా ఆకుపచ్చ రంగులోకి మారాయి. అధికారులు చెప్పే పొంతనలేని మాటలతో ఏకీభవించకుండా, ఊసరవెల్లిలాగ స్విమ్మింగ్ పూల్స్ కూడా రంగులు మార్చుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదం రియోలో బుధవారం చర్చనీయాంశమైంది. రియోలో ఓ ఈత కొలను ఆకుపచ్చగా మారిపోయింది. ముందు రోజు వరకు నీళ్లు నీలం రంగులో ఉన్నాయి. ఐతే తెల్లారేసరికి ఆకుపచ్చ రంగులోకి మారడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీకాక బుధవారం నీళ్ల రంగు మారిన కొలనులోనే పోటీలు నిర్వహించారు. అక్కడి వాతావరణంలో మార్పుల వల్లే నీళ్ల రంగు మారే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య అధికారులు మాట్లాడుతూ.. ఈత కొలనులో నీళ్ల రంగు మారిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నీటిని శుద్ధిచేయడానికి, స్విమ్మర్లకు ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రకాల రసాయనాలు అందులో కలిపినట్లు వెల్లడించారు. పీహెచ్ స్థాయి సమతౌల్యం దెబ్బతినడం వల్లే నీళ్ల రంగులో మార్పు సంభవించి ఉండొచ్చునని అభిప్రాపడ్డారు. నీళ్లను నీలి రంగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి
ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్పూల్కు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక అల్లమయ్యగుట్టకు చెందిన జోనధన్(12) ఈత కొలనులో ఈత నేర్చుకోవడానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
భయపెట్టే ... ‘స్విమ్మింగ్ పూల్’
ఓ ప్రేమ జంటకు ఎదురైన భయానక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘స్విమింగ్ పూల్’. అఖిల్ కార్తీక్, వశిష్ఠ జంటగా మనోహర్ చిమ్మని దర్శకత్వంలో అరుణ్కుమార్ ముప్పన నిర్మించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిన రొమాంటిక్ హారర్ చిత్రమిది. యూఎస్, యూకే, జర్మనీల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు. -
ఆకాశంలో ఈత మార్గం..
రెండు ఆకాశహర్మ్యాలను కలుపుతూ మధ్యలో బ్రిడ్జి ఉండటం కొత్తేమీ కాదు. కౌలాలంపూర్లోని పెట్రోనాస్ ట్విన్ టవర్లను కలుపుతూ 41, 42 అంతస్తుల్లో ఇలాంటి బ్రిడ్జి విఖ్యాతి చెందింది కూడా. అయితే లండన్లోని నైన్ ఎల్మ్స్ జిల్లాలో మాత్రం కొత్త బ్రిడ్జి రాబోతోంది. ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లాలంటే ఈత కొట్టాల్సిందే. ఎందుకంటే... రెండు పదంతస్తుల భవనాలను కలుపుతూ ఏకంగా ఓ స్విమ్మింగ్ పూల్ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా గాజుతో ఉంటుంది. అంటే అందులో ఈతకు దిగిన వారికి కిందనున్నవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. 90 అడుగుల పొడవు, 4 అడుగుల లోతు ఉండే ఈ స్విమ్మింగ్పూల్ నుంచి చూస్తే బ్రిటన్ పార్లమెంటు భవనం ఏరియల్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుందట! -
గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్
హైదరాబాద్: గోల్కొండ కోట సందర్శకులకు శుభవార్త. లోపలికి అడుగు పెట్టిన దగ్గర్నుంచి కోట పైకి ఎక్కి.. మళ్లీ దిగేవరకు ఆయాసం, చెమటలు అందరికీ అనుభవమే. అయితే ఇకపై ఈ బాధలన్నీ తీరిపోనున్నాయ్. పర్యాటకులు ఎంచక్కా గోల్కొండ కోటలోని స్విమ్మింగ్ పూల్ లో చల్లటి స్నానం చేసి బడలికను ఒదిలించుకోవచ్చు. ఇంతకీ ఆ ఈత కొలను ఎక్కడుందాంటారా.. కోటలోని షాహతిమ్ చెరువు లేదా కటోరా హౌస్ కుంటలను స్విమ్మింగ్ పూల్స్గా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శుక్రవారం షాహతిమ్, కటోరా చెరువులను సందర్శించారు. ఈ రెండు చెరువుల్లో ఒకదానిని ఎంపిక చేసుకుని రూ. 1.25 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్ను నిర్మించనున్నట్లు సోమేశ్ చెప్పారు. తర్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. చారిత్రక గోల్కొండ కోటలోనే తెలంగాణ ప్రభుత్వం జెండా పండుగ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
పదేళ్లకే ప్రపంచ చాంపియన్షిప్లో...
బహ్రెయిన్ చిన్నారి అల్జైన్ తారిఖ్ సంచలనం కజాన్ (రష్యా): చాలామంది చిన్నారులు ఈత కొలనులోకి దిగేందుకు తటపటాయించే వయస్సులోనే ఆ చిన్నారి ఏకంగా ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగింది. మేటి స్విమ్మర్లతో పోటీపడింది. తన ఈవెంట్లో అందరికంటే ఆఖరున నిలిచినప్పటికీ అందరి మనస్సులను గెలుచుకుంది. ఆ చిన్నారి ఎవరోకాదు బహ్రెయిన్కు చెందిన 10 ఏళ్ల అల్జైన్ తారిఖ్. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో భాగంగా శుక్రవారం జరిగిన 50 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్ తొలి హీట్స్లో బరిలోకి దిగడంద్వారా అల్జైన్ తారిఖ్... ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పోటీపడిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. తన రేసును 41.13 సెకన్లలో ముగించిన అల్జైన్ 64 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో చివరి స్థానంలో నిలిచింది. ‘ఇంతమంది ప్రేక్షకుల సమక్షంలో గతంలో ఎప్పుడూ స్విమ్మింగ్ చేయలేదు. దాంతో పోటీకి సిద్ధమయ్యేందుకు వస్తున్న సమయంలో కాస్త గాబరా కలిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనడమే నా లక్ష్యం. నేనెంతో అభిమానించే మేటి స్విమ్మర్లతో ఇక్కడ ఫొటోలు దిగాను. వారి నుంచి మెళకువలను నేర్చుకుంటాను’ అని నాలుగేళ్ల ప్రాయంలో స్విమ్మింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన అల్జైన్ తెలిపింది. ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు కనీస వయసు నిబంధనను ఇటీవలే అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (ఫినా) తొలగించడంతో అల్జైన్కు ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభించింది. అండర్-12 విభాగంలో బహ్రెయిన్ నంబర్వన్గా ఉన్నందుకు అల్జైన్ను ప్రపంచ చాంపియన్షిప్కు ఆమె కోచ్ ఎంపిక చేశారు. అల్జైన్ తల్లి స్కాట్లాండ్ దేశీయురాలు కాగా... తండ్రి తారిఖ్ సలీమ్ బహ్రెయిన్కు చెందినవారు. ‘అల్జైన్ వారంలో ఐదు రోజులు శిక్షణ తీసుకుంటుంది. యూఏఈ, ఖతార్, జోర్డాన్లలో జరిగిన అంతర్జాతీయ మీట్స్లో ఆమె బరిలోకి దిగింది. అల్జైన్కు 14 ఏళ్లు వచ్చాక మెరుగైన శిక్షణ కోసం బ్రిటన్కు మకాం మార్చే ఆలోచనలో ఉన్నాం’ అని తారిఖ్ తెలిపారు. -
స్విమ్మింగ్పూల్లో మృతదేహం
విశాఖపట్నం: విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లోని స్టీల్ క్లబ్ స్విమ్మింగ్పూల్లో మృతదేహన్ని సిబ్బంది మంగళవారం గుర్తించారు. అనంతరం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టీల్ క్లబ్కు చేరుకుని స్విమ్మింగ్పూల్ నుంచి మృతదేహన్ని బయటకు తీశారు. మృతుడు స్టీల్ ప్లాంట్లో కార్మికుడిగా పని చేస్తున్న జిలాని (53)గా గుర్తించారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు స్విమ్మింగ్పూల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జిలానిని ఎవరైనా హత్య చేసి స్విమ్మింగ్ పూల్లో పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జల్లంత... తుళ్లింత
-
స్విమ్మింగ్పూల్లో బాలుడు మృతి
-
స్విమ్మింగ్పూల్లో మునిగి బాలుడు మృతి
హైదరాబాద్: స్విమ్మింగ్పూల్లో మునిగి ప్రమాదవశాత్తు ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉప్పర్పల్లి హ్యాపీహోమ్స్లో జీబీఆర్ స్విమింగ్పూల్ ఉంది. శుక్రవారం సాయంత్రం అత్తాపూర్ ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన హసన్అలీ కుమారుడు రిజ్వాన్అలీ(12) స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు స్విమింగ్పూల్కు వచ్చాడు. నీటిలోకి దిగి ఈత కొడుతూనే ఒక్కసారిగా రిజ్వాన్ మునిగిపోయాడు. వెంటనే పైకి తీయడం ఆలస్యం కావడంతో అతడు మృతి చెందాడు. ఈత కొలను వద్ద సరైన ముందు జాగ్రత్తలు లేకపోవడంతో చనిపోయాడా? ఈత రాక మృతిచెందాడా? అన్నది తమ దర్యాప్తులో తేలుతుందని ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు. (అత్తాపూర్) -
స్మార్ట్గా సాగరయానం..
ఇప్పుడు అంతా స్మార్టే... ఫోన్ల దగ్గర నుంచి నగరాల వరకు అన్నీ స్మార్టే... ఈ భారీ షిప్ కూడా ఆ కోవలోకే వస్తుంది. దీని పేరు ‘క్వాంటమ్ ఆఫ్ ది సీస్’. ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ షిప్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ నౌకల్లో మూడోది. ఇందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! వేగవంతమైన వైఫై, స్కైడైవింగ్ సిమ్యులేటర్, కాక్టెయిల్ అందించే రోబో బార్టెండర్లు, సాగర అందాలను 360 డిగ్రీల కోణంలో తిలకించేందుకు పాసింజర్ పాడ్, స్విమ్మింగ్పూల్, భారీ స్క్రీన్ టీవీలు, అద్భుతమైన సూట్లు, వర్చువల్ బాల్కనీలు, ఇండోర్ స్డేడియాలు, 18 ఫుడ్ కోర్టులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాయే ఈ షిప్పంత అవుతుంది. ఇంతకీ దీని పొడవు ఎంతో తెలుసా? 1,141 అడుగులు. అంటే, ఐదు బోయింగ్ 747 విమానాలను ఒకదాని వెనుక ఒకటి ఉంచితే ఎంత పొడవు ఉంటుందో అంత. వెడల్పు 136 అడుగులు.. బరువు 1,68,666 టన్నులు. ఒక్కోటీ 4,694 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన నాలుగు థ్రస్టర్లు ఈ భారీ నౌకను ముందుకు కదిలిస్తాయి. మొత్తం 18 డెక్కులున్న ఈ ఓడలో 2090 గదులున్నాయి. వీటిలోని లగ్జరీ సూట్లు చూస్తే మనల్ని మనమే మైమరచిపోతాం. ఇక సముద్ర అందాలను వినూత్నంగా తిలకించేందుకు ఓ పాసింజర్ పాడ్ ఏర్పాటు చేశారు. అందులో ఎక్కితే సముద్ర మట్టం నుంచి 300 అడుగుల ఎత్తులో 360 డిగ్రీల కోణంలో ప్రకృతి అందాలను తిలకించవచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఓసారి ఈ షిప్ ఎక్కాలనిపిస్తోందా? కొంచెం ఖర్చవుతుంది మరి! రోజుకు ఓ లక్ష రూపాయలు మీవి కాదనుకుంటే ఈ విలాసవంతమైన ప్రయాణం మీ సొంతమవుతుంది. ఎనిమిది రోజలపాటు ఇందులో ప్రయాణించడానికి రూ.7.86 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది న్యూజెర్సీలోని కేప్ లిబర్టీ నుంచి ఫ్లోరిడాలోని పోర్ట్ కెనావరల్, నస్సావు మీదుగా బహమాస్లోని కోకోకే వరకు వెళ్లి, తిరిగి న్యూజెర్సీ వస్తుంది. -
లోతు.. లోయంత..
ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ఈత కొలను. ఎంత అంటే.. 12 అంతస్తుల బిల్డింగ్ అంత.. 9 డబుల్ డెక్కర్ బస్సులను ఒకదానిపై మరొకటి పెడితే.. ఎంతుంటుందో అంత.. దీని లోతు 131.2 అడుగులు. వై-40 పేరిట నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ ఇటలీలోని మాంటిగ్రొత్తో తెర్మేలో ఉన్న తెర్మే మిల్లెపినీ హోటల్లో ఉంది. ఇందులో నీటి అడుగున సొరంగం లాంటిదాన్ని కూడా నిర్మించారు. ఈత కొట్టడం రాని వారు.. దీన్లోకి వెళ్లడం ద్వారా నీటి కింద ఉన్న అనుభూతిని పొందవచ్చు. అత్యంత లోతైన ఈ ఈత కొలను ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ చేసే వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. -
స్విమ్మింగ్ పూల్ లో దూకి....విద్యార్ధి మృతి