Atishi Marlena
-
అతిషికి సీఎం రేఖా గుప్తా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా మాజీ సీంఎ అతిషికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందంటూ అతిషి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించాయి. ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్లేం చేశారు. మేం వచ్చి ఒక్కరోజే అయింది. తొలి రోజే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల రూపాయల ఆయుష్మాన్ బీమా యోజన వర్తించేలా ఆదేశాలిచ్చాం. వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. వాళ్లు ముందు వారి పార్టీని సరిగా చూసుకోవాలి. చాలా మంది పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.గత ప్రభుత్వ అక్రమాలపై కాగ్ రిపోర్ట్ బయటపెడతామని ‘ఆప్’ భయపడుతోంది’అని అతిషికి సీఎం రేఖ కౌంటర్ ఇచ్చారు. కాగా, కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలును మరిచిపోయిందని అతిషి గురువారం ఎక్స్(ట్విటర్)లో విమర్శించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
‘ఢిల్లీలో కరెంట్ కష్టాలు.. ప్రజలు ఇన్వెర్టర్లు కొంటున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఆప్ 22 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఢిల్లీలో అప్పుడే కరెంట్ కష్టాల్లో మొదలయ్యాయంటూ ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి(Atishi) ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఢిల్లీలో కరెంట్ కష్టాలు ఆరంభం అయ్యాయంటూ సెటైర్లు వేశారు. బీజేపీకి ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. ప్రధానంగా పరిస్థితిని బట్టి కరెంట్ సదుపాయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో బీజేపీ అప్పుడే విఫలమైంది. దీనిపై నాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులొచ్చాయి. చాలా ఏరియాల నుంచి పలు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు అప్పుడే కరెంట్ ఉంటుందనే నమ్మకం కోల్పోయారు. వారు ఇన్వెర్టర్లు కొనుగోలు చేయడం ఇప్పటికే ఆరంభించారు. . ఢిల్లీని యూపీ తరహాలో మార్చబోతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆమె విమర్శించారు.ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. ఇంకా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మొదీ అమెరికా పర్యటన అనంతరం ఢిల్లీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎంగా బీజేపీ ఇంకా ఎంపిక చేయకుండానే, పూర్తి స్థాయి పరిపాలన బాధ్యతలు తీసుకోకుండానే ఆప్ విమర్శలు చేయడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. -
‘మీకు శాపం తగిలింది.. అందుకే ఓడిపోయారు’.. అతిషీతో సక్సేనా!
ఢిల్లీ: ‘నేను ముందునుంచి చెబుతూనే ఉన్నా. యమునాతో పెట్టుకోవద్దు. మీ కొంప మునుగుతుంది అని. అయినా మీరు నా మాట విన్నారా. వినలేదు. పెడ చెవిన పెట్టారు. ఇప్పుడు అనుభవించండి’ అంటూ ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనాతో (Atishi Marlena) లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (lieutenant governor V K Saxena) అన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషీ మర్లేనా తన రాజీనామాను లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. ఆ సమయంలో ఇరువురు మధ్య ఈ సంభాషణ జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (delhi assembly elections) బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ తరుణంలో కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్లు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో యమునా నదిని శుభ్రం చేయకుండా కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించడమే ప్రధాన కారణమని సమాచారం.యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్ను నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించా’ అని గవర్నర్ సక్సేనా అతిషితో చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. కేజ్రీవాల్కు యమునా నది శాపం ఏంటి?యమునా నది కాలుష్యం కోరలు చాచడంతో జనవరి 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నది పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అత్యున్నత స్థాయి కమిటీ ఐదు సమావేశాలు నిర్వహించి యమునా నదిని శుభ్రపరచే పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైంది. అందుకు ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణలు తొలగించడం, 11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడం పూర్తయింది. నదిలో నీటి ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అప్పుడే యమునా నదిని శుభ్రం చేసిన ఘనత తమకు దక్కదనే దురుద్దేశ్యంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో యమునా నదిని శుభ్రం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్ పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించింది. తత్ఫలితంగా, యమునా నదిని పరిశుభ్రం చేసే పనులు ఐదు నెలల తర్వాత ఆగిపోయాయి. ఆ విషయంలో కేజ్రీవాల్ విజయం సాధించినా నదిని శుభ్రపరిచేందుకు గత 16 నెలలుగా ఒక్క పని కూడా చేయలేదు’అని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గతేడాది నవంబర్లో ఓ కార్యక్రమంలో ఆరోపణలు గుప్పించారు.తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తన రాజీనామా సమర్పించేందుకు వచ్చిన అతిషీ మర్లేనాకు ‘యమునా నది పునరుజ్జీవనం’ శాపం అంశం గురించి గుర్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా,ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అటు అతిషీ కానీ, ఎల్జీ రాజ్భవన్ వర్గాలు నిరాకరించాయి.👉చదవండి : మాజీ సీఎం కేజ్రీవాల్ను మట్టికరిపించిన ఎవరీ పర్వేష్ వర్మ? -
‘ఆప్’ ఓడినా అతిషి డ్యాన్సులేంటి..? స్వాతి మలివాల్ పోస్టు వైరల్
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం అతిషిపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఫైరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయినప్పటికీ సీఎం అతిషి మాత్రం కల్కాజి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన సంతోషంలో అతిషి తన అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను స్వాతి మలివాల్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. పార్టీ ఓడిపోయినా బాధలేదు కానీ తాను మాత్రం గెలిస్తే చాలన్నట్లు సీఎం అతిషి డ్యాన్సులేయడం ఏంటని మలివాల్ ఎద్దేవా చేశారు. పార్టీ ఓడిపోయింది.ఆప్ ముఖ్య నేతలంతా ఓడిపోయారు.అయినా అతిషి ఇలా వేడుక చేసుకుంటున్నారు అని వీడియోను ఉద్దేశించి మలివాల్ విమర్శించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిషి 3521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై గెలుపొందారు. ये कैसा बेशर्मी का प्रदर्शन है ? पार्टी हार गई, सब बड़े नेता हार गये और Atishi Marlena ऐसे जश्न मना रही हैं ?? pic.twitter.com/zbRvooE6FY— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి పార్టీ సీనియర్ నేతలంతా ఓటమి పాలయ్యారు.27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. కాగా, అతిషి ఆదివారం(ఫిబ్రవరి 9) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎల్జీ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా పదవిలో కొనసాగాలని ఎల్జీ అతిషిని కోరారు. -
ఢిల్లీలో ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు
-
ఢిల్లీ సీఎంపై కేసు నమోదు.. సీఈసీపై అతిషీ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ (Atishi Marlena)పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆమెపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ పరిణామాలతో ఆమె ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు అరవై మంది మద్ధతుదారులతో.. పది వాహనాల్లో ఆమె పతేహ్ సింగ్ మార్గ్కు వచ్చారు. అయితే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా.. ఆమె నిరాకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడమే అని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదైంది. అయితే ఈ పరిణామంపై అతిషి ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ పోలీసులు అక్రమంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, నిజంగా కోడ్ను ఉల్లంఘించిన వాళ్లను వదిలేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్పైనా ఆరోపణలు గుప్పించారు.ఎన్నికల సంఘం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. రమేష బిధూరి కుటుంబ సభ్యులు బహిరంగంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. అయినా వాళ్ల మీద ఎలాంటి చర్యలు లేవు. అందుకు సంబంధించిన ఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. ప్రతిగా నా మీదే కేసు నమోదు చేశారు. రాజీవ్కుమార్గారూ.. ఎన్నికల ప్రక్రియను ఇంకెంత దిగజారుస్తారు? అంటూ సందేశం ఉంచారామె. ఇదిలా ఉంటే.. ఆప్ కన్వీనర్ సైతం సీఈసీ రాజీవ్కుమార్ మీద ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగాల్సి ఉంది.चुनाव आयोग भी ग़ज़ब है!रमेश बिधूड़ी जी के परिवार के सदस्य खुले-आम आचार संहिता का उल्लंघन कर रहे हैं। उन पर कोई एक्शन नहीं।मैंने शिकायत कर के पुलिस और @ECISVEEP को बुलाया, और इन्होंने मेरे ऊपर केस दर्ज कर दिया! राजीव कुमार जी: आप चुनावी प्रक्रिया कि कितनी धज्जियां उड़ायेंगे https://t.co/UlRiBzbELV— Atishi (@AtishiAAP) February 4, 2025 -
Bhagwant Mann: పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి.. ఢిల్లీలోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ సింగ్ (Bhagwant Mann Singh) నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారని చెప్పారు. ఈ ఘటన ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ సింగ్ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారు. ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. కానీ, బీజేపీ చేసిన తప్పులను, కాషాయ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు పట్టపగలే డబ్బులు పంచినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోసం వస్తువులను ప్రజలకు పంచేందుకు వెళుతున్నారు అయినప్పుటికీ పోలీసుల నుంచి స్పందన కరువైంది. కానీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటి పైకి సోదాలు చేసేందుకు మాత్రం వచ్చారు’ అంటూ మండిపడ్డారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.మరోవైపు.. సీఎం అతిశి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా సీ-విజిల్ పోర్టల్లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే.. అక్కడున్న భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని తెలిపారు.ఇదిలా ఉండగా.. అతిశి ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్ నేతలు ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇక, ఢిల్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్ల విషయం కూడా సంచలన మారిన సంగతి తెలిసిందే. दिल्ली पुलिस @BhagwantMann जी के दिल्ली के घर पर रेड करने पहुँच गई है। भाजपा वाले दिन दहाड़े पैसे, जूते, चद्दर बांट रहे हैं- वो नहीं दिखता। बल्कि एक चुने हुए मुख्यमंत्री के निवास पर रेड करने पहुँच जाते हैं।वाह री भाजपा! दिल्ली वाले 5 तारीख़ को जवाब देंगे!— Atishi (@AtishiAAP) January 30, 2025 -
ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం ఆతిశికి బిగ్ రిలీఫ్..
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్కు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఎన్నికల వేళ ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశికి ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఒక్క వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆమె మాట్లాడలేదని.. మొత్తం పార్టీని ఉద్దేశించే వ్యాఖ్యానించారని న్యాయస్థానం పేర్కొంది. కాగా, గత ఏడాది లోక్సభ ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశి.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీలో చేరకపోతే.. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కొందరు బీజేపీ నేతలు బెదిరించారంటూ ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్ను కొట్టేసింది.మరో వైపు, దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈ సారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు -
ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఎనిమిది రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది. ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి, మనీశ్ సిసోడియా తదితరుల సమక్షంలో పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ రెండో మేనిఫెస్టోను సోమవారం ‘కేజ్రీవాల్ గ్యారంటీ’పేరిట విడుదల చేశారు. ‘‘బీజేపీ నేతలు హామీలు ఇస్తారు కానీ అమలు చేయరు. మేం మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలోపు కచ్చి-తంగా అమలు చేస్తాం. ఢిల్లీలో ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే ఢిల్లీ వాసులపై ఆర్థిక భారం తప్పదు’’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ 15 గ్యారంటీలు ఇవే.. → వచ్చే ఐదేళ్లలో ప్రతి యువకుడికి ఉపాధి → మహిళా సమ్మాన్ యోజన క్రింద ప్రతి మహిళకు నేరుగా బ్యాంకు ఖాతాకే రూ.2,100 నగదు జమ → సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స → తప్పుడు నీటి బిల్లుల మాఫీ → 24 గంటలు తాగు నీటి సరఫరా → యూరప్తరహాలో ప్రపంచ స్థాయి రోడ్లు → యమునా నదిని శుభ్రం చేయడం → డాక్టర్ అంబేడ్కర్ స్కాలర్షిప్ పథకం → విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రోలో 50 శాతం రాయితీ → పూజారి–గ్రంథి సమ్మాన్ యోజన కింద హిందూ ఆలయాల్లో అర్చకులు, గురుద్వారాల్లో గ్రంథీలకు జీతభత్యాల కింద ఒక్కొక్కరికి రూ.18 వేలు → సొంతిళ్లవారితోపాటే అద్దెకు ఉంటున్న వారికీ ఉచిత విద్యుత్, నీరు → మురుగు నీటిపైపులైన్ల మరమ్మతు, ముగునీటి వ్యవస్థలను మెరుగుపరచటం → అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డుల జారీ → ఆటో, టాక్సీ, ఇ–రిక్షా డ్రైవర్లకు జీవిత బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం, పిల్లలకు ఉచిత కోచింగ్ → రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు -
కేజ్రీవాల్ హత్యకు కేంద్రం కుట్ర: ఆప్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కుట్ర పన్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ సీఎం అతిషి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన భద్రతా బృందాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఉపసంహరించిందంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంపై స్పందించాలని.. కేజ్రీవాల్కు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన భద్రతను పునరుద్ధరించాలన్నారు. కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు కలిగించడానికి ఇప్పటి వరకు జరిగిన దాడులపై విచారణ జరిపించాలని అప్ సీఎంలు డిమాండ్ చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని అతిషి, భగవంత్ మాన్ మండిపడ్డారు. కేజ్రీవాల్పై పదేపదే దాడులు జరుగుతున్నా కానీ వారు పట్టించుకోవడం లేదని.. అందుకే వారిపై తమ పార్టీకి నమ్మకం లేదంటూ వారు చెప్పుకొచ్చారు. దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చింది.. సిసోడియా సంచలన వ్యాఖ్యలు -
సీఎం అతిషిపై మళ్లీ నోరుజారిన బీజేపీ నేత
న్యూఢిల్లీ:ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన సీఎం అతిషిని టార్గెట్ చేశారు. అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్గురును సమర్థించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అతిషి తల్లిదండ్రులది భారత్ వ్యతిరేక మనస్తత్వమని అన్నారు.అందుకే పార్లమెంట్పై దాడి చేసిన వ్యక్తిని కాపాడేందుకు వారు ప్రయత్నించారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గం నుంచి బిదూరి సీఎం అతిషిపై బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిదిన ఫలితాలు రానున్నాయి.కాగా, బిదూరి సీఎం అతిషి లక్ష్యంగా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అతిషి తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుంచి అతిషిసింగ్గా మారిందన్నారు. ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో అతిషి జింకలా పరుగులు పెడుతోందని మరో సందర్భంలో బిదూరి వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిదూరియేనన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: ఆప్,బీజేపీల మధ్య చైనీస్ సీసీ కెమెరాల వివాదం -
‘మా వాళ్లని భయపెడుతున్నారు.. దాడులు చేస్తున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ((Delhi Assembly Election 2025) ాభాగంగా తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతల భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ((AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్ కార్యకర్తలను భయపెట్టడమే కాకుండా దాడులు సైతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికి ఆమె లేఖ రాశారు. ప్రధానంగా బీజేపీ(BJP) ఎంపీ రమేష్ బిధురి మేనల్లుడు తమ కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాడని ఆమె లేఖ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు.ఇంట్లో కూర్చోకపోతే.. కాళ్లు చేతులు విరిచేస్తారట..!ఢిల్లీ సీఎం అతిషి.. ఈసీకి ఫిర్యాదు చేసిన ాదాని ప్రకారం.. ‘ఇవి తమ ఎన్నికలని, ఇంట్లో కూర్చోకుండా బయటకుస్తే కాళ్లు, చేతులువిరిచేస్తామని ఆప్ కార్యకర్తలకు బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చినట్లు అతిషి ేపేర్కొన్నారు. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8వ తేదీన ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 5వ ేతేదీన జరుగనున్నాయి. ఇంకా సుమారు ెరెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ ెగెలిచేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠంపై తామే కూర్చోవాలని బీజేపీ సైతం గట్టిగా పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎక్కడా కూడా ఇరు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.అది కేజ్రీవాల్ పనే .. ఎఫ్ఐఆర్ నమోదు చేయండిఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ. -
‘ఇదేమి దుస్థితి.. వందలాది మంది రోగులు ఫుట్పాత్పైనే..’
ఢిల్లీ: ‘వారికి అత్యంత ఖరీదైన వైద్యం(high-quality healthcare) చేయించుకునే స్థోమత లేదు. నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు వారి స్థాయి సరిపోవడం లేదు. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని వందలాది మంది రోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఫుట్పాత్లే వారికి దిక్కు అవుతున్నాయి.’ అని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖా మాత్యులు జేపీ నడ్డాకు, ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాశారు రాహుల్ గాంధీ.‘ ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) దగర్గ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ బయట చూస్తే వందలాది మంది రోగులు ఫుట్పాత్లపైనే ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచన చేస్తే కోట్ల మంది ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి దేశంలోలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ వంటి మహా నగరంలో ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రికి అధిక భారంగా మారింది. దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి. అందుకే కేంద్ర హెల్త్ మినిస్టర్.జేపీ నడ్డాకు విన్నవించుకుంటున్నా. హెల్త్ సిస్టమ్లోని లోపాల్ని గుర్తించండి, మొదటిగా దేశంలోన ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిల్లో పరిస్థితిని చక్కదిద్దండి. ఎంత తొందరగా ఆ సమస్యను పరిష్కారిస్తానే ఇక్కడ ముఖ్యం. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలి. ఇది అన్నిస్థాయిల్లోనూ జరగాల్సిన అవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయండి’ అని రాహుల్ పేర్కొన్నారు.రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం కాంగ్రెస్ అగ్రనేత (రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. -
బీజేపీ గూండాలతో కేజ్రీవాల్ను చంపించే ప్రయత్నం: సీఎం ఆతిశీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన దరిమిలా ముఖ్యమంత్రి ఆతిశీ ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ను చంపడానికి భారతీయ జనతా పార్టీ శిక్షణ పొందిన గూండాలను పంపిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలా చేస్తున్నదని స్పష్టమవుతోందన్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను చంపడానికి నేరస్తులు, గూండాలను పంపినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఈ దాడిలో పాల్గొన్న రోహిత్ త్యాగి అని, అతను ఎప్పుడూ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ పక్కనే ఉంటాడన్నారు. ఆయన పర్వేష్ వర్మ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడన్నారు.अरविंद केजरीवाल पर हमला करने वाले BJP के गुंडे Hardcore Criminal‼️♦️ केजरीवाल जी पर हमला करने वाला एक शख़्स राहुल उर्फ शैंकी था। यह व्यक्ति प्रवेश वर्मा के साथ रहता है ♦️ इस शख़्स के ऊपर Arms Act समेत डकैती, मारपीट और जान से मारने की कोशिश जैसे कई केस दर्ज हैं@AtishiAAP pic.twitter.com/CozzJ4k0Lf— AAP (@AamAadmiParty) January 19, 2025ఈ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై 2011లో దొంగతనం కేసు, హత్యాయత్నం కేసు నమోదయ్యాయని, ఈ నేరానికి అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఆతిశీ(atisi) పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న మూడవ వ్యక్తి సుమిత్ అని, అతనిపై దొంగతనం, దోపిడీ, హత్యాయత్నం కేసులు నడుస్తున్నాయన్నారు. శనివారం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేసిన ముగ్గురు గూండాలు సాధారణ బీజేపీ కార్యకర్తలు(BJP workers) కాదని, శిక్షణ పొందిన గూండాలు, నేరస్తులని.. వారిపై నమోదైన కేసులను చూస్తే తెలుస్తుందని ఆతిశీ పేర్కొన్నారు. దీనిని చూస్తుంటే ఎన్నికల భయంతో బీజేపీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను చంపడానికి ప్రయత్నిస్తోందని స్పష్టంగా తెలుస్తున్నదని ఆమె ఆరోపించారు.ఈ ప్రమాదం తర్వాత కూడా ఎన్నికల సంఘం ఏమీ స్పందించలేదని ఆతిశీ పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ కు గరిష్ట అధికారం ఉన్నప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కిల్లర్ తరహా వ్యక్తులు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కోసం ప్రచారం చేయడానికి వచ్చారా లేదా అరవింద్ కేజ్రీవాల్ను చంపడానికి వచ్చారా? అని ప్రశ్నించారు. వారు ఢిల్లీకి ఎందుకు వచ్చారు? అరవింద్ కేజ్రీవాల్పై ప్రతిరోజూ దాడి జరుగుతోందని, తాజాగా జరిగిన ఘటన అరవింద్ కేజ్రీవాల్ హత్యకు జరిగిన కుట్ర అని సంజయ్సింగ్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: పారా గ్లైడింగ్లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం -
సీఎం అతిషిపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఢిల్లీ(Delhi)లో నేతల విమర్శలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అతిషి(Atishi)పై బీజేపీ సీనియర్ నేత రమేష్బిదూరి (Ramesh Bidhuri) తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలను పట్టించుకోని అతిషి ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగెడుతున్నారని బిదూరి అన్నారు.ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలో వీధుల పరిస్థితి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గడిచిన నాలుగేళ్లలో అతిషి ఎప్పుడూ ఈ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారని బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతిషి మర్లెనా తన తండ్రిని మార్చి అతిషి సింగ్గా మారిందని గత వారం కూడా బిదూరి అతిషిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాగా, రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద కామెంట్లు చేయడం బిదూరికి సర్వసాధారణమైపోయింది. బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించడం మొదలు.. ఎంపీ ప్రియాంకా గాంధీపైనా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమయ్యారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి: అతిషి, అల్కాలాంబా ఎవరు ధనవంతులు -
ఆతిశీ.. అల్కా లాంబా.. ఎవరు ధనవంతులు? ఎంత బంగారం ఉంది?
దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. ఈ నేపధ్యంలో రాజకీయపార్టీలు మంచి ఉత్సాహంలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల బరిలోకి దిగిన సీఎం అతిశీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కల్కాజీ స్థానం నుండి పోటీకి దిగారు. ఆతిశీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబాపై పోటీకి దిగారు. అల్కా లాంబా కూడా తాజాగా తన నామినేషన్ దాఖలు చేశారు. తమతమ నామినేషన్లలో వారిద్దరూ తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. అయితే వీరిద్దరిలో ధనవంతులెవరు? ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందనేని ఆసక్తికరంగా మారింది.ముందుగా కల్కా జీ సీటు విషయానికొస్తే ఇది ఢిల్లీలోని ఒక హై ప్రొఫైల్ సీటుగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆతిశీ, అల్కా లాంబా మధ్య పోటీ కారణంగా ఈ సీటుకు మరింత ప్రాధాన్యత వచ్చింది. బీజేపీ కూడా ఇక్కడి నుంచి ప్రముఖ నేత రమేష్ సింగ్ బిధురిని బరిలోకి దింపింది. బిధురి 2003, 2008, 2013లలో తుగ్లకాబాద్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. అల్కా లాంబా దాదాపు ఐదేళ్ల పాటు ఆప్లో ఉండి 2019లో కాంగ్రెస్లో చేరారు. కల్కాజీ నియోజకవర్గంలో మొత్తం 1,94,515 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,893 మంది పురుష ఓటర్లు, 87,617 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ట్రాన్స్జెండర్ ఓటర్లున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా(Atishi Marlena) ఆస్తుల విలువ రూ.76,93,347.98. గత ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని ఆతిశీ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమెకు ఎటువంటి స్థిరాస్తి లేదు. ఆభరణాల పేరుతో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. సొంత కారు లేదా మరే ఇతర వాహనం కూడా లేదు. కల్కాజీ అసెంబ్లీ స్థానం(Kalkaji Assembly Constituency) నుండి నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో, తనపై రెండు క్రిమినల్ పరువు నష్టం కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆమె తెలియజేశారు. తన దగ్గర 30 వేల రూపాయల నగదు ఉందని, తనకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.ఆతిశీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా(Alka Lamba) కూడా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో తెలియజేశారు. అల్కా లాంబా మొత్తం ఆస్తులు రూ.3.41 కోట్లు. అల్కా లాంబాకు రూ.61.12 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, ఆమెపై ఆధారపడిన వారిలో ఒకరికి రూ.14.36 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఆమె సంపద రూ.20.12 లక్షలు పెరిగింది. అల్కా లాంబా గురుగ్రామ్లో రూ.80 లక్షల విలువైన 500 చదరపు అడుగుల వాణిజ్య ఫ్లాట్ను, ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్-1లో రూ.2 కోట్ల విలువైన నివాస ఆస్తిని కలిగివున్నారు. అఫిడవిట్ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 8.28 లక్షలు కాగా, 2023-24లో రూ. 8.91 లక్షలు, 2022-23లో రూ. 5.35 లక్షలుగా ఉంది. అల్కాలాంబా తన దగ్గరున్న ఆభరణాల గురించి అఫిడవిట్లో ప్రస్తావించలేదు.ఇది కూడా చదవండి: కేజ్రీవాల్కు మరింత టెన్షన్.. ఈడీ విచారణకు కేంద్రం అనుమతి -
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్పై హైకోర్టు సీరియస్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్ సర్కార్పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్ నివేదికను స్పీకర్కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సర్కార్కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.ఈ నేపథ్యంలో కాగ్ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్ సర్కార్ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్ సర్కార్ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.Delhi High Court criticised the Delhi Government for its delay in addressing the CAG reports, stating, "The way you have dragged your feet raises doubts about your bona fides." The court further emphasized, "You should have promptly forwarded the reports to the Speaker and… pic.twitter.com/CSSALuCV0G— ANI (@ANI) January 13, 2025 కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం. -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
నాకు ఇల్లు లేకుండా చేశారు: సీఎం అతిషి
న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మండిపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం(జనవరి7) ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడుంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారని వివరించారు.తన కుటుంబ సభ్యులను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని అతిషి ఆరోపించారు.తాను సీఎంగా ఎన్నికైన తర్వాత మా వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదకి విసిరేశారని చెప్పారు. తమ ఇళ్లను బీజేపీ లాక్కోవచ్చేమో గాని ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్నారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూవాళ్ల కోసం పని చేస్తానన్నారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం(జనవరి 7) ప్రకటించింది. ఫిబ్రవరి 5వ పోలింగ్ జరగనుంది.అదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు జరగనున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్కు షాక్..‘ఆప్’కు అఖిలేష్ మద్దతు -
‘మొసలి కన్నీరు కార్చొద్దు అతిషి’
ఢిల్లీ : సీఎం అతిషి కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. ఆ వ్యాఖ్యలపై రమేష్ బిదూరి కౌంటర్ ఇచ్చారు. ‘మీడియా సమావేశంలో సీఎం డ్రామాకు తెరతీశారు. ఆమె మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఓడిపోతామని తెలిసే ఆమ్ ఆద్మీ ఇలాంటి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందని మండిపడ్డారు. 'ఆప్దా'ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. 2001 పార్లమెంటు దాడిలో మన సైనికులు మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిషి మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్ను సమర్పించారు. అఫ్జల్ గురుకు మద్దతుగా తండ్రి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్పై ఆమె మద్దతు ఇస్తుందో లేదో ముఖ్యమంత్రి చెప్పాలి.కాగా, 2013లో తీహార్ జైలులో ఉరిశిక్ష పడిన అప్జల్ గురు కోసం రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్పై అతిషి తల్లిదండ్రులు సంతకం చేశారని బీజేపీ వాదిస్తోంది. పార్లమెంట్ దాడిలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.ఆతిషీ కంటతడిఢిల్లీ ఆతిషీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు.చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్ బిదురి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని అతిషి స్పష్టం చేశారు. -
కన్నీరు పెట్టిన ఆతిశీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్ బిధూరి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని ఆతిశీ స్పష్టం చేశారు.#WATCH | Delhi: On BJP leader Ramesh Bidhuri's reported objectionable statement regarding her, Delhi CM Atishi says, " I want to tell Ramesh Bidhuri, my father was a teacher throughout his life, he has taught thousands of children coming from poor and lower-middle-class families,… pic.twitter.com/ojQr3w0gVW— ANI (@ANI) January 6, 2025 ఇదీ చదవండి: ఢిల్లీలో మేం సహకరించకుండా ఉండి ఉంటే..! -
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి నోటి దురుసు వ్యాఖ్యలు
ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి (Ramesh Bidhuri) మరోసారి నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అతిషి మర్లెనా సింగ్ తన తండ్రినే మార్చేసిందంటూ కొత్త వివాదానికి తెరతీశారు.త్వరలో ఢిల్లీ అసెంబ్లీ (delhi assembly elections) ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ (bjp) విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మోదీ ఇప్పటికే ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. పనిలో పనిగా ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదంతో ఢిల్లీ ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు.ఇక ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. 👉చదవండి : ‘శీష్మహల్’ కోసం పెట్టిన ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్మొన్నటికి మొన్న ఓటర్లు తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తానో ఉదహరిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రమేష్ బిదురితో పాటు బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో తాను ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదంటూ క్షమాపణలు చెప్పారు.అలా క్షమాపణలు చెప్పారో లేదో.. కొన్ని గంటల వ్యవధిలో సీఎం అతిషీపై నోరు పారేసుకున్నారు. ఆమె(అతిషి) ఇంటి పేరు మర్లేనా నుంచి సింగ్గా మారింది. తన తండ్రినే మార్చేసింది. అవినీతి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనని ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేశారు. అదే క్రేజీవాల్ ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నారు. ఈ ఇద్దరి తీరు ఆమ్ ఆద్మీ పార్టీ లక్షణాల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని ’ మండిపడ్డారు. అంతేకాదు, మన సైనికులు మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిషి మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్ను సమర్పించారు. అఫ్జల్ గురు మరణానికి క్షమాపణలు కోరిన వారికి మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? అని నేను ఢిల్లీ ప్రజలను ప్రశ్నించారు.ప్రస్తుతం అతిషిపై రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతుండగా..బీజేపీ నేతలు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.బీజేపీ నేతలు హద్దు మీరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని దుర్భాషలాడుతున్నారు. ఢిల్లీ ప్రజలు మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని సహించరు. ఢిల్లీ మహిళలందరూ దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు ’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
టఫ్ ఫైట్ తప్పదా?
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం(జనవరి4) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలకు గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్పై బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనున్నారు. పర్వేష్సింగ్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేత. వెస్ట్ ఢిల్లీ నుంచి 2014,2019లో రెండుసార్లు కమలం గుర్తుపై ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లోనైతే ప్రత్యర్థిపై ఏకంగా ఐదు లక్షల 78వేల పై చిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్సింగ్ వర్మ కుమారుడే పర్వేష్సింగ్ వర్మ. త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు పర్వేష్సింగ్ వర్మ గట్టిపోటీ ఇవ్వగలరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.సీఎం అతిషిపై పోటీచేయనున్న రమేష్ బిదూరి ఎవరు..ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతిషిపై పోటీ చేయనున్న రమేష్ బిదూరి బీజేపీ సీనియర్ నేత. న్యాయవాది కూడా అయిన బిదూరి రెండుసార్లు ఎంపీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత బిదూరి. 2019లో దక్షిణ ఢిల్లీ నుంచి ఆప్ నేత రాఘవ్ చద్దాను ఓడించి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన బిదూరి సీఎం అతిషికి సరైన ప్రత్యర్థని భావించి పోటీకి దించిందని తెలుస్తోంది. కాగా, అతిషిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేయనున్నారు. -
అతిశీపై అల్కా లాంబా పోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది. కేవలం ఒక్క అభ్యర్థి ఆల్కా లాంబా పేరుతో శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిశీపై కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆల్కా లాంబా పోటీ చేయబోతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆల్కా లాంబా 2015లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా నెగ్గడం గమనార్హం. -
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం.. అతిషి Vs ఎల్జీ సక్సేనా
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఢిల్లీ లెఫ్లినెంట్ గవర్నర్పై ముఖ్యమంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఆమెకు వ్యాఖ్యలపై రాజ్భవన్ వర్గాలు స్పందిస్తూ ఆప్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముఖ్యమంత్రి అతిషి తాజా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో మతపరమైన కట్టడాలను కూల్చివేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. సక్సేనా ఆదేశాల మేరకు ప్యానెల్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆదేశాలపై తమకు సమాచారం ఉందని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో అతిషి కామెంట్స్పై గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆప్ సర్కార్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో మతపరమైన స్థలాలను కూల్చివేసేందుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒకవేళ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడే శక్తులు ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీలో మరింత నిఘా పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.Delhi CM Atishi's big allegation against the L-G:- 'L-G orders the demolition of temples'- 'Mandirs and religious places targeted'- 'Hindu and Buddhist temples targeted'However, the Delhi L-G has dismissed all allegations of 'temple demolition' & accused Atishi of… pic.twitter.com/66WTV5Lpvj— TIMES NOW (@TimesNow) January 1, 2025 ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆప్ నేతలు ప్లాన్ చేస్తున్నాయి. ఇక, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన విజయంతో అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అటు, కాంగ్రెస్ కూడా ఢిల్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. -
అరెస్ట్ ఖాయమంటూ కేజ్రీవాల్ కామెంట్స్ .. ఢిల్లీ సీఎం అతిశీకి అధికారిక లేఖ
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తప్పక గెలవాల్సిన ఎన్నికల్లో ఫలితం తారు మారైతే మాజీ సీఎం కేజ్రీవాల్తో పాటు ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) భవితవ్యం కూడా గందరగోళంలో పడనుండగా.. తాజాగా, కేజ్రీవాల్ ( Arvind Kejriwal) చేసిన ఆరోపణలతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.సీఎం అతిశీ (Atishi Marlena) త్వరలోనే అరెస్ట్ కానున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని ఢిల్లీ రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) ఖండించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. గత బుధవారం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత సీఎం అతిశీలు సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఆ ట్వీట్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రం (బీజేపీ పెద్దలు) సమావేశమైంది. సమావేశంలో తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నింది. సీఎం అతిశీపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అతిశీ ఇవ్వాళో, రేపో అరెస్ట్ కావొచ్చనే’ సమాచారం మాకు అందింది అని అన్నారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు.महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया हैउसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ సీఎం అతిశీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఉచిత బస్సు సర్వీసు పథకంపై విచారణ చేపట్టాలని ‘ది గవర్న్మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (gnctd),విజిలెన్స్ విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. కాబట్టే కేజ్రీవాల్ పేర్కొన్న దావా పూర్తిగా తప్పుగా, తప్పుదారి పట్టించేది’అని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.కేజ్రీవాల్తో పాటు సీఎం అతిశీ మాట్లాడారు. నేను గట్టి నమ్మకంతో చెబుతున్నా. ఒక వేళ దర్యాప్తు సంస్థలు నాపై తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా చివరికి నిజమే గెలుస్తోంది. దేశ న్యాయ వ్యవస్థపై గట్టి నమ్మకం ఉంది. అరెస్టయినా బెయిల్పై బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
కేంద్ర దర్యాప్తు సంస్థలపై కేజ్రివాల్ సంచలన ఆరోపణలు
-
త్వరలో ఢిల్లీ సీఎం అరెస్టు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(DelhiElections) సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. క్రమంలోనే ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvindkejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిషి(Atishi)ని త్వరలోనే ఏదో తప్పుడు కేసులో అరెస్టు చేస్తారన్నారు. ఈ మేరకు బుధవారం(డిసెంబర్25) ఎక్స్(ట్విటర్)లో కేజ్రీవాల్ ఒక పోస్టు చేశారు.సీఎం అతిషి ఇటీవల ముఖ్యమంత్రి సంజీవని యోజన,మహిళా సమ్మాన్ యోజన పథకాలు ప్రకటించడంతో కొందరు వణుకుతున్నారని అందుకే ఆమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందే పలువురు ఆమ్ఆద్మీ పార్టీ కీలక నేతల ఇళ్లలో సోదాలు జరగవచ్చని కేజ్రీవాల్ తెలిపారు.కాగా, ఢిల్లీలో మహిళలకు నెల నెలా రూ.2100 నగదు ఇచ్చే మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ ఏదీ లేదని, స్కీమ్ పేరుతో ఎవరైనా ప్రజల సమాచారం సేకరించడం నేరమని ఢిల్లీ మహిళా,శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఓ వైపు ఆమ్ఆద్మీపార్టీ ఈ స్కీమ్ కింద అర్హుల వివరాలు సేకరిస్తున్న వేళ మహిళా,శిశు సంక్షేమ శాఖ చేసిన ప్రకటన రాజకీయ వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ మరో విధంగా స్పందించింది. కేజ్రీవాల్ అతిషి మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆప్ స్కీమ్పై ప్రభుత్వం చర్యలకు దిగిందని ఆరోపించింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ గెలిస్తే మహిళా సమ్మాన్యోజనతో పాటు సంజీవని స్కీమ్ అమలు చేస్తామని తదితర హామీలిచ్చింది. ఈ స్కీమ్లపై బీజేపీ,ఆప్ల మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి. -
‘నన్నెందుకు గుర్తించడం లేదు.. బాధగా ఉంది’.. స్పందించిన సీఎం
భారత చదరంగ క్రీడాకారిణి తానియా సచ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చెస్ ప్లేయర్గా తనకు సరైన గుర్తింపునివ్వడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఇతర రాష్ట్రాలు ఎంతో ముందున్నాయని.. కానీ ఢిల్లీలో మాత్రం దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితి లేదని వాపోయింది.స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూఈ మేరకు.. ‘‘2008 నుంచి దేశం తరఫున వివిధ చెస్ టోర్నీల్లో పాల్గొంటున్నాను. ఎన్నో విజయాలు సాధించాను. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. ఇతర రాష్ట్రాలు మాత్రం తమ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తిస్తూ.. వారి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాయి.కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. 2022 చెస్ ఒలింపియాడ్లో చారిత్రక విజయం సాధించి.. కాంస్యం గెలిచిన జట్టులో నేను సభ్యురాలిని. వ్యక్తిగత పతకం కూడా సాధించాను. రెండేళ్ల తర్వాత.. అంటే 2024 చెస్ ఒలింపియాడ్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూ నేను భాగమే.అయినప్పటికీ ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం నుంచి నాకెలాంటి గుర్తింపు లభించలేదు. ఢిల్లీ, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావించే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధగా ఉంది.ఇకనైనా విలువ ఇవ్వండిఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అతిశి మేడమ్, అరవింద్ కేజ్రీవాల్ సర్.. ఇకనైనా క్రీడలు, క్రీడాకారుల విలువను గుర్తించి చెస్ అథ్లెట్లకు అండగా ఉంటారని ఆశిస్తున్నా’’ అని తానియా సచ్దేవ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి మర్లెనాతో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను ట్యాగ్ చేస్తూ తన విజ్ఞప్తిని తెలియజేసింది.గుకేశ్కు భారీ నజరానాకాగా ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ విజేతగా నిలిచిన భారత జట్టులో తానియా సచ్దేవ్ కూడా ఉంది. గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్లతో కలిసి పసిడి పతకాన్ని అందుకుంది.ఇక ఇటీవల ప్రపంచ చెస్ చాంపియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్పై తమిళనాడు ప్రభుత్వం కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పద్దెమినిదేళ్ల కుర్రాడికి రూ. 5 కోట్ల భారీ నజరానా అందజేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల తానియా సచ్దేవ్ తాజా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పందించిన సీఎంతానియా సచ్దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిశి మర్లెనా స్పందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని.. ఏ విషయంలో ఆమెకు అసౌకర్యం కలిగిందో చెప్పాలన్నారు. చెస్ ప్లేయర్ల కోసం తాము ఇంకా ఏమేం చేయగలమో చెప్పాలని సూచించారు. తన కార్యాలయం త్వరలోనే తానియాను సంప్రదించి.. అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుందని అతిశి ఎక్స్ వేదికగా చెస్ ప్లేయర్కు హామీ ఇచ్చారు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
అలా అయితే మీ తరపున ప్రచారం చేస్తా: బీజేపీ ఎమ్మెల్యేకు సీఎం అతిషి ఆఫర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశా ల్లో భాగంగా శుక్రవారం ప్రతిపక్ష బీజేపీపై సీఎం అతిషి మార్లేనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ట్రాన్స్పోర్టు కొర్పొరేషన్ బస్సులో బస్ మార్షల్స్ను తిరిగి నియమించే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అతిషి కౌంటర్ ఇచ్చారు.అయితే ఆప్ ప్రతిపాదనపై రోహిణి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆప్పై విమర్శలు గుప్పించారు. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబితేనే బస్ మార్షల్స్ను తొలగించామని చెప్పారు. దీనిపై సీఎం అతిషి స్పందిస్తూ..‘ నేను ముఖ్యమంత్రినే.. బస్ మార్షల్స్ను తిరిగి నియమించాలని నేను కూడా లెఫ్ట్నెంట్ గవర్నర్కు పదేపదే చెబుతున్నాను. వీకే సక్సేనా కూడా ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట వింటుంటే.. మార్షల్స్ను తిరిగి నియమించగలరు’ అని కౌంటర్ ఇచ్చారు.బస్ మార్షల్పై "నవంబర్ 10న మేం మీటింగ్ పెట్టాం. నవంబర్ 13న లెఫ్టినెంట్ గవర్నర్కురిపోర్టు పంపాం. ఈరోజు నవంబర్ 29. ఇప్పుడు బస్ మార్షల్స్ను పునరుద్దరించే ప్రతిపాదన ఆయన వద్ద ఉంది. ఒకవేళ మీరు (విజేందర్ గుప్తా) బస్ మార్షల్స్ నియమాకానికి సంబంధించిన ఫైల్ను ఎల్ సంతకం చేయిస్తే.. మీపై ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టకుండా మా పార్టీని ఒప్పిస్తాను. అంతేగాక మీ తరపున నేను కూడా ప్రచారం చేస్తాను’ అని పేర్కొన్నారు. VIDEO | "You (BJP MLA Vijender Gupta) just get the file for the appointment of bus marshals signed by the LG, I will convince my party not to field any candidate against you in Rohini, I will also campaign for you," said Delhi CM Atishi (@AtishiAAP) speaking in the Assembly,… pic.twitter.com/XxVHRuDwlO— Press Trust of India (@PTI_News) November 29, 2024 కాగా ఢిల్లీ ట్రాన్స్పోర్టు బస్సులో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం బస్ మార్షల్స్ను తక్షణమే పునరుద్ధరించాలని ఆప్ సర్కార్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బస్ మార్షలల్స్ను తిరిగి నియమించాలని కోరూతూ ఢిల్లీ ప్రభుత్వం తీర్మానించి సిఫార్సు చేసిన ఫైల్ ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా వద్ద పెండింగ్లో ఉంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులపై మార్షల్స్పై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే మధ్య వాగ్వాదం గత ఏడాది అక్టోబర్ నుంచి సాగుతోంది. -
కేజ్రివాల్ కంటే ఆతిశి నయం
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన ఆతిశితో కలిసి పాల్గొన్నారు. వేదికపై నున్న ఆతిశిని ఉద్దేశిస్తూ.. ‘ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. పూర్వ సీఎం కంటే ఆమె వెయ్యిరెట్లు నయమని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను’ అని సక్సేనా వ్యాఖ్యానించారు. సాధారణంగా ఢిల్లీ ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి పొసగదు. ఎప్పుడూ ఉప్పునిప్పుగా ఉండే సక్సేనా.. ఆతిశిపై ప్రశంసలు కురిపించడం విశేషం. జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చాక అరవింద్ కేజ్రివాల్ ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిజాయితీకి ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చాకే (ఎన్నికల్లో నెగ్గి) మళ్లీ సీఎం పదవిని చేపడతానని కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్ బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆతిశి జెండా ఎగురవేస్తారని ఆప్ సర్కారు ప్రతిపాదించగా.. సక్సేనా నిరాకరించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో హీట్ పాలిటిక్స్.. సీఎం ఇంటి వద్ద ఆప్ ఎంపీ వినూత్న నిరసన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నివాసం వద్ద ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోసి ఆప్ సర్కార్పై మండిపడ్డారు. దీంతో, ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తాజాగా సీఎం అతిషి నివాసం వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోశారు. అనంతరం స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాగర్పూర్, ద్వారక ప్రజలు నాకు ఫోన్ చేసారు. దీంతో, నేను అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్లి అక్కడ నల్లానీరు సరఫరాను గమనించాను. ఆ నల్లా నీటిని బాటిల్లో నింపాను.నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉంది. అదే నీటిని ఇప్పుడు నేను సీఎం అతిషి ఇంటి వద్దకు తెచ్చాను. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్లో నింపి సీఎం నివాసం వద్ద పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX— ANI (@ANI) November 2, 2024ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా? తాగితే వారు ప్రాణాలతో ఉంటారా?. ఢిల్లీలో ఛత్ పూజ వస్తోంది. ఈరోజు గోవర్ధన్ పూజ జరిగింది. నిన్న దీపావళి. పండుగ వేళ ఇలాంటి నీటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి అతిషి వద్దే నీటి పారుదల శాఖ కూడా ఉంది. నీటి సమస్యపై ఆమె ప్రతీరోజు మీటింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ నిరసన రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad... I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8— ANI (@ANI) November 2, 2024 -
ఢిల్లీలో 'ముంబై అండర్వరల్డ్' పరిస్థితి: సీఎం అతిషి
ఢిల్లీ: ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అతిషి కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి.. అండర్వరల్డ్ కాలంతో ముంబైలా మారిపోయిందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.‘ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కానీ బీజేపీ శాంతిభద్రతలను పట్టించుకోదు. ఢిల్లీ ప్రభుత్వాలు చేస్తే.. పనికి అంతరాయం కలిగించడానికి మాత్రం తన పూర్తి సమయాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి.. అండర్ వరల్డ్ కాలంలో ముంబైలా తయారైంది. బహిరంగంగా బుల్లెట్లు పేల్చుతున్నారు. గ్యాంగ్స్టర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశం లేదా అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం బీజేపీకి లేదు’ అని అన్నారు.रोहिणी स्थित एक स्कूल के बाहर Bomb Blast की घटना दिल्ली की चरमराती सुरक्षा व्यवस्था की पोल खोल रही है। दिल्ली में लॉ एंड ऑर्डर की जिम्मेदारी भाजपा की केंद्र सरकार के पास है। लेकिन भाजपा अपना ये काम छोड़कर सारा समय दिल्ली की चुनी हुई सरकार के कामों को रोकने में लगाती है। यही…— Atishi (@AtishiAAP) October 20, 2024ఇక.. పొరపాటున ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా పరిస్థితి ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మాదిరిగానే దారుణంగా మారుతుందని సీఎం అతిషి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రాంతం ఓ పాఠశాల గోడపై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు ధాటికి పాఠశాల గోడను ద్వంసమై.. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయి.చదవండి: ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్కు లేఖ -
బీజేపీ డర్టీ పాలిటిక్స్ వల్లే కాలుష్యం: ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్స్ కారణమని ఢిల్లీ సీఎం అతిషి అ న్నారు. నగరంలో గాలి కాలుష్యం పెరగడం,యమునా నది నీటిపై రసాయనాల నురగ కనబడటంపై ఆమె ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి బీజేపీ పాలిత హర్యానా,ఉత్తరప్రదేశ్లే కారణమని ఆరోపించారు.హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడం,ఇటుక బట్టీలు,యూపీ నుంచి వేల సంఖ్యలో డీజిల్ బస్సులు రావడం,నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని(ఎన్సీఆర్) థర్మల్ పవర్ ప్లాంట్లు కాలుష్యానికి కారణాలని అతిషి చెప్పారు.యమునా నదిలోకి వదిలే పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకపోవడం వల్లే నదిపై నురగ ఏర్పడుతోందన్నారు. యమునా నది ఉపరితలంపై ఏర్పడిన నురగను ఆదివారం రాత్రి నుంచి తొలగిస్తామని తెలిపారు.అయితే ఢిల్లీ పొరుగున ఉన్న ఆప్ పార్టీ పాలిత పంజాబ్ మాత్రం ఢిల్లీ కాలుష్యానికి ఏ మాత్రం కారణమవడం లేదని అతిషి చెప్పడం విశేషం.ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్ -
ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అతిశి భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి సోమవారం భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్రమోదీ గారిని కలిశాను. మన రాజధాని సంక్షేమం, అభివృద్ధి గురించి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ఆమె ఎక్స్లో పోస్టు చేశారు. గత నెలలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె మొదటిసారి ప్రధానిని కలిశారు. ఈ సమావేశం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్లో పోస్ట్ చేసింది. -
మేం ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాం: ఢిల్లీ సీఎం
ఢిల్లీ: తమ పార్టీని గెలిపించుకొని సీఎం పదవిని పొందే సత్తాలేక బీజేపీ ఢిల్లీ సీఎం నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అతిషి మండిపడ్డారు. ఆప్ నేతలు ప్రజల హృదయాల్లో నివసిస్తారని, బీజేపీ కోరుకుంటే ఆ బంగ్లాను వారే ఉంచుకోవచ్చని అన్నారు. సీఎం నివాసం విషయంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోందని మండిపడ్డారు. ఓడిపోయిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని అన్నారు.‘‘ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేమని బీజేపీ ఆందోళన చెందుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనప్పుడు.. బీజేపీ ‘ఆపరేషన్ కమలం'ను ఆశ్రయిస్తుంది. పార్టీ చేరని నేతలను జైల్లో పెడతారు. సొంతంగా ముఖ్యమంత్రిని గెలిపించుకోలేక ఇప్పుడు సీఎం నివాసాన్ని సీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విలాసవంతమైన కార్లు, బంగ్లాలలో నివసించేందుకు మేం రాజకీయాల్లోకి రాలేదు. అవసరమైతే వీధుల్లోంచి పాలన చేస్తాం. బీజేపీ వాళ్లు బంగ్లాలో ఆనందించవచ్చు. మేము ప్రజల హృదయాలలో జీవిస్తున్నాం’’ అని అన్నారామె.ఇక.. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకురాలు అతిషికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడంపై వివాదం నెలికొంది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిషి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిషికి సంబంధించిన సామగ్రిని బయట పడేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.చదవండి: సీఎం అతిషి సామాన్లు పడేశారు.. లెఫ్ట్నెంట్ గవర్నర్పై ఆప్ ఆరోపణలు -
సీఎం సామాన్లనే బయటపడేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం వేదికగా ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి అధికార ఆధిపత్యపోరు కనిపించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకు రాలు అతిశికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిశి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిశికి సంబంధించిన సామగ్రిని బయట పడేశా రని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. ‘‘ సీఎం అతిశికి అధికారిక బంగ్లాను కేటాయించలేదు. అందుకే ఇ న్నాళ్లూ సీఎంగా ఉన్నపుడు వినియోగించి, కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకే అతిశి మారారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ఆ బంగ్లాను బీజేపీ అగ్రనేతకు కేటాయించాలని కుట్ర పన్నింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను అడ్డుపెట్టుకుని అతిశికి చెందిన సామగ్రిని బయట పడేశారు. అంతకుముందు అదే బంగ్లాలోని క్యాంప్ ఆఫీస్లో అతిశి ఒక సమావేశం కూనిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ ఇలా చవకబారు బంగ్లా రాజకీయాలు చేస్తోంది’’ అని సంజయ్ వివరించారు.బంగ్లాకు సీలు వేయాల్సిందే: బీజేపీవివాదంపై బీజేపీ దీటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో విపక్షనేత, బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘‘ గత ఏడాది కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి అతిశి చేరినప్పుడే కేబినెట్ మంత్రి హోదాలో ఆమెకు మథుర రోడ్డులోని ఏబీ–17 బంగ్లాను ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) గతంలోనే కేటాయించింది. ఆ బంగ్లా ఉండగా ఈ బంగ్లాతో సీఎంకు పనేంటి?. కేజ్రీవాల్ వెళ్లిపోయినా సీఎం బంగ్లా తాళాలు పీడబ్ల్యూడీకి అప్పజెప్పలేదు. ఇప్పుడు అతిశి అక్రమంగా ప్రవేశించిన ఈ బంగ్లాకు సీలు వేయాల్సిందే’’ అని గుప్తా డిమాండ్చేశారు.అక్రమంగా తరలించారు: సీఎం కార్యాలయం‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాలను శిరసావహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. అతిశి వస్తువులను బయట పడేయించారు. బీజేపీ బడా నేతకు ఈ బంగ్లాను కేటాయించాలను ఎల్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని అందుకోలేని బీజేపీ ఇప్పుడు సీఎం బంగ్లాను ఆక్రమించాలని చూస్తోంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.అది అధికారిక బంగ్లా కాదు: ఎల్జీ వర్గాలుసీఎంఓ ప్రకటన తర్వాత ఎల్జీ కార్యాలయం వర్గాలు స్పందించాయి. ‘‘ సీఎం హోదాలో అతిశికి ఆ బంగ్లాను కేటాయించలేదు. అనుమతి లేకుండా అతిశి ఆమె సామగ్రిని బంగ్లాలోకి తరలించారు. తర్వాత ఆమెనే వాటిని బయటకు తరలించారు. ప్రస్తుతా నికి ఆ బంగ్లా పీడబ్ల్యూడీ అధీనంలోనే ఉంటుంది. గతంలో సమకూర్చిన వస్తువులను సరిచూసు కున్నాకే కేటాయిస్తారు’’ అని ఎల్జీ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీ సీఎం అడ్డగింత.. ఆప్ ఆగ్రహం
ఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం సింగు సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంపై ఆప్ వర్గాలు భగ్గుమన్నాయి. ‘‘ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు’’ అని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.#WATCH | Delhi CM Atishi reached Bawana police station to meet activist Sonam WangchukShe says, "People of Ladakh want statehood. Sonam Wangchuk and the people of Ladakh, who were going to visit Bapu's Samadhi, were arrested. They did not let me meet Sonam Wangchuk. This is the… pic.twitter.com/j5rmK3KCBa— ANI (@ANI) October 1, 2024 సోనమ్ వాంగ్చుక్ లడఖ్ నుంచి దాదాపు 120 మంది మద్దతుదారులతో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు.. సోనమ్ వాంగత్చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం అర్థరాత్రి సింగు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగు సరిహద్దుల్లో సెక్షన్ 163 విధించినట్లు ప్రకటించారు. నెల క్రితం లేహ్ నుంచి ప్రారంభమైన ‘‘ ఢిల్లీ చలో పాదయాత్ర’’కు వాంగ్చుక్ నాయకత్వం వహిస్తున్నారు.ఇక.. ఇప్పటికే సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవటాన్ని లోక్సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను నిర్భందించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.చదవండి: గుడి, మసీదు, దర్గా.. రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు -
పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్కు ఊరట
న్యూఢిల్లీ: క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీలో ఓటర్ల జాబితా నుంచి పలువురు పేర్లను తొలిగించారంటూ ఆరోపిస్తూ దిగువ కోర్టులో దాఖలైన క్రిమినల్ పరువునుష్టం కేసు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.కాగా ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేజ్రీవాల్, అతిషి, ఆప్ నేతలు సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్లపై పరువునష్టం కేసు దాఖలైంది.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్, అతిషి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు.దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదుదారు, బీజేపీ నేత రాజీవ్ బబ్బర్కు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అరవింద్ కేజ్రీవాల్, అతిషిపై దిగువ కోర్టులో విచారణపై స్టే ఇచ్చింది. -
నాదీ భరతుడి వ్యథే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.ఈ కుర్చీ కేజ్రీవాల్దిరామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు. సీఎం పదవికే అవమానంకేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. -
రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం అతిషి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పటికీ కేజ్రీవాల్దేనని అన్నారు. ఈ సందర్బంగా సీఎంగా కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీని పక్కనపెట్టి మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.ఢిల్లీ సీఎంగా అతిషి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు నాకు కూడా అంతే బాధగా ఉంది. ఎంతో కఠిన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నాను. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై చెప్పులు పెట్టుకుని పాలన కొనసాగించాడో.. అదే విధంగా, రాబోయే నాలుగు నెలల పాటు నేను ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. అరవింద్ కేజ్రీవాల్పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైల్లో ఉంచారు. ఢిల్లీ ప్రజలకు ఆయన నిజాయితీపై నమ్మకం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్కే చెందుతుంది. ప్రజలు మళ్లీ ఆయనను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు’ అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్ట్ కారణంగా కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం, సుప్రీంకోర్టు తీర్పుతో కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంగా మంత్రి అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. నేడు బాధ్యతలు స్వీకరించారు. #WATCH | Delhi CM Atishi says, "I have taken charge as the Delhi Chief Minister. Today my pain is the same as that was of Bharat when Lord Ram went to exile for 14 years and Bharat had to take charge. Like Bharat kept the sandals of Lord Ram for 14 years and assumed charge,… https://t.co/VZvbwQY0hX pic.twitter.com/ZpNrFEOcaV— ANI (@ANI) September 23, 2024ఇది కూడా చదవండి: కశ్మీర్లో ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్తో పొత్తుపై ఒమర్ -
సాక్షి కార్టూన్ 23-09-2024
-
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశి... మరో ఐదుగురు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం పీఠంపై మహిళా శక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా ముఖ్యమంత్రులు సుచేతా కృపలానీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. నందిని శతపథి దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు. శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత శశికళ కకోద్కర్ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. అన్వర తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు. వి.ఎన్.జానకి రామచంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు. జె.జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మాయావతి బహుజన సమాజ్ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. రాజీందర్ కౌర్ భట్టాల్ పంజాబ్కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్ కౌర్ భట్టాల్ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు. రబ్రీ దేవి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి. సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమా భారతి రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్బ్రాండ్ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వసుంధర రాజే గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆనందిబెన్ పటేల్ గుజరాత్కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. మహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియామూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత. -
అతిశి అనే నేను..! ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
-
సీఎం అతిషీతో పాటు ప్రమాణం.. ఐదుగురు మంత్రుల వివరాలివే..
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆమె చేత ప్రమాణం చేయించారు. కాగా ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన అతిపిన్క వియస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.అతిషీ పాటు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతిశీ తల్లిదండ్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.మంత్రుల వివరాలుగోపాల్ రాయ్..ఆయన ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ హయాంలో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి సాధారణ పరిపాలన శాఖను నిర్వర్తించారు. ఆలాగే ఆప్ ఢిల్లీ రాష్ట్ర విభాగానికి కన్వీనర్గా కూడా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలోని బాబాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కైలాష్ గహ్లోత్.. 2015లో నజఫ్గఢ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు తొలిసారి ఎన్నికలయ్యారు. కేజ్రీవాల్ పదవీకాలంలో పరిపాలనా సంస్కరణలు, రవాణా, రెవెన్యూ, చట్టం, న్యాయం, శాసనసభ వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.సౌరభ్ భరద్వాజ్.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటక-కళా సంస్కృతి భాషలు, పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇమ్రాన్ హుస్సేన్.. ఢిల్లీ క్యాబినెట్లో ఆహార, పౌర సరఫరాలు, ఎన్నికల మంత్రిగా పనిచేస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో బల్లిమారన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు.ముకేశ్ అహ్లావత్.. ఢిల్లీలోని సుల్తాన్పూర్ మజ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ముకేశ్ మంత్రివర్గంలో చేరారు. కాగా గత ఏప్రిల్లో ఆనంద్ కుమార్ ఆప్కు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సుల్తాన్పూర్ మజ్రా నుంచి 2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్లావత్.. 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి శనివారం(సెప్టెంబర్21) సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్నివాస్లో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు అతిషి ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. అతిషితో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్రాయ్,ముకేష్ అహ్లావత్,ఇమ్రాన్హుస్సేన్ తదితరులు మంత్రులుగా భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిషి ఢిల్లీకి మూడో మహిళా సీఎం కావడం విశేషం. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషి సీఎంగా పదవి చేపట్టారు. మళ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. అప్పటిదాకా అతిషి నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం కొనసాగనుంది. #WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9— ANI (@ANI) September 21, 2024 -
కేజ్రీవాల్ పాలనపై విమర్శలు.. అతిషికి అభినందనలు
ఢిల్లీ: ఆప్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూనే.. ఢిల్లీకి కొత్త సీఎంగా ఎంపికైన ఆప్ నాయకురాలు అతిషికి ప్రతిపక్ష బీజేపీ నేత హర్ష్ మల్హోత్రా అభినందనలు తెలిపారు. దశాబ్ద కాలం పాటు అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీని వేధించిన పలు కీలక సమస్యలకు పరిష్కరం చూపించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న అవినీతిని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.‘‘గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజలకు అందని అభివృద్ధి, సౌకర్యాలు కనీసం మీ(అతిషి) నాయకత్వంలోనైనా అందేలా చూడాలి. జాతీయ రాజధాని అంతటా అపరిశుభ్రమైన మురుగు, విస్తృతమైన నీటి ఎద్దడి, నిరంతర సమస్యలు ఉన్నాయి.ఈ సమస్యల ముఖ్యమంత్రిగా పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.ఇదిలాఉండగా.. అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడే ప్రయత్నాలకు అతిషి కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని ఇటీవల ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను హర్ష్ మల్హొత్రా ప్రస్తావిస్తూ.. అలాంటి వారికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై అతిషి , కేజ్రీవాల్ ఆలోచించాలన్నారు.మరోవైపు.. అతిషి ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు అతిషి ఇవాళ (శనివారం) ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా అతిషితో సహా ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అతిశి నియామకం సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అతిషి సీఎం నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేసింది. ఇక.. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.President Murmu officially appoints Atishi as Delhi CM; accepts Kejriwal's resignationRead @ANI Story | https://t.co/R278OnyQt6#DroupadiMurmu #Atishi #ArvindKejriwal pic.twitter.com/RwgGCmrHXn— ANI Digital (@ani_digital) September 20, 2024ఇటీవల ఢిల్లీ సీఎంగా రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఆయన రాజీమానా చేసి.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకురాలు అతిషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముందు ఆమెను శాసనసభా పక్షనేత ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకార తేదీని ప్రతిపాదిస్తూ.. లెఫ్టినెంట్ గరర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు లేఖ అందజేశారు. ఇక.. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కానున్నారు. ఆమె ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు. చదవండి: ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా.. -
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి మర్లెనా ఇష్టపడే రెసిపీ ఇదే..!
మన దేశ రాజధానిని చారిత్రాత్మక ప్రాధాన్యత తోపాటు విభిన్న సంస్కృతుల కలబోతగా పేర్కొనవచ్చు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అనంతరం కొత్త సీఎంగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కాగా మూడో మహిళ సీఎంగా నిలవడం విశేషం. పంజాబీ కుటుంబానికి చెందిన మన కొత్త సీఎం ఇష్టంగానే తినే వంటకం గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మన దేశ రాజధాని ఆహ్లాదపరిచే వివిధ వంటకాల సమ్మేళనాలకు ప్రతీకగా ఉంటుంది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు విభిన్న సంస్కృతుల రుచులు ఇక్కడ కనిపిస్తాయి. అలాంటి ఢిల్లీకి సీఎం కానున్న అతిషి ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తాం అనే వాగ్దానంతో ప్రజల్లోకి బలంగా వచ్చిన నాయకురాలు. అయితే ఆమె ఒక ఇన్స్టాగ్రాం వీడియోలో తనకు ఇష్టమనే రెసీపీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తనకు 'రాజ్మా చావలె' అంటే మహాఇష్టమని చెప్పారు. పంజాబీ వంటకమైన ఈ మసాల రెసిపీ సంపూర్ణంగా తిన్న ఫీల్ని అందిస్తుంది. దీన్ని వండటం చాల సులభం. అప్పటికప్పుడూ ఇంట్లో ఉండే మసాలా దినుసులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉత్తర భారత వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు. మరింత రుచికరంగా ఉండాలంటే.. ఈ రాజ్మా కర్రీలో చివరగా కాస్త క్రీమ్ లేదా వెన్నని జోడిస్తే ఆ రుచే వేరేలెవెల్ అని అన్నారు. అయితే ఆమె తాను స్వయంగా వండటంలో ఇబ్బంది లేదు గానీ తానే ఆ కూర తినాలంటే మాత్రం కష్టమే అంటూ చమత్కరించారు.(చదవండి: కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!) -
21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా మంత్రి అతిషి ప్రమాణస్వీకారం 21న ఉండే అవకాశాలున్నాయి. ప్రమాణస్వీకార తేదీని అతిషి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు అందజేసిన లేఖలో తెలపలేదు. అయితే ఎల్జీ మాత్రం 21న అతిషి ప్రమాణస్వీకారాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారమందించారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు అతిషి అందించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపించారు. ఈ సందర్భంగా అతిషి ప్రమాణస్వీకారం 21న ఎల్జీ ప్రతిపాదించారు. అయితే అతిషి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా కేబినెట్ మంత్రులు ఎవరైనా ఆమెతో ప్రమాణస్వీకారం చేస్తారా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.కాగా, అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖలో ఎల్జీకి కాకుండా రాష్ట్రపతిని ఉద్దేశించి ఒకే ఒక వ్యాఖ్యంలో రాశారు. లేఖ అందించడానికి మాత్రం కేజ్రీవాల్ స్వయంగా ఎల్జీ వద్దకు వెళ్లి అందిచడం గమనార్హం. ఇదీ చదవండి.. ‘అతిషి డమ్మీ సీఎంగా ఉంటారు’ -
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా..
ఢిల్లీ ఆప్ సర్కార్లో కీలక మంత్రులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే డజనుకుపైగా మంత్రిత్వ శాఖలను ఒంటిచేత్తో నడిపి సమర్థవంతమైన నాయకురాలిగా నిరూపించుకున్న అతిశికి సరైన మన్నన దక్కింది. మధ్యప్రదేశ్లోని కుగ్రామంలో ఏడు సంవత్సరాలపాటు ఉండి అక్కడి రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై పాఠాలు బోధించిన అతిశి తర్వాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సోషలిస్ట్ విప్లవయోధులు మార్క్స్, లెనిన్ పేర్లను కలిపి అతిశి తల్లిదండ్రులు ఆమెకు ‘మార్లెనా’ పేరును జోడించారు. అయితే రాజకీయరంగ ప్రవేశానికి ముందే 2018లో మార్లెనా పదాన్ని తన పేరు నుంచి అతిశి తొలగించుకున్నారు. రాజకీయ నామధేయం పోయినా ఈమెకు రాజకీయాలు బాగా అబ్బడం విశేషం. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల కోసం పాటుపడి మంచి పేరు తెచ్చుకున్నారు. పలు శాఖలను నిర్వర్తించిన పాలనా అనుభవం సీఎంగా ఆమెకు అక్కరకు రానుంది.రాజకీయ ప్రవేశం2013లో ఆప్ పార్టీలో చేరారు. 2013లో ఆప్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. పట్టణ, మధ్యతరగతి వర్గాల్లో ఆప్ ఇమేజ్ పెరిగేలా ముసాయిదా కమిటీకి అతిశి కీలక సూచనలు ఇచ్చినట్లు చెబుతారు. 2015లో మధ్యప్రదేశ్లోని ఖంద్వా జిల్లాలో జల సత్యాగ్రహం దీక్ష చేపట్టి పార్టీలో ముఖ్యురాలిగా మారారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు మనీశ్ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా సేవలందించారు. 2019లో ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి లోక్సభకు పోటీచేశారు. అయితే అక్కడి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2020లో ఢిల్లీలోని కాల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. పలుశాఖలకు మంత్రిగా: మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత 2023 ఫిబ్రవరిలో విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎక్సయిజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కావడంతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అన్నీ తానై ఆర్థికశాఖసహా 14 మంత్రిత్వ శాఖల బాధ్యతలు తన భుజస్కంధాలపై మోశారు. 2024లో ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అతిశి ఒకప్పుడు రిషివ్యాలీ టీచర్ కురబలకోట(అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్లో అతిశి గతంలో టీచర్గా పనిచేశారు. 2003 జూలై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్గా చేశారు. 6, 7 తరగతులకు ఇంగ్లీషు టీచర్గా పనిచేశారు. తమ పూర్వ టీచర్ ఢిల్లీ సీఎం కానుండటంతో రిషివ్యాలీ స్కూ ల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రిషివ్యాలీ స్కూల్ను స్థాపించారు. – సాక్షి, నేషనల్డెస్క్జననం: 1981 జూన్ 8తల్లిదండ్రులు: విజయ్ సింగ్, త్రిప్తా వాహీ(వీళ్లిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు)భర్త: ప్రవీణ్ సింగ్ (పరిశోధకుడు, విద్యావేత్త)విద్యార్హతలు: ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్లో చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి టాపర్గా నిలిచారు. చెవెనింగ్ స్కాలర్షిప్ సాయంతో ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2005లో రోడ్స్ స్కాలర్షిప్తో ‘ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ చేశారు. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషీ మర్లీనా నియామకంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అతిషీ ‘డమ్మీ సీఎం’ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నాల్ని గుర్తు చేశారు. అప్జల్ గురు అమాయకుడని రాష్ట్రపతికి రాసిన లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యక్తుల నుంచి ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలంటూ ఎక్స్లో పేర్కొన్నారుदिल्ली के लिए आज बहुत दुखद दिन है। आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला को बनाया जा रहा है जिनके परिवार ने आतंकवादी अफ़ज़ल गुरु को फांसी से बचाने की लंबी लड़ाई लड़ी। उनके माता पिता ने आतंकी अफ़ज़ल गुरु को बचाने के लिए माननीय राष्ट्रपति को दया याचिकाऐं लिखी।उनके हिसाब से… pic.twitter.com/SbllONqVP0— Swati Maliwal (@SwatiJaiHind) September 17, 2024 అయితే స్వాతి మాలీవాల్ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతి మాలీవాల్ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దిలీప్ పాండే మాట్లాడుతూ.. తమ పార్టీ పార్లమెంట్కు పంపినప్పటికీ .. ఆమె బీజేపీ స్క్రిప్ట్ను చదువుతున్నారని అన్నారు.‘ఆప్ నుంచి మాలీవాల్ రాజ్యసభ టికెట్ తీసుకున్నా, బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారు. అందుకే ఆప్ రాజ్యసభ పదవికి రాజీనామా చేసి.. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పదవి చేపట్టాలని సూచించారు. ఢిల్లీ సీఎంగా అతిషీ మర్లీనాఅతిషి మర్లీనా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి పేరును ప్రతిపాదించారు. దీంతో ఆమె ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టానున్నారు. -
నా గురువు కేజ్రీవాల్కు ధన్యవాదాలు: అతిషి
ఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు. కొత్త సీఎంగా ఎన్నికైన తర్వాత అతిషి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్, నాకు గురు సమానులు అరవింద్ కేజ్రీవాల్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాపై విశ్వాసం ఉంచి.. కేజ్రీవాల్ నాకు చాలా పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఇలా చేయటం కేవలం ఆప్లో మాత్రమే సాధ్యం అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో నేను ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చా. మరే ఇతర పార్టీలో ఉన్నా బహుశా నాకు ఎన్నికల టిక్కెట్టు కూడా ఇచ్చేవారు కాదు. కానీ, కేజ్రీవాల్ నన్ను నమ్మి ఎమ్మెల్యేని, మంత్రిని చేశారు. ఈరోజు నాకు సీఎం బాధ్యతలు అప్పగించారు...కేజ్రీవాల్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం.కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్పై తప్పుడు కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడంతో అది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. అరవింద్ కేజ్రీవాల్ను తిరిగి సీఎంగా ప్రజలు ఎన్నుకుంటారు. ఆయన ఎంత నిజాయితీపరుడో ప్రజలకు తెలుసు. ఢిల్లీ ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్ను సీఎం చేస్తారు.అప్పటివరకు ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు నిర్వహిస్తాను. నాకు శుభాకాంక్షలు పూలదండలు వద్దు. వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపు తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాను. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్, ఉచిత వైద్యం ఉండవు’’ అని అన్నారు.#WATCH | Delhi: Atishi addresses the media for the first time after being elected as the leader of Delhi AAP legislative party and the new CM.She says, "First of all, I would like to thank the popular CM of Delhi, AAP national convener and my guru - Arvind Kejriwal. He gave me… pic.twitter.com/kn9fVRILnx— ANI (@ANI) September 17, 2024చదవండి: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
అతిషి మర్లెనా సింగ్: ఢిల్లీ సీఎం పీఠం ఎక్కబోతున్న ఈమె ఎవరు?
గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. దిల్లీ తదుపరి సీఎం పేరును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కేజ్రీవాల్ నివాసంలో మంగళవారం జరిగిన ఆప్ శాసనసభ సమావేశంలో మంత్రి అతిషి పేరును ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఆమె పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారు. ప్రస్తుత సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేటి సాయంత్రం లెఫ్ట్నెంగ్ గవర్నర్ సక్సేనాతో భేటీ కానున్నారు. ఆయన్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఆ తర్వాత అతిషి . సీఎంగా బాధ్యతలను చేపట్టనున్నారు.ఎవరీ అతిషిఢిల్లీ లిక్కర్ పాలసీలో మాజీ డిప్యూటీసెం మనీష్ సిసోడియా జైలుకెళ్లినప్పటి నుంచి అతిషి మర్లెనా సింగ్ పేరు బాగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఆమె ఢిల్లీలోని కల్కాజీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పీడబ్ల్యూడీ, సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అతిషి మర్లెనా సింగ్ 8 జూన్ 1981న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి ప్రొఫెసర్లు ఆమె తల్లిదండ్రులు కార్ల్ మార్స్క్, లెనిన్ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి అతిషీ పేరులో ‘మార్లీనా’ అని చేర్చారు. 2018 ఎన్నికల ముందు నుంచి ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు. తన ఉన్నత పాఠశాల విద్యను న్యూ ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్ (పూసా రోడ్)లో పూర్తి చేసింది. ఆమె 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. 2003లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అక్కడ ఆమె చెవెనింగ్ స్కాలర్షిప్న్ను కూడా పొందారు.రాజకీయ ఎంట్రీ..2013 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. పార్టీ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2015లో,ఆమె మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన నిరసనలు, న్యాయ పోరాటం సమయంలో ఆప్ నేత, కార్యకర్త అలోక్ అగర్వాల్కు మద్దతునిచ్చారు.2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తూర్పు ఢిల్లీకి లోక్సభ ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఆ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ నంచి బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్పై అతిషి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 4.77 లక్షల ఓట్ల తేడాతో గౌతమ్ గంభీర్పై ఓడిపోయి మూడో స్థానంలో నిలిచారు.2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..ఆ తర్వాత 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషికి ఆప్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆమె 11,422 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్పై విజయం సాధించారు. 2020 ఎన్నికల తర్వాత ఆమె గోవా ఆప్ యూనిట్కు ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు.కేబినెట్ మంత్రిగా పదోన్నతి..2015 నుంచి 2018 ఏప్రిల్ 17 వరకు ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారురాలిగా పనిచేశారు. ఉప ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత సౌరభ్ భరద్వాజ్తోపాటు ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చేరారు. అనే పోర్టుఫోలియోల భారం ఆమె మీదే పడింది. దాదాపు 14 శాఖలకు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను అతిషి చూసుకుంటున్నారు. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్ షిప్ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుందిఢిల్లీ ప్రభుత్వంలో ఆమె పాత్ర..ఢిల్లీలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకు రావడంలో అతిషి కీలక పాత్ర పోషించారు. నగరంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేసిన ఘనత ఆమెది. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్ షిప్ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుంది.అతిషీనే ఎందుకు?మద్యం కుంభకోణంలో ఆప్ కీలక నేతలందరూ జైలుకు వెళ్లారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అటు సౌరభ్ భరద్వాజ్తో కలిసి ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ తనదైన పాత్ర పోషించారు. ఆప్ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను తన భూజాలపై వేసుకున్నారు. తన వాగ్ధాటితో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో ఆమె ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. కీలక అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని నడపనున్నారు. -
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు.ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేడు అపాయింట్మెంట్ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎల్జీతో భేటీ కానున్నారు. గవర్నర్ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. అయితే ఎల్జీ ఎంతవేగంగా కేజ్రీవాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే.. అతిషి సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేదానిపై స్పష్టత వస్తుంది.ఇక.. ఆప్ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అతిషి మర్లెనకు అవకాశం దక్కింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా అతిషీనే చూసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె విద్యాశాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ విజయం సాధించిన తర్వాతే సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ప్రజలు తమ తీర్పును ప్రకటించే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని స్పష్టం చేశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి: రాజీనామా వ్యూహమిదే! -
ఢిల్లీ పంద్రాగస్టు పంచాయతీ.. జెండా ఎగరేసేది ఆయనే
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్ మంత్రి కైలాశ్ గహ్లోత్ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్కు లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్ ఆప్గా మారింది. తాజాగా రాజ్భవన్ విడుదల చేసిన ప్రకటనపై మంత్రి అతిశీ స్పందించలేదు. -
‘మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు’
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఇక.. సోమవారం సాధారణ పరిపాలన శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశీ జెండా ఎగరవేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే తాజాగా జీఏడీ అదనపు ముఖ్యకార్యదర్శి నవీన్ కుమార్ చౌదరీ స్పందిస్తూ.. జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కాదని అన్నారు. ఆ ఆదేశాలము తాము పాటించలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఇలా చేయటం అనుతించబడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఛత్రసల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో జెండా ఎగరవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
మంత్రి అతిషి జెండా ఎగురవేస్తారు: ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ!
న్యూఢిల్లీ: ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15నాడు తనకు బదులు సీనియర్ మంత్రి అతిషి జాతీయ జెండా ఎగురవేస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 15నాడు ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో సీఎం జాతీయ జెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్జైలులో ఉన్నందున జెండా ఎగురవేయలేని పరిస్థితి ఏర్పడింది. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ
ఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్ట తీసుకురానుంది. ఈ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో ఓ కమిటిని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం తీసుకవచ్చే చట్టంలో మౌలిక వసతులు, టీచర్ల విద్యార్హత, ఫీజు నిబంధనలు, తప్పుదోవ పట్టించే కోచింగ్ సెంటర్ల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. చట్ట రూపకల్పన ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ..బిల్డింగ్ బేస్మెంట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్( డీఎంసీ) కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే రాజేంద్రనగర్, ముఖర్జీ నగర్, లక్ష్మీ నగర్, ప్రీత్ విహార్లో ఉన్న బేస్మెంట్లను కలిగి ఉన్న 30 కోచింగ్ సెటర్లను సీజ్ చేశాం. మరో 200 కోచింగ్ సెంటర్లకు డీఎంసీ అధికారులు నోటీసులు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును ఆరు రోజుల్లో సమర్పిస్తాం. ఈ ఘటనలో మున్సిపల్ అధికారులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’అని అతిశీ తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని రాజేంద్రనగర్ ఉన్న రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయంతెలిసిందే. -
ఢిల్లీకి రూ. పది వేల కోట్లు కేటాయించాలి.. ఆప్ మంత్రి డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ నుంచి రూ. 10,000 కోట్లు కేటాయించాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. సెంట్రల్ జీఎస్టీ కింద ఢిల్లీ నుంచి కేంద్రానికి రూ. 25,000కోట్లు అందుతోందని ఆమె తెలిపారు. అంతేగాక ఢిల్లీ ప్రజలు రెండున్నర లక్షల కోట్లకుపైగా ఆదాయపు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని, ఇందులో కొంతభాగం తిరిగి దేశ రాజధానికి దక్కడం తమ హక్కని ఆమె పేర్కొన్నారు. ఈ రెండున్నర లక్షల కోట్లలో ఐదు శాతం రాజధానికి కేటాయించాలని అతిషి డిమాండ్ చేశారు.ఈనెల 23న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధానిలో రోడ్డు, రవాణా, విద్యుత్ రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు నగరాన్ని సుందరీకరించడానికి ఢిల్లీకి మరింత డబ్బు విడుదల చేయాలని అతిషి కోరారు.2001 నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం పన్నుల కింద కేవలం రూ.325 కోట్లు మాత్రమే చెల్లిస్తోందని ఆమె అన్నారు. అయితే, ఈ చెల్లింపు కూడా గత ఏడాది ఆగిపోయిందని.. ఏడాది కాలంలో నగరానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని, ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు. -
ఢిల్లీ మంత్రి అతిషిపై పరువు నష్టం కేసు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత, ఢిల్లీ మంత్రి అతిషిపై శనివారం పరువు నష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది. చిరునామా తప్పుగా ఉన్నందున సమన్లు అందజేయలేదని కోర్టు పేర్కొంది. కోర్టులో ఉన్న ఆమె న్యాయవాదికి ఫిర్యాదు కాపీని అందించారు.ఈ కేసులో మంత్రి అతిషి తరఫున లాయర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. బీజేపీ నేత తరఫున న్యాయవాది శౌమేందు ముఖర్జీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపినట్లుగా తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ప్రవీణ్ శంకర్ కపూర్ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం.. ఓ సమావేశంలో మంత్రి అతిషి మాట్లాడుతూ.. బీజేపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్ చేస్తూ.. నేతలను కొనేందుకు ప్రంయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తుందని.. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది.ఆ తర్వాత కూడా అతిషి మళ్లీ ఆరోపణలు చేశారు. తన సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని.. తనను బీజేపీలో చేరాలని కోరారని చెప్పారు. పార్టీ మారితేనే తన రాజకీయ జీవితం నిలబడుతుందని అన్నారని.. పార్టీ మారకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను ఒక నెలలోగా అరెస్టు చేస్తుందని బెదించారని ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ పరువు నష్టం కింద నోటీసులు పంపింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.