IRELAND
-
గాజా ప్లాన్పై ట్రంప్ రివర్స్ గేర్
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది కూడా. గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనా ప్రజలు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా తరలి వెళ్లాల్సిందేనని అన్నారాయన. అయితే.. హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిథిలమైన గాజాను పునర్ నిర్మించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ బహిష్కరించమని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. బుధవారం ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్(Micheál Martin)తో ఆయన వైట్హౌజ్లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాజా నుంచి బహిష్కరణలు ఉండబోవని అన్నారు. ఈ సందర్భంగా.. యూఎస్ సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షూమర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారాయన. గతంలో ఆయన(చక్ షూమర్) యూదుడైనప్పటికీ.. ఇప్పుడు మాత్రం పాలస్తీనియన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో ఇదే అంశంపై ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చర్చకు దారి తీశారు కూడా. అయితే.. గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ గాజా ప్లాన్ను ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) తిరస్కరించింది. ప్రతిగా.. ఈజిప్ట్ ప్రతిపాదిస్తున్న ప్రణాళికకు మద్దతు ఇచ్చింది.గాజా యుద్ధం.. మధ్యలో ఐర్లాండ్గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఐర్లాండ్కు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో.. గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఓ కేసు వేయగా.. అందులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగాకిందటి ఏడాది డిసెంబరులో ఐర్లాండ్లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్అవీవ్(ISRAEL) ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్-మార్టిన్ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక.. భవిష్యత్తు గాజా పేరిట ట్రంప్ పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియోనూ సైతం ట్రంప్ విడుదల చేయగా అది తీవ్ర విమర్శలకు తావు ఇచ్చింది. హమాస్ సంస్థ సైతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. గాజా పాలస్తీనాలో విడదీయలేని భాగమని.. కొనుగోలు చేసి.. అమ్మడానికి అదేం స్థిరాస్తి కాదని ప్రకటించింది. అదే సమయంలో ఆ వీడియోను సృష్టించిన డిజైనర్.. అది కేవలం పొలిటికల్ సెటైర్ మాత్రమేనని ప్రకటన చేశాడు. -
జింబాబ్వేదే టి20 సిరీస్
హరారే: సొంతగడ్డపై ఐర్లాండ్తో జరిగిన టి20 సిరీస్ను జింబాబ్వే కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన చివరి పోరు వర్షం కారణంగా రద్దు కాగా... జింబాబ్వే 1–0తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. రెండో టి20లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగిన చివరి టి20లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (27 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), టోనీ (26), తషింగా (26 నాటౌట్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్, గారెత్ డెలానీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఐర్లాండ్ జట్టు లక్ష్యఛేదనకు దిగకముందే భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ సాధ్యపడలేదు. ఫలితంగా జింబాబ్వేకు సిరీస్ దక్కింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ జట్టు విజయం సాధించగా... అనంతరంమూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో జింబాబ్వే 2–1తో గెలుపొందింది. -
భళా భారత్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించిన భారత్... వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున నీలమ్ సంజీప్ (14వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (24వ నిమిషంలో), అభిõÙక్ (28వ నిమిషంలో), శంషేర్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టిన భారత్ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్ 14వ నిమిషంలో ఫీల్డ్గోల్తో భారత్ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్దీప్, అభిõÙక్, శంషేర్ తలా ఒక గోల్ కొట్టారు. మ్యాచ్లో భారత్కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా... రెగ్యులర్ కెప్టెన్, స్టార్ డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్లో సోమవారం ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. దీపిక గోల్తో భారత్ గెలుపు మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్లో దానికి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున స్టార్ డ్రాగ్ఫ్లికర్ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. పెనాల్టీ కార్నర్ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్ ఆడుతుంది. -
ఐర్లాండ్పై భారత్ విజయం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టుకు మరో విజయం లభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (22వ నిమిషంలో), జర్మన్ప్రీత్ సింగ్ (45వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఐర్లాండ్ జట్టుకు జెరెమీ డంకన్ (8వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. మరోవైపు జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 0–4 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఐర్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వెల్లింగ్టన్ మసకద్జ (35), బ్రియాన్ బెన్నెట్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్ కర్రన్ (18), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (4), జోనాథన్ క్యాంప్బెల్ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు, కర్టిస్ క్యాంఫర్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్, జాషువ లిటిల్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (89), వన్డౌన్ బ్యాటర్ కర్టిస్ క్యాంఫర్ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్ టక్కర్ (36 నాటౌట్), జార్జ్ డాక్రెల్ (20 నాటౌట్) ఐర్లాండ్ను విజయతీరాలకు చేర్చారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్ మూడు మ్యాచ్ల సిరీస్లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది. -
బెన్నెట్ విధ్వంసకర సెంచరీ.. ఐర్లాండ్ను చిత్తు చేసిన జింబాబ్వే
ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను జింబాబ్వే విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 49 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. మొదట జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (163 బంతుల్లో 169; 20 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన బెనెట్ చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (61 బంతుల్లో 66; 3 ఫోర్లు, 4 సిక్స్లు)... బెనెట్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.ఏకైక టెస్టులో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన జింబాబ్వే తొలి వన్డేలో దానికి బదులు తీర్చుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 46 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ స్టిర్లింగ్ (32), క్యాంపెర్ (44), టెక్టర్ (39), టకర్ (31), డాక్రెల్ (34), మెక్బ్రైన్ (32) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎన్గరవా మూడు వికెట్లు పడగొట్టారు. బెనెట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్? -
సచిన్, కోహ్లికి సాధ్యం కాని ఘనతను సాధించిన జింబాబ్వే ఆటగాడు
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) సాధించలేని ఘనతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఓ ఘనతను ఇవాళ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) సాధించాడు. బెన్నెట్.. 22 ఏళ్లు నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్, విరాట్ ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించలేదు. విరాట్ 23 ఏళ్ల 134 రోజుల వయసులో .. సచిన్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ సాధించారు.వన్డే క్రికెట్ చరిత్రలో బ్రియాన్ కంటే చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 4 రోజులు) అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించగా.. బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (20 ఏళ్ల 149 రోజులు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (20 ఏళ్ల 353 రోజులు) ఆతర్వాతి ఉన్నారు. తాజాగా బ్రియాన్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐర్లాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న వన్డేలో బ్రియాన్ 163 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. కెరీర్లో కేవలం ఏడో వన్డేలోనే బ్రియాన్ రికార్డు సెంచరీ సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో 150 పరుగుల మార్కును తాకిన ఐదో క్రికెటర్గా బ్రియాన్ రికార్డుల్లోకెక్కాడు. దీనికి ముందు బ్రియాన్ జింబాబ్వే తరఫున టెస్ట్ల్లో సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు.మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ క్రెయిగ్ ఐర్విన్ (66) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్ 28, సికందర్ రజా 8, మెదెవెరె 8, జోనాథన్ క్యాంప్బెల్ (అలిస్టర్ క్యాంప్బెల్ కొడుకు) 6, మరుమణి 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, జాషువ లిటిల్, హ్యూమ్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 31 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. పాల్ స్టిర్లింగ్ 32, కర్టిస్ క్యాంపర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. హ్యారీ టెక్టార్ (33), లోర్కాన్ టక్కర్ (30) క్రీజ్లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. -
జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్కు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్కు 127 పరుగులు జోడించారు. మెక్బ్రైన్, అదైర్తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్కార్తీ 4, ఆండీ మెక్బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్బెల్ చెరో వికెట్ పడగొట్టారు.292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. -
రాణించిన ఐరీష్ కెప్టెన్.. జింబాబ్వే లక్ష్యం 292
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఐర్లాండ్... ఆతిథ్య జట్టు ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారం మూడో రోజు 83/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఐర్లాండ్ 93.3 ఓవర్లలో 298 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (60; 2 ఫోర్లు), లార్కన్ టక్కర్ (58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. జింబాబ్వే బౌలర్లలో ఎన్గరవ 4, ట్రెవర్ వాండు, వెస్లీ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం కలిపి 292 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే... మూడో రోజు ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.టాపార్డర్ బ్యాటర్లు కైటానో (14; 3 ఫోర్లు), బెన్ కరన్ (4), నిక్ వెల్చ్ (5) వికెట్లను పారేసుకోగా... ఆట నిలిచే సమయానికి బ్రియాన్ బెన్నెట్ (15 బ్యాటింగ్, 1 ఫోర్), ట్రెవర్ వాండు (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడేర్, బారీ మెకార్తీ, మాథ్యూ హంఫ్రేస్ తలా ఒక వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్నప్పటికీ జింబాబ్వే విజయానికి 254 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లున్నాయి.చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్ -
సంచలనం.. అరంగేట్రంలోనే టీమ్ కెప్టెన్గా
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్తో లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ క్యాంప్బెల్ తనయుడు జోనాథన్ కాంప్బెల్ జింబాబ్వే తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా తన అరంగేట్ర మ్యాచ్లోనే జింబాబ్వే కెప్టెన్గా వ్యవహరించే అవకాశం కాంప్బెల్కు దక్కింది. ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు రెగ్యూలర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారంణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో 27 ఏళ్ల జోనాథన్కు జట్టు పగ్గాలను జింబాబ్వే టీమ్ మెనెజ్మెంట్ అప్పగించింది. తద్వారా కాంప్బెల్ ఓ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రంలోనే జింబాబ్వే టెస్టు కెప్టెన్గా వ్యవహరించిన రెండో ప్లేయర్గా కాంప్బెల్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ డేవ్ హౌటన్ ఉన్నాడు. హౌటన్ 1992లో హరారే వేదికగా భారత్తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే సారథిగా వ్యవహరించాడు.ఇక ఓవరాల్గా 21వ శతాబ్దంలో డెబ్యూలోనే టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో ప్లేయర్గా జోనాథన్ కాంప్బెల్ రికార్డులకెక్కాడు. కాంప్బెల్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లీ జెర్మెన్ 1995లో భారత్తో జరిగిన టెస్టులో తన అరంగేట్రంలోనే కెప్టెన్గా పనిచేశాడు. ఆ తర్వాత స్ధానాల్లో నైమూర్ రెహమాన్ (2000లో బంగ్లాదేశ్), విలియం పోర్టర్ఫీల్డ్ (2018లో ఐర్లాండ్), అస్గర్ ఆఫ్ఘన్ (2018లో ఆఫ్ఘనిస్తాన్) ఉన్నారు. వీరిందరూ అరంగేట్రంలోనే తమ జట్ల టెస్టు కెప్టెన్గా వ్యవహరించారు. జోనాథన్ కాంప్బెల్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. 34 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలతో సహా 1,913 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ 42 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు:జింబాబ్వే (ప్లేయింగ్ XI): బెన్ కుర్రాన్, టకుద్జ్వానాషే కైటానో, నిక్ వెల్చ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ కాంప్బెల్(కెప్టెన్), వెస్లీ మాధవెరె, న్యాషా మాయావో(వికెట్ కీపర్), న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ న్గారవ, బ్లెస్సింగ్ ముజారబానీ, ట్రెవర్ గ్వాండుఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పీటర్ మూర్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్కీపర్), ఆండీ మెక్బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, క్రెయిగ్ యంగ్చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు సమం -
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
డబ్లిన్:ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) కాగా మరొకరిని పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26)గా గుర్తించారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్(25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. భార్గవ్ శుక్రవారం(జనవరి31) రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్(26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికా సహా విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణాలు ఎక్కువవడం కలవరం కలిగిస్తోంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు పిల్లలను పంపాలంటే ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. విదేశాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు దుండగుల కాల్పుల్లో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతుండడం వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. -
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో వాసవీ మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రీతకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘ శుద్ధ విదియ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వందమందికి పైగా వాసవి మాత భక్తులు ,కార్యక్రమ నిర్వాహక సభ్యులు, స్థానిక VHCCI ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా విశ్వశాంతి కొరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమము, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. వివిధరకాల పుష్పాలతో అమ్మవార్ని అలంకరించారు. పల్లకి సేవ అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, అష్టోత్తరం, లలిత సహస్రనామ పఠనము, సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు.హాజరైన భక్తులందరికీ ఆంధ్రాభవన్, ఇండియన్ వైబ్, తాలి రెస్టారెంట్, రుచి రెస్టారెంట్స్ నుండి రుచికరమైన నోరూరించే వంటకాలతో అందరికి బోజనాలను వడ్డించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు శ్రీనివాస్ వెచ్చ, శిరీష, సంతోష్ కుమార్ పారేపల్లి, శ్రీనివాస్ సూడా, శృతి ముత్తుకుమార్, బాలాజీ జ్యోత్స్నా, రేణుక దినేష్, నితేశ్ గుప్తా, రఘు వల్లంకొండ, ప్రవీణ్ మదిరే, వెంకట్ జూలూరి లకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు, కార్యక్రమ పురోహితులు సాయి ప్రజ్వల్ ద్వారా సత్కరించి అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. తరువాత అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో కావ్య , దివ్య , లావణ్య, , రేణుక మరియు శిరీష తదితరులకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.తరువాత కార్యక్రమంలో నిర్వాహక సభ్యులైన నవీన్ సంతోష్, నరేంద్ర, భార్గవ్, శ్రీనివాస్ వెచ్చ మరియు మాణిక్ అందరు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరగాలని కోరుకున్నారు. చివరిగా ఆలయ సభ్యులైన రమణ, సాగర్ తదితరులకు సభ్యులందరు కృతఙ్ఞతలు తెలియజేసారు, నిర్వాహక సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా సంతోష్, సాయి తేజ, సందీప్, ప్రఫుల్ల, సుధీర్, సంపత్ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. -
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్ మహిళలలతో జరిగిన మ్యాచ్లో 13 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. తద్వారా ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో మొత్తం రెండు మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు.. రెండింట కూడా పరాజయం పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.ఐర్లాండ్ బ్యాటర్లలో వాల్ష్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. అన్నాబెల్ స్క్వైర్స్(13), హర్సిన్(10) రాణించారు. పాక్ బౌలర్లలో మెమూనా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టగా.. మనహర్ జెబ్, హషిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులకే పరిమితమైంది.పాక్ బ్యాటర్లలో కోమాల్ ఖాన్(12) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో ఎల్లీ మెక్గీ రెండు వికెట్లు పడగొట్టగా.. సార్జెంట్, లారా మెక్బ్రైడ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్.. -
T20 WC 2025 USA vs Ire: ధనాధన్.. 9.4 ఓవర్లలోనే..
ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025)లో అమెరికా తొలి గెలుపు నమోదు చేసింది. అమెరికా యువతుల జట్టు ఐర్లాండ్(Ireland Women U19 vs USA Women U19)పై మెరిక విజయం సాధించింది. కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జొహూర్ బహ్రూ వేదికగా సోమవారం జరిగిన ఈ ‘సూపర్ షో’ టోర్నీకే వన్నె తెచ్చింది. 75 పరుగులకే ఆలౌట్ముందుగా ఐర్లాండ్ 17.4 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అలైస్ వాల్ష్ (16; 2 ఫోర్లు), లాలా మెక్బ్రిడ్ (13), అబీ హ్యారిసన్ (13), ఫ్రెయా సర్జెంట్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.ఇసాని వాఘెలా 3, అదితిబా, రీతూ సింగ్, చేతన ప్రసాద్ తలా 2 వికెట్లు తీశారు. తెలుగు సంతతి అమ్మాయి ఇమ్మడి శాన్వీ ఒక వికెట్ తీసింది. తర్వాత అమెరికా జట్టు 9.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు దిశా ఢీంగ్రా (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్లు), తెలుగు సంతతి అమ్మాయి పగిడ్యాల చేతన రెడ్డి (25 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 9.3 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. ఆ మరుసటి బంతికే ఇసాని వాఘేలా (4 నాటౌట్) బౌండరీ బాదడంతో ఇంకా 10.2 ఓవర్లు మిగిలుండగానే అమెరికా అమోఘ విజయం సాధించింది. ఇక మంగళవారం జరిగే మ్యాచ్ల్లో శ్రీలంకతో వెస్టిండీస్ (ఉదయం 8 గంటల నుంచి), మలేసియాతో భారత్ (మధ్యాహ్నం 12 గంటల నుంచి) తలపడతాయి.సంచలన విజయంఈ మెగా టోర్నీతోనే వరల్డ్కప్లో అరంగేట్రం చేసిన ఆఫ్రికా దేశం నైజీరియా యువతుల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్లో సోమవారం జరిగిన పోరులో నైజీరియా... న్యూజిలాండ్కు ఊహించని షాక్ ఇచ్చింది. మహిళల క్రికెట్లో కివీస్ బలమైన జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకు ఏమాత్రం తీసిపోని గట్టి ప్రత్యర్థి. అలాంటి జట్టును తాము నిర్దేశించిన 66 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించకుండా నిలువరించడం పెద్ద విశేషం.గ్రూప్ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల తేడాతో కివీస్పై గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 13 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన నైజీరియా నిర్ణీత 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ లక్కీ పియెటి (25 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్స్కోరర్ కాగా, లిలియన్ ఉడే (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రెండంకెల స్కోరు చేసింది.ఇతరుల్లో ఇంకెవరూ కనీసం పది పరుగులైనా చేయలేదు. తర్వాత స్వల్ప లక్ష్యమే అయినా కివీస్ 13 ఓవర్లలో 6 వికెట్లకు 63 పరుగులే చేసి ఓడింది. అనిక టాడ్ (27 బంతుల్లో 19; 1 ఫోర్), ఇవ్ వొలాండ్ (15 బంతుల్లో 14; 1 ఫోర్) మెరుగ్గా ఆడారంతే! లలియన్ ఉడే (3–0–8–1) బౌలింగ్లోనూ అదరగొట్టింది.ఆఖరి ఓవర్ డ్రామా... కివీస్ 57/5 స్కోరు చేసి గెలుపు వాకిట నిలబడింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు చేస్తే చాలు. కానీ నైజీరియన్ బౌలర్ లక్కీ పియెటి 6 పరుగులే ఇచ్చింది. దీంతో 2 పరుగుల తేడాతో ఊహించని విధంగా న్యూజిలాండ్ కంగుతింది. లక్కీ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులే ఇచ్చింది. ఇందులో రెండో బంతి ‘బై’ కాగా, నాలుగో బంతి లెగ్బై!అంటే బ్యాటర్లు కొట్టింది 2 పరుగులే అన్నమాట! ఐదో బంతికి పరుగే ఇవ్వలేదు. ఇక మిగిలింది. చివరి బంతి... కివీస్ గెలిచేందుకు 5 పరుగులు కావాలి. అయాన్ లంబట్ (6 నాటౌట్) కొట్టిన షాట్కు 2 పరుగులే రాగా, మరో పరుగుకు ప్రయతి్నంచడంతో కెప్టెన్ టష్ వేక్లిన్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) రనౌటైంది. చదవండి: 10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్కప్-2025లో సంచలనం -
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
రాజ్కోట్: భారత పర్యటనలో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ జట్టు మందకొడిగా బౌలింగ్ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్ రిఫరీ జి.ఎస్.లక్షి... ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
ఐర్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్..
-
టాప్ ఫోర్... వైల్డ్ ఫైర్
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్డౌన్లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్ బ్యాటింగ్కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్: వోర్లా ప్రెండర్గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0. -
టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. గతంలో భారత అత్యధిక స్కోర్ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్పై భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లో భారత్ విండీస్పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో భారత టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్ దక్కించకుంది.వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు..370/5 ఐర్లాండ్పై (2025)358/2 ఐర్లాండ్పై (2017)358/5 వెస్టిండీస్పై (2024)333/5 ఇంగ్లండ్పై (2022)325/3 సౌతాఫ్రికాపై (2024)317/8 వెస్టిండీస్పై (2022)314/9 వెస్టిండీస్పై (2024)302/3 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఐర్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసింది. లియా పాల్ (59) అర్ద సెంచరీతో రాణించింది.భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్ ఏమీ మగూర్ 3 వికెట్లు పడగొట్టింది. -
సిరీస్ విజయంపై గురి
రాజ్కోట్: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్లో ప్రతీక రావల్, తేజల్ హసబ్నిస్ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్ ఫామ్ కొనసాగించాలని చూస్తోంది. గత మ్యాచ్లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టిటాస్ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్ అదే జోష్లో సిరీస్ సమం చేయడంతో పాటు... భారత్పై తొలి విజయం సాధించాలని చూస్తోంది. -
ప్రతీక, తేజల్ గెలిపించగా...
రాజ్కోట్: భారత మహిళల క్రికెట్ జట్టులో ఇటీవలే కొత్తగా వచ్చిన ఇద్దరు యువ బ్యాటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సత్తా చాటారు. వన్డే కెరీర్లో కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ప్రతీక రావల్, తేజస్ హసబ్నిస్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఆటకు సీనియర్ స్మృతి మంధాన తోడవటంతో ఐర్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డే భారత్ ఖాతాలో చేరింది. జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేయగా... భారత్ 34.3 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. సిరీస్లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. రాణించిన గాబీ, లియా... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేక ఐర్లాండ్ ఇబ్బంది పడింది. 29 పరుగుల వ్యవధిలో జట్టు తొలి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెప్టెన్ గాబీ లూయిస్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు), లియా పాల్ (73 బంతుల్లో 59; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 25 ఓవర్ల పాటు పట్టుదలగా క్రీజ్లో నిలబడిన ఈ జోడీ ఐదో వికెట్కు 117 పరుగులు జోడించింది. ఈ క్రమంలో గాబీ 75 బంతుల్లో, లియా 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కండరాల నొప్పితో బాధపడుతూ ఆడిన గాబీ త్రుటిలో తన తొలి సెంచరీని చేజార్చుకుంది. భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా ఐర్లాండ్కు కలిసొచ్చిoది.మన ఫీల్డర్లు నాలుగు సునాయాస క్యాచ్లు వదిలేశారు. ఇందులో ఒకటి గాబీ క్యాచ్, మరో రెండు లియా క్యాచ్లు కాగా...చివర్లో ఎర్లీన్ కెల్లీ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్యాచ్ కూడా వదిలేయడంతో ఐర్లాండ్ 50 ఓవర్లు ఆడగలిగింది. భారీ భాగస్వామ్యం... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రతీక రావల్ (96 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ స్మృతి మంధాన (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి వేగంగా ఛేదనను ప్రారంభించారు. వీరిద్దరు 10.1 ఓవర్లలోనే 70 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (6 బంతుల్లో 9; 2 ఫోర్లు) వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలో ప్రతీకకు తేజల్ (46 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు) జత కలిసింది. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ జట్టును వేగంగా గెలుపు దిశగా తీసుకుపోయారు. 70 బంతుల్లో ప్రతీక, 43 బంతుల్లో తేజల్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. భారత్ విజయం కోసం మరో 21 పరుగులు కావాల్సి ఉండగా, ప్రతీక 75 పరుగుల వద్ద ఉంది. ఈ దశలో మాగ్వైర్ బౌలింగ్లో 2 ఫోర్లు, సిక్స్తో 89కి చేరిన ఆమె మరో భారీ షాట్కు ప్రయతి్నంచి వెనుదిరిగింది. తేజల్తో కలిసి రిచా ఘోష్ (8 నాటౌట్) ఆట ముగించింది. ఈ మ్యాచ్తో సయాలీ సత్ఘరే భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 152వ ప్లేయర్గా గుర్తింపు పొందింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా ఫోర్బ్స్ (సి) దీప్తి (బి) సాధు 9; గాబీ లూయిస్ (సి అండ్ బి) దీప్తి 92; యునా రేమండ్ (రనౌట్) 5; ప్రెండర్గాస్ట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రియ 9; డెలానీ (బి) ప్రియా మిశ్రా 0; లియా పాల్ (రనౌట్) 59; క్రిస్టినా కూల్టర్ (నాటౌట్) 15; ఎర్లీన్ కెల్లీ (ఎల్బీ) (బి) సయాలీ 28; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–27, 2–34, 3–56, 4–56, 5–173, 6–194, 7–230. బౌలింగ్: టిటాస్ సాధు 9–1–48–1, సయాలీ సత్ఘరే 10–2–43–1, సైమా ఠాకూర్ 10–0–30–0, ప్రియా మిశ్రా 9–1–56–2, దీప్తి శర్మ 10–1–41–1, ప్రతీక రావల్ 2–0–14–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ప్రెండర్గాస్ట్ (బి) సార్జంట్ 41; ప్రతీక రావల్ (సి) ప్రెండర్గాస్ట్ (బి) మాగ్వైర్ 89; హర్లీన్ డియోల్ (సి) ప్రెండర్గాస్ట్ (బి) మాగ్వైర్ 20; జెమీమా (స్టంప్డ్) కూల్టర్ (బి) మాగ్వైర్ 9; తేజల్ (నాటౌట్) 53; రిచా ఘోష్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 21; మొత్తం (34.3 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–70, 2–101, 3–116, 4–232. బౌలింగ్: ఒర్లా ప్రెండర్గాస్ట్ 4.4–0–28–0, జార్జినా డెంప్సీ 5.3–0– 50–0, ఎర్లీన్ కెల్లీ 6–0–29–0, ఫ్రేయా సార్జంట్ 8–0–38–1, ఎయిమీ మాగ్వైర్ 8–1–57–3, లౌరా డెలానీ 2.2–0–36–0. -
భారత జట్టు తరపున అరంగేట్రం.. ఎవరీ సయాలీ గణేష్?
రాజ్కోట్ వేదికగా భారత మహిళల జట్టు తొలి వన్డేలో ఐర్లాండ్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హర్మాన్ ప్రీత్ కౌర్ గైర్హజరీలో స్మతి స్మృతి మంధాన భారత జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తోంది. ఇక ఈ మ్యాచ్తో ముంబైకి చెందిన ఆల్రౌండర్ సయాలీ సత్ఘరే గణేష్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెప్టెన్ స్మతి స్మృతి మంధాన చేతుల మీదగా ఆమె ఇండియా క్యాప్ను అందుకుంది. ఈ క్రమంలో నెటిజన్లు ఎవరీ సయాలీ అని వెతుకుతున్నారు.ఎవరీ సయోలీ?24 ఏళ్ల సయోలీ సత్ఘరే దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2015లో అరంగేట్రం చేసిన ఆమె.. అప్పటినుంచి నిలకడగా రాణిస్తోంది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. గతేడాది డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్కు ఆమె ప్రాతినిథ్యం వహించింది. ఆ సీజన్లో తొలుత ఆమె చాలా మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైంది.కానీ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం సయోలీకి సువర్ణ అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో డి హేమలతకు కంకషన్ సబ్స్టిట్యూట్గా ఆమె బరిలోకి దిగింది. ఆ మ్యాచ్లో ఆమె పర్వాలేదన్పించింది. దీంతో డబ్ల్యూపీఎల్-2025 సీజన్కు ముందు గుజరాత్ ఆమెను రూ.10 లక్షలకు రిటైన్ చేసుకుంది. సయోలీ సత్ఘరే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది.దేశీవాళీ క్రికెట్లో అదుర్స్..లిస్ట్-ఎ క్రికెట్లో ఇప్పటివరకు 51 మ్యాచ్లు ఆడిన సయోలీ.. 20.81 సగటుతో 666 పరుగులు, 56 వికెట్లు పడగొట్టింది. 2023–24 సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై ఆమె ఆజేయ సెంచరీతో మెరిసింది. బౌలింగ్లో 7/5 స్పెల్ అత్యుత్తమ గణాంకాలుగా ఉన్నాయి.తుది జట్లుభారత మహిళల జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సయాలీ సత్ఘరే, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధుఐర్లాండ్ మహిళల జట్టు: సారా ఫోర్బ్స్, గాబీ లూయిస్(కెప్టెన్), ఉనా రేమండ్-హోయ్, ఓర్లా ప్రెండర్గాస్ట్, లారా డెలానీ, లేహ్ పాల్, కౌల్టర్ రీల్లీ(వికెట్ కీపర్), అర్లీన్ కెల్లీ, జార్జినా డెంప్సే, ఫ్రెయా సార్జెంట్, ఐమీ మాగైర్ -
వన్డే సమరం!
భారత్, ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య 1993 నుంచి ఇప్పటి వరకు 12 వన్డేలు జరిగాయి. వీటన్నింటిలోనూ భారతే గెలవగా, ఐర్లాండ్కు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. ఈ మ్యాచ్లన్నీ ఐసీసీ టోర్నీల్లో భాగంగానే నిర్వహించారు ఒక్కసారి కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత మూడు మ్యాచ్ల సిరీస్తో ద్వైపాక్షిక పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుత ఫామ్లో ఉన్న భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉండగా... ఐర్లాండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. రాజ్కోట్: స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల జట్టు దేశంలోని వేర్వేరు వేదికలపై సిరీస్లు ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో బెంగళూరులో, న్యూజిలాండ్తో అహ్మదాబాద్లో, వెస్టిండీస్తో వడోదరలో ఆడిన జట్టు ఇప్పుడు మరో కొత్త వేదిక రాజ్కోట్లో ఐర్లాండ్తో తలపడుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఐర్లాండ్తో భారత మహిళల జట్టు ఆడనుంది. ప్రస్తుతం ఇరు జట్ల బలబలాలు చూస్తే భారత్ సంపూర్ణ ఆధిక్యంలో కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలిచి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని జట్టు పట్టుదలగా ఉంది. కొత్త ప్లేయర్లకు అవకాశం... రెగ్యులర్ కెపె్టన్ హర్మన్ప్రీత్కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. స్మృతి వన్డేల్లో గతంలో ఒకే ఒక మ్యాచ్లో కెపె్టన్గా వ్యవహరించింది. టాప్ పేసర్ రేణుకా సింగ్ లేకపోవడంతో కాస్త అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్లతోనే ఆమె ఫలితాలు రాబట్టాల్సి ఉంది. అయితే కొత్త ప్లేయర్లను మరింతగా పరీక్షించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. హర్మన్ స్థానంలో రాఘ్వీ బిస్త్ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. మహిళల దేశవాళీ వన్డే టోర్నీలో ఉత్తరాఖండ్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన రాఘ్వీ భారత్ ‘ఎ’ తరఫున ఆసీస్ ‘ఎ’ తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసింది. రేణుక, పూజ వస్త్రకర్తో పాటు అరుంధతి రెడ్డి కూడా జట్టులో లేకపోవడంతో టిటాస్ సాధు, సైమా ఠాకూర్లపై పేస్ బౌలింగ్ భారం ఉంది. ఆల్రౌండర్ కావాలంటే సయాలీ సత్ఘరే అందుబాటులో ఉండగా... దీప్తి శర్మ, ప్రియా మిశ్రాకు తోడుగా తుది జట్టులో మరో స్పిన్నర్ కావాలంటే తనూజ కన్వర్కు అవకాశం దక్కవచ్చు. అయితే సైమా, సాధు, ప్రియా కలిపి మొత్తం 20 వన్డేలు కూడా ఆడలేదు. ఓపెనర్గా తన స్థానం సుస్ధిరం చేసుకునేందుకు ప్రతీక రావల్కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత షఫాలీ వర్మ మరోవైపు దేశవాళీ క్రికెట్లో చెలరేగిపోతోంది. సీనియర్ వన్డే ట్రోఫీలో 527 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన ఆమె వన్డే చాలెంజర్ ట్రోఫీలో కూడా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్లలో మెరుపు వేగంతో రెండు అర్ధసెంచరీలు సాధించింది. ఈ నేపథ్యంలో ప్రతీక ఆ స్థాయి దూకుడును చూపించాల్సి ఉంది. మరో ఓపెనర్గా స్మృతి సూపర్ ఫామ్లో ఉండటం భారత్కు సానుకూలాంశం. హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్లపై భారత బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. ఆల్రౌండర్లే బలం... గాబీ లూయిస్ సారథ్యంలో ఐర్లాండ్ ఈ సిరీస్కు సన్నద్ధమైంది. ఈ టీమ్లో కూడా కొందరు అనుభవజు్ఞలతో పాటు ఎక్కువ మంది యువ ప్లేయర్లు ఉన్నారు. 2024లో జింబాబ్వే, శ్రీలంకలపై వన్డే సిరీస్లు నెగ్గిన ఐర్లాండ్... ఇంగ్లండ్, బంగ్లాదేశ్ చేతిలో సిరీస్లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్పై 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక వన్డే మ్యాచ్లో గెలవగలిగింది. ఐర్లాండ్ టీమ్లో ఒర్లా ప్రెండర్ఘాస్ట్ కీలక ప్లేయర్గా ఎదిగింది. ఆల్రౌండర్గా గత ఏడాది జట్టు తరఫున అత్యధిక పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకపై చేసిన సెంచరీ ఆమె సత్తాను చూపించింది. మహిళల బిగ్బాష్ లీగ్లో ఆమెకు మంచి అనుభవం ఉంది. మరో ఆల్రౌండర్ లౌరా డెలానీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎయిమీ మగ్వైర్, జొవానా లాఫ్రన్ టీమ్లో ఇతర ప్రధాన ప్లేయర్లు. అయితే గత కొంతకాలంగా సంచలన ఆటతో 19 ఏళ్ల ఐర్లాండ్ స్టార్గా ఎదిగిన ఎమీ హంటర్ గాయంతో ఈ సిరీస్కు దూరం కావడం జట్టును కాస్త బలహీనపర్చింది. -
స్మృతి సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్కు స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్తో ఇటీవల జరిగిన టి20 సిరీస్లో చివరి రెండు మ్యాచ్లకు స్మృతినే కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించింది. విండీస్తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్కు కూడా విరామం ఇచ్చారు. విండీస్తో సిరీస్లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్కోట్లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది. జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్ఘరే. -
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టబ్స్ విధ్వంసర సెంచరీ.. సౌతాఫ్రికా చేతిలో ఐర్లాండ్ చిత్తు
అబుదాబి వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో 174 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0 తేడాతో ప్రోటీస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. సఫారీ బౌలర్ల దాటికి కేవలం 169 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ పేసర్ లిజార్డ్ విలియమ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, జార్న్ ఫోర్టుయిన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, బార్టమన్ చెరో వికెట్ పడగొట్టారు. ఐరీష్ బ్యాటర్లలో క్రెయిగ్ యంగ్(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.సెంచరీతో చెలరేగిన స్టబ్స్..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 81 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. స్టబ్స్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. స్టబ్స్తో పాటు వెర్నయనే(67), ముల్డర్(43) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్, కాంఫ్హర్, హోయ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఆక్టోబర్ 7న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: T20 WC: న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే? -
చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం
పరిమిత ఓవర్ల క్రికెట్లో సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. టీ20 వరల్డ్కప్ అనంతరం ఆ జట్టు వెస్టిండీస్ (టీ20 సిరీస్లో 0-3 తేడాతో ఓటమి), ఆఫ్ఘనిస్తాన్ (వన్డే సిరీస్లో 1-2 తేడాతో ఓటమి) లాంటి సాధారణ జట్ల చేతుల్లో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ పసికూన ఐర్లాండ్ చేతుల్లోనూ ఓటమిపాలైంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్ సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. టీ20ల్లో ఐర్లాండ్కు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం.THE HISTORIC MOMENT FOR IRELAND.- First time ever Ireland beat South Africa in a T20i match. 🇮🇪pic.twitter.com/Hp6BtushbB— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024మెరుపు శతకంతో అలరించిన రాస్ అదైర్అబుదాబీ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అదైర్ బ్రదర్స్ బ్యాట్తో, బంతితో చెలరేగి ఐర్లాండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. రాస్ అదైర్ మెరుపు శతకంతో (58 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ (31 బంతుల్లో 52) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్ 2, ఎంగిడి, విలియమ్స్, క్రుగెర్ తలో వికెట్ పడగొట్టారు.బంతితో చెలరేగిన మార్క్ అదైర్196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మార్క్ అదైర్ (4-0-31-4), గ్రహం హ్యూమ్ (4-0-25-3) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాథ్యూ హంఫ్రేస్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ (51), మాథ్యూ బ్రీట్జ్కీ (51) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ర్యాన్ రికెల్టన్ (36) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చదవండి: ఐదో వన్డేలో ఆసీస్ విజయం.. సిరీస్ కైవసం -
ఇంగ్లండ్పై ఐర్లాండ్ సంచలన విజయం
మహిళల టీ20 క్రికెట్లో పసికూన ఐర్లాండ్ పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాకిచ్చింది. నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఓర్లా ప్రెండర్గాస్ట్ ఆల్రౌండ్ షోతో (2/31, 51 బంతుల్లో 80; 13 ఫోర్లు) అదరగొట్టి ఐర్లాండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఆఖరి ఓవర్లో ఐర్లాండ్ గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. మ్యాడీ విలియర్స్ (ఇంగ్లండ్ బౌలర్) వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి భయపెట్టింది. అయినా ఐర్లాండ్ ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇంగ్లండ్పై ఐర్లాండ్కు ఇది తొలి విజయం. ఈ గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది.The celebrations by Irish women after beating England women for the first time ever in a T20i. ❤️pic.twitter.com/H6pdzWzLuL— Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బేమౌంట్ (40), స్కోల్ఫీల్డ్ (34), బ్రైయోనీ స్మిత్ (28), జార్జియా ఆడమ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్గాస్ట్, ఆర్లీన్ కెల్లీ, ఆమీ మాగ్యూర్ తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. మరో బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రెండర్గాస్ట్ (80).. గ్యాబీ లెవిస్ (38), లియా పాల్ (27 నాటౌట్) సహకారంతో ఐర్లాండ్ను గెలిపించింది. చివరి ఓవర్లో కాసేపు నాటకీయ పరిణామాలు (ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది) చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా ఐర్లాండ్నే విజయం వరించింది. ఐర్లాండ్ దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్లోనూ ఓ మ్యాచ్లో ఇంగ్లండ్కు షాకిచ్చింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్ ఇంగ్లండ్ను ఓడించింది. ఆ సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు -
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్రౌండర్ సిమ్రన్జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్కు ఆడిన సిమికాగా సిమ్రన్జిత్ సింగ్ భారత్లోని పంజాబ్లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్రౌండర్కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్కు వెళ్లిఅయితే, క్రికెట్పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
ఐర్లాండ్పై ఇంగ్లండ్ భారీ విజయం
మహిళల ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ (సెప్టెంబర్ 9) జరిగిన వన్డే మ్యాచ్లో (రెండో వన్డే) ఇంగ్లండ్ 275 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. టామీ బేమౌంట్ (150 నాటౌట్) భారీ శతకంతో సత్తా చాటింది. బేమౌంట్కు ఫ్రేయా కెంప్ (65) సహకారం అందించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లీనా కెల్లీ, ఫ్రేయా సర్జంట్ చెరో రెండు.. అలీస్ టెక్టార్, జేన్ మగూర్, ఏమీ మగూర్ తలో వికెట్ పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 16.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్లో కేవలం ఒక్కరు (ఉనా రేమండ్ (22)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్, లారెన్ ఫైలర్ తలో మూడు.. ఫ్రేయా కెంప్, జార్జియా డేవిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న జరుగనుంది. కాగా, మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్లో పర్యటిస్తుంది. -
సౌతాఫ్రికా జట్ల ప్రకటన.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం మూడు వేర్వేరు దక్షిణాఫ్రికా జట్లను ఇవాళ (సెప్టెంబర్ 9) ప్రకటించారు. ఈ సిరీస్లలో సౌతాఫ్రికా తొలుత ఆఫ్ఘనిస్తాన్తో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్లు షార్జా వేదికగా జరుగనున్నాయి. ఆతర్వాత సౌతాఫ్రికా ఐర్లాండ్తో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్లన్నీ అబుదాబీ వేదికగా జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్లతో జరిగే సిరీస్ల కోసం ప్రకటించిన జట్లలో వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఈ సిరీస్లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్ స్మిత్, న్కాబా పీటర్, ఆండిలే సైమ్లేన్ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 18, 20, 22 తేదీల్లో జరుగనుంది. ఐర్లాండ్తో టీ20లు సెప్టెంబర్ 27, 29.. వన్డేలు అక్టోబర్ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ఆండిలే సైమ్లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రైన్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో టీ20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సైమ్లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెయిన్, లిజాడ్ విలియమ్స్ -
ప్రాణాపాయ స్థితిలో ఐర్లాండ్ టాప్ క్రికెటర్.. ఇండియాలో చికిత్స
ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్జిత్కు కాలేయ మార్పిడి జరుగనుందని.. ఆస్పత్రి సిబ్బంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.మొహాలీ నుంచి ఐర్లాండ్కు సిమి సింగ్గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్జిత్ సింగ్ భారత్లోని పంజాబ్లో గల మొహాలిలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న సిమి.. దేశవాళీ క్రికెట్ ఆడాడు. అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు.అయితే, ఈ లెగ్ స్పిన్ ఆల్రౌండర్కు భారత అండర్-19 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో హోటల్ మేనేజ్మెంట్ చదివేందుకు ఐర్లాండ్కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి ఏడాది డబ్లిన్లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికాపై శతకం బాదిఅద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. ఐర్లాండ్ టాప్ క్రికెటర్గా ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో శతకం బాది సంచలనం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సిమి వంద పరుగుల మార్కు అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను అలరించింది. ఇక 2020లో ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న సిమి సింగ్.. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అతడి లివర్ పూర్తిగా పాడైపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొంది. భార్య కాలేయదానంకాగా సిమి భార్య అగమ్దీప్ కౌర్ అతడికి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. డబ్లిన్లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తను కాపాడుకునేందుకు ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐర్లాండ్లో ఉన్నపుడు ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లకు సిమి సమస్య అర్థం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతడిని భారత్కు తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.చదవండి: T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్ -
శ్రీలంకకు వరుస షాక్లు
మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టుకు వరుస షాక్లు తగలుతున్నాయి. ఆ జట్టు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో వరుస మ్యాచ్ల్లో ఓటమిపాలవుతుంది. తొలుత టీ20 సిరీస్ను సమం చేసుకుని బయటపడ్డ శ్రీలంక.. తాజాగా వన్డే సిరీస్ను ఐర్లాండ్కు కోల్పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై ఐర్లాండ్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆమీ హంటర్ (66), లేయా పాల్ (81), రెబెకా స్టోకెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, అచిని కులసూరియ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చమారి ఆటపట్టు ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను హర్షిత సమరవిక్రమ (105) సెంచరీతో గెలిపించే ప్రయత్నం చేసింది. లంక ఇన్నింగ్స్లో హర్షితతో పాటు కవిష దిల్హరి (53) కూడా రాణించింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ 3, జేన్ 2, ఓర్లా, ఆమీ, ఫ్రేయా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఐర్లాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడు వన్డే ఆగస్ట్ 20న జరుగనుంది. -
సూపర్ సెంచరీ: శ్రీలంకపై ఐర్లాండ్ తొలి గెలుపు
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తొలిసారి శ్రీలంక జట్టుపై గెలుపు నమోదు చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత శతకంతో ఇది సాధ్యమైంది. కాగా రెండు టీ20, ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక మహిళా జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.17 ఫోర్లు, 2 సిక్సర్లుఇరు జట్ల మధ్య ఆదివారం నాటి (ఆగష్టు 11) తొలి టీ20లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలవగా.. మంగళవారం రాత్రి నాటి రెండో మ్యాచ్లో ఐర్లాండ్ను అనూహ్య రీతిలో విజయం వరించింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆమీ హంటర్ 9 పరుగులకే అవుటైనా.. మరో ఓపెనర్ గాబీ లూయిస్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.#Champion https://t.co/RSI0agcCbl— Cricket Ireland (@cricketireland) August 13, 2024 ఏకంగా 17 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 75 బంతుల్లోనే 119 పరుగులతో సత్తా చాటింది. గాబీకి తోడుగా వన్డౌన్ బ్యాటర్ ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్(38) రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 173 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే తమ ఓపెనర్ విష్మి గుణరత్నె(1) వికెట్ కోల్పోయింది.రాణించిన హర్షిత, కవిశా.. కానీ ఓటమి తప్పలేదుఅయితే, మరో ఓపెనింగ్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది. నాలుగో స్థానంలో వచ్చిన కవిశా దిల్హారీ 51 పరుగులతో అజేయంగా నిలవగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగిన శ్రీలంక ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మహిళా జట్టుకు శ్రీలంకపై తొలి అంతర్జాతీయ విజయం దక్కింది. ఐరిష్ బౌలర్లలో ఫ్రెయా సార్గెంట్, ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్ రెండేసి వికెట్లు తీయగా.. జానే మాగ్విరే, అవా కానింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండో టీ20లో విజయంతో సిరీస్ను 1-1తో సమం చేసింది ఐర్లాండ్. గాబీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.What. A. Game. https://t.co/PL5dcMepch— Cricket Ireland (@cricketireland) August 13, 2024 చదవండి: The Hundred 2024: కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో) -
IRE Vs ZIM: బౌండరీని ఆపబోతే ఇలా అయ్యిందేంటి..?
ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతంది.Fielder saves 4, batters run 5.pic.twitter.com/UgZqOp7iBc— CricTracker (@Cricketracker) July 28, 2024వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్ నగరవ బౌలింగ్లో ఆండీ మెక్బ్రైన్ కవర్ డ్రైవ్ ఆడగా.. టెండాయ్ చటార బౌండరీ లైన్ వరకు ఛేజింగ్ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్బ్రైన్, లోర్కాన్ టక్కర్ ఐదు పరుగులు తీశారు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో జింబాబ్వేపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్ను గెలిపించాడు. టెస్ట్ల్లో ఐర్లాండ్కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250, సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
ఐర్లాండ్ బ్యాటర్ల వీరోచిత పోరాటం.. జింబాబ్వేపై సంచలన విజయం
స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుత విజయం నమోదు చేసింది. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఐర్లాండ్కు చారిత్రక విజయం అందించారు. ఓవర్నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్ను గెలిపించాడు. టెస్ట్ల్లో ఐర్లాండ్కు ఇది రెండో విజయం. ఈ ఏడాది ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చింది.కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250, సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
నిప్పులు చెరిగిన నగరవ.. ఓటమి దిశగా ఐర్లాండ్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ మూడో రోజు ఆఖరి సెషన్లో నిప్పులు చెరిగాడు. నగరవ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. బ్లెస్సింగ్ ముజరబాని ఓ వికెట్ పడగొట్టాడు. నగరవ ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ ఏకంగా ముగ్గురు (పీటర్ మూర్, కర్టిస్ క్యాంఫర్, హ్యారీ టెక్టార్) డకౌట్లయ్యారు. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 4, పాల్ స్టిర్లింగ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. లొర్కాన్ టక్కర్ 9, ఆండీ మెక్ బ్రైన్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐర్లాండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే మరో 125 పరుగులు చేయల్సి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగా చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులు చేసింది. -
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే క్రికెటర్ క్లైవ్ మండాడే టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్లో ‘బై’స్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. ఐర్లాండ్తో టెస్టు సందర్భంగా ఈ పరాభవం మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే చేదు జ్ఞాపకాన్ని పోగుచేసుకున్నాడు.అరంగేట్రంలో డకౌట్ఏకైక టెస్టు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా గురువారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. 71.3 ఓవర్లలో 210 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది.ఓపెనర్లు గుంబీ 49, మస్వారే 74 పరుగులతో రాణించారు. సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మండాడే ఏడో స్థానంలో బరిలోకి దిగి.. డకౌట్గా వెనుదిరిగాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్ 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మూర్ 79 రన్స్ చేయగా.. ఆండీ మెక్బ్రైన్ 28 పరుగులతో ఐరిష్ ఇన్నింగ్స్లో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే కంటే.. 40 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.90 ఏళ్ల రికార్డు బద్దలుఅయితే, ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 24 ఏళ్ల క్లైవ్ మండాడే బైస్ రూపంలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ వికెట్ కీపర్ లెస్ ఆమ్స్ నమోదు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా 147 ఏళ్ల చరిత్రలో ఇలాంటి అన్వాంటెడ్ రికార్డు సాధించిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. అయితే, ఇందులో కేవలం క్లైవ్ను మాత్రమే తప్పుపట్టడానికి లేదు. జింబాబ్వే బౌలర్లకు కూడా ఇందులో భాగం ఉంది. కాగా 1934లో ఆమ్స్ ఒక టెస్టు ఇన్నింగ్స్లో 37 పరుగులు బైస్ రూపంలో ఇచ్చుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే ఐర్లాండ్ కంటే 28 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది జింబాబ్వే.తుదిజట్లుజింబాబ్వేజోయ్ లార్డ్ గుంబీ, ప్రిన్స్ మస్వారే, డియాన్ మేయర్స్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మాండాడే (వికెట్ కీపర్), బ్లెస్సింగ్ ముజరాబానీ, రిచర్డ్ నగరవా, తనకా చివంగా, టెండాయ్ చటారా.ఐర్లాండ్ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), పీటర్ మూర్, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), ఆండీ మెక్బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, మాథ్యూ హంఫ్రీస్. -
ఐర్లాండ్ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన జింబాబ్వేృ
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి రోజే ప్రత్యర్ధిని 210 పరుగులకు ఆలౌట్ చేశారు. బ్యారీ మెక్ కార్తీ, ఆండీ మెక్బ్రైన్ చెరి మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించగా.. మార్క్ అదైర్ 2, క్రెయిగ్ యంగ్, కర్టిస్ క్యాంఫర్ తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో ప్రిన్స్ మస్వౌరే 74 పరుగులతో రాణించగా.. జాయ్లార్డ్ గుంబీ (49), సీన్ విలియమ్స్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డియాన్ మైయర్స్ (10), కెప్టెన్ క్రెయిర్ ఎర్విన్ (5), బ్రియాన్ బెన్నెట్ (8), క్లైవ్ మదండే (0), బ్లెస్సింగ్ ముజరబానీ (4), రిచర్డ్ నగరవ (5), టెండయ్ చటార (0) నిరాశపరిచారు.కాగా, సొంతగడ్డపై ఐర్లాండ్కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లు ఆడింది. -
జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన
స్వదేశంలో జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్ జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. 22 ఏళ్ల అన్ క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ గావిన్ హోయ్ జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. ఈ ఒక్క ఎంపిక మినహా మిగతా జట్టంతా ఊహించిన విధంగానే ఉంది. సొంతగడ్డపై ఐర్లాండ్కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లు ఆడింది. జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ఈ నెల 25-29 మధ్యలో బెల్ఫాస్ట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం జింబాబ్వే జట్టును ఇదివరకే ప్రకటించారు. జింబాబ్వే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారథ్యం వహించనున్నాడు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్కు ఐర్లాండ్ జట్టు..ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గావిన్ హోయ్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, ఆండీ మెక్బ్రైన్, బారీ మెక్కార్తీ, జేమ్స్ మెక్కొల్లమ్, పిజె మూర్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రైగ్ యంగ్జింబాబ్వే జట్టు..డియోన్ మైర్స్, జోనాథన్ క్యాంప్బెల్, ప్రిన్స్ మస్వౌర్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, రాయ్ కయా, బ్రియాన్ బెన్నెట్, జాయ్లార్డ్ గుంబీ, క్లైవ్ మదండే, టనకా చివంగ, టెండాయ్ చటారా, బ్లెస్సింగ్ ముజరబాని, వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యాయుచి -
కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.ఏం జరిగినా అంతా ఓపెన్గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం స్పష్టం చేశాడు.వన్డే వరల్డ్కప్-2023లో వైఫల్యం తర్వాతపాక్ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ సారథ్యంలో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైంది.గ్రూప్-ఏలో ఉన్న పాక్.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్పై గెలుపొందినా అప్పటికే సూపర్-8 నుంచి నిష్క్రమించింది. పాక్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.అందరి ప్లేస్లో నేను ఆడలేను కదా!ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు. వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజం.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc) -
చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్
టీ20 వరల్డ్కప్-2024ను పాకిస్తాన్ విజయంతో ముగించింది. ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన పాకిస్తాన్.. తమ చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో గారెత్ డెలానీ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్కు 2 వికెట్లు దక్కాయి.తీవ్రంగా శ్రమించిన పాక్..అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు పాక్ తీవ్రంగా శ్రమించింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి కెప్టెన్ బాబర్ ఆజం(32) ఆజేయంగా నిలవగా.. ఆఖరిలో షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాక్కు రెండో విజయాన్ని అందించాడు.107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు."టోర్నమెంట్ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో బౌలింగ్లో మేము బాగానే రాణించాము. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును ఒత్తడిలోకి నెట్టాము. ఫ్లోరిడా వికెట్ పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.కానీ బ్యాటింగ్లో మాత్రం మేము మా మార్క్ను చూపించలేకపోయాము. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. ఏదో విధంగా టెయిలాండర్ల సాయంతో మ్యాచ్ను ముగించాము. ఇంతకుముందు మ్యాచ్ల్లో కూడా యూఎస్ఎ, భారత్పై కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయాం. జట్టు అవసరం బట్టి నేను ఏ పొజిషన్లోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అది ఓపెనింగ్ అయినా, ఫస్ట్డౌన్ అయినా కావచ్చు. ఇక జట్టులో మాత్రం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మాకు కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మేము బంగ్లాపర్యటనకు వెళ్లనున్నాం. ఈ నేపథ్యంలో మా బాయ్స్ తిగిరి కమ్బ్యాక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ టోర్నమెంట్లో ఎక్కడ తప్పు జరిగిందో అంచనా వేయాల్సిన అవసరం మాకు ఉందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బాబర్ పేర్కొన్నాడు.చదవండి: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం -
T20 World Cup 2024: పాకిస్తాన్ చచ్చీ చెడి...
లాడర్హిల్ (ఫ్లోరిడా): పేలవ ఆటతో ‘సూపర్–8’ అవకాశాలు కోల్పోయిన పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్లోనూ అతి కష్టమ్మీద నెగ్గి టి20 వరల్డ్ కప్ను ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 3 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (19 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. ఒకవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయినా... కెప్టెన్ బాబర్ ఆజమ్ (34 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చివరి వరకు నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) జట్టును గట్టెక్కించాడు. టి20 ప్రపంచకప్లో నేడుబంగ్లాదేశ్ X నేపాల్వేదిక: కింగ్స్టౌన్; ఉదయం గం. 5 నుంచినెదర్లాండ్స్ X శ్రీలంక వేదిక: గ్రాస్ ఐలెట్; ఉదయం గం. 6 నుంచిన్యూజిలాండ్ X పాపువా న్యూగినీవేదిక: ట్రినిడాడ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
PAK Vs IRE: ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్కప్-2024 నుంచి ఇప్పటికే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్.. చివరగా తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్తో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ ఆఖరి పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పాక్ జట్టులోకి నసీం షా స్ధానంలో అబ్బాస్ అఫ్రిది రాగా...ఐరీష్ జట్టులోకి బెన్ వైట్ వచ్చాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన పాక్.. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. ఐర్లాండ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా గెలుపొందలేదు.తుది జట్లుఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్ -
T20 WC: పాకిస్తాన్కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలతో చతికిలపడ్డ బాబర్ ఆజం బృందాన్ని దురదృష్టం కూడా వెంటాడింది.అమెరికా- ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది. గతేడాది రన్నరప్గా నిలిచిన ఈ జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టింది.మరోవైపు.. గ్రూప్-ఏ టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు అమెరికా కూడా తదుపరి దశకు అర్హత సాధించింది.బాబర్ ఆజంకు మరో చేదు అనుభవంగతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్ కూడా చేరుకుండానే ఐసీసీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో అతడు జట్టు ఓటములకు బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.ఆ తర్వాత బాబర్ ఆజం స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లుగా నియమితులయ్యారు. అయితే, వీరి సారథ్యంలో ఘోర పరాజయాలు.. అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మార్పుల అనంతరం.. బాబర్ ఆజం మళ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఎంపికయ్యాడు.ఆ సిరీస్లో వైట్వాష్టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు పీసీబీ అతడి పునర్నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వన్డే, టీ20 జట్లకు సారథిగా ప్రకటించింది. అయితే, బాబర్ కెప్టెన్సీలో తొలుత ఇంగ్లండ్తో సిరీస్ ఆడిన పాకిస్తాన్ వైట్వాష్(2-0)కు గురికాగా.. వరల్డ్కప్ టోర్నీలో పరాజయాల పరంపర కొనసాగింది.అమెరికా చేతిలో చిత్తుగ్రూప్-ఏలో టీమిండియా, ఐర్లాండ్, కెనడా, అమెరికాలతో పాటు ఉన్న పాకిస్తాన్.. తొలుత అమెరికా(సూపర్ ఓవర్ ద్వారా ఫలితం), అనంతరం టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. తద్వారా సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.మరోవైపు.. ఆతిథ్య అమెరికా తొలుత కెనడా.. తర్వాత పాకిస్తాన్ను ఓడించి మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో కెనడాపై విజయం సాధించిన పాకిస్తాన్.. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆశలు పెట్టుకోగా అది కాస్తా వర్షం వల్ల రద్దైంది.ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే అవుట్ఫలితంగా అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు చేరగా.. కేవలం రెండు పాయింట్లే కలిగి ఉన్న పాక్.. తమకు ఐర్లాండ్తో మిగిలిన మ్యాచ్లోనూ గెలిచినా లాభం లేకుండా పోయింది. ఐరిష్ జట్టుపై పాక్ గెలిచినా నాలుగు పాయింట్లే అవుతాయి కాబట్టి.. అమెరికాపై పైచేయి సాధించలేదు. దీంతో అమెరికా సూపర్-8కు చేరగా.. బాబర్ బృందం గ్రూప్ దశ కూడా దాటలేక నిష్క్రమించింది. చదవండి: T20 WC: అతడిని వదిలేశారు... కివీస్కు తగినశాస్తి: మాజీ క్రికెటర్ ఫైర్ -
అమెరికా ముందుకు... పాక్ ఇంటికి
లాడర్హిల్ (ఫ్లోరిడా): టి20 ప్రపంచ కప్లో అత్యంత కీలక ఫలితం! తొలిసారి ప్రపంచ కప్లో పాల్గొన్న ఆతిథ్య అమెరికా జట్టు సూపర్–8 దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ గ్రూప్ నుంచి భారత్ (6 పాయింట్లు), అమెరికా (5 పాయింట్లు) ముందంజ వేశాయి. ఆడిన 3 మ్యాచ్లలో ఒకటే గెలిచిన 2009 చాంపియన్ పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గత రెండు టి20ల్లో వరల్డ్ కప్లలో వరుసగా సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరిన పాక్ ఈసారి పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. భారత్తో పాటు అమెరికా చేతిలో ఓడిన ఆ జట్టు కెనడాపై మాత్రం గెలవగలిగింది. ఈ గ్రూప్లో బలహీన కెనడాపై నెగ్గిన అమెరికా... పాక్పై సంచలన విజయం సాధించి తమ అవకాశాలు మెరుగుపర్చుకుంది. తాజా ఫలితంతో ఆదివారం ఐర్లాండ్తో తమ చివరి మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్లో పాక్ ఆట ముగిసింది. లాడర్హిల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కూడా తెరిపినివ్వలేదు. నిర్ణీత సమయం నుంచి దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాలేదు. పదే పదే తనిఖీల తర్వాత కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించాలని ఆశించినా... మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతిథ్య జట్టు హోదాలో బరిలోకి దిగి సూపర్–8కు చేరడం ద్వారా అమెరికా 2026 టి20 వరల్డ్ కప్కు కూడా నేరుగా అర్హత సాధించింది. -
T20 World Cup 2024: పాకిస్తాన్కు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8కు చేరాలన్న పాకిస్తాన్ ఆశలకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జూన్ 14) యూఎస్ఏ, ఐర్లాండ్ జట్లు పోటీపడాల్సి ఉండగా.. మ్యాచ్ ప్రారంభానికి వరుణుడు అడ్డు తగులుతున్నాడు. భారతకాలమానం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అర్ద గంట గడిచినా టాస్ కూడా పడలేదు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్ కూడా వేయలేదు. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు అంపైర్లు మరో మారు మైదానాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఒకవేళ అప్పటికీ మైదానం తడిగా ఉంటే మ్యాచ్ మరో గంట ఆలస్యం కావచ్చు. ఇదే జరిగే ఓవర్లు కుదించి మ్యాచ్ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ మరోసారి వరుణుడు ఆటంకం కలిగిస్తే మ్యాచ్ పూర్తిగా రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా జరిగితే యూఎస్ఏ, ఐర్లాండ్కు చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్న యూఎస్ఏ.. మరో పాయింట్ ఖాతాలో పడితే ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాక్ తదుపరి ఆడాల్సిన మ్యాచ్లో గెలిచినా నాలుగు పాయింట్లు మాత్రమే వారి ఖాతాలో ఉంటాయి. ఈ లెక్కన పాక్ ఇంటికి.. యూఎస్ఏ సూపర్-8కి చేరుకుంటాయి.ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ నుంచి భారత్ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం యూఎస్ఏ, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ గ్రూప్లో ఉన్న మరో రెండు జట్లు (కెనడా, ఐర్లాండ్) టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించలేదు.గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా జట్లు సూపర్-8కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి నమీబియా, ఒమన్.. గ్రూప్-సి నుంచి ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్.. గ్రూప్-డి నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయ్యాయి. -
T20 World Cup 2024: పాక్ భవితవ్యం తేలేది నేడే (జూన్ 14)..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 14) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏ నుంచి సూపర్-8 రెండో బెర్త్ కోసం యూఎస్ఏ.. ఐర్లాండ్తో పోటీపడనుంది. యూఎస్ఏ ఈ మ్యాచ్లో గెలిచినా లేక వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం పోటీపడుతున్న మరో జట్టు పాక్ భవితవ్యం నేటి మ్యాచ్తో తేలిపోనుంది.ఇవాల్టి మ్యాచ్లో యూఎస్ఏ గెలిచినా లేక మ్యాచ్ రద్దైనా పాక్ తదుపరి ఆడాల్సిన మ్యాచ్తో (ఐర్లాండ్) సంబంధం లేకుండా ఇంటిదారి పడుతుంది. గ్రూప్-ఏ నుంచి భారత్ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించగా.. యూఎస్ఏ, పాక్ల మధ్య రెండో బెర్త్ కోసం పోటీ నెలకొంది.టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడింట విజయాలు సాధించి గ్రూప్-ఏ టాపర్గా ఉండగా.. యూఎస్ఏ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాక్ విషయానికొస్తే.. దాయాది జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో గెలిచి రెండింట ఓడి రెండు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఒకవేళ ఐర్లాండ్తో మ్యాచ్లో యూఎస్ఏ ఓడి.. పాక్ తదుపరి ఐర్లాండ్తో ఆడబోయే మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే పాక్కు సూపర్-8కు చేరే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా జరిగేందుకు ప్రకృతి సహకరించడం లేదు. యూఎస్ఏ-ఐర్లాండ్ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్కు వరుణ గండం పొంచి ఉంది. ఈ మ్యాచ్కు వేదిక అయిన ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నేటి మ్యాచ్ జరగడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే యూఎస్ఏ ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధిస్తుంది.ఇదిలా ఉంటే, ఇవాళే మరో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా-నేపాల్.. గ్రూప్-సి నుంచి న్యూజిలాండ్-ఉగాండ జట్లు పోటీపడనున్నాయి. యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరునున్న మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. సౌతాఫ్రికా-నేపాల్ మ్యాచ్ కింగ్స్టౌన్ వేదికగా రేపు తెల్లవారుజామున 5 గంటలకు మొదలవుతుంది. న్యూజిలాండ్-ఉగాండ మధ్య జరగాల్సిన మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. -
T20 WC 2024: పాకిస్తాన్కు ఊహించని షాక్!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ముందుకు సాగాలన్న పాకిస్తాన్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. వర్షం దెబ్బకు కనీసం ఈసారి గ్రూప్ దశ దాటడం కూడా గగనమే కానుంది. కాగా టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒక్కటే గెలిచింది.తొలుత అమెరికా చేతిలో ఓడిన పాక్.. తర్వాత టీమిండియాతో ఉత్కంఠ మ్యాచ్లోనూ అపజయం పాలైంది. ఈ క్రమంలో కెనడాపై గెలుపొందిన పాకిస్తాన్.. సూపర్-8 చేరాలంటే అమెరికాతో పోటీ పడాల్సి ఉంది.అమెరికా ఓడిపోతేనేఈ నేపథ్యంలో ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్లో అమెరికా గనుక ఓడితే పాక్కు అవకాశాలు ఉంటాయి. అయితే, జూన్ 14న జరిగే ఈ మ్యాచ్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.లాడర్హిల్లోని సెంట్రల్ బొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్లో ఐర్లాండ్- అమెరికా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఫ్లోరిడాలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ ప్రకటనఈ క్రమంలో ఫోర్ట్ లాడర్డేల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వాన, వరద ఉధృతమయ్యే సూచనలు ఉన్నాయని.. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.శ్రీలంక పయనం వాయిదాఈ నేపథ్యంలో సౌత్ ఫ్లోరిడా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో శ్రీలంక జట్టు వెస్టిండీస్ పయనం వాయిదా పడింది. గ్రూప్-డిలో ఉన్న లంక జట్టు ఇప్పటికే లాడర్హిల్లో ఆడాల్సిన మ్యాచ్ రద్దైన కారణంగా సూపర్-8 నుంచి అనధికారికంగా నిష్క్రమించింది.ఈ క్రమంలో తదుపరి నెదర్లాండ్స్తో మ్యాచ్ కోసం విండీస్ వెళ్లాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ప్రస్తుతానికి ఇక్కడే నిలిచిపోయింది లంక జట్టు. The "Qudrat Ka Nizam" is working to eliminate Pakistan from the tournament 😂🤣pic.twitter.com/kJlt46UcNQ— CrickSachin (@Sachin_Gandhi7) June 13, 2024పాక్కు ఊహించని షాక్ఇదిలా ఉంటే.. శుక్రవారం ఫ్లోరిడాలో జరగాల్సిన అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ గనుక వర్షం వల్ల రద్దైతే పాకిస్తాన్ అధికారికంగా గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి.ఐర్లాండ్తో మ్యాచ్ రద్దైతే ఒక పాయింట్ ఖాతాలో చేరితే.. మొత్తం ఐదు పాయింట్లు అవుతాయి. మరోవైపు.. పాక్ రెండు పాయింట్లతో ఉంది. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే.. తదుపరి ఫ్లోరిడాలోనే జరగాల్సిన మ్యాచ్లో ఐర్లాండ్ను పాక్ ఓడించినా ఫలితం ఉండదు. ఎందుకంటే.. అందులో గెలిచినా పాక్ ఖాతాలో ఉండేవి నాలుగు పాయింట్లే. కాబట్టి ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు సెకండ్ టాపర్గా అమెరికా బెర్తు ఖరారు చేసుకుంటుంది. చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్! -
T20 WC: పాకిస్తాన్కు ‘శుభవార్త’.. కానీ ఆ గండం దాటితేనే!
అమెరికాపై టీమిండియా విజయం నేపథ్యంలో పాకిస్తాన్ సంతోషంలో మునిగిపోయింది. సూపర్-8 దశకు చేరుకునే క్రమంలో తమ ఆశలు పదిలం కావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.టీ20 ప్రపంచకప్-2024 ఆరంభంలో పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో ఉన్న అమెరికా, టీమిండియా చేతిలో చిత్తైన బాబర్ ఆజం బృందం... కెనడాపై గెలుపుతో ఊపిరి పీల్చుకుంది.అయితే, సూపర్-8లో అడుగుపెట్టాలంటే అమెరికాతో పోటీ పడాల్సిన పరిస్థితి. అప్పటికే మొనాంక్ పటేల్ సేన రెండు విజయాలు సాధించి.. పాకిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో ఉండటమే ఇందుకు కారణం.మొన్న ఏడిపించి... ఇపుడేమో శుభవార్తఇలాంటి దశలో టీమిండియా- అమెరికా మ్యాచ్ ఫలితంపై పాక్ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన అమెరికాను ఓడిస్తే పాక్ సూపర్-8కు చేరవయ్యే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే భారత జట్టు బుధవారం నాటి మ్యాచ్లో అమెరికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.దీంతో పాయింట్ల పరంగా అమెరికా కంటే వెనుకబడి ఉన్నా.. రన్రేటు పరంగా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలోకి వెళ్లింది పాక్ జట్టు. ఈ క్రమంలో తదుపరి ఐర్లాండ్తో మ్యాచ్లో తాము గెలవడం.. అమెరికా ఓడటం జరిగితే పాక్ సూపర్-8లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచింది. కాగా గత మ్యాచ్లో భారత్ పాక్ను ఓడించిన విషయం తెలిసిందే.పాకిస్తాన్ సూపర్-8కు చేరాలంటే..గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ఇప్పటికే మూడు విజయాలతో(ఆరు పాయింట్లు) టాపర్గా నిలిచి సూపర్-8కు చేరుకుంది.రెండో స్థానం కోసం అమెరికా, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే గ్రూప్ దశలో మూడేసి మ్యాచ్లు ఆడాయి.అమెరికా రెండు విజయాలు(4 పాయింట్లు) సాధించగా.. పాకిస్తాన్ ఒకటి గెలిచింది(2 పాయింట్లు). అయితే, టీమిండియా చేతిలో ఓటమి తర్వాత నెట్ రన్రేటు పరంగా అమెరికా(+0.127) పాక్ కంటే (+0.191) కాస్త వెనుకబడింది.ఈ నేపథ్యంలో లీగ్ దశలో తమకు మిగిలిన ఆఖరి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-8కు చేరుతుంది. అయితే, రెండూ తమ తమ మ్యాచ్లలో గెలిస్తే అప్పుడు నెట్ రన్రేటు కీలకంగా మారుతుంది. ఇక ఆఖరి మ్యాచ్లలో అమెరికా, పాకిస్తాన్ల ప్రత్యర్థి ఐర్లాండ్ కావడం విశేషం. ఈ రెండు జట్లలో ఏది సూపర్-8 చేరాలన్నా ఐర్లాండ్ ఆట తీరుపైనే ఆధారపడి ఉంది.చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే -
T20 World Cup 2024: పాక్ భవితవ్యం తేలేది నేడే (జూన్ 11)..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 11) మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ పాకిస్తాన్, కెనడా (న్యూయార్క్) మధ్య భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. రెండో మ్యాచ్ శ్రీలంక-నేపాల్ (ఫ్లోరిడా) మధ్య రేపు తెల్లవారు జామున 5 గంటలకు (భారతకాలమానం ప్రకారం).. మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా-నమీబియా (ఆంటిగ్వా) జట్ల మధ్య రేపు ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభం కానున్నాయి.పాక్ భవితవ్యం తేలేది నేడే..!గ్రూప్-ఏలో మొదటి రెండు మ్యాచ్ల్లో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ ఇవాళ పసికూన కెనడాతో తలపడనుంది. సూపర్-8కు చేరాలంటే పాక్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్తో పాటు జూన్ 16న ఐర్లాండ్తో జరుగబోయే మ్యాచ్లోనూ పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగితేనే పాక్ గ్రూప్-ఏ నుంచి సూపర్-8 బెర్త్ రేసులో ఉంటుంది. పాక్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచినా సెమీస్కు చేరుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. ఇదివరకే రెండు మ్యాచ్ల్లో (కెనడా, పాక్) గెలిచిన యూఎస్ఏ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో (భారత్, ఐర్లాండ్) ఏదో ఒక మ్యాచ్లో గెలిచినా ఆ జట్టే సూపర్-8కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ (1.455), యూఎస్ఏ (0.626) గ్రూప్-ఏ నుంచి తొలి రెండు స్థానాల్లో ఉండగా.. రెండిట ఒక మ్యాచ్ గెలిచిన కెనడా (-0.274) మూడో స్థానంలో.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్ (-0.150), ఐర్లాండ్ (-1.712) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఏదైన అద్భుతం జరిగి యూఎస్ఏ తదుపరి రెండు మ్యాచ్ల్లో ఓడి.. పాక్ తదుపరి ఆడే రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తే తప్ప పాక్ సూపర్-8కు చేరలేదు. పాక్ సూపర్-8కు చేరకుండా ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తే ఆ జట్టుకు మరో పరాభవం కూడా ఎదురవుతుంది. ఇలా జరిగితే పాక్ తదుపరి టీ20 ప్రపంచకప్కు (2026) క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఈ సారి ప్రపంచకప్లో సూపర్-8కు అర్హత సాధించే దేశాలే నేరుగా తదుపరి వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. -
ఐర్లాండ్కు కెనడా షాక్
న్యూయార్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శాశ్వత సభ్య దేశం ఐర్లాండ్ జట్టుకు తొలిసారి టి20 ప్రపంచకప్లో ఆడుతున్న కెనడా జట్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన పోరులో కెనడా తక్కువ లక్ష్యాన్ని కాపాడుకొని 12 పరుగుల తేడాతో ఐర్లాండ్ను కంగుతినిపించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (14), నవ్నీత్ ధలివాల్ (6) సహా పర్గత్ సింగ్ (18), దిల్ప్రీత్ (7) నిరాశపరిచారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ కిర్టన్ (35 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్లు), మొవ్వ శ్రేయస్ (36 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించడంతో కెనడా కోలుకుంది. ప్రత్యర్థి బౌలర్లలో క్రెయిగ్ యంగ్, మెకార్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి ఓడిపోయింది. హేలిగెర్ (2/18), గొర్డాన్ (1/13), సిద్ధిఖీ (1/27), జాఫర్ (1/22) సమష్టిగా దెబ్బ కొట్టారు. దీంతో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో డాక్రెల్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ అడైర్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా చివరకు ఐర్లాండ్కు ఓటమి తప్పలేదు. -
T20 World Cup 2024: రాణించిన ఐర్లాండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన కెనడా
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 7) కెనడా, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కెనడాను 137 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ (4-0-32-2), బ్యారీ మెక్ కార్తీ (4-0-24-2), మార్క్ అడైర్ (4-0-23-1), గ్యారెత్ డెలానీ (2-0-10-1) సత్తా చాటారు. నికోలస్ కిర్టన్ (49), శ్రేయస్ మొవ్వ (37) ఓ మోస్తరు స్కోర్లు చేయకపోతే కెనడా ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. కెనడా ఇన్నింగ్స్లో ఆరోన్ జాన్సన్ (14), నవ్నీత్ ధలివాల్ (6), దిల్ప్రీత్ బజ్వా (7), పర్గత్ సింగ్ (18), దిల్లన్ హెలిగర్ (0) విఫలమయ్యారు.తుది జట్లు..కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ(వికెట్కీపర్), దిల్ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), లోర్కాన్ టక్కర్(వికెట్కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాషువా లిటిల్, క్రెయిగ్ యంగ్ -
T20 World Cup 2024: ఐర్లాండ్-కెనడా మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 7) కెనడా, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో కెనడా, ఐర్లాండ్ జట్లు ఇప్పటివరకు ఆడిన చెరో మ్యాచ్లో ఓటమిపాలై గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి వరుసగా రెండు విజయాలు సాధించిన యూఎస్ఏ అగ్రస్థానంలో ఉండగా.. ఇండియా, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి నిన్న జరిగిన మ్యాచ్లో యూఎస్ఏ.. పాకిస్తాన్పై సంచలన విజయం సాధించింది.సూపర్-8కు చేరాలంటే పాక్ తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్లు భారీ తేడాలతో గెలవాల్సి ఉంటుంది. జూన్ 9న పాక్.. న్యూయార్క్ వేదికగా భారత్తో తలపడనుంది.తుది జట్లు..కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ(వికెట్కీపర్), దిల్ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), లోర్కాన్ టక్కర్(వికెట్కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాషువా లిటిల్, క్రెయిగ్ యంగ్ -
T20 World Cup 2024: రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో నిన్న (జూన్ 5) జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన హిట్మ్యాన్.. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ ఈ రికార్డు సాధించే క్రమంలో మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో 4000 పరుగుల మార్కును తాకిన రెండో ఆటగాడిగా.. టీ20ల్లో వేగంగా 4000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా.. విరాట్, జయవర్దనే తర్వాత టీ20 వరల్డ్కప్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా.. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్గా.. సచిన్, కోహ్లి తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో 300 విజయాల్లో భాగమైన మూడో భారత ఆటగాడిగా పలు రికార్డులు నెలకొల్పాడు.ఐర్లాండ్పై విజయం సాధించిన అనంతరం రోహిత్ వ్యక్తిగత రికార్డులతో పాటు కెప్టెన్గానూ ఓ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక విజయాలు (55 మ్యాచ్ల్లో 42) సాధించిన భారత కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు.కాగా, ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో గెరాత్ డెలానీ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్తో పాటు పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ద సెంచరీ చేసిన హిట్మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2007 నుంచి ఇప్పటివరకు 473 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 499 ఇన్నింగ్స్ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476), బ్రెండన్ మెక్కల్లమ్ (398), మార్టిన్ గప్తిల్ (383) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో ఉన్నారు.కాగా, ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. -
టి20 వరల్డ్ కప్ : తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...
భారీ అంచనాలతో టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించని పిచ్పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్ చక్కటి బ్యాటింగ్ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్కు భారత్ సిద్ధమైంది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్ఫీల్డ్... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2), బల్బర్నీ (5)లను అవుట్ చేసి అర్‡్షదీప్ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్ పతనం వేగంగా సాగింది. పవర్ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్ (10), కాంఫర్ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్ (4)ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ (3) వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 49/6 వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్లో లిటిల్ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‡్షదీప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను అదే ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్... ఓపెనర్గా వచి్చన విరాట్ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్ ఓవర్లో రెండు వరుస సిక్స్లతో జోరు పెంచిన రోహిత్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్కు వచి్చన సూర్యకుమార్ (2) విఫలమైనా... మెక్కార్తీ బౌలింగ్లో రివర్స్ స్కూప్ సిక్సర్తో పంత్ మ్యాచ్ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడిన పంత్కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బర్నీ (బి) అర్‡్షదీప్ 5; స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 2; టకర్ (బి) పాండ్యా 10; టెక్టర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్ (సి) పంత్ (బి) పాండ్యా 12; డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3; డెలానీ (రనౌట్) 26; అడెయిర్ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్కార్తీ (సి అండ్ బి) అక్షర్ 0; లిటిల్ (బి) బుమ్రా 14; వైట్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–2, సిరాజ్ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్ పటేల్ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రిటైర్డ్హర్ట్) 52; కోహ్లి (సి) వైట్ (బి) అడెయిర్ 1; పంత్ (నాటౌట్) 36; సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2; దూబే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్: అడెయిర్ 4–0–27–1, లిటిల్ 4–0–42–0 మెక్కార్తీ 2.2–0–8–0, కాంఫర్ 1–0–4–0, వైట్ 1–0–6–1. 600: 600 రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్లు బాదాడు. 4000: రోహిత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. -
T20 World Cup 2024: రాణించిన హార్దిక్, రోహిత్.. ఐర్లాండ్ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజయంతో బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే కట్టడి చేయగా.. ఛేదనలో రోహిత్ (52 రిటైర్డ్ హర్ట్), పంత్ (36 నాటౌట్) సత్తా చాటి టీమిండియాను గెలిపించారు.వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ 16 ఓవర్లలో ఐర్లాండ్ను 96 పరుగులకు ఆలౌట్ చేసింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. రోహిత్తో జతగా తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లి.. మార్క్ అదైర్ బౌలింగ్లో బెంజమిన్ వైట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.కోహ్లి ఔటైనా ఏమాత్రం తగ్గని భారత్.. రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన భారత పేసర్లు.. 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. -
T20 World Cup 2024: హార్దిక్ సూపర్ డెలివరీ.. వైరల్ వీడియో
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఐర్లాండ్కు చుక్కలు చూపిస్తుంది. టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలాకాలం తర్వాత బంతితో ఇరగదీస్తున్నాడు. హార్దిక్ ధాటికి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. హార్దిక్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. హార్దిక్తో పాటు అర్ష్దీప్ సింగ్ (3-0-18-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (2-1-4-1), అక్షర్ పటేల్ (0.2-0-1-1) కూడా విజృంభించడంతో ఐర్లాండ్ 13 ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), లోర్కాన్ టక్కర్ (10), హ్యారీ టెక్టార్ (4), కర్టిస్ క్యాంపర్ (12), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. జాషువ లిటిల్ (8), గారెత్ డెలానీ (9) క్రీజ్లో ఉన్నారు.What a ball from Vice Captain Hardik Pandya. 💪 pic.twitter.com/rk76b8Dbdj— Johns. (@CricCrazyJohns) June 5, 2024హార్దిక్ సూపర్ డెలివరీ..చాలాకాలం తర్వాత బంతితో మెరిసిన హార్దిక్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పడగొట్టిన ఓ వికెట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. హార్దిక్ సూపర్ డెలివరీతో హ్యారీ టెక్టార్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
T20 World Cup 2024: ఐర్లాండ్తో మ్యాచ్.. టాస్ గెలిచిన టీమిండియా.. ఓపెనర్గా కోహ్లి
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా గ్రూప్-ఏలో ఇవాళ (జూన్ 5) భారత్-ఐర్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్లకు చోటు దక్కలేదు. జైస్వాల్ లేకపోవడంతో రోహిత్తో పాటు ఓపెనర్గా విరాట్ కోహ్లి బరిలోకి దిగే అవకాశం ఉంది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ -
శుభారంభంపై గురి
న్యూయార్క్: బంగ్లాదేశ్తో వామప్ పాస్ అయిన టీమిండియా ఇప్పుడు సిసలైన పోరాటానికి సిద్ధమైంది. టి20 ప్రపంచకప్లో భాగంగా బుధవారం గ్రూప్ ‘ఎ’లో జరిగే తమ తొలి పోరులో ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. రోహిత్ శర్మ బృందం తమ స్థాయికి తగని ప్రత్యర్థిపై అలవోక విజయంతో ప్రపంచకప్ వేటను మొదలుపెట్టాలని పట్టుదలతో ఉంది.ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా చిన్న జట్టయినా గట్టిగానే ఎదుర్కోవాలని భావిస్తోంది. మరోవైపు ఐర్లాండ్కు మాత్రం ఇది కొండను ‘ఢీ’కొట్టడమే! సూపర్ ఫామ్లో, రెండు నెలలుగా ఐపీఎల్తో టి20 మ్యాచ్లలో తలమునకలైన ఆటగాళ్లున్న జట్టుతో తలపడటం ఐర్లాండ్కు ఆషామాషీ కానేకాదు. భారత్లాంటి పటిష్టమైన జట్టుకే ఆడటం కష్టంగా ఉన్న డ్రాప్ ఇన్ పిచ్లపై ఐర్లాండ్ సంచలనాన్ని ఆశించడం కూడా ఆత్యాశే అవుతుంది. కోహ్లినే కొండంత బలం ఆలస్యంగా జట్టుతో కలిసిన స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లి బంగ్లాతో ప్రాక్టీస్ మ్యాచ్లో బరిలోకి దిగలేదు. అంతమాత్రాన ప్రాక్టీస్ లేదనుకుంటే పొరపాటే! ఈ సీనియర్ స్టార్ ఐపీఎల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో ప్రతి మ్యాచ్లోనూ నిలకడగా మెరిపించాడు. కెపె్టన్ రోహిత్ కూడా ఫామ్లోనే ఉన్నాడు. వీరిద్దరు ఓపెనింగ్ చేస్తే సంజూ సామ్సన్ వన్డౌన్లో దిగుతాడు.4, 5 స్థానాల్లో సూర్యకుమార్, రిషభ్ పంత్లు చెలరేగితే ఎలాంటి బౌలర్కైనా చుక్కలు కనబడటం గ్యారంటీ! బౌలింగ్లో అనుభవజు్ఞలైన బుమ్రా, సిరాజ్, స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్లు అందుబాటులో ఉండటంతో ప్రత్యర్థి జట్టు వీరిని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డకతప్పదు. లోయర్ ఆర్డర్లో అదనపు బ్యాటింగ్ అవసరం లేదనుకుంటే అక్షర్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులో ఉంటాడు. ఐర్లాండ్ పోటీ ఏపాటి? ప్రపథమ టి20 చాంపియన్ (2007) భారత్తో చూసుకుంటే ఐర్లాండ్ క్రికెట్ కూనే! అయితే పొట్టి పోరులో ఎవరు ఏ ఓవర్లో మెరిపించినా మ్యాచ్ మలుపుతిరగడం ఖాయం. కాబట్టి పాల్ స్టిర్లింగ్ బృందం భారత్ బలాబలాలను దృష్టిలో పెట్టుకొని బరిలోకి దిగుతుంది. హిట్టర్లు, బ్యాటింగ్ ఆల్రౌండర్లతో కూడిన ఐర్లాండ్ టీమిండియా ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించినా వాటిని సానుకూలంగా మలచుకోవాలనే వ్యూహాలతో ఉంది. వార్ వన్సైడ్ కాకుండా కాస్త దీటుగా ఎదుర్కోగలిగితే చాలు పరాజయమైన సగం విజయంతో సమానమని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లి, సంజూ సామ్సన్/దూబే, సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, బాల్బిర్నీ, క్యాంఫర్, టెక్టర్, డెలనీ, డాక్రెల్, టకెర్, జోష్ లిటిల్, మార్క్ అడైర్, యంగ్. పిచ్, వాతావరణం బంగ్లాదేశ్తో ఆడిన వార్మప్ వేదికపైనే ఈ మ్యాచ్ జరుగుతుంది. డ్రాప్ ఇన్ పిచ్. బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పేలవమైన అవుట్ ఫీల్డ్ వల్ల బ్యాటర్లకు పరుగులు అంత సులువుగా రాకపోవచ్చు. వర్షం ముప్పు లేదు. -
పసికూనలపై ప్రతాపం.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సునాయాస విజయాలు
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో పెద్ద జట్లు పసికూనలపై ప్రతాపం చూపుతున్నాయి. శ్రీలంకపై నెదర్లాండ్స్ విజయం మినహా ఇప్పటివరకు జరిగిన అన్ని వార్మప్ మ్యాచ్ల్లో పెద్ద జట్లే విజయం సాధించాయి. తాజాగా జరిగిన మ్యాచ్ల్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఫ్లోరిడా, ట్రినిడాడ్ వేదికలుగా నిన్న జరిగిన మ్యాచ్ల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమకంటే చిన్న జట్లైన ఐర్లాండ్, స్కాట్లాండ్లపై విజయాలు సాధించాయి.ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 41 పరుగుల తేడాతో గెలుపొందగా.. స్కాట్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.శ్రీలంక-ఐర్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ.. ప్రతి ఒక్క ఆటగాడు తలో చేయి వేశారు. ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. దసున్ షనక (3.2-0-23-4) ఐర్లాండ్ పతనాన్ని శాశించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కర్టిస్ క్యాంఫర్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఆఫ్ఘనిస్తాన్-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ నైబ్ (69), అజ్మతుల్లా (48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్టఫర్ సోల్ (4-0-35-3), బ్రైడన్ కార్స్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. ఆఫ్ఘన్ బౌలర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 56 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. ముజీబ్, కరీం జనత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో మార్క్ వాట్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్తో బంగ్లాదేశ్ 'ఢీ'వార్మప్ మ్యాచ్ల్లో ఇవాళ (జూన్ 1) చివరి మ్యాచ్ జరుగనుంది. న్యూయార్క్లో ఇవాళ భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఇవాల్టి నుంచే వరల్డ్కప్ రెగ్యులర్ మ్యాచ్లు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి మొదలవుతాయి. -
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరిగింది. డబ్లిన్లో జరిగిన ఈ టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్ సయీం ఆయుబ్(29 బంతుల్లో 45)తో పాటు బాబర్ ఆజం(43 బంతుల్లో 57), ఇఫ్తికర్ అహ్మద్(15 బంతుల్లో 37*) రాణించారు.ఒక బంతి మిగిలి ఉండగానేఅయితే, పాక్ విధించిన లక్ష్యాన్ని ఐర్లాండ్ అనూహ్య రీతిలో ఛేదించింది. ఓపెనర్ ఆండ్రు బల్బిర్నీ(55 బంతుల్లో 77), హ్యారీ టెక్టర్(27 బంతుల్లో 36), జార్జ్ డాక్రెల్(12 బంతుల్లో 24) దుమ్ములేపడంతో ఒక బంతి మిగిలి ఉండగానే విజయ ఢంకా మోగించింది.ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి సొంతగడ్డపై జయభేరి మోగించింది. సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది ఐర్లాండ్. దీంతో పాకిస్తాన్కు పరాభవం ఎదురైనా.. బాబర్ ఆజం మాత్రం వ్యక్తిగతంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు.పిన్న వయస్కుడిగా బాబర్ ప్రపంచ రికార్డుపొట్టి ఫార్మాల్లో అత్యంత వేగంగా వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా 29 ఏళ్ల బాబర్ ఆజం నిలిచాడు. ఓవరాల్గా ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి బాబర్ కంటే ముందున్నారు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో బాబర్ ఆజం 50కి పైగా పరుగులు సాధించడం ఇది 38వసారి. తద్వారా విరాట్ కోహ్లి రికార్డును అతడు సమం చేశాడు.టీ20లలో వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన టాప్-5 ఆటగాళ్లు👉1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 377 మ్యాచ్లలో- 12,232 పరుగులు- 110(8 సెంచరీలు, 102 అర్ధ శతకాలు)👉2. క్రిస్ గేల్(వెస్టిండీస్)- 463 మ్యాచ్లలో- 14,562 పరుగులు- 110(22 సెంచరీలు, 88 అర్ధ శతకాలు)👉3.విరాట్ కోహ్లి(ఇండియా)- 388 మ్యాచ్లలో- 12,628 పరుగులు- 105(9 సెంచరీలు, 96 అర్ధ శతకాలు)👉4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 296 మ్యాచ్లు- 10,677 పరుగులు- 100(11 సెంచరీలు, 89 అర్ధ శతకాలు)👉5. జోస్ బట్లర్(ఇంగ్లండ్)- 413 మ్యాచ్లు- 11,484 పరుగులు- 88(8 సెంచరీలు, 80 అర్ధ శతకాలు).చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we've just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏..#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024 -
IRE Vs PAK: పాకిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. డబ్లిన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి ఐర్లాండ్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ అయూబ్(45), ఇఫ్తికర్ ఆహ్మద్(37 నాటౌట్) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో క్రెగ్ యంగ్ రెండు వికెట్లు, డెలానీ,అడైర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బల్బర్నీ(77) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఆఖరిలో కాంఫ్హెర్(15), డెలానీ(10) ఆజేయంగా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా, షాహీన్ అఫ్రిది, వసీం తలా వికెట్ సాధించారు. Babar Azam is a cursed captain #IREvPAK IRELAND PROVE TO BE TOOO MIGHTY FOR 🇵🇰 😪💀 MOYE MOYE pic.twitter.com/LBNvtAd0Q6— Shehryar Sajid Khan (@Sskwrites) May 10, 2024IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we've just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏..#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024 -
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఐరీష్ జట్టుకు పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్కప్తో పాటు స్వదేశంలో పాకిస్తాన్తో జరిగే టీ20 సిరీస్, నెదర్లాండ్స్ ,స్కాట్లాండ్తో జరిగే ట్రై-సిరీస్కు ఐర్లాండ్ కూడా తమ జట్టును ప్రకటించింది.టీ20 వరల్డ్కప్లో పాల్గోనే జట్టునే ఈ రెండు సిరీస్లకు కూడా ఐరీష్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐరీష్ పేసర్ జాషువా లిటిల్.. పాక్, డచ్, స్కాట్లాండ్తో ట్రై-సిరీస్కు దూరం కానున్నాడు.ఇక ఐరీష్ వరల్డ్కప్ జట్టులో మాజీ కెప్టెన్ బల్బర్నీ, హ్యారీ టెక్టార్, కాంఫ్హెర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 5న టీమిండియాతో తలపడనుంది. ఐర్లాండ్ టీ20 వరల్డ్కప్ జట్టు:పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.పాక్, పాక్, డచ్, స్కాట్లాండ్తో ట్రై-సిరీస్కు ఐరీష్ జట్టు:పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, బారీ మెక్కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్. -
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (మే 2) ప్రకటించారు. ఇదే జట్టు నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేస్తామని పాక్ సెలెక్టర్లు తెలిపారు. ఇంగ్లండ్తో తొలి టీ20 (మే 22) అనంతరం వరల్డ్కప్ జట్టు ప్రకటన ఉంటుందని వెల్లడించారు. జట్ల ప్రకటనకు మే 24 డెడ్లైన్ కావడంతో ఆలోపే తమ వరల్డ్కప్ జట్టును వెల్లడిస్తామని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. పాక్ ఐర్లాండ్ పర్యటన ఈనెల 10న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. మే 10, 12, 14 తేదీల్లో డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం పాక్ ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. మే 22, 25, 28, 30 తేదీల్లో నాలుగు టీ20 జరుగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన అనంతరం పాక్ ఇక్కడి నుంచే నేరుగా టీ20 ప్రపంచకప్ వేదికకు బయల్దేరుతుంది. టీ20 వరల్డ్కప్ యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1న ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీలో పాక్ ప్రయాణం జూన్ 6న మొదలవుతుంది. ఆ రోజున జరిగే తమ తొలి మ్యాచ్లో పాక్ ఆతిథ్య యూఎస్ఏతో తలపడనుంది. డల్లాస్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్లో పాక్.. భారత్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా జట్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.పాక్ జట్టు విషయానికొస్తే.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనున్నాడు. పేసర్ హసన్ అలీ చాలాకాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అఘా సల్మాన్ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల కిందట స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న హరీస్ రౌఫ్, ఆజమ్ ఖాన్ తిరిగి జట్టులోకి చేరారు. మణికట్టు స్పిన్నర్ ఉసామా మీర్, పేసర్ జమాన్ ఖాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు.ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్ -
‘ఐర్లాండ్లో భారత రాయబారిని వెంటనే తొలగించాలి’
ఐర్లాండ్లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అఖిలేష్ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైం రమేష్ స్పందించారు. అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు చేయటం వృతిపరంగా ఆయన అవమానకరమైన ప్రవర్తనకు నిదర్శనం అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘భారత ప్రభుత్వాన్ని సమర్థించటం ఊహించినదే. కానీ, ఒక రాయబారి ప్రతిపక్ష పార్టీలపై బహిరంగంగా ఇలా విమర్శలు చేయటం సరికాదు. ఆయనది వృత్తిపరంగా చాలా అవమానకరమై ప్రవర్తన. రాయబారిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదించదగినవి కాదు. ఆయన సర్వీసు నియమాలను ఉల్లంఘించారు. వెంటనే రాయబారి పదవి నుంచి తొలగించాలి’ అని జైరాం రమేష్ మండిపడ్డారు. అఖిలేష్ మిశ్రా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఐర్లాండ్లోని ఓ దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయంలో ‘మోదీకి అపూర్వమైన ప్రజాదరణ ఉంది’ అనే శీర్షికపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ప్రజాదరణ పొందారు. దానికి మోదీ వ్యక్తిగత స్వాభావంతో పాటు పరిపాలనలో చూపించే సమగ్రత, స్థిరమైన అభివృద్ధిపై నాయకత్వమే కారణం. మోదీ రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. భారత్తో పాటు ప్రపంచ దేశాల్లోని లక్షలాది ప్రజలకు మోదీ వ్యక్తిగత జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకే కుటుంబానికి చెందిన అవినీతి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమే మోదీకి పెరుగుతన్న ప్రజాదరణ వెనక ఉన్న ప్రధానమైన అంశం’ అని అఖిలేష్ మిశ్రా అన్నారు. ‘సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్లో అవినీతిని అంతం చేయటంలో విజయం సాధించింది. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా దృఢమైనది. 80 శాతం హిందూ మెజార్టీ ఉన్న భారతదేశాన్ని కొందరు మూస పద్దతులతో తప్పదారి పట్టిస్తున్నారు’ అని అఖిలేష్ మిశ్రా తెలిపారు. ఇక.. ‘అత్యంత పక్షపాతంతో ప్రధాని మోదీ, భారత ప్రజాస్వామ్యం, చట్టం అమలు చేస్తున్న సంస్థలపై విమర్శలు చేస్తున్నారు’ అని డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. Ambassador @AkhileshIFS’s rejoinder to @IrishTimes' highly biased & prejudiced editorial [Modi tightens his grip” April 11, 2024)], casting aspersion on Prime Minister of India, Shri @narendramodi, Indian democracy, law enforcement institutions & “Hindu-majority” people of India. pic.twitter.com/Oh5rFly92Z — India in Ireland (Embassy of India, Dublin) (@IndiainIreland) April 15, 2024 -
నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్
షార్జా వేదికగా ఐర్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్.. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో జద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్ ఇషాక్ (27), సెదీఖుల్లా అటల్ (19), ఇజాజ్ అహ్మద్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, కర్టిస్ క్యాంపర్, డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్.. 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-9-4), నవీన్ ఉల్ హక్ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ, రషీద్ ఖాన్, ఖరోటే తలో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ (28) టాప్ స్కోరర్గా నిలువగా.. గెరాత్ డెలానీ (21), హ్యారీ టెక్టార్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఐర్లాండ్ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
Viral Video: కళ్లు చెదిరే సిక్సర్ బాదిన రషీద్ ఖాన్
ఐర్లాండ్తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో ఇరగదీసిన రషీద్.. ఆతర్వాత బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 3, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్ వైట్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. రషీద్ ఖాన్ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో బల్బిర్నీ (45), గ్యారెత్ డెలానీ (39) మాత్రమే రాణించారు. We have seen that before! 😄 Just @RashidKhan_19 being Rashid Khan! 🤩👏🙌#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/yxRqBibMQf — Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2024 బంతిని చూడకుండానే సిక్సర్ బాదిన రషీద్.. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన రషీద్ ఖాన్ అడపాదడపా బ్యాట్తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో రషీద్ మరోసారి బ్యాట్తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్లో 18వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బాదిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. బ్యారీ మెక్కార్తీ బౌలింగ్లో రషీద్ బంతిని చూడకుండానే సిక్సర్గా మలిచాడు. లెగ్సైడ్ దిశగా మెక్కార్తీ సంధించిన ఫుల్ టాస్ బంతిని రషీద్ కళ్లు మూసుకుని సిక్సర్ కొట్టాడు. రషీద్కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్ బాదిన ఈ సిక్సర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఐర్లాండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది. -
రీ ఎంట్రీలో అదరగొట్టిన రషీద్ ఖాన్.. 14 ఏళ్ల రికార్డు బద్దలు
అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న రషీద్.. శుక్రవారం ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీ మ్యాచ్లో రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో రషీద్ సత్తాచాటాడు. తన 4 ఓవర్ల కోటా స్పెల్లో 19 పరుగులిచ్చి రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. పాల్ స్టిర్లింంగ్, క్యాంప్హెర్ వంటి కీలక వికెట్లను ఖాన్ పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్ కెప్టెన్గా రషీద్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆ జట్టు మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ పేరిట ఉండేది. 2014 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఐర్లాండ్పై మంగల్ 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో మంగల్ ఆల్టైమ్ రికార్డును రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ అనుహ్యంగా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు రషీద్ ఫుల్ ఫిట్నెస్ సాధించడం గుజరాత్ టైటాన్స్కు కలిసొచ్చే అంశం. The Magician King @rashidkhan_19 is Back https://t.co/FkSsk7O91b — Baaz Khan (@Im_BaazKhan) March 15, 2024 -
అఫ్గానిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్..
అఫ్గానిస్తాన్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు బల్బర్నీ(22), స్టిర్లింగ్(25) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నంగేయాలియా ఖరోటే 2వికెట్లు, ఓమర్జాయ్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన బెంజిమిన్ వైట్.. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ స్పిన్నర్ బెంజిమిన్ వైట్ 4 వికెట్లతో అఫ్గాన్ను దెబ్బతీశాడు. అతడితో పాటు లిటిల్ 3 వికెట్లు, మెక్గ్రాతీ రెండు, అడైర్ వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ ఇషాఖ్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 17న జరగనుంది. చదవండి: CSK: సీఎస్కేకు బిగ్ షాక్! డెత్ ఓవర్ల స్పెషలిస్టు అవుట్! -
గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. స్టార్ వచ్చేస్తున్నాడు!
IPL 2024- Gujarat Titans: అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ ధ్రువీకరించాడు. కాగా అఫ్గన్ లెగ్ స్పిన్నర్ భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ, లీగ్ క్రికెట్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్- ఐర్లాండ్ టీ20 సిరీస్తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు. ‘‘రానున్న సిరీస్లో జాతీయ జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టాను. అన్నీ సజావుగా సాగుతున్నాయి. నిజానికి సర్జరీ కారణంగా గడిచిన మూడు నెలల కాలం కష్టంగా తోచింది. ఏడెనిమిది నెలలుగా వెన్నునొప్పి బాధపెడుతోంది. వరల్డ్కప్ టోర్నీకి ముందుగానే సర్జరీకి వెళ్తే బాగుంటుందని డాక్టర్లు సూచించారు. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్లో దేశం తరఫున ఆడాలనే నేను నిర్ణయించుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా బాగుంది. రానున్న రోజులు మరింత గొప్పగా ఉంటాయని భావిస్తున్నాను’’ అని రషీద్ ఖాన్ అఫ్గన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా.. టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఐపీఎల్ ఆడటం కూడా తమకు కలిసి వస్తుందని రషీద్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్కాగా రషీద్ ఖాన్ రీఎంట్రీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు కూడా శుభవార్తగా పరిణమించింది. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడి ముంబై ఇండియన్స్ సారథి కాగా.. మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఆగమనం టైటాన్స్కు ఊరట కలిగించనుంది. ఇక గత సీజన్లో రషీద్ ఖాన్ 17 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీశాడు. తద్వారా అత్యధిక వికెట్ టేకర్ల మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. మార్చి 15- 18 వరకు అఫ్గన్- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇక ఐపీఎల్-2024లో గుజరాత్ మార్చి 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
39 మ్యాచ్ల చిన్న కెరీర్లో ఆరో శతకం సాధించిన కేకేఆర్ బ్యాటర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్, ఆ జట్టు వికెట్కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ తన వన్డే కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతున్న ఈ 22 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్.. తన 39 మ్యాచ్ల కెరీర్లో ఆరో శతకం సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇన్ని సెంచరీలు సాధించడమంటే ఆషామాషీ విషయం కాదు. గుర్బాజ్ కెరీర్లో ఈ ఆరు శతకాలతో పాటు నాలుగు అర్దశతకాలు కూడా ఉన్నాయి. pic.twitter.com/J3sHi6z0OD— CricTracker (@Cricketracker) March 7, 2024 మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా షార్జా వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో గుర్బాజ్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 117 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. గుర్బాజ్తో పాటు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (60), వెటరన్ మొహ్మద్ నబీ (40), కెప్టెన్ షాహిది (50 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో థియో వాన్ వోర్కోమ్ 3 వికెట్లు పడగొట్టగా.. హ్యూమ్, క్రెయిగ్ యంగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో వారికంటే పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్కు పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించింది. -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. ఆరేళ్ల నిరీక్షణకు తెర
ఐర్లాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రెడ్బాల్ క్రికెట్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమ ఆరేళ్ల నిరీక్షణకు తెరదించింది. 2018లో టెస్టు హోదా పొందిన ఐర్లాండ్.. అప్పటి నుంచి తొలి గెలుపు కోసం ఆరేళ్లగా ఎదురుచూస్తోంది. ఇక ఈ మ్యాచ్లో 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (58) నాటౌట్గా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. అతడితో పాటు లారెన్ టక్కర్(27) పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 2 వికెట్లు, మసూద్, రెహ్మన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్.. ఐర్లాండ్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్కు 108 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్తాన్ ఐర్లాండ్ ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్లో 8 వికెట్లతో సత్తాచాటిన ఐరీష్ పేసర్ మార్క్ అడైర్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
263 పరుగులకే ఆలౌటైన ఐర్లాండ్.. అయినా 108 పరుగుల ఆధిక్యం
అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో ఐర్లాండ్ పైచేయి సాధించింది. ఈ జట్టు తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకే ఆలౌటైనా.. 108 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో వెటరన్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కర్టిస్ క్యాంఫర్ (49), లోర్కాన్ టక్కర్ (46), ఆండీ మెక్బ్రైన్ (38), హ్యారీ టెక్టార్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్లు మూర్ (12), బల్బిర్నీ (2), వాన్ వోర్కోమ్ (1), అదైర్ (15), మెక్కార్తీ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ పతనాన్ని శాశించిన రెహ్మాన్.. ఆఫ్ఘన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్ (5/64) ఐర్లాండ్ పతనాన్ని శాశించగా.. నవీద్ జద్రాన్ 3, నిజత్ మసూద్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ చేసిన 53 పరుగులే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా ఉంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ కరీం జనత్ (41 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (20), నవీద్ జద్రాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఐదేసిన అదైర్.. రహ్మత్ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్ (5), నసీర్ జమాల్ (0), జియా ఉర్ రెహ్మాన్ (6), నిజత్ మసూద్ (0), జహీర్ ఖాన్ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్ అదైర్ (5/39) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించగా.. కర్టిస్ క్యాంఫర్, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్కార్తీ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం. -
ఓపెనర్లుగా బాబాయ్-అబ్బాయ్.. ఒకరు హిట్టు, ఒకరు ఫట్టు
ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ జట్ల మధ్య అబుదాబీ వేదికగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 28) ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన బాబాయ్-అబ్బాయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అబ్బాయ్ ఇబ్రహీం జద్రాన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. బాబాయ్ నూర్ అలీ జద్రాన్ 7 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. బాబాయ్-అబ్బాయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆ మ్యాచ్ బాబాయ్ నూర్ అలీ జద్రాన్కు అరంగేట్రం మ్యాచ్ కాగా.. అబ్బాయ్ ఇబ్రహీం జద్రాన్కు అప్పటికే ఐదు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 35 ఏళ్ల వయసున్న బాబాయ్ నూర్ అలీ.. 22 ఏళ్ల అబ్బాయ్ ఇబ్రహీం చేతుల మీదుగా టెస్ట్ అరంగేట్రం క్యాప్ను అందుకున్నాడు. కాగా, ఇబ్రహీం బాబాయ్ నూర్ అలీ లేటు వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడో 15 ఏళ్ల కిందటే జరిగింది. నూర్ అలీ 2009లోనే వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో నూర్ అలీ రెగ్యులర్ సభ్యుడు. నూర్ అలీ ఇప్పటివరకు 51 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇతను వన్డేల్లో సెంచరీ, ఏడు అర్ధసెంచరీల సాయంతో 1216 పరుగులు.. టీ20ల్లో 4 అర్దసెంచరీల సాయంతో 586 పరుగులు చేశాడు. మరోవైపు అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ ఇప్పటివరకు 6 టెస్ట్లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడి 5 సెంచరీలు, 13 అర్దసెంచరీల సాయంతో దాదాపు 2500 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన కెరీర్లో చేసిన ఐదు సెంచరీలు వన్డేల్లో చేసినవే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. తొలి ఇన్నింగ్స్లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ చేసిన 53 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా ఉంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ కరీం జనత్ (41 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (20), నవీద్ జద్రాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఐదేసిన అదైర్.. రహ్మత్ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్ (5), నసీర్ జమాల్ (0), జియా ఉర్ రెహ్మాన్ (6), నిజత్ మసూద్ (0), జహీర్ ఖాన్ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్ అదైర్ (5/39) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించగా.. కర్టిస్ క్యాంఫర్, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్కార్తీ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. పీటర్ మూర్ (12), ఆండ్రూ బల్బిర్నీ (2), కర్టిస్ క్యాంఫర్ (49), వాన్ వోర్కమ్ (1) ఔట్ కాగా.. హ్యారీ టెక్టార్ (32), పాల్ స్టిర్లింగ్ (2) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
విజయంతో ముగింపు
రూర్కెలా: పురుషుల ప్రొ హాకీ లీగ్ భారత అంచె పోటీలను టీమిండియా విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. భారత్ తరఫున నీలకంఠ శర్మ (14వ ని.లో), ఆకాశ్దీప్ సింగ్ (15వ ని.లో), గుర్జంత్ సింగ్ (38వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో భారత జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. -
ఐర్లాండ్: వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు..
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవి మాత భక్తులు, కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో అలంకరించిన పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. చిరంజీవి-లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాలాా ఆనందంగా ఉందని కోర్-కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్కి, దీనికి సహకరించిన ప్రశాంత్కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తదుపరి కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహారణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా.. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్-కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు. -
ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్లలోనూ గెలుపు
అంతర్జాతీయ వన్డేల్లో ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0 తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20, మూడు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఐరిష్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా.. డిసెంబరు 7న మొదలైన టీ20 సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న ఐర్లాండ్.. వన్డేల్లోనూ సత్తా చాటింది. బుధవారం (డిసెంబరు 13) నాటి తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గిన ఐర్లాండ్.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాల్ స్టిర్లింగ్ బృందం జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఐరిష్ పేసర్లు గ్రాహం హ్యూమ్, కర్టిస్ కాంఫర్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో 40 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ జాయ్లార్డ్ గుంబీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వన్డౌన్ బ్యాటర్ కైటానో 13 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగారు. అయితే, వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ టార్గెట్ను 201గా నిర్దేశించారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మొత్తంగా 102 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(8) నిరాశపరచగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కర్టిస్ కాంఫర్ 40, హ్యారీ టెక్టార్ 33 పరుగులు సాధించారు. బల్బిర్నీతో కలిసి లోర్కాన్ టకర్ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఐర్లాండ్ 2-0తో సొంతం చేసుకుంది. బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. కర్టిస్ కాంఫర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్? -
ఆరేసిన జాషువ లిటిల్.. జింబాబ్వేకు మరో షాకిచ్చిన ఐర్లాండ్
ఐర్లాండ్ జట్టు తమ కంటే కాస్త మెరుగైన జింబాబ్వేకు షాక్ల మీద షాక్లు ఇస్తుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐరిష్ టీమ్.. తొలుత జరిగిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని తాజాగా ఆతిథ్య జట్టుకు మరో షాకిచ్చింది. వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జాషువ లిటిల్ ఆరు వికెట్లు (10-2-36-6) తీసి జింబాబ్వేను ఒంటిచేత్తో ఓడించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. లిటిల్ ధాటికి 42.5 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో మసకద్జ (40), ర్యాన్ బర్ల్ (38), క్లైయివ్ మదాండే (33), ముజరబానీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిటిల్కు జతగా మార్క్ అడైర్ (1/23), క్రెయిగ్ యంగ్ (1/30), ఆండీ మెక్బ్రెయిన్ (1/34), హ్యారీ టెక్టార్ (1/5) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 40.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్టిస్ క్యాంఫర్ (66) అర్ధసెంచరీతో రాణించగా.. లోర్కాన్ టక్కర్ (28), మార్క్ అడైర్ (25 నాటౌట్), హ్యారీ టెక్టార్ (21) ఒ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్ మవుటా, ముజరబానీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగరవ, చివంగ తలో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 17న జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. -
సికందర్ రజా ఆల్రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో జింబాబ్వే గెలుపు
సికందర్ రజా ఆల్రౌండ్ ప్రదర్శనతో (4-0-28-3, 42 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో 11వ నంబర్ ఆటగాడు ముజరబానీ ఆఖరి బంతికి 2 పరుగులు తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను జింబాబ్వే ఆటగాళ్లు ఆఖరి బంతి వరకు తీసుకెళ్లారు. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో జింబాబ్వే ఆటగాళ్లు తడబడ్డారు. 18వ ఓవర్లో వికెట్ నష్టపోయి 5 పరుగులు, 19వ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 4 పరుగులు, ఆఖరి ఓవర్లో వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసి అతి కష్టం మీద విజయతీరాలకు చేరారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. సికందర్ రజా, నగరవ (4-0-23-2), ముజరబానీ (4-0-24-2), సీన్ విలియమ్స్ (3-0-18-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్లో ఓపెనర్ బల్బిర్నీ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. సికందర్ రజా రాణించడంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో ఐర్లాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని జింబాబ్వేకు గెలుపును అంత ఈజీగా దక్కనీయలేదు. అతి కష్టం మీద జింబాబ్వే చివరి బంతికి విజయం సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ డాక్రెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రజాకు ఈ ఏడాది టీ20ల్లో ఇది ఎనిమిదో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం. కాగా, 3 టీ20లు, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
ఐర్లాండ్ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్లో గత రాత్రి (గురువారం, నవంబరు 23) కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్) తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన అనంతరం సెంట్రల్ డబ్లిన్ అంతటా హింసాత్మక నిరసన చెలరేగింది. ఈ ఘటన తరువాత దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు. మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్ను) తగుల బెట్టారు. అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. We are all shocked by the incident which has taken place in Parnell Square. A number of people have been injured, some of them children. Our thoughts and our prayers go out to them and their families. — Leo Varadkar (@LeoVaradkar) November 23, 2023 50 ఏళ్ల ఐరిష్ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. JUST IN: Another hotel on fire in Dublin, Ireland… Citizens set fire to the Holiday Inn that is used to house immigrants following the violent stabbing of three children..pic.twitter.com/51Y7Gj4dXC — Chuck Callesto (@ChuckCallesto) November 24, 2023 -
ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట!
పాములు లేని ఊరు, గ్రామం ఉండు. కానీ కొన్ని దేశాల్లో అస్సలు పాము అనేదే కనిపించదట. ముఖ్యంగా ఓ దేశంలో అయితే ఇంతవరకు పాము కనిపించిన దాఖలాలు లేవని తేల్చి చెబుతున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఎందువల్ల అక్కడ పాములు కనిపించవు? రీజన్ ఏంటి తదితరాల గురించే ఈ కథనం!. బ్రిటన్ , ఐర్లాండ్లో పామలు అస్సలు కనపించవట. అందుకు కారణంగా అతి శీతల ప్రదేశాలు కావడం వల్ల అని అంటుంటారు. గడ్డకట్టే చలిలో ఆ సరిసృపాలు జీవించలేవని అందువల్లే ఇక్కడ పాములు లేవని చెబుత్నున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఒక్క పాము కూడా కనిపించనట్లు రికార్డుల్లో కూడా లేదని చెప్పారు. పురాణాల ప్రకారం క్రీస్తు శకంలో సెయింట్ పాట్రిక్ అనే క్రైస్తవ మత పెద్ద ఐర్లాండ్ ద్వీపం నలుమూలలోని పాములను తరిమేసి సముద్రంలోకి పడేశాడని అందువల్లే ఇక్కడ పాములు ఉండవని కథలు కథలుగా చెబుతుంటారు. అంతేగాదు సుమారు పదివేల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరిత్యం వల్ల హిమనీనదాలు కరిగిపోవడంతో ఈ ఐర్లాండ్ ద్వీపం కొన్నేళ్ల వరకు మునిగిపోయిందని, అందువల్లే పాములు లేవని చెబుతుంటారు. పురావస్తు రికార్డుల ప్రకారం, బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో పాములు లేవని వెల్లడించింది. ఐతే ఆ తర్వాత మరికొన్ని పరిశోధన కారణంగా ఈ దేశాల్లో మూడు రకాల పాము జాతులను గుర్తించారు. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, సాధారణ పాములు వంటి సరీసృపాలు జాతులను మాత్రమే గుర్తించారు. అలాగే న్యూజిలాండ్లో కూడా ఒక్క పాము కూడా కనిపించదట. ఇది ఎన్నో రకాల అడవి జంతువులకు నిలయమైన ఇక్కడ కూడా ఒక పాము కూడా కనిపించదట. (చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్!) -
CWC 2023: టీ20 వరల్డ్కప్ 2022 సీన్ను ఇంగ్లండ్ మళ్లీ రిపీట్ చేస్తుందా..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పటిష్టమైన ఇంగ్లండ్ను మట్టికరిపించారు. ప్రపంచకప్ టోర్నీల్లో తమకంటే చిన్న జట్ల చేతుల్లో ఓడటం ఇంగ్లండ్కు ఇది తొలిసారేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ జట్టు పసికూనల చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. 1992లో జింబాబ్వే చేతిలో, 2011లో ఐర్లాండ్ చేతిలో, 2015 వరల్డ్కప్లో బంగ్లాదేశ్ చేతిలో, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ టీమ్ ఊహించని ఎదురుదెబ్బలు తినింది. వన్డే ప్రపంచకప్ల్లో పరిస్థితి ఇదైతే.. టీ20 వరల్డ్కప్లోనూ ఇంగ్లండ్కు ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. 2022 ఎడిషన్లో హేమాహేమీలతో నిండిన ఇంగ్లండ్ టీమ్.. ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో ఐర్లాండ్ ప్రత్యక్షంగా ఇంగ్లండ్ను ఓడించనప్పటికీ.. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్ను విజేతగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. నాడు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. ఆతర్వాత ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయి వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. ప్రస్తుత వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మరోసారి 2022 టీ20 వరల్డ్కప్ సీన్ను రిపీట్ చేస్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, నిన్నటి (అక్టోబర్ 15) మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..!
పసికూన ఐర్లాండ్పై వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రతాపం చూపింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ టీమ్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓపెనర్గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, ఐర్లాండ్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. సాల్ట్కు విల్ జాక్స్ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ జాక్ క్రాలే (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (54 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. డకెట్తో పాటు సామ్ హెయిన్ (4) క్రీజ్లో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, వాన్ వొయెర్కోమ్ ఓ వికెట్ పడగొట్టారు. మరో 25 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో రికార్డు స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఇప్పటికే నమోదైన పలు రికార్డులు.. వన్డే పవర్ ప్లేలో ఇంగ్లండ్ అత్యధిక స్కోర్: 107/2 8 ఓవర్లలోనే ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును తాకింది వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఫిలిప్ సాల్ట్ (22 బంతుల్లో) కాగా, ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ రెగ్యులర్ టీమ్ సభ్యులంతా వరల్డ్కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ టీమ్కు జాక్ క్రాలే నాయకత్వం వహిస్తున్నాడు. -
ఒక్కటీ గెలవలేదు.. హోదా ఇచ్చి తప్పుచేశారు! అన్నిటికంటే చెత్త విషయం ఇదే..
Getting Test status was...: న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఐర్లాండ్ క్రికెట్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు టెస్టు హోదా కల్పించడం అన్నింకంటే చెత్త విషయమని పేర్కొన్నాడు. టెస్టు జట్టుగా మారడం ఐర్లాండ్ క్రికెట్కు హానికరంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పసికూన అనే ముద్రను చెరిపేసుకునేందుకు కృషి చేస్తున్న ఐరిష్ టీమ్.. 2017లో టెస్టు జట్టు హోదాను దక్కించుకుంది. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్తో తమ తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఐరిష్ జట్టు.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత.. అఫ్గనిస్తాన్తో ఒకటి, ఇంగ్లండ్తో రెండు, శ్రీలంకతో రెండు టెస్టులాడింది. వీటన్నింటితో పాటు ఈ ఏడాది బంగ్లాదేశ్తో ఆడిన ఏకైక టెస్టులోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ జట్టు పరాభవాలను ఉద్దేశించి సైమన్ డౌల్ స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ఫ్యాన్స్ను కోల్పోతానని తెలుసు ‘‘ఇలా మాట్లాడటం వల్ల నా అభిమానుల్లో కొంతమందిని కోల్పోతానని తెలుసు.. కానీ ఐర్లాండ్ విషయంలో జరిగిన చెడు ఏమిటంటే ఆ జట్టుకు టెస్టు హోదా రావడమే. నేను మాట్లాడేది సిల్లీగా అనిపించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడాలనేది ఇప్పటికీ ఐర్లాండ్లోని కొద్ది మంది ప్లేయర్లకు మాత్రమే కల. అప్పుడు కౌంటీ క్రికెట్లో ఆడుతూ కానీ రానున్న 15-20 ఏళ్లలో ఇలాగే ఉంటుందని చెప్పలేం. నిజానికి తమ క్రికెటర్లు కౌంటీ క్రికెట్ ఆడేటపుడు ఐర్లాండ్ జట్టు అత్యుత్తమంగా ఉండేది. యూకేలో అత్యున్నత ప్రమాణాల స్థాయికి తగ్గట్లు వాళ్లు ఆడేవారు. దానినే జాతీయ జట్టులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉండేవారు. ఒత్తిడి ఎలా జయించాలో తెలిసిన అనుభవజ్ఞులు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఐర్లాండ్ టీమ్ను చూస్తే అలా కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా చెత్త ప్రదర్శనల నేపథ్యంలో టెస్టు హోదా వల్ల ఐర్లాండ్కు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. భవిష్యత్తులో ఆ జట్టు మనుగడ కష్టమేనన్న ఉద్దేశంలో సైమన్ డౌల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
వరల్డ్కప్కు ముందు జో రూట్ ఆసక్తికర నిర్ణయం
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఆ జట్టు వరల్డ్కప్ జట్టు సభ్యుడు జో రూట్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో రేపు (సెప్టెంబర్ 20) జరుగబోయే తొలి మ్యాచ్లో బరిలోకి దిగేందుకు సర్వం సిద్దం చేసుకున్నాడు. ఇందుకోసం అతను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతిని తీసుకున్నాడు. రూట్ గత కొన్ని మ్యాచ్లుగా ఫామ్లో లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్లోకి రావడం కోసం రూట్ పడుతున్న తాపత్రయాన్ని చూసి ఈసీబీ సైతం అతనికి పర్మీషన్ను ఇచ్చింది. వరల్డ్కప్కు ముందు ఫామ్లోకి వచ్చేందుకు రూట్కు ఇది చాలా ఉపయోగపడుతుందని ఈసీబీ సైతం భావిస్తుంది. కాగా, ప్రపంచకప్కు ఎంపిక చేసిన సభ్యులను ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక చేయలేదు. రూట్ ప్రస్తుతం పట్టుబట్టి మరీ ఇంగ్లండ్ జట్టులో చేరాడు. కీలకమైన వరల్డ్కప్కు ముందు ఆటగాళ్లు గాయాలు బారిన పడకూడదని ఈసీబీ ఐర్లాండ్ సిరీస్కు తమ మెయిన్ స్ట్రీమ్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే, ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్తో రూట్ చాలాకాలం తర్వాత వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జులైలో సౌతాఫ్రికాతో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన రూట్.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. రూట్ నాలుగు మ్యాచ్ల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 6 పరుగులు చేసిన రూట్.. ఆతర్వాత రెండో వన్డేలో డకౌట్, మూడో వన్డేలో 4 పరుగులు, నాలుగో వన్డేలో 29 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఐర్లాండ్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు.. జాక్ క్రాలే (కెప్టెన్), సామ్ హెయిన్, బెన్ డకెట్, జో రూట్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లూక్ వుడ్, ఫిలిప్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్,జార్జ్ స్క్రిమ్షా, టామ్ హార్ట్లీ -
వానతో ముగిసిన ఆట!
డబ్లిన్: భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వర్షంతో ముగింపు లభించింది. బుధవారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వాన కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. నిర్విరామంగా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మధ్యలో కొద్దిసేపు వాన తీవ్రత తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా... కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ ఖాతాలో 2–0తో సిరీస్ చేరింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ‘చంద్రయాన్’ను వీక్షిస్తూ... మ్యాచ్ రోజు డబ్లిన్లో భారత క్రికెటర్లు టీవీలో ‘చంద్రయాన్–3’ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ సమయం గడిపారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టిన క్షణాన సంబరాలు చేసుకుంటూ భావోద్వేగంతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. మరోవైపు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టార్ ప్లేయర్ కోహ్లి తదితరులు తమ సంతోషాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్లో ‘ఇస్రో’కు అభినందనలు తెలియజేశారు. -
IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. టాప్ స్కోరర్గా రుతురాజ్.. కాగా, ఈ సిరీస్లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
ఐర్లాండ్తో మూడో టీ20.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
ఐర్లాండ్తో ఇవాళ (ఆగస్ట్ 23) జరుగనున్న నామమాత్రపు మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. 3 మ్యాచ్ల సిరీస్ను 2-0తో ఇదివరకే కైవసం చేసుకున్న భారత్, నేటి మ్యాచ్లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన ముకేశ్ కుమార్, జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్లు మూడో టీ20 బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్ల స్థానంలో ఈ నలుగురు బరిలోకి దిగవచ్చు. పై పేర్కొన్న నలుగురికి అవకాశం ఇస్తే ఐర్లాండ్లో పర్యటించిన భారత జట్టు మొత్తానికి కనీసం ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సైతం విశ్రాంతి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆసియా కప్కు ముందు అనవసర రిస్క్ ఎందుకుని మేనేజ్మెంట్ భావిస్తే.. బుమ్రా రెస్ట్ తీసుకుని, అర్షదీప్కు అవకాశం ఇస్తాడు. అప్పుడు జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడు. ఆసియా క్రీడల్లో రుతు ఎలాగూ టీమిండియాకు నాయకత్వం వహించాల్సి ఉంది కాబట్టి, అతనికి ఈ మ్యాచ్ ప్రాక్టీస్ అయినట్లవుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్లో టీమిండియా రిజర్వ్ బెంచ్కు పరీక్షగా మారనుంది. మరోవైపు ఐర్లాండ్ సైతం ఒకటిరెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ జట్టు కూడా రిజర్వ్ బెంచ్కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే భారత్లా భారీ ప్రయోగాలు కాకుండా ఒకటి, రెండు మార్పులకు ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల విషయానికొస్తే.. ముగ్గురు టీమిండియా బౌలర్లు 4 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్లు మ్యాచ్కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్తో మూడో టీ20కి టీమిండియా (అంచనా): జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)/అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్/కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ -
Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్లకు ఛాన్స్!
డబ్లిన్: వెస్టిండీస్తో ఐదు టి20 మ్యాచ్లు, ఆ తర్వాత ఐర్లాండ్తో మూడు టి20 మ్యాచ్లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్ చివరి మ్యాచ్లో ఆ చాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్ను 2–0తో సొంతం చేసుకున్న భారత్ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్లలో కలిపి భారత్తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది. జితేశ్, షహబాజ్లకు అవకాశం! ఐర్లాండ్తో రెండు మ్యాచ్లోలనూ రాణించిన కెప్టెన్ బుమ్రా, పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫామ్లోకి రావడం, ఆసియా కప్కు ఎంపిక కావడంతో ఈ సిరీస్ నుంచి భారత్కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ కూడా సిరీస్లో తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. సిరీస్లో విఫలమైన తిలక్ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్ అహ్మద్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్లోకి వచ్చిన అవేశ్ ఖాన్ కూడా టీమ్తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్ ఇవ్వాలనుకుంటే అర్‡్షదీప్కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్ ప్రయోగం సంపూర్ణమవుతుంది. స్టిర్లింగ్ ఫామ్లోకి వచ్చేనా! రెండు టి20 మ్యాచ్లలో ఐర్లాండ్ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా లీగ్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్ కూడా గత మ్యాచ్తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
ప్రపంచ రికార్డు సమం చేసిన బుమ్రా
ఐర్లాండ్తో రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఓ ప్రపంచ రికార్డు సమం చేశాడు. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ను (ఛేదనలో) మెయిడిన్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో (ఐసీసీ ఫుల్టైమ్ సభ్యదేశాలు పాల్గొన్న మ్యాచ్లు) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) వేసిన బౌలర్గా సహచరుడు భువనేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు. భువీ 87 టీ20ల్లో 10 మెయిడిన్లు వేస్తే, బుమ్రా తన 62వ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విభాగంలో భువీ, బుమ్రాల తర్వాత బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6), శ్రీలంక నువాన్ కులశేఖర (6) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఐర్లాండ్తో రెండో టీ20లో 4 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (74) తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో చహల్ 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 90 వికెట్లతో భువనేశ్వర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్తో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ (58), శాంసన్ (40), రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఐర్లాండ్ లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ (72) టాప్ స్కోరర్గా నిలువగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. -
రుతురాజ్, సామ్సన్ మెరుపులు.. సిరీస్ మనదే
డబ్లిన్: సీనియర్లంతా విశ్రాంతి తీసుకున్న ఐర్లాండ్ పర్యటనలో యువ ఆటగాళ్లు బాధ్యతగా ఆడి టీమిండియాను గెలిపించారు. రెండో టి20లో 33 పరుగులతో గెలుపొందిన బుమ్రా బృందం మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. రెండో టి20లో మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించారు. మెకార్తీ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. రాణించిన గైక్వాడ్ భారీ షాట్లు ఆడే క్రమంలో బంతిని గాల్లోకి లేపిన టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (1) అవుటయ్యారు. విండీస్ పర్యటనలో రాణించిన తిలక్ ఈ సిరీస్లోని రెండు మ్యాచ్ల్లో నిరాశ పరిచాడు. మెకార్తీ షార్ట్పిచ్ బంతిని తిలక్ పుల్ చేయగా అదికాస్తా అక్కడే చాలా ఎత్తుకు లేచింది. డీప్స్కే్వర్ లెగ్లో ఉన్న డాక్రెల్ క్యాచ్ను అందుకున్నాడు. 34 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును రుతురాజ్, సంజూ సామ్సన్ ధాటిగా నడిపించారు. మూడో వికెట్కు 71 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతున్న సామ్సన్ బంతిని వికెట్ల మీదికి ఆడుకొని నిష్క్రమించగా, అర్ధసెంచరీ అనంతరం రుతురాజ్ అవుటయ్యాడు. ఆఖర్లో రింకూ సింగ్, శివమ్ దూబే (16 బంతుల్లో 22 నాటౌట్, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించారు. బల్బిర్నీ పోరాటం... తొలి మ్యాచ్లో బుమ్రా పడగొట్టినట్లే ఈసారి ప్రసిధ్ కృష్ణ ఒకే ఓవర్లో (3వ) కెపె్టన్ స్టిర్లింగ్ (0), టక్కర్ (0)లను డకౌట్ చేశాడు. టెక్టర్ (7), క్యాంఫర్ (18)లను రవి బిష్ణోయ్ స్పిన్తో బోల్తా కొట్టించాడు. దాంతో 10 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు 63/4. ఈ దశలో ఐర్లాండ్కు గెలుపుపై ఆశలేమీ లేవు. అయితే బల్బిర్నీ వీరవిహారం భారత శిబిరాన్ని వణికించింది. డాక్రెల్ (13; 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. కాసేపటికే డాక్రెల్ లేని పరుగుకు యత్నించి రనౌట్ కాగా... సిక్సర్ల మోత మోగిస్తున్న బల్బిర్నీ జోరుకు అర్ష్దీప్ బ్రేక్ వేలేశాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ పక్షాన నిలిచింది. మార్క్ అడైర్ (15 బంతుల్లో 23; 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే బంతులకి, పరుగులకి మధ్య కొండంత అంతరాన్ని ఈ సిక్సర్లు తగ్గించలేకపోయాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) క్యాంఫర్ (బి) యంగ్ 18; రుతురాజ్ (సి) టెక్టర్ (బి) మెకార్తీ 58; తిలక్ వర్మ (సి) డాక్రెల్ (బి) మెకార్తీ 1; సంజూ సామ్సన్ (బి) వైట్ 40; రింకూ సింగ్ (సి) యంగ్ (బి) అడైర్ 38; దూబే (నాటౌట్) 22; సుందర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–29, 2–34, 3–105, 4–129, 5–184. బౌలింగ్: మార్క్ అడైర్ 4–0–36–1, జోష్ లిటిల్ 4–0–48–0, మెకార్తీ 4–0–36–2, క్రెయిగ్ యంగ్ 4–0–29–1, బెన్ వైట్ 4–0–33–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బిర్నీ (సి) సామ్సన్ (బి) అర్ష్దీప్ 72; స్టిర్లింగ్ (సి) అర్ష్దీప్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; టక్కర్ (సి) రుతురాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; టెక్టర్ (బి) రవి బిష్ణోయ్ 7; క్యాంఫర్ (సి) దూబే (బి) రవి బిష్ణోయ్ 18; డాక్రెల్ (రనౌట్) 13; అడైర్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 23; మెకార్తీ (సి) రవి బిష్ణోయ్ (బి) బుమ్రా 2; యంగ్ (నాటౌట్) 1; జోష్ లిటిల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 152. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–28, 4–63, 5–115, 6–123, 7–126, 8–148. బౌలింగ్: బుమ్రా 4–1–15–2, అర్ష్దీప్ 4–0–29–1, ప్రసిధ్ కృష్ణ 4–0–29–2, రవి బిష్ణోయ్ 4–0–37–2, వాషింగ్టన్ సుందర్ 2–0–19–0, శివమ్ దూబే 2–0–18–0. -
IND VS IRE 2nd T20: ఐర్లాండ్పై భారత్ ఘన విజయం
ఐర్లాండ్తో జరిగిన రెండో టి20లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 33 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ (ఆగస్ట్ 20) జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 57; 6 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (18), తిలక్ వర్మ (1) విఫలం కాగా.. ఆఖర్లో శివమ్ దూబే (16 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్కార్తీ 2 వికెట్లు పడగొట్టగా.. క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్, మార్క్ అడైర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఐర్లాండ్తో రెండో టీ20.. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్ ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్ 39 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రుతురాజ్కు జతగా రింకూ సింగ్ (10) క్రీజ్లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 129/3గా ఉంది. యశస్వి (18), తిలక్ వర్మ (1), సంజూ శాంసన్ (40) ఔటయ్యారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ -
సిరీస్పై భారత్ కన్ను
డబ్లిన్: ఐర్లాండ్ పర్యటనలో శుభారంభం చేసిన భారత జట్టు మరో విజయంతో సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. నేడు జరిగే రెండో టి20లో ఐర్లాండ్పై గెలుపే లక్ష్యంగా బుమ్రా సేన బరిలోకి దిగుతోంది. వాన అడ్డుకున్న గత మ్యాచ్లో మన బౌలర్లు తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన సీనియర్ సీమర్ బుమ్రా మునుపటి వాడితో అదరగొట్టాడు. ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా సత్తా చాటారు. ఇప్పుడు బ్యాటర్ల వంతు వచ్చింది. ఈ మ్యాచ్లో కుర్రాళ్లకు చక్కని బ్యాటింగ్ అవకాశమివ్వాలనుకుంటే మాత్రం భారత్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఓపెనింగ్లో యశస్వి జైస్వాల్ ఉన్నంత సేపు బాగానే ఆడాడు. రుతురాజ్ మెరుగనిపించాడు. కానీ కరీబియన్ పర్యటనలో అందరికంటే బాగా ఆడిన తెలుగుతేజం తిలక్వర్మ డకౌట్ కావడం కాస్త నిరాశపరిచింది. ఈ మ్యాచ్లో హైదరాబాదీ బ్యాటర్ చెలరేగితే స్కోరు బోర్డు ఉరకలెత్తడం ఖాయం. అనుభవజు్ఞల్లేకపోయినా... భారత జట్టులోని ఆటగాళ్లందరికి ఐపీఎల్లో మెరిపించిన అనుభవం ఎంతో ఉంది. కాబట్టి వరుస విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. గెలిపించేదెవరు..? మరోవైపు ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య జట్టు సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవక తప్పదు. టాపార్డర్లో బల్బిర్నీ , కెప్టెన్ స్టిర్లింగ్, టకర్ బాధ్యత కనబరిస్తేనే ప్రత్యర్థికి దీటైన స్కోరు చేయొచ్చు. లేదంటే తొలి టి20లాగే ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదముంది. బౌలింగ్లో యంగ్ వైవిధ్యమైన బంతులతో భారత్ను కంగారు పెట్టించాడు. జోష్ లిటిల్, మార్క్ అడైర్లు కూడా నిలకడగా బౌలింగ్ చేస్తే భారత కుర్రాళ్ల జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. ఆదివారం వాన ముప్పు లేదు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. జట్లు (అంచనా) భారత్.. బుమ్రా (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, తిలక్ వర్మ, సామ్సన్, రింకూసింగ్, దూబే, సుందర్, అర్ష్దీప్, బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ. ఐర్లాండ్.. స్టిర్లింగ్ (కెప్టెన్ ), బల్బిర్నీ, టక్కర్, టెక్టర్, క్యాంపర్, డాక్రెల్, మార్క్ అడైర్, మెకార్తీ, యంగ్, జోష్ లిటిల్, బెన్వైట్. -
బుమ్రా బృందం శుభారంభం
డబ్లిన్: భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా (2/24) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ సీనియర్ సీమర్ వన్డే ప్రపంచకప్కు ముందు భారత బౌలింగ్ దళానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే అనుకున్నట్లే భారత్, ఐర్లాండ్ తొలి టి20ని వరుణుడు అడ్డుకున్నాడు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. ఈ మ్యాచ్తో రింకూ సింగ్, ప్రసిధ్ కృష్ణ భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేశారు. మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. పవర్ప్లేలో ఓపెనింగ్ జోడీ 45 పరుగులు చేసింది. ఏడో ఓవర్ వేసిన క్రెయిగ్ యంగ్ 5 బంతులేసి 2 వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ (0) డకౌటయ్యాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఇదే వేదికపై రెండో మ్యాచ్ జరుగుతుంది. బుమ్రా ధాటికి... చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన భారత పేసర్, కెపె్టన్ బుమ్రా తన పేస్లో పదును ఏమాత్రం తగ్గలేదని తొలి ఓవర్లోనే చూపించాడు. అతని ధాటికి ఓపెనర్ బల్బిర్నీ (4) క్లీన్బౌల్డ్ కాగా, టక్కర్ (0) ఖాతానే తెరవలేదు. తర్వాత ప్రసిధ్ కృష్ణ కూడా ఐర్లాండ్ ఇన్నింగ్స్ను చావుదెబ్బ తీయడంతో 31 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే క్యాంఫర్ (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకోగా, మెకార్తీ డెత్ ఓవర్లలో చెలరేగడంతో ఐర్లాండ్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బిర్నీ (బి) బుమ్రా 4; స్టిర్లింగ్ (బి) బిష్ణోయ్ 11; టక్కర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 0; టెక్టర్ (సి) తిలక్ (బి) ప్రసిధ్ కృష్ణ 9; క్యాంఫర్ (బి) అర్శ్దీప్ 39; డాక్రెల్ (సి) రుతురాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 1; మార్క్ అడైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 16; మెకార్తీ (నాటౌట్) 51; యంగ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–4, 2–4, 3–27, 4–27, 5–31, 6–59, 7–116. బౌలింగ్: బుమ్రా 4–0–24–2, అర్ష్దీప్ 4–0–35–1, ప్రసిధ్ కృష్ణ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–23–2, శివమ్ దూబే 1–0–6–0, వాషింగ్టన్ సుందర్ 3–0–19–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) స్టిర్లింగ్ (బి) యంగ్ 24; రుతురాజ్ (నాటౌట్) 19; తిలక్ వర్మ (సి) టక్కర్ (బి) యంగ్ 0; సామ్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (6.5 ఓవర్లలో 2 వికెట్లకు) 47. వికెట్ల పతనం: 1–46, 2–46. బౌలింగ్: మార్క్ అడైర్ 1–0–10–0, జోష్ లిటిల్ 3–0–20–0, మెకార్తీ 2–0–14–0, యంగ్ 0.5–0–2–2. -
IND VS IRE 1st T20: వర్షం అంతరాయం.. ఐర్లాండ్పై టీమిండియా విజయం
ఐర్లాండ్తో 3 టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో టీమ్ ఇండియా డక్వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఫలితంగా ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లలో (51 నాటౌట్), కర్టిస్ క్యాంఫర్ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్ స్టిర్లింగ్ (11), లోక్కాన్ టక్కర్ (0), హ్యారీ టెక్టార్ (9), జార్జ్ డాక్రెల్ (1), మార్క్ అదైర్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఆఖర్లో, ముఖ్యంగా అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో మెక్కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన మెక్కార్తీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఓ రికార్డు కూడా సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 8 లేదా అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ స్థానంలో వచ్చి కేశవ్ మహారాజ్ చేసిన 41 పరుగులే అత్యధికంగా ఉండేది. కాగా, దాదాపుగా ఏడాది తర్వాత బంతి పట్టిన బుమ్రా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆతర్వాత ప్రభావం చూపించలేకపోయాడు. -
IND VS IRE 1st T20: బుమ్రా రీఎంట్రీ.. తొలి బంతికే ఫోర్.. అదే ఓవర్లో 2 వికెట్లు
Ireland vs India, 1st T20I- Two wickets in the first over for India in a T20I: దాదాపుగా ఏడాది తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. వచ్చీ రాగానే తనదైన మార్కు చూపించాడు. ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో మునుపటి కంటి అధికమైన జోష్తో తొలి బంతిని సంధించిన బుమ్రా.. ఆ బంతికి బౌండరీని సమర్పించుకున్నాడు. రెండో బంతిని తొలి బంతి కంటే వేగంగా సంధించిన బుమ్రా ఈసారి సక్సెస్ సాధించి, వికెట్ తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన ఆండ్రూ బల్బిర్నీ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని క్లీన్ బౌల్డయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా మరో వికెట్ కూడా తీసుకున్నాడు. ఐదో బంతికి టక్కర్.. వికెట్ల వెనుక సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టిన క్రమంలో బుమ్రా ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. 2016లో శ్రీలంకపై అశ్విన్ తొలిసారి తొలి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టగా.. 2022లో ఆఫ్ఘానిస్తాన్పై భువనేశ్వర్ కుమార్, ఇదే ఏడాది వెస్టిండీస్పై హార్ధక్ పాండ్యా, తాజాగా బుమ్రా ఈ ఘనత సాధించారు. కాగా, ఈ మ్యాచ్లో బుమ్రా తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టిన అనంతరం డెబ్యూ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్లోనే (5వ ఓవర్) ఓ వికెట్ పడగొట్టాడు. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ప్రసిద్ధ్ టెక్టార్కు ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే భారత్కు మరో వికెట్ దక్కింది. రవి బిష్ణోయ్.. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ క్లీన్బౌల్డ్ చేశాడు. 7వ ఓవర్లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఐర్లాండ్ స్కోర్ 35/5గా ఉంది. మార్క్ అదైర్ (4), కర్టిస్ క్యాంఫర్ (2) క్రీజ్లో ఉండగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ తలో 2 వికెట్లు, బిష్ణోయ్ ఓ వికెట్ పడగొట్టారు. What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023 -
భారత బౌలర్ల విజృంభణ.. అతడు ఆదుకున్నాడు!
Ireland vs India, 1st T20I: టీమిండియాతో తొలి టీ20లో ఆరంభంలో తడబడ్డా ఐర్లాండ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన బ్యారీ మెకార్తీ అజేయ అర్ధ శతకం(51 పరుగులు)తో జట్టును ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 139 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు, ప్రసిద్ కృష్ణ రెండు, రవి బిష్ణోయి రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్నకు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల దెబ్బ తొలి టీ20లో భారత బౌలర్ల ధాటికి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమవుతోంది. 35 పరుగులకే ఐర్లాండ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బుమ్రా తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి టీమిండియాకు శుభారంభం అందించాడు. అనంతరం టీ20 అరంగేట్ర బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్లోనే (5వ ఓవర్) వికెట్ తీశాడు. టెక్టార్ను పెవిలియన్కు పంపాడు. ఇక ఆ మరుసటి ఓవర్లోనే టీమిండియాకు రవి బిష్ణోయ్ మరో వికెట్ అందించాడు. ఐరిష్ జట్టు సారథి పాల్ స్టిర్లింగ్ క్లీన్బౌల్డ్ చేశాడు. ఇక 7వ ఓవర్లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. దీంతో ఏడు ఓవర్లలోనే ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 18) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్-2023 స్టార్, సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. రింకూతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ మ్యాచ్తో టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ -
ఐర్లాండ్తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా
డబ్లిన్: రాబోయే కాలానికి కాబోయే స్టార్లతో ఉన్న టీమిండియా మరో టి20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో నిరూపించుకునేందుకు కుర్రాళ్లు సై అంటున్నారు. ఇందులో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. 11 నెలలుగా బరిలోకే దిగని బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనుండటం మరో విశేషం. అయితే స్టార్ల కొరతే సిరీస్కు వెలతి! ఇటీవల వెస్టిండీస్తో ఆడిన జట్టులో తాత్కాలిక కెపె్టన్ హార్దిక్ పాండ్యా అయినా ఉన్నాడు. ఈ సిరీస్కు తను కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలాగే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతమాత్రాన ఈ క్రికెట్ ‘షో’కు సోకులేం తక్కువగా లేవు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, జితేశ్ శర్మ తదితరులంతా ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన వారే! కలగలిపిన ప్రపంచ శ్రేణి బౌలర్లను ఎదుర్కొన్నవారే! ఇప్పుడు మాత్రం ఒక్క ఐర్లాండ్ బౌలర్లతో ‘ఢీ’ కొట్టేందుకు రెడీ అయ్యారు. అందరి కళ్లు బుమ్రా, తిలక్లపైనే... వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత 29 ఏళ్ల బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగుతున్నాడు. ఇదేమో టి20 సిరీస్... భారత్లో జరగబోయేది వన్డే వరల్డ్కప్... ఎలా చూసుకున్నా పరిమిత ఓవర్లలో బుమ్రా పవర్ఫుల్ బౌలర్. ఒకేసారి 10 ఓవర్ల కోటా ఉండే వన్డేల్లో కాకుండా 4 ఓవర్లతో సరిపెట్టుకునే టి20 మ్యాచ్లతో ఆడించడం ద్వారా అతనిపై పని ఒత్తిడి లేకుండా బోర్డు జాగ్రత్త పడింది. మరోవైపు అవకాశం వచ్చిన ఐపీఎల్లో, బరిలోకి దించిన కరీబియన్ సిరీస్లో చెలరేగిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మపై కూడా సెలక్టర్లు దృష్టి పడింది. ఈ సిరీస్లో వీరిద్దరిపైనే అందరి కళ్లుంటాయనేది వాస్తవం. ఇక ప్రత్యర్థి ఐర్లాండ్ విషయానికొస్తే బల్బిర్నీ సారథ్యంలో జట్టు నిలకడగా రాణిస్తోంది. కుర్రాళ్లున్నా... ఇంకెవరున్నా... టీమిండియాపై గెలుపు వారికి గొప్పదే అవుతుంది. అందుకే సిరీసే లక్ష్యంగా ఐర్లాండ్ దిగుతోంది. టికెట్లు హాట్కేకుల్లా... మైదానంలో భారత జట్టు దిగితే ఏ జట్టుకైనా కాసుల రాశులు కురుస్తాయనే దానికి భారత్, ఐర్లాండ్ టి20 సిరీస్ మరో ఉదాహరణ. టీమిండియా వైపు నుంచి చూస్తే ప్రత్యర్తి పెద్దగా పోటీ జట్టు కాదు. ‘హిట్మ్యాన్’ రోహిత్, బ్యాటింగ్ ‘కింగ్’ కోహ్లి... అంతెందుకు తాజా తాత్కాలిక కెపె్టన్ హార్దిక్ పాండ్యా కూడా లేడు. అంటే భారత స్టార్లెవరూ బరిలో లేకపోయినా... మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు టి20లకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని స్వయంగా ఐర్లాండ్ బోర్డే వెల్లడించింది. 11,500 సీట్ల సామర్థ్యమున్న స్టేడియం ‘హౌస్ఫుల్’ అయ్యింది. అయితే శుక్రవారం డబ్లిన్లో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ సజావుగా సాగుతుందో లేదో వేచి చూడాలి. -
ఐర్లాండ్తో తొలి టీ20.. రింకూ, జితేశ్ అరంగేట్రం.. సంజూకు మొండిచెయ్యే..!
భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20కి సర్వం సిద్ధమైంది. డబ్లిన్లోని ద విలేజ్ మైదానంలో రేపు (ఆగస్ట్ 18) జరుగబోయే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా దాదాపుగా ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న మ్యాచ్ కావడంతో భారత అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఐపీఎల్ స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తారా లేదా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్కు రింకూ సింగ్పై భారీ అంచనాలు ఉండటంతో ఈ మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ మ్యాచ్తో రింకూ, జితేశ్లు అరంగేట్రం చేస్తారో లేదో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. రింకూ, జితేశ్ల అరంగేట్రంపై డిస్కషన్ నేపథ్యంలో ఐర్లాండ్తో తొలి టీ20కి భారత జట్టు ఇలా ఉండబోతుందంటూ పలువురు మాజీ, విశ్లేషకులు, అభిమానులు సోషల్మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మెజారిటీ శాతం అభిప్రాయాల మేరకు.. భారత తుది జట్టులో రింకూ సింగ్, జితేశ్ శర్మ ఇద్దరూ చోటు దక్కించుకోనున్నారు. వికెట్కీపర్ కోటాలో సంజూ శాంసన్ను కాదని జితేశ్కు మెజారిటీ శాతం జనాలు ఓటేస్తున్నారు. సంజూకి విండీస్తో సిరీస్లో చాలా అవకాశాలు ఇచ్చారని, జితేశ్కు కూడా ఒకట్రెండు అవకాశాలిస్తే, అతనిలో విషయం ఉందో లేదో తెలిసిపోతుందని అంటున్నారు. అలాగే స్పిన్ ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో శివమ్ దూబేలను అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, అర్షదీప్ తుది జట్టులో ఎలాగూ ఉంటారు కాబట్టి, మూడో పేసర్గా ప్రసిద్ధ కృష్ణ, స్పెషలిస్ట్ స్పిన్నర్గా బిష్ణోయ్కు అవకాశాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఐర్లాండ్తో తొలి టీ20కి భారత్ తుది జట్టు (అంచనా).. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ (వికెట్కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, రవి బిష్ణోయ్ -
IND VS IRE 1st T20: చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా
ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. రేపు (ఆగస్ట్ 18) ఐర్లాండ్తో జరుగబోయే తొలి టీ20తో బుమ్రా ఈ ఘనత సాధించనున్నాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ భారత టీ20 జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించగా.. రేపటి మ్యాచ్తో బుమ్రా టీమిండియా 11వ టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, బుమ్రా గతంలో భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా భారత కెప్టెన్గా తొలిసారి పగ్గాలు చేపట్టాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బుమ్రా నేతృత్వంలోని భారత టీ20 జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా టీమిండియా రేపు తొలి టీ20 ఆడనుంది. దాదాపు 11 నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాకు డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన శివమ్ దూబే జట్టులో చేరాడు. వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. రెగ్యులర్ టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చారు. ఈ పర్యటనలో భారత్ ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు ఆడనుంది, మూడు మ్యాచ్లకు డబ్లిన్లోని ది విలేజ్ మైదానం వేదిక కానుంది. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ -
పట్టాలెక్కిన బుమ్రా ఎక్స్ప్రెస్.. పేసు గుర్రాన్ని ఎదుర్కోలేక వణికిపోయిన బ్యాటర్లు
3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా ఐర్లాండ్కు చేరుకుంది. ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో జరిగే ఈ సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. చిన్న జట్టే కదా తేలికగా తీసుకోకుండా భారత ఆటగాళ్లు నెట్స్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఇవాళ (ఆగస్ట్ 16) జట్టు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు చెందిన ఓ వీడియోను సోషల్మీడియాలో షేర్ చేసింది. The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9 — BCCI (@BCCI) August 16, 2023 ఇందులో బుమ్రా నెట్స్లో చమటోడుస్తూ కనిపించాడు. మునుపటి వేగాన్ని దొరకబుచ్చుకున్న అతను నిప్పులు చెరిగే వేగంతో బంతులను సంధించాడు. పేసు గుర్రాన్ని ఎదుర్కోలేక బ్యాటర్లు వణిపోయారు. బుమ్రా పేస్కు వారి దగ్గర సమాధానం కనిపించలేదు. దాదాపు ఏడాదిగా బంతి పట్టని బుమ్రా తిరిగి లయను అందుకోవడంతో బీసీసీఐ ఆనందం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ అభిమానులతో పంచుకుంది. Rishabh Pant's batting practice, recovery has been excellent. - Great news for Indian cricket. pic.twitter.com/KThpdkagDz — Johns. (@CricCrazyJohns) August 16, 2023 మనందరం ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.. అతని గురించి అందరికీ తెలిసిందే అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోతో పాటు మరో వీడియో కూడా నెట్టింట్లో సందడి చేస్తుంది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్కు సంబంధించిన ఈ వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. 🚨 KL Rahul & Shreyas Iyer in the midst of a match simulation exercise at the KSCA ‘B’ grounds. 🎥: Rishabh Pant/Instagram#KLRahul #ShreyasIyer #AsiaCup2023 pic.twitter.com/rDZVfWMpVj — Deepanshu Thakur (@realdpthakur17) August 14, 2023 ఈ వీడియోలో పంత్ యాక్సిడెంట్ తర్వాత తొలిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కొద్ది రోజుల కిందట కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో కూడా ఇలాగే వైరలయ్యింది. గాయాల బారిన పడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్లు తిరిగి బరిలో కనిపించడంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా వన్డే వరల్డ్కప్ సమయానికి జట్టులో చేరి భారత్ను జగజ్జేతగా నిలపాలని వారు ఆకాంక్షిస్తున్నారు. -
అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్డ్రా చేసుకోవచ్చు
సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఏటీఎమ్ నుంచి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఖాతాలో డబ్బు లేకున్నా.. రూ. 80,000 వరకు విత్డ్రా తీసుకోవచ్చని ఒక బ్యాంక్ వెల్లడించింది. దీంతో వినియోగదారులు ATM సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ (Bank Of Ireland) ఖాతాలో ఉన్న డబ్బుతో సంబంధం లేకుండా సుమారు వెయ్యి డాలర్లను విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఈ బ్యాంక్ ఆన్లైన్ సిస్టం కొంత మందకొడిగా ఉండటం వల్ల యాప్స్ పనిచేయడంలేదని.. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ విధమైన ప్రకటన చేసింది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ ఈ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి అవసరాల కోసం వెయ్యి డాలర్లను తీసుకున్నట్లయితే.. ఆ తరువాత అతడు జరిపే లావాదేవీల్లో ఈ మొత్తం వసూలు చేస్తుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది డబ్బు కోసం ఏటీఎమ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరు కనీసం మూడు, నాలుగు గంటలు వెయిట్ చేసి మరీ డబ్బు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ వివరణ.. మొబైల్ యాప్ అండ్ 365ఆన్లైన్తో సహా మా అనేక సేవలపై ప్రభావం చూపుతున్న సాంకేతిక సమస్యపై పనిచేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది. We are working on a technical issue that is impacting a number of our services including our mobile app and 365Online. We are working to fix this as quickly as possible and apologise to customers for any inconvenience caused. https://t.co/yO5ptZ6MfL — Bank of Ireland (@bankofireland) August 15, 2023 -
INDIA Tour Of IRELAND: విండీస్ పర్యటన ముగిసింది.. చలో ఐర్లాండ్
2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20ల టీమిండియా విండీస్ పర్యటన నిన్నటితో (ఆగస్ట్ 13) ముగిసింది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో భారత్ టెస్ట్ (1-0), వన్డే సిరీస్లు (2-1) నెగ్గగా.. విండీస్ టీ20 సిరీస్ (3-2) కైవసం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా విండీస్తో జరిగిన ఆఖరి టీ20 అనంతరం ఆరు మందితో (యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్) కూడిన భారత జట్టు ఇక్కడి నుంచి నేరుగా ఐర్లాండ్కు పయనం కాగా.. మిగతా తొమ్మిది మంది భారత్ నుంచి బయల్దేరతారు. ఐర్లాండ్ పర్యటనలో భారత్ ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు ఆడుతుంది. ఈ జట్టుకు బుమ్రా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతనికి డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మూడు మ్యాచ్లు డబ్లిన్లోని ద విలేజ్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ జియో సినిమా యాప్తో పాటు స్పోర్ట్స్18లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. భారత్తో టీ20 సిరీస్కు ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ -
ఐర్లాండ్లో ఆర్యవైశ్య సమ్మేళనం
ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఘనంగా జరిగింది. 70 మందికి పైగా ఆర్యవైశ్యులు అక్కడ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ కాథరిన్ పార్క్లో భగినీహస్త భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ తమ ఇంటి నుంచి మధురమైన వంటకాలను వండి తెచ్చారు. కార్యక్రమంలో బహుభాషా కోవిదులు డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని భక్తి గీతాలు ఆలపించారు. తరువాత సంతోష్ ఆధ్వర్యంలో సాగిన విందుభోజన కార్యక్రమంలో మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్ సహకారంతో అందరూ విందుభోజనాన్ని ఆరగించారు. తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ రేడియో జాకీ అంకిత పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పద్యాలు, శ్లోకాలు, తెలుగు భాష, సాంప్రదాయ దుస్తులు తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. వీటిలో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. అనంతరం వివిధ రకాల ఆటలు నిర్వహించారు. కుటుంబ అన్యోన్యతకి సంబంధించిన ఆటలో భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణ అంశంలో గ్రంధి మణి, లావణ్య దంపతులు బహుమతులు గెలుచుకున్నారు. తరువాత కార్యక్రమంలో పవన్, అంకిత సహాయంతో మహిళలందరికీ చిరు కానుకలు అందజేశారు. కార్యక్రమ నిర్వహణలో వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్, సతీష్ మేడా కీలక పాత్ర పోషించారు. చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టతను వివరించారు. ఐర్లాండ్ లో మొట్టమొదటి కార్యక్రమం చాలా బాగా జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన సదరన్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ దీవుల్లో స్థిరపడేవారికి భారీ నజరానా!
ఐర్లండ్ పరిధిలో ఉన్న దీవుల్లో స్థిరపడటానికి సిద్ధపడేవారికి అక్కడి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చాలా దీవులు జనాలు లేక కళ తప్పినట్లు ఉండటంతో, ఈ దీవులను జనాలతో కళకళలాడేలా చేయాలని ఐర్లండ్ ప్రభుత్వం తలపెట్టింది. ఈ దీవుల్లో స్థిరపడటానికి వచ్చేవారికి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఇతర అవసరాలకు 84 వేల యూరోలు (రూ.76.16 లక్షలు) ఇవ్వనున్నట్లు ఐర్లండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హీదర్ హంప్రీస్ ప్రకటించారు. ఈ దీవుల్లో నివాసం ఉండేవారికి మంచి కెరీర్ అవకాశాలను కల్పిస్తామని ఆమె తెలిపారు. ఇక్కడ నివాసం ఉండేందుకు వచ్చేవారికి ఖాళీ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు జాతీయ దీవుల కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వ గ్రాంటు చెల్లిస్తామని వెల్లడించారు. చదవండి లాఠీ పట్టుకుని బోర్ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని.. -
ఇండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన
ఇండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ 15 మంది సభ్యుల జట్టును ఇవాళ (ఆగస్ట్ 4) ప్రకటించింది. ఈ జట్టుకు పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఐర్లాండ్ 2024 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించిన నేపథ్యంలో పటిష్టమైన పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేసింది. విండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20 జరుగనున్నాయి. మరోవైపు ఈ పర్యటన కోసం భారత జట్టును కూడా ఇటీవలే ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టుకు బుమ్రా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతనికి డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్తో టీ20 సిరీస్కు ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బ్యారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. టీమిండియాకు కొత్త కెప్టెన్, రింకూ సింగ్కు పిలుపు
ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇవాళ (జులై 31) ప్రకటించారు. ఈ జట్టుకు భారత సెలెక్టర్లు కొత్త కెప్టెన్ను నియమించారు. దాదాపు 11 నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఐర్లాండ్లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాకు డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన శివమ్ దూబే జట్టులో చేరాడు. వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. రెగ్యులర్ టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చారు. కాగా, విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా ఆగస్ట్ 18 నుంచి ఐర్లాండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. విండీస్తో టీ20 సిరీస్కు ఎంపికైన జట్టులోని తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ ఐర్లాండ్ సిరీస్కు కూడా ఎంపికయ్యారు. ఈ ఏడుగురు క్రికెటర్లు విండీస్ నుంచి నేరుగా ఐర్లాండ్కు బయల్దేరతారు. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ -
టీ20 వరల్డ్కప్ 2024కు కొత్తగా అర్హత సాధించిన మూడు జట్లు ఇవే..!
వచ్చే ఏడాది వెస్టిండీస్, యూఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల టీ20 వరల్డ్కప్కు కొత్తగా మూడు జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ రీజియన్స్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ జట్లు తాజాగా ప్రపంచకప్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే మెగా టోర్నీలో పై పేర్కొన్న మూడు దేశాలు 13, 14, 15వ జట్లుగా బరిలోకి దిగుతాయి. టీ20 వరల్డ్కప్ 2024 నిబంధనల ప్రకారం.. తొమ్మిదో ఎడిషన్ ప్రపంచకప్ కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్లో టాప్-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్).. టీ20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. తాజాగా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ 13, 14, 15 స్థానాలకు క్వాలిఫై కాగా.. మరో 5 స్థానాల కోసం వివిధ రీజియన్లలో పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఆసియా క్వాలిఫయర్-బి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మలేసియా, థాయ్లాండ్, భూటాన్, చైనా, మయన్మార్ వరుస స్థానాల్లో ఉన్నాయి. -
టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన ఐర్లాండ్..
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్కు ఐర్లాండ్ అర్హత సంపాదించింది. గురువారం జర్మనీతో జరగాల్సిన క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఐర్లాండ్కు బెర్త్ లభించింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫైయర్స్లో 5 మ్యాచుల్లో 4 విజయాలను ఐర్లాండ్ అందుకుంది. ఇక ఇదివరకే అర్హత సాధించిన స్కాట్లాండ్తో శుక్రవారం ఐర్లాండ్ తలపడుతుంది. యూరోపియన్ రీజినల్ నుంచి రెండు బెర్త్లు ఉండగా... స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, జర్మనీ, జెర్సీ, డెన్మార్క్, ఆస్ట్రియా క్వాలిఫయర్స్లో తలపడ్డాయి. స్కాట్లాండ్ (10 పాయింట్లు), ఐర్లాండ్ (8 పాయింట్లు) రెండు స్థానాల్లో నిలిచి అర్హత పొందాయి. మరోవైపు ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైయర్స్లో పాపువా న్యూ గినియా, జపాన్ జట్లు ముందంజలో ఉన్నాయి. అదే విధంగా ఆసియా క్వాలిఫైయర్స్లో రెండు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న మలేషియా టాప్లో ఉంది. చదవండి: IND vs WI: మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ప్లేయర్.. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు ఆడిన దేశంపైనే..!
మహిళల క్రికెట్లో 27 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కిమ్ గార్త్ చరిత్ర సృష్టించింది. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు ప్రాతినిధ్యం వహించిన దేశంపైనే వన్డే మ్యాచ్ ఆడి రికార్డుల్లోకెక్కింది. 2010 నుంచి 2019 వరకు ఐర్లాండ్కు ఆడిన కిమ్.. నిన్న (జులై 25) అదే ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించి, చరిత్ర పుటల్లోకెక్కింది. ఓ క్రికెటర్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించడం సాధారణమే అయినప్పటికీ.. తనతో పాటు కుటుంబంలోని నలుగురు క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించిన దేశానికి వ్యతిరేకంగా ఆడటం మాత్రం చరిత్రలో ఇదే మొదటిసారి. కిమ్ తండ్రి జోనాథన్ గార్త్, తల్లి అన్నే మేరీ మెక్డొనాల్డ్, తమ్ముడు జోనాథన్ గార్త్ ఐర్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కిమ్ వివిధ కారణాల చేత 2022 నుంచి ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతుంది. ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో నిన్న జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 153 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఎల్లీస్ పెర్రీ (91), గార్డ్నర్ (65), మూనీ (49) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఐర్లాండ్ 38.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో యామీ హంటర్ (50) టాప్ స్కోరర్గా నిలువగా.. గాబీ లివిస్ (37), కెప్టెన్ లారా డెలానీ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన కిమ్ గార్తీ (6-2-9-1) ఓ వికెట్ పడగొట్టగా.. జార్జీయా వేర్హమ్ చెరో 3 వికెట్లు, మెక్గ్రాత్, జొనాస్సెన్ చెరో 2, గార్డనర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతి
వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్లు ముగిసాక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బందికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విండీస్ సిరీస్ ముగిసాక టీమిండియా.. ఐర్లాండ్తో వారి స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్కు వెళ్లకుండా స్వదేశంలో రెస్ట్ తీసుకునేందుకే ద్రవిడ్ బృందానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విండీస్తో ఆఖరి రెండు టీ20ల తర్వాత ద్రవిడ్ అండ్ కో యునైటెడ్ స్టేట్స్ (ఆఖరి 2 టీ20లు విండీస్లో కాకుండా యుఎస్ఏలో జరుగనున్నాయి) నుంచి నేరుగా భారత్కు పయనమవుతుంది. ద్రవిడ్ టీమ్లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు మరికొంత మంది సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) సిబ్బంది ఐర్లాండ్ పర్యటనను నిర్వహిస్తారు. లక్ష్మణ్ టీమ్లో బ్యాటింగ్ కోచ్గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారీ విజయం సాధించి, మరో విజయం కోసం తహతహలాడుతుంది. ఈ సిరీస్లో భారత్ తదుపరి మరో టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలు సాధించి, టీమిండియా భారీ స్కోర్కు దోహదపడగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, భారత గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. -
ఐర్లాండ్తో సిరీస్.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు..!
ఆసియా కప్ 2023కి ముందు టీమిండియాకు మాంచి బూస్టప్ లాంటి వార్త వినిపించింది. ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్ ద్వారా ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఐర్లాండ్తో సిరీస్తో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. గాయాల కారణంగా గతేడాది నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న వీరు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని, ప్రస్తుతం వీరు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) రిహాబ్లో ఉన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. కాగా, వెన్ను సమస్య కారణంగా 2022 సెప్టెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న బుమ్రా.. ఇటీవలే పూర్తిగా కోలుకుని, ప్రస్తుతం నెట్స్లో సాధన చేస్తున్నాడు. అతను నెట్స్లో అవిశ్రాంతంగా 7 నుంచి 9 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ చాలాకాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. అతను చివరిగా ఈ ఏడాది మార్చిలో ఆసీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. -
Ind Vs Ire T20Is: ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టులో రింకూకు చోటు!
India Tour Of Ireland For T20Is 2023: వెస్టిండీస్తో టీ20 సిరీస్ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్కు టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్లు భారత జట్టులో స్థానం సంపాదించారు. రింకూకు అన్యాయం ఐపీఎల్-2023లో మెరుగైన ప్రదర్శనతో విండీస్ టూర్కు ఎంపికయ్యారు. ఈ మేరకు కొత్తగా ఈ ఇద్దరికీ చోటిస్తూ మొత్తంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్కు అన్యాయం జరిగిందంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా #JusticeForRinku అంటూ సెలక్టర్ల తీరును విమర్శించారు. అందుకే వాళ్లను ఎంపిక చేయలేదు ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటనకు రింకూను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో సత్తా చాటిన రింకూ సహా ఇతర యువ ఆటగాళ్లు ఐర్లాండ్ పర్యటనకు వెళ్తారు. నిజానికి ఒకేచోట.. ఒకేసారి అందరినీ ఆడించడం కుదరదు కాబట్టే కొంతమందికి వెస్టిండీస్కు వెళ్లే జట్టులో చోటు దక్కలేదు. వాళ్లు ఐర్లాండ్ టూర్కు తప్పకుండా వెళ్లే అవకాశం ఉంది’’ అని సదరు అధికారి తెలిపారు. టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సహా రింకూ సింగ్ తదితరులు ఐరిష్ జట్టుతో తలపడే టీమిండియాకు ఎంపికవుతారనే సంకేతాలు ఇచ్చారు. కరేబియన్ దీవిలో వాళ్లంతా కాగా జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో గడుపనుంది. టెస్టు సిరీస్తో ఈ టూర్ ఆరంభం కానుండగా ఇప్పటికే ఆటగాళ్లంతా కరేబియన్ దీవికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక టెస్టు, వన్డే సిరీస్లు ముగిసిన తర్వాత ఆగష్టు 4- ఆగష్టు 13 వరకు టీమిండియా- విండీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగునుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టు ఇందులో పాల్గొననుంది. ఈ టీమ్లో టాపార్డర్లో ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్.. వీరికి బ్యాకప్గా యశస్వి జైశ్వాల్, మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్తో పాటు సంజూ శాంసన్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా(పేస్), అక్షర్ పటేల్(స్పిన్) ఉండగా.. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి స్పిన్ విభాగంలో చోటు సంపాదించారు. ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్లతో కూడిన పేస్ దళాన్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా విండీస్ పర్యటన తర్వాత ఆగష్టు 18- 23 మధ్య భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. చదవండి: MS Dhoni: ధోని బర్త్డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్ టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా -
వన్డే వరల్డ్కప్కు క్వాలిఫై కాకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు..!
ఐర్లాండ్ వన్డే వరల్డ్కప్-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో ఏడో స్థానం కోసం నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్లో నేపాల్పై విజయం సాధించిన అనంతరం బల్బిర్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు. బల్బిర్నీ తప్పుకోవడంతో క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) పాల్ స్టిర్లింగ్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించింది. 32 ఏళ్ల బల్బిర్నీ మూడు ఫార్మాట్లలో కలిపి 89 మ్యాచ్ల్లో ఐర్లాండ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. బల్బిర్నీ 2019లో ఈ బాధ్యతలు చేపట్టాడు. బల్బిర్నీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గెలుపుతో ముగింపు పలకడం విశేషం. కాగా, జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్కప్-2023 క్వాలిఫయర్స్లో ఐర్లాండ్ కనీసం సూపర్ సిక్స్ దశకు కూడా చేరలేకపోయింది. ఆ జట్టు గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీలో అజేయంగా ఉన్న శ్రీలంక ఇదివరకే వన్డే వరల్డ్కప్-2023కు అర్హత సాధించగా.. మరో బెర్త్ కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొంది. నిన్న జరిగిన కీలక సూపర్ సిక్స్ మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో ఓటమితో జింబాబ్వే వరల్డ్కప్ రేసు నుంచి నిష్క్రమించింది. -
ఇంగ్లండ్పై ఆసీస్.. ఐర్లాండ్పై విండీస్ విజయాలు
మహిళల క్రికెట్లో నిన్న (జులై 1) జరిగిన వేర్వేరు ఫార్మాట్ల మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు విజయాలు సాధించాయి. మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా, 3 వన్డేల సిరీస్లో భాగంగా జరుగుతున్న మూడో వన్డేలో ఐర్లాండ్పై విండీస్ 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. రాణించిన బెత్ మూనీ.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో బెత్ మూనీ (61) అజేయ అర్ధశతకంతో రాణించి ఆసీస్ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు తహిళ మెక్గ్రాత్ (40), ఆష్లే గార్డ్నర్ (31) సహకరించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఆసీస్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా మల్టీ ఫార్మాట్ సిరీస్లో (ఒక టెస్ట్, 3 టీ20లు, 3 వన్డేలు) ఆసీస్ 6-0 ఆధిక్యంలోకి (ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది) దూసుకెళ్లింది. స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ అజేయ అర్ధశతకాలు.. 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం విండీస్లో పర్యటిస్తున్న ఐర్లాండ్.. నిన్న జరిగిన మూడో వన్డేలో ఓటమిపాలైంది. ఫలితంగా ఆ జట్టు 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది (వర్షం కారణంగా రెండో వన్డే రద్దైంది). మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ 41.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో గాబీ లెవిస్ (95 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. స్టెఫానీ టేలర్ (79), చినెల్ హెన్రీ (53) అజేయ అర్ధశతకాలు సాధించి విండీస్ను విజయతీరాలకు చేర్చారు. -
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల
3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా ఐర్లాండ్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) నిన్న (జూన్ 27) విడుదల చేసింది. ఆగస్ట్ 18న తొలి టీ20, ఆగస్ట్ 20, ఆగస్ట్ 23 తేదీల్లో మిగతా రెండు టీ20లు జరుగుతాయని సీఐ సీఈఓ వెల్లడించాడు. ఈ మూడు మ్యాచ్లకు డబ్లిన్లోని మలహిదే గ్రౌండ్స్ వేదిక కానున్నాయని ఆయన తెలిపాడు. భారత్.. వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే (ఆగస్ట్ 13) ఐర్లాండ్ సిరీస్ మొదలవుతుంది. కాగా, టీమిండియా.. ఐర్లాండ్తో గతేడాది కూడా టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. నాటి సిరీస్ను హార్దిక్ పాండ్యా నేతృత్వంలోనే టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 12 ఓవర్లకు కుదించిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో 4 పరుగుల స్వల్ప తేడాతో భారత్ గెలుపొందింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన దీపక్ హుడా (104)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. అంతకుముందు 2018లో కూడా టీమిండియా ఐర్లాండ్లో పర్యటించింది. నాటి సిరీస్ను కూడా టీమిండియా 2-0 తేడాతో ఊడ్చేసింది. ఓవరాల్గా భారత్-ఐర్లాండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్లు జరగ్గా ఐదింటిలో టీమిండియానే గెలుపొందింది. -
భారత్ కు గుడ్ న్యూస్...ఆ స్టార్ వచ్చేస్తున్నాడు
-
గెలిచినా లాభం లేదు; క్వాలిఫయింగ్ రేసులో లంక, జింబాబ్వే
క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయింగ్ పోరులో భాగంగా ఐర్లాండ్కు ఓదార్పు విజయం దక్కింది. గ్రూప్-బిలో మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ 138 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ గెలిచినా ఐర్లాండ్కు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐర్లాండ్, ఒమన్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక స్కాట్లాండ్పై గెలిచిన శ్రీలంక నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి గ్రూప్ టాపర్గా సూపర్ సిక్స్లో అడుగుపెట్టగా.. ఆరు పాయింట్లతో స్కాట్లాండ్ రెండో స్థానంలో, ఒమన్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో సూపర్సిక్స్కు అర్హత సాధించాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 134 బంతుల్లో 162 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ ఆండ్రూ బాల్బర్ని 66 పరుగులు, హ్యారీ టెక్టర్ 57 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 39 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సంచిత్ శర్మ 44 పరుగులు, బాసిల్ హమీద్ 39 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, జార్జ్ డొక్రెల్, ఆండీ మెక్బ్రైన్ జోషువా లిటిల్లు తలా రెండు వికెట్లు తీశారు. ఇక క్వాలిఫయింగ్ టోర్నీలో ఇవాళ్టితో లీగ్ మ్యాచ్లు ముగిశాయి. సూపర్ సిక్స్కు వెళ్లిన ఆరుజట్లలో లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా సాధించిన పాయింట్లను ఐసీసీ పేర్కొంది. సూపర్సిక్స్ స్టాండింగ్స్ ప్రకారం శ్రీలంక నాలుగు, జింబాబ్వే నాలుగు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చెరో రెండు పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్, ఒమన్ జట్లు సున్నా పాయింట్లతో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచాయి. సూపర్ సిక్స్లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అయితే శ్రీలంక, జింబాబ్వేలు నాలుగేసి పాయింట్లతో ఉండడంతో.. ఈ రెండు జట్లకు అక్టోబర్లో జరగనున్న వన్డే వరల్డ్కప్కు క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 హోదాలో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప! The race for the final two #CWC23 spots is heating up 🔥 How the Super Six standings look at the end of the Qualifier group stages 👀 pic.twitter.com/B2xTVFb72V — ICC (@ICC) June 27, 2023 చదవండి: క్లియరెన్స్ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ' -
సెంచరీతో కదంతొక్కిన కరుణరత్నే.. దిగ్గజాల సరసన చోటు
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 25) జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నే (103 బంతుల్లో 103; 8 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు. ఈ శతకం కరుణరత్నేకు వన్డేల్లో తొట్టతొలిది కావడం విశేషం. టెస్ట్ల్లో 16 శతకాలు బాదిన కరుణరత్నే.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇటీవలే వన్డే జట్టులోకి వచ్చి తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో కరుణరత్నే వన్డేల్లో 1000 పరుగులు (40 మ్యాచ్ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1095 పరుగులు) పూర్తి చేసుకోవడంతో పాటు ఓ అరుదైన ఫీట్ సాధించి, దిగ్గజాల సరసన చేరాడు. కరుణరత్నే.. ఈ మ్యాచ్తో కలుపుకుని తన చివరి 5 వన్డే ఇన్నింగ్స్ల్లో 50 ప్లస్ స్కోర్లు చేశాడు. ఈ మ్యాచ్లో ఐర్లాండ్పై 103, దీనికి ముందు ఒమన్పై 61 నాటౌట్, యూఏఈపై 42, ఆఫ్ఘనిస్తాన్పై 56 నాటౌట్, ఆఫ్ఘనిస్తాన్పై 52 పరుగులు స్కోర్ చేశాడు. గతంలో శ్రీలంక తరఫున ఇలా 5 వరుస ఇన్నింగ్స్ల్లో 5 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. సనత్ జయసూర్య, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షన్, దినేశ్ చండీమాల్.. కరుణరత్నే కంటే ముందు ఈ రేర్ ఫీట్ను సాధించారు. తాజాగా కరుణరత్నే ఈ ఫీట్ను సాధించడంతో దిగ్గజ క్రికెటర్లు జయసూర్య,సంగక్కర సరసన చేరాడు. వన్డేల్లో వరుసగా ఫిప్టి ప్లస్ చేసిన రికార్డు పాకిస్తాన్ జావిద్ మియాందాద్ (9 వరుస 50 ప్లస్ స్కోర్లు) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, గ్రూప్-బిలో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే సెంచరీతో కదంతొక్కగా.. సదీర సమరవీర (82) అర్ధసెంచరీతో రాణించాడు. చరిత్ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 4, బ్యారీ మెక్కార్తీ 3, గెరత్ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు. -
బౌలర్ పెట్టిన బిక్షతో మ్యాచ్ను గెలిపించాడు
జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. చేజింగ్లో భాగంగా స్కాట్లాండ్కు ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో అలర్ట్ అయిన లీస్క్ వెంటనే బ్యాట్ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్కు ఒక్క వికెట్ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్లో ఐర్లాండ్ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్ పెట్టిన బిక్షతో లీస్క్ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా! -
స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ల 2023లో భాగంగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ హై థ్రిల్లర్ను తలపించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో స్కాట్లాండ్ కేవలం ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగుల స్కోరు చేసింది. 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కర్టీస్ కాంఫర్ (108 బంతుల్లో 120 పరుగులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడుగా డోక్రెల్ 69 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్కు 136 పరుగులు జోడించారు. ఐర్లాండ్ బౌలర్లలో బ్రాండన్ మెక్ముల్లెన్ ఐదు వికెట్లతో రాణించాడు.అనంతరం 287 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్బ్రైడ్ 56 పరుగులు చేయగా..ఏడో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేసిన మైకెల్ లీస్క్ (61 బంతుల్లో 91 పరుగులు నాటౌట్, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మార్క్ వాల్ట్ 43 బంతుల్లో 47 పరుగులతో లీస్క్కు సహకరించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోషువా లిటిల్, జార్జ్ డోక్రెల్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక చేజింగ్లోనూ స్కాట్లాండ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. చేజింగ్లో వరుసగా 14 మ్యాచ్ల్లో తొలి మ్యాచ్ మాత్రమే ఓడిన స్కాట్లాండ్ అప్పటినుంచి 13 మ్యాచ్ల్లో ఓటమనేది లేకుండా ముందుకు సాగుతుంది. Leask pulls it off! 💥 Scotland continue their stunning streak of successful run-chases ⚡ They have won 13 of their last 14 ODIs batting second 🔥#CWC23 | #IREvSCO: https://t.co/T7hZENekE0 pic.twitter.com/tQbShg2lZU — ICC Cricket World Cup (@cricketworldcup) June 21, 2023 చదవండి: హ్యాట్రిక్ గోల్స్తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి -
ఐర్లాండ్కు బిగ్ షాకిచ్చిన ఒమన్.. వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో బోణీ
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్లో ఒమన్ బోణీ కొట్టింది. బులవాయో అథ్లెటిక్ క్లబ్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఒమన్ అద్భుతమైన విజయం సాధించింది. 282 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఒమన్ ఛేదించింది. ఒమన్ విజయంలో ఓపెనర్ ప్రజాపతి(72) కెప్టెన్ జీషన్ మక్సూద్ కీలక(59) కీలక పాత్ర పోషించారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్, అడైర్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో డాక్రెల్(91), హ్యరీ టెక్టార్(52) పరుగులతో రాణించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఫయ్యాజ్ భట్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయాన్ ఖాన్, ఒడేరా, మక్సూద్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. చదవండి: #CWCQualifiers2023: చెలరేగిన హసరంగా.. ICC CWC Qualifiersలో లంక శుభారంభం -
బాబర్ ఆజమ్కు షాక్.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అనామక ప్లేయర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు షాక్ తగిలింది. బాబర్ను కాదని ఓ అనామక జట్టు ప్లేయర్ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. ఐర్లాండ్కు చెందిన హ్యారీ టెక్టార్ 2023 మే నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికయ్యాడు. మే నెలలో టెక్టార్తో పోలిస్తే బాబర్ ప్రదర్శనలే మెరుగ్గా ఉన్నప్పటికీ, అవార్డు టెక్టార్నే వరించింది. టెక్టార్, బాబర్తో పాటు బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉండగా.. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టెక్టార్కే అధిక ఓట్లు వేసి గెలిపించారు. పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుతో పాటు మహిళల విభాగంలోనూ ఈ అవార్డు విజేతను ప్రకటించారు. అవార్డు రేసులో శ్రీలంక ప్లేయర్స్ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్లాండ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ ఉండగా.. 19 ఏళ్ల థాయ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ను ఈ అవార్డు వరించింది. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. మే నెలలో నామినీస్ ప్రదర్శనలు.. బాబర్ ఆజమ్: న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు నజ్ముల్ షాంటో: ఐర్లాండ్తో 3 మ్యాచ్ల వన్డేల సిరీస్లో 44, 117, 35 పరుగులు హ్యారీ టెక్టార్: బంగ్లాదేశ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 21, 140, 45 పరుగులు చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్గా ఈ ఐదుగురు క్రికెటర్లు -
టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అతడొచ్చేస్తున్నాడు..!
టీమిండియా అభిమానులకు వెటరన్ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ శుభవార్త చెప్పాడు. గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఆగస్ట్లో ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని పరోక్షంగా కన్ఫర్మ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 నాలుగో రోజు కామెంట్రీ ఇస్తూ డీకే ఈ విషయాన్ని బయటపెట్టాడు. బుమ్రా ఎంట్రీతో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరిగే వరల్డ్కప్ కంతా బుమ్రా సెట్ అయితే, అది టీమిండియాకు చాలా మేలు చేస్తుంది. కాగా, ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో టీమిండియా.. ఐర్లాండ్తో 3 టీ20లు ఆడనుంది. ఇందుకోసం భారత్.. ఐర్లాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిస్తుంది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 425 పరుగుల లీడ్ను సాధించింది. మరో 30, 40 పరుగులు చేసి, ఆ జట్టు ఇన్నింగ్స్ను (ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 252/6) డిక్లేర్ చేయవచ్చు. అలెక్స్ క్యారీ (64), స్టార్క్ (33) క్రీజ్లో ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 252/6 (అలెక్స్ క్యారీ 64 బ్యాటింగ్, జడేజా 3 వికెట్లు) ఆసీస్ 425 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..? -
బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్గా!
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ను 172 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. అదే రోజు బ్యాటింగ్ కు వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే (45 బంతుల్లో 56, 11 ఫోర్లు) , బెన్ డకెట్ (178 బంతుల్లో 182, 24 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడారు. ఈ ఇద్దరితో పాటు ఓలీ పోప్(205) డబుల్ సెంచరీతో చెలరేగాడు. వీరిముగ్గరి అద్భుత ఇన్నింగ్స్లు ఫలితంగా ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 524 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగలకు ఆలౌటైంది. కేవలం 10 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ ముంగిట ఐరీష్ జట్టు ఉంచింది. 10 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు బంతుల్లోనే ఛేదించింది. బెన్ స్టోక్స్ అరుదైన ఘనత.. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్గా స్టోక్స్ నిలిచాడు. ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. ఇలా జరగడం టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి సారి. చదవండి: WTC Final 2023: ‘ఓవల్’ను ఓ లుక్కేద్దామా! -
ఐర్లాండ్పై ఇంగ్లండ్ ఘన విజయం
లండన్: ఐర్లాండ్ జట్టు పోరాటంతో ఇంగ్లండ్కు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సి రాగా... తుది ఫలితం మాత్రం ఊహించిన విధంగానే వచి్చంది. లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్తో శనివారం ముగిసిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 97/3తో ఆట కొనసాగించిన ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 363 పరుగులకు ఆలౌటైంది. మార్క్ ఎడైర్ (88) ఆండీ మెక్బ్రైన్ (86 నాటౌట్) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో తొలి టెస్టు ఆడిన జోష్ టంగ్ (5/66) ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 11 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ తొలి 4 బంతుల్లోనే 3 ఫోర్లతో అందుకుంది. చదవండి: #Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్ -
ఆడటమే కాదు, ఏకంగా తొలి మ్యాచ్లోనే 5 వికెట్ల ఘనత
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ ఓ ఆసక్తికర పరిణామం ద్వారా వార్తల్లో నిలిచాడు. టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని ఓ వ్యక్తి 14 ఏళ్ల కిందట 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) పందెం కాసి గెలవడంతో ఈ వార్సెస్టర్షైర్ బౌలర్ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నిలిచాడు. టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో జాక్పాట్ కొట్టిన పందెం కాసిన వ్యక్తి, ప్రస్తుతం రెట్టింపు సంతోషానికి లోనవుతున్నాడు. టంగ్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించడం సదరు వ్యక్తి అదనపు సంతోషానికి కారణం. టంగ్ ఇంగ్లండ్ తరఫున తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు సాధించడంతో ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబైపోతున్నాడు. అందులోనూ టంగ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఈ ఫీట్ సాధించడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా, ఐర్లాండ్తో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో టంగ్ ఐదేయడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 11 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండానే ఛేదించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ENG VS IRE One Off Test: చేతులెత్తేస్తుందనుకుంటే చుక్కలు చూపిస్తుంది..!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో పసికూన ఐర్లాండ్ ప్రతిఘటిస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. తొలుత హ్యారీ టెక్టార్ (51), లోర్కాన్ టక్కర్ (44) నిలకడగా ఆడి ఇంగ్లీష్ బౌలర్లకు విసుగు తెప్పిస్తే.. ఆతర్వాత ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన ఆండీ మెక్బ్రైన్ (71 నాటౌట్), తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్కు దిగిన మార్క్ అదైర్ (88 నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లను డిఫెన్స్లోకి నెట్టేస్తున్నారు. వీరిద్దరు ప్రతిఘటిస్తుండటంతో ఐర్లాండ్ 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. 352 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 27 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను అధిగమించి వారికి కొద్దో గొప్పో టార్గెట్ సెట్ చేసినా అది కచ్చితంగా ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతలను ఎత్తి చూపినట్లవుతుంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా.. స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ -
93 ఏళ్ల కిందటి బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 178 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 182 పరుగులు చేసిన డకెట్.. 93 ఏళ్ల కిందట క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్ బ్రాడ్మన్ నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్ల్లో వేగవంతమైన 150 పరుగుల రికార్డు డాన్ బ్రాడ్మన్ పేరిట ఉండేది. 1930లో లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బ్రాడ్మన్ 166 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. నిన్నటి వరకు లార్డ్స్ టెస్ట్ల్లో ఇదే వేగవంతమైన 150గా ఉండేది. అయితే నిన్నటి ఇన్నింగ్స్తో డకెట్ ఈ రికార్డును బద్దలు కొట్టి నయా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. డకెట్ కేవలం 150 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి బ్రాడ్మన్ రికార్డుకు ఎసరు పెట్టాడు. Ben Duckett broke Don Bradman's record for the fastest Test 150 at Lord's 🔥 #ENGvIRE pic.twitter.com/ARQcLnCtYK — ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2023 ఓవరాల్గా ఫాస్టెస్ట్ 150 రికార్డు విషయానికొస్తే.. ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉంది. మెక్కల్లమ్ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 103 బంతుల్లోనే 150 రన్స్ బాదాడు. ఆతర్వాత మహేళ జయవర్ధనే 111 బంతుల్లో, రాయ్ ఫ్రెడ్రిక్స్ 113 బంతుల్లో, హ్యారీ బ్రూక్ 115 బంతుల్లో 150 పరుగులు బాదారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్లో సైతం తడబడుతున్న ఐర్లాండ్ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 141 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీనికి ముందు స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..?
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టుబిగించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విధ్వంసం సృష్టించగా.. జాక్ క్రాలే (56), జో రూట్ అర్ధసెంచరీలతో రాణించారు. అంతకుముందు వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది. టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..? ఇటీవల కాలంలో టెస్ట్ల్లో బజ్బాల్ అప్రోచ్ అంటూ ఆటలో వేగం పెంచిన ఇంగ్లీష్ క్రికెటర్లు, ఐర్లాండ్తో ఏకైక టెస్ట్లోనూ అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. వీరు ఎంత వేగంగా ఆడారంటే.. ఈ మ్యాచ్ను చూసిన ఫాలోవర్స్కు ఇది టెస్ట్ మ్యాచా లేక వన్డేనా అన్న డౌట్ వచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా 6కు పైగా రన్ రేట్ మెయింటైన్ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించడంతో పాటు వేగంగా పరుగులు రాబట్టారు. వీరి వేగం చూస్తుంటే రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తుంది. రెండో రోజు మరో 25 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐర్లాండ్ను సెకెండ్ ఇన్నింగ్స్లో ఆలౌట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. టెస్ట్ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీ.. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఓలీ పోప్ టెస్ట్ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీని, ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన ద్విశతకాన్ని బాదాడు. సిక్సర్తో డబుల్ హండ్రెడ్ను పూర్తి చేసిన పోప్.. 207 బంతుల్లో ఈ మార్కును అందున్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ డబుల్ హండ్రెడ్ రికార్డు జట్టు సారధి బెన్ స్టోక్స్ (163 బంతుల్లో) పేరిట ఉంది. ఓవరాల్గా ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టల్ (153) పేరిట ఉంది. ఆస్టల్ తర్వాత స్టోక్స్, సెహ్వాగ్ (168), సెహ్వాగ్ (182), మెక్కల్లమ్ (186) ఈ రికార్డును సాధించారు. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
చరిత్ర సృష్టించిన జో రూట్
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ టెస్ట్ల్లో 11000 పరుగుల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్గా.. ఓవరాల్గా 11వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో రూట్ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున వేగవంతంగా 11000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా, అలిస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు కుక్కు 252 ఇన్నింగ్స్లు అవసరమైతే.. రూట్ 232 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ 11000 రన్స్ రికార్డు కుమార సంగక్కర (208 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది. కాగా, ఫాబ్ ఫోర్గా చెప్పుకునే (రూట్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్) ప్రస్తుత తరం స్టార్ క్రికెటర్లలో పరుగుల పరంగా ఎవరూ రూట్కు దరిదాపుల్లో కూడా లేరు. 32 ఏళ్ల రూట్ 130 టెస్ట్ల్లో 11000 పరుగుల మైలురాయిని తాకితే.. 34 ఏళ్ల స్టీవ్ స్మిత్ 96 టెస్ట్ల్లో 8792 పరుగులు, 34 ఏళ్ల విరాట్ కోహ్లి (34) 108 టెస్ట్ల్లో 8416 పరుగులు, 32 ఏళ్ల కేన్ విలియమ్సన్ 94 టెస్ట్ల్లో 8124 పరుగులతో చాలా వెనుకపడి ఉన్నారు. వయసు పరంగా చూసినా ఫాబ్ ఫోర్లో మిగతా ముగ్గురితో పోలిస్తే రూట్కు టెస్ట్ల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (15921) బద్దలు కొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో మ్యాచ్లో రెండో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బెన్ డకెట్ (182) భారీ సెంచరీతో అలరించి ఔట్ కాగా.. ఓలీ పోప్ (197 నాటౌట్) ద్విశతకానికి 3 పరుగుల దూరంలో ఉన్నాడు. అతనికి జతగా రూట్(52 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. చదవండి: ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం -
ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్.. 172 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ముందు సన్నాహంగా ఐర్లాండ్తో ఆడుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే అన్ని విభాగాల్లో శాసించింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ 56.2 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సీమర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) నిప్పులు చెరిగాడు. దీంతో టాపార్డర్లో జేమ్స్ (36; 5 ఫోర్లు), పీటర్ మూర్ (10; 2 ఫోర్లు), కెప్టెన్ బాల్బిర్నీ (0) సహా... టెక్టర్ (0), లోయర్ ఆర్డర్లో అడెర్ (14; 2 ఫోర్లు)లు బ్రాడ్ పేస్ పదునుకు తలవంచారు. 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా... ఇందులో 4 వికెట్లు బ్రాడ్వే! ఐర్లాండ్ ఇన్నింగ్స్లో క్యాంఫర్ (33; 6 ఫోర్లు), పాల్ స్టిర్లింగ్ (30; 5 ఫోర్లు) కాసేపు ఇంగ్లండ్ బౌలింగ్కు ఎదురొడ్డి నిలిచారు. స్పిన్నర్ జాక్ లీచ్ 2, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలీ (56; 11 ఫోర్లు), డకెట్ (60 బ్యాటింగ్; 8 ఫోర్లు) 16.3 ఓవర్లలోనే వేగంగా 109 పరుగులు జోడించారు. క్రాలీని హ్యాండ్ అవుట్ చేయగా, డకెట్తో ఒలీ పోప్ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 20 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. చదవండి: Josh Tongue: ఇంగ్లండ్కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్పాట్ కొట్టేశాడు The I̶a̶n̶ ̶B̶e̶l̶l̶ Ollie Pope cover drive... One of the most pleasing shots in cricket 😍 Get it on repeat 🔁 #EnglandCricket | #ENGvIRE pic.twitter.com/our07uvBgw — England Cricket (@englandcricket) June 1, 2023 -
ఇంగ్లండ్కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్పాట్ కొట్టేశాడు
ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 1) మొదలైన ఏకైక టెస్ట్ ద్వారా 25 ఏళ్ల జాషువ టంగ్ అనే ఇంగ్లండ్ పేసర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో, అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు జాక్పాట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. టంగ్ 11 ఏళ్ల వయసులో ఉండగా, టిమ్ పైపర్ అనే అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు, టంగ్పై ఓ పందెం కాసాడు. టంగ్ భవిష్యత్తులో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని టిమ్ అప్పట్లో కొంత మొత్తం పందెం కాసాడు. ఇవాళ టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో టిమ్ పందెం గెలిచి, 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) జాక్పాట్ కొట్టేశాడు. టంగ్.. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడటాన్ని గమినిస్తూ వచ్చిన టిమ్, అతను ఏదో ఒక రోజు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడట. 14 ఏళ్ల తర్వాత టిమ్ జోస్యం నిజమై, టంగ్ ఇంగ్లండ్ 711వ ప్లేయర్గా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. కాగా, ఐర్లాండ్తో టెస్ట్కు తొలుత ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో టంగ్కు చోటుదక్కలేదు. నలుగురు పేసర్లు వివిధ కారణాల చేత అందుబాటులోకి రాకపోవడంతో.. ఆఖరి నిమిషంలో టంగ్కు జట్టులో చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. టంగ్.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్లలో 162 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. స్టువర్ట్ బ్రాడ్ (5/51), జాక్ లీచ్ (3/35), మాథ్యూ పాట్స్ (2/36) సత్తా చాటడంతో ఐర్లాండ్ 172 పరుగులకే ఆలౌటైంది. టంగ్కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. చదవండి: WTC Final: ఆసీస్కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
ఐర్లాండ్తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే! స్టార్ క్రికెటర్ వచ్చేశాడు
లార్డ్స్ వేదికగా జూన్1నుంచి ఐర్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. ఈ టెస్టుకు ఆ జట్టు స్టార్ పేసర్లు క్రిస్వోక్స్,, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ ఫిట్నెస్ కారణంగా దూరమయారు. ఈ క్రమంలో పేసర్ జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టెస్టు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ టెస్టుకు తొలుత 15 మంది సభ్యులతో కూడిన ప్రకటించిన జట్టులో జోష్ టంగ్ చోటుదక్కలేదు. కానీ ఈ నలుగురు పేసర్లు ఈ టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో.. ఆఖరి నిమిషంలో జోష్ టంగ్కు చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్లలో 162 వికెట్లు పడగొట్టాడు ఈ వోర్సెస్టర్షైర్ పేసర్. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో పనరాగమనం చేయనున్నాడు. కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బెయిర్స్టో జట్టుకు దూరంగా ఉన్నసంగతి తెలిసిందే. ఐర్లాండ్తో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, జాక్ లీచ్ చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్న్యూస్! -
Ben Stokes: టైం అయ్యింది.. డబ్బులు ముట్టాయి, వెళ్లొస్తా..!
ఐపీఎల్ 2023లో కష్టపడకుండా అధిక లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అని చెప్పాలి. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్లు. అందులో అతను చేసిన పరుగులు 16. అంటే పరుగుకు కోటి రూపాయల పై మాటే అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ ఇప్పుడు తగుదునమ్మా అని స్వదేశానికి బయల్దేరాడు. స్వదేశంలో ఐర్లాండ్తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ (జూన్ 1 నుంచి) ఆడేందుకు స్టోక్స్ సీఎస్కే క్యాంప్ను వీడాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యమే అధికారికంగా ట్వీట్ చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు కోట్లు పోసి కొనుక్కున ఫ్రాంచైజీకి పంగనామం పెట్టడంతో స్టోక్స్పై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. కారణాలు ఏవైనా డబ్బులిచ్చాక లీగ్ అయిపోయేంత వరకు ఉండాలని చురకలంటిస్తున్నారు. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) దేశం కోసం మాత్రమే ఆడాలనుకున్నప్పుడు.. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ లాగా ఐపీఎల్లో పేరు కూడా నమోదు చేసుకోకుండా ఉండాల్సిందంటూ మందలిస్తున్నారు. ఐపీఎల్ ఆడటానికి వచ్చినట్లు లేదు, సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లుందని అంటున్నారు. కాగా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకున్న ఆటగాడు ఆడినా ఆడకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్లో సీఎస్కే అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో దూసుకుపోతుంది. ధోని సేన ప్లే ఆఫ్స్కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. మే 23న జరిగే క్వాలిఫయర్-1లో సీఎస్కే.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ను ఢీకొట్టనుంది. ఎలిమినేటర్ మ్యాచ్కు సంబంధించిన వివరాలు ఇవాల్టి (మే 21) మ్యాచ్లతో తేలిపోతాయి. లక్నో ఇదివరకే ఓ బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై ఇండియన్స్ పోటీపడుతున్నాయి. చదవండి: అప్పటి నుంచి అందరూ గుర్తు పడుతున్నారు.. ఆరోజు ఒక్క బాల్ మిస్ చేసినా! -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్
ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి. మే 12న బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్తో ముగిసిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్కప్ క్వాలిఫయర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్లో ఐర్లాండ్తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించనున్నాయి. చదవండి: శుబ్మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
ఐర్లాండ్పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్.. 320 పరుగుల టార్గెట్ ఛేజ్
చెమ్స్ఫోర్డ్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్ (140) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. డాక్రెల్ 74 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్, షోర్పుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో(117) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తౌహిద్ హృదయ్(68), రహీం(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్, డాక్రల్ తలా రెండు వికెట్లు, లిటిల్, అదైర్, హ్యుమ్ ఒక్కో వికెట్ పడగొట్టాడు. కాగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 అధిక్యంలో బంగ్లాదేశ్ నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
అదృష్టం కలిసొచ్చింది.. ప్రపంచకప్కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. చెమ్స్ఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం కోసం ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఇంగ్లండ్ వేదికగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఉంటే ఐర్లాండ్ నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించేది. కానీ దురదృష్టవశాత్తూ తొలి వన్డే రద్దుకావడంతో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసివచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీకు నేరుగా క్వాలిఫై అయిన ఎనిమిదవ జట్టుగా ప్రోటీస్ నిలిచింది. కాగా వన్డే ప్రపంచకప్-2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు క్వాలిఫియర్ రౌండ్లలో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడతాయి. ఈ క్వాలిఫియర్ మ్యాచ్లు జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. చదవండి: #ManishPandey: 'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!' -
తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది!
27 రోజులు.. 64 కిలోమీటర్లు.. దారి తెలీయకున్నా ఎక్కడా ప్రయాణం ఆపలేదు. తిండి లేదు.. తోవలో తిప్పలెన్నో పడింది.. చివరకు కథ సుఖాంతం అయ్యింది. విశ్వాసానికి మారుపేరైన శునకం మరోసారి తన స్వామి భక్తిని చాటుకుని వార్తల్లోకి ఎక్కింది. అదేంటో మీరూ చదివేయండి.. సృష్టిలో ప్రేమ అనంతం. కానీ, ఆ ప్రేమకు స్వచ్ఛతను.. అచ్చమైన అర్థాన్ని చెప్పేవి మాత్రం కొన్నిగాథలే. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని(కేర్ టేకర్) కోసం చేసిన సాహసం గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే. పైన ఫొటోలో ఉంది కూపర్. Golden Retriever జాతికి చెందిన శునకం. ఒక నెలకిందట.. ఐర్లాండ్ ఉత్తర భాగంలోని టైరోన్ కౌంటీలోని ఓ ఇంటికి దత్తత వెళ్లింది. కారు నుంచి దిగీదిగగానే పరుగులు అందుకుంది కూపర్. అలా మొదలైన ప్రయాణం 40 మైళ్ల పాటు సాగింది. లండన్డెర్రీలోని టోబర్మోర్లో ఉన్న తన కేర్ టేకర్ చెంతకు చేరింది. కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే లాస్ట్పాస్ ఎన్ఐ అనే ఛారిటీ కూపర్కు చెందిన అందమైన కథను సోషల్ మీడియాలో పంచుకుంది. దాదాపు నెలపాటు సాగిన కూపర్ ప్రయాణం.. ఎక్కడా ఆగలేదు. ఎవరి సాయం లేకుండానే అది ముందుకు సాగింది. దారి తెలియకపోయినా.. అది పాత ఓనర్ చేరుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేయిస్తోందని సదరు ఛారిటీ పేర్కొంది. మరోవైపు అది తిరిగి రావడం చూసి దానిని దత్తత ఇచ్చిన వ్యక్తి భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై కూపర్ ఎక్కడికి వెళ్లదని, తనతోనే ఉంటుందని కన్నీళ్లతో చెబుతున్నారు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక
బౌలర్లు రమేశ్ మెండిస్ (5/64), ప్రభాత్ జయసూర్య (2/88), అసిథా ఫెర్నాండో (3/30) రాణించడంతో... ఐర్లాండ్తో గాలెలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో కరుణరత్నే కెప్టెన్సీలోని శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. 1982లో టెస్ట్ హోదా పొందిన శ్రీలంక జట్టుకిది 100వ టెస్టు విజయం కావడం విశేషం. ఓవర్నైట్ స్కోరు 54/2తో ఆట చివరిరోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ 77.3 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. భారత్, పాకిస్తాన్ల తర్వాత.. 1982లో టెస్ట్ హోదా పొందిన శ్రీలంక.. ఐర్లాండ్పై రెండో టెస్ట్లో విజయంతో 100వ విక్టరీ సాధించింది. 311 టెస్ట్ల్లో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఆసియా దేశాల్లో భారత్ (569 టెస్ట్ల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్ట్ల్లో 146 విజయాలు) ల తర్వాత శ్రీలంక ఈ అరుదైన జాబితాలో చేరింది. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆసీస్.. 853 టెస్ట్ల్లో 405 విజయాలు సాధించింది. ఇక, అత్యధిక టెస్ట్లు ఆడిన రికార్డు ఇంగ్లండ్ (1060) పేరిట ఉంది. -
చరిత్ర సృష్టించిన జయసూర్య.. 71 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
టెస్టు క్రికెట్లో శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్గా జయసూర్య నిలిచాడు. గాలె వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్తో పాల్ స్టిర్లింగ్ను ఔట్ చేసిన ప్రబాత్ జయసూర్య.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డును కేవలం 7 మ్యాచ్ల్లోనే జయసూర్య సాధించాడు. ఈ వరల్డ్ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది. ఆల్ఫ్ వాలెంటైన్ ఎనిమిది టెస్టు మ్యాచ్ల్లో అద్భుతమైన రికార్డును సాధించాడు. వాలెంటైన్ 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు. తాజా మ్యాచ్తో 71 ఏళ్ల ప్రపంచ రికార్డును ప్రబాత్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్గా కూడా జయసూర్య రికార్డులకెక్కాడు. చదవండి: IPL 2023-Teamindia: కిషన్ వద్దు.. అతడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్! విధ్వంసం సృష్టిస్తాడు.. అదే విధంగా ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్గా దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టామ్ రిచర్డ్సన్తో జయసూర్య సంయుక్తంగా నిలిచాడు. ఇక ఐరీష్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన జయసూర్య.. రెండో ఇన్నింగ్స్లో ఇప్పటివరకు ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. చదవండి: IPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్కు దొరికిన ఆణిముత్యం! -
డబుల్ సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండీస్.. 18 ఫోర్లు, 11 సిక్స్లతో
గాలే వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. తమ తొలి ఇన్నింగ్స్ను 704/3 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక 212 పరుగుల అదధిక్యంలో నిలిచింది. కుశాల్ మెండిస్, నిషాన్ మదుష్కా డబుల్ సెంచరీలతో చెలరేగారు. 339 బంతుల్లో మదుష్కా 22 ఫోర్లు, ఓ సిక్సర్తో 205 పరుగులు చేయగా.. మెండిస్ 18 ఫోర్లు, 11 సిక్స్లతో కేవలం 291 బంతుల్లోనే 245 పరుగులు చేశాడు. కాగా వీరిద్దరికి ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరితో పాటు మాథ్యూస్(101 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో కుశాల్ మెండిస్ అరుదైన రికార్డు సాధించాడు.సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో శ్రీలంక బ్యాటర్గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే(374) తొలి స్థానంలో ఉండగా.. సనత్ జయసూర్య(340),కుమార సంగక్కర(287) వరుసగా రెండు మాడు స్ధానాల్లో నిలిచారు. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ అదే విధంగా మరో రికార్డును కూడా మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన శ్రీలంక బ్యాటర్గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఐర్లాండ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కుశాల్ 11 సిక్స్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సంగక్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. చదవండి: IPL 2023: మద్యం మత్తులో మహిళతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అనుచిత ప్రవర్తన..! -
సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 357 పరుగులు చేసింది. నిషాన్ మధుష్క 149 బ్యాటింగ్, కుషాల్ మెండిస్ 83 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. టీ విరామం అనంతరం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు 23 ఓవర్లు మిగిలి ఉండగానే మూడోరోజు ఆట ముగిసిందని ప్రకటించారు. అంతకముందు లంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నే (133 బంతుల్లో 115 పరుగులు, 15 ఫోర్లు), నిషాన్ మధుష్క 234 బంతుల్లో 149 బ్యాటింగ్, 18 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు. లంక ఓపెనర్ల దెబ్బకు ఐర్లాండ్ బౌలర్లు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. ఈ ఇద్దరు తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 228 పరుగులు జోడించారు. ఆఖరికి కర్టిస్ కాంపర్ ఈ జోడిని విడదీశాడు. 115 పరుగులు చేసిన కరుణరత్నే కాంపర్ బౌలింగ్లో మాథ్యూ హంఫ్రెస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కుషాల్ మెండిస్ వన్డే తరహా బ్యాటింగ్ ఆడాడు. దీంతో లంక స్కోరు పరుగులు పెట్టింది. 62 బంతుల్లో అర్థశతకం మార్క్ అందుకున్న మెండిస్ 83 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. మ్యాచ్కు మరో రెండురోజులు సమయం ఉండడంతో ఫలితం వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అంతకముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులకు ఆలౌట్ అయింది. Play on Day 3 has been called off due to heavy rain. ⛈️⛈️#SLvIRE #LionsRoar pic.twitter.com/l6LuTyDnzZ — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 26, 2023 చదవండి: 580 రోజుల తర్వాత టాస్ నెగ్గిన కోహ్లి.. -
శ్రీలంకకు చుక్కలు చూపించిన ఐర్లాండ్.. టెస్టుల్లో అత్యధిక స్కోర్!
గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య శ్రీలంకకు పసికూన ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 492 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టెస్టుల్లో ఐర్లాండ్కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 2018లో పాకిస్తాన్తో జరిగిన టెస్టులో ఐర్లాండ్ 339 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో ఐర్లాండ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐరీష్ బ్యాటర్లలో పాల్ స్టిర్లింగ్(103), కర్టిస్ కాంఫర్(111) సెంచరీలతో చెలరేగారు. అదే విధంగా ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ(95) పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో ప్రబాత్ జయసూర్య ఐదు వికెట్ల హాల్ సాధించగా.. విశ్వా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో రోజు ఆటను వెలుతురు లేమి కారణంగా నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. క్రీజులో నిషాన్ మదుష్కా(41), దిమిత్ కరుణరత్నే(39) ఉన్నారు. చదవండి: Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్రౌండర్కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్! -
శతక్కొట్టిన పాల్ స్టిర్లింగ్.. అత్యంత అరుదైన జాబితాలో చోటు
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (103) శతక్కొట్టాడు. తద్వారా ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 23 ఆటగాడిగా, ఈ ఘనత సాధించిన రెండో ఐరిష్ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. స్టిర్లింగ్కు ముందు కెవిన్ ఓబ్రెయిన్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఓవరాల్గా ఈ ఘనతను తొలుత విండీస్ విధ్వంకర వీరుడు క్రిస్ గేల్ సాధించగా.. భారత్ తరఫున సురేశ్ రైనా సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 121 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. స్టిర్లింగ్తో పాటు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (95), లోర్కన్ టక్కర్ (80), కర్టిస్ క్యాంఫర్ (68 నాటౌట్) సత్తా చాటారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 2 వికెట్లు, విశ్వ ఫెర్నాండో, రమేశ్ మెండిస్ చెరో వికెట్ పడగొట్టారు.