Eluru District
-
హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుండగా ప్రమాదం
-
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ.. ఓ వ్యక్తికి పాజిటివ్!
సాక్షి, ఏలూరు: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.మరోవైపు.. ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24x7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.ఇదిలా ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక, భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో, పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఎమ్మెల్యే చింతమనేని అరాచకం.. జనసేన నేతపై దాడి
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతయర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ.. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సైలెంట్ పుంజు.. వయలెంట్ విజయం
భీమడోలు: ఏలూరు జిల్లా కోడి పందేల బరిలో ఓ పుంజు చిత్రమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘నేనెప్పుడూ సైలెంట్.. నా జోలికొస్తే మాత్రం మహా వయలెంట్’ అన్నట్టుగా మూడు కోడి పుంజుల్ని వీరోచిత పటిమతో ఓడించిన రసంగి పుంజును అబ్రాస్ పుంజు మట్టికరిపించింది. ఏలూరు జిల్లా భీమడోలులో జాతీయ రహదారి పక్కన ఓ భారీ బరిని ఏర్పాటు చేశారు. బుధవారం చివరగా ఓ పందెం వేశారు. ఒకేసారి ఐదు కోడి పుంజులను బరిలోకి దింపారు. వాటిలో ప్రారంభం నుంచి సైలెంట్గా ఉన్న అబ్రాస్ కోడి పుంజు వేరే పుంజుల జోలికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోయింది. కాగా.. రసంగి కోడి పుంజు మిగిలిన మూడు పుంజులపై వీరోచితంగా పోరాడి వాటిని మట్టి కరిపించింది. చివరగా నక్కినక్కి ఉన్న అబ్రాస్ కోడి పుంజుని పొడిచేందుకు వెళ్లిన రసంగిని అబ్రాస్ పుంజు ఒకే ఒక్క దెబ్బతో నేల కరిపించింది. ఈ పందేన్ని చూసిన వారంతా ‘సైలెంట్ పుంజు.. వయలెంట్’ విజయం.. అని వ్యాఖ్యానించారు. -
సంక్రాంతికి ఇంటికొచ్చిన అల్లుడికి 470 వంటకాలు
సంక్రాంతి పండుగకు అల్లుళ్లకు మర్యాదల్లో తాము తగ్గేదేలే అని చెబుతున్నారు ఉమ్మడి గోదావరి జిల్లా వాసులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వందనపు వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 452 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కుక్కుల వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 270 రకాల పిండి వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. – మామిడికుదురు/జంగారెడ్డిగూడెం120 రకాల వంటలతో కొత్త అల్లుడికి భోజనం!పెళ్లి అయిన తర్వాత తొలిసారి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 120 రకాల వంటకాలతో భోజనం పెట్టి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నందిగామ భాస్కరరావు – సుజాత రెండో కుమార్తె మధుశ్రీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లికి చెందిన కొనకళ్ల సందీప్తో వివాహం జరిగింది. కొత్త దంపతులు సంక్రాంతి పండుగకు వైరా వచ్చారు. ఈ సందర్భంగా భాస్కరరావు దంపతులు తమ అల్లుడు, కుమార్తెకు వివిధ రకాల పిండివంటలు, ఇతర వంటకాలు కలిపి 120 రకాలతో భోజనం వడ్డించడం విశేషం.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతల బరితెగింపు
-
అశ్లీల నృత్యాల ఘటనలో 24 మంది అరెస్టు
నిడమర్రు: ఏలూరు జిల్లా బావాయిపాలెంలో జనసేన నేతల అశ్లీల నృత్యాల బాగోతంలో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన జనసేన పార్టీ క్రొవ్విడి గ్రామ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్, మరో 21 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు ఉన్నట్లు గణపవరం సీఐ సుభాష్ గురువారం తెలిపారు. ఈ అశ్లీల నృత్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీఆర్వో భుజంగరావు ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టయిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 292, 296 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదీ జరిగింది: ఈ నెల 12వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వేడుకలకు హాజరైన వారిలో పలువురు మద్యం సేవించారు. భీమవరానికి చెందిన ఇద్దరు హిజ్రాలతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ నృత్యాలను మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల పైనుంచి సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసి జనసేన నేతలు టీడీపీ వారిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే తొలిసారి: ఈ ప్రాంతంలో ఇలా అశ్లీల నృత్యాలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇదే కొనసాగితే జనసేన నాయకుల ఆగడాలు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వైఖరిని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఇంద్రకుమార్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. -
అధికారుల అండతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
ద్వారకా తిరుమల ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో శ్రీవారి క్షేత్ర డ్రోన్ విజువల్స్ హల్చల్ చేశాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్ ఎగురవేశారు. విజువల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఆలయ భద్రతా వైఫల్యమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై, ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన ‘అక్రమ మైనింగ్’ పంచాయతీ
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడులో తెలుగు తమ్ముళ్ల అక్రమ మైనింగ్ పంచాయతీ రచ్చకెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాక తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుండగా.. చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో ముద్దరబోయిన తీరుపై నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ముద్దరబోయిన కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. రావిచర్లలో అక్రమ మైనింగ్ జరిగితే ఏ చర్యలైనా తీసుకోండని అధిష్టానాన్ని కోరుతున్నాం. సొంత పార్టీలోని నేతలపైనే బురద చల్లడం బాధాకరం. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ముద్దరబోయిన చర్యలున్నాయి. తక్షణం ముద్దరబోయినను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
తల్లి, కుమారుడి దారుణహత్య
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్బాబు (55) సంతానం. అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్బాబు విజయవాడలో డ్రైవర్గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్బాబు, సురేష్ల మధ్య విభేదాలున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు. బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు. -
సుందర్ కుమార్ అక్రమ అరెస్ట్..
-
టీడీపీ Vs జనసేన.. తారాస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్కల్యాణ్ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు. -
బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మహిళలు సజీవదహనం
ఉండ్రాజవరం/సాక్షి, అమరావతి: దీపావళి పండుగ వారి జీవితాల్లో అమావాస్యను మిగిల్చింది. కూటికోసం కూలికొచ్చిన ఇద్దరు మహిళల్ని పిడుగుపాటు సజీవదహనం చేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు వారిని కాల్చేశాయి. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపాలెంలో జనావాసాలకు దూరంగా వేగిరోతు రామశివాజీ ఆధ్వర్యంలో సాయి ఫైర్వర్క్స్ పేరిట దీపావళి బాణసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది. తణుకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, పురుషులు ఇక్కడ పనిచేస్తున్నారు. గురువారం దీపావళి నేపథ్యంలో బాణసంచా తయారీ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం ఆ కేంద్రం సమీపంలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. ఆ నిప్పురవ్వలు బాణసంచా తయారీ కేంద్రం మీద పడ్డాయి. బాణసంచా అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న వేగిరౌతు శ్రీవల్లి (50), గుమ్మడి సునీత (35) సజీవంగా కాలిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సూర్యారావుపాలెంలో పిడుగుపాటుతో బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయపడిన వారికి తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పీఎస్లో రెడ్బుక్ రాజ్యాంగం.. అమలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, ఏలూరు జిల్లా: తలకడిపూడి పీఎస్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హల్చల్ చేశారు. ఎస్సై కుర్చీలో కూర్చొని టిఫిన్ చేసిన ఆయన.. పోలిస్ స్టేషన్లో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లుగా వ్యవహరించారు. పోలిస్ స్టేషన్ను సెటిలిమెంట్లకు అడ్డగా మార్చారు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్. పోలిస్ స్టేషన్లో ఎస్సై కుర్చీలో కూర్చొని ఆదేశాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏలూరులో మహిళపై సామూహిక అత్యాచారం
ఏలూరు టౌన్: కోల్కతాలో డాక్టర్పై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఏలూరులో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భర్తను చితక్కొట్టి.. భార్యను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆ మృగాళ్ల ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు వెంటనే స్పందించకపోవడం, ఘటన వివరాలు ఓ వ్యక్తి వెంటనే తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే.. కూటమి సర్కారులో మహిళలకు భద్రత కరువైందన్న దానికి తార్కాణంలా ఈ ఘటన నిలుస్తోంది.భర్త ఫిర్యాదుతో ఏలూరు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ఏలూరు జీజీహెచ్లో వైద్యచికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన భార్యాభర్తలు జీవనోపాధి కోసం 20 రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. వన్టౌన్ ప్రాంతంలోని ఓ హోటల్లో పనికి కుదిరారు. రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న ఆధ్యాతి్మక వేదిక రామకోటిలో నిద్రపోయి.. ఉదయం లేచి పనులకు వెళుతున్నారు. జీతం వచ్చాక అద్దె ఇల్లు కూడా తీసుకోవాలని భావించారు. వీరు ఇలా జీవించడం చూసిన ముగ్గురు జులాయి యువకులు కొద్ది రోజులుగా భర్తతో స్నేహంగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు భర్తకు మద్యం తాగించారు. అతను మత్తులో మునిగి నిద్రపోగా.. అతని భార్య (35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయగా.. మెలకువ వచి్చన భర్త వారిని అడ్డగించాడు. యువకులు బలమైన కర్రతో భర్త కాళ్లను చితక్కొట్టారు. అనంతరం మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె ముఖంపైనా బలంగా కొట్టారు. పోలీసుల అలసత్వం కాళ్లపై బలంగా దెబ్బతిన్నా.. భర్త రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరిచాడు. సినిమా చూసి అటుగా వెళుతున్న బాలాజీ అనే యువకుడు ఇది గుర్తించి డయల్ 100కు ఫోన్ చేయగా సిబ్బంది పట్టించుకోలేదు. చేసేది లేక ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి అక్కడి సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పగా.. వారు వెంటనే స్పందించకుండా ఆలస్యం చేశారు. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో బాలాజీ.. తన స్నేహితులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లాడు. వీరు వెళ్లాక నిందితులు ముగ్గురూ బాధిత మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏలూరు వన్టౌన్ గజ్జవారి చెరువు వద్ద బిట్టు బార్ ఎదురుగా రోడ్డుపై నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జులాయిగా తిరిగే ఈ నిందితులు ఏలూరు టీచర్స్ కాలనీలో చెంచుకాలనీ రోడ్డు ప్రాంతానికి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేట, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన నారపాటి నాగేంద్ర, ఎంఆర్ఆర్ కాలనీ 13వ రోడ్డు ప్రాంతానికి చెందిన గడ్డి విజయకుమార్ అని పోలీసులు వెల్లడించారు. -
నల్ల బంగారులోకం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లు 44, 45 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం. దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే వేలంలో చోటు దక్కినా...!చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్ టన్నుల నుంచి 3వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు. కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితోపాటుగా చింతలపూడి బ్లాక్లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది. తాజాగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.60 ఏళ్ల నుంచి అన్వేషణ.. » ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. » అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. » లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో నాటి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గనులపై అధ్యయనం చేసింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది. » సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది. » ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8 వేల మెగావాట్లు చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు. -
Eluru District: పందికొక్కుల మెక్కేస్తున్నారు..
-
తెగిపోయిన పెదవాగు ప్రాజెక్టు ఆనకట్ట
వేలేరుపాడు: కుండపోత వర్షాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటి ప్రవాహం ఉధృతం కావడంతో పెదవాగు ప్రాజెక్టు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తెగిపోయింది. దీంతో మండలంలోని మేడేపల్లి, కమ్మరగూడెం, అల్లూరి నగర్, ఒంటిబండ, రామవరం ఊటగుంపు, ఉదయ్నగర్, సొంబే గొల్లగూడెం, గుల్లవాయి, పాత పూచిరాల గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. అకస్మాత్తుగా ప్రాజెక్టు నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. పెదవాగు ప్రాజెక్టుకు చేరువలో ఉన్న మేడేపల్లి, అల్లూరి నగర్, ఒంటి బండ, కమ్మరగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని గుట్టల పైకి, భవనాల పైకి ఎక్కారు. వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. సహాయక చర్యలు అందించేందుకు ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లాలన్నా రహదారి సౌకర్యం లేదు. ఆయా గ్రామాల ప్రజలే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వేలేరుపాడు మండలం మేడేపల్లి మొదలుకొని అల్లూరి నగర్, కోయ మాధవరం, గుల్లవాయి తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ నీట మునిగాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో వేళ్లవాగు, ఎద్దెల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎద్దెల వాగు వద్ద వంతెన అప్రోచ్ కొట్టుకుపోయింది. వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోటకు వెళ్లే రహదారిలో పెదవాగు వంతెన వద్ద రహదారి అంతా నీట మునిగింది. -
నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
ద్వారకాతిరుమల: కారు డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన ఏలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన రాచాబత్తుని నాగార్జున హైదరాబాద్లో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.అతని భార్య భాగ్యశ్రీ (30) సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల ఆరో తేదీన భీమవరానికి చెందిన తన తల్లిదండ్రులు బొమ్మా నారాయణరావు, కమలాదేవి (57)తో పాటు, తన ఇద్దరు పిల్లలు నాగనితిన్ కుమార్ (4), నాగషణ్ముఖను తీసుకుని కిరాయి కారులో హైదరాబాద్కు వెళ్లారు. ఇంటర్వ్యూ ముగించుకుని ఏడో తేదీ రాత్రి స్వగ్రామానికి అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణరావు విజయవాడలో కారు దిగి, భీమవరానికి వెళ్లిపోగా, మిగిలినవారు రాజవోలుకు బయలుదేరారు.అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం మారంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారి వద్దకు రాగానే డ్రైవర్ దుర్గా వంశీ నిద్రమత్తులో రోడ్డు పక్కన నిలిపివున్న కంటైనర్ను వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో భాగ్యశ్రీ,, ఆమె తల్లి కమలాదేవి, ఆమె చిన్న కుమారుడు నాగనితిన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పెద్ద కుమారుడు నాగషణ్ముఖ, డ్రైవర్ దీవి వంశీకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి ఘటనాస్థలిని పరిశీలించారు. భీమడోలు సీఐ బి.భీమేశ్వర రవికుమార్, ద్వారకా తిరుమల ఎస్ఐ జి.సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
ఆయిల్పామ్.. ధర పతనం
ఆయిల్పామ్ ధరలు తిరోగమనం బాట పట్టాయి. క్రూడ్ ఆయిల్పై కేంద్రం దిగుమతి సుంకం రద్దు చేయడం, ఇతర కారణాలతో ఆయిల్పామ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే 40 శాతం మేర ధర తగ్గింది. అంతర్జాతీయంగా వచ్చే 30 ఏళ్ల వరకు ఆయిల్పామ్కు విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుండగా దానికి విరుద్ధంగా ధరలు పతనమవుతున్నాయి. ఐదేళ్ల నుంచి వరుసగా ధరలు పెరుగుతూ వచ్చి మళ్లీ ఈ ఏడాది రివర్స్లో పయనిస్తున్నాయి. ఆయిల్పామ్ సాగులో దేశంలోనే ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: వాణిజ్య పంటల్లో అగ్రగామిగా ఉన్న ఆయిల్పామ్ సాగు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. దేశంలోనే సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు జరుగుతుండగా ఒక్క ఏలూరు జిల్లాలోనే 48,968.8 హెక్టార్లలో, పశ్చిమగోదావరి జిల్లాలో 3 వేల హెక్టార్లు సాగులో ఉంది. సుమారుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కలిపి 1.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్, కోకో, కొబ్బరి, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అంతర పంటగా వేసుకునే వీలు ఆయిల్పామ్కు ఉండటంతో లక్షా 30 వేల ఎకరాల్లో ఆయిల్పామ్తో పాటు అత్యధిక శాతం కోకో అంతర పంటగా ఉంది.ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో గాలిలో 85 శాతం తేమ ఉండటంతో ఆయిల్పామ్ సాగుకు జిల్లా పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్రని నేలలు కావడం, కృష్ణా, గోదావరి డెల్టా మధ్య ప్రాంతం కావడంతో గాలిలో తేమ శాతం ఉండటం వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటంతో ఆయిల్పామ్ సాగు అత్యధికంగా సాగుతుంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా దీర్ఘకాలిక పంటగా దీన్ని అత్యధిక శాతం సాగు చేస్తున్నారు. తిరోగమనంలో ధరలుఆయిల్పామ్ ధరలు తిరోగమనంలో కొనసాగుతున్నాయి. 2017లో సగటున రూ.8 వేలు ఉన్న ధర అంతర్జాతీయ పరిణామాలు డిమాండ్ కారణంగా 2022 నాటికి టన్ను ధర అత్యధికంగా రూ.26 వేలకు చేరింది. ఆ తరువాత క్రూడ్ ఆయిల్పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో ఆయిల్పామ్ ధర తిరోగమన బాట పట్టి గతేడాది రూ.23 వేలు సగటున ఉండగా ప్రస్తుతం రూ.13,180కు పరిమితమైంది. రెండేళ్ల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్పామ్ ఇంపోర్ట్పై డ్యూటీ (దిగుమతి సుంకం) విధించింది. ఐదేళ్ల క్రితం వరకు ఇంపోర్ట్ డ్యూటీ 30 శాతం ఉండగా తర్వాత 20 శాతానికి తగ్గించారు.గతేడాది పూర్తిగా రద్దు చేయడంతో దేశంలోని ప్రధాన కంపెనీలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. వాస్తవానికి 10 లక్షల టన్నులు ఏటా డిమాండ్ ఉంటే 2 లక్షల టన్నులు కూడా ఉత్పత్తి లేని పరిస్థితి. ఈ క్రమంలో డిమాండ్ అధికంగా ఉండాలి. అయితే ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా రద్దు చేయడంతో దిగుమతుల పైనే అత్యధికంగా ఆధారపడటంతో స్థానిక మార్కెట్లో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ ఏడాది మళ్లీ ఇంపోర్టు డ్యూటీ విధించే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ అమలులోకి వస్తే ఆయిల్పామ్ ధరలు కొంతైనా పెరిగే అవకాశం ఉంది.ఏలూరు జిల్లాలో భారీగా సాగుఏలూరు జిల్లాలో 14 మండలాల్లో అత్యధికంగా ఆయిల్పామ్ సాగు జరుగుతుంది. 2019–20లో 72,860 హెక్టార్లు, 2020–21లో 70,963 హెక్టార్లు, 2022023లో 48,836 హెక్టార్లు, 2023–24లో 48,968.8 హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంది. ప్రధానంగా టి.నర్సాపురం మండలంలో 16190 ఎకరాలు, కామవరపుకోట మండలంలో 16,078 ఎకరాలు, ద్వారకాతిరుమల మండలంలో 17,504 ఎకరాలు, చింతలపూడి మండలంలో 18,304 ఎకరాలు, జంగారెడ్డిగూడెం మండలంలో 8,422 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. హెక్టారుకు నాలుగేళ్లు కలిపి రూ.71 వేలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం, 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే పంట కావడంతో ఆయిల్పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్పామ్ను పామాయిల్ పరిశ్రమలు తక్కువ గాను, కాస్మొటిక్స్ ఇతర అనుబంధ పరిశ్రమలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
-
చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్ను పోలీస్స్టేషన్కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్స్టేషన్కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్కు వచ్చి సీఐ, ఎస్ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
అది బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఓ కుగ్రామం. ఏలూరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గూడేనికి చేరుకోవడమే ఓ ప్రహసనం. ఎలాంటి రహదారి సౌకర్యం లేని అక్కడి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే కొయిదా గ్రామం నుంచి గోదావరి‡ నదిగుండా బోట్లో ప్రయాణించి, ఆవలి ఒడ్డు నుంచి సుమారు మూడు కిలోమీటర్లు గుట్టల నడుమ కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మొత్తం 472మంది కొండరెడ్ల ఓటర్లున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో 440 ఓట్లు పోల్ కాగా 93.22శాతం ఓటింగ్ నమోదు చేసుకుని ఎలక్షన్ కమిషన్ దృష్టిని ఆకర్షించింది. అంతేనా... అధికారుల ప్రశంసలను కూడా అందుకుని దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే పోలవరం నియోజకవర్గం పరిధిలోని కాకిస్నూరు.వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంత గ్రామమైన కాకిస్నూరు గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93.22 ఓటింగ్ శాతం నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి వెళ్లిన అధికారులకు గ్రామ కొండరెడ్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అధికారులను పూలమాలలతో సన్మానించారు. వారి సహృదయతకు ముచ్చటపడిన భారత ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా అధికారులకు స్వాగతం పలికిన ఫొటోను అప్లోడ్ చేసి, వివరాలతో ట్విట్ చేశారు. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. బోటుపై వచ్చి ఓటు హక్కు వినియోగందట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్నూరు పోలింగ్ కేంద్రం పరిధిలోని పేరంటపల్లి, టేకుపల్లి, చినమకోలు, పెదమంకోలు గ్రామాల ఓటర్లు 440 మంది గోదావరిలో బోటుపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16,37,430 ఓటర్లున్న ఏలూరు జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సకల ఏర్పాట్లు చేశారు. కాకిస్నూరు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేని ఆ గ్రామంలో జనరేటర్ సమకూర్చి, తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేయించారు.ఫోన్ కవరేజ్ లేకపోవడంతో ఈ గ్రామంలో శాటిలైట్ ఫోన్ ఏర్పాటు చేశారు. ఓటర్లు వచ్చేందుకు బోటు సౌకర్యం కల్పించడమే కాకుండా ఓటింగ్కు ఒక రోజు ముందు వారికి ఓటింగ్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులు 12న కాకిస్నూరు గ్రామానికి చేరుకొని, ఇంటింటికీ తిరిగి ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను వివరించారు. ఫలితంగా ఓటింగ్ శాతం పెరిగింది. తమ గ్రామానికి దే«శస్థాయిలో గుర్తింపు రావడంపై భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్కుమార్ మీనా, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు గ్రామ కొండరెడ్లు కృతజ్జతలు తెలిపారు.మా ఓటు వల్లనే ఊరికి మంచి పేరుమేమంతా ఓటు వేయడం వల్లనే మా ఊరికి మంచి పేరొచ్చింది. మా ఊరు దేశ ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. మాకు చాలా సంతోషంగా ఉంది. –సిద్ది శ్రీనివాసరెడ్డిసానా సంతోషంగా ఉందయ్యామేమంతా ఓటెయ్యడం వల్ల ఊరికే పేరు రావడం నాకు సానా సంతోషంగా ఉందయ్యా.. పెద్ద సార్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. – కోళ్ల కన్నమ్మ -
రోడ్డు ప్రమాదంలో భారీగా నగదు స్వాధీనం..!
-
కేసుల పుట్ట రఘురామకృష్ణరాజు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తులు, కేసుల పుట్ట అని వెల్లడైంది. ఆయన, ఆయన భార్య కనుమూరి రమాదేవి పేరిట స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ.215.57 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సీబీఐ కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు తరఫున ఆయన భార్య రమాదేవి శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ను సమర్పించారు. ఉండి అభ్యర్థిగా టీడీపీ ఇంకా ఆయన పేరును అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం.. బ్యాంకుల్లో అప్పులు రూ.12.60 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఆస్తులు, అప్పులు ఇవి.. రఘురామకృష్ణరాజు పేరుతో రూ.13.89 కోట్లు, ఆయన భార్య రమాదేవి పేరుతో రూ.17.79 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చూపించారు. తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు అన్నీ కలిపి రూ.8.48 కోట్లు రఘురామకృష్ణరాజు పేరిట, ఆయన భార్య పేరుతో రూ.175.45 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. రఘురామకృష్ణరాజుకు రూ.8.15 కోట్లు, ఆయన భార్యకు రూ.4.45 కోట్లు బకాయిలు ఉన్నట్టు చూపించారు. రఘురామపై కేసుల వివరాలివీ.. ►సైబరాబాద్లో వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనలో, నేరపూరిత కుట్ర ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్స్టేషన్లో, పెనుమంట్ర పోలీస్స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. ►ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. ►మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడినందుకు చింతలపూడి, మంగళగిరి, భీమవరం, పోడూరు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ►కుట్ర, మోసం, ఫోర్జరీ చేశారని ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుపై, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ను మోసం చేయడంతో ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ►ఫెమా చట్టం ఉల్లంఘన కింద రూ.40 కోట్లు జరిమానా విధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది. -
రెట్టించిన ఉత్సాహంతో...
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం.. ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ను అందించినందుకు వారు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కుట్ర అది.. ఇక జగన్పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం బస్సుయాత్ర కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. మొదటి ఓటు జగన్ మామకే.. ఫస్ట్టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా. ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి జగనే మళ్లీ సీఎంగా రావాలి.. జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి టీడీపీ హయాంలో నరకయాతన టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు సూరీడు నిప్పులు చెరుగుతున్నా.. ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు. మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్కు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 16వ రోజు షెడ్యూల్
సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం 16వ రోజు మంగళవారం (ఏప్రిల్ 16) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. చదవండి: మేమంతా సిద్ధం 15వ రోజు: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ -
రౌడీఛీటర్ చింతమనేని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్డ్ కాస్ట్ వారు... రాజకీయాలు మాకుంటాయి..మాకు పదవులు... మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా గొడవలు...’’ ఇదీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలోని దళిత పేటలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళిత సామాజికవర్గంపై తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు. ‘‘పవన్కళ్యాణ్.. వాడి వల్ల ఏం అవుతుంది. వాడి అన్న చిరంజీవి లాంటి వాడినే గెలిపించుకోలేనివాడు.. మమ్మల్ని ఏమి చేస్తాడు... మేము గతంలో 2014లో వాడి బొమ్మపై గెలిచామా..’’ అంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు. దెందులూరులోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద జనసేన నేత పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలివి. దెందులూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని నోటి దురుసుతో పాటు తీవ్ర వివాదాస్పద వైఖరితో ప్రతి ఒక్కరిపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. జర్నలిస్టు మొదలుకొని మంత్రి వరకు అందరిపై దాడి చేసిన ఏకైక రికార్డు కలిగిన రాజకీయ నేత. 85కి పైగా కేసులు చింతమనేనిపై ఉన్నాయని గత డీజీపీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 40కి పైగా క్రిమినల్ కేసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్లో రౌడీషిట్ తెరిచారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి, అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని వందల కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యతి్నంచిన పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్ శాఖ సిబ్బందిపై దాడులుకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యే పదవి కాలంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. పోలవరం గట్లు మాయం పోలవరం కుడికాల్వ గట్టు 20 కిలోమీటర్ల మేర ఐదేళ్లలో పూర్తిగా మాయం చేసిన ట్రాక్ చింతమనేనిది. పోలవరం నుంచి 180 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఉండగా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి నుంచి పెదపాడు మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ఉంది. 240 అడుగుల వెడల్పుతో కాల్వను నిరి్మంచడానికి భూసేకరణ చేసి 240 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో 80 అడుగుల మేర కాల్వ తగ్గి, కుడి, ఎడమ వైపు 80 అడుగుల మేర పోలవరం గట్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 అడుగుల లోతుతో కాల్వను తవ్వారు. కాల్వను తత్విన మట్టితో పాటు కుడి, ఎడమ వైపు తత్విన గట్లపై ఉన్న గ్రావెల్నూ కొల్లగొట్టారు. దెందులూరు నియోజకవర్గంలోనే లక్ష క్యూబిక్ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టినట్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అప్పటి విజిలెన్స్, ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. 17 క్యూబిక్ మీటర్ల చొప్పున ఒక లారీ లోడు దింపి ప్రతిరోజూ 200 టిప్పర్లు, కొన్నేళ్ళపాటు నిరాటంకంగా నిర్వహించి మట్టి దోపిడీకి పాల్పడ్డారు. 85కుపైగా కేసులు అన్ని రకాల కేసులు 85కు పైగానే చింతమనేనిపై ఉన్నాయి. వీటిలో సగం కేసులు కోర్టుల్లో కొట్టి వేయగా, మరికొన్ని నడుస్తున్నాయి. 26 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ట్రాఫిక్ వి«ధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడిచేసిన కేసుతోపాటు తెలంగాణలోనూ కోడిపందేల కేసులు ప్రభాకర్పై నమోదు కావడం విశేషం. ప్రధానంగా తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసులో చింతమనేని, ఆయన గన్మెన్, మరో 58 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 353, 332, 379, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 నవంబర్ 26న దెందులూరులో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్పై చింతమనేని దాడి చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 506, 353, 332, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భీమడోలు కోర్టులో రెండేళ్లు జైలుశిక్ష విధించారు. దీనిపై ప్రస్తుతం ఏలూరు జిల్లా కోర్టులో అప్పీల్ కేసు కొనసాగుతోంది. మాజీ మంత్రి వట్టి వసంత్పై దాడి 2011 నవంబర్ 26న దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్పై అప్పటి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. వట్టి వసంత్కుమార్తో మాటామాటా పెరిగి చింతమనేని అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదై భీమడోలు జూనియర్ సివిల్ కోర్టులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ కావడంతో జడ్జి కె.దీపదైవకృప రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై చింతమనేని అప్పీల్కు వెళ్లారు. తమ్మిలేరును మింగేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఏలూరు నగరం నుంచి కొల్లేరు వరకు విస్తరించి ఉన్న తమ్మిలేరు ప్రధాన కాల్వను చింతమనేని అండ్ ముఠా మింగేసింది. దెందులూరు నియోజకవర్గంలో తమ్మిలేరు ఎక్కువగా ఉండటం, తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో నాణ్యత ఉన్న ఇసుక ఉండటంతో దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తమ్మిలేరు పరీవాహక ప్రాంతాలంతా గట్టిగా కొల్లగొట్టారు. ప్రధానంగా పెదవేగి మండలంలో విజయరాయి నుండి ప్రారంభమై నడిపల్లి, బలివే, సూర్యారావుపేట, తమ్మిలేరు, చింతలపూడి నియోజకవర్గం వలసపల్లి వద్ద తమ్మిలేరు 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఒక రాత్రికి 200 లారీలు చొప్పున దాదాపు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచేశారు. దోపిడీ ప్రస్థానాన్ని దెందులూరుతో పాటు పక్క నియోజకవర్గమైన నూజివీడులో కూడా చొరబడి ముసునూరు మండలంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2015 జూన్లో ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి 2015 జూలై 11న ముసునూరులో చింతమనేని అనుచరులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో అప్పటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడి గట్టిగా నిలువరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న చింతమనేని హుటాహుటిన అక్కడకు చేరి మహిళా అధికారి, మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చి పక్కకు పడేసి దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదైన వెంటనే బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం, రెవెన్యూ తిరుగుబాటుతో చంద్రబాబు దిగి వచ్చి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. చింతమనేనిపై 2015లో ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచారు. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖాధికారిపై దాడి, ఐసీడీఎస్లో పనిచేసే మహిళా అధికారులపై బెదిరింపులకు దిగడం, 2016 ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ మధుపై దాడి ఘటనలకు చింతమనేని పాల్పడ్డారు. కొల్లేరులో చేపలు మాయం కొల్లేరులో చేపలను మాయం చేసిన ఘనత చింతమనేనిది. అటవీ శాఖ అధికారులను బెదిరించి మరీ కొల్లేరులో ఆక్రమణలకు దిగి చెరువులను స్థానిక టీడీపీ నేతలతో సాగు చేయించారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు.. కొన్ని సమయాల్లో చెక్పోస్టుల వద్ద పోలీసులపై తన నోటికి, చేతికి పని చెప్పడంతో కేసులు నమోదైన ఘటనలు అనేకం. మొత్తం 1,860 ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా చింతమనేని కనుసన్నల్లోనే సాగైనట్టు అంచనా. ఒక్క కొల్లేరులోనే సగటున రూ.వంద కోట్లకుపైగా దోచినట్లు సమాచారం. పెదవేగి మండలం పెదవేగి (సూర్యారావుపేట) లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయకుండా దాదాపు 70 ఎకరాల్లో గ్రావెల్ దోచేశారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు గ్రామాల్లో మట్టిని కొల్లగొట్టారు. -
కూటమిలో కత్తులు
సాక్షి నెట్వర్క్ : ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్ సామాజికవర్గాలదే. దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్ వర్గీయులు కిరణ్తో సమావేశమయ్యారు. శంకర్కి టికెట్ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు. ► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు. ► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్ తేలి్చచెప్పారు. కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు. సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్లో వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్కు విశేష ఆదరణ లభిస్తోంది. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది. -
టీడీపీ అభ్యర్థి పార్థసారథికి పెద్దవ్వ ఝలక్
నూజివీడు: ‘మీరు ఇచ్చే హామీలు నెరవేరుస్తామని హామీపత్రం రాసివ్వండి. లేకపోతే మీకు ఓటు వేయం...’ అంటూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఓ వృద్ధురాలు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కె.పార్థసారథి శనివారం నూజివీడులోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... స్థానికులు తమ గృహాలు చెరువు పోరంబోకు స్థలంలో ఉన్నాయని, వాటికి పట్టాలు ఇప్పించాలని కోరారు. దీనిపై పార్థసారథి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే నివేశన స్థలాలకు పట్టాలు ఇప్పిస్తామని, లేనిపక్షంలో పొజిషన్ సర్టిఫికెట్లు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో స్థానికంగా నివాసం ఉంటున్న తులసమ్మ అనే వృద్ధురాలు జోక్యం చేసుకుని ‘నోటి మాట చెబితే కుదరదు. రాతపూర్వకంగా హామీపత్రం రాసివ్వాలి. లేకపోతే ఓట్లు వేయం’ అని చెప్పారు. దీంతో తులసమ్మతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈలోపు కొందరు స్థానికులు జోక్యం చేసుకోవడంతో వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
YSRCP ఏలూరు అభ్యర్థులు వీళ్లే
ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై
సాక్షి, ఏలూరు జిల్లా: టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారు. నూజివీడు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పోస్టర్లను ముద్రబోయిన పీకిపడేశారు. టీడీపీ తనను దారుణంగా మోసం చేసిందని, చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా. చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బతికించా. పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా. కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా.. నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు. పార్టీ కష్ట కాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు. ఈ రోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని ముద్రబోయిన ధ్వజమెత్తారు. నేను ఏం తప్పుచేశానో చెప్పమంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, యనమల సమాధానం చెప్పలేకపోయారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెల్లడించారు. -
‘ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయి’
ఏలూరు: దెందులూరులో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ ‘సిద్ధం సభ’కు గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగినట్టుగా ప్రజలు తరలివచ్చారని వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తామంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయులకు జరిగిన చిన్న అసౌకర్యానికి మన్నించాలని కోరుతున్నామన్నారు. దెందులూరులో జరిగిన ‘సిద్ధం సభ’ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారిందని తెలిపారు. భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న(శనివారం) దెందులూరు సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే లబ్ధి చేకూరిందో వారే తమ స్టార్ క్యాంపెనర్లలని సీఎం జగన్ సూచించారని అన్నారు. వై నాట్ 175 అనేది.. నిన్నటి సభతో ప్రతిపక్షాలకు అర్థమై ఉంటుందని అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే నినాదం సభలో ప్రజల నోట వినబడిందని తెలిపారు. ఈ 60 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడదామని సీఎం జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు నేతలు సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళతాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో ఉంటున్నారని మండిపడ్డారు. కుప్పం టూ ఇచ్చాపురం మా అభ్యర్థులు ఎవరో చెప్పాం.. మా ఎజెండా ఏంటి.. మా జెండా ఏంటి.. అనేది స్పష్టం చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు కరువై.. ప్రతిపక్షాలు పొత్తులకు వెళుతున్నాయని ఎద్దేవా చేశారు. -
Updates: నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
UPDATES: 05:47 PM, Feb 3, 2024 దెందులూరు వైఎస్సార్సీపీ సిద్ధం సభ.. సీఎం జగన్ తన ప్రసంగం అనంతరం వేదిక దిగుతుండగా సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, ప్రజాప్రతినిధులు వారితో ఓపిగ్గా సెల్పీలు దిగిన సీఎం జగన్ 05:14 PM, Feb 3, 2024 ముగిసిన సిద్ధం బహిరంగ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు 04:14 PM, Feb 3, 2024 సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్ ►మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: సీఎం జగన్ ►ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా ►దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా ►పేదల భవిష్యత్ను కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా ►రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ►ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు ►కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు ►జగన్ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం ►కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండటమే నిజం ►నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్ ►జగన్ ఎప్పటికీ ఒంటరివాడు కాదు ►నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరే ►నాకున్న నమ్మకం మీరే ►వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని ►దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే ►రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోంది ►రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది ►మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది ►పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు ►గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది. ►అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం ►అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం ►175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం ►నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా ►చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించండి ►పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి ►చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి ►కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి ►గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి ►సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి ►ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే జగన్ అని చెప్పండి ►ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ అందిస్తున్నాం ►అసైన్డ్ భూములకు శాశ్వత భూహక్కు ఇచ్చాం ►డీబీటీ ద్వారా 2 లక్షల 55 కోట్లు పేదలకే అందించా ►కేబినెట్లో 68 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాం ►4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేశాం ►అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన అందించాం ►31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ►మీ బిడ్డ జగన్ పాలనలోనే ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పేందుకు గర్వపడుతున్నా ►దిశ యాప్తో అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం ►రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం ►కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం ►మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం ►అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి ►వచ్చే ఎన్నికలు.. పేదల భవిష్యత్ను నిర్ణయించేవి ►ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే ►3వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్లో పెరగాలన్నా.. మీ జగనే రావాలి ►ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి ►చెప్పిన ప్రతీది చేసిన ప్రభుత్వం మనది ►ప్రజలు నా స్టార్ క్యాంపెయినర్లు ►జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి ►పేదల సొంతింటి కల నెరవేరాలంటే జగనన్నే కావాలని చెప్పండి ►రైతు భరోసా కొనసాగాలన్నా జగనన్నే మళ్లీ రావాలని చెప్పండి ►పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాం.. ►రూ.2 లక్షల 55వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం ►మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి ►ఒకటి అసెంబ్లీ,ఒకటి పార్లమెంట్కు ఫ్యాన్ మీద నొక్కితే చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా ఉండదు ►ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు ►చంద్రబాబు అండ్ కో.. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ►175 స్థానాల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులే లేరు ►చంద్రబాబు అండ్కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ►చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు ఏపీతో ఏం సంబంధం ►దిగజారుడు పార్టీలన్నీ పేదవాడి భవిషత్తునే టార్గెట్ చేసుకుంటున్నాయి ►ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ 04:10 PM, Feb 3, 2024 దెందులూరులో భారీ జనసందోహానికి సీఎం జగన్ అభివాదం సీఎం జగన్కు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో జగనన్న ప్రభంజనం కనిపిస్తోంది: అబ్బయ్య చౌదరి ఎటుచూసిన వైఎస్సార్సీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. విశ్వసనీయతకు మారు పేరు సీఎం జగన్ సీఎం జగన్ రంగంలోకి దిగితే వార్ వన్సైడే పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి మేం సిద్ధం 03:56 PM, Feb 3, 2024 సిద్ధం సభావేదికపై వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి సిద్ధం సభావేదికపై వైఎస్సార్కు నివాళి అర్పించిన సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు భారీ వాక్ వేపై పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్ 50 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు 03:41 PM, Feb 3, 2024 సిద్ధం వేదికపైకి సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ సిద్ధం సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ ‘సిద్ధం’ పాటతో మారుమోగుతున్న దెందులూరు సభా ప్రాంగణం కాసేపట్లో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:29 PM, Feb 3, 2024 దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో దెందులూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దెందులూరులో వైఎస్సార్సీపీ సిద్ధం సభ వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్న సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 03:22 PM, Feb 3, 2024 సిద్ధం సభ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది: మంత్రి వేణు అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని జగన్ చేతల్లో చూపించారు సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు కుట్రలు చేయడమే చంద్రబాబు పని 03:15 PM, Feb 3, 2024 సీఎం జగన్ పేదల పక్షపాతి: ఆళ్ల నాని ప్రతిపక్షాలు సీఎం జగన్ను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు సీఎం జగన్ పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకొని జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది 03:00 PM, Feb 3, 2024 తాడేపల్లి నుంచి దెందులూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఏలూరు సిద్దం సభకు హాజరు జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం: కొట్టు సత్యనారాయణ మా ప్రజాబలం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది. సీఎం జగన్ వెంటే ప్రజలు ఉన్నారు. 175కు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్ జగన్కు ఉన్న స్టార్ క్యాంపెయినర్లను చూశారా? వైస్సార్సీపీకి సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు పచ్చ బ్యాచ్కు మాత్రం దండిగా స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబుకి సపోర్ట్గా దత్తపుత్రుడు పవన్, వదిన.. బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో ఉన్న బాబు అభిమాన సంఘం పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ప్రభుత్వంపై విద్వేషం గుప్పించే యెల్లో మీడియా కానీ, సీఎం జగన్కు నో స్టార్ క్యాంపెయినర్లు వైఎస్సార్సీపీకి సామాన్యులే క్యాంపెయినర్లు అందుకు ప్రత్యక్ష తార్కాణం.. ఏలూరు దెందలూరు సిద్ధం సభకు పోటెత్తిన జన ప్రభంజనం Star Campaigners of YSRCP…🔥 సామాన్య ప్రజలే మన పార్టీ స్టార్ క్యాంపైనర్లు…#YSJaganAgain #Siddham#YSRCPStarCampaigners pic.twitter.com/kg1Nv4I2Tq — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 జనజాతరను తలపిస్తున్న@YSRCParty దెందులూరు సిద్ధం సభ🔥#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/Hg07fTSKQk — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 02:30 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సిద్ధం సభకు భారీగా తరలి వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు... రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో తరలింపు. అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాం: రాజమండ్రి ఎంపీ భారత్. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలంతా మేము సిద్ధంగా ఉన్నామని సభకు వస్తున్నారు. మేము సిద్ధం అంటే .. సంసిద్ధం అంటూ ప్రతిపక్షాలు అనడం సిగ్గుచేటు. ఒక పార్టీ ఇచ్చిన నినాదాన్ని మరొక పార్టీ కూడా ఫాలో అయ్యే పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు పెద్దపీఠం వేసి మేము ఎన్నికలకు సిద్ధ పడుతున్నాం. మేము 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించి మేము సిద్ధం అంటున్నాం. మీరు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సంసిద్ధం అని చెప్పండి.. ఊరికనే కాదు. 01:50 PM, Feb 3, 2024 కృష్ణాజిల్లా : దెందులూరులో జరిగే సిద్ధం సభకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుండి 100 బస్సుల్లో బయల్దేరిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు. సిద్ధం సభకు బస్సు డ్రైవర్గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును స్వయంగా నడిపిన పేర్ని నాని. 01:30 PM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సిద్ధం సభకు భారీగా బయలుదేరిన వాహన శ్రేణులు జాతీయ రహదారిపై జెండా ఊపి బస్సులను ప్రారంభించి వారితో సభకు కలిసి వెళ్లిన ఉదయభాను. దెందురూరులో,సీఎం జగన్ సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు. దెందురూరులో సిద్ధం సభకు మైలవరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. 12:50 PM, Feb 3, 2024 తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలిన అభిమానులు, కార్యకర్తలు కృష్ణా జిల్లా: పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు నుండి దెందులూరు సిద్ధం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు. దెందులూరు లో సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు పెడన నియోజకవర్గం ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు 12:26PM, Feb 03, 2024 సిద్ధం సభకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్లిన కార్యకర్తలు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి 12:20PM, Feb 03, 2024 వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం: మంత్రి చెల్లుబోయిన మరో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దెందులూరు సిద్ధం సభను విజయవంతం చేస్తాం సేవే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ కోసం మేమంతా సిద్ధం నాయకుడి లక్ష్యం నెరవేర్చడమే పార్టీ కేడర్ ఉద్దేశం సిద్ధం సభ.. దేశ రాజకీయాల్లో సేవే లక్ష్యమని చాటి చెప్పడం సేవకి సైన్యం సిద్ధమైంది 12:15PM, Feb 03, 2024 గుడివాడ నుండి సిద్ధం సభకు వేలాదిగా వైఎస్సార్సీపీ శ్రేణులు దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో గుడివాడ నుండి వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు గుడివాడ VKR VNB ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సు ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. 12:00 PM, Feb 3, 2024 కృష్ణా జిల్లా: మచిలీపట్నం నుంచి సిద్ధం సభకు బస్సుల్లో కదలిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి బయల్దేరిన బస్సులో దెందులూరు బయల్దేరిన కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు. నేడు ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్ఆర్సీపీ రెండో ఎన్నికల సన్నాహక సభ సిద్ధం బహిరంగ సభకు 50 నియోకవర్గాల నుంచి తరలిరానున్న కేడర్ 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం @ysjagan#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/k9WIu7L5D8 — YSR Congress Party (@YSRCParty) February 3, 2024 11:30 AM, Feb 3, 2024 వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా నుంచిమంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో దెందులూరు బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. దెందులూరు సిద్ధం సభకు రాజమండ్రి నుంచి భారీగా బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లలో తరలి వెళ్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు సీఎం జగన్ సభను విజయవంతం చేసేందుకు ఉత్సాహంతో బయలుదేరిన అభిమానులు 11:23AM, Feb 03, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 11:20AM, Feb 03, 2024 ఏలూరు జిల్లా: కైకలూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 11:10 AM, Feb 3, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఏలూరు జిల్లా: కైకలూరు నుంచి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. సాక్షి, ఏలూరు: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమగోదావరిలో 15, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, ప్రజలు లక్షలాది మంది సభకు తరలిరానున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారు ఏలూరు ఆటోనగర్–దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో 110 ఎకరాల ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం ముస్తాబు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. సభా వేదిక నిర్మాణం, వేదిక ముందు భాగంలో ‘ఫ్యాన్’ గుర్తులో వాకింగ్వే ఏర్పాటుచేశారు. ప్రతి గ్యాలరీలో మంచినీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లతో పాటు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచారు. సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన పార్టీ ఫ్లెక్సీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘మేం సిద్ధం’ అంటూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలతో ప్రాంగణాన్ని నింపేశారు. పదుల సంఖ్యలో సీఎం జగన్ భారీ కటౌట్లను స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15కు పైగా భారీగా ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ సిద్ధమైంది. సీఎం షెడ్యూల్ ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
ఏలూరు ‘సిద్ధం’కు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షిఅమావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు గురువారం పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి ఎన్నికలకు జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 3న దెందులూరుకు సీఎం ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
అమ్మో.. పులొచ్చింది!
ద్వారకాతిరుమల: పెద్ద పులి.. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం పంచాయతీ, కొత్తగూడెంలోకి వచ్చిన పెద్ద పులి ఒక దూడను చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు ముక్కవల్లి బాలసుందరం గేదెల నుంచి పాలు తీసేందుకు తెల్లవారుజామున తన తోటలోకి వెళ్లాడు. అక్కడ కట్టేసి ఉన్న గేదెలు, దూడలు బెదిరిపోయి అరుస్తుండడాన్ని గమనించాడు. వాటిలో ఒక గేదె దూడ లేకపోవడాన్ని గుర్తించాడు. దూడ కోసం వెతుకుతుండగా సమీప పొదల్లోంచి పులి గాండ్రింపులు వినబడడంతో వెంటనే అక్కడున్న జీడి మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చేయాలో పాలుపోక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా స్థానిక రైతులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్వో నాగరాజు, జంగారెడ్డిగూడెం సబ్ డీఎఫ్వో ఎ.వెంకట సుబ్బయ్య, ఏలూరు సబ్ డీఎఫ్వో ఆర్.శ్రీదేవి, ఏలూరు ఎఫ్ఆర్వో ఎస్వీకే కుమార్, నూజివీడు ఎఫ్ఆర్వో దావీదురాజు నాయుడు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పులి జాడలు, దూడ రక్తం, ఎముకలు వారికి కనిపించాయి. పులి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ట్లు నిర్ధారించిన అధికారులు దాని కోసం గా లించారు. అవసరాన్ని బట్టి బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు. గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెంలో టాంటాం వేయించారు. ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటే‹Ùను ఆరా తీయగా, పులి రామసింగవరం అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. -
ఏలూరు జిల్లా దెందులూరులో పెద్దపులి సంచారం
-
సీఎం జగన్ మీటింగ్ కు భారీ ఏర్పాట్లు
-
ఏలూరు జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం
-
పండుగపూట విషాదం.. అక్కాచెల్లెళ్లు ముగ్గు వేస్తుండగా..
సాక్షి, ఏలూరు జిల్లా: మండపల్లి మండలం కానుకొల్లులో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి సడన్గా ఇటుక లోడుతో వెళుతున్న లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(16), పల్లవి దుర్గ(18) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
ఏజెన్సీలో హైవే
సాక్షి, ఏలూరు ప్రతినిధి: ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నూతన జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించి ఏజెన్సీ మీదుగా ప్రధాన రహదారుల మధ్య కనెక్టివిటీ పెంచే జాతీయ రహదారికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రా మధ్య దూరాన్ని తగ్గించేలా హైవే ప్రణాళిక ఖరారు చేశారు. మొదటిసారిగా పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో అత్యధిక భాగం నాలుగు వరుసల రహదారి నిర్మాణం కానుండటం విశేషం. ఎన్హెచ్ 365 బీబీ రెండో ప్యాకేజీ పనులకు రూ.367.97 కోట్లు మంజూరు కావడం, భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలాఖరు నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సూర్యాపేట నుంచి పట్టిసీమను కలిపేలా.. సూర్యాపేట నుంచి ఖమ్మం, చింతలపూడి నియోజకవర్గం మీదుగా దేవరపల్లి జాతీయ రహదారికి ఇప్పటికే కనెక్టివిటీ పెంచేలా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ఫీల్డ్ హైవేకు సమీపంలోనే జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమ కలిపేలా రహదారిని డిజైన్ చేశారు. జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకు మొత్తం 86.5 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసల రహదారిగా నిరి్మంచడానికి వీలుగా టెండర్ ఖరారు చేశారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు 365 బీబీ నిర్మాణ పనులు మొదటి ప్యాకేజీలో భాగంగా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం నుంచి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, కేఆర్ పురం, ఎల్ఎన్డీ పేట మీదుగా పట్టిసీమ వరకు 40.4 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.367.97 కోట్లు మంజూరు చేశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో 52.89 హెక్టార్ల భూమి అవసరమవుతుందని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ కూడా నిర్వహించారు. వచ్చే నెల రెండో వారానికి టెండర్లు పూర్తి చేసి నెలాఖరు నాటికి పనులు ప్రారంభించే అవకాశముంది. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 23వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఏలూరు జిల్లా: కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహం 12 గంటలకు సీతారాం ఫంక్షన్ హాలులో తటస్థులతో వైసీపీ నాయకుల సమావేశం కానున్నారు. 3 గంటలకు ఫంక్షన్ హాలు నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, జోగి రమేష్, పినిపే విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరుకానున్నారు. విజయనగరం జిల్లా: నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు విజయనగరంలోని జగన్నాధ ఫంక్షన్ హాలులో వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు కొండవెలగడ గ్రామ సచివాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం నెల్లిమర్ల వరకు ర్యాలీ జరపనున్నారు. 3:00 గంటలకు నెల్లిమర్ల మొయిన్ జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరుకానున్నారు. -
నేడు విజయనగరం, ఏలూరు జిల్లాలో సాధికార యాత్ర
-
‘ఈసారి కూడా నా మనవడే సీఎం’
ద్వారకా తిరుమల: ‘ఈ మనవడు నాకెందుకు తెలీదు. నా పెద్ద మనవడే. వయసులో చిన్నోడైనా నాలాంటి ముసలోళ్లతోపాటు ఎంతోమంది పేదల జీవితాల్లో భరోసా నింపుతున్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నేనే కాదు. రాష్ట్రంలోని అందరూ ఆయనకే ఓటేస్తారు. ఈసారి కూడా నా మనవడు జగనే సీఎం అవుతాడు’ అంటోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన ముద్దన ముస్సెమ్మ. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దొరసానిపాడులో ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. ఈ సందర్భంలో ముద్దన ముస్సెమ్మ అనే వృద్ధురాలు తారసపడగా.. ఎమ్మెల్యే ఆమెతో ముచ్చటించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కరపత్రంపై ఉన్న సీఎం జగన్ ఫొటోను బామ్మకు చూపి ‘ఈయన ఎవరో గుర్తు పట్టావా’ అని అడిగారు. అది చూసిన ముస్సెమ్మ విప్పారిన కళ్లతో ‘నా మనవడు నాకెందుకు తెలీదు. జగన్ మనవడి వల్లే సంతోషంగా బతుకుతున్నా. జగన్బాబే లేకపోతే మాలాంటి వాళ్ల బతుకులు ఏమైపోయేవో. ఆయన దయవల్ల ఎందరో పేదల బతుకులు బాగుపడ్డాయ్. మా అందరి ఆశీస్సులతో మళ్లీ నా మనవడే సీఎం అవుతాడు’ అంటూ అమితానందంతో జవాబిచ్చింది. చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు. ‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
నూజివీడులో సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్ విజువల్స్
-
చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Live Updates.. ►నూజివీడులో అర్హులకు పట్టాలు ప్రదానం చేసిన సీఎం జగన్. సీఎం జగన్ మాట్లాడుతూ.. ►ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదు. చంద్రబాబుకు మంచి చేద్దామనే ఆలోచనే లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనే. బాబు హయాంలో అందరినీ మోసం చేశాడు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్దాలతో వస్తారు.. ప్రతీఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ►తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తుకు తెచ్చుకోండి. ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు. ఆయన అన్న మాటలను గుర్తుకుతెచ్చుకోండి. ►ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్లోని నాయకుడు చంద్రబాబు. కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నది చంద్రబాబే. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతీ ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు మోసపోకండి. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ తోడేళ్లు అందరూ ఏకమవుతారు. ప్రజల దీవెనలు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోను. ►రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నాం. కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నాం. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. ►మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం. అసైన్డ్ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం. ►ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. దళిత వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్మశాసవాటికలకు స్థలాలు కేటాయించాం. ►నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. నేడు చంద్రబాబు అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు. 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుంది. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడు.. ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి. లోకేశ్ ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభిస్తానంటే సీఎం జగన్కు చెప్పి అనుమతులు ఇప్పిస్తాను. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘతన సీఎం జగన్దే. దివంగత వైఎస్సార్ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు. నూజివీడుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా రావు. ►నూజివీడు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ►నూజివీడు బయలుదేరిన సీఎం జగన్ ►కాసేపట్లో అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం ►భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. ► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. ► 12.50 గంటలకు హెలీప్యాడ్కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు. గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అత్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం. వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూపించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం. డీకేటీ పట్టాల పంపిణీ.. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్ ఫారెస్ట్ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం. -
పేదజనం కల నెరవేర్చిన జగనన్న ప్రభుత్వం
-
సామాజిక విప్లవ సారథి జగన్కు జేజేలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, బాపట్ల/సాక్షి, కడప: సామాజిక విప్లవ సారథి వైఎస్ జగన్ పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు మూడో రోజు శనివారం ప్రజలు నీరాజనం పలికారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర శనివారం విశాఖ జిల్లా భీమిలి, బాపట్ల జిల్లా బాపట్ల, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ బస్సు యాత్ర సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాల్లో జరగనుంది. బాపట్లలో అపూర్వ స్పందన బాపట్ల నియోజకవర్గంలో బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. యాత్రకు ప్రజలు పూల తివాచీలతో ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్ర నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, సంగుపాలెం కోడూరు గ్రామాల మీదుగా మధ్యాహ్నం 1.10 గంటలకు చందోలులోని శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరింది. అక్కడ అమ్మవారికి నేతలు పూజలు చేశారు. పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చందోలులోని నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్య, వైద్యం తదితర విభాగాల్లో జరిగిన అభివృద్ధిని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు వివరించారు. యాత్ర రెడ్డిపాలెం, కర్లపాలెం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల చేరుకుంది. నియోజకవర్గంలోని యువకులు అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ చేశారు. అంబేడ్కర్ సెంటర్లో సభ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేస్తున్న మేలును మంత్రులు వివరించిన సమయంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జనసంద్రంగా మారిన పసిడిపురి పసిడిపురి ప్రొద్దుటూరులో సామాజిక సాధికార యాత్ర జనజాతరలా సాగింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వైవీఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్ రోడ్డు మీదుగా రామేశ్వరం వైపు సాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి బస్సు ముందు నడుస్తుండగా మహిళలు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేశారు. రామేశ్వరంలోకి బస్సు చేరుకోగానే బాణాసంచా కాల్చారు. వన్టౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. రాజీవ్ సర్కిల్ వద్ద ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. శివాలయం సెంటర్లో అసంఖ్యాక జనం మధ్య బహిరంగ సభ జరిగింది. దసరా ఉత్సవాలకు పసిడిపురి పెట్టింది పేరు. భారీ స్థాయిలో ప్రజానీకం వీటిని వీక్షిస్తుంటారు. శనివారం సామాజిక సాధికార యాత్ర కూడా ఇదే ఉత్సవాలను తలపించింది. శివాలయం సెంటర్ నుంచి కనుచూపు మేర రోడ్డుకు ఇరువైపులా ప్రజానీకం నిల్చొని నేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. భీమిలిలో 2వేల బైక్లతో భారీ ర్యాలీ భీమిలిలో స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను ఎండాడలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగా ర్జున, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అక్కడ నుంచి చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘నాడు–నేడు’ పనులను నాయకులు పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆనందపురం మండలం బోయిపాలెం కూడలి నుంచి 2 వేలకు పైగా బైక్లు, వందకు పైగా కార్లతో ర్యాలీగా యాత్ర ప్రారంభమై హైవే మీదుగా తగరపువలస చిట్టివలస ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అక్కడ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి బహిరంగ సభ వద్ద వైఎస్సార్ విగ్రహాలకు నివాళర్పించి మంత్రులు ప్రసంగించారు. -
చంద్రబాబు జైల్లో ఉండటానికి కారణం వారే: కొమ్మినేని
సాక్షి, ఏలూరు జిల్లా: తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టిపెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఏపీ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదని కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు అమరావతిని తనకు కావాల్సిన వాళ్లకి రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. సీఎం జగన్ తనకు తెలిసిన వారితో పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాల్సిన అవసరం తప్పకుండా ఉంది.’’ అని కొమ్మినేని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్పై కొమ్మినేని మాట్లాడుతూ, చంద్రబాబు 38 రోజులుగా జైల్లో వుండటానికి కారణం వారి కుటుంబ సభ్యులు, టీడీపీ లాయర్లే... లాయర్లు ముందు బెయిల్ కోరకుండా కేసు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. మొన్నటి దాకా చంద్రబాబు ఎండలో తిరిగి ఫిట్గా ఉన్నానని, ఇప్పుడు జైల్లో నీడలో ఉండి ఆరోగ్యం బాగాలేదనడం అర్థం కాని విషయం. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏసీలు కావాలని కోర్టులో వేస్తున్నారు తప్ప, ఆయన్ని ఆసుపత్రిలో చేర్చమని ఎందుకు అడగడం లేదు’’ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. చదవండి: అన్ని సీట్లలో పోటీ చేయదట.. టీడీపీపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు -
బైక్ లిఫ్ట్ అడగడమే ఆమెకు శాపమైంది.. ఫొటోలు తీసి..
సాక్షి, ఏలూరు: మహిళలు, యువతులపై వేధింపులు తగ్గించేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవు అనే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ చావా సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర లక్ష్మణరావుకు దెందులూరుకు చెందిన పావని (35)కి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల చదువుల నిమిత్తం గుండుగొలనులోని గంగానమ్మ గుడి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 15న పావని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ అటుగా వస్తున్న ఓ మోటార్ స్లైక్లిస్ట్ను లిఫ్ట్ అడిగి వెళుతోంది. అయితే, ఆ సమయంలో లక్ష్మీపురానికి చెందిన పాత నేరస్తుడు బోను శివకృష్ణ ఆమె బండి ఎక్కి వెళుతున్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీసి తన సహచరులైన బోను పవన్, సుంకర యశ్వంత్, శనపతి రాజబాబులతో కలిసి ద్వారకాతిరుమల వరకు వారిని వెంబడించారు. అక్కడ వారిని అడ్డగించి తమ కోరిక తీర్చాలని లేదంటే వీడియో వైరల్ చేసి అల్లరి పాలు చేస్తామని బెదిరించారు. అయినా ఆమె వారికి లొంగలేదు. కాగా, ఈనెల 10న బోను శివకృష్ణ సదరు మహిళ బైక్ ఎక్కి వెళ్లిన వీడియోను గ్రామంలో అందరికి షేర్ చేశాడు. వ్యభిచారిణిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వివాహిత అదేరోజు ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతదేహానికి వీఆర్వోలు వి.వెంకటేశ్వరరావు, కందులపాటి శంకర్ పంచనామా నిర్వహించారు. పావని మృతికి కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వీడియోలను తీసిన సెల్ఫోన్లను కూడా సీజ్ చేశామని చెప్పారు. నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. చేపల పట్టుబడికి వెళుతూ జీవనం పొందుతున్న భర్త, పిల్లలు పావని ఆత్మహత్యతో తల్లడిల్లిపోయారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం -
లోకేశ్ను కలిసేందుకు రైతులు ససేమిరా
జంగారెడ్డిగూడెం రూరల్/కామవరపుకోట: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బుధవారం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వెలవెలబోయింది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నుంచి పుట్లగట్లగూడెం మీదుగా గురవాయిగూడెం వరకు యాత్ర సాగింది. పాదయాత్ర షెడ్యూల్లో పుట్లగట్లగూడెంలో గ్రీన్ఫీల్డ్ హైవే రైతులతో లోకేశ్ ముఖాముఖి ఏర్పాటు చేశారు. అయితే.. రైతుల వద్దకు లోకేశ్ రారని.. రైతులనే లోకేశ్ వద్దకు తీసుకు రావాలని చెప్పడంతో నాయకులు హైరానా పడ్డారు. లోకేశ్ వద్దకు రావాలని రైతులను బతిమాలుకోగా.. తాము రాబోమని రైతులు తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు తమ బంధువులను, పరిచయం ఉన్న వారిని తీసుకెళ్లి వాళ్లే రైతులని లోకేశ్కు చెప్పారు. వారితో ముక్తసరిగా మాట్లాడిన లోకేశ్ యాత్రను ముందుకు సాగించారు. చదవండి: 15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం -
జనం లేక లోకేశ్ పాదయాత్ర వెలవెల
లింగపాలెం/చింతలపూడి: ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సోమవారం నారా లోకేశ్ పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. లింగపాలెం మండలంలోని సుందరరావుపేట నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చింతలపూడి మండలం వెలగలపల్లి, ఫాతిమాపురం గ్రామాల మీదుగా చింతలపూడి శివారు క్యాంప్ సైట్కు చేరారు. ఎన్వీఎన్ కాలనీ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్రలో నాయకులు, యువగళం టీం సభ్యులు మినహా స్థానిక ప్రజలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అక్కడక్కడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, తనకు ఒక చెయ్యి నొప్పిగా ఉందని చెబుతూ మరో చేతిని ఊపుతూ వెళ్లిపోయారు. లింగపాలెం గ్రామ శివారుకు వెళ్లిన తర్వాత మాజీ ఎమ్మెల్యే, స్థానిక మాజీ ప్రజాప్రతినిధిని ‘మీ గ్రామంలో జనం ఏరి..’ అంటూ లోకేశ్ ప్రశ్నించారు. కాగా, లోకేశ్ క్యాంప్ సైట్లో పామాయిల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేతలు ముందుగానే ఎంపిక చేసిన తమ పార్టీకి చెందిన రైతులనే ఈ కార్యక్రమానికి అనుమతించారు. తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పామాయిల్ రైతులకు ఎంతో మేలు చేసినట్లు చెప్పినా రైతుల నుంచి స్పందన రాకపోవడంతో ‘కనీసం చప్పట్లన్నా కొట్టండయ్యా..’ అంటూ లోకేశ్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడంతో రైతులు నవ్వుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత లోకేశ్ పాదయాత్ర చింతలపూడి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ‘సైకో పోవాలి, సైకిల్ కావాలి...’ అంటూ మైకులో కేకలు వేయడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ‘జై జగన్... వైఎస్సార్సీపీ జిందాబాద్...’ అంటూ నినాదాలు చేశారు. దీంతో లోకేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితోపాటు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి దూసుకువచ్చారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. కూలి ఇవ్వలేదని జెండాలు పారేసి వెళ్లిన వైనం.. ముసునూరు: ఏలూరు జిల్లాలో జరుగుతున్న లోకేశ్ పాదయాత్రలో పెయిడ్ ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. పల్లెల్లో ప్రజల్లో స్పందన కరువవడంతో పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్రకు కూలి డబ్బులిస్తామని జనాన్ని తరలించిన విషయం సోమవారం వెలుగుచూసింది. శనివారం యువగళం పాదయాత్ర నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలో ప్రారంభమై మండలంలోని కొర్లగుంట–ముసునూరుల మీదుగా వలసపల్లి వరకు జరిగింది. ఈ క్రమంలో కొందరు ఆటోలో కాట్రేనిపాడు గ్రామం మీదుగా దగ్గర దారిలో హనుమాన్జంక్షన్ వైపు వెళుతూ జెండాలను రహదారి పక్కనే పడేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు.. అలా పడేశారేంటని ఆటోలోని వారిని ఆరా తీశారు. కూలి డబ్బులు ఇస్తామని పాదయాత్రకు తీసుకొచ్చారని, కానీ డబ్బులివ్వకుండా తమను మోసం చేశారని ఆటోలోనివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వెనుదిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనేందుకు తమకు ఇచ్చిన జెండాలు, చొక్కాలను విప్పి దారిలో పారేసి వెళుతున్నామని తెలిపారు. ఈ ఘటనపై కాట్రేనిపాడుకు చెందిన కంబాల రాజేశ్ సోషల్మీడియాలో పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ సందర్భంగా రాజేష్ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. పాదయాత్ర తమ గ్రామం మీదుగా జరగలేదని, దగ్గర దారి కావడంతో వీరంతా ఇటువైపు వెళ్లారని చెప్పారు. వారు ఏ గ్రామానికి చెందినవారో చెప్పలేదని ఆయన తెలిపారు. -
ఏలూరు: లోకేష్ యాత్రలో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
సాక్షి, ఏలూరు: లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల దగ్గర రెచ్చగొట్టే చర్యలకు దిగిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేత విజయ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసం కాగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ అరాచకాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం లోకేష్ యువగళం టీమ్ లాక్కొంది. అడ్డుగా వెళ్లిన రూరల్ కానిస్టేబుల్పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
సీన్ రివర్స్.. చంద్రబాబుకు వార్నింగ్.. అలా చేయకపోతే తోకలు కత్తిరిస్తాం..
తోకలు కత్తిరిస్తానంటూ అందరినీ బెదిరించడం చంద్రబాబుకు బాగా అలవాటు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పచ్చ పార్టీ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. తమ ఇన్చార్జ్ను మార్చకపోతే మేమే తోకలు కత్తిరిస్తామంటూ అక్కడి నాయకులు చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారట. బయటినుంచి తమ మీద పెత్తనం చేస్తున్న వ్యక్తికి కాకుండా లోకల్ లీడర్కే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉండగానే టీడీపీ బాస్ చంద్రబాబుకు ఏలూరు జిల్లా నూజివీడు తమ్ముళ్లు చుక్కలు చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ సీటు స్థానికులకే ఇవ్వాలన్న డిమాండే దీనికి కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం నూజివీడు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్టీలోను.. ఇటు ప్రజల్లోనూ ఆదరణ లేక ఓటమిని తనఖాతాలో వేసుకోవాల్సివచ్చిందని టాక్. రెండుసార్లు ఓడిపోయిన నేత మూడోసారైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉండగా.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పట్నుంచో నూజివీడు టీడీపీకి ఆయువుపట్టుగా ఉన్న క్యాడర్ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారట. ముఖ్యంగా నూజివీడు పార్టీలో సీనియర్ నేత కాపా శ్రీనివాసరావుకు.. ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో కాపా వర్గాన్ని ముద్రబోయిన తరచూ టార్గెట్ చేస్తున్నారట. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతుగా కాపా శ్రీనివాసారావు వర్గం పాదయాత్ర చేపట్టింది. నియోజకవర్గ ఇంఛార్జి ముద్రబోయిన లేకుండానే పాదయాత్ర చేపట్టినందుకు కాపా వర్గానికి చెందిన నూజివీడు మండల నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిణామాలతో కాపా శ్రీనివాసరావు వర్గం ముద్రబోయినపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాపా వర్గం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి నేరుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పంచాయతీ పెట్టిందట. ఆ సమయంలో చంద్రబాబు తన సహజధోరణితో.. మీ సంగతి చూస్తా...అంతు తేలుస్తా..అంటూ హెచ్చరించడంతో వెళ్లినవారంతా షాక్ తిన్నారట. సమస్య చెప్పుకోవడానికి వెళితే బెదిరిస్తారా అంటూ రగిలిపోతున్న కాపా వర్గం ముద్రబోయిన కావాలో తాము కావాలో తేల్చుకోవాలంటూ, అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేందుకు ఓ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే మొన్నటి వరకూ డోంట్ కేర్ అన్న అధిష్టానం బుజ్జగింపుల కోసం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుని రంగంలోకి దించింది. ఓ మూడు గంటలు పాటు బ్రతిమిలాడిన తర్వాత.. మూడు రోజులు గడువిస్తామని.. ఈలోగా తమ డిమాండ్లకు సానుకూల నిర్ణయాలు రాకపోతే..తమ నిర్ణయం ఏంటో ప్రకటిస్తామని కాపా శ్రీనివాసరావు పార్టీ నాయకత్వానికే డెడ్ లైన్ పెట్టారట. చదవండి: పాదయాత్రలో లోకేష్కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ ఇదిలా ఉంటే నూజివీడు ఇన్చార్జ్గా అధిష్టానం ఎవరిని సూచించినా ఆ నేతకు మద్దతిస్తామని.. కానీ ఆ వ్యక్తి ముద్రబోయిన కాకుండా స్థానికుడే అయిఉండాలని పట్టుబడుతున్నారట కాపా వర్గం నేతలు. ఏ సామాజిక వర్గానికి చెందిన నేత అయినా స్థానికుడైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ముద్రబోయిన కాకుండా ఎవరైనా ఓకే అని స్పష్టం చేస్తున్నారట. తమ డిమాండ్ను కాదని ముద్రబోయినకు టిక్కెట్టిస్తే మాత్రం తేడాలొచ్చేస్తాయనే బలమైన సంకేతాన్ని పంపించారట. ఇప్పుడు నూజివీడులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పసుపు పార్టీలో తీవ్రస్థాయి చర్చకు దారితీసాయి. వారి డిమాండ్కు తలవొగ్గితే అన్ని చోట్ల నుంచి అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మరో రకంగా సమస్య వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యగానే కనిపిస్తోందంటూ చంద్రబాబు తల బాదుకుంటున్నారని టాక్. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
-
48 గంటల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేశాం...!
-
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం: సీఎం జగన్
LIVE UPDATES: ► రాజమండ్రి చేరుకున్న సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు సీఎం జగన్. ఇవాళ రాత్రి ఇక్కడి ఆర్&బి అతిధి గృహంలో బస చేస్తారు. మంగళవారం(రేపు) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ► ఏలూరు జిల్లా: ముగిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కుక్కునూరు పర్యటన. రాజమండ్రి బయలుదేరారు. గొమ్ముగూడెంకు వరద ముంపు బాధితులతో సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ ►ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు ►ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం ►జనవరి కల్లా ప్యాకేజీ అందే విధంగా చూస్తాం ►అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం ►2013 -14 రేట్ల తో కడతామని గత ప్రభుత్వం చెప్పింది ►ఆ రేట్ల ప్రకారమే డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్పింది ►మనసుపెట్టి ఆలోచించాలని కేంద్రానికి సూచించాము.. ►కేంద్రంలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణం వచ్చింది ►సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ కోసం పంపారు ►ఈ నెలాఖరుకు కేంద్ర క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అది వేస్తే17వేల కోట్లు కేంద్రం ఇచ్చే అవకాశం ఉంది.. ►హామీ ఇచ్చిన రీతిలో 47వేల ఏకరాలకు ఐదు లక్షలు ఇస్తాము ►2025 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసి నీరందిస్తాం ►గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం ►స్పిల్ వే కట్టకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టారు ►కాఫర్ డ్యాం కట్టకపోవడం వల్లే గ్రామాలు ముంపునకు గురయ్యాయి ►కొత్త డయాఫ్రం వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నాం ►గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నాం ►వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నాం ►ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు ►సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని రకాల అధికారాలు ఇచ్చాం ►వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచ్చు ►పోలవరం డ్యాంలో మూడు దశల్లో నీళ్లు నింపుతాం ►వచ్చే 6,7 నెలల్లో మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుంది ►లిడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది ►లిడార్ సర్వే సైంటిఫిక్గా జరిగింది.. ఎవరికీ అన్యాయం జరగదు ►భూములు కొనుగోలుకు సంబంధించి మరింత న్యాయం చేస్తాం ►వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించిన సీఎం జగన్ ►గొమ్ముగూడెంలో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ ►వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్ ►వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ ►ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ►కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకున్న సీఎం జగన్ ►వరద బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్ .. ►పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు ►ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం ►ఆర్&ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు ►పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారు ►పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు. ►పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం. ►పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదు. ►బాధితులకు రావాల్సిన ప్యాకేజ్పై మంచి జరుగుతుంది. ►ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుంది. ►ముంపు ప్రాతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోంది. ►మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం ►ఒక్కసారిగా నింపితే డ్యామ్ కూలిపోవచ్చు ►సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు ►సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నాం ►వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదు. ►ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారు ►అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ► బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు. ►సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చాం. ►నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నాం. ►అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉన్నారు. ►వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం ► ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశాం. ►వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి నాకు చెప్పండి ►ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం ►డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదు. ►అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు. ►తాడేపల్లి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. తొలుత ఏఎస్ఆర్ జిల్లా కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులను సీఎం కలవనున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో సోమవారం పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శించనున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. చదవండి: హానీట్రాప్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి? సీఎం జగన్ షెడ్యూల్ సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్ సెంటర్లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పోలవరం వద్ద పెరుగుతున్న వరద.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
సాక్షి, ఏలూరు జిల్లా : ఎగువను కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద 32.390 మీటర్ల నీటిమట్టం పెరిగింది. వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్ వే గేట్ల నుంచి 7 లక్షల 43 వేల 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే దిగువన 24 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరదల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 233 1077 జంగారడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 9553220254 కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 7013128597,9848590546 వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 6309254781 తూ.గో. జిల్లా: ధవళేశ్వరంలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 8.48 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాల్వలకు 11వేల క్యూసెక్కులు విడుదల చేశారు అధికారులు. చదవండి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ వదలని వాన.. వరదలా.. -
అమానవీయ ఘటన.. కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసిన మహిళ
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి హేయమైన చర్య ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసింది తల్లి పుట్ట విజయ లక్ష్మి. సదరు మహిళకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, భర్త మరణించగా మేనత్త కొడుకు సతీష్ను రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానంటూ సతీష్ బెదిరించడంతో వేరే పెళ్లి వద్దని, తన ఇద్దరు కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తకు అప్పగించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి మృతి చెందాడు. భార్య భర్తల మధ్య విభేదాలతో వ్యవహారం బయటపడింది. విషయం తెలిసిన బంధువులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు సతీష్, విజయలక్ష్మిలను అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్: టీవీ సీరియల్ నటి అదృశ్యం -
‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్వర్ధన్రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్వర్ధన్రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్లైట్తో అఖిల్వర్ధన్రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్వర్ధన్రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు. మృతుడి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్వర్ధన్రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్ జాగిలం సహాయంతో గాలించారు. -
‘జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్కు ఇష్టమేమో..?’
సాక్షి, ఏలూరు: పవన్ కల్యాణ్ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులో ప్రెస్మీట్ నిర్వహించిన ఆళ్ల నాని.. ‘ వాలంటీర్లపై నీచంగా మాట్లాడతావా?, పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు..?, నీ గెలుపు మీదే నీకు నమ్మకం లేకపోతే.. నీ పార్టీవాళ్ళు నిన్నెలా నమ్ముతారు?, పవన్ పోరాటం.. ఆరాటం.. అంతా బాబు కోసమే. జగన్ గద్దెదించి.. మరి ఎవర్ని గద్దెనెక్కిస్తాడో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్. చంద్రబాబు హయాంలో కాగ్ అక్షింతలు వేయని సంవత్సరం ఏదైనా ఉందా..?, జగన్ని ఏకవచనంతో పిలిచే అర్హత నీకెక్కడిది?,–వందజన్మలెత్తినా జగన్ స్థాయికి చేరుకోలేవు. బాబు అధికారం కోసం చేసే నీ పోరాటం వృథానే’ అని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆళ్ల నాని ఏమన్నారంటే.. రాజకీయ అవగాహన లేని నాయకుడు పవన్ వారాహి అపజయ యాత్రలో భాగంగా పవన్కళ్యాణ్ నిన్న ఏలూరులో కొంతమంది జనసేన కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. రాజకీయపార్టీ పెట్టి పదేళ్లు దాటిన తరుణంలో తమ పార్టీ గురించి, తాము ఏ దశలో ఉన్నామో ఆపార్టీ అధినేతగా ఆయన కార్యకర్తలకు వివరిస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే, పవన్కళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగానే తన రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించుకున్నారు. ఆయనకు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై.. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. కేవలం, ఆయన మిడిమిడి జ్ఞానంతో వారాహి యాత్ర మొత్తం బూతులు, దూషణలతోనే సాగుతుంది. ప్రభుత్వ పనితీరుపై బురదజల్లే ఆరోపణలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకే పవన్కళ్యాణ్ పరిమితమయ్యాడు. ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా.. చివరికి ప్రజల్ని కూడా ‘మీరు నాకు ఓట్లేయలేదు’ అని తన అక్కసు వెళ్లగక్కిన పవన్కళ్యాణ్ తీరు అందరూ చూస్తున్నారు. వారాహి యాత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారు మొదటి యాత్రంటే ఏదో తెలిసీ తెలియనితనంతో ముగించాడనుకుందాం. రెండోవిడత యాత్ర ప్రారంభంతోనే నిన్న పవన్కళ్యాణ్ మరింత దిగజారిపోయి ప్రవర్తించాడు. ఆయన మాటల్ని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ వ్యక్తి అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేశాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిడుతున్నాడు. మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడుతాడు. చివరికి ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన ప్రజాసేవలందించే వాలంటీర్లను కూడా వదిలిపెట్టకుండా పవన్కళ్యాణ్ దూషిస్తున్నాడు. ఒక రాజకీయ సిద్ధాంతం, రాజకీయ లక్ష్యం లేకుండా వారాహి యాత్ర పేరుతో ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్కళ్యాణ్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏలూరు సభలో పవన్కళ్యాణ్ ఇక్కడి ప్రజల్ని ఉద్దరించే మాటలేమైనా చెబుతాడేమోనని అందరూ ఎదురుచూశారు. చంద్రబాబుతో కలిసి ఆయన రాబోయే కాలంలో ప్రజల్ని ఉద్ధరించడానికి ఎలాంటి మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నారోనని చూసినవాళ్లకు చివరికి నిరాశే మిగిలింది. ఏలూరు సభ నుంచే తాను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలుస్తానంటూ అదేదో ప్రజలకు మేలు చేసే మ్యానిఫెస్టో అంశంగా ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేసింది. పిచ్చిపిచ్చిగా నోటికొచ్చినట్లు వాగే పవన్కళ్యాణ్కు అసలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మనవి చేసుకుంటున్నాను. మా నాయకుడ్ని ఏకవచనంతో పిలవడానికి పవన్కళ్యాణ్ ఎవరు..? అసలు, నీ స్థాయి.. నీ అర్హతలేంటని ప్రశ్నిస్తున్నాను. గ్లామర్ తగ్గుతుందనే పాదయాత్ర చేయలేదా..? గతంలో ఒకసారి ఇదే పవన్కళ్యాణ్ పాదయాత్ర చేస్తానన్నాడు. కొంతకాలానికి నేను పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది. నా పాదయాత్రతో ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని ఆయన నోటితో కుంటిసాకులు చెప్పాడు. పాదయాత్ర ప్రతిపాదనను విరమించుకున్నాడు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న విషయమేంటంటే, ‘నువ్వు ప్రజల మధ్యకు వెళ్లే సువర్ణావకాశమైన పాదయాత్రను ఎందుకు కాదనుకున్నావు..? ఎండలో, వానలో తిరిగి ప్రజల మధ్య నలిగి నల్లగా నువ్వు కమిలిపోతే.. నీకు సినిమా అవకాశాలు రావనే భయంతోనే పాదయాత్ర చేయంది..? అంటే, నీకు ప్రజాసేవ చేయాలనే తపన లేదు కనుకనే ప్రజల మధ్య తిరిగే సువర్ణావకాశాన్ని గ్లామర్ కోసం వదులుకున్నావు.’ దీన్నిబట్టి చూస్తే నీకు ప్రజల మేలు కంటే... నీకు డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే ఎక్కువని అందరికీ అర్ధమవుతుంది కదా..? వందజన్మలెత్తినా జగన్ గారి స్థాయికి చేరుకోలేవు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై అవగాహన చేసుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇప్పటికే 99.5 శాతం మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారితో పవన్కళ్యాణ్కు ఎక్కడ పోలిక ఉంది..? నువ్వు వందజన్మలెత్తినా మా నాయకుడు జగన్ గారి స్థాయికి చేరుకోలేవు. లేనిపోని వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ లబ్ధిని పొందాలనుకునే వపన్కళ్యాణ్ ప్రయత్నాలు ఆకాశం మీద ఉమ్మేసిన చందంగా ఉంటాయనడంలో సందేహమేదీలేదు. పవన్ అబద్ధాలకు అంబేద్కర్ ఆత్మక్షోభిస్తుంది? పట్టుమని పది అసెంబ్లీ నియోజవర్గాల్లో పర్యటించక ముందే పవన్కళ్యాణ్లో అంత నిరాశా నిస్పృహలెందుకు..? ఎవరి మీద ఆయన అక్కసు..? ఈరోజు ఆయన సభకొచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా మా జగన్గారికే ఓటేస్తామని బహిరంగంగా చెబుతుంటే.. తనను ఎందుకు గెలిపించరని పవన్కళ్యాణ్లో అసహనం పెరిగిపోతుంది. అంబేద్కర్ మహానుభావుడి సాక్షిగా అన్నీ నిజాలే మాట్లాడుతానని చెబుతూ.. అన్నీ అబద్ధాలే మాట్లాడాడు నిన్న పవన్కళ్యాణ్. అయన మాట్లాడిన దూషణలకు ఆ అంబేద్కర్ మహానుభావుడే చిన్నబుచ్చుకుని ఆయన ఆత్మ క్షోభించి ఉంటుందని ప్రజలంతా అనుకున్నారు. వాలంటీర్లపై నీచపు మాటలా? వాలంటీర్ వ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నీచాతీ నీచంగా మాట్లాడిన పవన్కళ్యాణ్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన సంస్కరణల్లో సచివాలయాలు- వాలంటీర్ వ్యవస్థ ఒకటి. మహాత్మ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేరుస్తున్న ఈ వాలంటీర్లు ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి గడప వద్దకే తీసుకొస్తూ.. ప్రతీ ఇంటిలో ఒక అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్నగా కనిపిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి పవిత్రమైన వాలంటీర్ వ్యవస్థను అగౌరవపరచడానికి నీకు సిగ్గుందా.. పవన్కళ్యాణ్..? ఈరోజు ఎక్కడా పైసా అవినీతి లేకుండా ప్రభుత్వసేవల్ని పారదర్శకంగా అందిస్తున్న వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటికైనా నీ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని హితవు పలుకుతున్నాను. జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్కు ఇష్టమేమో..? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలంటూ... ప్రతీ పనికీ లంచం సమర్పించాలంటూ హుకుం చేసిన గత జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. చివరికి వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలన్నా కూడా గంటల తరబడి పడిగాపులుతో లంచాలిచ్చుకుని పింఛన్లు తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ జన్మభూమి కమిటీల అవినీతి అంతా ఇంతా కాదు. ఇవన్నీ అప్పట్లో ఈ పవన్కళ్యాణ్కు బాగా ఇష్టమైన కార్యక్రమాలుగా ఉన్నాయేమో..ఇవన్నీ ఏమీలేకుండా అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ఇప్పటి వాలంటీర్ వ్యవస్థంటే పవన్కు ఎందుకు నచ్చడంలేదు..? అత్యంత నిస్వార్థంగా జగన్ గారి స్ఫూర్తితో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ మహత్తరమైన ప్రజాసేవ చేసే వాలంటీర్లంటే మీకెందుకు కక్ష అని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్కళ్యాణే పెద్దక్రిమినల్ కోవిడ్ సమయంలో ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా చంద్రబాబు, పవన్కళ్యాణ్ లు.. హైదరాబాద్లో తమ ప్యాలెస్లలో కూర్చొన్నారు. అయితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్ని కోవిడ్ సమయంలో ఆదుకునే కార్యచరణ ప్రణాళికలో ఈ వాలంటీర్ల వ్యవస్థ భాగస్వామ్యం అయింది. వాలంటీర్లు అందరూ తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా ఇంటింటా సర్వేలు చేశారు. వైద్యసాయం అందించారు. ఆనాడు వాలంటీర్ల చొరవ కారణంగా ఇంటింటా ప్రభుత్వసేవలందాయి. అలాంటి వాలంటీర్లను పట్టుకుని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వాలంటీర్లను బ్రోకర్లు, క్రిమినల్స్ అంటూ పవన్కళ్యాణ్ మాట్లాడటానికి సిగ్గుందా..లేదా..? అని అడుగుతున్నాను. నిజానికి ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్కళ్యాణ్ అనే వ్యక్తే పెద్ద క్రిమినల్ అని చెబుతున్నాను. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను, తన భార్యాబిడ్డల్ని ఎవరో అసభ్యంగా మాట్లాడుతున్నారని మొసలికన్నీరు పెడుతున్నారే.. మరి, ఈరోజు మీరు వాలంటీర్లను పట్టుకుని బ్రోకర్లు, క్రిమినల్స్ అంటే వారి కుటుంబాలు రోధించవా..? వారి ఏడుపు మీకు శాపంగా మారదా..? అని ప్రశ్నిస్తున్నాను. కనుక, ఇప్పటికైనా నువ్వు ఫ్రస్టేషన్లో మాట్లాడిన మాటల్ని వెనక్కితీసుకుని వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు కోసం చేసే నీ పోరాటం వృథానే పట్టుమని పది నియోజకవర్గాల సమస్యలపై కూడా అవగాహన లేని పవన్కళ్యాణ్ ఎవరికోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో.. ఎక్కడ గెలుస్తాడో.. ఆయనకే దిక్కులేదు. మాటకొస్తే ప్రతీచోటా జగన్గారిని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నాడు కదా..? మరి, జగన్గారిని గద్దె దించితే.. ఆ తర్వాత గద్దెనెక్కేది ఎవరు..? పవన్కళ్యాణ్ మనసులో ఉన్నదేంటో బయటపెట్టాలి కదా..? చంద్రబాబును ఎక్కిస్తాడా..? లేదంటే, లోకేశ్ను గద్దెనెక్కిస్తాడా..? చంద్రబాబు అనే ప్రజాకంటకుడ్ని, దుర్మార్గుడ్ని అధికారంలోకి తెచ్చేదాకా పోరాటం చేస్తానని ఆరాటపడుతున్నాడు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లినా.. మా జగన్గారిని వ్యక్తిగతంగా దూషించినా.. ఊగినా తూగినా కూడా పవన్కళ్యాణ్ ప్రయత్నాలన్నీ వృథాప్రయాసే. ఎందుకంటే, గతంలో చంద్రబాబుతో జతకట్టి, అధికారంలోకి వచ్చాక, టీడీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలపై నోరుమెదపని పవన్కళ్యాణ్ అంటేనే ప్రజలకి విరక్తి కలిగింది. కనుక, ఇప్పుడు ఆయన ఎన్ని యాత్రలతో ప్రజల్ని నమ్మించాలని చూస్తే వారు నమ్మరుగాక నమ్మరని స్పష్టంచేస్తున్నాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 చోట్లా వైఎస్ఆర్సీపీకే ప్రజా మద్ధతు ఉంటుందని, మరలా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెబుతున్నాను. ఏలూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా నేను ఏలూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. నామీద పవన్కళ్యాణ్ ఏవేవో గాలిపోగేసి మాట్లాడినంత మాత్రానా ఎవరూ నమ్మరు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.150 కోట్లతో ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపాం. సుమారు రూ.500 కోట్లతో ఏలూరు మెడికల్ కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయంటూ పవన్కళ్యాణ్ ఏవేవో అవగాహరాహిత్యంతో మాట్లాడుతున్నాడు. గతంలో ఇక్కడ ఒక అంతుచిక్కని వ్యాధి ప్రబలినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు తరచూ సమీక్షలు జరిపి, ఢిల్లీనుంచి ఐసీఎంఆర్ నిపుణుల్ని పిలిపించి సర్వే చేయించి వారిచ్చిన నివేదిక ప్రకారం రూ.300 కోట్లతో ఏలూరుకు గోదావరి జలాల్ని తెచ్చే ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభించనున్నాం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. ప్రజలు వారాహిని అడ్డుకుని మీకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరిస్తున్నాను. -
నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్గా వీడియో కాల్స్ మాట్లాడి..
సాక్షి, ఏలూరు: సోషల్ మీడియాలో హాయ్ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ప్రతీరోజూ చాటింగ్, కాల్స్ చేసి ఆమెకు నమ్మకం కలిగించాడు. ఇంతలోనే నువ్వంటే ఇష్టమని మనసులోని మాట తనకు చెప్పేశాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు యువకుడు. వీడియో కాల్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వీడియోలు రికార్డు చేశాడు. అనంతరం.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రంగుల రాజాను అదుపులోకి తీసుకున్నాడు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన నవీన్.. ఇన్స్స్టాగ్రామ్లో హైదరాబాద్లో ఎంబీఏ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరుచు ఆమెతో చాటింగ్, కాల్స్ చేస్తూ చనువుతో మెదిలాడు. ఇలా కొద్దిరోజులు గడిచాక.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మనసులోని కపట ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు నవీన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో, స్పీడ్ పెంచిన నవీన్.. యువతితో చనువు పెంచుకుని వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా వీడియోలు తీసి రికార్డు చేసుకున్నాడు. ఇక, కొద్దిరోజులు గడిచిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్న వీడియోలను ఆమెకు చూపించిన బెదిరింపులకు దిగాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఆమె బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి బాధితురాలు దగ్గరి నుంచి రూ.25వేలు వసూలు చేశాడు. తాజాగా వీడియోలను అడ్డుపెట్టుకుని మరో లక్ష రూపాయాలు డిమాండ్ చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ ప్లాన్ చేశారు. తన ఇంటి వద్దే నవీన్కు డబ్బులు ఇస్తానని చెప్పి.. అక్కడికి రావాలని కోరింది. ఈ క్రమంలో నవీన్.. ఆమె ఇంటి వద్దకు రావడంతో.. అతడిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. నవీన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో, బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభలో చినరాజప్ప మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజీ కుప్ప కూలిపోయింది. దీంతో చినరాజప్ప, మాగంటి బాబు, పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్ కింద పడిపోయారు. పలువురు టీడీపీ నేతలు గాయపడ్డారు. వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చదవండి: ‘ఎల్లో మీడియా నుంచి స్క్రిప్ట్.. ఓ పథకం ప్రకారం కథ’ -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
ఆర్బీకేల పనితీరు బాగుంది
భీమడోలు: రైతులకు అనేక రకాల సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరు బాగుందని స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్ జితేంద్ర శ్రీవాత్సవ కొనియాడారు. స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా భీమడోలు, దుద్దేపూడి గ్రామ పంచాయతీలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ జె. వెంకట మురళీతో కలిసి జితేంద్ర శ్రీవాత్సవ సందర్శించారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై హౌసింగ్ అధికారులను అడిగారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సచివాలయ వ్యవస్థలోని ప్రతి విభాగం పనితీరు, అది ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, మత్స్యశాఖ సహాయకులు, ఇంజనీరింగ్ శాఖల సహాయకులు జాబ్చార్ట్తో పాటు వారు చేసే సేవలపై ఆరా తీశారు. మంచి స్పర్శ.. చెడు స్పర్శ (గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) కార్యక్రమంపై నువ్వేం చేస్తావు.. అంటూ మహిళా కానిస్టేబుల్ని ప్రశ్నించగా.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తోందని, తాను ఉన్నత పాఠశాలల బాలికలు, కళాశాలల్లో యువతులు, డ్వాక్రా మహిళలకు దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కలి్పస్తున్నానని ఆమె తెలిపింది. కియోస్క్ పనితీరుపై ఆరా.. ఆ తర్వాత రైతుభరోసా కేంద్రంలోని కియోస్క్ యంత్రాన్ని చూసిన ఆయన వీఏఏ (విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్) రూప నుంచి ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆరా తీశారు. కియోస్క్ యంత్రంలో రైతులు తమకు కావాల్సిన ఎరువులను బుక్ చేసుకుంటారని, వాటి నగదును చెల్లిస్తే రైతుల చెంతకే ఎరువులు చేరుకుంటాయని ఆమె వివరించారు. రైతులకు మద్దతు రేటుకే అందుబాటులో ఉంటున్నాయని, ఈ విధానంలేని తరుణంలో రైతులు దళారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకునేవారని ఎండీ జె. వెంకటమురళి ఆయనకు వివరించారు. అక్కడే ఉన్న సర్పంచ్ పాము సునీతామాన్సింగ్ను కియోస్క్ యంత్రం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతోందని ప్రశ్నించారు. ఆర్బీకే సేవలవల్ల రైతులు సంతృప్తికరంగా ఉన్నారని, ఈ విధానం లేనప్పుడు రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని సర్పంచ్ వివరించారు. దీంతో రైతుభరోసా కేంద్రాల పనితీరు బాగుందని, రైతులకు సంతృప్తికరమైన సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో జితేంద్ర శ్రీవాత్సవ మొక్కలు నాటారు. నూజివీడు సబ్కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఈడీ ఊరి్మళాదేవి, జెడ్పీ సీఈఓ కేవీఎస్ఆర్ రవికుమార్, డీపీఓ ఏవీ విజయలక్షి్మ, ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి
-
రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం.. అధికారులతో ప్రాజెక్ట్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్ -
ప్రపంచంలోనే భయం లేని జంతువు
దాదాపు 30 కిలోమీటర్ల మేర వినిపించేంత భీకరంగా అరిచే అరుదైన జీవి తేనె కుక్క. హనీ బ్యాడ్జర్గా పిలిచే ఈ వన్య జీవులు పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. చిన్నపాటి ఎలుగు బంటిని పోలినట్టుండే తేనె కుక్కలు సుమారు రెండేళ్ల క్రితం కర్ణాటకలోని కావేరి వన్య ధామంలో కనిపించాయి. ఇటీవల పాపికొండలు అభయారణ్యంలో సైతం వీటి జాడలు ట్రాప్ కెమెరాలకు భారీగానే చిక్కాయి. బుట్టాయగూడెం: తేనె కుక్కలుగా పిలిచే అరుదైన వన్యప్రాణి హనీ బ్యాడ్జర్ (రాటిల్) పాపికొండలు అభయారణ్యంలో కనువిందు చేస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా అడవుల్లో మాత్రమే గుర్తించిన ఈ జీవులు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోనూ ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. వీటి ఎత్తు కేవలం 12 అంగుళాలు. తల నుంచి తెలుపు, తెలుపు గీతలతో కూడిన మందపాటి.. దట్టమైన నల్లని బొచ్చును కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. తేనె కుక్కల పంజా గోళ్లు మూడు అంగుళాల వరకు పొడవు ఉన్నాయి. చూసేందుకు చిన్నపాటి ఎలుగుబంటి.. పెద్దగా ఉండే ముంగిసలా కనిపిస్తుంది. నడకలో మాత్రం కుక్కను పోలి ఉంటుంది. వీపుపై తెల్లని ఛాయలుండే నల్లని ఈ జీవి చూసేందుకు భీతి గొలుపుతుంది. ఈ జీవులకు పౌరుషంలో మరో వన్యప్రాణి సాటిరాదు. వీటికి అడవిలో లభించే తేనె తుట్టెల్లోని తేనెటీగ లార్వాలంటే ఎంతో ఇష్టం. అందుకే వీటికి హనీ బ్యాడ్జర్ అని పేరొచ్చింది. ఇతర కీటకాలు, కుందేళ్లను కూడా తింటాయి. వీటి ఆహారంలో 25 శాతం పాములే. కలుగుల్లో ఉండే కొండ ఎలుకల్ని సైతం ఇవి ఇష్టంగా తింటాయి. వీటిని చూస్తే జంతువులకు హడల్ తేనె కుక్కలను చూడగానే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు హడలిపోతాయి. ఇవి కనిపిస్తే వాటికి దారిచ్చి తప్పుకుని వెళ్లిపోతాయి. ఇవి చాలా ధైర్యం గల ప్రాణులు. వీటి చర్మం ఎలాస్టిక్ మాదిరిగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి. అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడగల జంతువు ఇది. పులి, చిరుత, కొండచిలువతోనైనా పోరాడుతుంది. పాము విషం కూడా వీటిని ఏమీ చేయలేదు. ప్రపంచంలోనే భయం లేని జంతువు హనీ బ్యాడ్జర్ ఒక్కటే అని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటి జీవిత కాలం ఏడేళ్లు మాత్రమే. వాసనను పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నిపర్ డాగ్ను మించిన నైపుణ్యం వీటి సొంతం. అరుదైన హనీ బ్యాడ్జర్ల సంచారం పాపికొండల అటవీప్రాంతంలో ఎక్కువగా∙ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 1,200 పైగా హనీ బ్యాడ్జర్లు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడి ట్రాప్ కెమెరాలలో చిక్కిన జాడలను బట్టి తెలుస్తోందన్నారు. వీటి సంతతి పెరుగుతోంది అరుదైన హనీ బ్యాడ్జర్లు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధైర్యమైన జంతువుగా దీనికి పేరుంది. తేనెటీగల లార్వాను చాలా ఇష్టంగా తింటాయి. పులి, చిరుతతో పాటు ఎటువంటి జంతువుతోనైనా ఎదిరించి పోరాడగలవు. వీటి సంతతి 1,200కు పైగా ఉన్నట్టు అంచనా వేశాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ఏలూరు జిల్లా -
వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
-
ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రీన్ఫీల్డ్ రయ్.. రయ్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది భూసేకరణతో కలిపి రూ.4,609 కోట్లతో ఈ ప్రాజెక్ట్ను ఖరారు చేయగా.. ఏలూరు జిల్లా పరిధిలో రూ.1,281.31 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. భారతీమాల ప్రాజెక్టులో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణతో కాకినాడ పోర్ట్ అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టు కీలకమైనదని కేంద్రానికి నివేదించి ఈ ప్రాజెక్ట్ మంజూరు చేయించింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు రూ.711.94 కోట్లను కేంద్రం కేటాయించింది. 53 కిలోమీటర్లు తగ్గనున్న దూరం ప్రస్తుతం ఖమ్మం–రాజమండ్రి నగరాల మధ్య దూరం 220 కిలోమీటర్లు. దీనిని 167 కిలోమీటర్లకు తగ్గించడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ఖమ్మం–రాజమండ్రి మధ్య దూరం 53 కిలోమీటర్లు తగ్గుతుంది. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి కల్లూరు మీదుగా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి ఆంధ్రాలో జీలుగుమిల్లిలోకి ప్రవేశించి జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం గోపాలపురం, కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంటుంది. నూతనంగా నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి ఖమ్మం, సత్తుపల్లికి దూరంగా రేచర్ల నుంచి నేరుగా ఆంధ్రాలోని చింతలపూడి మండలంలో ఎండపల్లి నుంచి రా«ఘవాపురం, రేచర్ల మీదుగా టి.నరసాపరం, గుర్వాయిగూడెం మీదుగా దేవరపల్లి రహదారిలో కలుస్తుంది. భూసేకరణ పూర్తి ఈ రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతోంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. 1,297 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్గా ఈ రహదారిని వర్గీకరించారు. గ్రీన్ఫీల్డ్తో జిల్లాకు ఉపయోగం గ్రీన్ఫీల్డ్ రహదారితో మెట్ట ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. ఆంధ్రా–తెలంగాణ మ«ధ్య నూతన రహదారి వల్ల దూరం తగ్గడమే కాకుండా తెలంగాణ, కాకినాడ పోర్టు అనుసంధానానికి ఉపయోగపడుతుంది. –కోటగిరి శ్రీధర్, ఏలూరు ఎంపీ