Antibiotics
-
లొంగని బ్యాక్టీరియాకు విరుగుడు
సాక్షి, అమరావతి : ‘అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వాడకంవల్ల శరీరంలోని చెడు బ్యాక్టీరియా రోగనిరోధకత పెరుగుతోంది. దీంతో కొన్నిరకాల బ్యాక్టీరియాపై యాంటిబయోటిక్స్ పనిచేయకుండాపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెనువిపత్తులా మారింది. ఇలా యాంటిబయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఫేజ్ థెరపీతో చెక్పెట్టొచ్చు’.. అని క్లినికల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్), యూరోపియన్ స్టడీ గ్రూప్ ఆన్ నాన్–ట్రెడిషనల్ యాంటిబయోటిక్స్ సొసైటీ (ఈఎస్జీఎన్టీఏ) సభ్యులు డాక్టర్ కళ్యాణచక్రవర్తి అన్నారు.జార్జియా, రష్యా, అమెరికా, యూరప్ దేశాల్లో న్యూమోనియా, క్షయ, చర్మ, మూత్రనాళ, ఇతర బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లలో యాంటిబయోటిక్స్కు బ్యాక్టీరియా లొంగని క్రమంలో ఫేజ్ థెరపీ వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్లోనూ అక్కడక్కడా ఇది వినియోగంలో ఉన్నా ఈ విధానం భవిష్యత్తులో పెద్దఎత్తున వాడుకలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్లోని లియోన్లో ఈఎస్జీఎన్టీఏ ఆధ్వర్యంలో ఫేజ్ థెరిపీపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డా. కళ్యాణ్చక్రవర్తి పాల్గొన్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్సల్లో ఫేజ్ థెరఫీకి సంబంధించిన అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. 1900 దశకంలోనే..బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి బ్యాక్టీరియా వైరస్ (ఫేజ్)లను వినియోగించడమే ఫేజ్ థెరపీ. యాంటిబయోటిక్స్ కనిపెట్టడానికంటే ముందు 1900 దశకం ప్రారంభంలో ఈ ఫేజ్ థెరపీ వినియోగంలో ఉండేది. మానవులపై దాడిచేసి వ్యాధుల బారినపడేలా చేసే బ్యాక్టీరియాను నశింపజేసే బ్యాక్టీరియా ఫేజ్లు ప్రకృతిలో ఉంటాయి. నీరు, మట్టి, ఇతర ప్రకృతి వనరుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను ప్రయోగశాలల్లో శుద్ధిచేసి అందులోని చెడు రసాయనాలను వేరుచేసిన అనంతరం ఫేజ్లను సాధారణ మందుల మాదిరిగానే చికిత్సలో వినియోగిస్తారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనిపెట్టిన అనంతరం పెద్దఎత్తున యాంటిబయోటిక్ మందులు అందుబాటులోకి రావడంతో ఫేజ్ థెరపీ కనుమరుగైంది.రోగ నిరోధకత పెరుగుదల..మార్కెట్లో ఉన్న యాంటిబయోటిక్స్కు లొంగకుండా బ్యాక్టీరియా రోగ నిరోధకత పెంచుకోవడంతో మందులు పనిచేయకుండాపోతున్నాయి. ఆస్ప త్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రమాణాలు సరిగా పాటించకపోవడం. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 90 శాతం, ఆస్పత్రులకు వచ్చే వారిలో 50 శాతం మందిలో యాంటిబయోటిక్స్ పనిచేయని దుస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచానికి ఫేజ్ థెరపీ ప్రత్యామ్నాయంగా ఉంటోంది. కొన్నేళ్ల క్రితం నేను న్యుమోనియాతో బాధపడే 60 ఏళ్ల వృద్ధురాలికి ఈ విధానం ద్వారా నయంచేశాను. రోగుల డిమాండ్ మేరకు ఆస్పత్రుల్లోని ఎథిక్స్ కమిటీ ఆమోదంతో మన దేశంలో ఇప్పటికే ఈ విధానాన్ని వినియోగి స్తున్నారు. ఈ విధానంలో రోగుల్లో రోగనిరోధకత పెరగడంతో పాటు, త్వరగా వ్యాధుల నుంచి కోలుకుంటారని పలు పరిశో«ధనల్లో సైతం వెల్లడైంది. మార్పు రాకపోతే కష్టం..ప్రజలు, కొందరు వైద్యులు లెక్కలేనితనంగా యాంటిబయోటిక్స్ను వినియోగిస్తుండటంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ప్రపంచానికి పెనుముప్పుగా అవతరించింది. ఏఎంఆర్ పెను ఆరోగ్య సమస్యగా మారి ఫేజ్ థెరపీని ఆశ్రయించాల్సిన దుస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మనం పెరట్లో పెంచుకునే మొక్కకు తెగులు వస్తే ఆ తెగులు ఏంటో నిర్ధారించుకుని మందు కొని పిచికారి చేస్తాం. మొక్కకే ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజలు ఆరోగ్యానికి ఇవ్వకపోతుండటం దురదృష్టకరం. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ చిన్నజబ్బు వచ్చినా వెంటనే మెడికల్ స్టోర్కు వెళ్లి వాళ్లిచ్చే యాంటిబయోటిక్స్ వాడుతున్నారు. ఈ దురలవాటును ప్రతిఒక్కరూ విడనాడాలి. సాధారణ దగ్గు, జలుబు, జ్వరానికి యాంటిబయోటిక్స్ వాడొద్దు. వైద్యుడిని సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని, వైద్యుడి సూచన మేరకు మాత్రమే యాంటిబయోటిక్స్ వాడితే చాలావరకూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. -
కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించటం ఎలా?
వ్యాధి నిర్ధారణ అయిన కోళ్లకు, వాటి పక్కన ఉన్న కోళ్లకు చికిత్స చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించండి. వీటిని మేత ద్వారా కంటే నీటిలో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్ ఔషధాలను వ్యాధి నివారణకు లేదా కోళ్ల పెరుగుదలను పెపొందించడానికి ఉపయోగించవద్దు.కోళ్ల షెడ్లోకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయండి. లోపలికి వెళ్లే ముందు బట్టలు, చెప్పులు/బూట్లు మార్చుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఆవరణలోకి ప్రవేశించే ముందు వాహనాలను క్రిమిసంహారకాలతో శుభ్రపరచండి. వ్యాధులను వ్యాపింపజేసే ఎలుకలు, పురుగులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు కోళ్ల ఫారాలల్లోకి రానివ్వకండి. నాణ్యతతో కూడిన మంచి వ్యాక్సిన్లను ఉపయోగించండి. తయారీదారు సూచించిన విధంగా వాటిని నిల్వ చేయండి, జాగ్రత్తగా వాడండి.మీ ఫౌల్ట్రీ ఫామ్లో కోళ్ల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రతిరోజూ తనిఖీ చేయండి. వాటిల్లో అకస్మాత్తుగా లేదా క్రమంగా వస్తున్న మార్పులను వెంటనే గుర్తించండి. చనిపోయిన పక్షులను తొలగించి పారవేయండి.గాలి, వెల్తురు, మేత, నీటి సరఫరా, కోళ్ల సంఖ్య (స్టాకింగ్ డెన్సిటీ) ఇతర విషయాలకు సంబంధించి నిపుణుల సిఫార్సులను అనుసరించండి.కోళ్లకు వేసే మేత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి. మేతలో తగినంత శక్తినిచ్చే దినుసులు, ఖనిజాలను సమతుల్యంగా ఉండాలి. మేతను జాగ్రత్తగా నిల్వ చేయండి. మొక్కలు, గింజలతో కూడిన మేతను ఇవ్వటమే మేలు.ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, సుగంధ తైలాలు, ఆర్గానిక్ యాసిడ్స్, నీటకరగని పీచు కోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగులలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. సూక్ష్మక్రిములను నిరోధిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.చదవండి: మనం తింటున్న ఆహార నాణ్యత ఎంత?మీ ఫౌల్ట్రీ షెడ్ను, పరికరాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసిన తర్వాత.. మురికిని శుభ్రంచేయటానికి డిటర్జెంట్లు లేదా వేడి నీటిని ఉపయోగించండి. ప్రతి బ్యాచ్ తర్వాత తగినన్ని రోజులు షెడ్ను ఖాళీగా ఉంచండి.కొత్తగా కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడు విశ్వసనీయమైన హేచరీల నుంచి తెచ్చుకోండి. టీకాలు వేసి, వ్యాధులు సోకని తల్లి కోళ్ల నుంచి పుట్టిన పిల్లలనే ఎంచుకోండి.కోడిపిల్లలను తెచ్చిన వెంటనే మేతను, నీటిని అందించండి. వాటికి అవసరమైన అన్ని పోషకాలు ఇవ్వండి. శారీరక అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేయండి.చదవండి: కుమ్ఖాత్ పండు.. పోషక విలువలు మెండుశుభ్రమైన, మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. నీటి సరఫరా గొట్టాలను తరచుగా శుభ్రపరచండి. డ్రింకింగ్ లైన్లను వారానికోసారి శుభ్రపరచండి.మరిన్ని ముఖ్యాంశాలుకోడి పిల్లలకు మొదటి నుంచే అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన కోడి పిల్లలను మాత్రమే పెంచండి. మీ కోళ్ల ఫారాన్ని సిద్ధం చేయండి.మేతలో ప్రత్యేక పోషకాలు కలిపి ఇవ్వండి.మేత ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.సౌకర్యవంతమైన వాతావరణం కల్పించండి.ప్రతి రోజూ కోళ్లను పరిశీలించండి.సకాలంలో టీకాలు వేయండి.గట్టి జీవ భద్రతా చర్యలు పాటించండి. యాంటీ బయాటిక్స్ను తగుమాత్రంగా వాడండి.అధిక నాణ్యత గల నీరివ్వండి. -
ఏఎంఆర్.. యమ డేంజర్!
సాక్షి, విశాఖపట్నం: అతి సర్వత్రా వర్జయేత్... అని పెద్దలు చెప్పినట్లుగా మేలు చేస్తున్నాయని యాంటీబయాటిక్స్ను మితిమీరి వాడటం మానవాళి మనుగడకు ముప్పుగా మారుతోంది. అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనుషులకు మేలు చేసే మైక్రోబ్స్ను నాశనం చేస్తున్నాయి. కీడు చేసే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఏఎంఆర్ వల్ల 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా 49 లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశంలో కూడా 2019లో ఏఎంఆర్ కారణంగా దాదాపు 3లక్షల మంది మృతిచెందారు. ఏఎంఆర్ మరణాలు ఎక్కువగా దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారక మరణాల కన్నా అధికంగా ఏఎంఆర్ మరణాలు ఏటా కోటి వరకు నమోదవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తలసరి ఆదాయం, డిమాండ్కు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచుకోవడానికి మన దేశంలో కూడా వాణిజ్య, జంతు, వ్యవసాయ ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. దీనిని అరికట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏఎంఆర్ ముప్పును ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అవేర్నెస్ వీక్’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏమిటీ ఏఎంఆర్ ? » కంటికి కనిపించని సూక్ష్మ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ మొదలైనవి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటన్నింటినీ మైక్రోబ్స్ అని పిలుస్తారు. » కొన్ని రకాల జీవక్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి మంచి బ్యాక్టీరియాలు, వైరస్లు సహాయకారిగా ఉంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోను వీటి ప్రాధాన్యం పెరిగింది. » ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు... కొన్ని సందర్భాల్లో మానవాళితోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకాలు ప్రమాదకర మైక్రోబ్స్ను అంతం చేయడం, వాటి వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. » అయితే, యాంటిబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల చెడు మైక్రోబ్స్ తమ శరీరంలో ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. టీకాలకు లొంగకుండా మొండిగా మారి సూపర్ బగ్స్గా రూపాంతరం చెందుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు వినియోగించినా ఎలాంటి ఫలితం కనిపించదు. దీనినే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. వన్ హెల్త్ అప్రోచ్ అవసరం ఏఎంఆర్ అనేది మానవ ఆరోగ్యం, జంతువులు, వ్యవసాయం, ఆహారం, పర్యావరణం... ఇలా అన్నింటిపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ‘వన్ హెల్త్ అప్రోచ్’ ఆధారంగా మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్య, పర్యావరణ రంగాల మధ్య సమన్వయంతో కూడిన సహకార చర్యలు అవసరం. ఈ ముప్పు నుంచి కాపాడుకునేందుకు, సమస్యను పరిష్కరించడానికి 2017లో మన దేశం జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2022లోనే ఏపీలో కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. – డాక్టర్ బి.మధుసూదనరావు, ఐసీఏఆర్–సీఐఎఫ్టీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆహారభద్రత, సుస్థిరాభివృద్ధికి ముప్పు » ప్రస్తుతం ఏఎంఆర్ మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, సుస్థిర అభివృద్ధికి సైతం ముప్పుగా పరిణమించింది. » ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం కేవలం ప్రాణనష్టంలోనే కాదు... అన్ని దేశాలను ఆర్థికంగా దిగజార్చేంత శక్తి ఏఎంఆర్కు ఉంది. » ఏఎంఆర్ కారణంగా 2050 నాటికి 100 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని ప్రపంచం చవిచూస్తుందని అంచనా. » జీడీపీలో 3.5శాతం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది. » ఏఎంఆర్ వల్ల ప్రపంచ ఎగుమతుల్లో 3.5% వరకు తగ్గవచ్చు. » మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల పశువుల ఉత్పత్తి 7.5శాతం తగ్గుతుంది. » ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 28 మిలియన్ల మంది పేదరికంలో కూరుకుపోతారు. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
అతి వినియోగం అనర్థమే
యాంటీ బయాటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోంది. దగ్గు, జలుబు, ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగి పోయింది. దీంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు రోగనిరోధక శక్తిపెంచుకుని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ), బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటీ బయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఐసీఎంఆర్కు చెందినఏఎంఆర్ రీసెర్చ్, సర్వైలెన్స్ నెట్వర్క్ విభాగం ఇటీవల 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించి, ఆ ఫలితాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. 20 శాతం తక్కువ ప్రభావంవిశ్లేషించిన నమూనాల్లో 22,182 రక్తం, 20,026 యూరిన్, 19,360 అంటు వ్యాధులు, 17, 902 లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మిగిలినవి ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చెందినవి. కాగా సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోఫ్లా్లక్సాసిన్, లెవోఫ్లాక్సాసిన్ వంటి కీలక యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించారు. ఉదాహరణకు పైపెరాసిలిన్–టాజోబాక్టమ్ ప్రభావం 2017లో 56.8 శాతం ఉండగా 2023లో 42.4 శాతానికి తగ్గింది. గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ వంటి బ్యాక్టీరియా ఫ్లూరోక్వినోలోన్ ఔషధానికి 95 శాతానికిపైగా నిరోధకతను పెంచుకుందని స్పష్టమైంది. మూత్రనాళ, ఇతర ఇన్ఫెక్షన్లలో చికిత్స కోసం వినియోగించే అమికాసిన్ ప్రభావం 2017లో 79.2 శాతం ఉండగా, 2023లో 68.2 శాతానికి పడిపోయింది. ఏఎంఆర్ ముప్పు నుంచి బయటపడటానికి తక్షణ చర్యలు అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. యాంటీ బయాటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉండాలని వెల్లడించింది. వ్యవసాయరంగంలోనూ యాంటీ బయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టాలని స్పష్టం చేసింది. ఏటా 10 లక్షల మంది మృతి యాంటీ బయాటిక్స్ అపరిమిత వినియోగం కారణంగా వ్యాధులు సోకిననప్పుడు చికిత్సల్లో అవి పని చేయక ప్రపంచంలో ఏటా 10 లక్షల మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. 1990–2021 మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాన్సెట్లో ప్రచురించిన స్టడీ రిపోర్ట్లో పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో నాలుగు కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేసింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో 2025–2050 మధ్య యాంటీ బయాటిక్స్కు లొంగని వ్యాధులతో 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. మానవాళి ఎదుర్కొంటున్న 10 అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఏఎంఆర్ ఒకటని డబ్ల్యూహెచ్వో సైతం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిందని గుర్తు చేసింది.- సాక్షి, అమరావతి -
పొంచి ఉన్న కోవిడ్ జేజమ్మ!
‘కోవిడ్–19 మానవాళిని మూడేళ్లు మాత్రమే ఇబ్బందులకు గురి చేసింది. దీనికి జేజమ్మలా తయారైంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్మార్). ఇది భవిష్యత్లో మానవాళిని నిరంతరం ఇబ్బందులకు గురి చేయనుంది. దీనివల్ల భవిష్యత్లో ప్రపంచం తీవ్రమైన గడ్డు పరిస్థితిని చవిచూడబోతున్నాం’ అని ఇండియన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి హెచ్చరించారు. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ప్రజలు యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వినియోగం తగ్గించాలని సూచించారు. వీటిని వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా వినియోగించకూడదని స్పష్టం చేశారు. వైద్యులు సైతం క్లినికల్ పరీక్షల అనంతరం,, వ్యాధి నిర్ధారణ అయ్యాక ప్రోటోకాల్స్ ప్రకారమే యాంటీబయోటిక్స్ను చికిత్స కోసం వాడాలన్నారు. కంటికి కనిపించకుండా చాపకింద నీరులా మానవ ఆరోగ్యానికి పెను విపత్తుగా మారుతున్న ఏఎమ్మార్ నియంత్రణ, ప్రజలు, వైద్యులు పాటించాల్సిన జాగ్రత్తలను ‘సాక్షి’తో రంగారెడ్డి పంచుకున్నారు. ఆయన భారత, ఏపీ ఏఎమ్మార్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో సలహాదారుగా ఉన్నారు. ఏఎమ్మార్పై రంగారెడ్డి ఏమంటున్నారంటే.. –సాక్షి, అమరావతిటాప్–10లో ఇదే ప్రధానం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలిన్ ఇంజెక్షన్ 1940 దశకంలో వినియోగంలోకి వచ్చింది. ఇది ఆరోగ్య రంగం, రోగుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. అనంతరం రకరకాల యాంటీబయోటిక్స్ తయారీ ఊపందుకుంది. వీటివల్ల సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే అనేకానేక ఇన్ఫెక్షన్లను నయం చేస్తూ బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తూ వైద్య రంగం ముందుకు వెళ్లింది. పెన్సిలిన్ కనుగొన్న సమయంలోనే దీన్ని విచ్చలవిడిగా వినియోగిస్తే బ్యాక్టీరియాలో ఒకరకమైన నిరోధకత పెరిగి మనం ఇచ్చే ఏ మందులకు పని చేయకుండా సూపర్ బగ్స్గా మారతాయని అలెగ్జాండర్ హెచ్చరించారు. వైద్యులు, ప్రజలు లెక్కలేనితనంతో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ని వినియోగించడంతో ఏఎమ్మార్ సమస్య ఉత్పన్నం అవుతోంది.ప్రపంచ ప్రజారోగ్య రంగంలో ఎదుర్కొంటున్న టాప్–10 సమస్యల్లో ఏఎమ్మార్ ప్రధానమైందని డబ్ల్యూహెచ్వో సైతం హెచ్చరించింది. అతిగా యాంటీబయోటిక్స్ వినియోగంతో మనుషుల్లో సూపర్ బగ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో 80 శాతం యాంటీబయోటిక్స్ పనిచేయడం లేదని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వో తేల్చాయి.అడ్వాన్స్డ్ డ్రగ్స్ సైతం 10 మందికి ఇస్తే అందులో 9 మందిలో పనిచేయడం లేదు. సెప్సిస్ వంటి జబ్బులు వచి్చనప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయక చేతులు ఎత్తేసే పరిస్థితులు చూస్తున్నాం.యాక్షన్ ప్లాన్ను ఆచరణలో పెట్టాలి2016లో డబ్ల్యూహెచ్వో ఏఎమ్మార్ను విపత్తుగా పరిగణించి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా 2022లో యాక్షన్ ప్లాన్ను రూపొందించిన నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రస్తుత రోజుల్లో ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఒకటి రెండు రోజుల్లో నయమవ్వాలని ప్రజలు భావిస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చి యాంటీబయోటిక్స్ రాయించుకుంటున్న వారు ఉంటున్నారు. లేదంటే ఆ వైద్యుడిని పనికిమాలిన వాడికింద లెక్కగడుతున్నారుమరికొందరైతే వైద్య పరీక్షలు దండగని భావించి.. నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి ఫార్మాసిస్ట్ ఇచి్చన యాంటీబయోటిక్స్ వేసుకుంటున్నారు. ఈ చర్యలతో తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని వారే పాడుచేసుకుంటున్నారు. చనిపోతామని తెలిసి ఏ వ్యక్తిని కావాలనే విషాన్ని కొనుక్కుని తినడు. యాంటీబయోటిక్స్ విషయంలోనూ ప్రజలు అదే విధంగా ఆలోచించాలి. రోగులు, ప్రభుత్వాలపై ఆర్థిక భారం ఏఎమ్మార్ను అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వాలు, వైద్యులు పరిగణించాలి. లేదంటే ప్రజారోగ్య వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రజలు, దేశాలు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా పెద్దపెద్ద జబ్బలకు పెన్సిలిన్, సల్ఫర్ డ్రగ్ ఇస్తే మూడు నుంచి నాలుగు రోజుల్లో రోగి కోలుకుని ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చాలా సందర్భాల్లో అవి పనిచేయకపోవడంతో ఒక డోస్, రెండో డోస్ అని డోస్ల మీద డోస్లు యాంటీబయోటిక్ మందులు వాడాల్సి వస్తోంది. దీంతో రోగులు, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. చికిత్సా సమయం పెరుగుతోంది. ఒక రోగాన్ని తగ్గించడం కోసం యాంటీబయోటిక్స్ను డోస్ల మీద డోస్లు ఇవ్వడం శరీరంలో మరో సమస్యకు దారితీస్తోంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా నిరీ్వర్యమై, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. -
అలా వాడేయటం ఆరోగ్యానికి ‘యాంటీ’
సాక్షి, అమరావతి: జలుబుకు మందు వేస్తే వారానికి.. వేయకపోతే ఏడు రోజులకు తగ్గుపోతుందనేది తెలుగు నాట తరచూ వినిపించే మాటే. స్మార్ట్ ఫోన్లు వచ్చాక దగ్గు.. జలుబు.. జ్వరం.. ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అందులో సూచించే మందులను మెడికల్ షాపులకు వెళ్లి కొనేస్తున్నారు. వాటిలో యాంటీ బయోటిక్స్ కూడా ఉంటున్నాయి. కొందరైతే మెడికల్ షాపులకు వెళ్లి తనకొచ్చిన నలత ఏమిటో చెప్పి నేరుగా యాంటీ బయోటిక్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి పెనుముప్పు తెచ్చిపెడుతోంది. చాలా ప్రమాదం సుమా! యాంటీ బయోటిక్స్ను మితిమీరి వినియోగించడం వల్ల సూక్ష్మజీవనాశక నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సమస్య ఉత్పన్నం అవుతోంది. వైద్య నిపుణుల సలహా లేకుండా యాంటీ బయోటిక్స్ను ఇష్టారీతిన వినియోగిస్తే.. వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తి పెంచుకుని.. చివరకు ఏ మందుకూ లొంగకుండా మరింత బలం పుంజుకుంటాయి. టీకాలు, ఔషధాలు ప్రయోగించినా ఫలితం లేకుండాపోతుంది. ఇలా తయారు కావటాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ఏఎంఆర్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మరణిస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. కాగా.. 2050 నాటికి ఏఎంఆర్ కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య కోటికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తొలి పది ఆరోగ్య సంక్షోభాల్లో ఏంఎఆర్ ఒకటని డబ్ల్యూహెచ్వో సైతం స్పష్టం చేస్తోంది. ప్రి్రస్కిప్షన్ లేకుండానే.. వైద్యులను సంప్రదించకుండా.. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదని ఔషధ నియంత్రణా శాఖ హెచ్చరిస్తున్నా మెడికల్ షాపుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. మరోవైపు వైద్య శాఖ సైతం ఏంఎఆర్పై ప్రత్యేక ప్రణాళికను రచించింది. పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, ఇతర శాఖలను సమన్వయ పరుచుకుంటూ ఏంఎఆర్ నియంత్రణపై ముందుకు అడుగులు వేస్తోంది. ప్రజలకు సైతం యాంటీబయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పిస్తోంది. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?
జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. కానీ వైద్యుల సలహా లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రమాదకరమని మీకు తెలుసా? 564 మందిపై 2023లో నిర్వహించిన సర్వేలో 43.6శాతం మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించారట. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడినా, అదేపనిగా వాడినా అనర్థాలు తప్పవని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచ పది ఆరోగ్య సంక్షోభ అంశాల్లో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మొదటి పదిలో ఒకటిగా ఉన్నట్టు పేర్కొంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే యాంటీబయాటిక్స్ కొనుగోలు చేయాలి అంటున్నారు డీఏసీ. ఏఎంఆర్ అంటే యాంటీ బయోటిక్స్ను అతిగా వాడడం వల్ల ఆ మందు వైరస్పై పనిచేయకుండా పోయే పరిస్థితి అని తెలిపింది. యాంటీ బయోటిక్స్ను ప్రజలు అవగాహన లేకుండా వాడటంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్రెడ్డి తెలిపారు. యాంటీబయోటిక్స్ వాడకం అనర్థాలపై అవగాహన పెంచాలని సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 12.7 లక్షల మంది బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కారణంగా మృతి చెందినట్టు తెలిపారు. యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల బ్యాక్టీరియా రెసిస్టెంట్గా మారుతుందని, ఇది సూపర్బగ్ మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వినియోగించాలన్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారా? కేంద్రం కీలక సూచనలు
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది. కారణం రాయాల్సిందే.. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు. వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తున్నారా? ఆ ఇన్ఫెక్షన్ మనుషుల్లోనూ..
ఈరోజుల్లో కుక్కల్ని పెంచుకోవడం కామన్ అయిపోయింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కుక్కలు బెస్ట్ స్ట్రెస్ బస్టర్గానూ ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇంట్లో మనిషిలాగే కుక్కలను కూడా ట్రీట్ చేస్తుంటారు. కుటుంబసభ్యులకు చేసినట్లు కుక్కలకు కూడా ఘనంగా బర్త్డే పార్టీలు, సీమంతాలు నిర్వహిస్తుంటారు. మరికొందరైతే కుక్కలకి పెట్టకుండా ఏమీ తినరు. అయితే కొన్నిసార్లు అతి ప్రేమతో తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. ఇష్టంగా తింటున్నాయి కదా అని ప్రతిరోజూ వాటికి ఆహారంలో పచ్చి మాంసం పెడుతుంటారు. దీని వల్ల మనుషులకు అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. కుక్కలకు పచ్చిమాంసం పెట్టడం వల్ల యాంటీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు కారణం అవుతుందని తేలింది. యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు వాడతారు. కానీ మితిమీరి యాంటీబయోటిక్స్ను వాడితే శరీరం బాక్టీరియాను నిరోధించే శక్తిని క్రమంగా కోల్పోతుంది. అయితే కుక్కులకు పచ్చి మాంసం తినిపించడం వల్ల సిప్రోఫ్లోక్సాసిన్ నిరోధక E. కోలిని విసర్జిస్తుందని తాజాగా యూకేకు చెందిన బ్రిస్టోల్ సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధారణంగా Fluoroquinolones అనే యాంటిబయోటిక్స్ను మనుషులకు, పశువైద్యంలోనూ ఉపయోగిస్తారు. కుక్కలకు పచ్చి మాంసం తినిపించం వల్ల బాక్టీరియా ఏర్పడి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ E. కోలితో కలుషితమవుతుందని శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్లో కనుగొన్నారు. సుమారు 600 ఆరోగ్యకరమైన కుక్కలను పరిశీలించగా వాటి నమూనాల్లో మానుషులు, జంతువుల ప్రేగుల్లో E. coli బాక్టీరియా రకాన్ని గుర్తించారు. ఇది పరిశుభ్రత సరిగా లేని, పచ్చి మాంసం తినడం వల్ల పేరుకుపోయిందని తేలింది. దీనివల్ల యాంటిబయోటిక్స్ నిరోధం తగ్గిపోతుందని, ఫలితంగా బాక్టీరియా ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. పచ్చిమాంసాన్ని కుక్కలకు స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది ప్రేగుల్లో కొన్ని సంవత్సరాల పాటు పేరుకుపోయి తర్వాత ట్రీట్మెంట్ అందివ్వడానికి సైతం కష్టమవుతుంది. సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో సుమారు 7.3% గ్రామీణ కుక్కలు, 11.8% పట్టణాల్లో కుక్కల మలంలో సిప్రోఫ్లోక్సాసిన్-రెసిస్టెంట్ E. కోలి ఉన్నట్లు గుర్తించారు. వండని మాసం తినిపించడే ఈ బాక్టీరియాకు కారణమని నమూనాల్లో తేలింది. అందుకే కుక్కల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా?మీరు డేంజర్లో ఉన్నట్లే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రాణాలను కాపాడే యాంటీబయోటిక్స్ ఒక్కోసారి ప్రాణాంతకమవుతున్నాయి. విచ్చలవిడి వినియోగం కొంప ముంచుతోంది. ప్రతి చిన్న రోగానికీ పెద్ద మందు వేయడం శరీరానికి భారంగా మారింది. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికి కూడా ఖరీదైన, మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ను వాడుతున్నారు. దీంతో కొన్ని రకాల బాక్టీరియా హై డోస్ (తీవ్ర మోతాదుతో కూడిన) యాంటీబయోటిక్స్కూ లొంగని పరిస్థితి ఎదురైంది. దీనివల్ల జరగాల్సిన నష్టం కంటే ఎక్కువగా జరుగుతున్నట్టు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంటీబయోటిక్స్ గురించి కొన్ని నిజాలు.. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా రూ.240 కోట్ల విలువైన యాంటీబయోటిక్స్ వినియోగంలో ఉన్నట్టు అంచనా. ► డాక్టరు సూచించినవి కాకుండా నేరుగా కౌంటర్ సేల్ అంటే మందుల షాపు వద్దకెళ్లి వాడుతున్న వారు 30 శాతం మంది. ► ఉదాహరణకు ఒక వ్యాధి తగ్గాలంటే ఐదురోజుల కోర్సు పూర్తి చేయాలి. కానీ మూడురోజులకే జబ్బు తగ్గిందని ఆపేస్తున్నారు. ► చిన్న చిన్న జ్వరాలు, జలుబు, దగ్గు, విరేచనాలు వంటి జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడేవాళ్లు ఎక్కువయ్యారు. ►యాంటీబయోటిక్స్కు జబ్బులు తగ్గకపోతే రోగం ముదిరి ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాలి. దీనివల్ల ఆర్థికంగా చితికిపోతారు. ► ఎక్కువ వినియోగంలో ఉన్న యాంటీబయోటిక్స్...అజిత్రోమైసిన్, సెఫాక్సిమ్, సెఫడోక్సిమ్, నార్ఫ్లాక్సిన్, సెఫ్ట్రియాక్సోన్, ఆఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, టాజోబ్యాక్టమ్ వంటివి. నియంత్రణ ముఖ్యం యాంటీ బయోటిక్స్ వాడేముందు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి. యాంటీ బయోటిక్స్ వాడేటప్పుడు కోర్సు పూర్తయ్యే వరకూ మధ్యలో మానెయ్యొద్దు. డాక్టర్ సూచించిన మోతాదే వాడాలి. మెడికల్ స్టోర్కు వెళ్లి మనకు మనమే యాంటీబయోటిక్ తెచ్చుకోకూడదు. చిన్న చిన్న జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడటం మంచిది కాదు. యాంటీ బయాటిక్ ఎలా వాడాలి? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి.వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియాలు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవాటు పడడంతో శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది లొంగకపోతే పెద్ద ప్రమాదం యాంటీబయోటిక్స్ మందులు పరిమితంగా ఉంటాయి. ఒక్కసారి ఈ మందులకు బ్యాక్టీరియా లొంగకపోతే తర్వాత కష్టం. కొత్త జబ్బులు వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు. ఈ పరిస్థితులను అధిగమించడం చాలా కష్టమవుతుంది. పరిమిత మోతాదులో వాడాలి. – డా.సీహెచ్.ప్రభాకర్రెడ్డి,హృద్రోగ నిపుణులు మోతాదుకు మించి వాడితే... యాంటీబయోటిక్స్ పరిమితంగా వాడాలి. జబ్బును బట్టి డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే కోర్సు వాడాలి. అలాగని రెండ్రోజులు వాడి వదిలేయకూడదు కూడా. పరిమిత మోతాదులో జబ్బును బట్టి వాడితేనే మంచిది. లేదంటే కొన్ని జబ్బులు మొండికేసే అవకాశం ఉంటుంది. –డా.ఫణి మహేశ్వరరెడ్డి, జనరల్ సర్జన్ -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
చీటికి మాటికీ యాంటీ బయాటిక్స్ వాడితే ఈ దుష్ప్రభావాలు తప్పవు! కిడ్నీ, లివర్..
యాంటీ బయాటిక్స్ మందుల వాడకం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే తప్పదంటే తప్ప వీటిని డాక్టర్లు ప్రిస్కెప్షన్గా రాయరు. కానీ వైద్యులతో సంబంధం లేకుండా ప్రజలే ఏ చిన్న ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా యాంటీ బయాటిక్స్ను మందుల దుకాణాల్లో కొనుగోలు చేసి మింగేస్తున్నారు. ఈ వాడకం కొత్త రకం సమస్యలకు దారి తీస్తోంది. విజయనగరం ఫోర్ట్ : యాంటీ బయాటిక్స్ మందులను జనం తెగ మింగేస్తున్నారు. జిల్లాలో వీటి వినియోగం బాగా పెరిగింది. చిన్నపాటి జలుబు, దగ్గు వంటి వాటికి కూడా ప్రజలు యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. కొంతమంది ఆర్ఎంపీలు చీటికి మాటికీ యాంటీ బయాటిక్స్ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కిడ్నీ, లివర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియా లు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవా టు పడడంతో జ్వరాలు కూడా తగ్గక రోగులు రోజు ల తరబడి మంచాన పడి మూలుగుతున్నారు. వీటి వల్ల శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న రోగాలకు కూడా.. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా యాంటీ బయాటిక్స్ మందులు అ«ధికంగా వినియోగిస్తున్నారు. కొంత మంది ఆర్ఎంపీలు వద్ద తీసుకోగా, మరి కొంతమంది మందుల దుకాణాల వద్ద నేరుగా తెచ్చుకుని వాడుతున్నారు. జలుబు చేసినా.. దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. తలనొప్పి, నడుం నొప్పి, చర్మ వ్యాధులు ఇలా ఏ జబ్బుకు అయినా యాంటీ బయా టిక్స్ తప్పనిసరిగా వాడేస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. జిల్లాలో 1200 మందుల దుకాణాలు జిల్లాలో 1200 మందుల దుకాణాలు ఉన్నాయి. ఏడాదికి సుమారు 50 లక్షలకు పైగా యాంటీ బయా టిక్స్ మాత్రలు జనం వాడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల దుకాణాల్లో విచ్చల విడిగా యాంటి బయాటిక్స్ మందులు విక్రయిస్తు న్నారు. కొంత మంది నేరుగా మందుల దుకాణానికి వెళ్లి అడగగానే వీటిని ఇచ్చేస్తున్నారు. రైతులు, కూలీలు, ఒళ్లు నొప్పులు వచ్చిన వారు ప్రతీ సారి డైక్లోఫినాక్ ఇంజిక్షన్గాని లేదా యాంటీ బయాటిక్ మాత్రలుగాని మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి వాడేస్తున్నారు. వాటి వల అనర్ధాలు తెలియక తాత్కాలిక ఉపశమనం కల్గడంతో వాటినే ఆశ్రయిస్తున్నారు. ప్రిస్కప్షన్ లేకుండా మందులు అమ్మ కూడదన్న నిబంధన ఉన్నప్పటికి అమలు కావడం లేదు. ప్రమాదమే... నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడితే ప్రమాదమే. ప్లారోసిస్ వలన నొప్పులు ఎక్కువ గా ఉంటాయి. నొప్పి నివారణకు వాడే మందు లు వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రకాల ఇంజక్షన్లు కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వైద్యుని సలహా లేకుండా ఎటువంటి యాంటీ బయాటిక్స్ వాడకూడదు. – డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
నాణ్యమైన రొయ్యల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆక్వాసాగులో యాంటిబయోటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా యాంటిబయోటిక్స్ వినియోగాన్ని 95 శాతానికిపైగా నియంత్రించగలిగారు. ఇకముందు 100 శాతం నియంత్రించేదిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ శాతాన్ని పరీక్షించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏటా తొమ్మిదిలక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. లక్షటన్నులు స్థానికంగా వినియోగమవుతుండగా, లక్షన్నర టన్నులు ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వెళుతున్నాయి. మిగిలిన 6.50 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీన్లో 50 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 30 శాతం చైనాకు, 10 శాతం వియత్నాం, థాయ్లాండ్ దేశాలకు, 6–8 శాతం యూరప్ దేశాలకు, మిగిలింది మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యాంటిబయోటిక్ రెసిడ్యూల్స్ మితిమీరి ఉన్నాయంటూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కన్సైన్మెంట్స్ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్ యాక్టులు తీసుకురావడంతోపాటు తీరప్రాంత జిల్లాల్లో రూ.50 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన ఆక్వాసాగు వివరాలను ఈ ఫిష్ యాప్లో నమోదుచేస్తూ, నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా పెద్ద ఎత్తున మత్స్యసాగుబడులు నిర్వహిస్తున్నారు. యాంటిబయోటిక్స్ వినియోగంవల్ల తలెత్తే దుష్పరిణామాలపై ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నారు. పంటకాలంలో కనీసం నాలుగైదుసార్లు వాటర్ అనాలసిస్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడమే కాదు.. పొరుగు రాష్ట్రాలు, దేశాలతో పోల్చుకుంటే రొయ్యల ఎదుగుదల 12.76 శాతం మేర పెరిగింది. మరోవైపు యాంటిబయోటిక్స్ వినియోగం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి విదేశాలకు పంపే రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు 0.3 నుంచి 0.4 శాతం ఉంటే, మన రాష్ట్రం నుంచి వెళ్లే వాటిలో 0.2 శాతం మాత్రమే నమోదవుతున్నాయి. అవికూడా కొద్దిపాటి కన్సైన్మెంట్లలోనే. ఈక్విడార్ వంటి దేశాల్లో ప్రతి ఉత్పత్తిని టెస్ట్ చేసిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తారు. అదే మనదేశంలో ర్యాండమ్గా చెక్చేసిన తర్వాత ఎగుమతులకు అనుమతినిస్తుంటారు. వ్యాధుల నియంత్రణ పేరుతో విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటిబయోటిక్స్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాంటిబయోటిక్స్ అవశేషాలుంటే ఇకనుంచి రొయ్యలను కొనుగోలు చేయబోమని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్పోర్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నూరుశాతం యాంటిబయోటిక్స్ రహిత ఉత్పత్తులుగా మన రొయ్యలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈక్విడార్ తరహాలోనే నూరుశాతం తనిఖీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ఆపరేటర్లతోపాటు రైతుసంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ పర్యవేక్షణలో సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ అవశేషాలను క్రమం తప్పకుండా పరీక్షించనుంది. ప్రస్తుత సీజన్ నుంచే ఈ కార్యాచరణ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యాంటిబయోటిక్స్ పరీక్షలకు అయ్యే వ్యయం రైతులపై పూర్తిగా పడకుండా సమష్టిగా భరించేలా ఏర్పాటు చేస్తోంది. యాంటిబయోటిక్స్ నియంత్రణే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాంటిబయోటిక్స్ వినియోగం నూరుశాతం నియంత్రణే లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ రైతుల్లో అవగాహన కల్పించడమే కాదు.. సీడ్ నుంచి పట్టుబడి వరకు దశలవారీగా ప్రతి చెరువులోని రొయ్యలను పరీక్షిస్తుంది. – వడ్డి రఘురాం, అప్సడా వైస్ చైర్మన్ కమిటీ ఏర్పాటు మంచి ఆలోచన యాంటిబయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. యాంటిబయోటిక్స్ లేని రొయ్యలను మాత్రమే ఎగుమతి చేసేందుకు ఇది ఎంతో దోహదపడనుంది. – ఐ.పి.ఆర్.మోహనరాజు, జాతీయ రొయ్యరైతుల సంఘం అధ్యక్షుడు -
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్లో, స్పెషాలిటీ బ్లాక్లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
యాంటి బయోటిక్స్ అనధికార విక్రయాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: యాంటి బయోటిక్స్ విచ్చలవిడిగా వినియోగించడం ప్రాణాంతకంగా మారుతోందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారుతున్న యాంటీ మైక్రోబియాల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్)ను నియంత్రించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ శనివారం ముగిసింది. ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కాల్ ఫర్ యాక్షన్’ను ఆవిష్కరించిన కృష్ణబాబు ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ల బలోపేతానికి ‘విజయవాడ డిక్లరేషన్’ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలను రక్షించుకునేందుకు యాంటీ బయోటిక్స్ వినియోగం వల్ల పెరుగుతున్న ఏఎంఆర్ను కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం యాంటి బయోటిక్స్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు అనధికారిక విక్రయాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎంఆర్ కట్టడి కోసం గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఏఎంఆర్ కట్టడి కార్యాచరణ ప్రణాళికను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు రాష్ట్రంలోని కృష్ణా జిల్లాను కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా అమలవుతున్న ఈ ప్రణాళిక ఫలితాలను సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా), ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (ఇఫ్కాయ్), వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ (డబ్ల్యూఏపీ) వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్, ఏఎంఆర్ నోడల్ అధికారి జె.నివాస్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్ నారా>యణ్, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పి.రెడ్డన్న, సెక్రటరీ జనరల్ డాక్టర్ రత్నాకర్, ఇఫ్కాయ్ అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి పాల్గొన్నారు. -
‘పురుగులు పడితే’ బతుకుతారు..!
జంతువులు, మనుషులు.. శరీరం ఏదైనా సరే తీవ్రంగా గాయాలై తగిన చికిత్స చేయకపోతే పురుగులు పట్టడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా కుళ్లిన, చనిపోయిన మాంసానికే (మృత కణాలకే) పురుగులు పడతాయి. కానీ అదే పురుగులు తీవ్రమైన గాయాలు మానడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే గుర్తించిన ఈ విధానాన్ని వినియోగించడం ఇటీవల మళ్లీ పెరిగింది కూడా. మరి ఈ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ యాంటీ బయాటిక్స్కు లొంగకుండా.. సరైన విధంగా మందులు వాడకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం, పలు రకాల అనారోగ్య సమస్యలు వంటివాటి వల్ల గాయాలు మానవు. గాయాల్లో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. అవి మరింత తీవ్రమై పుండ్లు పడటం, చీమురావడం, కణాలు చనిపోయి కుళ్లిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. మరోవైపు పలురకాల బ్యాక్టీరియాలు ఔషధాలకు నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవడంతో.. చికిత్స చేసినా ఫలితం లేకపోవడం లేదా సుదీర్ఘకాలం పట్టడం జరుగుతోంది. ఈలోగా సమస్య ముదిరి.. ఆ శరీర భాగాలను తొలగించాల్సి రావడంగానీ, ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించి ప్రాణాలు పోగొట్టుకోవడంగానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ‘పురుగుల’ చికిత్సతో ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలోనే.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కాల్పులు, బాంబు దాడుల్లో లక్షలాది మంది సైనికులు గాయపడ్డారు. యుద్ధ క్షేత్రాల్లో సరైన చికిత్స అందక గాయాలు పుండ్లు పడి, ఇన్ఫెక్షన్లు పెరిగి.. అవయవాలు కోల్పోయినవారు, చనిపోయినవారు ఎందరో. అయితే యుద్ధంలో గాయపడిన ఫ్రెంచ్ సైనికుల్లో కొందరికి గాయాలపై పురుగులు పట్టడం, వారి గాయాలు త్వరగా మాని కోలుకోవడాన్ని వైద్యులు గుర్తించారు. గాయాల్లోని మృత కణాలను ఆ పురుగులు తినేయడం, అదే సమయంలో బ్యాక్టీరియాను హతమార్చే రసాయనాలను విడుదల చేయడమే దీనికి కారణమని తేల్చారు. ఇది తెలిసిన చాలా మంది వైద్యులు సైనికులకు పురుగుల చికిత్స చేశారు. కానీ తర్వాతికాలంలో యాంటీ బయాటిక్స్ రావడం, పురుగుల పట్ల ఏవగింపు వంటివి ఈ చికిత్స మరుగునపడిపోవడానికి కారణమయ్యాయి. పురుగులు ఏం చేస్తాయి? ఈగలు, తేనెటీగలు వంటి ఎగిరే కీటకాలు గుడ్డు నుంచి ఎదిగే క్రమం భిన్నంగా ఉంటుంది. అవి మొదట గుడ్డు నుంచి పురుగుల రూపంలోని లార్వాగా జన్మించి.. తర్వాత పూర్తిస్థాయి కీటకాలుగా మార్పు చెందుతాయి. ఇందులోని లార్వా దశ పురుగులనే గాయాలను మాన్పడానికి వినియోగిస్తారు. ఈ పురుగులు నేరుగా మన మృతకణాలను తినవు. ముందుగా వాటి నోటి నుంచి వివిధ ఎంజైమ్లు ఉండే లాలాజలాన్ని (సలైవా) విడుదల చేస్తాయి. ఈ ఎంజైమ్లు మృతకణాలను కరిగించి పోషక ద్రవంగా మారుస్తాయి. ఇదే సమయంలో అక్కడ ఉండే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు కూడా చనిపోయి పోషక ద్రవంగా మారుతాయి. పురుగులు ఈ పోషక ద్రవాన్ని పీల్చుకుని జీవిస్తాయి. మొత్తంగా గాయంపై మృతకణాలు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశించడంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మరోవైపు పురుగుల సలైవా వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి చురుగ్గా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో సమస్య నుంచి వేగంగా కోలుకున్నట్టు తేల్చారు. ఇంగ్లండ్లోని సౌత్వేల్స్కు చెందిన బయోమోండే సంస్థ ‘గ్రీన్ బాటిల్ బ్లోఫ్లై’ రకం ఈగల లార్వాలను టీబ్యాగ్ల తరహాలో ప్యాక్ చేసి అమ్ముతోంది. ఏటా 9 వేల బయోబ్యాగ్లను చికిత్సల కోసం కొంటున్నారని చెబుతోంది. నర్సుల భయమే సమస్యట! సాధారణంగా పురుగులను చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. కొందరైతే భయంతో కెవ్వున కేకలు కూడా పెడుతుంటారు. ప్రస్తుతం గాయాలకు పురుగుల చికిత్సలోనూ ఇదో సమస్యగా మారిందని ఇంగ్లండ్ వైద్యులు చెప్తున్నారు. చాలా మంది నర్సులు పురుగులను చూసి అసహ్యం, భయం వ్యక్తం చేస్తున్నారని.. ఆ చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. అందువల్ల కొందరు నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ చికిత్సల్లో వినియోగిస్తున్నామని చెప్తున్నారు. కొన్నాళ్లుగా ఇంగ్లండ్లో మళ్లీ వినియోగం గాయాలు, పుండ్లకు చికిత్సలో పురుగుల వినియోగానికి ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ 2004లోనే అధికారికంగా అనుమతి ఇచ్చింది. కొన్నాళ్లుగా ఈ విధానానికి ఆదరణ వస్తోందని, 2009–19 మధ్య ఈ తరహా చికిత్సలు 50శాతం పెరిగాయని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. పుళ్లుపడి, చీముపట్టిన గాయాలైనా.. సాధారణంగా గాయాలు తీవ్రమై పుళ్లుపడటం, చీముపట్టడం (గ్యాంగ్రిన్) వంటివి జరిగితే.. అంతమేర ఆపరేషన్ చేసి కండరాన్ని కోసి తీసేయాల్సిందేనని వైద్యులు చెప్తుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి కారణాలతో కాళ్లు, చేతులు, వేళ్లు వంటివి తొలగించిన ఘటనలూ మనకు కనిపిస్తుంటాయి. అలాంటి తీవ్రమైన గాయాలు కూడా మానిపోయేందుకు పురుగుల చికిత్స తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా గ్యాంగ్రిన్ సమస్యతో 7లక్షల మంది వరకు చనిపోతున్నట్టు అంచనా. వారిలో చాలా మందిని ‘పురుగుల చికిత్స’తో కాపాడవచ్చని అంటున్నారు. ఏదో ఓ పురుగు వేసుకుంటే డేంజర్ పురుగులతో గాయం తగ్గిపోతుందికదా అని ఏదో ఒక పురుగును వేసుకుంటే మొదటికే మోసం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుగులు అంటేనే వివిధ బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మజీవులకు అడ్డాలు అని.. వాటితో మరిన్ని ఇన్ఫెక్షన్లు సోకుతాయని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా ప్రత్యేకమైన ఈగ జాతులకు చెందిన గుడ్లను యాంటీ బ్యాక్టీరియల్ ద్రావణంతో శుద్ధిచేసి, ప్రయోగశాలలో వాటిని పొదిగి.. లార్వా దశకు వచ్చాక గాయాలపై వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు. ఈ పురుగులను కూడా గాయాలపై నేరుగా వేయరు. టీబ్యాగ్ తరహా ప్రత్యేకమైన పలుచని రంధ్రాలున్న బయోబ్యాగ్లో వాటిని ఉంచుతారు. ఈ బ్యాగ్లను గాయాన్ని తాకేలా పెట్టి.. పైన వదులుగా పట్టీకడతారు. ఇలా రెండు నుంచి నాలుగు రోజులు ఉంచుతారు. -
యాంటీ‘భయో’టిక్స్!
సాక్షి, హైదరాబాద్: తుమ్మినా..దగ్గినా..నీరసమున్నా..ఆయాసమున్నా.. వొళ్లు నొప్పులు.. వైరల్ జ్వరం.. ఏదైనా ఒక్కటే మందు..యాంటీబయాటిక్. ఇలా చిన్నాచితకా రోగానికీ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం చాలామందికి అలవాటై పోతోంది. చివరి అస్త్రంగా వాడాల్సిన వాటిని తొలిదశలోనే వాడేస్తున్నారు. వైద్యులు సూచించక పోయినా కొందరు సొంతంగా వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంటే అప్పటికే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములకు యాంటీబయాటిక్స్ను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్) వచ్చి ఉంటుందన్న మాట. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను (యాంటీబయాటిక్స్) చల్లుతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం పాడి పశువులకు ఇంజెక్షన్లు (యాంటీబయాటిక్స్) ఇస్తున్నారు. ఈ విధమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా అప్పటికే మానవ శరీరంలో అధిక శాతం యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్ల విక్రయం దేశంలో 2019లో 85 రకాలకు సంబంధించిన 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్లు అమ్ముడుపోయినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాంటీబయాటిక్స్పై చేసిన అధ్యయనం ఇటీవల లాన్సెట్లో ప్రచురితమైంది. ఇందులో 28 యాంటీబయాటిక్స్ను అత్యవసర మందుల జాబితాలో పెట్టారు. మిగితావి సాధారణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) అనుమతి ఇచ్చిన యాంటీబయాటిక్స్ కేవలం 19 శాతమే కాగా మిగిలిన 81 శాతం రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల పరిధిలో అమ్ముతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. అయినా కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఔషధాల నియంత్రణలో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని దందా నిర్వహిస్తున్నాయి. అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్లో 85–90 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాక్టీషనర్లు రాస్తున్నవేనని అధ్యయనం తేల్చిచెప్పింది. ఆహారం ద్వారానే అత్యధిక శాతం యాంటీబయాటిక్స్! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, వివిధ రకాల పంటల (ఆహార పదార్ధాలు) వినియోగం ద్వారా 80 శాతం యాంటీబయాటిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నాయని తేల్చింది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లుగా మారితే, అక్కడున్న పెన్సిలిన్కు సంబంధించిన యాంటిబయాటిక్కు లొంగని పరిస్థితులు 65 శాతం ఉంటున్నట్లు తెలిపింది. దీంతో డోసు ఎక్కువున్న యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఉదర ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్గా మారితే.. యాంటీబయాటిక్స్కు లొంగని పరిస్థితులు 85 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. శుభ్రత పాటించకపోవడంతో చేటు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటానికి ఇన్ఫెక్షన్లే ప్రధాన కారణం. ఇప్పటికీ 54 శాతం ఇళ్లల్లో శుచీ శుభ్రత పాటించడం లేదు. సబ్బుతో చేతిని కడుక్కోలేని స్థితి ఉన్న ఇళ్లు 32 శాతం ఉన్నాయి. నీటి వసతి లేని ఆసుపత్రులు ఆరు శాతం ఉన్నాయి. పారిశుధ్యం సరిగా పాటించని ఆసుపత్రులు 22 శాతం ఉన్నాయి. వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయని ఆసుపత్రులు 27 శాతం ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వివిధ దశల్లో 90 రకాల వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేలా, ఇన్ఫెక్షన్ రాకుండా చూసేలా ప్రపంచవ్యాప్తంగా 90 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. చాలారకాల యాంటీబయాటిక్స్కు లొంగని, మొండి ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లు రాకుండా నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
47 శాతం యాంటీబయోటిక్స్కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్ఈస్టు ఆసియా’ జర్నల్లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..!
యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడవచ్చన్న విషయం తెలిసిందే. అయితే... ఈ యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా, విచక్షణరహితంగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ వాటి దురుపయోగం ఆగడం లేదు. దాంతో తాజాగా ఇప్పుడు ఎంతకూ తగ్గని టైఫాయిడ్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నివేదిస్తున్నారు. ఈ ముప్పును గుర్తెరిగి అప్రమత్తం అయ్యేందుకు ఉపయోగపడే కథనమిది. గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులూ / యాంటీబయాటిక్స్ వాడకపోయినా తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు... ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. తాజాగా టైఫాయిడ్ను వ్యాప్తి చేసే క్రిమి కూడా అలా నిరోధకత పెంచుకుంటోందని కొన్ని అధ్యయనాల్లో aతేలింది. ఆసియాలో పెరుగుతూ.. అంతర్జాతీయంగా వ్యాప్తి టైఫాయిడ్ చాలా పురాతనమైన జబ్బు. దాదాపు వెయ్యేళ్ల నుంచి మానవాళిని బాధిస్తోందన్న దాఖలాలున్నాయి. ఇలా చాలాకాలం నుంచి వేధించిన మరోపురాతనమైన జబ్బు టీబీలాగే... టైఫాయిడ్ కూడా యాంటీబయాటిక్స్ తర్వాత పూర్తిగా అదుపులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనవాళ్లు లేకుండా మటుమాయమైంది. ఇది సాల్మొనెల్లా ఎంటరికా లేదా సాల్మొనెల్లా టైఫీ అనే రకాల క్రిము కారణంగా వ్యాప్తి చెందుతుంది. మనదేశంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో నిర్వహించిన పరిశోధనల్లో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు మనదేశంతో పాటు ఆయా దేశాల్లోని 3,489 రకాల టైఫీ స్ట్రెయిన్ల జీనోమ్ సీక్వెన్సింగ్ను పరిశీలించారు. దాంతో ఇప్పుడు తాజాగా యాంటీబయాటిక్స్కు ఓ పట్టాన లొంగని కొత్త స్ట్రెయిన్ టైఫాయిడ్ జబ్బును కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తేలింది. నిపుణులు దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ టైఫాయిడ్ లేదా ‘ఎక్స్డీఆర్’టైఫాయిడ్గా పేర్కొంటున్నారు. టైఫాయిడ్ కొత్త స్ట్రెయిన్స్... ‘‘ఉత్పరివర్తనం చెందిన ‘ఎక్స్డీఆర్ టైఫాయిడ్’ 2016లో తొలిసారి పాకిస్తాన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతున్న ఈ ‘ఎక్స్ఆర్డీ’ టైఫీ స్రెయిన్స్ వ్యాప్తి... భారత్, పాక్, నేపాల్, బంగ్లాదేశ్... ఈ నాలుగు ఆసియా దేశాలనుంచే జరుగుతోంది. ఈ సూపర్బగ్స్ యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎంతో ఆందోళనకరం. అందుకే వీలైనంత త్వరగా ఈ అనర్థానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’’ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెంది జేసన్ ఆండ్రూస్ ప్రపంచానికి హితవు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ దాదాపు కోటీ 10 లక్షల టైఫాయిడ్ కేసులు వస్తుండటం... ప్రస్తుతం ఆ వ్యాధి దాఖలాలే లేని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుండటం... అది మందులకు ఓ పట్టాన లొంగకుండా వ్యాధిగ్రస్తుల్లో 20 శాతం మంది మృత్యువాతపడుతుండటం అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే ఓ ఆరోగ్యాంశం అవుతుందని కూడా ఆండ్రూ హెచ్చరిస్తున్నారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెంచుకుంటున్న మరికొన్ని జబ్బులు ►క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా వల్ల వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. ఈ క్లాస్ట్రీడియమ్ బ్యాక్టిరియా ఇటీవల యాంటీబయాటిక్స్కు నిరోధకత పెంచుకున్నట్లుగా తెలుసోది. ►గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో చిన్న డోస్తో కేవలం మామూలు యాంటీబయాటిక్స్ తగ్గిపోయేవి. కానీ ఇప్పుడవి ఒక పట్టాన తగ్గడం లేదు. ►అప్పట్లో ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ (టీబీ), క్లెబిసిలియా నిమోనియా, సూడోమొనాస్ వంటి సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్కు తేలిగ్గానే లొంగిపోయేవి. కానీ ఇప్పుడవి మరింత మొండిగా మారాయి. ► ఈ వేసవిలో మామిడిపండ్లు కాస్త ఎక్కువగానే తిన్నప్పుడు కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగగానే కొందరు ఆన్కౌంటర్ మెడిసిన్ వాడుతుంటారు. ఎలాంటి మందులు వాడకపోయినా అవి మర్నాటికల్లా తగ్గిపోతాయి. ఇలా ఆన్కౌంటర్ మెడిసిన్స్ వాడటం వల్ల విరేచనాలే కాదు... మరెన్నో సమస్యలు మొండిగా మారుతున్నాయి. అందుకే ఆన్కౌంటర్ మెడిసిన్స్ను వాడకపోవడమే మంచిది. అందుబాటులో టైఫాయిడ్ వ్యాక్సిన్ టైఫాయిడ్కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతేకాదు... మనదేశంలో పిల్లలందరికీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన (మ్యాండేటరీ) వ్యాక్సినేషన్ షెడ్యూల్ జాబితాలో ఉంది. టీసీవీ వ్యాక్సిన్ రూపంలో దీన్ని 9 – 12 నెలల పిల్లలకు ఇస్తుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే... రెండేళ్లు దాటిన పిల్లలకు దీన్ని ఇప్పించడం ద్వారా టైఫాయిడ్ నుంచి అనేక మంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చు. ఏ జబ్బుకు ఏ యాంటీ బయాటిక్... ఏ మోతాదులోనంటే? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి. దురుపయోగం చేయవద్దు... మన ప్రాణాలను రక్షించే ఈ యాంటీబయాటిక్స్ మందులను అదేపనిగా వాడటం వల్ల లేదా అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడు చేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్ను దురుపయోగం చేసుకుని, వాటిని నిరుపయోగం చేసుకోకుండా, యాంటీబయాటిక్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. చదవండి: Green Tea- Weight Loss: గ్రీన్ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా? -
గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడకూడదు... ఎందుకంటే?
గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల మందులను వాడకూడదంటూ డాక్టర్లు ఆంక్షలు పెడతారు. అందులో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. నిజానికి మనం చీటికీ మాటికీ యాంటీబయాటిక్స్ వాడుతూ, సొంతవైద్యం చేసుకుంటూ ఉంటాం. కానీ అది గర్భవతుల విషయంలో ఏమాత్రం చేయకూడదు. అది వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెడుతుంది. మామూలు వ్యక్తులు సైతం ఆన్కౌంటర్ మందుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదనేది వైద్యుల మాట. అందునా గర్భవతులు వాడటం వల్ల వారికి మాత్రమే కాకుండా... అది కడుపులో బిడ్డకు సైతం ఎన్నో రకాలుగా కీడు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... కాబోయే తల్లులు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. కొన్ని యాంటీబయాటిక్స్ బిడ్డ ఎముకల సాధారణ ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) రావచ్చు. ఇక సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. కాబోయే తల్లి స్ట్రెప్టోమైసిన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో డాక్టర్లు వాటిని సూచిస్తారు. అవి మాత్రమే... అందునా డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. -
యాంటీబయాటిక్స్తో భూసారానికీ ముప్పు.. అదెలా అంటే!
పశువైద్యంలో యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల దీర్ఘకాలంలో మట్టి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా భూతాపాన్ని పెంపొందించే కర్బన ఉద్గారాల బెడద సైతం పెరుగుతుందని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పశు వ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వల్ల వాటి విసర్జితాలు నేలపై పడినప్పుడు మట్టిలో శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయని అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కార్ల్ వెప్కింగ్ అంటున్నారు. యాంటీబయాటిక్స్ దుష్ప్రభావానికి గురికాని వాతావరణం భూతలం మీద లేదన్నారు. యాంటీబయాటిక్స్ వల్ల కర్బనాన్ని పట్టి ఉంచే శక్తిని మట్టి కోల్పోతుందన్నారు. యాంటీబయాటిక్స్ను పశుపోషణలో అతిగా వాడటం వల్ల.. మనుషుల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్కు లొంగని పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే. చదవండి: Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి -
సూపర్బగ్స్ పెనుప్రమాదం.. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏ మందునైనా అవసరమైనప్పుడు నిర్ణీత మోతాదులో వాడితేనే మంచి ఫలితం వస్తుంది. అనవసరంగా వాడితే మంచి జరగకపోగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒకప్పుడు కలరా తదితర అంటువ్యాధులు ప్రబలినప్పుడు పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్ ప్రజల ప్రాణాలు నిలిపాయి. ఇప్పుడు పలు రకాల యాంటీబయోటిక్స్ను మితిమీరి వాడటం వల్ల తీవ్ర దుష్ఫలితాలు కనిపిస్తున్నాయని ఫార్మకాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నేడు ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు. విచ్చలవిడిగా ఈ మందులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. జలుబు చేసినప్పుడు సిట్రజెన్ వంటి ఎలర్జిక్ డ్రగ్ వాడితే తగ్గిపోతుంది. దానికి కూడా యాటీబయోటిక్స్ వాడుతున్నారు. పంటి నొప్పి వంటి సమస్యలకు యాంటీబయోటిక్స్ వినియోగం మంచిది కాదని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ఈ మందులను అవసరం మేరకు మాత్రమే వినియోగించి, విచ్చలవిడితనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు సైతం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నాయి. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే.. మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు వైరల్ ద్వారా వ్యాప్తి చెందిందా? లేక బ్యాక్టీరియా కారణమా అన్నది నిర్ధారించుకోవాలి. బ్యాక్టీరియా కల్చర్ పరీక్ష ద్వారా నిర్ధారించుకుని అవసరం మేరకు మూడు నుంచి ఐదు యాంటీబయోటిక్స్ వాడాలి. మన శరీరంలో మంచి, చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా నివారణకు అతిగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల వాటి ప్రభావం మంచి బ్యాక్టీరియాపై పడుతుంది. ఫలితంగా శరీరంలోని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి తీవ్రమైన నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. యాంటీబయోటిక్స్ రెండు రకాలుగా ఉంటాయి. నేరో స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్ ఒకే రకమైన బ్యాక్టీరియాకు పనిచేస్తాయి. బ్రాడ్ స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్ రెండు మూడు రకాల బ్యాక్టీరియాల నివారణకు పనిచేస్తాయి. సూపర్బగ్స్ పెనుప్రమాదం యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల శరీరంలో బ్యాక్టీరియాకు డ్రగ్ రెసిస్టెన్స్ (ఔషధ నిరోధకత) ఏర్పడుతుంది. ఔషధ నిరోధకతను సంతరించుకున్న బ్యాక్టీరియా నుంచి వచ్చే తరువాతి తరాల బ్యాక్టీరియాలను సూపర్ బగ్స్ అంటారు. ఇవి సాధారణ యాంటీ బయోటిక్స్కు లొంగవు. ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం కొందరిలో సూపర్ బగ్స్ను గుర్తిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధిని గుర్తించడం ముఖ్యం నిమోనియా వ్యాధి వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మూడు కారణాలుగా వస్తుంది. వైరల్ నిమోనియా చాలా వేగంగా వ్యాప్తి చెంది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి మందులు వాడేటప్పుడు సరైన నిర్ధారణ చేసి యాంటీబయోటిక్స్ వాడాలి. లేకుంటే నివారించడం కష్టం. నిమోనియానే కాదు ఏ వ్యాధినైనా యాంటీబయోటిక్స్ వినియోగించే సమయంలో బ్యాక్టీరియా కల్చర్, అవసరమైతే డ్రగ్ కల్చర్ పరీక్షలు చేయడం ఉత్తమం. గర్భిణుల విషయంలో జాగ్రత్తలు అవసరం గర్బిణులకు కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడటం చాలా ప్రమాదకరమని ఫార్మకాలజీ నిపుణులు చెపుతున్నారు. వారు వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం వలన గర్భస్థ శిశువులో అవయవలోపాలు ఏర్పాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
పశువుల్లో యాంటీబయాటిక్స్ లేని పాల ఉత్పత్తికి కొత్త పద్ధతులు..
యాంటీబయాటిక్ ఔషధాలను మనుషులకు చికిత్సలో, పశు వ్యాధుల చికిత్సలో నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణా రహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. మొండికేసిన క్రిములు (సూపర్ బగ్స్) తయారవుతున్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీబయాటిక్స్కూ లొంగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సమస్యను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)గా వ్యవహరిస్తున్నాం. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి తక్షణం స్పందించకపోతే 2050 నాటికి ఏటా కోటి మంది (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) ఎ.ఎం.ఆర్. సమస్యతో చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎ.ఎం.ఆర్. సమస్య వల్ల యాంటీబయాటిక్ మందులు అసమర్థంగా మారడంతో శరీరం నుంచి ఇన్ఫెక్షన్లను తొలగించడం కష్టతరంగా మారుతోంది. ఉపయోగించిన యాంటీబయాటిక్స్ పరిమాణంలో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతుంది. ఎ.ఎం.ఆర్. సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులతోపాటు పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశుపక్ష్యాదుల కోసం యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం, జబ్బులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్కు బదులు సంప్రదాయ మూలికలతో కూడిన పశు ఆయుర్వేద పద్ధతులు అనుసరించడం ద్వారా ఎ.ఎం.ఆర్. సమస్య నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చని శాస్త్రీయంగా రుజువు కావటం సంతోషదాయకం. బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.) హెల్త్ అండ్ టెక్నాలజీ, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు గత పదేళ్లుగా ఈ దిశగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలనిచ్చింది. 10 రాష్ట్రాల్లో సంప్రదాయ పశువైద్య పద్ధతులను అధ్యయనం చేసి 441 మూలికా వైద్య మిశ్రమాలను గుర్తించారు. వీటిని పరీక్షించి 353 మందులు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని నిర్థారించారు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి.) ఈ పశు ఆయుర్వేద పద్ధతులను ఐదేళ్లుగా సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు పరిచయం చేసి అద్భుత ఫలితాలను రాబడుతున్నది. 24 రకాల పశు వ్యాధులను నివారించడంలో, నిరోధించడంలోనూ సంప్రదాయ మూలికా మిశ్రమాలు అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఎన్.డి.డి.బి. నిర్థారణకు వచ్చింది. ఈ పద్ధతులను పాడి సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పరిచయం చేస్తోంది. ఏటా యాంటీబయాటిక్ మందుల కొనుగోలుకు రూ. 1.86 కోట్లు ఖర్చు పెట్టే ఎన్.డి.డి.బి. ఈ ఖర్చును సంప్రదాయ మూలికా వైద్యం అనుసరించడం ద్వారా రూ. 50 లక్షలకు తగ్గించుకోగలిగింది. 1,500 గ్రామాల్లో పాడి రైతులకు ఈ మూలికా చికిత్సను ఇప్పటికే నేర్పించింది. తమ పరిసరాల్లోని ఔషధ మొక్కలు, దినుసులతోనే పశు వ్యాధుల నివారణకు, చికిత్సకు ఉపయోగించుకుంటూ శాస్త్రీయంగా యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని 80% తగ్గించామని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా ప్రకటించారు. పొదుగువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధులను రసాయనిక యాంటిబయాటిక్స్ వాడకుండా నూటికి నూరు శాతం పూర్తిగా తగ్గించగలిగామని ఆయన తెలిపారు. పాలలో యాంటీబయాటిక్స్ను 88% తగ్గించగలిగాం: ప్రొ. నాయర్ యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.)లోని మూలికా పశువైద్య పరిశోధనా విభాగం అధిపతి ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్, తన సహచరులు డా. ఎన్. పుణ్యమూర్తి, ఎస్.కె. కుమార్తో కలిసి పశు ఆయుర్వేద పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో 140 మంది పాడి రైతులతో కలసి మూడేళ్లు ప్రయోగాత్మకంగా మూలికా వైద్యంపై అధ్యయనం చేశారు. పాలలో యాంటీబయాటిక్స్ అవశేషాలను 88% తగ్గించగలిగామని ప్రొ. నాయర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఎన్.డి.డి.బి.తో కలసి ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 30 పాల సంఘాలలో 1750 మంది పశువైద్యులకు, 30 వేల మంది పాడి రైతులకు, 560 మంది గ్రామ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తమ యూనివర్సిటీలో రైతుల కోసం 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు, పశువైద్యుల కోసం 7 రోజుల సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఎమ్మెస్సీ, పిహెచ్డి కూడా పెట్టామన్నారు. సిక్కిం, హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకొని రసాయనిక యాంటీబయాటిక్స్ అవసరంలేని పశుపోషణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ముందుకొస్తే స్వల్ప ఫీజుతోనే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులకు పశు ఆయుర్వేద పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వివరాలకు.. ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ – 63602 04672. nair.mnb@tdu.edu.in చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా? -
కరోనా చికిత్సలో ఈ మెడిసిన్ వాడేటప్పుడు జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సలో బ్రహ్మాస్త్రం లాంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ మందును అవసరమున్న వారికే ఉపయోగించాలి తప్ప విచక్షణరహితంగా వాడొద్దని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డా.డి.నాగేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఖరీదైన మందు (దాదాపు రూ.70 వేలు) కావడంతో పాటు దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. అవసరం లేకపోయినా దీన్ని ఉపయోగిస్తే వైరస్ మ్యూటెంట్లు మరింత ముదిరే అవకాశం ఉందని, యాంటీబాడీ చికిత్సకు కూడా లొంగని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ వచ్చాక మూడు రోజుల్లో లేదా వారంలోనే దీన్ని తీసుకోవాలని, ఆ తర్వాత దీని ప్రభావం ఉండదని చెప్పారు. తమ ఆస్పత్రిలో ‘కసిరివిమాబ్, ఇమ్దెవిమాబ్ కాంబినేషన్లోని యాంటీబాడీస్ మందు వేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గురువారం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడారు. కోవిడ్ తొలిదశలో స్వల్ప, ఒక మోస్తరు లక్షణాలు ఉన్న వారిపైనే ఇది పనిచేస్తుందని, అయితే ఇది ఇచ్చాక త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఇంజెక్షన్ రూపంలో.. ప్రస్తుతం మన దగ్గర ఇంజెక్షన్ రూపంలో దీనిని ఇస్తున్నట్టు చెప్పారు. ఈ మందు తీసుకున్నాక ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం తగ్గిపోవడమే కాకుండా 70 శాతం వరకు మరణించే అవకాశాలు తగ్గి వైరల్ క్లియరెన్స్లోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రస్తుతం అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ఇండియాలో డబుల్ మ్యుటెంట్పై ఇది ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్న దానికి సంబంధించి వంద మందిపై నిర్వహిస్తున్న పరిశోధన ఫలితాలు నెలలో వెల్లడి అవుతాయని చెప్పారు. ఈ మందు తీసుకున్న వారికి కనీసం 3 నెలల ద్వారా వ్యాక్సిన్ వేయకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో తయారవుతున్న ఈ మందును సిప్లా కంపెనీ ద్వారా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. దీని ఫలితాల ఆధారంగా త్వరలోనే దేశీయంగా ఉత్పత్తి చేసే అవకాశముందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు కనీస బరువు 40 కిలోలు ఉన్న వారికి ఈ చికిత్సకు అనుమతిస్తారు. ఎవరెవరికి ఇవ్వొచ్చు.. 65 ఏళ్లు పైబడిన వారు. అనియంత్రిత మధుమేహం ఉన్న స్థూలకాయులు గుండెజబ్బులున్న వారు. ఇమ్యునో సప్రెషన్స్ తీసుకునే కేన్సర్, ఇతర జబ్బుల వారు. 55 ఏళ్లకు పైగా వయసున్న వారిలో అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి. -
నయంచేసే ఔషధాలే ఎదురు తిరిగితే..?
సాక్షి, హైదరాబాద్: వ్యాధులను నయం చేయాల్సిన ఔషధాలే ఎదురు తిరిగితే పరిస్థితేంటి..? యాంటీ బయోటిక్స్ అతి వాడకంతో ఇప్పుడు అలాంటి ప్రమాదమే మానవాళికి ముప్పుగా పరిణమించింది.. సూక్ష్మక్రిములు యాంటీ బయోటిక్స్కు లొంగకుండా తట్టుకునే శక్తిని పెంచుకుని మొండిగా తయారవుతుండటంతో చాలా రకాల వ్యాధులకు అత్యవసర మందులు కూడా పనిచేయకుండా పోతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) దీన్ని తీవ్ర విపత్తుగా గుర్తించింది. రెండేళ్ల పాటు 114 దేశాల్లో యాంటీ బయోటిక్స్ వాడకంపై క్షుణ్ణంగా సర్వే చేసి తొలిసారిగా ఒక సమగ్ర నివేదిక తయారు చేసింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘ప్రపంచ యాంటీబయోటిక్స్ అవగాహన వారం’సందర్భంగా అన్ని దేశాలను హెచ్చరిస్తూ సూచనలు చేసింది. మన దేశంలో అతి వినియోగం.. యాంటీ బయోటిక్స్ మందులు వాడినా తట్టుకొని నిలబడే సూక్ష్మక్రిముల వల్ల జబ్బులు తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచంలో ఏటా కోటి మంది చనిపోతారని హెచ్చరించింది. 2030 నాటికి యాంటీ బయోటిక్స్ పనిచేయని పరిస్థితి ఏర్పడటం, కుటుంబాల్లో ఎవరో ఒకరు చనిపోవడం తదితర కారణాలతో 2.40 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోతారని పేర్కొంది. విచ్చలవిడి యాంటీ బయోటిక్స్ వాడకంలో భారత్ ముందుంది. ఇక్కడ ఏటా లక్ష మంది వరకు చనిపోతున్నట్లు అంచనా. అందులో 58 వేల మంది చిన్నపిల్లలే. చదవండి: (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) వారిలో ఐదేళ్ల లోపు పిల్లలుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2050 నాటికి దేశంలో ఏటా 15 లక్షల మంది చనిపోతారని అంచనా. 2001–15 మధ్య మనదేశంలో కొన్ని రకాల యాంటీ బయోటిక్స్ వాడకం 8.5 మిలియన్ యూనిట్ల నుంచి 13.2 మిలియన్ యూనిట్లకు పెరిగిపోయింది. ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 14 యాంటీ బయోటిక్ మాత్రలు మింగుతున్నారని వైద్య నిపుణులు అంచనా వేశారు. 2014 నుంచి 24 రకాల యాంటీ బయోటిక్స్ మందులను సీడీఎస్సీవో హెచ్1 జాబితాలో చేర్చింది. అంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. కానీ, ఇష్టారీతిన వాడుతున్నారు. వ్యవసాయం, జంతువుల ద్వారా.. పశువులు, కోళ్లు, మేకల్లో వచ్చే బ్యాక్టీరియా సంబంధ వ్యాధులకు కూడా యాంటీ బయోటిక్ మందులనే వైద్యులు సూచిస్తారు. డాక్టర్లు ఇచ్చే యాంటీ బయోటిక్స్ మందులు నేరుగా మన శరీరంపై 30 శాతం మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. కానీ, వ్యవసాయంలో వాడే పురుగుల మందులు, రసాయన మందులు, కోళ్లు, గేదెలు, ఇతర జంతువులకు వాడే యాంటీ బయోటిక్స్, నీళ్లల్లో రసాయనాల ద్వారా యాంటీ బయోటిక్స్ నిరోధకతను పెంచుకుని 70 శాతం మనపై ప్రభావం చూపిస్తున్నాయి. జాతీయ పాల పరిశోధన సంస్థ పరిశోధన ప్రకారం.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సేకరించిన 44 పాల శాంపిళ్లలో 14 శాతం యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలింది. రాజస్తాన్లో సేకరించిన పాల శాంపిళ్లలోని ఇకోలి బ్యాక్టీరియా ప్రస్తుతం వాడకంలోని 70 శాతం యాంటీ బయోటిక్స్కు లొంగడం లేదు. పందుల్లో సేకరించిన 774 శాంపిళ్లు, బాతుల్లో సేకరించిన 74 శాంపిళ్లలోని బ్యాక్టీరియా 70 శాతం యాంటీ బయోటిక్స్కు లొంగడం లేదు. చేపలోని 82 శాంపిళ్లలోని విబ్రియా బ్యాక్టీరియా.. అందుబాటులో ఉన్న 90 శాతం సాధారణ యాంటీ బయోటిక్స్కు లొంగడం లేదు. సీడీడీపీ పరిశోధన ప్రకారం.. హైదరాబాద్లో ఫార్మసీ తయారీ ప్లాంట్లు ఎక్కువగా ఉండటంతో వాటి ద్వారా వచ్చే వృథా నీటి ప్రాసెసింగ్ ప్లాంట్ల సమీపంలో ఉన్న భూగర్భ, ఉపరితల నీళ్లల్లో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా అన్ని రకాల యాంటీ బయోటిక్స్ మన శరీరాల్లో చేరిపోతున్నాయి. (వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!) టీకాలే మేలు.. ఫ్లూ, న్యుమోనియా, రోటా వైరల్ డయేరియా, డిప్తీరియా, కోరింత దగ్గు, టైఫాయిడ్, మీజిల్స్ వంటివాటికి టీకాలున్నాయి. వాటిని ముందే ఇవ్వటం మంచిది. చేతి, నీటి, ఆహార శుభ్రత, టీకాలు, చక్కటి పోషకాహారం ఇవన్నీ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. యాంటీ బయో టిక్స్ వాడకంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఒక విధానమంటూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సూక్ష్మక్రిములు ప్రస్తుత యాంటీ బయోటిక్స్కు నిరోధకత పెంచుకోవటం వల్ల క్షయ, మలేరియా, గనేరియా, న్యుమోనియా, మూ త్రనాళ ఇన్ఫెక్షన్లు సమస్యలుగా పరిణ మిస్తున్నా యని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. శరీరంలో 10 కోటి కోట్ల బ్యాక్టీరియా మన శరీరంలో దాదాపు కోటి కోట్ల జీవ కణాలుంటే, దానికి పదింతలు ఎక్కువగా అంటే 10 కోటి కోట్ల బ్యాక్టీరియా కూడా మనలోనే ఉంటుంది. ముఖ్యంగా పేగుల్లో, చర్మం మీద, ముక్కులో, నోట్లో, ఊపిరితిత్తుల్లో ఇలా చాలా శరీరభాగాల్లో స్థిర నివాసం ఉంటాయి. వీటిలో చెడ్డవీ మంచివీ ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియా మనలోని రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండేలా చేస్తుంది. ఈ మంచి బ్యాక్టీరియా లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండటం కష్టం.. అయితే యాంటీ బయోటిక్స్ వేసుకున్నప్పుడు దాని ప్రభావానికి చెడు బ్యాక్టీరియానే కాదు, కొంత మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్ ఈ రెండు రకాల సూక్ష్మజీవులే అన్ని రకాల వ్యాధులకు కారణం. యాంటీబయోటిక్స్ కేవలం బ్యాక్టీరియాను మాత్రమే చంపగలవు. వైరల్ ఇన్ఫెక్షన్లను యాంటీబయోటిక్స్ పెద్దగా అదుపు చేయలేవు. ఈ విషయం తెలియక వైరల్ ఇన్ఫెక్షన్లైన జలుబు, ఫ్లూలకు యాంటీబయోటిక్స్ వాడేస్తుంటాం. ఇలా వాడటం వల్ల వైరస్ నశించకపోగా శరీరంలోని బ్యాక్టీరియా బలం పెరుగుతుంది. మరికొన్ని అంశాలు ►యాంటీ బయోటిక్స్ నిరోధకత పెంచుకోవడంతో చిన్నా చితకా జబ్బులకు కూడా మందుల్లేని పరిస్థితి ఏర్పడుతోంది. ►జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా యాంటీ బయోటిక్స్ వాడటం సాధారణమై పోయింది. ►తెలంగాణ గ్రామాల్లో అనర్హులైన అనేకమంది మెడికల్ ప్రాక్టీషనర్లూ ఉన్నారు. ప్రతి చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్ ఇవ్వడంతో పనిచేయక జబ్బులు ముదురుతున్నాయి. ►పంటలకు విచ్చలవిడిగా పురుగు మందులను చల్లుతున్నారు. కూరగాయలు, ధాన్య పు గింజలకూ వాడేస్తున్నారు. అటువంటి ఆహార పదార్థాలను తిన్నాక మనుషుల్లోనూ వాటి ఆనవాళ్లు ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలివే.. ►యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గించేందుకు దేశాలు జాతీయస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ► వ్యవసాయంలో పురుగు మందులను, పశువులకు ఇష్టారాజ్యంగా ప్రేరేపిత యాంటీ బయోటిక్స్ వాడకుండా చూసేందుకు ఒక పటిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ►యాంటీ బయోటిక్స్ అవసరం లేకుండా జలుబు లాంటి సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించే సహజ పద్ధతులను వైద్యులు రోగులకు సూచించాలి. హెచ్1 జాబితాలోని యాంటీ బయోటిక్స్ ఇవే.. 1) సెఫడ్రాక్సిల్ 2) సెఫజోలిన్ 3) సెఫ్డినిర్ 4) సెఫ్టజిడిమ్ 5) సెఫ్టిజోగ్జిమ్ 6) సిఫరోగ్జిమ్ 7) సిప్రోఫ్లోగ్జాసిన్ 8) క్లారిత్రోమైసిన్ 9) క్లిండామైసిన్ 10) కోట్రిమోక్సాజోల్ 11) గాటిఫ్లోక్సాసిన్ 12) అజిత్రోనామ్ 13) ఇస్పామిసిన్ 14) లివోఫ్లోక్సాసిన్ 15) లినజోలిడ్ 16) మెరోపినామ్ 17) మోక్సిఫ్లోక్సాసిన్ 18) నైట్రాజిపామ్ 19) నార్ఫ్లాక్సాసిన్ 20) ఒఫ్లాక్సాసిన్ 21) తొబ్రామైసిన్ 22) అమికాసిన్ 23) స్పార్ఫ్లోక్సాసిన్ 24) మినోసైక్లిన్ -
అధిక యాంటీబయాటిక్స్తో ఇన్ఫెక్షన్లు
ఆరోగ్యంపై బాగా అవగాహన పెరిగింది.. ప్రజలు సొంత ప్రయోగాలు చేస్తున్నారు.. శరీరంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మందుల షాపునకు వెళ్తున్నారు.. వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు.. కొందరు ఓ వారం వాడితే బాగుంటుందని ఉచిత సలహా.. దీంతో అలా వాడేస్తున్నారు.. ఇవే కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నాయి.. వీటిపై అవగాహన కోసం ప్రతి ఏడాదీ 13వ తేదీ వరల్డ్ సెప్సిస్ డే నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: విచ్చల విడిగా యాంటీబయాటిక్స్ వినియోగించడంతో పాటు వ్యాధి నివారణకు వాడాల్సినవి కాకుండా ఇతర యాంటీబయాటిక్స్ వాడడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అనేక మంది ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇన్ఫెక్షన్ల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి ఏడాది 7 నుంచి పది కోట్ల మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి మృతి చెందుతున్నట్లు అంచనా. ప్రతి 3.5 సెకన్లకు ఒకరు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది 2.70 కోట్ల నుంచి 3 కోట్ల మంది ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలుకొని, ఐదేళ్లలోపు పిల్లలు 60 లక్షల మంది ప్రతిఏడాది ఇన్ఫెక్షన్లతో చనిపోతున్నారు. లక్షణాలు.. సెప్సిస్ అనేది ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ.. బ్లడ్ కల్చర్, కార్బాఆర్, బయోఫయర్ టెస్ట్ల ద్వారా సెప్సిస్ వ్యాధిని నిర్ధారిస్తారు. అంటు వ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్ఫెక్షన్ల వలన పనిచేయడం మానివేసి రోగి ప్రాణాలు కోల్పోతాడు. రాజధాని జిల్లాల్లో బాధితులు గుంటూరు జిల్లాలో ఫిజీషియన్లు 120 మంది, కృష్ణా జిల్లాలో వంద మంది వైద్యనిపుణులు ఉండగా, ప్రతిరోజూ ఒక వైద్యుడి వద్దకు 20 మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి చికిత్స కోసం వస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్గా (సెప్సిస్) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. వ్యాధి సోకే భాగాలు ఇన్ఫెక్షన్లు నూటికి 50 శాతం ఊపిరితిత్తుల్లో వస్తాయి. తదుపరి కిడ్నీలు, బ్రెయిన్, యూరినరి ట్రాక్ట్, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. క్యాన్సర్ బాధితులు, షుగర్ బాధితులు, కాలిన గాయాల వారిలో, మేజర్ ట్రామా బాధితుల్లో, హెచ్ఐవీ బాధితుల్లో సూక్ష్మ క్రిముల ద్వారా ఈ వ్యాధి త్వరితగతిన ఎక్కువ మందిలో వ్యాప్తి చెందుతుంది. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్ని సార్లు ఆపరేషన్ల ద్వారా ఆగాయాలను తొలగించాల్సి వస్తుంది. పౌష్టికాహారం తీసుకోవాలి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఖనిజ లవణాలు, విటమిన్లు, కార్బోహైడ్రేడ్లు, అన్ని సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి. మరుగుదొడ్లు వినియోగించిన పిదప, భోజనానికి ముందు తప్పనిసరిగా కాళ్లు, చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రమైన వ్రస్తాలు ధరించడం, నిద్రించే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. యాంటీబయాటిక్స్ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి. –డాక్టర్ కోగంటి కల్యాణ చక్రవర్తి, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు -
తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా..!
సాక్షి, హైదరాబాద్ : తుమ్మినా, దగ్గినా యాంటీబయోటిక్స్ మందులు రాయడం చాలామంది డాక్టర్లకు పరిపాటైంది. ‘ఫ్లస్ వన్’అనే మెడికల్ జర్నల్ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం.. దేశంలో నాలుగేళ్లలోపు పిల్లల్లో ప్రతి వెయ్యిలో 636 మందికి యాంటీబయోటిక్స్ రాస్తున్నారని తేలింది. 10–19 ఏళ్ల వయసు వారికి అతి తక్కువగా వెయ్యిలో 280 మందికి ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు. మొత్తంగా దేశంలో యాంటీబయోటిక్ దుర్వినియోగం అధికంగా ఉందని తేల్చింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్లలో 33.2 శాతం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు రాయడం గమనార్హం. భారతదేశంలో రిటైల్ రంగంలో తలసరి యాంటీబయోటిక్ వినియోగం 22 శాతం పెరిగిందని అధ్యయనంలో తేలింది. భారతదేశంలో అధిక యాంటీబయోటిక్ వాడకానికి ప్రధాన కారణం అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలడమేనని తెలిపింది. వివిధ కారణాలతో చనిపోయే ఐదేళ్లలోపు పిల్లల్లో 50 శాతం మంది న్యుమోనియా, విరేచనాలు వంటి అంటువ్యాధుల కారణంగానే చనిపోతున్నారని తేల్చింది. అయితే ఈ యాంటీ బయాటిక్స్ కేవలం తీవ్రమైన అంటువ్యాధుల చికిత్సకు ఉద్దేశించినవి కావని తేలింది. యాంటీబయాటిక్స్ మందుల దుర్వినియోగం ప్రధానంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ఆసుపత్రులు, క్లినిక్లలో అధికంగా జరుగుతోందని అధ్యయనం తెలిపింది. పెద్ద నగరాల్లోని ఆసుపత్రుల్లో అంతగా ఉండట్లేదని పేర్కొంది. కాబట్టి కిందిస్థాయిలో నిఘా అవసరమని తేల్చింది. ఆ దేశాల కంటే తక్కువే అయినా.. వివిధ యూరోపియన్ దేశాల కంటే తక్కువగానే మన దేశంలో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారని అధ్యయనం తెలిపింది. భారత్లో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ రేటు వెయ్యి మందికి 412 ప్రిస్క్రిప్షన్లుగా ఉంది. ఇటలీలో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ రేటు వెయ్యి మందికి 957 ప్రిస్క్రిప్షన్లు, జర్మనీలో 561 ప్రిస్క్రిప్షన్లు, యూకేలో 555 ప్రిస్క్రిప్షన్లు, డెన్మార్క్లో 481 ప్రిస్క్రిప్షన్లుగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కొన్ని యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ల రేటు మన దేశంలో ఎక్కువ ఉందని తెలిపింది. యాంటీబయాటిక్స్ అనుచిత వాడకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, మన కేంద్రం పలు చర్యలు చేపట్టింది. యాంటీబయోటిక్స్ డిమాండ్ తగ్గించడానికి, సార్వత్రిక రోగనిరోధకత కోసం కొత్త టీకాలు ప్రవేశపెట్టింది. కానీ లక్ష్యాలను సాధించే విషయంలో పురోగతి అంతగా లేదని అధ్యయనం తెలిపింది. పని చేయని స్థితికి.. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్న తర్వాత క్రమంగా యాంటీబయోటిక్స్ అభివృద్ధి పెరిగింది. రకరకాల బాక్టీరియాను మట్టుబెట్టడం సులువైంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడం సులభతరమైంది. కానీ మన అలవాట్లు, నిర్లక్ష్యం వల్ల ఈ యాంటీబయోటిక్స్కు బాక్టీరియా తలొగ్గే పరిస్థితి లేకుండా పోతుంది. ఆయా మందులకు లొంగట్లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. న్యుమోనియా, టీబీ, రక్తంలో ఇన్ఫెక్షన్లు, గనేరియా లాంటి వ్యాధుల విషయంలో చికిత్స అనేది సవాలుగా మారింది. శక్తిమంతమైన యాంటీబయోటిక్ మందులు కూడా పనిచేయడం మానేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి సాధారణ ఇన్ఫెక్షన్లు సైతం ప్రాణాంతకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. మొదటి దశ యాంటీబయోటిక్స్ చికిత్స వల్ల ఫలితం లేనప్పుడు మరింత ఖర్చుతో కూడుకున్న సమర్థమైన యాంటీబయోటిక్స్ వాడాల్సి ఉంటుంది. యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం వల్ల చికిత్సా కాలం పెరుగుతుంది. అనారోగ్య బాధ పెరుగుతుంది. ఆసుపత్రుల్లో ఉండే కాలం పెరుగుతుంది. వైద్యం ఖర్చు పెరిగి కుటుంబాలు, సమాజాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు పెద్ద సవాలుగా నిలిచిన సమస్య యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ అని నిపుణులు అంటున్నారు. అవగాహన కల్పించాలి.. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ ఒక సామాజిక విషాదంగా మారింది. యాంటీబయోటిక్స్ లేని రోజుల్లో చిన్నపాటి జబ్బులు కూడా ప్రాణాంతకంగా మారేవి. కానీ అవే యాంటీబయోటిక్స్ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం వల్ల, అవసరమైనప్పుడు అసలు ఏ మందులూ పనిచేయని పరిస్థితి వస్తుంది. ఈ యాంటీబయోటిక్స్ హానికర అలర్జీలు, విరేచనాలు, గుండె జబ్బులు, కండరాల సమస్యలు వంటి దుష్ప్రభావాలు కలగజేస్తాయి. – డాక్టర్ ఆకుల సంజయ్రెడ్డి, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు -
సూపర్బగ్ల పని పట్టాల్సిందే!
సాంక్రమిక వ్యాధులపై మనిషి విజయం సాధించేశాడని, ఆరోగ్య రంగంలో సరికొత్త యుగం మొదలైనట్లేనని చాలామంది అంచనాలు కట్టారు. పెన్సిలిన్ బలం తగ్గిపోయిందన్న సూచనలు కనిపించినప్పుడు కొత్త కొత్త యాంటీబయాటిక్ల ఆవిష్కరణతో ఆ సమస్యను ఎదుర్కోగలిగాం. ఏఎంఆర్ (సూక్ష్మజీవులు పెన్సిలిన్ వంటి మందులను తట్టుకోగలగడం) అనేది ఆరోగ్య పరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పది అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏఎంఆర్ సమస్యల అటు భారత్తోపాటు ఇటు అమెరికాలోనూ తీవ్రంగానే ఉంది. అమెరికాలో ఏటా సుమారు 28 లక్షల కేసులు నమోదవుతూండగా యాంటీబయాటిక్ల వాడకంలోనూ ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్లోనూ పరిస్థితి దాదాపుగా ఇంతే. బూజుపట్టిన ఓ పుచ్చకాయ లక్షల మంది ప్రాణాలు నిలబెడుతుందని ఎవరనుకున్నారు! కానీ ప్రపంచంలోనే తొలి యాంటీబయాటిక్ పెన్సిలిన్ చేసిన పని అచ్చంగా ఇదే. బ్రిటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను 1928లోనే కనుక్కున్నప్పటికీ.. 1942లో ఓ పుచ్చకాయకు పట్టిన బూజులోంచి దీన్ని వేరు చేసి ఇబ్బడిముబ్బడిగా తయారు చేయడంతో రెండో ప్రపంచ యుద్ధంలో వేలాదిమంది సైనికుల ప్రాణాలు దక్కాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో మాదిరిగా గాయాల కంటే సాంక్రమిక వ్యాధుల కారణంగా ఎక్కువ మరణాలు జరక్కుండా అడ్డుకోగలిగింది ఈ అద్భుత ఔషధం. అంతేకాదు... న్యూమోనియా, చర్మవ్యాధుల సమస్య గణనీయంగా తగ్గిపోయాయి. సాంక్రమిక వ్యాధులపై మనిషి విజయం సాధించేశాడని ఆరోగ్య రంగంలో సరికొత్త యుగం మొదలైనట్లేనని చాలామంది అంచనాలు కట్టారు కూడా. పెన్సిలిన్ బలం తగ్గిపోయిందన్న సూచనలు కనిపించినప్పుడు కొత్త కొత్త యాంటీబయాటిక్ల ఆవిష్కరణతో ఆ సమస్యను ఎదుర్కోగలిగాం. ఆ ధైర్యంతోనే కాబోలు... 1985లో అమెరికా సాంక్రమిక వ్యాధుల సొసైటీ వార్షిక సదస్సులోనూ ఈ అంటువ్యాధులకు సంబంధించిన నిపుణుల అవసరమేమిటన్న ప్రశ్న కూడా చర్చకు వచ్చింది. ప్రాణాలు నిలబెట్టిన మందులు పనిచేయవు అయితే... 35 ఏళ్లలోనే పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ప్రాణాలు నిలబెట్టిన మందులు అసలు పనిచేయవన్న కొత్త వాస్తవం కళ్లముందు నిలిచింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్... క్లుప్తంగా ఏఎంఆర్ (సూక్ష్మజీవులు పెన్సిలిన్ వంటి మందులను తట్టుకోగల గడం) అనేది ఆరోగ్య పరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పది అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం పరి స్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సూపర్బగ్లు ఇప్పటికే ఏఎంఆర్ ఏటా 2,14,000 మంది శిశువులను బలిగొంటూండగా.. ఇతరులను కబళించవన్న గ్యారెంటీ ఏమీ లేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాల్లేకుండా అందరూ ఈ సూపర్బగ్ మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది. తగిన చర్యలు తీసుకోకపోతే చిన్నపాటి ఇన్ఫెక్షన్లకే ప్రాణాలు కోల్పోయిన పాతకాలంలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. సింపుల్గా చెప్పాలంటే... మనం యాంటీబయాటిక్లనే అతి విలువైన వనరును చాలా అజాగ్రత్తగా వాడుతున్నామని చెప్పాలి. అవసరమున్నా లేకపోయినా ఎడా పెడా వాడేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విచ్చలవిడి వాడకానికి కూడా కొన్ని అపోహలే కారణం. వైరస్లపై యాంటీబయాటిక్ల ప్రభావం ఉండదన్నది వాస్తవం కాగా.. వాటితో వచ్చే జలుబుకు మందులు వాడటం ఇలాంటిదే. ఇలాంటి అపోహల కారణంగానే... యాంటీబయాటిక్లను అనుచితంగా వాడటం, ఎక్కువగా వాడటం జరగుతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న యాంటీబయాటిక్లలో సగం అనవసరమని అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు చెబుతున్నాయి. జంతువులకూ ఈ మందులు ఎక్కించడం చాలా ఎక్కువగా జరుగుతోంది. యాంటీబయాటిక్ మందుల ప్రభావాన్ని కాపాడుకుంటే లక్షలమంది ప్రాణాలు కాపాడుకోవచ్చుగానీ.. వీటిని చాలా వరకూ ఆహారంగా ఉపయోగపడే జంతువుల్లో వాడటం ఆందోళన కలిగించే అంశం. పైగా ఇన్ఫెక్షన్లకు చికిత్సగా వాడకుండా.. జంతువులు వేగంగా ఎదగాలన్న ఆలోచనలతో ఈ మందులు వాడటం ప్రమాదకరం కూడా. నలభై ఏళ్లుగా కొత్త యాంటీబయాటిక్ మందులేవీ అందుబాటులోకి రాని నేపథ్యం ఈ అంశానికి ప్రాధాన్యత పెంచుతోంది. చేయి కలపాల్సిన తరుణమిదే... ఏఎంఆర్ సమస్యలు అటు భారత్తోపాటు ఇటు అమెరికాలోనూ తీవ్రంగానే ఉంది. అమెరికాలో ఏటా సుమారు 28 లక్షల కేసులు నమోదవుతూండగా యాంటీబయాటిక్ల వాడకంలోనూ ఈ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్లోనూ పరిస్థితి దాదాపుగా ఇంతే. ఇక్కడ కూడా ఇతర దేశాలన్నింటితో పోల్చినా సగటు యాంటీబయాటిక్ల వాడకం ఎక్కువే. అందుకే ఈ పరిస్థితి ఇరు దేశాలకూ ఓ జటిలమైన సవాలే. ఇరు దేశాలూ తమ తమ శక్తి సామర్థ్యాలను కలిపి వాడితేనే ఈ సమస్య పరిష్కారానికి ఓ మార్గం లభించే అవకాశముంది. సాంక్రమిక వ్యాధుల పర్యవేక్షణ, కొత్త కొత్త మందులను ఆవిష్కరించడంలో అమెరికా ముందువరసలో ఉంటే.. భారత్కు తన ఫార్మా రంగం, పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ బలాలు. వీటి సాయంతో ఏఎంఆర్ సమస్యను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికాలు ఇప్పటికే వేర్వేరు మార్గాల్లో కృషి చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్లను నియంత్రించడం, ఏఎంఆర్ ఇన్ఫెక్షన్ల కోసం భవనాలను నిత్యం పరిశీలిస్తూండే వ్యవస్థల ఏర్పాటు, ఈ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలకు ప్రోత్సాహకాలు, కొత్త యాంటీమైక్రోబియల్స్ అభివృద్ధికి ఆర్థిక సాయం వీటిల్లో మచ్చుకు కొన్నే. ఏఎంఆర్ సమస్యపై పరిశోధన చేసేందుకు విధాన రూపకల్పనకు ఇటీవలే కోల్కతాలో ఓ కొత్త కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఏఎంఆర్పై పోరులో అమెరికా ఎల్లప్పుడూ భారత్కు సహకరిస్తుందని స్పష్టం చేశాను. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతోపాటు, భారత వైద్య పరిశోధనల సమాఖ్య, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని కూడా చెప్పాను. మీరు చేయాల్సిందీ ఉంది... యాంటీబయాటిక్ మందులను తట్టుకోగల సూక్ష్మజీవులను ఎదు ర్కొనేందుకు ప్రభుత్వాలు మాత్రమే పనిచేస్తే సరిపోదు. ప్రభుత్వాలు వ్యవస్థల స్థాయిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూంటాయి. ప్రజలందరూ వ్యక్తిగత స్థాయిలోనూ తమదైన రీతిలో సహకరిస్తేనే సమస్య సమసే అవకాశం ఉంటుంది. యాంటీబయాటిక్లు తీసుకునేముందు వైద్యులను సంప్రదించడం వ్యక్తులుగా మనం చేయగల అతిచిన్న పని. అంతేకాదు.. ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడమూ ముఖ్యమే. అవసరమైనప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గు వస్తే... చేతులు అడ్డుపెట్టుకోవడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తే చాలు. సమస్య మరింత ముదరకుండా చూసుకోవచ్చు. మరోవైపు వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు కూడా తమదైన రీతిలో ఏఎంఆర్ నిరోధానికి సాయపడవచ్చు. ఇన్ఫెక్షన్లను నియంత్రించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వీటిల్లో ఒకటైతే... సాంక్రమిక వ్యాధులకు సంబంధించి గుర్తింపు పొందిన చికిత్స మార్గదర్శకాలను మాత్రమే అనుసరించడం మరోటి. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్లు తీసుకోవాల్సిందిగా రాసివ్వడాన్ని వీలైనంత మేరకు తగ్గించాల్సి ఉంది. కొన్ని రకాల సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కొన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందరూ ఉపయోగించేలా చేయడం ద్వారా యాంటీబయాటిక్ మందుల వాడకాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించవచ్చు. పశువుల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు పశువుల్లో ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు మాత్రమే యాంటీబయాటిక్లను వాడాలి. ఇది కూడా పశువైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. అంతేగానీ... అవి వేగంగా కండపడతాయనో, దిగుబడి ఎక్కువ అవుతుం దనో వాడరాదు. ఇలాంటి చర్యల వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువని గుర్తించాలి. ఫార్మా రంగం పరిశోధనలను ముమ్మరం చేసి కొత్త యాంటీబయాటిక్లు ఆవిష్కరించగలిగితే సమస్యను మరింత వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. సమయం మించిపోయిన యాంటీబయాటిక్ మందులను తగిన రీతిలో వదిలించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏఎంఆర్ సమస్యను వ్యక్తులుగానే కాదు.. అందరం సమష్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అంశంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఇరుదేశాల సంబంధాలకు ప్రతీకగా ఉండాలి. చేయి చేయి కలిపితే ఏం చేయగలమో నిరూపించే అవకాశమిది. ఇది మన రెండు దేశాల కోసం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికి కూడా! కెన్నెత్ ఐ జస్టర్ వ్యాసకర్త భారత్లో అమెరికా రాయబారి -
ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!
మనం రోజూ తినే ఇడ్లీలు, దోసెలు, రోజూ తాగే మజ్జిగ కూడా మందులా ఉపయోగపడతాయంటే నమ్మగలరా? ఎన్నోరకాల జబ్బుల్నీ నయం చేస్తాయి కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పూర్తిగా వాస్తవం. అలాగే కాద్దిసేపు వదిలేస్తే పులవడానికి అవకాశమున్న ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్ అని పిలుస్తాం. ప్రోబయోటిక్స్ ఇచ్చే సందర్భాలు... యాంటీబయాటిక్స్ వాడినప్పుడు: డాక్టర్లు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రయిబ్ చేసినప్పుడు అవి మనలోని హాని చేసే సూక్ష్మజీవులతో పాటు మేలు చేసేవాటినీ చంపేస్తాయి. దాంతో మనలో కొన్ని రకాల సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అంటే కడుపులో గ్యాస్ పెరగడం, మజిల్ క్రాంప్స్, డయేరియా వంటివి. మనలో ఉండే ప్రోబయాటిక్స్ మన దేహానికి అవసరమైన కొన్ని విటమిన్లు స్వాభావికంగానే అందేలా చేస్తాయి. అయితే యాంటీబయాటిక్స్ కారణంగా విటమిన్లు కూడా అవసరమైన మేరకు అందని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఈ పరిణామాన్ని నివారించడానికి యాంటీబయాటిక్స్తో పాటు కొన్ని విటమిన్లు, ప్రోబయాటిక్స్ డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. డయేరియాతో బాధపడేవారికి: కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా నీళ్ల విరేచనాలు అవుతున్నవారికి సైతం ప్రో–బయాటిక్స్ ఇస్తారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): ఈ సమస్య ఉన్నవారిలో విరేచనం సరిగా కాదు లేదా అదేపనిగా విరేచనాలు కావచ్చు. తిన్న వెంటనే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి ప్రో–బయాటిక్స్ బాగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్: అల్సరేటివ్ కొలైటిస్ లేదా క్రోన్స్ డిజీస్ ఉన్నవారికి ప్రో–బయాటిక్స్ మేలు చేస్తాయి. హెలికోబ్యాక్టర్ పైలోరీ: కొందరిలో పేగులో పుండు పడి, పేగుకు రంధ్రం పడేలా చేసే హెలికోబ్యాక్టర్ పైలోరీ కారణంగా కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సైతం ప్రో–బయాటిక్స్ మంచి మేలు చేస్తాయి. ఇడ్లీ, దోసె, మజ్జిగలు మందెలా అవుతాయంటే... మన చుట్టూ సూక్ష్మజీవులైన అనేకరకాల బాక్టీరియా ఉంటుంది. మన చుట్టే కాదు.. మన చర్మంపైనా, నోట్లో, గొంతులో, మన జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. ఇలా మన జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా మన ఆహారాలు జీర్ణం కావడానికి ఉపయోగపడటంతో పాటు కొన్ని రకాల వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయన్నమాట. మన ఆహార సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో–బయాటిక్స్ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీపిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ వాయి దింపుతాం. మన దక్షిణభారతీయులు ఇడ్లీ, దోసె తింటే... గుజరాత్ వంటి చోట్ల ధోక్లా అనే వంటకాన్ని కూడా పిండి పులిసే వరకు ఉంచి చేసుకుంటారు. డాక్టర్ శరత్ చంద్ర జి. మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్గూడ, హైదరాబాద్. -
మొండి రోగాల ముప్పు!
వచ్చిన జబ్బేమిటో, దాని తీవ్రత ఎంతో తెలియకపోయినా ఇష్టానుసారం మందులు మింగే అల వాటు మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించిందని, మొండిరోగాలు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ బృందం (ఐఏసీజీ) సోమవారం చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కలిగించాలి. బ్యాక్టీరియా వల్లనో, వైరస్వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో ఏదైనా వ్యాధి సోకినప్పుడు శరీరతత్వాన్నిబట్టి స్పందన ఉంటుంది. ఏ కారణంగా నలత ఉందో, దాన్ని అరికట్టడానికి ఏ మందు ఏ మోతాదులో, ఎలా వాడాలో వైద్య నిపుణులు చెప్పాలి. కానీ ఎవరినీ సంప్రదించకుండా, మందుల దుకాణంలో లక్షణాలు చెప్పి గోలీలు కొనుక్కుని వాడే ధోరణి మన దేశంలోనే కాదు... ప్రపంచమంతటా పెరిగిపోయింది. దానికి తోడు ఆసుపత్రులు కాసుపత్రులుగా మారాక అవసరమున్నా లేకున్నా వైద్యులే మందులు అంటగడుతున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల మొండి రోగాలు విస్తరించి 2030నాటికి అల్పాదాయ దేశాల్లో దాదాపు రెండున్నర కోట్లమంది తీవ్రమైన పేదరికం బారిన పడతారని, దానివల్ల ఆర్థిక వ్యవస్థలు ధ్వంస మవుతాయని ఐఏసీజీ హెచ్చరిస్తోంది. మన దేశంతోసహా 71 దేశాల్లో గణాంకాలు సేకరించి విశ్లేషిం చాక ఇందులో మూడోవంతు దేశాల్లో వ్యాధికారక క్రిములు మందులకు లొంగని రీతిలో తయా రయ్యాయని తేలిందని అంటోంది. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న మన దేశంలో అసలు ఔషధాల వాడకం ఎలా ఉందో, అందులోని గుణదోషాలేమిటో ఆరా తీసే వ్యవస్థ సక్రమంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే. కొన్నేళ్లక్రితం ఏ మందులకూ లొంగని అత్యంత శక్తిమంతమైన కొత్త బ్యాక్టీరియా పుట్టు కొచ్చిందని కనుక్కున్నప్పుడు దానికి ‘న్యూఢిల్లీ సూపర్బగ్’ అని పేరుపెట్టారు. పేరు గురించిన వివాదం సంగతి పక్కనబెడితే ‘ఇ–కొలి’ అనే అసాధారణ బ్యాక్టీరియాలో కొత్త జన్యువు బయల్దేరి దాన్ని మొండి ఘటంగా మార్చిందని ఆ పరిశోధన ద్వారా కనుక్కున్నారు. అశాస్త్రీయంగా, విచ్చలవి డిగా మందులు మింగడం వల్లే ఈ ‘సూపర్బగ్’ పుట్టుకొచ్చిందని నిర్ధారించారు. ఇన్ఫెక్షన్లు ఏర్ప డినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి నిర్దిష్టమైన మోతాదులో మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మోతాదు ఎక్కువైనా, తక్కువైనా రోగికి ముప్పు కలిగించడమే కాదు... ఆ రోగకారక క్రిమి మరింత శక్తి సంతరించుకుని చుట్టూ ఉన్న అనేకమందికి సోకుతుంది. అటుపై దాన్ని అరికట్టడం అసాధ్య మవుతుంది. అంటురోగాలను నివారించడానికి పెన్సిలిన్ కనుగొన్నప్పుడు అందరూ సంబరప డ్డారు. కానీ రెండు దశాబ్దాలు గడిచేసరికల్లా వ్యాధికారక బ్యాక్టీరియా పెన్సిలిన్ను తట్టుకునే విధంగా వృద్ధి చెందింది. మన దేశంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీ బయాటిక్ మందుల విక్రయాలపై ఎవరికీ అదుపు లేదు. వైద్యుల చీటీ ఉంటే తప్ప కొన్ని మందులు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించేవారుండరు. అది అమలవుతున్నదో లేదో చూసే వ్యవస్థ సక్రమంగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, అతిసార వంటి వైరస్ కారక జబ్బులకు చాలా సందర్భాల్లో అసలు యాంటీ బయాటిక్స్ అవసరమే ఉండదని, వాటంతటవే దారికొస్తా యని అంటారు. కానీ సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రీయంగా ఆలోచించే ధోరణి కొరవడటం, వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉండటం వగైరా కారణాల వల్ల వైద్యులు అయినదానికీ, కానిదా నికీ రోగులతో ఔషధాలు వాడిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరుగా ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్ను మొదట్లోనే అంటగడుతున్నారు. ఈ సంగతిని రెండేళ్లక్రితం యునిసెఫ్ నివేదిక వెల్ల డించింది. సక్రమంగా మందులు వాడకపోవడం వల్ల లేదా మోతాదుకుమించి మింగడం వల్ల ఏటా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో లెక్కేసే విధానమే మన దేశంలో లేదు. కనుక దాన్ని అరికట్టడ మనే ఆలోచనే ఉండటం లేదు. మెరుగైన, ప్రామాణికమైన వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పుడే ఔషధాల వాడకం ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. అదొక్కటే కాదు...దీనితో ముడిపడి ఉండే ఇతర సమస్యలపై సైతం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశు భ్రమైన తాగునీటి లభ్యత, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. వాటికి పౌష్టికాహారలోపం తోడవటంతో వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. ఈ స్థితిలో జబ్బును అరికట్టడానికి అవసరమైన మోతాదులో మందుల వినియోగం కొరవడితే చెప్పేదేముంది? ఔషధ నిరోధకతను అరికట్టడానికి రెండేళ్లక్రితం భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఆచ రణలో అది సరిగా అమలు కావడం లేదు. కొన్ని ఔషధాలను నిషేధించడం, మరికొన్ని ఔషధాల విక్రయంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం చాలవన్నది ఐఏసీజీ భావన. ఔషధ నిరోధకత ఏ స్థాయిలో ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఔషధ నిరోధకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇప్పటికే 7 లక్షలమంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకుంటుందని ఐఏసీజీ అంచనా వేస్తోంది. మన దేశంలో సగటున ప్రతి వేయిమందిలో రోజూ యాంటీబయాటిక్స్ వాడే అలవాటు 63 శాతం పెరిగిందని నిరుడు ఒక అధ్యయనం తెలియజేసింది. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తున్నదని వెల్లడైంది గనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే ప్రణాళికలు రచించి మందుల వినియోగంపై వైద్యులు, ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సుల వరకూ అందరికీ అవగాహన కలిగించాలి. విస్తృత ప్రచారోద్యమాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో జబ్బుపడినవారెవరికైనా నాణ్యమైన చికిత్స అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఔషధ నిరోధకత ముప్పునుంచి తప్పించుకోగలం. -
పాపకు పదే పదే చెవి నొప్పి...తగ్గేదెలా?
మా పాప వయస్సు ఐదేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందన్నారు. తగ్గిపోయాక ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మళ్లీ ఇలా వచ్చే అవకాశం ఉందా? మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనుసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం (బ్లాక్ కావడం), నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. బాబుకు ఛాతీలో నెమ్ముఏంచేయాలి? మా బాబు వయసు రెండేళ్లు. వాడు ఛాతీలో నెమ్ము సమస్యతో బాధపడుతున్నాడు. యాంటీబయాటిక్స్ ఇప్పించాం. నెమ్ము రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. మీ బాబుకు ఉన్న కండిషన్ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా నిమోనియా కనిపించవచ్చు. కేవలం ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే సమూహాలుగా జనం (క్రౌడ్స్) ఉన్న ప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. అలాగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి దూరంగా ఉంచాలి ∙పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) అవసరం. పాప నోట్లో ఏమిటీ మచ్చలు? మా పాప వయసు పదేళ్లు. ఆమెకు తరచూ నాలుక మీద, పెదవుల మీద, దవడ భాగాల్లో పుండ్లు వస్తున్నాయి.ఆమె నాలుకపైన ఎర్రటి మచ్చల్లా వచ్చి తాను ఏమీ తినలేకపోతోంది. ఇవి రావడానికి కారణం ఏమిటి? ఇది ఏమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా? సరైన సలహా ఇవ్వండి. మీ పాపకు ఉన్న సమస్యను ఏఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి కొందరిలో పదే పదే వస్తూ ఉండవచ్చు. ఇది చాలా సాధారణంగా, తరచూ చూసే నోటి సమస్యల్లో ఒకటి. ఈ అల్సర్స్కు నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా... అలర్జీ, ఇమ్యూనలాజికల్ సమస్యలు, హెర్పిస్, రసాయనాల వల్ల నోరు కాలడం, వేడి వేడి ఆహారం తీసుకోవడంతో నోరు కాలడం, నోటిలోని మృదువైన కణజాలంలో అయ్యే గాయాల వల్ల, కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వల్ల కూడా ఈ రకమైన నోటి అల్సర్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ పుండ్లు 5 నుంచి 10 రోజుల పాటు ఉండి, వాటికవే నిదానంగా తగ్గుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బెంజోకైన్ లేదా లిడోకైన్ వంటి ద్రావకాలను స్థానికంగా పూయడం, సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే పుండ్లపై పూతమందుల రూపంలో లభ్యమయ్యే స్టెరాయిడ్స్ పూయడం, కొన్ని సందర్భాల్లో సరైన యాంటీబయాటిక్స్ వాడటం కూడా జరుగుతుంది. అలాగే వ్యక్తిగత నోటి పరిశుభ్రత పాటించడం కూడా చాలా ప్రధానం. ఇక మీ పాపకు సంబంధించిన మరో సమస్య విషయానికి వస్తే... నాలుక మీద మచ్చలు మచ్చలుగా రావడాన్ని ‘జియోగ్రాఫికల్ టంగ్’ అని అంటారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా వస్తూ... కొన్ని గంటలు లేదా రోజుల్లో మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఒత్తిడి వల్ల, కారంగా ఉండే ఘాటైన ఆహారాల వల్ల మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యకు నిర్దిష్టమైన చికిత్స ఏదీ అవసరం లేదు. కాకపోతే ఘాటైన కారంతో ఉన్నవీ, మసాలాలతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండి, నోటి పరిశుభ్రత పాటించాలి. సమస్య మరీ తీవ్రమైతే ఒకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియా ట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
అమ్మ కావాలని ఉందా?
అమ్మ కావడం చాలామందికి సులువు. కొందరిలో సమస్య ఉంటుంది.ఎదురుచూపు ఉంటుంది.అడ్డంకులు ఏమిటో బోధ పడవు.వైద్య సహాయానికి వెళితే సమస్య ఏమిటో తెలుస్తుంది.అది గర్భాశయంలో లోపం కావచ్చు, ట్యూబుల్లో అడ్డంకి కావచ్చు,ఫలదీకరణ సమస్య కావచ్చు, మానసిక ఒత్తిడీ కావచ్చు.డాక్టర్ని కలవండి. అవగాహన పెంచుకోండి. ఆనందంగా మాతృత్వపు మాధుర్యం అనుభవించండి. గత వారం సంతానలేమి తాలూకు కొన్ని అంశాల గురించి చర్చించాం. ‘అండాల విడుదలలో ఎదురయ్యే సమస్య’ గురించి, వాటికి పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మహిళల్లో సంతానలేమికి కారణమయ్యే మరికొన్ని అంశాల గురించి విపులంగా తెలుసుకుందాం. గర్భాశయంలో లోపాలు సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకు ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. ఉదాహరణకు... గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే మ్యూకస్ స్రావాలు మరీ చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోనిలోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉండటం వల్ల అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి. కొంతమందిలో సర్విక్స్ దగ్గర వీర్యకణాలకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ–స్పెర్మ్ యాంటీబాడీస్ ఉంటాయి. అవి వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోకి వెళ్లనివ్వవు. మరికొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడ్డుపొరలు (యుటెరైన్ సెప్టమ్) వంటి సమస్యలు ఉండటం వల్ల... అవి ఉన్న స్థితి (పొజిషన్), పరిమాణం (సైజు) వంటి అంశాలు గర్భధారణకు అడ్డుగా నిలవవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సమస్య తీవ్రతను బట్టి గర్భం దాల్చడం కష్టం కావచ్చు. పరీక్షలు/చికిత్స: స్పెక్యులమ్, వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా యోని, సర్విక్స్ భాగంలో ఉండే ఇన్ఫెక్షన్, పూత, గీరుకుపోయినట్లుగా అయ్యే పుండు (ఎరోజన్), సర్వైకల్ పాలిప్ వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే పాప్స్మియర్ పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. కేవలం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడటం వల్ల సమస్య సమసిపోతుంది. దీంతో పుండు తగ్గకపోతే అప్పుడు క్రయోకాటరీ (ఐస్ ట్రీట్మెంట్) చికిత్స అవసరమవుతుంది. పాలిప్ (కండపెరగడం) వంటి సమస్యలు ఉంటే, వాటిని శస్త్రచికిత్సతో తొలగించాలి. గర్భాశయ ముఖద్వారం కొందరిలో మరీ సన్నగా (సర్వైకల్ స్టెనోసిస్) ఉన్నప్పుడు దానిని డీ అండ్ సీ అనే చిన్న ప్రక్రియ ద్వారా వెడల్పుచేయడం వల్ల ఉపయోగం ఉండవచ్చు. ఇన్ఫెక్షన్, పూత, పుండు ఉన్నప్పుడు సర్విక్స్లో స్రవించే ద్రవాలు సరిగా లేకపోవడం వల్ల చికిత్స తీసుకున్నా గర్భం రాకపోతే ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) అనే పద్ధతి ద్వారా వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపడం జరుగుతుంది. పెల్విక్ స్కానింగ్ చేయడం వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ వంటి అనేక సమస్యలు తెలుస్తాయి. అవసరమైతే 3డీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి, సమస్య తీవ్రతను నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలను నిర్ధారణ చేసి, అదే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేయవచ్చు. లేదా పాత పద్ధతుల్లోనే పొట్టను కట్ చేయడం ద్వారా సర్జికల్ పద్ధతిలో వాటిని తొలగించవచ్చు. ఇక హిస్టరోస్కోప్ ద్వారా గర్భాశయం లోపలి పొరలో ఉండే పాలిప్స్, సెప్టమ్ (అడ్డుపొర), అడ్హెషన్స్ (అతుకులు), సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలను నిర్ధారణ చేసుకొని, వాటిని తొలగించవచ్చు. ఇలా గర్భధారణకు అడ్డుపడే అంశాలను కనుగొని, వాటిని తొలగిస్తే గర్భం దాల్చడానికి అవకాశాలు పెరుగుతాయి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే...: అన్ని రకాల ఫైబ్రాయిడ్స్ను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్స్ గర్భాశయ పొరలో ఉన్నప్పుడు (సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) వాటిని తొలగించాల్సి వస్తుంది. గర్భాశయ కండరాల్లో ఉన్నవి (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) 5 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండి, సర్విక్స్ భాగంలో ఉండి, వీర్యకణాలను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుపడటం, పిండం పెరగకుండా చేయడం వంటి సమస్య ఏర్పడుతున్నప్పుడు మాత్రమే వాటిని తొలగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న ఫైబ్రాయిడ్లు, గర్భాశయం బయటకు ఉన్నవీ (సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్) గర్భం రావడానికి పెద్దగా అడ్డుపడకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటికి ఆపరేషన్ కచ్చితంగా చేయాలని ఏమీలేదు. ఎండోమెట్రియాసిస్ సమస్య ఉన్నప్పుడు, కొందరిలో గర్భాశయం లోపలిపొర (ఎండోమెట్రియమ్) కడుపులోకి వెళ్లడం, మరికొందరిలో గర్భాశయం బయటా, అండాశయం పైనా, ఇలా పలుచోట్ల అతుక్కొని నెలనెలా రుతుస్రావం సమయంలో లోపలివైపున రక్తస్రావం అయి, అక్కడ అండాశయంలో చాక్లెట్ సిస్ట్లూ, ట్యూబ్స్, గర్భసంచి, పేగులు... ఇలా అన్నీ అంటుకుపోయి అండం నాణ్యత, విడుదలలో, ఫలదీకరణలో ఇబ్బందులు ఏర్పడి, గర్భం రాకపోవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు అండాశయం నుంచి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ట్యూబ్లను ఫెలోపియన్ ట్యూబ్లు అంటారు. అండం అండాశయం నుంచి ఈ ట్యూబ్లలోకి చేరుతుంది. యోని నుంచి శుక్రకణాలు, గర్భాశయంలోనుంచి ట్యూబ్లలోకి చేరుతాయి. అండం, శుక్రకణంతో కలిసి, ట్యూబ్లో పిండంగా మారాక అది గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొరలోకి చేరిపోయి, శిశువుగా పెరుగుతుంది. గర్భం దాల్చడంలో ఫెలోపియన్ ట్యూబ్లు కూడా కీలకమైన భూమిక పోషిస్తాయి. అందుకే ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు కూడా గర్భం రావడంలో అవరోధాలు కలిగిస్తాయి. గర్భాశయం నుంచి లేదా పొట్టలోని పేగుల నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఫెలోపియన్ ట్యూబ్స్కి చేరి వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేయడం వల్ల వాటి పనితీరు తగ్గుతుంది. అప్పుడు ట్యూబ్స్ వాయడం, తర్వాత అవి మూసుకుపోవడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రావడంతో పాటు కడుపులో ఏదైనా అపరేషన్ జరిగి ఉంటే ఆ కారణంగా, లేక ఎండోమెట్రియోసిస్తో కొందరిలో అతుకులు (అడ్హెషన్స్) ఏర్పడటం వల్ల ట్యూబ్స్ అండాశయాలకు దూరంగా జరుగుతాయి. దాంతో అండం ట్యూబ్లోపలికి ప్రవేశించదు. నిర్ధారణ ఇలా: ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి ఉన్నాయా లేదా తెరచుకుని ఉన్నాయా తెలుసుకోడానికి హిస్టరోసాల్పింగోగ్రామ్ (హెచ్ఎస్జీ) అనే ఎక్స్రే లేదా సోనోసాల్పింగోగ్రామ్ (ఎస్ఎస్జీ) అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో పరీక్ష చేసినప్పుడు పొట్టకండరం బిగుసుకుపోవడం వల్ల ట్యూబ్స్ బిగుసుకుపోయినట్లయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయని (అడ్డంకులు ఏర్పడ్డాయని) తప్పుడు రిపోర్ట్ రావచ్చు. చికిత్స: ట్యూబ్స్ మూసుకుపోయి ఉంటే, దాన్ని నిర్ధారణ చేసుకోడానికి లాపరోస్కోపీ ప్రక్రియలో డై–టెస్ట్ చేస్తారు. ఇందులో అడ్డంకి (బ్లాక్) ఎక్కడుందో చూసి, హిస్టరోస్కోపీ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్ కాన్యులేషన్ అనే ప్రక్రియతో దాన్ని తెరవడానికి ప్రయత్నించవచ్చు. ఇది కొందరికి ఉపయోగపడుతుంది. కొందరిలో సత్ఫలితం ఇవ్వకపోవచ్చు. కొందరిలో ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరి (హైడ్రో సాల్పింగ్), అవి వాచి, మూసుకుపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చికిత్స చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కారణం... ట్యూబ్స్ పాడైపోయి, వాటి పనితీరు సరిగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో గర్భం వచ్చినా అది ట్యూబ్స్లో ఇరుక్కుపోయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు ట్యూబ్స్లో కనీసం ఒక్కటైనా తెరచుకొని ఉంటే గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్యూబ్స్ రెండూ మూసుకుపోయినప్పుడు, అలాంటివారిలో గర్భం కోసం ఐవీఎఫ్ (టెస్ట్ట్యూబ్) పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. కొందరిలో ఐవీఎఫ్కు వెళ్లేముందు ట్యూబ్స్లో హైడ్రోసాల్పింగ్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే, ట్యూబ్స్ను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే దానిలోనుంచి వచ్చే ద్రవం పిండం గర్భాశయంలో అతుక్కోకుండా చేస్తుంది. మానసిక కారణాలు మహిళల్లో కనిపించే మానసిక ఒత్తిడి అంశం కూడా గర్భధారణపై చాలావరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు, గర్భం రాలేదని బంధువుల, ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు, మానసిక వ్యథ వంటి కారణాల వల్ల గర్భధారణకు మొదటి నుంచీ అవసరమైన హార్మోన్ల విడుదలలో అసమతౌల్యత ఏర్పడి అండం విడుదల కాదు. అలాగే ఫలదీకరణ, ఇంప్లాంటేషన్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇలాంటి వారికి బయట నుంచి ఎన్ని మందులు ఇచ్చినా, లోపల విడుదల కావాల్సిన హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల గర్భం రావడంలో ఆలస్యమవుతుంది. అందుకే మానసికంగా కుంగుబాటు వంటి సమస్యలను దరిచేరనివ్వకూడదు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు (వారితో పాటు ఇలాంటి సమస్యను దరిచేరనివ్వకూడదని భావించే సాధారణ ఆరోగ్యవంతులు కూడా) యోగా, ధ్యానం, వాకింగ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అవసరమైతే కౌన్సెలింగ్ వంటివి ప్రయత్నించవచ్చు. దాంతో మనకు తెలియకుండానే అసమతౌల్యత తొలగిపోయి, హార్మోన్లు సరిగా పనిచేసి, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంప్లాంటేషన్ సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్ల ద్వారా వచ్చే అండం అక్కడ శుక్రకణాలతో కలిశాక పిండంగా మారి, గర్భసంచిలోకి వచ్చి అక్కడ కాస్తంత పరుపులాగా తయారుగా ఉన్న ఎండోమెట్రియమ్ పొరలోకి అంటుకుపోయి శిశువుగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలా అండంగా మారిన పిండం, ఎండోమెట్రియమ్లోకి అంటుకుపోవడాన్ని ‘ఇంప్లాంటేషన్’ అంటారు. కొందరిలో ఈ ఇంప్లాంటేషన్ సమస్య వల్ల కూడా పిండం పెరగక సంతానలేమి సమస్య రావచ్చు. కారణమేమిటి: కొందరిలో ఎలాంటి సమస్యలూ కనిపించకపోయినా, అన్ని పరీక్షలూ మామూలుగా (నార్మల్గా)నే ఉన్నా, ప్రాథమికంగా వాడే మందులు వాడినా, నేరుగా వీర్యకణాలను లోపలికి తీసుకెళ్లి వదిలే ప్రక్రియ అయిన ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) చేసినా, పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు తీసుకెళ్లే ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) జరిపినా, లేదా వీర్యకణాలను నేరుగా అండంలోకే ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టే ఇక్సీ (ఐసీఎస్ఐ – ఇంట్రా సైటోప్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) పద్ధతి ద్వారా పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు పంపినా గర్భం రాకపోవచ్చు. కొందరిలో గర్భాశయం పిండాన్ని స్వీకరించదు. ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు ఇంకా తెలియరావడం లేదు. ఇందుకోసం అనేక రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. పిండం ట్యూబుల్లోకి వచ్చి, గర్భాశయంలో అంటుకుంటేనే అది శిశువుగా రూపొందడం మొదలువుతుంది. ఇంప్లాంటేషన్గా చెప్పే ఈ సమయంలో అనేక రకాల హార్మోన్లు, రసాయనాలు, కెమికల్ మీడియేటర్లు, గర్భాశయ పొరలో రక్తప్రసరణ, ఇంకా బయటకు తెలియని చాలా ప్రక్రియలు అన్నీ సరిగా ఉన్నప్పుడే గర్భధారణ జరుగుతుంది. వాటిలో ఏదైనా సమస్య ఉంటే ఎన్ని చికిత్సలు చేసినా ఉపయోగం ఉండదు. అందుకే టెస్ట్ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా ప్రయత్నించినా, అందులోనూ 40% నుంచి 50% మేరకు మాత్రమే గర్భధారణ కలిగే అవకాశం ఉంటాయి. ఇంప్లాంటేషన్ సమస్యలకు చికిత్సలో భాగంగా ఐవీఎఫ్లో గర్భసంచిలోకి ఎండోమెట్రియమ్ పొరను ప్రేరేపించడం, పిండం పైనా, పొరకీ చిన్నగా చిల్లు పెట్టడం (అసిస్టెడ్ హ్యాచింగ్) వంటి ప్రక్రియలతో పాటు గర్భాశయం పిండాలన్ని తిరస్కరించకుండా ఉండటం కోసం, స్వీకరించేలా చేయడం కోసం యాంటీఇమ్యూన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్టెరాయిడ్స్ వంటి అనేక రకాల మందులతో చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. కొందరిలో ఎన్ని చేసినా ఇంప్లాంటేషన్ నూటికి నూరు పాళ్లు విజయవంతం కాకపోవచ్చు. ఫలదీకరణ (ఫర్టిలైజేషన్) సమస్యలు ప్రతినెలా అండాశయం నుంచి విడుదలైన అండం ట్యూబ్లలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి విడుదలైన తర్వాత అండం 24 గంటలు మాత్రమే జీవిస్తుంది. (అంటే యాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత నిర్వీర్యమవుతుంది). ఆ సమయంలో కలయిక ద్వారా విడుదలైన వీర్యకణాలు ట్యూబ్లలోకి చేరి అండాన్ని చుట్టుముడతాయి. అనేక వీర్యకణాల నుంచి విడుదలయ్యే హైలురానిక్ యాసిడ్ వంటి అనేక ఎంజైములు... అండం మీద చిల్లుపడేలా చేస్తాయి. అందులోనుంచి ఒక్క వీర్యకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే చిల్లు మూసుకుపోతుంది. అలా ఒక వీర్యకణం, అండం కలిసి ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపాలు ఉన్నాగానీ గర్భం రాకపోవచ్చు. ఈ ప్రక్రియలో శుక్రకణాలు గర్భాశయంలో వెళ్లిన తర్వాత అక్కడ వాటి సంఖ్య తక్కువగా ఉన్నా, వాటి నాణ్యత (క్వాలిటీ), కదలిక (మొటిలిటీ) సరిగా లేనప్పుడు, వాటి నుంచి విడుదలయ్యే ఎంజైములు సరిగా ఉండనప్పుడు గర్భం రాదు. అలాగే అండం నాణ్యత సరిగా లేకపోయినా, అండంపైన పొర బాగా మందంగా ఉన్నా ఫలదీకరణ జరగకపోవచ్చు. వీర్యకణాలు 48 గంటల నుంచి 72 గంటల వరకు జీవించి ఉంటాయి. ఫలదీకరణ లోపాలను తెలుసుకోవడం మామూలుగా కష్టం. పరీక్షలలో వేరే సమస్యలు ఏవీ కనిపించనప్పుడు దంపతులకు ఒక కోర్స్ యాంటీబయాటిక్, మల్టీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ మాత్రల వంటి రకరకాల మందులు ఇచ్చి చూడటం జరుగుతుంది. అన్ని రకాలుగా ప్రయత్నించినా ఐయూఐ చికిత్స చేసినా గర్భం రానప్పుడు ఫలదీకరణలో సమస్యలు ఉన్నట్లుగా భావించి, ఆ దంపతులకు ఐవీఎఫ్, ఇక్సీ (ఐసీఎస్ఐ / టెస్ట్ట్యూబ్ బేబీ) పద్ధతులను సూచించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో అండాలను శుక్రకణాలను మైక్రోస్కోప్ కింద విశ్లేషించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి కొన్ని లోపాలను సైతం గుర్తించే అవకాశం ఉంది. అందులో అనేక అండాలను, శుక్రకణాలను నేరుగా ల్యాబ్లో అనేక న్యూట్రిషన్ మీడియాలో కలిపి చూస్తారు. కాబట్టి ఈ ప్రక్రియల ద్వారా ఫలదీకరణ సమస్యలను అధిగమించవచ్చు. అయినా ఫలదీకరణ కాకపోవడం జరగడం, వాటి నాణ్యత బాగా లేకపోయినా, అవసరమైతే దాతల నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను కూడా దంపతులు ఆమోదిస్తే వాడి చూడవచ్చు. తెలియని కారణాలు: (అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ): కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా, ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయినా ఎంతకూ గర్భం రాదు. ఇందుకు కారణాలు తెలియదు. డా‘‘ వేనాటి శోభ, బర్త్రైట్ బై రెయిన్బో, హైదర్నగర్ -
సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే క్యాన్సర్లు
నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయడానికి ఒక కారణమైతే... బిజీలైఫ్, అందుబాటులో ఉండే మెడికల్ షాప్లు, ఫోన్లలోనే డాక్టర్ సలహాలు, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్కిల్లర్స్, ఇంటర్నెట్ సమాచారం అనారోగ్య లక్షణాలకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చి సమస్యను తీవ్రం చేసే మరొక అంశమని చెప్పవచ్చు. వేడి చేసిందనీ, పడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణాల వల్ల అని, అలసట అని, ఎప్పుడో తగిలిన దెబ్బల చిహ్నాలంటూ భ్రమపడట వల్ల అనీ, వయస్సు పైబడే కొద్దీ కనిపించే లక్షణాలే అంటూ సర్దుకుపోవడం... ఇలా కారణాలేమైనప్పటికీ అవి క్యాన్సర్కు ప్రమోషన్ ఇచ్చి లేటు దశలో గుర్తించే పరిస్థితులే చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే కనుగొంటే ఆధునిక వైద్యంలో ఏ సవాలుకైనా సమాధానం లభిస్తుంది. రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్సావిధానాలు రెండూ వైద్యరంగానికి కొత్తదనాన్ని సంతరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. క్యాన్సర్ చికిత్స విధానాలన్నీ ఏ దశలో వ్యాధి కనుగొన్నామనే అంశం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందుకే సాధారణ లక్షణాలూ కొంత ఎక్కువ కాలం కొనసాగినప్పుడు రోగి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. అందుకే సాధారణ లక్షణాలే ఒక్కోసారి క్యాన్సర్లను ఎలా పట్టిస్తాయో తెలుసుకోవడం మంచిది. తలనొప్పి: చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రేన్ లేదా తలనొప్పి అప్పుడప్పుడు రావడం చాలా సహజమే. తలనొప్పికి కారణం తెలుసుకోవడం, మైగ్రేన్ అయితే నిర్దిష్టకాలం పాటు సరైన మందులు వాడితే సమస్య తగ్గుతుంది. ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్కు సంకేతం కావచ్చు. గొంతునొప్పి: చల్లటి పదార్థాలు, వాతావరణం, కొత్తప్రదేశం, తాగేనీరు మారాయి అందుకే గొంతు బొంగురు, నొప్పి అని బాధపడే వారిని చాలామందినే చూస్తుంటాం. రెండుమూడు రోజుల్లో తగ్గకపోతే మందులు కోర్సుగా వాడటం లాంటి ప్రయత్నాలు చేశాక కూడా ఆ సమస్య బాధిస్తుంటే మాత్రం డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. థైరాయిడ్ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి. దగ్గు, ఆయాసం: ముఖ్యంగా సిగరెట్టు తాగేవారు మాకు ఇలాంటి లక్షణాలు అలవాటే అనుకుంటారు. కానీ వీరికి లంగ్ క్యాన్సర్తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహిస్తే మంచిది. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లె/తెమడలో రక్తం, ఆయాసం వంటివి టీబీ లేదా లంగ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కడుపు ఉబ్బరం, మంట: వేళకు ఆహారం తీసుకోకపోవడం, కంటికి ఇంపుగా నోరూరించే అనారోగ్య పదార్థాలు, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో మనలో చాలా మంది కడుపులో మంట, తేన్పులు, ఉబ్బరం, ఆకలి తగ్గడం, వికారం వంటి లక్షణాలను తరచూ చూస్తున్నారు. ముందు సరైన జీవనశైలి అలవరచుకుని నీరు, పీచు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, కాలేయం, పాంక్రియాస్, గాల్బ్లాడర్ క్యాన్సర్లను తొలిదశలోనే కనుగొనే అవకాశం ఉంది. మూత్రవ్యవస్థలో తేడాలు: మూత్రంలో రక్తం పడటం, ఆగిఆగిరావడం, మంటగా ఉండటం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు తమకు వేడిచేసిందని కొందరు భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లు తక్కువ తాగడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటి కారణాలవల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మరీ తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్కు సంబంధించిన క్యాన్సర్ కావచ్చని అనుమానించాలి. 50 ఏళ్లపైబడిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరిమధ్య రక్తస్రావం, పొట్టభారంగా ఉండటం, ఆకలి మందగించడం, స్త్రీల నెలసరి ముందు ఉండే సమస్యలుగా పొరబడవచ్చుగానీ కొన్ని సందర్భాల్లో ఒవేరియన్, యుటిరైన్ క్యాన్సర్లు కూడా అయ్యే అవకాశాలుంటాయి. మలవిసర్జనలో తేడాలు: అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కనిపించవచ్చు. కానీ మలవిసర్జన సమయంలో ఎప్పుడూ రక్తం పడుతుంటే మాత్రం దాన్ని పైల్స్ అనుకుంటే పొరబాటు పడుతున్నట్లే. దక్షిణభారతదేశంలో పురుషుల్లో ఎక్కువగా కనిపించే కోలన్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. అసలు విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తోందంని ఇతర అంశాలకు దీన్ని ఆపాదించుకుంటాం. ఆహార పదార్థాలు మార్చి మార్చి తీసుకుంటూ ఇబ్బందిపడే కంటే సరైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే పూజలు, మంత్రాలు, విభూది, తాయెత్తులు, దిష్టితీయడాలు వంటి అనేక మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉండే ఫలితం కనిపించకపోగా అసలు సమస్య బయటపడే సమయానికి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ అసలు భాగం నుంచి ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావచ్చు. ప్రతినెలా కనిపించే గడ్డలే అనీ, పాలగడ్డలనీ రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణుతులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచిఉంటుంది. అలసట, చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్క్యాన్సర్ను హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్ / లంగ్ క్యాన్సర్లకు సూచన కావచ్చు. శరీరం మీద మచ్చలు, వాటిలో మార్పుల మీద కూడా ఒక కన్నేసి ఉంచితే మంచిది. ఒత్తిడికి గురైనప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపుగా అందరూ ఎదుర్కొనేవే. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అవే కారణాలని భ్రమపడి ముందు వాడిన మందులనే మళ్లీ వాడుకుంటూ కాలయాపన చేస్తే సమస్యలను మనమే తీవ్ర చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలావరకు క్యాన్సర్ ముదిరాకే చికిత్సకు వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ గత కొంతకాలంగా హెల్త్చెకప్స్ చేయించుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
బ్యాక్టీరియాకు.. బ్యాడ్ టైమ్ స్టార్ట్!
ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుక్కురమ్మన్నారనేది సామెత.. యాంటీబయాటిక్ మందుల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది.. ఉన్న మందులకు అలవాటు పడిన బ్యాక్టీరియాలు ఒక పట్టాన చావమంటున్నాయి.. కొత్తవాటి తయారీకి బ్రేకులు పడి ఏళ్లు గడిచిపోతున్నాయి.. దీంతో శాస్త్రవేత్తలు రూటు మార్చేశారు. అటు నుంచి చెక్ పెట్టే సరికొత్త మందును సిద్ధం చేశారు! యాంటీబయాటిక్ నిరోధకత.. ఈ మధ్యకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతిపెద్దది అనడంలో సందేహం లేదు. అంతెందుకు.. దీని కారణంగా 2050 నాటికి కోటి మంది ప్రాణాలు కోల్పోతారంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ ఫార్మా సంస్థ షియొనోగి ఓ శుభవార్తను మోసుకొచ్చింది. ‘సెఫీడెరొకాల్’పేరుతో ఈ సంస్థ అభివృద్ధి చేసిన సరికొత్త యాంటీబయాటిక్ మొండి బ్యాక్టీరి యాలను కూడా నాశనం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏంటి ఈ కొత్త మందు ప్రత్యేకత? సెఫీడెరొకాల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే మనం జబ్బు పడ్డప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇన్ఫె క్షన్ సోకినప్పుడు ముందుగా మన రోగ నిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇది రకరకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది. శరీరంలోని ఇనుము మోతాదును తగ్గించడం ఇందులో ఒకటి. రోగ నిరోధక వ్యవస్థ ఈ చర్యకు దిగిన వెం టనే బ్యాక్టీరియా కూడా స్పందిస్తుంది. అందుబాటులోని ఇనుమును వేగంగా తీసుకోవడం మొదలుపెడుతుంది. షియొనోగి శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని సెఫీడెరొకాల్ను సిద్ధం చేశా రు. ఇనుము అణువుల్లోపల యాంటీబయాటిక్ మందును చేర్చారు. బ్యాక్టీరియా ఈ అణువులను లోపలికి చేర్చుకోగానే... సెఫీడెరొకాల్ పని మొదలుపెడుతుంది. లోపలి నుంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. గ్రీకు పురాణాల్లో చెప్పినట్లు చెక్క గుర్రాల్లోపల యోధులను ఉంచి.. ట్రాయ్ నగరంపై దం డెత్తినట్లు అన్నమాట! 73% సక్సెస్.. షియొనోగి ఇటీవలే సెఫీడెరోకాల్ను 448 మందిపై ప్రయోగించి చూశారు. మూత్రపిండాల, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిపై ఈ మం దు ప్రయోగించగా దాదాపు 73% మంది స్పందించారని, ప్రస్తు తం మార్కెట్లో అం దుబాటులో ఉన్న శక్తిమంతమైన యాంటీబయాటిక్ కంటే ఇది చాలా ఎక్కువని షియొనొగి తెలిపింది. దాదాపు 15 దేశాలు, 67 ఆసుపత్రుల్లో జరిగిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చినప్పటికీ విస్తృత స్థాయిలో ప్రయోగాలు జరిగితేగానీ.. ఈ మందును అందుబాటులోకి తేలేమన్నది నిపుణుల మాట. సెఫీడెరొకాల్ లాంటి వినూత్న మం దులు మరిన్ని అభివృద్ధి చేస్తే యాంటీబయాటిక్ నిరోధకతకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని వీరు అంటున్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సుమారు 90 ఏళ్ల క్రితం పెన్సిలిన్ రూపంలో తొలి యాంటీ బయాటిక్ను తయారు చేశారు. పెన్సిలిన్ లాంటి యాంటీ బయాటిక్లకూ లొంగని బ్యాక్టీరియా ఏటా 7 లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్లు వాడాలని సూచిస్తున్నది.. మొత్తం ప్రిస్క్రిప్షన్లలో 20% అవసరానికి మించి వాడటం వంటి కారణాలతో ఏ మందుకూ లొంగని సూపర్ బగ్లు ఎక్కువ అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 12 రకాల బ్యాక్టీరియాలతో మనిషికి ముప్పు ఎక్కువ! గత 30 ఏళ్లలో మార్కెట్ లోకి వచ్చిన యాంటీ బయాటిక్లన్నీ పాతవాటిలో మార్పులు, చేర్పులు చేసి సిద్ధం చేసినవే! -
యాంటీబయాటిక్స్తో స్ధూలకాయం
లండన్ : యాంటీబయాటిక్స్ వాడకంతో వాటిల్లే అనర్ధాలపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో చిన్నారులు ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు యాంటీబయాటిక్స్ మరింత ప్రమాదమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. నవజాత శిశువులు, రెండేళ్లలోపు చిన్నారులకు యాంటీబయాటిక్స్ ఇస్తే భవిష్యత్లో వారిని ఊబకాయం వెంటాడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం వీటిని తీసుకుంటే ఒబెసిటీ ముప్పు మరింత పెరుగుతుందని పేర్కొంది. బాలికలకు నాలుగైదు రకాల యాంటీబయాటిక్స్ ఇస్తే వారు మున్ముందు స్ధూలకాయంతో బాధపడే పరిస్ధితి 50 శాతం అధికమని అంచనా వేసింది. రెండేళ్ల పాటు పిల్లలకు యాంటీబయాటిక్స్ రిఫర్ చేస్తే వారు స్ధూలకాయం బారిన పడే ముప్పు 26 శాతం పెరుగుతుందని పేర్కొంది. మూడు లక్షల మందికి పైగా పిల్లలపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో దాదాపు 47,000 మంది పిల్లలు ఆ తర్వాత అనూహ్యంగా బరువు పెరిగారని పరిశోధనలో తేలింది. శరీర బరువును నియంత్రించే కీలక బ్యాక్టీరియాను ఈ శక్తివంతమైన ఔషధాలు నాశనం చేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. జలుబు వంటి చిన్న అనారోగ్యాలకు సైతం పిల్లలకు అనవసరంగా యాంటీబయాటిక్స్ను వాడుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన మేరీల్యాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు చెందిన డాక్టర్ కేడ్ న్యూలాండ్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో ఊబకాయంతో మున్ముందు వారు రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యాంటీబయాటిక్స్ను పిల్లలకు అత్యవసరమైతే తప్ప సిఫార్సు చేయరాదని పరిశోధకులు సూచిస్తున్నారు. -
మెడిసిన్ మిస్ యూజ్
మనం ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనకు తెలిసిన యాంటీబయాటిక్స్ వాడటం ఇటీవల మామూలైపోయింది. సాధారణ జలుబు, దగ్గుకు అజిథ్రోమైసిన్, నీళ్లవిరేచనాలకు నార్ఫ్లాక్స్ వంటి మందులను చాలా విరివిగా ఉపయోగిస్తుంటాం. సొంతవైద్యం చేసుకునే చాలామందితో పాటు... కొంతకాలం డాక్టర్లు రాసిన మందులను చూస్తూ, ఆ తర్వాత వాటినే వాడుతూ ఉండే అవగాహన లేని గ్రామీణ వైద్యులు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటానికి కారణమవుతున్నారు. కానీ దీనివల్ల మానవాళికి ఎంతో ముప్పు పొంచి ఉంది. రోగకారక సూక్ష్మజీవులు మనం విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ పట్ల నిరోధకత పెంచుకుంటున్నాయి. దాంతో వాటి మోతాదును మరింతగా పెంచి ఇచ్చినా కూడా హానికారకమైన సూక్ష్మజీవులను తుదముట్టించలేకోతున్నాం. విచ్చలవిడి యాంటీబయాటిక్ ఉపయోగంతో కలగనున్న ముప్పునకు ఉదాహరణలివే... ♦ యాంటీబయాటిక్స్కు నిరోధకత పెంచుకున్న క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా కారణంగా వచ్చే నీళ్ల విరేచనాలు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. ♦ కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల మందుల వల్ల ఎంతకూ లొంగని ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ♦ ఇక టీబీ వచ్చిన కొందరు వారికి ఇచ్చిన మందులను పూర్తికాలం ఉపయోగించకపోవడం వల్ల అది మళ్లీ కనిపించడంతోపాటు, టీబీకి కారణమైన క్రిములు యాంటీబయాటిక్స్కు నిరోధకత సాధిస్తున్నాయి. దాంతో టీబీ ఒకపట్టాన లొంగడం లేదు. దీనివల్ల హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధి, ఖర్చు పెరగడంతో పాటు చివరగా రోగి మృత్యువాత పడే రిస్క్ కూడా పెరుగుతాయి. అందుకే వాటిని మన దేహానికి ఉన్న సహజ రోగ నిరోధక శక్తి దెబ్బతినకుండా ఉండేంత మోతాదులో వాడాలని గుర్తుంచుకోండి. అదికూడా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే. -
లైఫ్ ‘కిల్లర్స్’
కంకిపాడుకు చెందిన రామారావు(పేరుమార్చాం)కు 45 ఏళ్లు.. వ్యవసాయ కూలీపనులకు వెళ్లే ఆయన నిత్యం సాయంత్రం ఒళ్లు నొప్పులు రావడంతో మందుల షాపుకు వెళ్లి నొప్పుల బిళ్లలు తీసుకుని వేసుకునే వాడు. ఇలా రెండేళ్లు గడిచే సరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. ప్రస్తుతం అంపశయ్యపై ఉన్న వెంకటేష్ వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు... నగరానికి చెందిన రమేష్కు పళ్ల ఇన్ఫెక్షన్ ఉండటంతో తరచూ యాంటీ బయోటిక్స్ వాడుతుంటాడు. వైద్యుని సూచనపై కాకుండా మందుల షాపుల్లో ఇచ్చేవి తీసుకుని వాడుతుండటంతో క్రమేపీ అతని శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి, వ్యాధులు సోకడం ప్రారంభించాయి. ప్రస్తుతం మందులు సైతం పనిచేయని స్థితికి చేరుకున్నాడు. ఇలా వెంకటేష్.. రమేష్లే కాదు.. సమాజంలో చాలామంది విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్, యాంటిబయోటిక్స్ వాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న సమస్యలకు మితిమీరిన మందులు వాడకంతో.. తెలియకుండానే వారి అవయవాలు పూర్తిస్థాయిలో దెబ్బతింటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిని గుర్తించి అవగాహన కలిగించేందుకు నిర్ణయించింది. లబ్బీపేట(విజయవాడ తూర్పు): అవసరం లేకున్నా తరచూ మందులు వాడుతుండటంతో అనేక మంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికంగా మందుల వినియోగం వలన ఎముకలోని మూలిగ(బోన్ మ్యారో)పై ప్రభావం చూపి ఒక్కో సమయంలో రక్తహీనత, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదనే నిబంధన ఉన్నా.. దానిని పాటించక పోవడం వల్లే విచ్చలవిడి వినియోగం పెరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. కిడ్నీ, గుండె, లివర్ వ్యాధులతో పాటు, ఒక్కోసారి నరాలు, మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మందుల వినియోగం వల్ల పెరుగుతున్న వ్యాధులను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. మందుల వాడకంపై అవగాహన కలిగించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని కొద్దికాలం కిందట ఫార్మశీ కౌన్సిల్స్ను ఆదేశించింది. యాంటిబయోటిక్స్తో అనర్థమే.. పెన్సిలిన్ వంటి యాంటి బయోటిక్స్ వైద్యరంగంలో ఒక సంచలనంగా మిగిలిపోయింది. ఎంతో మందిని ప్రాణాంతక వ్యాధుల నుంచి విముక్తి కలిగించింది. అయితే ఆ తర్వాత క్రమేణా మార్కెట్లోకి యాంటిబయోటిక్స్ ప్రవేశం పెరగడంతో చిన్న సమస్యకు వాటిని వాడటం ప్రారంభమైంది. దీంతో శరీరంలో యాంటి డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి. ప్రాణాంతక వ్యాధులు సోకిన సమయంలో మందులు పనిచేయని పరిస్థితులు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వినియోగం ఇలా ఉండాలి.. యాంటిబయోటిక్స్కు సంబంధించి వ్యాధిని బట్టి వైద్యుల సూచన మేరకు సూటబుల్ మందులు వాడాల్సి ఉందంటున్నారు. మన శరీరంలో కొన్ని వేల బ్యాక్టీరియాలు ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన సమయంలో అవి ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో జన్యుపరమైన కారణాలతో కొన్ని రకాల మందులు పడవని, వాటిని గమనించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఉదాహరణకు పెయిన్కిల్లర్ ‘బ్రూఫెన్’ అందరికీ పడదని చెబుతున్నారు. ఇలా అనేక రకాల మందులు వైద్యుల సూచన లేకుండా వాడటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారంటున్నారు. జలుబుకూ వాడేస్తున్నారు.. జలుబు.. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీనికి ఎలాంటి యాంటిబయోటిక్స్ అవసరం లేదు. కానీ దీనికి కూడా యాంటిబయోటిక్స్తో పాటు, కొందరు స్టిరాయిడ్స్ కూడా వాడుతున్నారు. పొడిదగ్గుకు యాంటి బయోటిక్స్ వాడనవరం లేదు.. వీటిని ఎప్పుడూ లోయర్ టు హయ్యర్కు వెళ్లాలి. కానీ ప్రజలు ఒకేసారి వ్యాధి తగ్గిపోవాలనే ఉద్ధేశంతో హయర్ వాడేస్తున్నారు. బాక్టీరియాను బట్టి యాంటిబయోటిక్స్ వాడాలి. దానిని నిపుణులు మాత్రమే గుర్తించగలుగుతారు. వీటి వినియోగంపై తమశాఖ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.– డాక్టర్ బాలు, డ్రగ్ ఇన్స్పెక్టర్,ఫార్మకాలజీ నిపుణులు -
జన్యువులను నిర్వీర్యం చేసి బ్యాక్టీరియాను చంపేస్తారు
వ్యాధికారక బ్యాక్టీరియాను చంపేయాలంటే ఏం చేస్తాం. యాంటీబయాటిక్స్ వాడతాం. అంతేకదా.. అయితే ఈ క్రమంలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా కూడా అంతమైపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పెన్ స్టేట్ మెడికల్ కాలేజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. బ్యాక్టీరియా జన్యువులను నిర్వీర్యం చేయడం ద్వారా కేవలం చెడు బ్యాక్టీరియా మాత్రమే నాశనమయ్యేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మన పేగుల్లో సి.డిఫికైల్ అనే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆ బ్యాక్టీరియా మనుగడకు కీలకమైన జన్యువులను నిర్వీర్యం చేసే మందులు తయారు చేసి వాడారు. సక్రమంగా పనిచేయడంతో ఇదే పద్ధతిని ఇతర బ్యాక్టీరియాకు వర్తింప చేయవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అరుణ్ శర్మ అంటున్నారు. బ్యాక్టీరియా రకాన్ని బట్టి మందును తయారు చేస్తున్నాం కాబట్టి ఆ బ్యాక్టీరియా మాత్రమే నాశనమవుతుందని.. మిగిలినవాటికి ఏ మాత్రం హాని జరగదు కాబట్టి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని వివరించారు. అభివృద్ధి చేసిన మూడు ముందుల ద్వారా కూడా అతితక్కువ దుష్ప్రభావాలు కనిపించడం ఇంకో విశేషమని చెప్పారు. -
కొంప ముంచేస్తున్న బ్యాక్టీరియా!
నిమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులొస్తే యాంటీబయాటిక్ల వాడకం తప్పనిసరి. వ్యాధి కారక బ్యాక్టీరియాలను ఈ మందులు చంపేస్తాయి. ఈ క్రమంలో కొన్ని మందులకు నిరోధకతను పెంచుకుంటాయి. మరికొన్ని అటు నిరోధకత పెంచుకోవడంతోపాటు ఇటు ఆ మందులను ఆహారంగానూ మార్చేస్తున్నాయి! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. పదేళ్ల క్రితం బ్యాక్టీరియా యాంటీబయాటిక్లను తినేసే అవకాశముందని తాము చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారని తాజా పరిశోధనలను బట్టి చూస్తే ఈ బ్యాక్టీరియా కర్బనం కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గౌతమ్ దంతాస్ తెలిపారు. యాంటీబయాటిక్ నిరోధకత అన్నది ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో అతి ముఖ్యమైందని, కొత్త మందుల అభివృద్ధి జరగక ముందే నిరోధకత పెరిగిపోతే ప్రాణనష్టం తీవ్రమవుతుందని గౌతమ్ అన్నారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్లను కొన్ని రకాల బ్యాక్టీరియా ఎలా తట్టుకుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించామని, నేలలో ఉండే నాలుగు రకాల బ్యాక్టీరియా పై పరిశోధనలు జరిపినప్పుడు అవన్నీ పెన్సిలిన్పై ఆధారపడి బతుకుతున్నట్లు తెలిసిందని వివరించారు. ఈ పరిశోధనల ఆధారంగా భవిష్యత్తులో మెరుగైన యాంటీబయాటిక్లను తయారుచేయడం సాధ్యమవుతుందని అంచనా. -
బాబుకు ఛాతీలో నెమ్ము... ఏం చేయాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు 14 నెలలు. రొమ్ములో నెమ్ము ఉందని డాక్టర్లు చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. బాబు ఆరోగ్యం పట్ల చాలా ఆందోళనగా ఉంది. ఇలా ఛెస్ట్లో నెమ్ము ఎందుకు వస్తుంది? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. – ఎల్. ప్రవీణ, నెల్లూరు మీ బాబుకు ఉన్న కండిషన్ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. నిమోనియాకు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అత్యంత ప్రధాన కారణాలు. కొన్నిసార్లు శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం చాలా ముఖ్యం. జాగ్రత్తలివే... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే గుంపుగా జనం ఉన్నప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. ∙తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి దూరంగా ఉంచాలి. పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) కూడా అవసరం. బాబుకు మూత్రంలో ఎరుపు... ఎందుకిలా? మా బాబుకి ఎనిమిదేళ్లు. రెండు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అన్ని రకాల పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ అన్నీ నార్మలే. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు బాధ పడుతున్నాడు. వారం క్రితం కూడా మూత్రంలో రక్తం పడింది. మళ్లీ డాక్టర్ దగ్గరకెళితే పరీక్షలు చే శారు. ఆ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, ఎందుకిలా రక్తం పడుతోంది? – సువర్ణ, కందుకూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. స్కూల్కి వెళ్లే 2–5 శాతం మంది పిల్లల మూత్రంలో రోజూ రక్తం కనబడుతుంటుంది. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచనగా ఉంటుంది. పిల్లల యూరిన్లో రక్తం కనబడానికి కొన్ని కారణాలు: మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చిందంటున్నారు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ క్యాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా క్యాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండాలి. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకొని మీరు మరోసారి మీ డాక్టర్తో చర్చించి, తగిన సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మన శరీరంలో కొత్త అవయవం!
‘‘ఇంటర్స్టిటియం’’ అంటే ఏమిటో చెప్పుకోండి? తెలియదా...? కొంతకాలం క్రితం వరకూ శాస్త్రవేత్తలకూ దీని గురించి అస్సలు తెలియదు. విషయం ఏమిటంటే.. కొన్ని నెలల క్రితం మన శరీరంలో ఉండే అవయవాన్ని కొత్తగా గుర్తించారు. అవునండి.. ఇది నిజం. కొన్ని వేల ఏళ్లుగా వైద్యులు, శాస్త్రవేత్తలు మన శరీర భాగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఇదొక్కటి మాత్రం అందరి కళ్లూ కప్పేసింది. మన అవయవాలను కప్పుతూ ఉండే కణజాలానికి ప్రత్యేకమైన పనులేమీ లేవుకాబట్టి అది అవయవం కాదని అనుకునేవారు. కానీ ఇటీవల ఒక రోగికి ఎండోస్కోపీ చేస్తూండగా శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించారు. ఈ కణజాలానికి శరీరం మొత్తానికి లింకులు ఉన్నాయని... బయటి నుంచి వచ్చే ఒత్తిడి నేరుగా అవయవాలపై పడకుండా ఇవి అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. దీనికే ఇంటర్స్టిటియం అని పేరు పెట్టారు. ఈ కణజాలాన్ని ప్రత్యేకంగా పరిశీలించేందుకు వీలయ్యేది కాదని.. నమూనా కోసం కత్తిరిస్తే.. అక్కడ ఉండే ద్రవం మొత్తం ఖాళీ అయిపోవడంతోపాటు మృదులాస్థి కణజాలం కూడా ముక్కలైపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎండోస్కోపీతో కణజాలాన్ని కత్తిరించాల్సిన అవసరం లేకపోవడం, నేరుగా చూసేందుకు అవకాశం ఉండటం వల్ల ఈ సరికొత్త అవయవం గురించి తెలిసిందని చెప్పారు. ఈ కొత్త అవయవంతో ఉపయోగం ఏమిటన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్స్టిటియం కేన్సర్ కణాలు శరీరం మొత్తం విస్తరించేందుకు సహకరిస్తుందని తాజా అంచనా. పెరుగుతున్న యాంటీబయాటిక్ వాడకం... భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏటికేడాదీ యాంటీబయాటిక్ల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోందని, ఫలితంగా సమీప భవిష్యత్తులోనే బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులు సాధారణ మందులకు లొంగని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తోంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి. 2010 – 2015 మధ్యకాలంలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం యాంటీబయాటిక్ల వాడకం ఏటా 15 శాతం చొప్పున పెరిగింది. మొత్తం 76 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం ఉన్న దేశాల్లో యాంటీబయాటిక్ల వాడకం పెరిగిపోతూండగా.. అధికాదాయ దేశాల్లో స్థిరంగా ఉండటం. చివరి ప్రయత్నంగా వాడాల్సిన మందులను కూడా విచ్చలవిడిగా వాడేయటం ఆందోళన కలిగించే అంశమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక అంచనా ప్రకారం 2015లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,200 డోసుల యాంటీబయాటిక్లు వాడారు. ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించకపోతే 2030 నాటికి వీటి వాడకం రెట్టింపు కానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధ్యయనం తాలూకు వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఆ యాంటీబయాటిక్తో గుండెకు ముప్పు
న్యూయార్క్ : యాంటీబయాటిక్స్ వాడకంపై భిన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో తాజాగా ఓ యాంటీబయాటిక్పై పదేళ్ల పాటు జరిపిన అథ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. బయాక్సిన్ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న క్లారిత్రోమైసిన్ హృద్రోగంతో బాధపడే రోగులకు పెనుముప్పుగా పరిణమించిందని తేలింది. ఇన్ఫెక్షన్ల చికిత్సకు వైద్యులు ఈ యాంటీబయాటిక్ను సహజంగా రిఫర్ చేస్తుంటారు. ఈ మందును వాడిన కొన్ని సంవత్సరాల తర్వాత సైతం హృద్రోగులకు ప్రాణాపాయం ముంచుకొస్తుందని ఎఫ్డీఏ హెచ్చరించింది. హృద్రోగాలతో బాధపడతే వారు ఈ డ్రగ్ను రెండు వారాల కోర్సుగా తీసుకున్న క్రమంలో ఏడాది లేదా తర్వాతి కాలంలో గుండె పోటు లేదా హఠాన్మరణానికి గురైనట్టు పదేళ్ల పాటు నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. 2005లోనే క్లారిత్రోమైసిన్ దుష్పరిణామాలపై ఎఫ్డీఏ హెచ్చరించింది. ఇక గుండె సమస్యలతో బాధపడే రోగులకు ఈ మందు చేసే మేలు కంటే కీడే అధికమని ఎఫ్డీఏ గుర్తించింది. ఈ డ్రగ్ కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుందని, గుండెపోటు, ఆకస్మిక మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. -
యాంటిబయో'కిల్స్'
వినుకొండ మండలం బొల్లాపల్లికి చెందిన నరసింహారావు కాలులో మేకు గుచ్చుకుంది. ఆర్ఎంపీ డాక్టర్ను ఆశ్రయిస్తే యమికాసిన్ అనే యాంటిబయోటిక్ ఇంజక్షన్ చేశారు. దీంతో ఒళ్లంతా వాపు రావడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు చేరాడు. అధిక మోతాదులో యాంటిబయోటిక్ వాడడం వల్ల కిడ్నీ పాడైనట్లుగా వైద్యులు గుర్తించారు. క్రోసూరు మండలానికి చెందిన సామ్రాజ్యం అనే మహిళ 20 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ వద్దకు వెళ్లింది. ఆయన లివర్ ఫ్లాక్స్, డైక్లోఫినాక్ ఇంజక్షన్లు రెండు కలిపి ఇవ్వడంతో రెండు రోజులకే లివర్, కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో బంధువులు గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు. సాక్షి, గుంటూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంపీలే వైద్యులే దిక్కవుతున్నారు. కొందరు ఆర్ఎంపీలకు కనీస అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా యాంటిబయోటిక్లు ఉపయోగిస్తున్నారు. చిన్న జబ్బుకు కూడా అధిక మోతాదులో యాంటిబయోటిక్స్ వాడుతూ లేనిపోని రోగాలు తీసుకొస్తున్నారు. జబ్బు రావడానికి కారణం ఏమిటి? వీరికి బీపీ, షుగర్ వంటి ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని సైతం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా యాంబయోటిక్లు వాడడంతో కిడ్నీ, లివర్లు దెబ్బతింటున్నాయి. ప్రాంతమైన వినుకొండ, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వంటి నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వీరు చిన్న జ్వరం వచ్చినా, పొలం పనులు చేసి వచ్చి ఒళ్లు నొప్పులని చెప్పినా జంటామైసిన్, యమికాసిన్, డైక్లోఫినాల్, లివర్ ఫ్లాక్స్ వంటి యాంబయోటిక్స్ను వాడుతున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారికి అధిక డోసులో యాంటిబయోటిక్లు వాడకూడదని తెలిసినప్పటికీ అవేమీ పట్టించుకోవడం లేదు. ప్రిస్కిప్షన్ లేకుండానే.. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా యాంటిబయోటిక్లు అమ్ముతున్నారు. పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఔషధ నియంత్రణ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యులు, మెడికల్ దుకాణదారుల ఇష్టారాజ్యమైపోయింది. జిల్లాలో వినియోగించే మందుల్లో సుమారుగా 50 శాతం యాంటిబయోటిక్లే ఉన్నట్లు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి వాడకం ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని వెల్లడిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరో 12 శాతం అధికంగా యాంటిబయోటిక్ల వియోగం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్లో 3 వేల మంది ఆర్ఎంపీలు రిజిస్ట్రేషన్లు చేయించుకోగా, వీరిలో సుమారు 2 వేల మంది ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక శిక్షణను పొందారు. ఇదిలా ఉంటే అసోసియేషన్లో ఎటువంటి రిజిస్ట్రేషన్గానీ, శిక్షణగానీ పొందని వారు జిల్లా వ్యాప్తంగా 1500 మంది ఉన్నట్లు ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అచ్చిరెడ్డి తెలిపారు. ఇలాంటి వారు చేస్తున్న తప్పు వల్ల మిగిలిన వారికీ చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాంటిబయోటిక్అమ్మకాలపై దృష్టి సారిస్తాం జిల్లాలో యాంటిబయోటిక్ల వినియోగం పెరిగిన మాట వాస్తవమే. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటిబయోటిక్ల అమ్మకాలు చేయకూడదని మెడికల్ షాపులకు స్పష్టమైన ఆదేశాలి అయినా కొందరు అమ్ముతూనే ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. యాంటిబయోటిక్ల అమ్మకాలపై ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయించాం. – విజయకుమార్, ఔషధ యంత్రణ, పరిపాలన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
యాంటీబయాటిక్స్తో రోగ నిరోధక వ్యవస్థకు చిక్కులు!
చిన్న సమస్య వస్తే చాలు.. ఎడా పెడా యాంటీబయాటిక్లు వాడేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఈ యాంటీబయాటిక్లు మన రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయని.. ఫలితంగా మరిన్ని ఎక్కువ రోగాల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.. హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు! రకరకాల కారణాల రీత్యా ఇప్పటికే కొన్ని బ్యాక్టీరియా మందులకు లొంగకుండా పోతున్న విషయం తెలిసిందే. కొత్త మందులేవీ అందుబాటులో లేని నేపథ్యంలో బ్యాక్టీరియా మరింత బలం పుంజుకునే అవకాశముంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎంఐటీ, హార్వర్డ్ శాస్త్రవేత్తలు అసలు ఈ యాంటీబయాటిక్స్ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ కోలీ బ్యాక్టీరియాను ఎలుకల్లోకి ప్రవేశపెట్టి.. వాటికి సిప్రోఫ్లాక్సిన్ మందు ఇచ్చి శరీరం లోపల ఏరకమైన మార్పులు జరుగుతున్నాయో గుర్తించారు. ఈ మందు నేరుగా ఎలుక కణజాలంపై పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇది కాస్త జీవక్రియల కోసం విడుదలయ్యే రసాయనాల్లో మార్పులకు తద్వారా బ్యాక్టీరియా నిరోధానికి దారితీసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా యాంటీబయటిక్ మందులు మాక్రోఫేగస్ కణాలను దెబ్బతీయడంతో అవి వ్యాధులను అరికట్టే విషయంలో తక్కువ ప్రభావం చూపాయని జేసన్ యాంగ్ తెలిపారు. పరి పరిశోధన -
సూపర్బగ్స్ పనిపట్టే కొత్త యాంటీబయోటిక్!
చిన్నా చితకా ఇన్ఫెక్షన్లకు సైతం పెద్దపెద్ద యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడేస్తున్న కొద్దీ, యాంటీబయోటిక్స్కు లొంగని రీతిలో సూక్ష్మజీవులు ముదిరి సూపర్బగ్స్గా తయారవుతున్న సంగతి తెలిసిందే. యాంటీబయోటిక్స్కు లొంగని సూపర్బగ్స్ వల్ల ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. యాంటీబయోటిక్స్కు ఒకపట్టాన లొంగని మొండివ్యాధులను సైతం సమర్థంగా నయం చేయగల సరికొత్త యాంటీబయోటిక్ను బ్రిటిష్ వైద్య నిపుణులు కనుగొన్నారు. ‘క్లోస్తియోమైడ్’ అనే ఈ యాంటీబయోటిక్ ఎంతకూ నయం కాని ఇ–కోలి, గనేరియా వంటి వ్యాధులను నయం చేయగలదని, సాదాసీదా యాంటీబయోటిక్స్కు అంతంకాని ‘ఎంఆర్ఎస్ఏ’ వంటి సూపర్బగ్స్ను సమర్థంగా తుదముట్టించగలదని బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డేమ్ సేలీ డేవిస్ వెల్లడించారు. అయితే, ఇది పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులోకి వచ్చేందుకు ఐదేళ్లు పట్టవచ్చని ఆయన తెలిపారు. -
ఓవర్ డోస్ యాంటీబయాటిక్స్తో.. పెద్దపేగు క్యాన్సర్!
పరిపరిశోధన డాక్టర్ సలహా లేకుండా మీ అంతట మీరే చాలా దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా? దాదాపు రెండు వారాలకు పైగా యాంటీబయాటిక్స్ వదలకుండా వాడేవారిలో పెద్దపేగు వృద్ధి చెంది అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మిగతా ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే ఇలా 15 రోజులకు పైగా యాంటీబయాటిక్స్ తీసుకునేవారిలో ఇలా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం 73 శాతం అధికంగా ఉందంటున్నారు అధ్యయనవేత్తలు. అరవై ఏళ్లకు పైబడ్డ దాదాపు 16,000 మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్ట్ర్కు చెందిన ఇమ్యునాలజీ నిపుణులు డాక్టర్ షీనా క్య్రూక్షాంక్ వెల్లడిస్తూ... ‘‘కొన్ని వ్యాధులు తగ్గడానికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం అవసరమే. అయితే దీన్ని చాలా విచక్షణతో వాడాలి. అందుకే డాక్టర్ సలహా మేరకు తగిన ప్రిస్క్రిప్షన్తోనే దీన్ని కొనాలి. డాక్టర్ సలహా లేకుండా ఆన్కౌంటర్ మందుగా యాంటీబయాటిక్స్ వాడటం తగదు’’ అంటారు డాక్టర్ షీనా. -
ఆ ఇన్ఫెక్షన్లు ఈ సీజన్లోనే ఎందుకు ఎక్కువ?
విమెన్ కౌన్సెలింగ్ వేసవిలో నేను తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్)కు గురవుతుంటాను. ఎండాకాలంలో ఎందుకీ సమస్య మాటిమాటికీ తిరగబెడుతుంది? కారణాలు వివరించండి. – మాలతి, వర్ధమాన్కోట మన మూత్ర వ్యవస్థలో రెండు కిడ్నీలుంటాయి. వాటి నుంచి మూత్రకోశానికి (బ్లాడర్) రెండు నాళాలు వెళ్తాయి. వాటిని యురేటర్స్ అంటారు. బ్లాడర్ నుంచి మరో నాళం (ఇదే మూత్ర నాళం) ద్వారా మూత్రవిసర్జన జరుగుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే... మాటిమాటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్ర విసర్జన సమయంలో మంట, పొత్తికడుపులో నొప్పి, కాస్తంత మబ్బు రంగులో, ఒక్కోసారి ఎర్రగా, కొంత దుర్వాసనతో మూత్రం వస్తుంది. చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు ఈ–కొలై అనే పరాన్న జీవి కారణమవుతుంది. సాధారణంగా ఇది ఆహారనాళంలో ఉంటుంది. అయితే అవి మూత్ర విసర్జన వ్యవస్థలోకి కూడా ప్రవేశించవచ్చు. అలాగే క్లెబిసియెల్లా, ఎంటరోకోకస్ ఫీకాలిస్ అనే సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్కు లొంగకుండా మొండిగా మారుతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రవిసర్జక నాళం పొడవు తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు సోకగల ప్రదేశాల పైన మలవిసర్జన నాళం వంటి ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పరిమాణంలో బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశం ఉండటంతో మహిళల్లో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మహిళల్లో సహజంగా ఉండే సిగ్గు, బిడియం ఎక్కువ. కాబట్టి ఇటువంటి కారణాలున్నప్పటికీ వైద్యం కోసం హాస్పిటల్స్కు వచ్చే వాళ్లు చాలా తక్కువ. సమస్య తీవ్రమైనప్పుడే వారు ఆసుపత్రులకు వస్తుంటారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. గుర్తించిన వెంటనే హాస్పిటల్కు వెళ్లి చికిత్స చేయించుకోవాలి, లేకపోతే కిడ్నీల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ ఆకర్షణీయమైన రంగుల ఆహారం తీసుకోవచ్చా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ వేసవి సెలవుల్లో ఊళ్లకు, బయటి ప్రదేశాలకు, విహార యాత్రలకు వెళ్తుంటాం కదా? అక్కడ ఆకర్షణీయమైన రంగులతో ఉండే ఆహారాలకు పిల్లలు తేలిగ్గా ఎట్రాక్ట్ అవుతుంటారు. ఆ ఆహారం వారికి ఇవ్వవచ్చా? – శ్రద్ధ శ్రీ, బళ్లారి ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు దీర్ఘకాలం నిల్వ ఉండటానికి వాడే ప్రిజర్వేటివ్స్... సన్సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్యాక్టివ్) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం లివర్ సిర్రోసిస్కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయింది. అందుకే రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. డాక్టర్ రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ మునుపటి చురుకుదనం సాధించడం ఎలా..? లైఫ్స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. గతంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. ఇటీవల నా ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో మునుపటిలా చురుగ్గా లేకపోవడం వల్ల నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను మునుపటిలాగే ఆరోగ్యాన్నే పొందడానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి. ఇక ఇటీవల సమ్మర్లో మరింత అలసట ఫీలవుతున్నాను. – బి. వెంకటేశ్వరరావు, గుంటూరు వయసు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. మీ వయసు వారిలో డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసు పైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినప్పుడు ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వేసవిలో మరింత నిస్సత్తువతోనూ, నీరసంగా ఉండటం జరుగుతోందంటే బహుశా మీరు నీటిని, ఉప్పును ఎక్కువగా చెమట రూపంలో కోల్పోవడం వల్ల కావచ్చు. వేసవిలో ఎక్సర్సైజ్ చేయవచ్చు. కానీ అవి ఎక్కువ శ్రమ కలిగించేలా కాకుండా బాగా తేలికపాటివే అయి ఉండాలి. ఈ సీజన్లో డీహైడ్రేషన్కు లోనుకాకుండా చూసుకోండి. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్ లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
సైనసైటిస్ అంటువ్యాధి కాదు
ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు చాలా ఎక్కువగా తలనొప్పి వస్తోంది. ఇది నాకు ఎవరి నుంచైనా వ్యాపించిందేమో అనిపిస్తోంది. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - విజయ్కుమార్, నల్లగొండ మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక చిన్న పట్టిక ఇది... అపోహ: సైనసైటిస్తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది. వాస్తవం: నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి వచ్చేవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాస్తవం: నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల మీకు ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి. వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. ఒకవేళ సైనస్లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. మీరు వెంటనే ఈఎన్టీ నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. - డా॥శ్రీనివాస్ కిశోర్ సీనియర్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అందుకే భారత్లో టీబీ ఇంతలా..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా క్షయ(ట్యుబరిక్యులోసిస్) వ్యాధి ప్రభావానికి లోనవుతున్న దేశం మనదే. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులపై దాడి చేసే బ్యాక్టీరియా కారక అంటువ్యాధి. భారత్లో ఈ వ్యాధి ఇంతలా ప్రభావం చూపడానికి కారణం ఇక్కడ అవలంభిస్తున్న ఔషధ విధానాలే అని కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది. ప్రపంచంలో అత్యధికంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తున్న దేశం ఇండియానే. అయితే.. ఈ యాంటీ బయాటిక్స్ మితిమీరిన వాడకం మూలంగానే భారత్లో క్షయ వ్యాధి మందులకు లొంగకుండా తయారవుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మధుకర్ పాయ్ వెల్లడించారు. ఇక్కడి ఫార్మసిస్టులు క్షయ వ్యాధి లక్షణాలు గల వారికి ఎలాంటి ఔషధాలు ఇస్తున్నారు అనే అంశంలో నిర్వహించిన పరిశీలనలో నివ్వెరపరిచే విషయాలు వెల్లడయ్యాయి. పూర్తిగా క్షయ వ్యాధి లక్షణాలతో ఉన్నవారికి ఫార్మిసిస్టులు సాధారణ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. సరిగ్గా క్షయ వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడే ఫస్ట్లైన్ యాంటీ టీబీ డ్రగ్స్(ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటాల్, స్ట్రెప్టోమైసిన్)ను ఫార్మసిస్టులు ఇవ్వడంలేదని గుర్తించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్న యాంటీ బయాటిక్స్ మూలంగా రోగులకు తీవ్ర హాని కలగడంతో పాటు.. భవిష్యత్తులో టీబీ మందులకు లొంగకుండా తయారవుతోందని పరిశోధకులు వెల్లడించారు. -
పెద్ద సమస్య అయితే తప్ప యాంటిబయాటిక్స్ వద్దు!
పరిపరి శోధన పిల్లలకు దగ్గు వస్తున్నా లేదా జలుబు కనిపించినా తల్లిదండ్రులు తమంతట తామే వారికి యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. పిల్లలకు వచ్చే సమస్యతో తల్లడిల్లిపోయి తక్షణం తగ్గడానికి యాంటీబయాటిక్స్ రాయమంటూ డాక్టర్లను అడుగుతుంటారు. అయితే చిన్న చిన్న సమస్యల కోసం ఆన్ కౌంటర్ మెడిసిన్గా లేదా డాక్టర్ను ఒత్తిడి చేసైనా పిల్లలకు యాంటీబయాటిక్స్ వాడటం సరికాదని తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇలా చిన్న వయసులోనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పెద్దయ్యాక వారిలో డయాబెటిస్ వచ్చేలా చేసేందుకు అవకాశాలు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కోసారి చిన్న వయసులోనే కనిపించే టైప్-1 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. పిల్లలందరిలోనూ ఈ అవకాశం ఎక్కువే అయినా మగపిల్లల్లో ఇలా జరిగే అవకాశాలు మరింత ఎక్కువని ‘జర్నల్ నేచర్ మైక్రోబయాలజీ’ అనే మెడికల్ జర్నల్ వివరిస్తోంది. -
మెడికిల్ షాపుల్లో..శంకర్ దాదా ఎంబీబీఎస్లు
♦ మందుల విక్రయాలకు చెల్లుచీటీ ♦ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ అమ్మకాలు ♦ అవి ఎలా పడితే అలా వాడితే దుష్ప్రభావం ♦ పశ్చిమ ప్రకాశంలో యథేచ్ఛగా విక్రయాలు జిల్లా వ్యాప్తంగా శంకర్ దాదా ఎంబీబీఎస్లు ఎక్కువయ్యారు. శంకర్ దాదాలు ఎవరో ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఓ సినిమాలో హీరో పాత్రధారి ఎంబీబీఎస్ చదవకుండానే తన తల్లిదండ్రులు, ప్రియురాలి మెప్పు పొందేందుకు నానాతంటాలు పడతాడు. ఎంబీబీఎస్ చదివిన వ్యక్తిలా ఎదుటి వారి ముందు కట్టింగ్ ఇస్తాడు. అది సినిమా.. జిల్లాలో అలాంటి శంకర్ దాదాలు చాలామందే ఉన్నారు. ఆర్ఎంపీల ముసుగులో కొందరు, మెడికల్ షాపుల యజమానుల ముసుగులో మరికొందరు రోగులకు మిడిమిడి జ్ఞానంతో మందులు ఇచ్చి అందిన కాడికి దండుకుంటున్నారు. మెడికల్ షాపుల యజమానులు ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. – మార్కాపురం రోగి అవసరాన్ని మందుల షాపుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చీటీ) లేకుండానే యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు. ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రమాణాలు పాటించకుండానే మందులు అమ్ముతున్నారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం తదితర పట్టణాల్లో మందుల షాపుల యజమానులు ఇచ్చిందే మాత్ర, అమ్మిందే ధరగా తయారైంది. నిబంధనలు తెలిసినా డాక్టర్లు సైతం తమ క్లినిక్ల్లో అనుమతులు లేకుండానే మందుల షాపులు పెట్టి విక్రయిస్తున్నారు. ఫార్మసిస్ట్ల సమక్షంలోనే మందులను విక్రయించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అరకొర పరిజ్ఞానం ఉన్న వారు సైతం మందులు విక్రయిస్తున్నారు. ఫార్మసీ చదివిన వారి పేరుతో లైసెన్స్ తీసుకుని ఈ తతంగాన్ని సాగిస్తున్నారు. 24 మండలాల్లో 500 మెడికల్ షాపులు మార్కాపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాలు.. అంటే మెుత్తం 24 మండలాల్లో దాదాపు 500 మెడికల్ షాపులున్నాయి. వాస్తవానికి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆస్పత్రుల ఫీజులు భరించలేక జ్వరం, దగ్గు, విరేచనాల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాన్ని గమనించిన మందుల షాపుల యజమానులు తమకు ఇష్టామొచ్చిన మాత్రతో పాటు అదనంగా ప్రతి రోగానికి యాంటిబయాటిక్స్ అమ్ముతున్నారు. పారాసిట్మల్ ట్యాబ్లెట్లలో సుమారు 20కి పైగా కంపెనీలు ఉన్నాయి. వాస్తవ ధర ఒక్కో ట్యాబ్లెట్ 25 పైసలు నుంచి 30 పైసలు మధ్య ఉండగా రోగికి రూ.1.50 నుంచి రూ.2లకు విక్రయిస్తున్నారు. డాక్టర్ రాసి ఇచ్చిన చీటీ లేనిదే మందులు విక్రయించకూడదన్న ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది మందుల షాపుల యజమానులు ఒకడుగు ముందుకేసి మిడిమిడి జ్ఞానంతో ఇంజెక్షన్లు సైతం చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో ఆర్ఎంపీలు ఆర్ఎంపీలు కొందరు మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న కెమిస్ట్, డ్రగ్గిస్ట్లు మాత్రమే రోగులకు మందులు విక్రయించాలి. పశ్చిమ ప్రకాశంలో కొంతమంది మెడికల్ షాపుల యజమానులు తమకు తెలిసిన వారి సర్టిఫికెట్లతో మందుల షాపులు నిర్వహిస్తున్నారు. తమ ఇష్టామొచ్చిన ధరలతో అమ్ముతూ రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. వైద్యులు రాసి ఇచ్చే మందులకు, మెడికల్ షాపుల యజమానులు ఇచ్చే మందులకు పొంతన ఉండకపోగా ఇదేమని ప్రశ్నిస్తే కంపెనీ తేడా.. మందు ఒక్కటే అంటూ సమాధానం చెబుతున్నారు. మార్కెట్లో వివిధ రకాల కంపెనీలు షాపుల యజమానులకు కమీషన్లు ఎక్కువగా ఇస్తుండటంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి దుకాణంలో రికార్డులు, బిల్లు పుస్తకాలు తప్పనిసరిగా నిర్వహించాలి. వినియోగదారునికి ధరతో కూడిన బిల్లు ఇవ్వాలి. ఆచరణలో ఇవి అమలు కావటం లేదు. ఇవి మచ్చుకు కొన్నే.. 4 ఇటీవల కనిగిరి, దర్శి, రాజంపల్లి, బేస్తవారిపేట, గిద్దలూరుల్లో లైసెన్స్లు లేకుండా మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకుని మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటి యజమానులపై డ్రగ్ ఇన్స్పక్టర్ కేసులు నమోదు చేశారు. 4 బేస్తవారిపేటలో ఫిజిషియన్ శాంపిల్స్ను అమ్ముతుండగా గుర్తించి ఆ మందుల దుకాణంపై కేసు నమోదు చేశారు. 4 దర్శిలో ఒక మందుల షాపులో గేదెలు పాలు ఎక్కువగా వచ్చేందుకు ఆక్సిడోసిన్ నకిలీ మందును అమ్ముతుండగా సీజ్ చేశారు. ఇది చాల ప్రమాదకరమైన మందు. నకిలీ కావటం గమనార్హం. ఎటువంటి కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీ దీనిపై లేదు. దీన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం మందుల షాపుల యజమానులు మందులను అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయవచ్చు. అలా ఫిర్యాదు చేసిన వినియోగదారుల పేర్లు గోప్యంగా ఉంచుతాం. మందుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కరపత్రాలు పంచుతున్నాం. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. కొన్ని మందులను డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు మందులు ఇస్తే చర్యలు తీసుకుంటాం. మెడికల్ షాపుల యజమానులకు కూడా అవగాహన కల్పిస్తాం. – జయరాముడు, డ్రగ్ ఇన్స్పెక్టర్, మార్కాపురం -
ఆ మందులతో ఏటా 23,000 మంది మృతి!
వాషింగ్టన్: అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడితే కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకే మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్ వాడటం మూలంగా భవిష్యత్తులో సంభవించే తీవ్రమైన రోగాలపై కూడా అవి ప్రభావం చూపలేవు. అయితే అమెరికా వైద్యులు మాత్రం.. తమ పేషెంట్లకు సూచిస్తున్న యాంటీబయాటిక్స్లో 30 శాతానికి పైగా అవసరం లేనివేనట. డాక్టర్లు సూచిస్తున్న ఈ మోతాదుకు మించిన యాంటీ బయాటిక్స్ వాడకం మూలంగా ఏటా 20 లక్షల మంది యాంటీబయాటిక్స్ కు లొంగని ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సంస్థ నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. అంతే కాదు డాక్టర్ల ఈ నిర్వాకం మూలంగా ఏటా 23,000 మృత్యువాతపడుతున్నారని సీడీసీ వెల్లడించింది. డాక్టర్లు రాసిన సుమారు 1,80,000 ప్రిస్క్రిప్షన్లను పరిశీలించి సీడీసీ తన ఫలితాలను వెలువరించింది. సైనసైటిస్, చెవి ఇన్ఫెక్షన్లు, గొంతు ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సూచిస్తున్న మందుల్లో మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. శ్వాసకోశ వ్యాదులకు సంబంధించి డాక్టర్లు సూచిస్తున్న యాంటీబయాటిక్స్లో 50 శాతం అసలు అవసరమే లేదని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా ఔట్ పేషంట్లకు సూచిస్తున్న ఓరల్ యాంటీబయాటిక్స్లో 30 శాతం అక్కర్లేనివేనని తెలిపింది. మోతాదుకు మించి వీటిని వాడటం ద్వారా కలిగే దుష్ఫలితాలను గురించి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందని సీడీసీ అభిప్రాయపడింది. -
తిరుగులేని యాంటీబయాటిక్స్
లండన్: యాంటీబయాటిక్స్లో కొత్త సంచలనానికి తెరతీశారు లింకన్ వర్సిటీ శాస్త్రజ్ఞులు. యాంటీబయాటిక్స్ను తట్టుకునే సామర్థ్యమున్న సూక్ష్మ క్రిములను కూడా చంపే ఔషధాన్ని వారు రూపొందించారు. ఈ కొత్త యాంటీబయాటిక్కు టీక్సోబాక్టిన్ అని పేరు పెట్టారు. మట్టిలోని సూక్ష్మజీవులతో దీన్ని తయారుచేశారు. సూక్ష్మజీవ నిరోధకాలను తట్టుకునే బ్యాక్టీరియాపై పోరులో కొత్త చరిత్రను సృష్టించబోతోందని గతేడాది అమెరికాలో ఈ మందు ప్రశంసలందుకొంది. దీన్ని కనిపెట్టిన బృందంలో భారత సంతతికి చెందిన ఈశ్వర్ సింగ్ అనే పరిశోధకుడు ఉన్నారు. పరీక్షల్లో ఇది సమర్థవంతంగా పనిచేసి, సూక్ష్మ క్రిములను చంపేసింది. ఈ మందు భవిష్యత్తులో అందుబాటులోకి రాగలదని శాస్త్రజ్ఞులు విశ్వాసంతో ఉన్నారు. -
ఆ వైరస్ సోకింది... చనిపోతానా?!
సందేహం నా వయసు 22. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అప్పుడప్పుడూ పిరుదుల్లో మంటలాగా వస్తోంది. కంటిన్యుయస్గా రావడం లేదు. వచ్చి ఆగుతోంది. తగ్గిపోయిందిలే అనుకుంటే మళ్లీ వస్తోంది. మంటతో పాటు దురద కూడా ఉంటోంది. బాగా నడిచినప్పుడు ఎక్కువగా అలా అవుతోంది. ఒక్కోసారి మోషన్కి వెళ్లాక కూడా నొప్పి, దురద వస్తాయి. మోషన్లో బ్లడ్ కానీ, వెళ్లేటప్పుడు నొప్పి కానీ లేవు. ఎందుకిలా వస్తోందో అర్థం కావడం లేదు. నెల రోజుల్నుంచీ యూరిన్ ఇన్ఫెక్షన్కి యాంటీ బయొటిక్స్ వాడుతున్నాను. వాటివల్ల ఇలా అవుతోందా? ఇప్పుడు నేనేం చేయాలి? - లోహిత, మెయిల్ మీరు ఎంత బరువు ఉన్నారు, చదువు కుంటున్నారా లేక ఉద్యోగం చేస్తున్నారా అనేవేవీ రాయలేదు. ఎందుకు అడుగుతున్నానంటే... ఉద్యోగరీత్యా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. అధిక బరువు ఉన్నవారు ఇలా గంటల తరబడి కూర్చునే ఉంటే... ఒక్కోసారి పిరుదుల్లోని నరాలు ఒత్తుకుని, మంటగా తిమ్మిరిగా అనిపించవచ్చు. మరికొంత మందికి కూర్చునే ఉండటం వల్ల గాలి ఆడక చెమట పట్టడం, పిరుదుల చర్మంపై మంటగా ఉండటం జరగవచ్చు. కొన్నిసార్లు వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మంట, దురద వచ్చే అవకాశం ఉంటుంది. నెల నుంచి యాంటీ బయొటిక్స్ వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడి, మంట దురద వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మోషన్కి వెళ్లాక మంట, దురద వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మోషన్లో నులి పురుగులేమైనా ఉండవచ్చు. లేదా మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల కూడా అలా జరగవచ్చు. పరీక్ష చేస్తేనే ఏదైనా చెప్పగలం. కాబట్టి మీరు ఓసారి డాక్టర్ని సంప్రదిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ మరేదైనా సమస్య కానీ ఉందేమో చూస్తారు. కడుపులో నులి పురుగులు ఉన్నాయా అనేది కూడా పరీక్షించి చికిత్స చేస్తారు. నాకు పెళ్లై మూడు నెలలు అవుతోంది. ఈ మధ్యనే నాకు హెర్పిస్ సింప్లెక్స్ 2 ఉందని తేలింది. రేపు నేను బిడ్డని కంటే ఈ వ్యాధి తనకి కూడా సోకుతుందా? ఈ వ్యాధి భవిష్యత్తులో క్యాన్సర్గా మారే అవకాశం ఉందా? నేనింకా ఎన్నేళ్లు బతుకుతాను? అసలు నేనేం ట్రీట్మెంట్ తీసుకోవాలి? - రమ, మెయిల్ కేవలం వైరల్ ఇన్ఫెక్షన్కే చావుదాకా ఎందుకు ఆలోచిస్తున్నారు? హెర్పిస్ సింప్లెక్స్ 2 అనేది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2 వల్ల వస్తుంది. దీనివల్ల జననేంద్రియాల వద్ద, తొడల వద్ద చిన్న చిన్న నీటి పొక్కులు వస్తాయి. వాటివల్ల అక్కడ దురద, మంట ఉంటాయి. మూత్రం పోసినప్పుడు మంట ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. దీన్ని నిర్ధారించడానికి క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు అవసరమైతే HSV2 Igg, Igm antibodies రక్తపరీక్షలు చేయాలి. అలాగే నీటిపొక్కుల నుంచి Swab తీసి మైక్రోస్కోపిక్ టెస్ట్కి పంపించవచ్చు. మీకు HSV2 నిర్ధారణ అయ్యింది కాబట్టి మీరు, మీవారు కూడా డాక్టర్ పర్యవేక్షణలో acyclovir, valacyclovir అనే యాంటీ వైరల్ మందులు, క్రీములు వాడి చూడండి. పొక్కులు పూర్తిగా తగ్గిపోయేవరకు కలయికకు దూరంగా ఉండండి. కొందరిలో ఈ పొక్కులు వాటికవే మాడిపోతాయి. అయితే ఈ వైరస్ చాలావరకూ నరాల్లో దాగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, మానసిక ఆందోళన, ఒత్తిడి వంటివి కలిగినప్పుడు మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చికిత్స కరెక్ట్గా తీసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదు. క్యాన్సర్గా మారే అవకాశాలూ లేవు. ఓసారి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా మూడు వారాల్లో HSV యాంటీ బాడీస్ తయారవుతాయి. వీటివల్ల మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పైన చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో మళ్లీ వచ్చినా... తీవ్రత తక్కువగా ఉంటుంది. గర్భం దాల్చినా బిడ్డకు సోకే అవకాశాలు ఉండవు. గర్భంతో ఉన్నప్పుడు కనుక HSV2 ఇన్ఫెక్షన్ వస్తే... అది వ్యాధి తీవ్రతను బట్టి బిడ్డకు సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా ఆలోచించి భయపడకుండా మీరు, మీవారు మంచి చికిత్స తీసుకోండి. - డా.వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్,హైదరాబాద్ -
రుచికే కాదు.. ఆరోగ్యానికీ...
తిక్క లెక్క మామూలు వంటకాలను సైతం తన ఘుమఘుమలతో మరింత రుచిగా మార్చే పుదీనాను రోమన్లు, గ్రీకులు మొదటిసారిగా గుర్తించి, దాని వాడకాన్ని వెలుగులోకి తెచ్చారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని వారి నమ్మకం. ఏథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించుకునేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట. పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే యాంటీబయాటిక్స్లా పని చేస్తాయని పలు పరిశోధనలు తేల్చాయి. దీని నుంచి తీసే మెంథాల్ను తల, గొంతు, నొప్పి నివారణకు వాడుతున్నారు. పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటిదుర్వాసన దూరమవుతుంది. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టిపడడమే కాకుండా, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ తగ్గుముఖం పడతాయట. ఎండాకాలంలో మజ్జిగతేటలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే ఎండదెబ్బ కొట్టకుండా ఉంటుందట. బిర్యానీలో పుదీనా ఆకులను వేసేది రుచికి, సువాసనకే కాదు... అజీర్తిని, విషాలను తొలగించడానికేనట! -
నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది...
యూరాలజీ కౌన్సెలింగ్ నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. అప్పటి నుంచి తరచూ మూత్రంలో మంట, నొప్పి వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. - ఒక సోదరి, హైదరాబాద్ మహిళలకు పెళ్లైన కొత్తలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. దీన్నే హనీమూన్ సిస్టైటిస్ అంటారు. కలయిక సమయంలో యోనిమార్గంలోని సూక్ష్మక్రిములు మూత్రాశయంలోకి ప్రవేశించడం వల్ల ఇలా అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూడు రోజులు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇది తగ్గిపోతుంది. మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కొన్ని మందులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా చాలా అవసరం. మా ఆవిడ వయసు 45 ఏళ్లు. నెల రోజల క్రితం మూత్రంలో రక్తం పడిపోయింది. అప్పటి నుంచి క్యాన్సరేమోనని ఆందోళన పడుతోంది. - మహేందర్రావు, మెదక్ మూత్రంలో రక్తం పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్, మూత్రవాహికలో రాళ్లు ఉండటం, క్యాన్సర్, టీబీ వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా రక్తం పోతుంది. ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకోడానికి స్కానింగ్, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కారణానికి తగిన చికిత్స చేస్తారు. ఒక్కోసారి రక్తం పడుతుండే ఈ లక్షణాన్ని చూసి ఇన్ఫెక్షన్గా భావించి, యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. ఇది సరికాదు. కనీసం అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి... రాళ్లు, గడ్డలు లాంటివి ఏమీ లేవని నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం. డాక్టర్ సనంద్ బాగ్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా మెడ, చెవుల భాగంలో దురద వస్తోంది. నా రోల్డ్గోల్డ్ చైన్ మెడకు ఆనే చోట ఈ దురద వస్తోంది. ఎన్ని ఆయింట్మెంట్స్, క్రీమ్స్ వాడినా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా? - సునీత, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది డర్మటైటిస్ కావచ్చు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. అవి.. కాంటాక్ట్ డర్మటైటిస్: స్పర్శను బట్టి వచ్చే చర్మ వ్యాధి ఇది. ఇందులో చర్మం గులాబీ రంగుకు మారుతుంది. ఇది దురదను కలిగిస్తుంది. చికాకు, అలర్జీని కలిగిస్తుంది. రబ్బరు తొడుగుల వల్లగానీ లేదా ఆభరణాలోని కోబాల్ట్ వంటి లోహాలు ఈ జబ్బుకు కారణమవుతాయి. కొన్ని పరిమళ ద్రవ్యాలు, నగలు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల ఇది సంభవించవచ్చు. నుమ్యులార్ డర్మటైటిస్: నుమ్యులార్ డర్మటైటిస్లో నాణెం ఆకృతిలో మచ్చలు వస్తాయి. ఇవి కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. సాధారణంగా ఇది 55 నుంచి 65 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ని ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లుగా ఉండటం, కొద్దిగా పొరలు తయారవ్వడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దురద ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిమా వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపు రంగులో కములుతుంది. తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. ఇవి క్రమంగా నీటి బుగ్గల ఆకృతిని సంతరించుకుంటాయి. సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లలలో కనిపిస్తుంది. ముఖం, తల మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా ఉంటుంది. కనుబొమల వద్ద, ముక్కు పక్కల వ్యాపిస్తుంది. ఇది అధిక ఒత్తిడి వల్ల రావచ్చు. కారణాలు: కొన్ని రకాల మందులు జుట్టుకోసం వాడే రంగులు కుంకుమ మొదలైన పదార్థాల వల్ల డర్మటైటిస్ వస్తుంది. జంతుచర్మాలతో తయారైన ఉత్పాదనలు, రోల్డ్గోల్డ్ నగల వల్ల కూడా డర్మటైటిస్ రావచ్చు. డర్మటైటిస్కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్, క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్ వంటి మందులను రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి డీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అత్తగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య పొడిదగ్గు, పడుకుంటే ఆయాసంతో నిద్రలేవడం, గుండెదడ వంటివి వస్తుంటే డాక్టర్ను సంప్రదించాం. హార్ట్ వాల్వ్లలో సమస్య ఉందని డాక్టర్ గారు అన్నారు. అసలు ఈ వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుందో వివరించి, లక్షణాలు కారణాల గురించి దయచేసి తెలపండి. - సునీత, నందిగామ మీరు చెప్పిన లక్షణాల బట్టి మీ అత్తగారికి గుండె కవాటాలలో సమస్య (హార్ట్ వాల్వ్ డిసీజ్) ఉందని తెలుస్తోంది. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి.. 1) ట్రైకస్పిడ్ వాల్వ్ 2) పల్మనరీ వాల్వ్ 3) మైట్రల్ వాల్వ్ 4) అయోర్టిక్ వాల్వ్. వీటిలో రెండు రకాలు సమస్యలు రావచ్చు. అవి... వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)తో పాటు వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్). వాల్వ్ సమస్యలకు కారణాలు: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల, మరికొందరికి ఇవి పుట్టుకతోనే రావచ్చు. కొందరిలో వయసు పెరగడం వల్ల కూడా రావచ్చు. వాల్వ్ సమస్యలో లక్షణాలు: హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం, పొడి దగ్గు, పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం, గుండె దడ కనిపిస్తాయి. నిస్సత్తువతోనూ ఒక్కోసారి గుండెనొప్పి రావచ్చు. కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీ-గర్జిటేషన్) సమస్యతో కాళ్ల వాపు మైట్రల్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) రక్తపు వాంతులు అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) స్పృహ తప్పవచ్చు. ఇప్పుడు ‘ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్’ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్ను మార్చవచ్చు. వాల్వ్ సమస్యలకు చికిత్స: వీటికి కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మైట్రల్ వాల్వ్ సన్నగా మారడం (స్టెనోసిస్) జరిగితే... రోగులకు బెలూన్ వాల్విలోప్లాస్టీ చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా గుండె కవాటాల్లో సమస్య తలెత్తితే ఈ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం. వాల్వ్స్ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్ను ఉపయోగించవచ్చు. అవి... 1) మెకానికల్ వాల్వ్స్ 2) టిష్యూ వాల్వ్స్. మెకానికల్ వాల్వ్స్ విషయంలో ఒక ప్రతికూలత ఉంది. ఈ రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ వాడాల్సి ఉంటుంది టిష్యూ వాల్వ్స్ ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్స్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ప్రస్తుతం వాల్వ్స్ మార్చడం కన్నా ఉన్న వాల్స్ ఎప్పుడూ మెరుగైనవి కావడంతో సర్జరీ కంటే వాల్వ్స్ రిపేర్ చేయడమే మేలు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
యాంటీబయోటిక్స్తో మతిభ్రమణం!
పరిపరి శోధన చిన్నా చితకా ఇబ్బందులకు ఎడా పెడా యాంటీబయోటిక్స్ వాడటం చాలామందికి అలవాటే. అయితే, మోతాదు చూసుకోకుండా ఇష్టానుసారం యాంటీబయోటిక్స్ వాడితే ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించిన యాంటీబయోటిక్స్ వాడటం వల్ల శారీరక సమస్యలు మాత్రమే కాదు, కొందరిలో తాత్కాలిక మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్త డాక్టర్ శామిక్ భట్టాచార్య చెబుతున్నారు. దీర్ఘకాలంగా మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడేవారిలో రకరకాల భ్రమలు కలగడం, సంధి ప్రేలాపనలు వంటి లక్షణాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు ఆయన తెలిపారు. -
కుందేటి జ్వరం..!
మెడిక్షనరీ ఈ జబ్బు పేరు కుందేలు జ్వరం. పేరుకు కుందేలు జ్వరం అయినా నిజానికి ఇది ఫ్రాన్సిస్ టులరెన్సిస్ అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది. ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు కాబట్టి దీన్ని వైద్యపరిభాషలో ‘టులెరేమియా’ అని కూడా అంటారు. కుందేళ్లు, ఆ జాతికి చెందిన ఇతర ప్రాణుల వల్ల వాటి నుంచి మనుషులకూ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో జ్వరం, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెంపుడు కుందేళ్లకు తగిన వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఈ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. వాటిని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే గ్లౌవ్స్ వంటివి తొడుక్కోవడం మేలు. ఇక కుందేలు జ్వరం వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్ట్రెప్టొమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ తరగతికి చెందిన యాంటీబయాటిక్స్తో దీనికి చికిత్స చేయవచ్చు. -
ఈ రోగానికి మందేది?!
మితి మీరితే ఏదైనా వికటిస్తుంది. అది ప్రాణాధార మందుల విషయంలో కూడా వాస్తవమేనని తరచు వెల్లడవుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. వచ్చిన వ్యాధేమిటో తెలియక, రోగి పడుతున్న నరకయాతనను చూడలేక ఆప్తులంతా క్షోభించే పాడుకాలం అంతరించి...రోగకారక క్రిములను మట్టుబెట్టే యాంటీ బయాటిక్స్ అందుబాటులోకొచ్చినప్పుడు ప్రపంచమంతా సంతోషించింది. యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో ఒక విప్లవాత్మక పరిణామం. రోగాన్ని నిరోధించి, ఆయుఃప్రమాణాన్ని పెంచడంలో అవి కీలక పాత్ర పోషించాయి. దేన్నయినా జయించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. తరాలనుంచీ, యుగాలనుంచీ మానవజాతి ప్రాణాలు తోడేస్తున్న అంటువ్యాధులపై 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొనడంతో మొదలెట్టి దాదాపు వంద రకాల యాంటీయాటిక్స్ అందుబాటులోకొచ్చాయి. అయితే అవసరం జూదంగా మారకూడదు. విచక్షణా, హేతుబద్ధతా కొరవడకూడదు. యాంటీబయాటిక్స్ విషయంలో జరిగింది అదే. రోగి స్థితిగతులను అంచనావేసి, రోగ తీవ్రతను ఆధారం చేసుకుని మోతాదు నిర్ధారించాల్సి ఉండగా... అందుకు బదులు విచ్చలవిడి వాడకం ఎక్కువైంది. 'పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం...' అన్నట్టు అన్నిటికీ యాంటీబయాటిక్స్ వినియోగించడం పెరిగిపోయింది. కనుకనే వ్యాధి కారక క్రిములు మొండి ఘటాలుగా మారాయి. ఏ మందులనైనా తట్టుకునే స్థితికి చేరుకున్నాయి. పర్యవసానంగా తేలిగ్గా తగ్గవలసిన వ్యాధులు దీర్ఘకాలం పీడిస్తున్నాయి. ఇదే వరస కొనసాగితే భవిష్యత్తులో చిన్న చిన్న గాయాలు కూడా మానే స్థితి ఉండకపోవచ్చునని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మనం ఎలాంటి విపత్కర స్థితికి చేరువవుతున్నామో తెలియజెబుతున్నాయి. ఇతర రంగాల మాదిరే వైద్య రంగం కూడా వ్యాపారమయం కావడంవల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మనుషుల ప్రాణాలతో ముడిపడి ఉండే ఆరోగ్యరంగంలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం మితిమీరడంవల్లనే ఇంతగా వికటించింది. ఔషధ సంస్థలకూ, వైద్యులకూ ఉండాల్సిన సంబంధమూ.... వైద్యుడికీ, రోగికీ ఉండాల్సిన బంధమూ గతి తప్పాయి. అనైతికత, అమానవీయత దండిగా పెరిగాయి. పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఔషధ సంస్థలు అడ్డదారిలో అమాంతం ఎదగాలని చూస్తున్నాయి. నాణ్యమైన మందుల్ని ఉత్పత్తి చేయడానికి బదులు నాసిరకం సరుకును మార్కెట్లోకి వదులుతున్నాయి. కొన్నేళ్ల క్రితం 167 రకాల యాంటీబయాటిక్స్పై ఆరా తీసినప్పుడు అందులో కేవలం 15 మాత్రమే వ్యాధులను ఎదుర్కొనడానికి ఉపయోగపడతాయని తేలింది! ఔషధ సంస్థలు వైద్యులకు ఆకర్షణీయమైన బహుమతులను ఎరగా చూపి అమ్మకాలను పెంచుకుంటుంటే...రోగి ఆర్థిక స్థోమతనుగానీ, మందుల వాడవలసిన అవసరాన్నిగానీ పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా అంటగట్టే ధోరణి వైద్యుల్లో పెరుగుతోంది. ఇవి చాలవన్నట్టు వచ్చిన రోగమేదో తెలియకుండా, వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకుండా మందుల దుకాణాలకెళ్లి సమస్య చెప్పి ఏవో మాత్రలు కొనుగోలు చేసి వాడేవారూ ఎక్కువయ్యారు. కట్టుదిట్టమైన చట్టాలుండటంతోపాటు వాటి అమలు తీరును పర్యవేక్షించే వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి పోకడలను నియంత్రించడం సాధ్యమవుతుంది. అవి సక్రమంగా పనిచేయకపోవడంవల్లనే రోగ నిరోధకత నానాటికీ క్షీణిస్తున్నదని గుర్తించాలి. నిజానికిది మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. చాలాచోట్ల అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.ఈ ప్రమాదం గురించి 2001లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ అతివాడకాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టకపోతే గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని తెలిపింది. ఈ హెచ్చరికల పర్యవసానంగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. మన దేశంలో ఇలాంటి పరిస్థితి కనబడదు. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్లు ఎన్నడో కనుమరుగయ్యారు. ఇప్పుడు భారీ పెట్టుబడులతో కార్పొరేట్ ఆస్పత్రులు రంగంలోకొచ్చాయి. అవి రోగిని వైద్య సాయం అవసరం పడిన వ్యక్తిగా కాక, కస్టమర్గా భావిస్తున్నాయి. వేల రూపాయలు వ్యయమయ్యే వైద్య పరీక్షలు సరేసరి...అవసరంలేని మందుల్ని అంటగట్టే పోకడలు కూడా పెరిగాయి. అసలు ఏ వ్యాధికైనా అల్లోపతి వైద్య విధానం తప్ప మరే విధమైన ప్రత్యామ్నాయమూ లేదని భావించే వాతావరణం ఏర్పడింది. వ్యాధి ప్రాథమిక దశలో ఉండగా ఇంట్లో లభించే చిన్న చిన్న వాటితో దాన్ని అరికట్టడం తేలికవుతుందన్న అవగాహన ఒకప్పుడు ప్రజల్లో ఉండేది. అది రాను రాను కరువవుతోంది. దేనికైనా ఒక మాత్ర మింగేస్తే తేలిగ్గా తగ్గిపోతుందన్న దురభిప్రాయం ఏర్పడుతోంది. కిందిస్థాయి వరకూ పటిష్టమైన యంత్రాంగం ఉండే ప్రభుత్వాలు తల్చుకుంటే ఇలాంటి లోటుపాట్లను సరిదిద్దడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ పని జరగడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలను మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)వంటి వృత్తిగత సంస్థల వైఫల్యం కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి సంస్థలు వైద్యుల్లో మాత్రమే కాదు...ప్రజల్లో సైతం యాంటీబయాటిక్స్పైనా...వాటి దుర్వినియోగం, అతి వినియోగంవల్ల కలిగే అనర్థాలపైనా గట్టిగా ప్రచారం చేస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. అలాగే మందుల వినియోగంపై ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సులు, గ్రామీణ ఆరోగ్య సహాయకులవరకూ అందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుండాలి. మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే పరిస్థితి కాస్తయినా మెరుగుపడుతుంది. నిర్లక్ష్యమనే రోగాన్ని వదుల్చుకుంటేనే ముంచుకొస్తున్న ముప్పును ఆపడం తేలికవుతుంది. -
మాటిమాటికీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్స్?
ప్రైవేట్ కౌన్సెలింగ్ నాకు 32 ఏళ్లు. సెక్స్ చేసిన ప్రతిసారీ మూత్రంలో మంట వస్తోంది. నాకంటే కూడా నా భార్యకు విపరీతమైన మంట, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, పొత్తికడుపులో నొప్పిగా ఉండటం జరుగుతోంది. యాంటీబయాటిక్స్ వాడినప్పుడల్లా సమస్య కొద్దిగా తగ్గినా రెండు మూడు నెలల తర్వాత మళ్లీ వస్తోంది. దాంతో సెక్స్ అంటేనే భయంగా ఉంది. దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపండి. - జి.ఎస్.ఆర్., సూళ్లూరుపేట మీరు చెబుతున్న లక్షణాలు బట్టి మీరిద్దరూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. సెక్సువల్ ఇంటర్కోర్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత మరింత ఎక్కువవుతోంది. చాలామంది మహిళల్లో వాళ్ల యోని బ్యాక్టీరియాతో కంటామినేట్ కావడం వల్ల, లేదా ఈ బ్యాక్టీరియాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి (రెసిస్టెన్స్) తక్కువగా ఉండటం వల్ల యోని నుంచి బ్లాడర్కు తఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మీరిద్దరూ యూరిన్ కల్చర్, బ్లడ్ షుగర్ వంటి పరీక్షలు చేయించుకొని, పూర్తి కోర్సు యాంటీబయాటిక్స్ మధ్యలో ఆపకుండా వాడండి. అప్పటికీ తగ్గకపోతే ఇద్దరూ యూరాలజిస్ట్ను సంప్రదించండి. నా వయస్సు 74 ఏళ్లు. ప్రోస్టేట్ గ్లాండ్ను పూర్తిగా తొలగించారు. అయితే అంగస్తంభనలు మాత్రం బాగానే ఉంటున్నాయి. అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తున్నాను. కానీ వీర్యం మాత్రం అస్సలు రావడం లేదు. నాకు వీర్యం ఎందుకు కావడం లేదు? ఈ ఆపరేషన్ తర్వాత సెక్స్ చేయవచ్చా? - ఆర్.ఆర్.డి., గుంటూరు ప్రోస్టేట్ గ్లాండ్ తొలగించిన తర్వాత వీర్యం ఎక్కువగా రాదు. ఎందుకంటే వీర్యంలో ఎక్కువభాగం ఈ గ్రంథి నుంచే తయారవుతుంది. అంగస్తంభనలు బాగా ఉండి మీరు సెక్స్ చేయగలుగుతుంటే నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఇందువల్ల ఎలాంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు. ఈ వయస్సులో వీర్యం వచ్చినా, రాకపోయినా దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు సెక్స్లో సంతృప్తి ఉంటే చాలు. నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇక పిల్లలు పుట్టకుండా నేను వాసెక్టమీ చేయించుకోవాలనుకుంటున్నాను. అయితే మగతనానికి ఏదైనా లోపం వస్తుందేమోనని నాకు ఆందోళన కలుగుతోంది. ఒక్కోసారి మా ఆవిడకు ట్యూబెక్టమీ చేయిద్దామని కూడా అనుకుంటున్నాను. మా ఇద్దర్లో ఎవరు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది? వాసెక్టమీ చేసిన తర్వాత మగతనం తగ్గుతుందని మా ఫ్రెండ్స్ అంటున్నారు. ఇది వాస్తవమేనా? - వి.ఆర్.కె., తల్లాడ మహిళలకు ట్యూబెక్టమీ చేయించడం కంటే మగవారిలో వాసెక్టమీ చేయడం సర్జికల్గా చాలా సులభమైన ప్రక్రియ. వాసెక్టమీ చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. ఈమధ్య కాలంలో ఒక్క కుట్టు కూడా లేకుండా, బ్లేడ్ ఉపయోగించకుండా కూడా ఈ ఆపరేషన్ చేయడం సాధ్యమవుతుంది. దీన్ని ‘నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ’ అంటారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ మర్నాటి నుంచి అన్ని పనులూ మామూలుగానే చేసుకోవచ్చు. ఈ సర్జరీ వల్ల అంగస్తంభనల్లోగాని, సెక్స్ కోరికల విషయంలోగాని, పురుషత్వపు సామర్థ్యంలోగాని ఎలాంటి తేడాలు ఉండవు. శరీర దారుఢ్యంలోగాని, బరువులు ఎత్తడంలోగాని, ఫిట్నెస్లోగాని ఎలాంటి మార్పులు రావు. ఇంత తేలికైన ఆపరేషన్ కాబట్టే సాధారణంగా మగవారే వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తారు. నాకు 60 ఏళ్లు. రోజూ ఒక పాకెట్కు పైగా సిగరెట్లు తాగుతాను. గత 15 రోజుల నుంచి నాకు మూత్రంలో రక్తం పడుతోంది. అయితే మంట, నొప్పి ఏమీ లేవు. ఈ వయస్సులో మూత్రంలో రక్తం పడటం మంచిది కాదని తెలిసినవాళ్లు అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎం.వి.పి.ఆర్., కందుకూరు నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడటాన్ని ‘పెయిన్లెస్ హిమచ్యూరియా’ అంటారు. యాభై ఏళ్లు పైబడిన వారిలో ఇలా రక్తం పడే లక్షణం కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా పొగ తాగేవాళ్లలో వాళ్ల స్మోకింగ్ అలవాటు వల్ల బ్లాడర్లో చిన్న చిన్న గడ్డల వల్ల కూడా ఇది రావచ్చు. ఇదిగాక ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జిమెంట్ వల్ల లేదా ఇతరత్రా మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా మూత్రంలో రక్తం రావచ్చు. కారణం ఏమైనా ఇలా నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీ, మూత్రపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ముందు మీరు మీ స్మోకింగ్ అలవాటును పూర్తిగా ఆపేయండి. అయితే తక్కువ వయస్సున్న వారిలో ఇలా మూత్రంలో రక్తం పడితే అది ఎక్కువశాతం ఇన్ఫెక్షన్ల వల్లనే కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వీలైనంత త్వరగా యూరాలజిస్ట్ను కలవండి. నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. దాంతో నా పురుషాంగం కొంచెం ఎడమవైపునకు ఒంగినట్లుగా ఉంది. దాంతో అంగం స్తంభించినప్పుడల్లా నా పురుషాంగం ఎడమవైపునకు ఒంగుతోంది. వృషణాలు ఒకే లెవెల్లో లేకపోవడం వల్లనే పురుషాంగం ఇలా పక్కుకు వంగుతోందా? దీనివల్ల నేను పెళ్లి చేసుకొని సెక్స్లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా? దీనికి చికిత్స ఉంటుందా? - కె.ఎస్.ఆర్., తెనాలి వృషణాలు సమానమైన లెవెల్లో ఉండకపోవడం చాలా సాధారణం. అంగం కూడా కొంచెం ఎడమవైపునకో, కుడివైపునకో పక్కకు తిరిగి ఉండటం కూడా సహజమే. పురుషాంగం ఇలా పక్కకు తిరిగి ఉండటానికీ, వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభనలు నార్మల్గా ఉండి, వృషణాల్లో నొప్పి లేకపోతే మీరు నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. మీరు అందరిలాగే దాంపత్యసుఖం అనుభవించగలరు. వైద్యపరంగా మీకు ఎలాంటి సమస్యా లేదు. ఈ అంశం మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కాదు. -
పిల్లల్లో యాంటీబయాటిక్స్తో జువెనైల్ ఆర్థరైటిస్ ఎక్కువ!
కొత్త పరిశోధన పిల్లల్లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల చిన్నతనంలోనే వాళ్లకు ఆర్థరైటిస్ (ఎముకలు పెళుసుబారి తేలిగ్గా విరిగిపోయే జబ్బు) వస్తుందని తేలింది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్స్ వాడే పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్) చాలా ఎక్కువని తెలిసింది. ‘‘ఒక ఏడాది కాలంలో తరచూ ఏదో ఇన్ఫెక్షన్ల వల్ల యాంటీబయాటిక్స్ చాలాసార్లు వాడిన పిల్లలను పరిశీలించినప్పుడు ఈ వాస్తవం నిరూపితమైంది’’ అంటున్నారు నిపుణులు. అది ఏ యాంటీబయాటిక్ అయినప్పటికీ దాన్ని వాడని పిల్లలతో పోలిస్తే యాంటీబయాటిక్స్ వాడే పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు రెట్టింపు అని తేలింది. సాధారణంగా పిల్లల్లో శ్వాసనాళం ఇన్ఫెక్షన్లు (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తుంటారు. ఇలాంటి పిల్లలను పరిశీలించినప్పుడు వారిలో జువెనైల్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువే అని తేలింది. ఇక్కడో మంచి విషయం ఏమిటంటే.. యాంటీఫంగల్ లేదా యాంటివైరల్ డ్రగ్స్ వాడినప్పుడు మాత్రం వాటి వల్ల జువెనైల్ ఆర్థరైటిస్ పెరిగిన దాఖలాలు కనిపించలేదు. కేవలం యాంటీబయాటిక్స్ వల్లనే జువెనైల్ ఆర్థరైటిస్ అనే అనర్థం రావడం పరిశోధకులు గమనించారు. అందుకే పిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడే సమయంలో చాలా విచక్షణతో వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్లో పొందుపరిచారు ఈ పరిశోధనకర్తలు. -
ఆరోగ్యానికి పారాహుషార్!
మనం కాస్త పరాకును వదిలి అప్రమత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మన ఉదాసీనతను వీడి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న వ్యాధులు దేశాన్ని చుట్టుముట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రజలకు తెలియజెప్పే సంకల్పాన్ని తీసుకుంది ‘సాక్షి’. ఇందుకోసం ఈ నెల 8, 9 తేదీల్లో హైటెక్స్ ‘సాక్షి వెల్నెస్ ఎక్స్పో’ పేరిట భారీ ప్రదర్శనను, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా సాక్షి మీ ముందుకు తెస్తున్న మరణమృందంగ ఘంటికా రావాల శబ్దాలివి. ఇవి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసం మాత్రమే. అవగాహన పెంచుకొని రాబోయే ముప్పును మనమంతా ఎదుర్కోవడం కోసమే. ఆనాడది అంతు చిక్కని కాలం! ఒకప్పుడు అది అంటురోగాల కాలం! యాంటీబయాటిక్స్ కనిపెట్టని కాలంలో అంటువ్యాధులంటే అంతుచిక్కని వ్యాధులే!! మశూచీ, ప్లేగు, కలరా లాంటి వ్యాధులు అతి వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేవి. ఇలా ముట్టుకున్న వెంటనే అంటుకునే సాంక్రమిక వ్యాధులు యాంటీబయాటిక్స్ కనిపెట్టాక అదుపులోకి వచ్చాయి. అంటే మనం పురోగమించాం. అన్ని రకాలుగా! ఎన్నో చిరుతిండ్లు... కానీ పోషకాల్లేవు. ఎన్నో సుఖాలు... కానీ శారీరక శ్రమ లేదు. ఎన్నో వినోదాలు... కంటి నిండా నిద్ర లేదు. ప్రస్తుతం జీవనశైలి వ్యాధుల తీవ్రదశ కొనసాగుతోంది. అందుకే వీటి గురించి అవగాహన పొంది, నివారణ కోసం ఉద్దేశించిన కథనమిది... ఆధునిక జీవనశైలి... అనారోగ్య కారణం ఆధునిక జీవనశైలితో వచ్చిన మార్పులు అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న మాట ఇది. ఈ అనారోగ్యాలు ప్రమాదకరమైన వేగంతో విస్తరిస్తూ పోతున్నాయి. ప్రస్తరిస్తూ పెరుగుతున్నాయి. పెచ్చరిల్లుతున్నాయి. కునారిల్లజేస్తున్నాయి. కూలిపోయేలా, జీవితాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న వ్యాధులివే... డయాబెటిస్ (మధుమేహం) హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) స్థూలకాయం థైరాయిడ్ సమస్యలు ఎముకలు పెళుసుబారి పుట్టుక్కున విరిగేలా చేసే ఆస్టియోపోరోసిస్ పెద్దపేగు, ఊపిరితిత్తులు... మొదలైన అన్ని రకాల క్యాన్సర్లు సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు సంతానలేమి విటమిన్ డి లోపాలు, దాని వల్ల వ్యాధినిరోధకశక్తి లోపించి వచ్చే అనేక రకాల వ్యాధులు విటమిన్ బి12 లోపాలు గుండెజబ్బులు. ఎందుకిలా జీవనశైలి వ్యాధులు తీవ్రతరమవుతున్నాయి? డెబ్బయిల తర్వాత మన జీవనశైలిలో వచ్చిన వేగవంతమైన మార్పులతో ఈ వ్యాధుల తీవ్రత మరింత పెరుగుతోంది. వ్యాధుల తీవ్రత పెరగడానికి దోహదపడుతున్న ఆధునిక మార్పులివే... నగరీకరణ : మంచి చదువులు, మంచి ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పల్లెలు వదిలి నగరాలకు రావడం పెరిగింది. అంతేకాదు... మునుపటితో పోలిస్తే పల్లెల్లోనూ నగరీకరణ పోకడలు పెరిగాయి. దాంతో పట్టణల్లోనే కాదు... మునుపటితో పోలిస్తే పల్లెల్లోనూ కాలుష్యం పెరగడం, ఆకుపచ్చదనం తగ్గడం, ఆటలాడటానికి అనువైన స్థలాల లేమి వంటివి పెరిగాయి. ఇవన్నీ అనారోగ్యానికి దోహదం చేసే అంశాలే. ఆహారపు అలవాట్లు : మనం తినే ఆహారంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోయాయి. ఇందులో పోషకాల కంటే రుచి కోసం కొవ్వు, క్యాలరీలే ఎక్కువ. ఇక ఈ నవీనకాలంలోని వ్యయసామర్థ్యాలను పెంచుకోవడం కోసం భర్తా, భార్య... ఇద్దరూ సంపాదిస్తున్నారు. దాంతో మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేసుకునే సమయం లేక ఏదో సమయానికి ఎంతో కొంత కడుపులో పడేలా చూసుకుంటున్నారు. అంతే తప్ప... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు. శారీరక శ్రమ లేకుండా ఎప్పుడూ కూర్చొని ఉండే జీవనశైలి : ఇటీవల అందుబాటులోకి వచ్చిన చాలా రకాల ఉపాధి అవకాశాలు దాదాపుగా శారీరక శ్రమ లేకుండా కూర్చొని చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఐటీ ఉద్యోగాల వంటి వాటిల్లో 10 - 12 గంటలు కూర్చొనే ఉండాల్సినవే. రైతులు, పొలాల్లో పనిచేసే వారు మినహా మిగతావారంతా దాదాపుగా ఎక్కువసేపు కూర్చొనే పనిచేస్తుంటారు. వాహన సౌకర్యాలు : గతంలో మన తండ్రులు, తాతలు నడుస్తూనో లేదా సైకిల్ మీదో కార్యాలయాలకు వెళ్లేవారు. కానీ ఇటీవల శరీర శ్రమకు ఏమాత్రం ఆస్కారం లేని వాహన సౌకర్యాలే ఎక్కువ. నడవడానికి అవకాశం దాదాపు లేదు. ఇక ఇంట్లో ఉన్నా సరే... గతంలో ఉన్న కార్యకలాపాలు కాస్త ఒంటికి పనిచెప్పేవిగా ఉండేవి. కానీ ఇటీవల ఇంట్లో మనం వ్యవహరించే తీరుతెన్నుల్లోనూ మార్పు వచ్చింది. పని పేరిట ల్యాప్టాప్ మీద, వినోదం పేరిట టీవీ స్క్రీన్ మీద నిలిపి, శరీరాన్ని ఏ సోఫా మీద వదిలేస్తున్నాం. పైగా ఇదే సమయంలో ఏదో నములుతూ ఉండిపోతున్నాం.ఈ ఆధునిక అవలక్షణాలన్నింటితోనూ వ్యాధులకు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం... ఆ అనువైన ఆవాసమే - మన శరీరం! ఒత్తిడితో చిత్తుచిత్తుగా ఓటమి : ఇటీవల దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యమైన స్థానాన్ని ఆక్రమించుకుంది ‘ఒత్తిడి’. అది పని ఒత్తిడి కావచ్చు. ఇంట్లోని ‘డొమెస్టిక్ ఒత్తిడి’ కావచ్చు. వీధిలో ‘సామాజిక ఒత్తిడి’ కావచ్చు. ఇలా ఒత్తిడి బారిన పడని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. పైగా పనిగంటలూ మారిపోయాయి. దాంతో అనాదిగా మనిషి విశ్రాంతి కోసం ప్రకృతి నిర్దేశించిన సమయం సైతం ఒత్తిడిని కలిగించి అనేక శారీరక, మానసిక రుగ్మతలకు తావిస్తోంది.వేళకు తినకపోవడం, ఏది పడితే అది తినడం, వేళలు తప్పి పనిచేయడం, వేళలు తప్పి నిద్రపోవడం లాంటి అన్ని అంశాలూ కలగలసిపోయి, కలగాపులగమై మనిషిని వ్యాధులకు గురిచేస్తున్నాయి. జీవనశైలి వ్యాధులతో జీవితంపై ఎంత భారం...? ఎంత బరువు? ఊబకాయంతో బతుకు బరువు! ఆధునిక జీవనశైలి వల్ల మన జీవితం అన్ని విధాలా ఎంత భారమవుతోందో గ్రహించడానికి ఒక్క స్థూలకాయ సమస్యే చాలు. ఒక్క ఒళ్లు బరువైపోతే జీవితంలోని ఎన్నో అంశాలు బరువైపోయినట్లే! ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య 1980 నుంచి 2014 నాటికి రెట్టింపు అయ్యింది. పద్ధెనిమిదేళ్లు దాటిన వారిలో ప్రస్తుతం 11 శాతం మంది పురుషులుంటే మహిళల్లో 18 శాతం మంది ఊబకాయులే.2013 నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో నాలుగు కోట్ల ఇరవై లక్షలమంది పసిపిల్లలంతా ఊబకాయులే. ఇలా పిల్లల్లో ఊబకాయం సమస్య ఇంతగా పెచ్చరిల్లుతుంటే తొలిలెక్కల్లో 34 ఏళ్ల వ్యవధిలోనే స్థూలకాయుల సంఖ్య రెట్టింపైనప్పుడు 2013 నాటి లెక్కల ప్రకారం వీళ్లంతా తమ ఒంటినే పెద్దబరువుగా పరిగణిస్తూ బతుకును ఈడుస్తూ ఉంటారు. ఇప్పుడు కాస్త మంచి ఆహారం అందుబాటులో ఉన్న దేశాలలో, ధనిక దేశాలతో పాటు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం మూడో వంతు మంది చిన్నారులు చాలా భారంగా తమ బతుకులను ఈడుస్తూ జీవించబోతున్నారు. చేదుగా అనిపించినా ఇది భవిష్యత్తు నిజం. గడగడలాడించే డయాబెటిస్ గణాంకాలు : డయాబెటిస్ ప్రపంచాన్ని ఎంతగా గడగడలాడిస్తుందో చెప్పడానికి మాటలక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒకరో, ఇద్దరో డయాబెటిస్ పేషెంట్లు ఉండనే ఉంటారు. డయాబెటిస్ సభ్యులు లేని కుటుంబమే భారత్లో లేదంటే అది అతిశయోక్తేమీ కాదు. గణాంకాల్లో చెప్పాలంటే... 2000 నాటికి మన దేశంలో 62 లక్షల మంది డయాబెటిస్ రోగులు ఉండేవారని అంచనా. ఇవాళ్టికి ఆ సంఖ్య 3.17 కోట్లకు చేరి, ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. (2.08 కోట్లతో రెండో స్థానంలో చైనా, 1.77 కోట్ల మందితో యూఎస్ మూడోస్థానంలో ఉన్నాయి). అయితే కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే పాశ్చాత్యదేశాలను అధిగమించేలా మన దగ్గరి రోగుల సంఖ్య ఇంత తీవ్రంగా పెరిగిందంటే మనం ఏ మేరకు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి ఆ సంఖ్య 36.6 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఇప్పుడున్న జనాభాలో మూడో వంతు డయాబెటిస్ రోగులు ఉంటారంటే వణుకు పుట్టడం లేదూ! పైన పేర్కొన్న అనారోగ్య పరిస్థితులన్నీ భారత్లో ఈ వ్యాధి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడానికి దోహదం చేస్తోంది. కేవలం గతంలో పెద్దల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి, ఇప్పుడు టైప్-1 రూపంలో పిల్లల్లోనూ కనిపిస్తోంది.ఇక డయాబెటిస్కు దగ్గర్లో (బార్డర్లైన్లో) ఉన్న రోగుల సంఖ్యకు లెక్కేలేదు. ఒక నిర్దిష్టమైన అంచనా కూడా లేదు. అయితే ఇంతగా వణికించే పరిస్థితులున్నా ఈ బార్డర్లైన్ రోగులకు ఇంకా ఆరోగ్యస్పృహ లేక, ఆహార నియమాలు, లేక వాకింగ్ వంటి పరిమిత వ్యాయామాలపై దృష్టి లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కేవలం నడక, వేళకు సరైన భోజన నియమాలు అనే చిన్న జాగ్రత్తతో ఇందులో ఎంతోమంది తమ డయాబెటిస్ను చాలావరకు నివారించుకోవచ్చు. లేదా వీలైనంత ఆలస్యం చేయవచ్చు. పోటెత్తుతున్న రక్తపోటు రోగుల సంఖ్య రక్తపోటు వ్యాధికి సెలైంట్కిల్లర్ అని పేరు. చాపకింద నీరులా వచ్చే ఈ వ్యాధి కొందరిలో మూత్రపిండాలూ, కాలేయం, చివరికి మెదడు దెబ్బతిని పక్షవాతం అనే రోగాలను తెచ్చిపెట్టేంత వరకూ దీని ఉనికే తెలియదు. ఆరోగ్యస్పృహ లేకపోవడం, ఆరోగ్యవిషయాలపై అవగాహన లేకపోవడంతో మన దేశంలోని చాలామందిలో దీని ఉనికి తెలిసేనాటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. కొందరు గుండెపోటుతోనో, మరికొందరు మతిమరపుతోనో, ఇంకొందరు మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతిని డయాలసిస్ చేయిస్తూనో లేక అంధత్వంతోనో బతుకీడుస్తుంటారు. లేదా కొందరు చనిపోతూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా రక్తపోటు పెరుగుతోంది. పద్దెనిమిదేళ్లు దాటిన చాలామందిలో ఇది మామూలుగా ఉండాల్సిన 120/80 చోట 140/90 ఉంటోంది. 2014 నాటికి మన దేశంలో 22 శాతం మందిలో రక్తపోటు పెరిగిపోయి బాధపడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో, అది చేయబోయే నష్టం ఏ మేరకు ఉండబోతుందో ఊహించుకోవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలతోనే దీన్ని చాలావరకు అరికట్టవచ్చు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, తాజాపండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం, స్థూలకాయం ఉంటే తగ్గించుకోవడం, పొగతాగే అలవాటు, మద్యం మానేయడం చేస్తే చాలు, రక్తపోటుతో వచ్చే అనర్థాలు చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యంగా బతకవచ్చు. కానీ అనివార్యంగా పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీని పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. క్యాన్సర్లు : ఎవరైతే పొగాకు వినియోగాన్ని తొందరగా మానుతున్నారో, వారికి పొగాకు కారణంగా వచ్చే క్యాన్సర్ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. బ్యాలెన్స్డ్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటెజీ... యువతరం మాత్రమే కాక పెద్దవారు సైతం పొగతాగడం మానేయడంవల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ నుంచి బయటపడగలుగుతున్నారని తెలిపింది. అదేవిధంగా కిడ్నీ, మూత్రాశయ, ఓరల్ కావిటీ, ఇసోఫేగస్, ఉదరం, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను కూడా నివారించవచ్చునని తేలింది. పొగతాగే అలవాటు ఉన్నవారు 50 సంవత్సరాల వయసు లోపే ఆ వ్యసనాన్ని విడిచిపెడితే వారి జీవితకాలం కొద్దిగా పెరుగుతుంది. అలాగే 30 సంవత్సరాల లోపు విడిచిపెడితే వారి జీవితకాలం మరికాస్త పెరుగుతుంది. అసలు ఆ అలవాటే లేనివారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. అత్యధికంగా ధూమపానం చేసేవారిలో, స్త్రీపురుష భేదం లేకుండా 75 సంవత్సరాల వయసున్న వారు 16 శాతం మంది, 50 లోపు వారు 6 శాతం, 30 లోపు వారు 2 శాతం మందికి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది. అలవాటును ఎంత త్వరగా మానితే అంత ఎక్కువకాలం జీవించడానికి అవకాశం ఉంది. నివారించలేని జన్యుపరమైన క్యాన్సర్ల వంటివి కేవలం 10 నుంచి 15 శాతం వరకు ఉండగా 80 నుంచి 85 శాతం వరకు క్యాన్సర్లను మన జీవన శైలిని సక్రమంగా మార్చుకుంటే అవి మన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడవచ్చు. జీవనశైలి వ్యాధులతో చిన్నవయసులోనే మృతులు 2012లో దాదాపు 5.60 కోట్ల మృతులు అకాలంగా యువతలో సంభవించినవే. ఇందులో 3.8 కోట్లు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సాంక్రమిక వ్యాధులు కాని, జీవనశైలి వ్యాధులు)తో చనిపోయారు. అందులో గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాసకోశవ్యాధులు వంటివాటితో చనిపోయినవారు ఎక్కువ. ఇక వీరిలో 2.8 కోట్లు మనలాంటి మధ్యతరహా ఆదాయవర్గాలకు చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలవారు లేదా అల్పాదాయ దేశాలకు చెందినవారు. మిగతా కోటి మంది అన్ని అభివృద్ధి చెందిన దేశాలూ కలుపుకొని మృతిచెందినవారు. అంటే మృత్యువు ఇక్కడ ఎంత విచ్చలవిడిగా నాట్యమాడుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇవే గణాంకాలను ప్రాతిపదికగా ఇలా జీవనశైలిలో మృతిచెందేవారిలో గుండెపోటుతో చనిపోయే వారు 46.2 శాతం, క్యాన్సర్లతో చనిపోయేవారు 21.7 శాతం, శ్వాసకోశవ్యాధుల (ఆస్తమా, సీఓపీడీ)తో మృతిచెందే వారు 10.7 శాతం, డయాబెటిస్తో చనిపోయే వారు 1.5 శాతం. గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాసకోశవ్యాధులు, డయాబెటిస్... ఈ నాలుగింటి వాటాయే... మొత్తం జీవనశైలితో చనిపోయే వారిలో 80.1 శాతాన్ని ఆక్రమిస్తోంది.పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన సంపూర్ణ ఆరోగ్యం చాలాకాలం బాగుంటుందనడంలో సందేహం లేదు. హెచ్చరిక... డెబ్బయిలలో వచ్చిన మార్పులు ఎనభైలలో మరింత వేగవంతమయ్యాయి. అంతే తొంభైలు, 2000 నాటికి వీటి వల్ల వచ్చే విపత్కర ఫలితాలు మొదలయ్యాయి. రోగభారంతో పాటు ఇవి ఆర్ధికభారాన్నీ మోపబోతున్నాయి. - 2030 నాటికి జీవనశైలిలో వచ్చే వ్యాధుల కారణంగా ప్రజలు పెట్టే ఖర్చు అక్షరాలా రూ. 222 లక్షల కోట్లు పైమాటే. ఒకనాడు 60, 70 ఏళ్లకు కనిపించే చక్కెర వ్యాధి... ఇప్పుడు పాతిక, ముప్పయ్యేళ్లకే కనిపిస్తోంది. ఇక 2030 నాటికి భారత్లో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య 15 కోట్లకు చేరనుందని అంచనా. 2010 నాటి లెక్కలతో పోల్చి చూస్తే ఈ సంఖ్య రెండున్నర రెట్లు! ఒకనాడు 50, 60 ల తర్వాత మొదలయ్యే రక్తపోటు... ఇప్పుడు పైలాపచ్చీస్ వయసులోని ఉడుకురక్తానికి చేటు తెచ్చిపెడుతోంది. 2030 నాటికి దేశంలో హైబీపీతో బాధపడేవారి సంఖ్య 23 కోట్లకు పైమాటే.ఆధునిక భారతం రోగగ్రస్తం కాబోతున్న తరుణంలో రాబోయే తరాలన్నీ ఆరోగ్యంగా ఉండాలనే మంచి సంకల్పాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. జీవనశైలి వ్యాధులతో పోరాటమెలా... గతంలో రాజ్యమేలిన సాంక్రమిక వ్యాధుల తర్వాత ఇప్పుడు వాటి స్థానాన్ని ఆక్రమించిన నాన్కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ)లు... అంటే జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులతో పోరాటం చాలా సులభం.వ్యాధి వచ్చాక క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలోఅప్లో ఉంటూ, వారు చెప్పిన సూచనలు పాటిస్తూ, చికిత్స తీసుకుంటూ ఉండటం. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఇది తప్పనిసరి.వీటిలో చాలావరకు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసరమున్నవి. కాబట్టి వీటిభారం సామాన్యులపై చాలా ఎక్కువ. కేవలం ఆర్థికభారం మాత్రమే కాదు... పనిగంటలు వృథా కావడం, చాలా విలువైన మానవవనరులు నష్టం కావడం లాంటి చాలా అనర్థాలు వీటితో వస్తున్నాయి. కాబట్టి అందుకే వ్యాధి రాకముందే నివారించుకోవడం చాలా అవసరం. అందులో భాగంగా... ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. మన ఆరోగ్యానికి అదెంతో మేలు. అవేమిటంటే... వేళకు తప్పకుండా భోజనం చేయడం.భోజనంలో పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవడం.భోజనంలో కొవ్వులు, నూనెలు, ఉప్పు చాలా పరిమితంగా తీసుకోవడం. సూక్ష్మపోషకాలు అవసరానికి తగినంతగా ఉండేలా చూసుకోవడం. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తింటుండటం, వారంలో కనీసం మూడు నాలుగు రోజులు ఆరోగ్యకమైన ప్రోటీన్ ఉండే చేపలు తీసుకుంటూ ఉండటం. బరువును అదుపులో పెట్టుకోవడం. ఎత్తుకు తగినంత బరువే ఉండేలా జాగ్రత్త పడటం.{Mమం తప్పకుండా వారంలో కనీసం 150 గంటల పాటు తేలికపాటి వ్యాయామాలు అంటే నడక, స్లో జాగింగ్ వంటివి చేస్తూ శరీరానికి తగినంత, ఆరోగ్యకరమైన శ్రమ కలిగించడం. పొగతాగడం, మద్యం తాగడాన్ని పూర్తిగా మానేయడం. ఇలాంటి చర్యలతోనే మున్ముందు రాబోతున్న ముప్పును నివారించగలం. -
శ్వాసా..కష్టమే..!
గ్రేటర్లో పెరుగుతున్న శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఐదేళ్లలోపు చిన్నారుల్లో పది శాతం మందికి ఆస్తమా కాలుష్యం. యాంటిబయోటిక్ మందులతో సమస్య జటిలం వాతావరణ కాలుష్యం..మారిన జీవనశైలి..అతిగా యాంటిబయాటిక్స్ వాడకంతో సిటిజన్ల శ్వాసనాళాలు దెబ్బతింటున్నాయి. స్వేచ్ఛగా గాలిని పీల్చాల్సిన నాళాలు కుంచించుకుపోతున్నాయి. గ్రేటర్లో 20-24 శాతం మంది శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో అత్యధికంగా 10-12 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులే ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సిటీబ్యూరో: గ్రేటర్లో పదిహేనేళ్ల క్రితం పదకొండు లక్షల వాహనాలు ఉండగా, 2015 నాటికి 35 లక్షలకు చేరుకున్నాయి. వీటిలో పది హేనేళ్ల సర్వీసు దాటిన వాహనాలు ఐదు లక్షల వరకు ఉన్నాయి. నగరంలో 40 వేల పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న కాలుష్యం, ఓజోన్లెవల్స్ ఫర్ క్యూబిక్ మీటర్ గాలిలో 130-150 మైక్రోగ్రాములుగా నమోదవుతోంది. సల్పర్డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్మోనాక్సైడ్ తో కలుషితమైన గాలిని పీలుస్తుండటం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. అవుట్డోర్ పొల్యూషన్కు ఇన్డోర్ పొల్యూషన్(మస్కిటో కాయిల్స్, ఫర్ఫ్యూమ్స్, సిగరెట్స్, పరుపు, తలదిండ్లలో పేరుక పోయిన దుమ్ము)తో పాటు ఇన్సైడ్ పొల్యూషన్ (పోతపాలు, జంక్ఫుడ్, యాంటిబయాటిక్స్ వాడకం) ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాస నాళాలను దెబ్బతీస్తున్నాయి. వయసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గ్రేటర్లో ఐదేళ్లలోపు సుమారు ఆరు లక్షల మంది చిన్నారులుంటే వీరిలో పది శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. ఘాటైన వాసనలను పీల్చడం, ఆస్ప్రిన్, బీటాబ్లాకర్స్ వంటి మందులు వాడటం, వ్యర్థ పదార్థాల నుంచి వెలువడే రసాయనాలు, డస్ట్మైట్స్, మస్కిటో కాయిల్స్, సువాసన కోసం వాడే ఫర్ఫ్యూమ్, పుప్పడి రేణువులు, ధూమపానం వంటి అంశాలు ఆస్తమాకు కారణమవుతున్నాయి. చివరకు బాగా నవ్వినా.. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస కోశసమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా నాడీవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు మంద గిస్తుంది. ఊపిరితిత్తుల జీవిత కాలం తగ్గుతుం ది. హోటల్ మారియట్లో ఆస్తమాపై గురు వారం జరిగిన సమావేశంలో వైద్యులు మాట్లాడారు. పోతపాలతో ఆస్తమా ►తరచు దగ్గడం, ఆయాసం, కడుపు ఉబ్బరంగా ఉం డటం, శ్వాస తీసుకోలేక పోవడం ఆస్తమా లక్షణాలు ►డబ్బాపాల వల్ల పిల్లలు త్వరగా ఆస్తమా బారిన పడే ప్రమాదం ఉంది. ►ఐస్క్రీమ్లు, శీతల పానియాలు, కూలర్, ఏసీలకు పిల్లలను దూరంగా ఉంచాలి. ►సిగరెట్, వాహన, పారిశ్రామిక కాలుష్యానికి గురికావొద్దు ► సిమెంట్, ఘాటైన వాసనతో కూడిన రంగులు, ఫ్లెక్సీ ప్రింటర్స్కు దూరంగా ఉండాలి. ►రోడ్డుపై వెళ్తున్నప్పుడు, పరిశ్రమల్లో పని చేసే సమయంలో మాస్క్లు ధరించాలి. ►ఇది పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువు, ఆటలు, తదితర అంశాలపై ప్రభావం చూపుతోంది. డాక్టర్ సుదర్శన్రెడ్డి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఇన్హేలర్ ఒక్కటే పరిష్కారం ►ఇంట్లో ఇన్హేలర్ ఉండాలి. నెబ్లూజన్ ఆస్పత్రిలో ఉండాలి. ► టాబ్లెట్స్, నెబ్లూజర్లతో పోలిస్తే ఇన్హేలర్తోనే ప్రయోజనం ఎక్కువ ► మెడికల్ టెస్టులతో పని లేకుండా కేవలం క్లీనికల్గా ఆస్తమాను నిర్ధారించవచ్చు ► వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే సరిపోతుంది. ► పొల్యూషన్కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. డాక్టర్ ప్రద్యూవాగ్రే, ఆస్తమా నిపుణుడు -
యాంటీ బయాటిక్స్ లేవు
కోళ్ల బరువు పెంచడానికి యాంటీ బయాటిక్స్, హార్మోన్లు ఇస్తున్నారనడం అవాస్తవం పౌల్ట్రీ రంగ సంస్థలు, నిపుణుల స్పందన సాక్షి ఆదివారం ‘ఫోకస్’ పేజీలో ‘గుడ్డు మందా.. కోడి మందా’ అనే శీర్షికతో ఇచ్చిన కథనంపై పలు సంస్థలు స్పందించాయి. ఈ సందర్భంగా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్రెడ్డి మాట్లాడారు. ‘‘కోళ్ల బరువు పెంచడం కోసం హార్మోన్లు, యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారన్న విషయంలో నిజం లేదు. కేవలం మన దగ్గరున్న నాణ్యమైన బ్రీడ్ కారణంగానే కోళ్ల ఎదుగుదల బాగుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కోంటోంది. ఒకవైపు గుడ్లకు సరైన ధర లేదు. మరోవైపు దాణా రేట్లు బాగా పెరిగాయి. బ్రాయిలర్ అయినా, లేయర్ కోళ్లయినా వాటికి కడుపు నిండా దాణా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న మన రెండు రాష్ట్రాల రైతులు కోళ్ల పెంపకంలో రసాయనాలు వాడుతున్నారనడం అవాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో రైతులు నెలకు 3 కోట్ల బ్రాయిలర్ కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పౌల్ట్రీని నమ్ముకుని బతుకుతున్నారు. మన దగ్గర కోళ్లలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఉన్నాయంటూ కిందటేడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్లు ఢిల్లీలో చేసిన పరిశోధనను కూడా మేం ఖండించాం. ఆ రిపోర్టులో ఉన్న అవశేషాల స్థాయి యూరోపియన్ ప్రమాణాలకు లోబడే ఉన్నట్టు అప్పుడే మేం స్పష్టం చేశాం కూడా. కోళ్లకు బొటాక్స్ వాడుతున్నారన్న విషయంలో కూడా నిజం లేదు. అంతేకాదు ఈ నలభై రోజుల కాలంలో నాలుగు కిలోల ఆహారం తీసుకునే మన కోడిని ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వరకూ ఎప్పుడైనా తినొచ్చు..’’ అని చెప్పారు. సరైన ధరే లేదు.. - కె.జి.ఆనంద్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) సీఈవో రెండు తెలుగు రాష్ట్రాల్లో లేయర్ కోళ్ల రైతులు 5,000 మంది వరకు ఉన్నారు. ఏడాదికి పదివేల కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. కోళ్ల దాణాగా ఉపయోగించే మొక్కజొన్న కనీస మద్దతు ధరను గత ఐదేళ్లుగా ప్రభుత్వం పెంచుతూ పోవడంతో.. ఆ ప్రభావం పడి గుడ్ల ధర విషయంలో రైతులు చాలా నష్టపోవాల్సి వస్తోంది. గుడ్ల ఉత్పత్తికి రసాయన పదార్థాలను ఆశ్రయిస్తున్నారనే విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ధరల కారణంగా మన రైతులకు కోడికి కడుపునిండా దాణా పెట్టే పరిస్థితే లేదు. అలాంటిది యాంటీ బయాటిక్స్ వాడి గుడ్ల ఉత్పత్తిని పెంచుతున్నారనే వార్తల్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు మన దగ్గర మోల్టింగ్ పద్ధతిని కూడా కేవలం 20శాతం మంది రైతులు పాటిస్తున్నారు. రైతు క్షేమం - ఎస్.బాలసుబ్రమణ్యన్, ఆలిండియా డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వెంకాబ్ చికెన్) ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీల వల్ల రైతులు నష్టపోతున్నారనే విషయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 శాతం ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ ఉండడమే దీనికి కారణం. మరో 35 శాతం సొంతంగా పెట్టుబడులు పెట్టి పౌల్ట్రీఫామ్లను నడిపిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కారణంగా బహుళజాతి కంపెనీల పెత్తనం పెరిగిపోతుందన్న విషయం పక్కనపెడితే.. పౌల్ట్రీని నమ్ముకుని బతుకుతున్న తెలుగు రైతులు సురక్షితంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి. ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీలో రైతులకు పెట్టుబడి రిస్క్ ఉండదు. రెండు నెలలు తిరగకుండానే లాభాల్ని ఆర్జించవచ్చు. అలాగే ఇంటిగ్రేటెడ్ సంస్థలు కోట్ల సొమ్ము ఆర్జిస్తున్నాయన్న విషయం కూడా అవాస్తవం. రైతులకు వచ్చే లాభం కంటే కంపెనీలకు తక్కువగా వస్తుంది. -
నిస్పృహ వద్దు
డిప్రెషన్ అంటే ఇది కాదు... చాలా మంది డిప్రెషన్ను ఒక మానసిక బలహీనత అనుకుంటారు. మరికొందరు వ్యక్తిత్వ లోపంగా భావిస్తారు. చేయాల్సిన పనిని తప్పించుకోవడం కోసం సాకుగా చూపే సోమరితనంగా ఇంకొందరు పరిగణిస్తారు. కానీ ఇవన్నీ తప్పే. ఇవన్నీ అపోహలే. డిప్రెషన్ అంటే మూడ్స్ బాగుండకపోవడం కాదు. డిప్రెషన్ అంటే మూడీగా ఉండటం కాదు. అయితే నిజానికి డిప్రెషన్ అంటే ఏమిటి? ఏమిటంటే... మూడ్స్కు సంబంధించిన ఒక మానసిక రుగ్మతే డిప్రెషన్. ఎంత విస్తృతం అంటే..? అదొక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. చాలా సాధారణం కూడా. డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరూ, ప్రతి పదిమంది పురుషుల్లో ఒకరూ ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని మొత్తం మహిళల్లో 21 శాతం మంది, పురుషుల్లో 12 శాతం మంది తమ జీవితకాలంలోని ఏదో ఒక దశలో డిప్రెషన్తో బాధపడుతున్న లేదా బాధపడిన వారే. డిప్రెషన్ వ్యాధికి స్త్రీ, పురుషుడూ... విద్యావంతుడు, నిరక్షరాస్యుడూ... ఆర్థికంగా బలవంతుడూ, బలహీనుడూ అనే వివక్ష లేదు. ఇది ఎవరికైనా రావచ్చు. డిప్రెషన్కు కారణాలు మెదడులో వచ్చే మార్పుల వల్లనే డిప్రెషన్ వస్తుందన్న విషయం నిర్ద్వంద్వమైనదే. కానీ దానికి దోహదపడే పరిస్థితులపై, కారణాలపై శాస్త్రవేత్తలలో వాగ్వాదాలు నడుస్తున్నాయి. జన్యుపరమైన అంశాలూ, హార్మోన్ల పాళ్లలో మార్పులు, కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు/జబ్బులు, తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన విచారం (గ్రీఫ్), తీవ్రమైన అవమానాలకూ/అత్యాచారాలకు లోనుకావడం కూడా డిప్రెషన్కు దారితీయవచ్చుననేది పరిశోధకుల అభిప్రాయం. పైన పేర్కొన్న అన్ని అంశాల్లో ఒకటిగానీ, లేదా చాలా అంశాలు కలగలసి గానీ మెదడులోని రసాయనాల్లో మార్పులు తీసుకురావచ్చనీ, దాంతో అది డిప్రెషన్కు దారితీయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. డిప్రెషన్లో రకాలు డిప్రెషన్కు సంబంధించిన రుగ్మతలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు అధిక స్థాయి (మేజర్) డిప్రెషన్ ఉన్నవారిలో వారి పనిసామర్థ్యం, నిద్ర, చదువు, తిండి, జీవితాన్ని ఆస్వాదించడం... ఇలా దైనందిన వ్యవహారాల్లోని ప్రతి అంశమూ ప్రభావితమవుతుంది. కొన్ని రకాల డిప్రెషన్లు కాస్త వైవిధ్యమైన లక్షణాలతో కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని... సైకోటిక్ డిప్రెషన్: కొందరు జీవితంలో తీవ్రంగా వ్యాకులతకు లోనవ్వడంతో పాటు కాస్తంత తీవ్రంగా (సైకోసిస్తో) ప్రవర్తించడం వంటి లక్షణాలను కనబరుస్తారు. వీటిలో చాలామంది కొన్ని రకాల భ్రాంతులకు లోనవుతారు. పోస్ట్పార్టమ్ డిప్రెషన్ : చిన్నారికి జన్మనిచ్చిన తల్లికి వచ్చే మానసిక సమస్య ఇది. పాపాయిని ప్రసవించిన వెంటనే వాళ్లలో కలిగే హార్మోనల్, భౌతికమైన మార్పులు ఈ తరహా డిప్రెషన్కు దారితీస్తాయి. కొత్తగా పుట్టిన తన బుజ్జాయిని అపురూపంగా, అత్యంత జాగ్రత్తగా చూసుకోగలనో లేదో అన్న సందేహం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 10 నుంచి 15 శాతం తల్లులు ఈ పోస్ట్పార్టమ్ డిప్రెషన్ బారిన పడతారు. సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (శ్యాడ్): చలికాలంలో తగినంత సహజ సూర్యకాంతి ఉండదు. దాంతో కొందరిలో డిప్రెషన్ వస్తుంటుంది. మళ్లీ వేసవి రాగానే మళ్లీ పగటి నిడివి పెరగడం, కాంతి కూడా పెరగడం వల్ల ఈ డిప్రెషన్ సహజంగానే తగ్గుతుంది. శ్యాడ్ అనే ఈ రుగ్మత కనిపిస్తే కాంతితో చికిత్స చేస్తారు. దీన్నే లైట్ థెరపీ అంటారు. ఈ రుగ్మతకు లోనైన వారిలో సగానికి పైగా రోగులు ‘లైట్ థెరపీ’తోనే బాగుపడతారు. ఇక మిగతావారికే కొన్ని రకాల మందులు, కొంత సైకోథెరపీ అవసరమవుతాయి. కొందరిలో ఈ మూడూ కలిసి ఇవ్వాల్సి రావచ్చు. ఇక మరికొందరిలో బై-పోలార్ డిజార్డర్ అనే తరహా డిప్రెషన్ ఉంటుంది. వీరు అప్పటికప్పుడే తమను తాము చాలా గొప్పగా ఊహించుకుని, అంతలోనే తీవ్రంగా కుంగిపోతారు. ఇలా గొప్పగా భావించుకోవడం, తీవ్రంగా కుంగిపోవడం... ఒకదాని తర్వాత మరొకటిగా (సైక్లిక్ఫామ్లో) వస్తూ ఉంటాయి. ఈ సైకిల్లో గొప్పగా ఊహించుకోడాన్ని ‘మేనియా’గానూ, తీవ్రంగా కుంగిపోవడాన్ని ‘డిప్రెషన్’గానూ పేర్కొంటారు. డిప్రెషన్కు లక్షణాలు డిప్రెషన్ సాధారణంగా ఆ రుగ్మతకు లోనైన వ్యక్తి తాలూకు ఆలోచనలనూ, భావోద్వేగాలనూ, ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి అతడిలో మానసిక లక్షణాలే కాకుండా, భౌతికమైన లక్షణాలూ కనిపించేలా చేస్తుంది. డిప్రెషన్కు లోనైన వారిలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలివే... తీవ్రమైన విచారం జీవితంపై నమ్మకం కోల్పోవడం అపరాధభావన ముభావంగా ఉండటం ఒక్కసారిగా చాలా కోపం రావడం స్నేహితులను కలవడంలోనూ లేదా తమకు గతంలో ఇష్టమైన/ఆనందం కలిగించిన అంశాలలోనూ ఆసక్తికనబరచకపోవడం సెక్స్పై ఆసక్తి కోల్పోవడం ఆలోచనల పరంగా... ఏదైనా ఆలోచన కలిగినప్పుడు దానిపై సరిగా దృష్టి కేంద్రీకరించలేకపోవడం నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం విషయాలను జ్ఞాపకం ఉంచుకోవడంలో ఇబ్బంది తమకు తామే హానిచేసుకునేలాంటి ఆలోచనలు రావడం డిప్రెషన్ తీవ్రమైనప్పుడు భ్రాంతులకు లోనుకావడం. ప్రవర్తన పరంగా... ఇతరులతో కలవలేకపోవడం అవమానానికి గురైనట్లుగా భావించడం తరచూ స్కూల్/ఆఫీసుకు ఎగవేతలు. భౌతికంగా... తీవ్రమైన అలసట కారణం లేకుండా ఎన్నో చోట్ల నొప్పులు రావడం ఆకలిలో మార్పులు బరువు కోల్పోవడం లేదా అకస్మాత్తుగా చాలా బరువు పెరగడం నిద్ర అలవాట్లలో మార్పులు (తీవ్రమైన నిద్రలేమి/అతిగా నిద్రపోవడం) గమనిక : పైన పేర్కొన్న అంశాలలో చాలావరకు మన దైనందిన జీవితంలో ఏదో ఒకదాన్ని ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటాం. వాటన్నింటినీ డిప్రెషన్గా పేర్కొనలేం. నిపుణులైన డాక్టర్లు ఎవరైనా రోగికి డిప్రెషన్ ఉన్నట్లు గ్రహిస్తే... పై లక్షణాల్లో చాలా అంశాలు కలగలసి ఉన్నట్లుగా కనుక్కుంటారు. కాబట్టి పైన పేర్కొన్న అంశాల్లో ఒకటి రెండు కనిపిస్తే... దాన్ని పట్టుకుని మీకు డిప్రెషన్ ఉన్నట్లుగా భావించడం సరికాదు. ఆయా అంశాల్లో చాలామట్టుకు రెండువారాలకు పైగా ఉండటం, తామెంతగా ప్రయత్నించినా, సొంతంగా వాటి నుంచి బయటపడలేకపోవడం వంటి అనేక అంశాలను పరిశీలించి డాక్టర్లు డిప్రెషన్ను నిర్ధారణ చేస్తారు. కలర్ఫుల్ ప్రపంచమైన బాలీవుడ్లో అగ్రశ్రేణి నటి దీపికా పదుకొణె. డబ్బుకు, గ్లామర్కు కొదవలేదు. అభిమానుల ఆదరానికి కొరతలేదు. అయినా దీపిక కూడా డిప్రెషన్కు లోనయ్యారు. మొదట్లో అందరిలాగే వైద్యుణ్ని సంప్రదించడానికి సంశయించారు. కానీ ఇదీ అన్ని వ్యాధుల్లాంటిదేనని గ్రహించి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు. ఆమె పరోక్ష సందేశంతో ఈ వ్యాధితో బాధపడుతున్న వారు తగిన చికిత్స తీసుకుని బాగుపడాలన్నదే ఈ కథనం ఉద్దేశం... నివారించండిలా... తప్పక వాడాల్సి వస్తే తప్ప... సాధ్యమైనంతవరకు యాంటీబయాటిక్స్ వాడవద్దు క్లోరిన్ ట్రీట్మెంట్ ఇచ్చిన నీరు లేదా ఫ్లోరినేటెడ్ నీరు తాగవద్దు. మెదడుకు, పొట్టకు బంధమిలా... మన మెదడులో నిరాశ, నిస్పృహలూ, డిప్రెషన్ వంటివి కలిగాయనుకోండి. అవి పొట్టలో ఇబ్బందితో బయటపడతాయి. కడుపులో మంట, తిన్నది జీర్ణం కానట్లుగా అనిపించడం వంటి లక్షణాలు మొదట కనపడతాయి. ఆ తర్వాత కూడా మనం డిప్రెషన్కు చికిత్స తీసుకోకపోతే అది గుండెజబ్బులకూ, టైప్ 2 డయాబెటిస్కూ దారితీయవచ్చు. ఇక మనం పొట్టలో ఇబ్బందిని తగ్గించడం కోసం ప్రోబయాటిక్స్ (అంటే... పాలను పెరుగులా మార్చే బ్యాక్టీరియా... ఒక్కమాటలో చెప్పాలంటే తియ్యని పెరుగు), విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ డి... ఇచ్చినప్పుడు అవి పొట్ట ఇబ్బందితో పాటు మెదడులోని డిప్రెషన్నూ తగ్గిస్తాయి. ఎందుకంటే పొట్ట ఇబ్బందిని తొలగించడానికి వెలువరచే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలన్నీ మెదడులోని డిప్రెషన్ను ప్రేరేపించే అంశాలను జోకొట్టి డిప్రెషన్నూ తగ్గిస్తాయి. విటమిన్-డి లోపం కూడా డిప్రెషన్కు దారితీసే అంశమే. మన శరీరంలో విటమిన్- డి పాళ్లు 20 ఎన్జీ/ఎమ్ఎల్ కు తగ్గితే డిప్రెషన్కు గురయ్యే అవకాశాలు 11 రెట్లు పెరుగుతాయి. అందుకే సూర్యరశ్మికి తక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చే ‘సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ - శ్యాడ్’తో బాధపడేవారికి విటమిన్-డి ఇవ్వడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. విటమిన్ బి12 లోపం కూడా డిప్రెషన్కు దారి తీయవచ్చు. ఈ రెండింటి లోపం ఉన్నప్పుడు ఆహారంతో వాటిని భర్తీ చేయవచ్చు. ఇందుకు మాంసాహారంలోని ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు, తిమింగలం నుంచి తీసి తయారు చేసే ‘క్రిల్ ఆయిల్’ (వేల్ ఆయిల్ ) ఉపయోగపడతాయి. డిప్రెషన్ తగ్గాలంటే... మన శరీరంలో చక్కెర పాళ్లు పెరిగితే... దాన్ని నియంత్రించేందుకు జరిగే జీవరసాయన చర్యలు డిప్రెషన్ను పెంచే అవకాశం ఉంది. మనం చక్కెరను తీసుకోగానే దాన్ని అదుపులో ఉంచడానికి ఇన్సులిన్ స్రవిస్తుంది. దాంతో వెంటనే మెదడులో గ్లుటామేట్ అనే రసాయనం స్రవిస్తుంది. దీనికి డిప్రెషన్ను పెంచే గుణం ఉంది. కాబట్టి స్వీట్స్ తినడంలో సంయమనం పాటించండి. ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే చక్కెర పాళ్లు డిప్రెషన్ను పెంచుతాయి. కాబట్టి బేకరీ ఐటమ్స్ వంటివాటిని తగ్గించుకోండి. ఆ స్థానంలో పొట్టు ఉండే కార్బోహైడ్రేట్ట్లు చక్కెర విడుదలను నియంత్రిస్తాయి కాబట్టి పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన పదార్థాలను తినండి. ఇక మన ఇడ్లీ, దోసె వంటివి డిప్రెషన్ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇడ్లీ పిండి, దోసె పిండిలో పొట్టకు మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంటాయి. ఇవి పొట్టలోకి వెళ్లి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సరికొత్త చికిత్సలు పెరుగు వంటి ప్రోబయాటిక్ పదార్థాలను ఇచ్చి చేసే చికిత్సలు డిప్రెషన్ను తగ్గించడంలో ఉపయోగపడుతున్నాయి. అందుకే వీటిని సైకోబయోటిక్స్ ఇచ్చే ప్రక్రియగా ఈ తరహా చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ సైకోబయోటిక్స్ కడుపులోని ఇన్ఫ్లమేషన్ గుణాన్ని తగ్గించి మెదడునూ సాంత్వన పరుస్తాయి. ధ్యానం చేయడం (మెడిటేషన్) అనే ప్రక్రియ కూడా డిప్రెషన్ తగ్గించడంలో ఔషధం అంతటి భూమిక పోషిస్తుందని పరిశోధనల వల్ల తేలింది. దీనికి తోడు ఫార్మకోజీనోమిక్స్ అనే మందులతోనూ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)తోనూ డిప్రెషన్తో బాధపడుతున్నవారిలో సానుకూల ధోరణిని పెంచి, వారిని బాగుచేయవచ్చు. ఇక సరికొత్త మందుల విషయానికి వస్తే... కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ యాంటగొనిస్ట్స్, డెక్సామెథాజోన్, పార్షియల్ అడ్రనిలెక్టమీ వంటి శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక సీబీటీ, బ్రెయిన్ స్టిమ్యులేషన్స్, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్, ఎగ్జోజెనస్ బ్రెయిన్-డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్లు ఇవ్వడం, సెరటోనిన్ రీ-అప్టేక్ ఇన్హిబిటార్స్ను సెలక్టివ్గా వాడటం, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులతో డిప్రెషన్ను సమర్థంగా నయం చేయవచ్చు. మీ సేవాభావం... కావాలి ఇతరులకు ఆదర్శం! వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలే ప్రాతిపదిక. మీ ఎంట్రీలను పంపండి. మీ సేవాకార్యకలాపాల దృష్టాంతాలకు ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను పంపండి. చిరునామా: సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్, సాక్షి టవర్స్, 6-3-249, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. సరికొత్త కారణాలు... ఎంతోకాలంగా భావిస్తున్న సాంప్రదాయిక కారణాలతో పాటు ఇటీవల కొత్త పరిశోధనలతో మరెన్నో అంశాలు డిప్రెషన్కు కారణమవుతున్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. వాటిని తెలుసుకుని, సమూలంగా అంకురం నుంచి వాటిని తొలగించగలిగితే డిప్రెషన్ కూడా దూరమవుతుంది. ఇదో విచిత్రం! దీర్ఘకాలికంగా ఒక వ్యక్తిపై అదేపనిగా ఒత్తిడి పడుతూ ఉంటే అతడి జన్యువుల్లోనూ మార్పు వస్తుంది. రోజంతా అతడి ఎముక మజ్జ నుంచి ఎర్ర, తెల్ల రక్తకణాలు పెద్దసంఖ్యలో విడుదలవుతాయి. ఒక వైరస్ శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి జరిగే ప్రక్రియే... ఈ ఒత్తిడిని ఎదుర్కోవడంలోనూ జరుగుతుంది. అంటే యాంత్రికంగా శరీరం తనకు అయిష్టమైనదేదో లోనికి ప్రవేశించిందని గుర్తిస్తుందన్నమాట. అది ‘ఒత్తిడి’ అని శరీరానికి తెలియదు కదా. దాంతో ఈ ఎర్ర, తెల్ల రక్తకణాలకు తోడుగా వ్యాధినిరోధక కణాలూ పెద్దఎత్తున ఉత్పత్తి అవుతాయి. అసలక్కడ లేని శత్రువుతో పోరాటం చేయడం మొదలుపెడతాయి. పోరు ప్రారంభించగానే భౌతిక మార్పులతో శరీరంలో మంట, నొప్పి (ఇన్ఫ్లమేషన్) మొదలవుతుంది. తాము యుద్ధం చేయడానికి శత్రువు లేకపోవడంతో అవి మనలోని గుండె, రక్తప్రసరణ వ్యవస్థపై పోరాడి, గుండెజబ్బులకు కారణమవుతాయి. డయాబెటిస్కు దారితీస్తాయి. ఒక్కోసారి స్థూలకాయానికీ కారణమవుతాయి. అదేపనిగా జరిగే ఈ ప్రక్రియ వల్ల కొందరి కణాల్లో జన్యుపరమైన మార్పులూ రావచ్చు. ఇక మౌంట్ సియానీలోని ఐకాహ్న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో కొన్ని ఎలుకల మీద జరిగిన పరిశోధనల్లో ఇలా ఇన్ఫ్లమేటరీకి దారితీసే ఇమ్యూన్ కణాలు అదేపనిగా విడుదల అవుతూ ఉంటే... మెదడు బయట ఉంటే కొన్ని కణాలు ‘ఇంటర్ల్యూకిన్-6’ అనే ఒక రకం రసాయనాన్ని విడుదల చేస్తుందనీ, అది ‘డిప్రెషన్’ను కలిగిస్తుందని తేలింది. చేదు అనుభవం ఏదైనా ఇష్టంలేని చేదు అనుభవంతో డిప్రెషన్ వస్తుందని కౌమార వయసు (టీన్స్)లోని 36,000 మందిపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. మెదడుకు ఏదైనా ఆఘాతం తగలడం అనేది ఇరవై ఒక్క సెకండ్లకు పైగా కొనసాగినప్పుడూ డిప్రెషన్ కలుగుతుందని ‘జర్నల్ ఆఫ్ అడాలసెన్స్ హెల్త్’ పేర్కొంది. ఇలాంటప్పుడు తప్పక డాక్టర్ను కలవాలని ఆ జర్నల్ సూచిస్తోంది. దీర్ఘకాల ఒత్తిడి కొన్ని వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా ఒత్తిడికి గురవుతుంటే వారి మెదడులోని ‘మైక్రోగ్లియా’ అనే ఒక రకమైన కణాలు మార్పులకు లోనవుతాయి. ఈ మైక్రోగ్లియా కణాలు మెదడులోని కణాల్లో 10 శాతం ఉంటాయి. వీటిని మెదడు వ్యాధి నిరోధక కణాలుగా భావించవచ్చు. దీర్ఘకాలం కొనసాగే ఒత్తిడి వల్ల ఈ కణాల స్వరూపంలో మార్పులు వచ్చినప్పుడూ డిప్రెషన్ కలుగుతుందని హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెం శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దాంతో న్యూరో-సైకియాట్రిక్ వ్యాధులు రావడం సహజమని పేర్కొంటున్నారు. దీనివల్ల మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ అనే భాగం ప్రభావితమవుతుంది. (మనలోని భావోద్వేగాలకూ, నేర్చుకునే ప్రక్రియకూ, జ్ఞాపకముంచుకోవడం అనే కార్యకలాపాలకు మూలకేంద్రం ఈ హిప్పోక్యాంపసే). ‘టీన్ జీన్’ కూడా ఒక కారణమే... మన మెదడులో ఏర్పడిన కణాలు తొలి రెండేళ్ల పాటు విభజితమవుతుంటాయి. ఆ తర్వాత అవి అటు ఇటు రీ-అడ్జెస్ట్ అవుతాయంతే. ఇక బాల్యం దాటి టీనేజ్లో ప్రవేశించాక... ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా సంతరించుకునే సమయంలో మెదడు కణాలు పరిణతి సాధిస్తూ, వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ మార్పుచెందుతుంటాయి. ఈ మార్పులనే ‘టీన్ జీన్’గా వ్యవహరిస్తుంటారు. ఈ సమయంలో యువతలో ఉండే ఉత్సాహం, ఉద్వేగాలు తప్పుదారి పట్టి మాదకద్రవ్యాల (డ్రగ్ అబ్యూజ్) వంటి దురలవాట్లకు లోనయ్యేందుకూ లేదా తమ తీవ్ర భావోద్వేగాలతో స్క్రీజోఫ్రీనియా, డిప్రెషన్లకు గురయ్యేందుకు అవకాశాలున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అందుకే ఆ వయసు పిల్లల వ్యక్తిత్వం సరిగా వికసితమయ్యేలా మంచి పుస్తకాలు చదవడం, మంచి హాబీలను అభివృద్ధి చేసుకోవడం, లలితకళల వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాల్లో ఆ వయసువారిని నిమగ్నం చేయడం మంచిది. వ్యాపకం లేకపోవడం పూర్తిస్థాయి విశ్రాంతి గానీ వ్యాపకంగానీ లేకపోవడం వంటి అంశాలు సైతం ‘డిప్రెషన్’కు దారితీయవచ్చని ‘కెనెడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ’ పేర్కొంటోంది. గుండె ఆపరేషన్ అయిన వారు తాము ఏ పనీ చేయకూడదనే అపోహలో ఉంటారు. ఫలితంగా ‘గుండె శస్త్రచికిత్స’ జరిగిన వారిలో 40 శాతం మంది డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు. గుండె శస్త్రచికిత్స జరిగిన వారు గుండెపై భారం పడేలా పనిచేయకూడదన్న అంశం వాస్తవమే గానీ... దానర్థం అసలే పనిచేయకూడదని కాదు. తమకు ఆనందం కలిగించే వ్యాపకాలు, నడక, గార్డెనింగ్ వంటివి శ్రమ కలగని రీతిలో చేయాల్సిందే. ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మనలో ఫీల్గుడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దాంతోపాటు వ్యాయామం చేయగానే మన శరీరంలోంచి ‘కైన్యురెనిన్’ అనే ప్రోటీన్ తొలగిపోతుంది. అలాగే శరీరంలో ఉండిపోతే ఆ ప్రోటీన్ మనకు ‘డిప్రెషన్’ను కలిగిస్తుంది. అందుకే అలసట కలగని విధంగానూ, ఆరోగ్యకరమైన రీతిలోనూ వ్యాయామం చేయడం అవసరమే. -
నాన్న ప్రాణం నిలబెట్టండి
అధిక బరువు, వ్యాధులతో బాధపడుతున్న ఆర్టీసీ ఉద్యోగి లింగమయ్య పిల్లల విజ్ఞప్తి కనీసం లేచి నడవలేని దుస్థితి.. ఆదుకోవాలంటూ వేడుకోలు విజయవాడ: రోజు రోజుకూ మరింతగా బరువు పెరిగిపోయే వ్యాధి ఒకవైపు, శరీరం నిండా మానని గాయాలు మరోవైపు.. నడవలేడు, నిలబడలేడు, సరిగా పడుకోలేడు కూడా. మెదక్ జిల్లా జహీరాబాద్కు చెందిన 53 ఏళ్ల లింగమయ్య అవస్థ ఇది. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కొన్నేళ్లుగా బరువు పెరుగుతూ.. ఇప్పుడు ఏకంగా 202 కేజీలకు పెరిగిపోయారు. 2009లో ఆయనకు గుండెపోటు రాగా స్టెంట్ అమర్చారు. దానికితోడు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి నిమ్స్కు వెళ్లినా, పలు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేదు. ఇలాగే అధిక బరువుతో బాధపడి బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం పొందిన ఒక స్నేహితుడి సహాయంతో లింగమయ్య విజయవాడలోని ఎండోకేర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ లింగమయ్యను పరీక్షించిన వైద్యులు.. శరీరంలో గాయాలు తగ్గిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాయాలు మానడానికి కొద్దిరోజుల పాటు రోజుకు రూ. 10 వేల విలువైన యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుందని.. తర్వాత సర్జరీకి దాదాపు రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని లింగమయ్య కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని, తమ తండ్రి ప్రాణాలను కాపాడాలని లింగమయ్య కుమారుడు విక్రమ్, కుమార్తె పరిమళ వేడుకుంటున్నారు. దాతలు నేరుగా లింగమయ్య కుమారుడు విక్రమ్ నంబర్ 9963324224కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని, సహాయం అందించవచ్చు. -
రాష్ర్టంలో ‘గ్యాస్ గ్యాంగ్రిన్’
బెంగళూరులో ఓ వ్యక్తి మృతి * అరుదైన, ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తింపు * ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సాక్షి,బెంగళూరు/మైసూరు : అత్యంత అరుదైన, ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తింపు పొందిన గ్యాస్ గ్యాంగ్రిన్ వ్యాధితో బెంగళూరులో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచాన్ని ‘ఎబోలా’ భయపెడుతున్న తరుణంలో వైద్య రంగ పరిభాషలో మెడికల్ ఎమర్జెన్సీగా పేర్కొనే గ్యాస్ గ్యాంగ్రిన్ ఉదంతం వైద్య లోకంతో పాటు సాధారణ ప్రజలకు కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... మైసూరు జిల్లా హెడీకోటే తా లూకా హొమ్మరగళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (35) విద్యుత్శాఖలో లైన్మన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 15న చలి, జ్వరం రావడంతో అతన్ని స్థానిక ఆస్పత్రులతో పాటు మైసూరులోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బెంగళూరులోని అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరున్న ఓ ఆస్పత్రిలో గత గురువారం చేర్పించారు. వైద్యుల పరీక్షల్లో అతనికి గ్యాస్ గ్యాంగ్రిన్ సోకినట్టు తేలింది. వ్యాధి ముదరడంతో అతను ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. వైద్యుల సూచనల మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శనివారం స్వగ్రామంలో దహనం చేశారు. కాగా, గ్యాస్గ్యాంగ్రిన్ వ్యాధి మట్టిలో ఆవాసం చేసే క్లాస్ట్రీడియం పర్ప్రీగీనస్ అనే బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించనప్పుడు వస్తుంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి శరీరంలో కణజాలాల్లో ఎక్కువ మొత్తంలో వాయువు (గ్యాస్) ఏర్పడి కణజాలం పగిలిపోతుంది. దీంతో రోగిమరణిస్తాడు. వ్యాధికి గురైన వ్యక్తికి యాంటిబయాటిక్స్తోపాటు ఎటువంటి మందులు పనిచేయవు. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వచ్చి ఉంటే దానిని మెడికల్ ఎమర్జెన్సీగా భావించవచ్చు. ఇదిలా ఉండగా బోత్రోప్స్ కుటుంబానికి చెందిన పాములు మనుషులను కాటు వేసినప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ ఉద్యోగి గ్యాస్ గ్యాంగ్రిన్తో చనిపోయిన విషయాన్ని సదరు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించడం లేదు. -
జంతువులను పాము కాటు నుండి .....
ప్రథమ చికిత్స ఇలా.. పాము కరిచిన చోట పైభాగాన బట్టతో గట్టిగా కట్టాలి కాటేసిన స్థలంలో బ్లేడుతో కోసి రక్తాన్ని పిండేయాలి {పతి 20 నిమిషాలకు కట్టును వదులుగా మళ్లీ కట్టు కట్టాలి పాము కరిచిన పశువుకు ఫామ్, ఆట్రోఫిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్లను ఎక్కించాలి ఈ మందు ఖరీదు రూ100 నుంచి రూ.200 వరకు ఉంటుంది. పశువులు కోలుకునే వరకు ఈ మందును ప్రతి గంటకు ఎక్కిస్తుండాలి యాంటీబయాటిక్స్, అనెల్జెసిక్స్, కార్టికోస్టిరియాడ్స్, గ్లూకోస్ వంటి మందులను అవసరాన్ని బట్టి వాడుతూ ఉండాలి శ్యాస క్రియను ఉత్తేజం చేయడానికి కొరమిన్, నికతాబైడ్ వంటి ఇంజక్షన్లు ఇస్తూ ఉండాలి ఇలా చేస్తే పాము కరిచిన పశువులను సులభంగా రక్షించుకోవచ్చు. ఈ విష సర్పాలు కరిచే అవకాశం.. అటవీ ప్రాంతంలో సాధారణంగా కట్ల పాము, తాచుపాము, రక్త పింజరలు పశువును కాటు వేస్తాయి. ఇవి ఎక్కువ విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పాములు సాధారణంగా పశువుల ముట్టె, కాళ్లు, పొదుగు భాగంలో కాటు వేస్తాయి. తాచుపాము, కట్ల పాము కాటువేస్తే తాచుపాము, కట్లపాము కరిస్తే న్యూటాక్సీన్ (విషం)విడుదలై పశువుల నాడీ మండలం దెబ్బతినే ప్రమాదం ఉంది.దీంతో శ్వాసకోశ వ్యవస్థ స్తంభిస్తుంది. పాము కరిచిన చోట మంట ఉండదు. కానీ నోటినుంచి నురగ వస్తుంది. శరీరం అదుపు తప్పుతుంది. పశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లి సరైన కాలంలో మందులు వేయకపోతే మృతి చెందుతాయి. రక్త పింజర కరిస్తే.. రక్త పింజర కరిచినప్పుడు హిమోటాక్సిన్ (విషం) విడుదల రక్తంలో కలిసి రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో పశువుల ముక్కు, నోరు నుంచి రక్తం కారుతుంది. కాటు దగ్గర మంటగా ఉంటుంది. వాపు వచ్చి పాము కరిచినచోట చర్మం రంగు మారి రక్తం కారుతుంది. మూత్రం ఎరుపురంగులో ఉంటుంది. రక్తపింజర కాటు బారిన పశువు పది గంటల్లోగా మృతి చెందుతుంది. -
రొయ్యో.. మొర్రో
టంగుటూరు: వ్యాపారుల మాయాజాలంలో ఆక్వా రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు కూటమికట్టి ధరలను నియంత్రిస్తున్నారు. మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారు. వ్యాపారులు ఏడాదికి ఒకసారి ధరలపై సీలింగ్ పెట్టి రైతులను దోచుకుంటున్నారు. ఇది ధరల సీజన్: అక్టోబర్, నవంబర్ నుంచి జనవరి వరకూ రొయ్యలకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంటుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, ముస్లిం పండుగలు ఇదే రోజుల్లో ఉండటంతో విదేశాలకు కంటైనర్ల కొద్దీ రొయ్యలు ఎగుమతవుతాయి. ఎగుమతి చేసేందుకు, కొత్తగా స్టాకు చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడి రొయ్యలు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల్లో పోటీతో సీలింగ్కు బ్రేక్ పడుతుంది. ఈ సీజన్లో రొయ్యల అమ్మకానికి వచ్చిన రైతులకు లాభాలపంట పండుతుంది. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా ధరలున్నాయి. రెండు నెలల క్రితం వరకూ 30 కౌంట్ రూ.650 ఉన్న ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 30 కౌంట్ ప్రస్తుతం రూ.500 ఉండగా, 40 కౌంట్ రూ.400, 50 కౌంట్ రూ.360 ఉంది. ఈ ధరలూ ఒకప్పుడు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాయి. పెరిగిన సీడ్, ఫీడ్, విద్యుత్, ఇతర ఖర్చులతో ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు నష్టాలు మిగులుస్తున్నాయి. 30 కౌంట్ రొయ్యలు పెంచాలంటే రైతుకు రూ.500 వరకు, 40 కౌంట్ పెంచేందుకు రూ.400 వరకు ఖర్చవుతుంది. సగానికి పడిపోయిన రొయ్యల సర్వేయల్ (చెరువులో బతికిన రొయ్యలు): సీడ్లో లోపం కారణంగా చెరువులో వేసిన రొయ్యల సీడ్లో సగం కూడా బతకడం లేదు. 40 నుంచి 50 శాతం లోపే రొయ్యల సీడ్ బతికి ఉంటుంది. హేచరీల యాజమాన్యాలు లాభాపేక్షతో రైతులను మోసం చేస్తున్నారు. బ్లూడర్స్(తల్లిరొయ్య)సేకరణలో లోపంతో నాణ్యమైన సీడ్ రావడం లేదు. సీడ్లో నాణ్యత లేదని తెలిసీ రైతులకు అంటగడుతున్నారు. ఒకప్పుడు కేవలం 30 పైసలున్న సీడ్ ధరను నేడు 60 నుంచి 80 పైసలకు పెంచారు. వెనామిలో హెక్టారు చెరువుకు 2 నుంచి 5 లక్షల వరకూ సీడ్ పోస్తున్నారు. రైతులు సీడ్కే లక్షలో వ్యయం చేస్తున్నారు. వాతావరణంలో మార్పు, సీడ్ లోపం కారణంగా నెల రోజులకే కొన్ని చోట్ల చెరువులు దెబ్బతింటున్నాయి. దీంతో హెక్టారు చెరువులో రూ.7 నుంచి రూ.10 లక్షల వరకూ నష్టపోతున్నారు. యాంటీ బయాటిక్స్ వల్లే ధరలు పతనం: రైతులు యాంటీబయాటిక్స్ వాడకం వలన అంతర్జాతీయంగా మన రొయ్యలకు గిరాకీ తగ్గిందని, దీంతో రొయ్యల ధరలు పతనమవుతున్నాయని వ్యాపారి అల్లూరి వెంకట సత్యనారాయణరాజు అన్నారు. ఇతర దేశాలకు వెళ్లిన కొన్ని రొయ్యల లోడు కంటైనర్లు యాంటీ బయాటిక్స్ అవశేషాలున్నాయన్న కారణంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయని ఆయన అన్నారు. రైతులు యాంటీ బయాటిక్స్ స్వయం నియంత్రణ ద్వారా సాధించాలని ఆయన సూచించారు. -
యాంటీబయో‘కిల్స్’
ఐదేళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో 71 శాతం పెరిగిన యాంటీ బయోటిక్స్ వినియోగం ఏటా రూ. 5 వేల కోట్ల అమ్మకాలు ప్రభుత్వాసుపత్రులు వాటా రూ.123 కోట్లు ఈ మందుల వినియోగం పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాంటీబయోటిక్స్ మందుల వినియోగం తీవ్రమైంది. చిన్నపాటి జలుబు చేసినా ఈ తరహా మందులు వాడటం ఎక్కువైంది. వీటితో ప్రమాదం పొంచి ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 71 శాతం యాంటీబయోటిక్స్ మందుల వినియోగం పెరిగినట్టు తేలింది. రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధుల బాధితులకు మధుమేహం ఒక కారణమైతే.. రెండో కారణం యాంటీబయోటిక్స్ మందులేనని వైద్యులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో) ఒక్కొక్కరు ఏడాదికి సగటున 13 నుంచి 16 యాంటీబయోటిక్స్ మాత్రలు (ఇంజక్షన్లు కాకుండా) వినియోగిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మందుల వినియోగం దేశవ్యాప్తంగా కూడా గత ఐదేళ్లలో 62 శాతం పెరిగినట్టు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం తాజాగా తమ పరిశోధనలో తేల్చింది. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే తెలుగురాష్ట్రాల్లోనే ఈ మందుల వినియోగం ఎక్కువని తేలింది. ఇటీవలే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ యాంటీబయోటిక్స్ మందుల వినియోగం పెరుగుదల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ మందుల వినియోగం వల్ల దుష్ఫలితాలు ఏటికేడాదిపెరుగుతున్నాయి. సూక్ష్మక్రిములు (మైక్రోబ్యాక్టీరియా) నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. దీంతో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఏటా 30 శాతం యాంటీబయోటిక్ మందులు పనిచేయకపోతుండటంతో కొత్త మందులను వాడుతున్నట్టు తేలింది. మోతాదు పెంచడం వల్ల అది మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాకుండా నరాలు, ఎముకల సంబంధిత వ్యాధులూ వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. మైక్రోబ్యాక్టీరియా సామర్థ్యం పెంచుకునే కొద్దీ కొత్తరకాల వ్యాధులు వస్తున్నట్టు కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. రూ. 5 వేల కోట్లకు పైనే వ్యాపారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా ఒక్క యాంటీబయోటిక్స్ మందులుపై రూ. 5,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఔషధ నియంత్రణ మండలి ఇచ్చిన లెసైన్సులను బట్టి రెండు రాష్ట్రాల్లో 50 వేల మందుల షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో రోజూ 10 నుంచి 15 శాతం యాంటీబయోటిక్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆర్ఎంపీలు, ఫార్మసిస్ట్లు కూడా స్పెషలిస్ట్ డాక్టర్ అనుమతి లేకుండా హైడోస్ (మోతాదుకు మించిన) యాంటీబయోటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాస్పత్రులకు ఏటా రూ. 130 కోట్ల యాంటీబయోటిక్స్ మందులు కొనుగోలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యాంటీబయోటిక్స్పై అవగాహన లేకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. బలం పెంచుకుంటున్న బ్యాక్టీరియా యాంటీబయోటిక్స్ పదే పదే వాడటం వల్ల క్రిములు ఆ మందును తట్టుకునేలా బలాన్ని పెంచుకుంటున్నాయి. దీనివల్ల ఏటా కొత్త జబ్బులు వస్తున్నాయి. పైగా అర్హతలేని వైద్యులు కూడా ఈ మందులను ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నారు. యాంటీబయోటిక్స్ వల్ల కిడ్నీలపై ఎక్కువ ప్రభావం పడుతోంది. దీనివల్ల కిడ్నీరోగుల సంఖ్య పెరుగుతోంది. కఠినమైన నిబంధనలు విధిస్తే తప్ప వీటిని నివారించడం కష్టమైన పని. -డాక్టర్ జె.రంగనాథ్, మూత్రపిండాల వైద్య నిపుణులు, మల్లిక కిడ్నీసెంటర్, హైదరాబాద్ భవిష్యత్లో దొరక్కపోవచ్చు.. చిన్నచిన్న జబ్బులకు కూడా అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడుతున్నాం. వీటిని వాడటం వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకోవడమే కాకుండా, సూక్ష్మక్రిములు మరింత రాటుదేలి పోతున్నాయి. దీంతో భవిష్యత్లో ఈ స్థాయిలో బలమైన యాంటీబయోటిక్స్ను మనం తయారు చేసుకోలేక పోవడం గానీ, దొరక్కపోవడం గానీ జరగవచ్చు. -డాక్టర్ బి.చంద్రశేఖర్రెడ్డి, న్యూరో ఫిజీషియన్,సిటీ న్యూరో సెంటర్, హైదరాబాద్ -
మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ వాడకంతో తగ్గుతున్న రోగ నిరోధక శక్తి
ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన సాక్షి, బెంగళూరు : జ్వరం, జలుబు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు సైతం ప్రజలు మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్ను వాడుతుండటంతో శరీరంలోని రోగనిరోధక శక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోందని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కర్ణాటక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి డాక్టర్ వై.సి.యోగానందరెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుతం చాలా మంది తమకు అవసరం ఉన్నా లేకున్నా అనేక రకాల యాంటీ బయాటిక్స్ను వాడుతున్నారని అన్నారు. ఈ కారణంగా శరీరంలో సహజంగా ఏర్పడిన రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తోందని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు ఎలాంటి ఔషధం మనిషి దేహంపై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్ను వాడడాన్ని ప్రజలు తగ్గించుకోవాలని, అందునా డాక్టర్ సలహా లేకుండా ఏ యాంటీ బయాటిక్స్ను వాడరాదని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో అవసరం లేని అనేక యాంటీ బయాటిక్స్ ప్రజలపై దుష్పరిణామాలను కనబరుస్తున్నాయని, వీటన్నింటిని నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. యాంటీ బయాటిక్స్ వాడకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహనను కల్పించేందుకు నేటి (ఆదివారం) నుంచి అక్టోబర్ 5 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రముఖ డాక్టర్లు, మెడికల్ షాపుల యజమానులు ఈ అవగాహనా కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారని వెల్లడించారు. -
ఆక్వా ఎగుమతులపైయాంటీ బయోటిక్స్ దెబ్బ!
యాంటీ బయోటిక్స్ అంటే.. కొన్ని జాతుల సూక్ష్మ జీవుల జీవన ప్రక్రియలో భాగంగా తయారయ్యే రసాయనిక పదార్థాలే యాంటీ బయోటిక్స్. ఈ రసాయానాలు మిగిలిన సూక్ష్మ జీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. యాంటీ బయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్న వారికి అలర్జీ, విష లక్షణాలు కనిపిస్తాయి. ఆహార నాళంలోని సూక్ష్మజీవుల్లో మార్పులు వచ్చి యాంటీ బయోటిక్స్ నిరోధక శక్తి కలిగిన కొత్త సూక్ష్మ జీవుల జాతులుగా మారే ప్రమాదం ఉంది. మనం తీసుకునే సముద్ర ఆహార ఉత్పత్తుల కణజాలంలో క్లోరాం ఫెనికాల్ అవశేషాలు ఎముక మూలుగ(బోన్మారో)కు హాని చేస్తాయి. రక్త హీనత కూడా ఏర్పడుతుంది. నైట్రో ఫ్యూరాన్ అవశేషాలు కేన్సర్కు దారితీస్తాయని పశోధనల్లో తేలింది. ఈ కారణాల నేపథ్యంలో సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు జల జీవుల పెంపకంలో యాంటీ బయోటిక్స్ను నిషేధించాయి. సురక్షితమైన రొయ్యల సాగుకు జాగ్రత్తలు యాంటీ బయోటిక్స్ అవశేషాలు కలిగిన రొయ్యల ఎగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆక్వా రైతులు, హేచరీల యజమానులు, మందుల తయారీ సంస్థలు ఆక్వా పెంపక రంగంతో అనుబంధం ఉన్న వారు యాంటీ బయోటిక్స్ను నిబద్ధతతో వాడాలి. హేచరీల్లో రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ అన్ని జాతుల పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించి వాటిని పూర్తిగా నిర్మూలిస్తాయి. కొన్ని జాతుల సూక్ష్మ జీవుల యాంటీ బయోటిక్స్ని తరచుగా వాడే సందర్భాల్లో వ్యాధికారక జీవుల జన్యువులు బయోటిక్స్ను నిరోధించే శక్తిని సంతరించుకుని తర్వాత సంతతులకు అందజేస్తాయి. ఈ ప్రక్రియలో ఏర్పడే కొత్త రకాల సూక్ష్మ జీవులను యాంటీ బయోటిక్స్ వాడినా నిర్మూలించలేం. చెరువుల్లో ప్రోబయోటిక్స్ వాడకం ద్వారా యాంటీ బయోటిక్స్ వాడే అవసరం ఉండదు. ఆక్వా రైతులు ఇవి అనుసరిస్తే మేలు.. చెరువుల్లో రోగ నిరోధానికి, రోగ నిర్మూలనకు ఆహారంతో పాటు అందజేసే యాంటీ బయోటిక్స్ రొయ్యల శరీరంలో నిల్వ ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల యంటీబయోటిక్స వాడకంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను రైతులు తప్పనిసరిగా పాటించాలి. యాంటీ బయోటిక్స్ వాడిన చెరువుల్లో రొయ్యలను ఆహారంగా తీసుకునే వారికి కలిగే హానిని గుర్తించాలి. యాంటీ బయోటిక్స్ వాడకంలో నిర్ధేశించిన గరిష్ట పరిమితులు, విత్డ్రా సమయం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. హేచరీ/రొయ్యల పెంపకంలో వాడే మందులో యాంటీ బయాటిక్స్ లేవనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. రైతులు వాడే మందులను అసలైన ప్యాకింగ్లోనే లేబుల్స్తో సహా ఉంచాలి. సాంకేతిక సలహాదారు ద్వారా చెరువుల్లో ఉపయోగించే మందుల ఉపయోగాలను తెలుసుకోవాలి. హేచరీల్లో/ఫారంలో వాడే మందుల వివరాలు, ఉపయోగించిన కారణాన్ని సాంకేతిక సలహాదారుతో నమోదు చేయించాలి. హేచరీ నుంచి తెచ్చిన పిల్లలను, వాటి పెంపకంలో వాడే ఆహారాన్ని తరచూ పరీక్ష చేయించి యాంటీ బయోటిక్స్ అవశేషాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. పశువైద్యంలో వాడే మందులు విదేశాల నుంచి తెప్పించినప్పుడు అవి ఆక్వా కల్చర్లో వాడటానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని తె లుసుకోవాలి. అవి ఏ దేశం నుంచి దిగమతి చేశారో గుర్తించి శానిటరీ సర్టిఫికెట్ తప్పనిసరిగా గమనించాలి. యాంటీ బయోటిక్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై తోటి రైతులకు కూడా అవగాహన కలిగించి వాడకాన్ని నియంత్రించాలి. రొయ్యల పెంపకం సమయంలో ఆక్వా కల్చర్ గ్రేడ్ మందులు, అనుమతించిన మందులును మాత్రమే పంపిణీ చేయాలని సదరు సంస్థలను రైతులు అడగాలి. యాంటీ బయోటిక్స్ వాడకం ఆపేసిన తర్వాత చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత 22 సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు 15 రోజులు, ఇంకా ఎక్కువగా ఉంటే 20 నుంచి 25 రోజుల తర్వాత పట్టుకోవాలి. శాస్త్రీయ సాంకేతిక సలహాల కోసం మత్స్యశాఖ అధికారులను తరచూ కలిసి వారి ఆదేశాలను పాటించాలి. - చినగంజాం -
కోళ్లకు ‘యాంటిబయాటిక్స్’ అవాస్తవం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్లకు రోగాలు వచ్చినప్పుడు మినహా సాధారణ పరిస్థితుల్లో యాంటిబయాటిక్స్ వాడడం లేదని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఢిల్లీ ప్రాంతంలో చేపట్టిన అధ్యయనంలో కోళ్లలో యాంటిబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయని తేలిన సంగతి తెలిసిందే. అయితే రిపోర్టులో ఉన్న అవశేషాల స్థాయి యూరోపియన్ ప్రమాణాలకు లోబ డే ఉందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి వెల్లడించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి.హర్షవర ్ధన్రెడ్డి, జనరల్ సెక్రటరీ జి.రమేష్బాబు, జాయింట్ సెక్రటరీ సి.మధుసూధన్రావు, పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డి.సుధాకర్, జనరల్ సెక్రటరీ కేఎస్ రెడ్డి, నెక్ హైదరాబాద్ జోన్ వైస్ చైర్మన్ కేవీఎస్ సుబ్బరాజు, వీహెచ్ గ్రూప్ జీఎం ఎస్.బాలసుబ్రమనియన్తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ అప్రాధాన్యం..: లక్షల టన్నుల్లో చికెన్ లెగ్స్ అమెరికా గిడ్డంగుల్లో 5 ఏళ్లపైబడి నిల్వ ఉన్నాయి. వీటిని కిలోకు రూ.24-48లకే వివిధ దేశాలకు అమెరికా ఎగుమతి చేస్తోందని పౌల్ట్రీ ప్రతినిధులు తెలిపారు. భారత్కు చికెన్ లెగ్స్ దిగుమతి నిర్ణయం గనక అమలైతే దేశీయ కోళ్ల పరిశ్రమ కుదేలవడం ఖాయమని అన్నారు. దిగుమతయ్యే చికెన్పై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని వారు డిమాండ్ చేశారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు. ధాన్యం ధరలు పెరగడంతో కిలో కోడికి రూ.10 నష్టపోతున్నామని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికిగాను ఒక్కో కోడిపైన రూ.6 దాకా పౌల్ట్రీ యజమానులు వడ్డీ చెల్లిస్తున్నారన్నారు. -
ఈ కోళ్లు ఖతర్నాక్
- విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం - 40 శాతం కోళ్లలో మందుల అవశేషాలు - శరీరానికి ముప్పు తప్పదంటున్న ఐఎంఏ సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ఢిల్లీలోని పౌల్ట్రీఫారాల నిర్వాహకులు కోళ్లకు భారీ ఎత్తున యాంటీబయాటిక్స్ను భారీ మోతాదులో వాడుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలడం చర్చకు దారితీసింది. యాంటీబయాటిక్స్ వాడిన చికెన్ తినడం వలన మానవ శరీరంలో క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గి, విషక్రిముల ప్రభా వం పెరుగుతుందని హెచ్చరించింది. కోళ్లు రోగాల బారిన పడకుండా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇలాంటి కోళ్ల మాంసాన్ని తినడం వల్ల మానవశరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. ఫలితంగా రోగాల బారిన పడడం ఖాయమని, అప్పుడు యాంటీబయాటిక్స్తోనూ ప్రయోజనం ఉండకపోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ డాక్టర్ నరేంద్ర సైనీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ను జాగ్రత్తగా వాడడంపై అవగాహన పెంచాలని ఐఎంఏ నిర్ణయించింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో పెంచుతున్న కోళ్లలో ఆరు యాంటీబయాటిక్స్ మందుల అవశేషాలు అధికంగా ఉన్నాయని సీఎస్ఈ వెల్లడించింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో దొరికే 70 చికెన్ నమూనాలను పరీక్షించగా, 40 శాతం కోళ్లలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టు నిర్ధారించారు. 17 శాతం నమూనాల్లో ఒకటి కన్నా ఎక్కువ యాంటీబయాటిక్స్ అవశేషాలున్నాయని సీఎస్ఈ ఇటీవల జరిపిన అధ్యయనం వెల్లడించింది. కోళ్లు వేగంగా పెరిగి, వాటిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పెంపకందారులు యాంటీబయాటిక్స్ను వాడుతున్నారు. ఇలాంటి కోళ్ల మలమూత్రాలు భూమి, నీటిలో కలవడంవల్ల వాటి దేహాల్లోని యాంటీబయాటిక్స్ అవశేషాలు క్రమేణా మానవశరీరంలో చేరవచ్చు. కోడి మాంసాన్ని బాగా ఉడికించినప్పటికీ ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి చికెన్ తినడం వల్ల క్రమేణా మనిషి శరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. మానవులలో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాకు శక్తి పెరిగిన తరువాత యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా ఫలితం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో సిప్రోఫ్లోక్సీసిన్, టెట్రాసైక్లీన్, డాక్సీసైక్లిన్ వంటి యాంటిబయాటిక్స్కు బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతోందని డాక్టర్లు అంటున్నారు. ఏ కోడికి యాంటిబయాటిక్స్ వాడారో తెలుసుకోవడం కష్టం కాబట్టి పౌల్ట్రీల్లో యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయడం మేలన్నది డాక్టర్ల అభిప్రాయం. -
మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స!
పండ్ల తోటల్లో యాంటీ బయోటి క్స్కు లొంగని మొండి తెగుళ్లను సమర్థవంతంగా నిలువరిస్తున్న ప్రోబయోటిక్స్ దానిమ్మ, బత్తాయి, నిమ్మ, మామిడి.. అంతా బాగుంటే రైతుకు అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులపై అతిగా ఆధారపడి ఈ పంటలను సాగు చేసే రైతుల ఆశలు వమ్ము అవుతున్న సందర్భాలు తరచూ తారసపడుతున్నాయి. మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటూ మొండికేస్తున్న బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లే ఈ దుస్థితికి కారణం. ఈ తెగుళ్ల నివారణకు వాడుతున్న శిలీంద్ర నాశక మందు మోతాదు పెంచుతున్న కొద్దీ తెగుళ్ల తీవ్రత పెరుగుతోంది తప్ప ఫలితం ఉండడం లేదు. విసిగిపోయిన రైతులు కొందరు తోటలు తీసేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రైతుల ఆశలను కూలదోస్తున్న ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఉంది! యాంటీ బయోటిక్ రసాయనానికి బదులుగా.. జీవామృతం, పంచగవ్య వంటి ప్రోబయోటిక్స్ వాడి, తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ప్రొ. శ్యాం సుందర్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటే తప్ప జీవామృతంతో ఈ తెగుళ్లు పత్తాలేకుండా పోతాయంటున్నారు. దానిమ్మ దిగుబడిని ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగులు 50-100% వరకు దెబ్బతీస్తున్నది. ఆకులపై మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోవడం, కాయలపై కూడా మచ్చలు ఏర్పడడంతో సమస్య జటిలంగా మారింది. నెలకోసారి, తెగులు ఉధృతిని బట్టి వారానికోసారి కూడా దీన్ని పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఏడాదికి రూ. 30 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దానిమ్మ సాగులో అపారమైన అనుభవం కలిగిన, వనరులకు కొరత లేని రైతులకు తప్ప సాధారణ రైతులు, కొత్తగా సాగు ప్రారంభించిన వారికి ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లు శాపంగా మారి.. తోటలు తీసేయాల్సిన పరిస్థితి వస్తోంది. బత్తాయి/ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు బత్తాయి, నిమ్మ తోటల్లో గజ్జి తెగులు సమస్యగా ఉంది. దీన్ని అరికట్టడానికి యాంటీబయోటిక్ మందును 3-5 సార్లు పిచికారీ చేస్తున్నారు. యాంటీబయోటిక్ వాడకం వల్ల నష్టాలు: యాంటీబయోటిక్స్, శిలీంద్రనాశకాలను చెట్లపై చల్లడం వల్ల తెలుగు కారక సూక్ష్మజీవులతోపాటు, ఆకుల ఉపరితలంపై ఉండి రక్షణ కల్పించే మేలు చేసే సూక్ష్మజీవులు సైతం చనిపోతాయి. ఈ మందు చల్లినప్పుడు, వర్షం పడినప్పుడు ఆకుల మీద నుంచి కారి భూమి మీద పడినప్పుడు నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. బ్యాక్టీరియాలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. తెగులు విజృంభిస్తుంది. ఇవీ ప్రోబయోటిక్స్: జీవామృతం, పంచగవ్య(2-5% అంటే.. వంద లీటర్ల నీటిలో 2 నుంచి 5 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి), కునప జలం(2-5% పిచికారీ చేయాలి). ఇవన్నీ చీడపీడలను అరికట్టడంతోపాటు పంటలకు పోషకాలను అందించే ప్రోబయోటిక్సే. జీవామృతం ఎలా వాడాలి? పంటలపై జీవామృతాన్ని 10,15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. జీవామృతాన్ని 1:4 మోతాదులో నీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిచి నీరు కారేంత వరకు పిచికారీ చేయాలి. ముందు నుంచే పిచికారీ చేస్తే ఆకుమచ్చ, శిలీంద్రపు తెగుళ్లు పంటల దరిచేరవు. ఈ తెగుళ్లు సోకిన చెట్లపై జీవామృతాన్ని వడకట్టి పిచికారీ చేస్తే సమర్థవంతంగా అదుపులోకి వస్తాయి. ఆకులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. దానిమ్మ, మామిడి, పసుపు వంటి పంటలకు ఆశించే ఆంత్రాక్నోస్ అనే శిలీంద్రపు తెగులు వల్ల మచ్చలు ఏర్పడిన ఆకులు, కాయలు కుళ్లిపోతాయి. జీవామృతాన్ని పిచికారీ చేస్తే ఇది కూడా పోతుంది. జీవామృతం తయారీ ఇలా.. 200 లీటర్ల నీరు + 10 కిలోల నాటు ఆవు పేడ + 10 లీటర్ల నాటు ఆవు మూత్రం + కిలో బెల్లం + కిలో ఏవైనా పప్పుల పిండి + గట్టు మట్టి గుప్పెడు.. వీటిని డ్రమ్ము/ తొట్టిలో పోసి కుడి వైపునకు (గడియారపు ముల్లు తిరిగే విధంగా) తిప్పాలి. డ్రమ్మును ఎండ తగలకుండా నీడన ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రతో కుడి వైపునకు కలియ తిప్పుతూ ఉండాలి. కలిపిన 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధం అవుతుంది. అప్పటి నుంచి 7 రోజుల్లోగా వాడేయాలి. జీవామృతంలో నేలకు, చెట్లకు మేలు చేసే కోటానుకోట్ల సూక్ష్మజీవుల సముదాయం, సూక్ష్మపోషకాలు, అమైనో ఆమ్లాలుంటాయి. దీన్ని పిచికారీ చేసినా, నేలపైన పోసినా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. సేంద్రియ ఎరువులూ వాడాలి జీవామృతం ద్వారా 100% ఫలితాలను పొందాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం బాగుండాలి. ఇందుకోసం సేంద్రియ ఎరువులు కూడా విధిగా వాడాలి. ఎకరానికి 10-20 టన్నుల చివికిన పశువుల ఎరువు లేదా 2-5 టన్నుల వర్మీ కంపోస్టు లేదా టన్ను మేరకు కానుగ / ఆముదం / వేప పిండి వేయాలి. రసాయనిక నత్రజని ఎరువులు అతిగా వాడితే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్ల ఉధృతి పెరుగుతుందే గానీ తగ్గదు. ఒకవేళ రసాయనిక ఎరువులు అనివార్యంగా వాడాల్సి వస్తే.. అతితక్కువ మోతాదులో, విడతల వారీగా వాడుకోవాలి. 10 రోజులకోసారి కిలో వాడేకన్నా.. రోజుకో వంద గ్రాములు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మల్చింగ్తో సాగునీటి ఆదా, కలుపు సమస్యకు చెక్! జీవామృతం, సేంద్రియ ఎరువులతోపాటు గడ్డిని, రొట్టను నేలపై ఆచ్ఛాదన(మల్చింగ్)గా వేయడం వల్ల చెట్లకు మేలు కలిగించే సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందడానికి అనుకూలమైన సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. మల్చింగ్ వల్ల సాగునీరు ఆదా కావడమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. నేలపై వేసిన గడ్డి కుళ్లి, మంచి ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తుంది. వరి గడ్డి, వరి పొట్టు, జంబుగడ్డి, చెరకు ఆకు, కొబ్బరి పీచు, అడవి చెట్ల నుంచి సేకరించిన ఆకులు.. తదితరాలను మల్చింగ్గా ఉపయోగించవచ్చు. అధిక మోతాదులో మల్చింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రైతులు ఎవరికివారు తమ పొలంలోని 10-20% విస్తీర్ణంలో జనుము, జీలుగ, మొక్కజొన్న, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను విత్తుకొని.. ప్రతి 45 రోజులకోసారి కోసి మల్చింగ్ కోసం వాడుకోవచ్చు. జనుము 65 రోజులు పెరిగిన తర్వాత కోసి.. మల్చింగ్గా వాడుకోవడం మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ మామిడిపై బ్యాక్టీరియా ఆకుమచ్చ బనేషాన్ మామిడి చెట్ల ఆకులపై బ్యాక్టీరియా మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. ఆకులు తక్కువ ఉండడం వల్ల కాయలు సరిగ్గా పెరగవు. ఎండ నేరుగా పడడం వల్ల కాయలు పసుపు పచ్చగా మారుతుంటాయి. దీన్ని ఎవరూ అంతగా గుర్తించడం లేదు. దానిమ్మ పూత, పిందె దశలో జీవామృతం పిచికారీ చేయొద్దు! దానిమ్మ తోట పూత, పిందె దశలో ఉన్నప్పుడు జీవామృతం పిచికారీ చేయరాదని, అలా చేస్తే పూత, చిన్న పిందెలు రాలిపోతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని ప్రొ. శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. పూత, పిందె ఏర్పడుతున్న ఆ నెల రోజులపాటు జీవామృతాన్ని పిచికారీ చేయరాదని, నీటిలో కలిపి నేల మీద పోయవచ్చు. తోట లేతగా ఉన్నప్పుడు, కాపు వద్దను కున్నప్పుడు పూత, పిందెలను తీసెయ్యడానికి జీవామృతం పిచికారీ చేయొచ్చు. జీవామృతంతో నీటిని 1:1 నుంచి 1:4 పాళ్లలో కలిపి పిచికారీ చేస్తే వాటంతట అవే రాలిపోతాయన్నారు. రైతుకు కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా.. రాలినవి త్వరగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారతాయన్నారు. జీవామృతంతో అద్భుత ఫలితాలు! ఉద్యాన పంటల్లో జీవామృతం, పంచగవ్య, కుణపజలం, ఉపయుక్త సూ క్ష్మజీవులు(ఈఎంలు), స్థానిక ఉపయుక్త సూక్ష్మజీవులు (ఐఎంవోలు), బయోడైన మిక్ ద్రావణాలు, పులిసిన కల్లు, పులిసిన మజ్జిగ.. చేప, కోడిగుడ్ల అమైనో ఆమ్లాలు తదితర ప్రోబయోటిక్స్తో ఐఐఐటీ(హైదరాబాద్)లో, రైతుల తోటల్లో విస్తృత ప్రయోగాలు చేస్తున్నాం. జీవామృతం అందరూ సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగినది. ఆకులపై ఆశించే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లను ఇది ఎంతో సమర్థ వంతంగా అరికట్టగలుగుతున్నది. జీవామృతం వాడు తున్న తోటల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపించడం చాలా అరుదు. పంచగవ్య కూడా ఆకుమచ్చ తెగుళ్ల నివారణలో అద్భుత ఫలితాలనిస్తున్నది. - ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్రెడ్డి, రైతు, సస్య వైద్యుడుః ఐఐఐటీ - హైదరాబాద్, మొబైల్: 99082 24649. shyamiiit@gmail.com -
విచక్షణతోనే యాంటీ బయాటిక్స్ వాడాలి!
అవగాహన ఇటీవల యాంటీ బయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికి వారు మందుల పేర్లు తెలుసుకుని అనారోగ్యం రాగానే యాంటీ బయాటిక్స్ని వాడేస్తున్నారు. దాంతో ఆ మందు అరకొరగా పనిచేస్తుంది. దేహంలో చేరిన వ్యాధి కారక వైరస్ యాంటీ బయాటిక్ నుంచి తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. ఆ తర్వాత వ్యాధి తగ్గాలంటే మరింత శక్తిమంతమైన మందును వాడక తప్పదు. మరో సమస్య ఎలా ఉంటుందంటే... డాక్టరు సూచించిన మందులనే వాడుతుంటారు. కానీ రెండు రోజుల్లో వ్యాధి తగ్గుముఖం పట్టగానే ఆపేస్తారు. ఆ మందులు అలా ఉంటే మరోసారికి వాడుకోవచ్చనే ఆదా పద్ధతన్నమాట. తగినంత మందు పడకపోతే వ్యాధికారక వైరస్ పూర్తిగా నశించకపోగా తిరిగి శక్తిని పుంజుకుంటుంది. ఈ వాడకంలో వ్యాధి కారక వైరస్ను సమర్థంగా నిర్మూలించే యాంటీ బయాటిక్నే వాడుతున్నామా లేదా అనేది ఆయారంగాల్లో నిపుణులకు తప్ప సాధారణంగా ఇతరులకు తెలియదు. ఇలాంటి విషయాల మీద అవగాహన తీసుకురావడానికి యూరప్ దేశాల్లో ‘యూరోపియన్ యాంటీ బయాటిక్ అవేర్నెస్ డే’ని నిర్వహిస్తున్నారు. ఏటా నవంబరు18వ తేదీన యాంటీబయాటిక్స్ వాడకానికి ఓ పద్ధతి ఉంటుందనీ, బాధ్యతతో వాడాలనీ సమావేశాలు పెట్టి మరీ తెలియచేస్తారు. -
తగిన మోతాదే అసలైన మందు
20 ఏళ్లు - యాంటీ బయాటిక్స్తో పెరిగిన మనిషి సగటు ఆయుర్ధాయం. 76 ఏళ్లు - పెన్సిలిన్ ఆవిష్కరణ తరువాత మనం భయంకరమైన వ్యాధులను సమర్థంగా తట్టుకున్న సమయం. 26 ఏళ్లు - కొత్త యాంటీబయాటిక్ తయారు కాకుండా గడిచిపోయిన కాలం. 1000 - మనిషి పేగుల్లో కనిపించే బ్యాక్టీరియా రకాలు. సగటున వీటి బరువే దాదాపు రెండు కిలోలు ఉంటుందని అంచనా. 9500000 - 2011లో సాంక్రమిక వ్యాధుల కారణంగా మరణించిన వారి సంఖ్య. వ్యాధికారక సూక్ష్మజీవులు మందులకు లొంగకపోవడం దీనికి ప్రధాన కారణం. ‘‘మీ వేలి కొన మొదలుకొని మోచేతి భాగం మధ్యలో ఉండే బ్యాక్టీరియా సంఖ్య ఎంతో తెలుసా? 20 లక్షల నుంచి కోటి!’’ ‘‘బాగా తలనొప్పిగా ఉందయ్యా... జ్వరం వచ్చినట్లు కూడా అనిపిస్తోంది’’ ‘‘దానిదేముంది... ‘ఫలానా’ యాంటీబ యాటిక్ వేసుకోండి. ఇట్టే తగ్గిపోతుంది.’’ ‘‘ఒకే’’ తరచూ వినే సంభాషణ ఇది. కానీ ఇలా యథాలాపంగా మందేసుకుని మనకుమనం ఎంత హాని చేసుకుంటున్నామో ఎవరూ పట్టించుకోవడంలేదు. అవసరమున్నా లేక పోయినా యాంటీబయాటిక్స్- అదికూడా అధిక మోతాదులో-వాడటం వల్ల మానవ జాతికి పెనుప్రమాదం ముంచుకొచ్చింది. వ్యాధికారక సూక్ష్మక్రిములు ఈ మందులతో నిరోధకత పెంచుకుంటున్నాయి. 1943లో పెన్సిలిన్ ఆవిష్కరణ తరువా త మానవజాతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను, సాంక్రమిక వ్యాధులను తట్టుకుని దాదాపు 76 ఏళ్లు మనగలిగింది. ఆ తరువాతి కాలంలో బ్యాక్టీరియా కూడా తెలివి మీరడం, కొత్తకొత్త రూపాల్లో విరుచుకుపడటం మొదలయ్యా యి. గత 30 ఏళ్లలో డెంగీ, చికెన్గున్యా వం టి దాదాపు 30 కొత్త వ్యాధులు పుట్టుకొచ్చా యని అంచనా. మందులకు లొంగని ఈ కొత్త వ్యాధుల కారణంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు పేదదేశాల్లో ఏ టా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక పిల్లాడు సాంక్రమిక వ్యాధుల కారణంగా మర ణిస్తూం డడం మన ఖ్యాతిని పెంచే విషయం కాదు. మందులకు నిరోధకత పెరగడానికి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం ఒక్కటే కారణం కాదు. విచక్షణ మరచి పశు వులకూ వీటిని వాడటం మరో కారణం. ఆ మందులు పశు ఉత్పత్తుల ద్వారా పరోక్షంగా మనిషిలో తిష్టవేస్తున్నాయి. పోనీ కొత్తకొత్త మందులు తయారు చేసుకోవచ్చుకదా? అను కుంటే అదేమంత ఆషామాషీ కాదు. ఒక కొత్త మందు అభివృద్ధి చేయాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవు తుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని పరి శోధన, అభివృద్ధులపై ఖర్చుపెట్టేందుకు కం పెనీలు ఇష్టపడటం లేదు. యాంటీబయా టిక్స్పై పెద్దగా లాభాలు రావన్న అంచనా దీనికి కారణం. అదే కేన్సర్, ఆర్థరైటిస్, మధు మేహాం వంటి వ్యాధులపై పెట్టే పెట్టుబడు లకు లాభాలు దండిగా ఉండటంతో ఎక్కువ కంపెనీలు అటువైపే మొగ్గుచూపు తున్నాయి. మందుల తయారీ కంపెనీలు తమ కాలుష్యాన్ని నియంత్రించుకోకుండా తాగు నీటి వనరుల్లోకి వదులుతూండటం, కొన్ని ప్రై వేట్ ఆసుపత్రుల్లో అవసరానికి మించిన మోతాదుల్లో యాంటి బయాటిక్స్ ఇస్తూం డటం కూడా వ్యాధులకు లొంగని బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమని నిజామ్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్లోని మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ వి.లక్ష్మి అంటున్నా రు. మందులకు పెరుగుతున్న నిరోధకత అం శంపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజిస్ట్ విస్తృ్తత అధ్యయనాలు చేస్తోంది. ‘‘దురదృష్టం ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో మాదిరి మన వద్ద యాంటీబయా టిక్స్ వాడకానికి సంబంధించి పూర్తిస్థాయిలో సమాచారం లేదు. ఎన్ని ప్రిస్కిప్షన్స్ వస్తున్నా యి? ఎలాంటి మందులు వాడుతున్నారు? అన్న అంశాలపై ఎవరికి అనుకూలమైన వాద న వారు చేస్తున్నారు. ఇది సరికాదు’’ అం టారు డాక్టర్ లక్ష్మి. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడేందుకు యాంటీబయా టిక్స్ వాడకానికి సంబంధించి సమగ్ర విధా నం అవసరమని ప్రభుత్వానికి సిఫారసు చేశామని, అన్నీ సవ్యంగా సాగితే మరో నాలు గైదు నెలల్లో ఇది అందుబాటులోకి రావచ్చు నని ఆమె వివరించారు. ప్రిస్కిప్షన్ లేకుండా దుకాణాలు మందులు ఇవ్వడాన్ని నియంత్రిం చాలని, ఆసుపత్రుల్లో కూడా తగిన మోతాదు లోనే మందులు ఇచ్చేలా చూసే విధానం ఉండాలని ఆశిస్తున్నామని డా.లక్ష్మీ తెలిపారు. - గిళియార్ గోపాలకష్ణమయ్యా