Farmers Welfare
-
రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్: సీఎం రేవంత్
నా ప్రాంత అభివృద్ధి, 25 వేల మంది యువతకు ఉపాధి కోసం కొడంగల్లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకున్నా. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు లగచర్లలో చిచ్చుపెట్టి అధికారులపై దాడులు చేయించారు. వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు వెళ్లారు. మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాడిని కాదు. తోడేళ్లు, పులులు ఎన్నో చూశా.. మానవ మృగాలు మీరెంత? నేను ఆనాడే చెప్పాను వాళ్లని నమ్మొద్దని. లగచర్లలో కేసులు ఎదుర్కొంటున్న వారు నా దగ్గరకు వస్తున్నారు. ఒక్క కేసీఆర్కే గజ్వేల్లో వెయ్యి ఎకరాల ఫామ్హౌస్ ఉంది. మా పారిశ్రామిక వాడ కోసం 1,300 ఎకరాలు ఉండొద్దా? నాడు అధికారులపై దాడులు చేసి ఉంటే సాగర్ వంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా? అభివృద్ధి కోసం కొందరు నష్టపోక తప్పదు. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రైతు సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని...వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ నుంచి ఇప్పుడు వరి ధాన్యానికి రూ.500 బోనస్ దాకా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ వస్తారో.. మాజీ సీఎం కేసీఆర్ వస్తారో.. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలసి వస్తారో... రండి... చర్చిద్దాం..’’ అని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ‘లగచర్ల’లో చిచ్చుపెట్టి అధికారులు, కలెక్టర్పై దాడులు చేయించారని... వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయారని పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు, స్టాళ్లను తిలకించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ప్రజలు గమనించాలి. గత పదేళ్లలో కేసీఆర్ కేవలం సాగునీటి ప్రాజెక్టులు, కాంట్రాక్టర్ల కోసం రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అందులో కాళేశ్వరానికే రూ.1.02 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతానని చెప్పారు. కానీ సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ కుప్పకూలిపోయాయి. అదే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో కట్టిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, మంజీరా, ఎల్లంపల్లి భద్రంగా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాకున్నా... వరుణుడి దయవల్ల 75 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర చర్రితలో, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 లక్షల కోట్ల టన్నుల వడ్లు తెలంగాణలో పండాయి. వరి వేస్తే ఉరేనని నాడు కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరి ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. దానితో బీఆర్ఎస్ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. రైతు కుటుంబాలకు రుణమాఫీ చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిత్రంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, అనిరు«ద్రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, తదితరులు. కేసీఆర్ రుణమాఫీ మిత్తీలకే పోయింది.. కేసీఆర్ మొదట ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ అన్నారు. నాలుగు విడతలు అన్నారు, మిత్తి తాను కడతానన్నారు. మళ్లీ 2018–23 వరకు లక్షన్నర రుణమాఫీ చేస్తానన్నారు. మొదటి నాలుగేళ్లు పైసా ఇవ్వలేదు. ఆఖరి ఏడాదిలో ఔటర్ రింగ్ రోడ్డును రూ.7,500 కోట్లకు తెగనమ్మి మాఫీ డబ్బులు వేశారు. ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది రూ.11 వేల కోట్లే. అందులో రూ.8,596 కోట్లు మిత్తిలకే పోయాయి. రైతులకు చెల్లించింది రూ.2,500 కోట్లే. హరీశ్రావు ఇది విను.. లెక్కలు కావాలంటే మళ్లీ చెబుతాం. సవాల్ చేస్తున్నా... ఎవరు వస్తారో రండి.. కేసీఆర్కు ఈ వేదికగా సవాల్ విసురుతున్నా. 25 రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు మొత్తం రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. మోదీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి.. అసెంబ్లీలో చర్చిద్దాం. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచి్చన చరిత్ర మాది.. రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్.. వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్. అసలు రైతు సంక్షేమమే కాంగ్రెస్ పేటెంట్. పని చేయడమే మాకు తెలుసు.. పనిలోపడి చేసింది చెప్పుకోలేకపోతున్నాం. నాకీ పదవి ఆషామాషీగా రాలేదు.. కేసీఆర్.. పాలమూరు బిడ్డలు నిన్ను పల్లకీలో మోసి ఎంపీని చేశారు. పాలమూరు ప్రజలు ఆదరిస్తే సీఎం అయ్యానని చెప్పి పదేళ్లు మోసం చేశావు. నాడు పాలమూరును దత్తత తీసుకుంటా అన్నారు. కానీ పదేళ్ల పాలనలో ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఇవాళ మేం నారాయణపేట–మక్తల్–కొడంగల్ ప్రాజెక్టు చేపడితే వద్దంటున్నావ్. కాళ్లలో కట్టెలు పెడుతున్నావ్. ఎందుకీ ద్వేషం. నేను రైతు బిడ్డగా కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరి రాష్ట్రానికి సీఎంగా ఇక్కడికి వచ్చా. నాకీ పదవి ఆషామాషీగా వచ్చింది కాదు. ఒక బాధ్యత. పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి, రోశయ్య, కేసీఆర్ చేసిందేమీ లేదు. మేం అభివృద్ధి చేసుకోలేమా? నేను ఇక్కడే పుట్టినోడిని, ఇక్కడి మట్టిలో కలిసే వాడిని.. సీఎంగా ఉండి నా జిల్లాకు ఏమీ చేయకపోతే చరిత్ర క్షమిస్తుందా? ఎవరు అడ్డం వచి్చనా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తెస్తా. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించేవరకు గ్రీన్చానల్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మార్పు కోసం వేసిన ఓటు అభయహస్తమైందిసాక్షి, హైదరాబాద్: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (నవంబర్ 30) పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్కెళ్లి మార్పు కోసం ఓటేశాడని, ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా.. ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్... రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్.. రూ.1,433 కోట్ల రైతుబీమా.. రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం.. రూ.10,547 కోట్ల ధాన్యం కొను గోళ్లు.. ఇలా ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం..’’ అని రేవంత్ పేర్కొన్నారు.పాలమూరుకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు తెచ్చుకుందాం పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డుపడుతున్నారు. ఎవరో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడం కాదు. మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరి దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుకోవద్దా? ఒకే సంతకంతో మన జిల్లాకు కావాల్సిన అన్నీ తెచ్చుకుందాం. ఏడాదికి రూ.20 వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరఫున మంత్రివర్గాన్ని అడుగుతా. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చుకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా? కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు తీసుకెళ్లారు. అలాంటిది మన గడ్డ అభివృద్ధికి లక్ష కోట్లు తెచ్చుకోలేమా? కచి్చతంగా తెచ్చుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాల్లో నీరు పారించి సస్యశ్యామలం చేస్తాం. -
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్ఎఫ్ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్ఎఫ్ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్పవర్గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్ఎఫ్ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్ఎఫ్ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్ఎఫ్ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
రైతాంగం కోసం రూ.879 కోట్ల భారీ ప్రాజెక్టు
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. రూ.879.75 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆవిష్కరించింది. నిర్థేశిత ఉత్పత్తులకు క్లస్టర్లను అభివద్ధి చేసి అన్నదాతల ఆదాయాభివృద్ధి, పంట చేతికి వచ్చిన తర్వాత ఎదుర్కొనే నష్టాల నివారణే లక్ష్యంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ చేపట్టినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే ఐదేళ్లలో గుర్తించిన ఐదు ఉత్పత్తుల ధర, నాణ్యత, బ్రాండింగ్, స్థిరత్వాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా, వాల్యూ అడిషన్లలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 17 జిల్లాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధి ప్రాజెక్టు ప్రోగ్రామ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఆయా జిల్లాల్లో మార్కెటింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్టేక్ హోల్డర్ల అభివృద్ధి, అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాం కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బడ్టెట్ లో రూ.879.75 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల 7,030 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రతియేటా రూ.1,436.04 కోట్ల ఆదాయం లభించే 34 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డీజీ మంగల్ రాయ్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.పంట అనంతర నష్టాలు, సవాళ్లను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుందని అంటున్నారు అడిషనల్ చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లోహ్. -
రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు: వై.ఎస్. షర్మిల
సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. రాష్ట్రంలో కల్లాలపైనే రైతుల గుండెలు ఆగిపోతున్నా, పురుగుమందు తాగి నురగలు కక్కి చచ్చిపోతున్నా..పట్టించుకోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దొరకు పంజాబ్, హరియాణా రైతులే కనబడతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు,రిజర్వాయర్లు కాదని, కే అంటే ‘కన్నీళ్లు’, సీ అంటే ‘చావులు’, ఆర్ అంటే ‘రోదన’లు అని, బీఆర్ఎస్ అంటే రైతులకు భరోసా ఇవ్వని బందిపోట్ల రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. భూస్వాములకు రూ.లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిదని, బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. -
ఏపీలో రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు అద్భుతం
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను వింటుంటే నిజంగా ఆశ్చర్యమేస్తోందని.. ఇక్కడి పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ దేశం ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆధునిక సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసేందుకు ఊతమిచ్చేలా ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్ర న్ ఆస్ట్రేలియా వర్సిటీలతో ఎన్జీ రంగా వర్సిటీ సోమవా రం ఎంవోయూ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్, పార్లమెంటరీ కార్యదర్శి సమంతారో సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ల్యాబ్ టూ ల్యాండ్ కాన్సెప్ట్ కింద ఆర్బీకేల ద్వారా పరిశోధనా ఫలితాలను నేరుగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా మంత్రి తప్పకుండా ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, మర్డోక్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఆండ్రూ డీక్స్, డిప్యూటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పీటర్ డెవిస్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందంతో ప్రయోజనాలివే.. ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలతో అవగాహన ఒప్పందం వల్ల ఎన్జీ రంగా వర్సిటీ విద్యార్థులు అక్కడకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు అక్కడ పరిశోధనలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యూనివర్సిటీలకు చెందిన వి ద్యార్థులు ఇక్కడ మన వర్సిటీలో పరిశోధనలు చేసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ అధ్యాపక బృందం అక్కడకు వెళ్లి శిక్షణ పొందడంతోపాటు పరిశోధనా ఫలాలను పరస్పరం అందిపుచ్చుకోవచ్చు. -
Rythu Bharosa Kendralu: ఆర్బీకే ఓ అద్భుతం!
సాక్షి, అమరావతి, గన్నవరం/కంకిపాడు/ పెనమలూరు: వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా వ్యవహరిస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం అభినందించింది. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయతగ్గవని, వాటిపై అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తామని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఖ్యాతి సాధించిన ఆర్బీకేల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులందరికీ ఆ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. నిపుణుల బృందం బుధవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం, కంకిపాడు మార్కెట్ యార్డులోని వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, వణుకూరులోని ఆర్బీకేని పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసింది. రైతులను స్వయంగా పలుకరించి అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై వ్యవసాయం, రైతు సంక్షేమంపై చర్చించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)తో భాగస్వామి అయ్యేందుకు అభ్యంతరం లేదన్నారు. నష్టపోతున్న రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్ పొందుపర్చాలని సూచించారు. మోడల్ ఖరారు కాగానే కేంద్రంతో కలసి పాలు పంచుకుంటామన్నారు. కృష్ణాజిల్లా వణుకూరు ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను తెలుసుకుంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ ఇలాంటివి ఎక్కడా చూడలేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అద్భుతమని, ఇలాంటి వ్యవస్థను ఇంతవరకు ఎక్కడా చూడలేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా ప్రశంసించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన అగ్రిల్యాబ్స్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. అగ్రిల్యాబ్స్లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా విత్తనాలు, ఎరువుల్లో ఎక్కడైనా కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా తెలియజేయాలని కోరారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులను హెచ్చరించి కల్తీల బారినుంచి కాపాడుకోవచ్చన్నారు. పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు చాలా బాగున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ వినియోగించుకుంటున్న తీరు అమోఘమన్నారు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుందని అహూజా ప్రశంసించారు. ఈ–క్రాపింగ్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని, టెక్నాలజీని మిళితం చేసి రైతులకు చక్కటి ప్రయోజనాలు అందిస్తున్నారని చెప్పారు. రైతు క్షేత్రం (ఫామ్గేట్) వద్దే కొనుగోళ్లు, ఆర్బీకేల స్థాయిలోనే పంటల విక్రయం లాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేయడాన్ని స్వాగతించారు. ఆర్బీకేల స్థాయిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ఏర్పాటు ఎంతో మంచి ఆలోచనన్నారు. సామాజిక తనిఖీల కోసం అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్న విధానం పారదర్శకంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు విద్యా రంగంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులను సైతం తమతో పంచుకున్నారని పేర్కొంటూ విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృషిని అభినందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ మనోజ్ అహుజాకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాల్ సెంటర్, ఆర్బీకే, అగ్రిల్యాబ్ను సందర్శించిన బృందం నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటైన ఆర్బీకేలు నిజంగా గొప్ప ఆలోచన అని మనోజ్ అహూజా పేర్కొన్నారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను సందర్శించిన అనంతరం రైతు భరోసా కేంద్రం లైవ్ స్టూడియోను ఆయన పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా శాస్త్రవేత్తలు వెంటనే సలహాలు, సూచనలు అందిస్తుండటాన్ని ప్రశంసించారు. రైతులు ఫోన్ చేసినపుడు ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటిæ సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలను నిశితంగా గమనించారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరులో ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించారు. పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ధాన్యం కొనుగోలు తదితర సేవలు అందుతున్నాయన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సీఎం జగన్ ఆర్బీకేలను ఏర్పాటు చేసిన తరువాత రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. కియోస్క్ ద్వారా రైతులే స్వయంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించడాన్ని బృందం పరిశీలించింది. ఆర్బీకేలకు ఐఎస్ఓ నాణ్యత ప్రమాణ పత్రం లభించడం ఉత్తమ పనితీరుకు నిదర్శనమని బృందం సభ్యులు పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతు భరోసా రథం. వెటర్నరీ మొబైల్ వాహనాన్ని సైతం పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. అక్కడ నుంచి కంకిపాడు చేరుకుని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను పరిశీలించారు. పైసా ఖర్చు లేకుండా ఇన్పుట్స్ను ముందుగానే పరీక్షించుకుని కల్తీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. మట్టి నమూనాల పరీక్షలు, విత్తన సేకరణ, నాణ్యత పరిశీలనపై ల్యాబ్ సిబ్బందిని బృందం అడిగి తెలుసుకుంది. కేంద్ర బృందం సభ్యులైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్కరన్లతో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఆర్బీకేల జేడీ శ్రీధర్ కార్యక్రమంలో పొల్గొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం రైతులకు గరిష్ట ప్రయోజనం అందాలి: సీఎం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో పాటు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర దక్కని సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ఎంతో బాగుందని, ఈ పథకం పీఎంఎఫ్బీవైతో భాగస్వామిగా మారితే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అహూజా సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే రైతులకు గరిష్ట ప్రయోజనాలతో మంచి మోడల్ రూపొందించాలని సూచించారు. -
వ్యవసాయ వర్సిటీకి మొదటి స్థానం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలవగా, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 2021–22 విద్యాసంవత్సరంలో వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎన్జీ రంగా, హార్టి కల్చర్ అండ్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ కేటగిరీలో ఉద్యాన వర్సిటీ ఈ అవార్డులను దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పర్షోత్తమ్ఖడోభాయ్ రూ పాలా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రి లోచన్ మహాపాత్ర చేతుల మీదుగా ఎన్జీ రంగా, ఉద్యాన వర్సిటీ వీసీలు డాక్టర్ ఎ.విష్ణువర్ధన్రెడ్డి, డాక్టర్ టి.జానకీరామ్ అందుకున్నారు. ఆయా కేటగిరీల్లో అత్యధిక పీజీ స్కా లర్షిప్లు మన రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు పొందారు. జాతీయ స్థాయిలో 63 వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పోటీపడిన ఎన్జీ రంగా వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా, ఏడు ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బెంగళూరు ఉద్యాన వర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రెండో స్థానం దక్కించుకుంది. -
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల
-
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
-
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు చెల్లించాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. ఒకేసారి మూడు పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నామన్నారు. (చదవండి: మాది రైతు పక్షపాత ప్రభుత్వం: సీఎం జగన్) ముఖ్యమంత్రి ఏమన్నారంటే... ‘‘ వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, యంత్రసేవా పథకం... ఈ మూడు పథకాలకోసం రూ. 2190 కోట్ల లబ్ధి. వరుసగా మూడో సంవత్సరం.. రెండో విడత కింద రూ.2052 కోట్ల రూపాయలను జమచేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా రెండో విడతగా ఆగస్టు మాసంలో రూ. 977 కోట్లు ఇచ్చాం. కేవలం ఈ ఒక్క రైతు భరోసా కింద మాత్రమే రూ.18,777కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా కూడాలేని విధంగా, జరగని విధంగా సొంత భూములను సాగుచేసుకుంటున్న రైతులతోపాటు, కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 6,67లక్షల రైతులకు రూ.112 కోట్లకుపైగ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం. ఏడాదిలోపే పంటరుణాలు చెల్లించిన వారికి.. వారు కట్టీని వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమచేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటిన నుంచి సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1674 కోట్ల రూపాయలు ఇచ్చాం. 10778 రైతు భరోసా కేంద్రాల్లో 9160 మంది బ్యాంకింగ్ కరస్పాండెట్లను కూడా పెట్టాం. మిగిలిన చోట్లా కూడా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కౌలు రైతులతో సహా.. రైతులందరికీ కూడా బ్యాంకు లావాదేవీలు జరుపుకునేందుకు, రైతుల పంటరుణాలు అందుకునేందుకు బ్యాకింగ్ కరస్పాండెంట్ల సేవలు మీకు బాగా ఉపయోగపడతాయి. వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీతోపాటు వైయస్సార్ యంత్రసేవా పథకం కింద 1720 గ్రూపులకు రూ. 25.55 కోట్ల రూపాయలు నేడు జమ చేస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు. ♦రాష్ట్రవ్యాప్తంగా రూ.2134 కోట్లతో రైతు భరోసా కేంద్రాల్లో యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1035 కంబైన్డ్ హార్వెస్టర్లను పెడుతున్నాం ♦29 నెలల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం ♦దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమ సైతం.. నీటితో పుష్కలంగా ఉంది ♦రైతుకు ఇంతకుముందు కరువులు, కాటకాలు మాత్రమే తెలుసు ♦కరోనా సవాల్ విసిరినా.. రైతు అడుగు ముందుకేస్తున్నాడు ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం ♦వ్యవస్థలను సరిదిద్దుతున్నాం ♦మార్కెటింగ్ మీద విపరీతమైన శ్రద్ధ కూడా పెట్టాం ♦ధరల స్థిరీకరణ నిధిని కూడా తీసుకు వచ్చాం ♦పొగాకుకు కూడా ధరల స్థిరీకరణను వర్తింప చేస్తాం ♦జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాం ♦విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా అన్నింట్లోనూ కూడా రైతులను చేయిపట్టుకుని ఆర్బీకేలు నడిపిస్తున్నాయి ♦ఇలాంటి గొప్ప మార్పులు తీసుకు వస్తున్నాం ♦వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేస్తాం ♦ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి.. నాలుగు అంచెలుగా సమావేశాలు ఏర్పాటు చేశాం ♦సలహాలు, సూచనలతో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాం ♦ఇ- క్రాపింగ్ అన్నది.. ప్రతి రైతుకు, ప్రతి పంటకూ నమోదు చేసుకోవడం ద్వారా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట కొనుగోలు, పంటరుణాలు, సున్నావడ్డీలు ఇవన్నీ కూడా పారదర్శకంగా అందిస్తున్నాం ♦ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రతి పథకానికి ఇ- క్రాపింగ్ ద్వారా అనుసంధానం చేస్తున్నాం ♦యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦గ్రామ స్థాయిలో వ్యవసాయాన్ని యాంత్రీకరిస్తున్నాం ♦ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకులను ఉంచాం ♦ప్రతి సేవను వారిద్వారా అందిస్తున్నాం ♦సహకార వ్యవస్థలో హెచ్ఆర్విధానాన్ని తీసుకు వస్తున్నాం ♦ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలను కంప్యూటరీకరిస్తున్నాం ♦సీఎం యాప్ద్వారా.. రైతులు ధరల విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే.. వెంటనే వారిని ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకునేందుకు అడుగులు ముందుకేస్తున్నాం ♦ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే కనీస గిట్టుబాటు ధరలను వర్తింపు చేయడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఎంఎస్పీ వర్తింపు చేస్తున్నాం: ♦ఇవన్నీ చేయడానికి గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది ♦కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్లు మంజూరుచేస్తూ... వ్యవసాయ మార్కెట్లను కూడా ఆధునీకరిస్తున్నాం ♦కల్తీ నివారణమీద మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్టుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు ♦కల్తీలేని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నాం ♦ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా కల్తీలేని వాటిని అమ్మేలా చర్యలు తీసుకుంటున్నాం ♦పగటిపూటే రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.18వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశాం ♦ఇది కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన మరో రూ.10వేల కోట్ల బకాయిలను కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది ♦నాణ్యమైన కరెంటు ఇచేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీడర్ల అభివృద్ది కోసం రూ.1700 కోట్ల రూపాయలు కూడామనం ఖర్చు చేశాం ♦29 నెలల కాలంలో వైయస్సార్ ఉచిత పంటల భీమా ద్వారా 31.7లక్షలమంది రైతులకు రూ. 3716 కోట్ల రూపాయలు అందించగలిగాం ♦ఇది కాక ధాన్యం సేకరణకోసం రూ.35వేల కోట్ల పైచిలుకు ఖర్చుచేశాం ♦మరో రూ.1800 కోట్ల రూపాయలతో పత్తిపంటను కూడా కొనుగోలు చేశాం ♦ఇతర పంటలకోసం రూ.6400 కోట్లకుపైగా ఖర్చు చేశాం ♦ధరలు పడిపోకూడదు.. రైతు నష్టపోకూడదని.. ఈ కార్యక్రమాలు చేశాం ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలను కూడా రైతుల కోసం మన ప్రభుత్వం కట్టింది ♦గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల రూపాయల విత్తన బకాయిలను కూడా మనమే చెల్లించాం ♦ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్లో అందించేలా చేస్తున్నాం ♦ఇన్పుట్ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్లో నే ఇచ్చే కొత్త ఒరవడిని తీసుకు వచ్చాం ♦ఏపీ అమూల్ పాలవెల్లువను తీసుకు రాగలిగాం ♦ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ కింద రూ.1.5కే యూనిట్ అందిస్తున్నాం ♦రెండు సంవత్సరాల్లో రూ.1560 కోట్లు సబ్సిడీ రూపంలో ఆక్వారైతులకు ఇచ్చాం ♦రైతన్నల ఆత్మహత్యలు చూడ్డానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే.. మన రైతు భరోసా కేంద్రాలను చూడ్డానికి ఇతర రాష్ట్రాలనుంచి బృందాలు వస్తున్నాయి ♦సకాలంలో మంచి వర్షాలు పడాలని, వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను -
రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగు కోసం వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమై తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 40 శాతం సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ నగదు జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు.మాది రైతు పక్షపాత ప్రభుత్వం. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) 50.37 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా ఖరీఫ్ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీన్లో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది. (చదవండి: ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..) ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు 2019–20లో 45.23 లక్షల మంది కుటుంబాలకు రూ.6,162.45 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో 49.40 లక్షల మంది రైతులకు రూ. 6,750.67 కోట్లు అందజేసింది. అటవీభూమి సాగుచేస్తున్న వారితోపాటు కౌలుదారులు కలిపి తొలి ఏడాది 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది లబ్ధిపొందారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా మే 13న రూ.3,811.96 కోట్ల సాయమందించిన ప్రభుత్వం రెండోవిడతగా నేడు 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్లు అందిస్తోంది. భూమిలేని 1.50 లక్షల మందికి భరోసా ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86,361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది లబ్ధిపొందుతున్నారు. మూడేళ్లుగా లబ్ధి పొందుతున్న వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రెండోవిడత సాయంతో కలిపి 2019 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు రూ.18,777 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. (చదవండి: దీపావళికి ప్రత్యేక వారాంతపు రైళ్లు) పారదర్శకంగా అర్హుల ఎంపిక ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న సంకల్పంతో అర్హుల గుర్తింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోంది. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అర్హులై ఉండి లబ్ధిపొందని వారి వివరాలను గ్రీవెన్స్ పోర్టల్లో పొందుపరిచి వారిలో అర్హులను గుర్తిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నివసిస్తూ మన రాష్ట్రంలో వ్యవసాయ భూములు ఉన్న 865 మంది రైతులకు కూడా ఈ ఏడాది రూ.13,500 వంతున రైతుభరోసా సాయం అందించారు. 6.67 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీమేరకు వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు కూడా చెల్లిస్తూ రైతులకు బాసటగా ఉండటమేగాక ఏడాది తిరక్కుండానే ఈ వడ్డీ రాయితీ సొమ్మును జమచేస్తోంది. ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీ సొమ్మును నేడు ముఖ్యమంత్రి వారిఖాతాల్లో జమచేస్తున్నారు. 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 50 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేసింది. ఖరీఫ్–2019 సీజన్లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ–2019–20 సీజన్లో 5.55 లక్షల మందికి రూ.92.38 కోట్లు చెల్లించింది. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా.. ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి ఈ–క్రాప్లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించాలని సంకల్పించారు. ఈ సీజన్లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వీరిలో 6.67 లక్షల మంది సున్నావడ్డీకి అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలను సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఇలా అర్హత పొందినవారి ఖాతాలకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కింద రూ.112.70 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. యాంత్రీకరణకు చేయూత చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను నేడు రైతు గ్రూపులకు జమ చేసింది. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఇప్పటికే 789 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించగా, తాజాగా మరో 1,720 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను (సీహెచ్సీలను) ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలతో 10,750, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలతో కూడిన 1,035 యంత్ర సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం కింద రూ.2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతుగ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తంలో 854 కోట్లు (40 శాతం) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుండగా, 10 శాతం (రూ.213 కోట్లు) రైతు కమిటీలు భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతం (1,067 కోట్లు) బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. తొలివిడతగా గ్రామస్థాయిలో 3,250 సీహెచ్సీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కాగా ఇప్పటికే 789 సీహెచ్సీలను రైతు దినోత్సవం రోజైన జూలై 8వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి రూ.9.07 కోట్ల సబ్సిడీని జమచేశారు. తాజాగా రూ.69.87 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో 1,720 యంత్ర సేవాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి 40 శాతం సబ్సిడీ మొత్తం రూ.25.55 కోట్లను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. -
ఏపీ పథకాలు దేశంలోనే ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి తెలిపారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును రైతులు ఎన్నటికీ నమ్మరని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీ లేదన్నారు. పైగా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువే అన్నారు. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పండగ చేశారని చెప్పారు. ఆ మహానేత కుమారుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును రాజును చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఏం చెప్పారంటే.. ► రాష్ట్రంలో ఖరీఫ్లో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట వేరుశనగ. 2014–15 నుండి ఇప్పటి దాకా ఈ పంట వివరాలు తెప్పించుకుని చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి. ► రాయలసీమలో కేవలం 3 శాసన సభ స్థానాలకే టీడీపీని ప్రజలు పరిమితం చేశాక కూడా, అక్కడి ప్రజలను ఇంకా మోసం చేసేందుకు టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తుండటం దారుణం. ► కరువు, చంద్రబాబు కవల పిల్లలుగా సాగిన పాలన అందరికీ తెలుసు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని.. పగటి పూటే తొమ్మిది గంటలు నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఈ విషయాలు రైతులెవరూ మరచిపోరు. ► ఇలాంటి చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ రోజు వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. కోవిడ్ సంక్షోభంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రకటించిన సమయానికి పథకాలు అమలవుతున్నాయి. ► క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కనిపిస్తే, ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. నిర్మాణాత్మక ప్రతి పక్షంగా వ్యవహరించకపోగా.. కుల, మతాల పేరుతో, అబద్ధపు ప్రచారాలతో లబ్ధిపొందేందుకు యత్నిస్తున్న ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడటం దేశంలో ఇదే ప్రథమం. -
Andhra Pradesh: ఆర్బీకేలు గొప్ప ప్రయోగం... దేశం మొత్తం మీవైపు చూస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) ద్వారా అమలవుతున్న వివిధ పథకాల అమలుతీరును పరిశీలించేందుకు మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రెండ్రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించింది. ఎన్ఎఫ్ఎస్ఎం కింద 100% సబ్సిడీపై పంపిణీ చేసిన కంది, మినుము, పెసర, నూనె గింజల మినీ కిట్ల ద్వారా సాగవుతున్న పంట క్షేత్రాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇక్కడ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రశంసలు కురిపించింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట పంట ప్రదర్శన క్షేత్రాల పరిశీలన.. గుంటూరు జిల్లా విట్టంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, ములకనూరులలో కంది క్లస్టర్ ప్రదర్శన క్షేత్రాలను, వెంగళాయపాలెంలో హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో క్లస్టర్ డెమోతో పాటు ఎల్లమంద గ్రామంలోని పొలంబడి క్షేత్రాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం.. కృష్ణాజిల్లా చంద్రగూడెంలో పత్తి, కోడూరులో కంది ప్రదర్శన క్షేత్రాలతోపాటు తుమ్మలపల్లిలో వరి పొలంబడి క్షేత్రాన్ని సందర్శించారు. అంతర పంటల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఆరా తీయగా, ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు వివరించారు. క్షేత్రాల వద్ద రిజిస్టర్ల నిర్వహణ, బోర్డుల ఏర్పాటును పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఆర్బీకే, అగ్రిల్యాబ్స్ సందర్శన గుంటూరు జిల్లా నూజెండ్ల రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే), కృష్ణాజిల్లా ఎ.కొండూరు అగ్రి ల్యాబ్లను కూడా బృందం సభ్యులు సందర్శించి వీటి ద్వారా రైతులకందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నామని సిబ్బంది చెప్పగా.. నిజంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బుక్ చేసిన 24 గంటల్లోనే అందిస్తున్నారని రైతులు బదులిచ్చారు. కియోస్క్లను రైతులు ఎలా వినియోగించుకుంటున్నారో ఆరా తీశారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సేవలు, పంటల వారీగా లైబ్రరీలో ఉంచిన పుస్తకాలు, వీడియోలను పరిశీలించి చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఎ.కొండూరు అగ్రిల్యాబ్తో పాటు ల్యాబ్లోని అత్యాధునిక టెస్టింగ్ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. చదవండి: రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది! త్వరలో కేంద్రానికి నివేదిస్తాం ‘ఇలాంటి అత్యాధునిక ల్యాబ్లను దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం. ముందుగా నాణ్యత పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాత పంపిణీ చేయడంవల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది’.. అని పొన్నుస్వామి అన్నారు. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్స్ దేశానికే రోల్ మోడల్గా ఉన్నాయన్నారు. ఈ వివ్లవాత్మక మార్పులతో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. ఇక్కడ అమలుచేస్తున్న కొన్ని కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బృందం వెంట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు ఎన్సి బాలునాయక్.. కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశం మొత్తం మీవైపు చూస్తోంది ► ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక అగ్రిల్యాబ్స్ (33) తమిళనాడులోనే ఉన్నాయనుకునే వాణ్ణి. కానీ, మీ రాష్ట్రంలో ఏకంగా 160 ల్యాబ్స్ను తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో ఏర్పాటుచేశారంటే నమ్మలేకపోతున్నా. చాలా బాగున్నాయి. సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలు నిజంగా గొప్ప ప్రయోగం. గ్రామస్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని కచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో దేశం మొత్తం మీవైపు చూస్తోంది. ఇక్కడి యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. – డాక్టర్ కె. పొన్నుస్వామి, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ జేడీ, జాతీయ ఆహార భద్రతా మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి -
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 60 రైతుబజార్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త రైతుబజార్లు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా వీటి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆరు రైతుబజార్లను వినియోగంలోకి తీసుకురాగా మిగిలిన వాటిని డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో 107 రైతుబజార్లున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 11వేల మంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీరోజు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల కూరగాయలను రైతులు గిట్టుబాటు ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో రైతుబజార్లో ప్రతిరోజు రూ.20 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతుబజార్లకు ప్రజలు బాగా అలవాటుపడ్డారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెండింగ్ పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. స్థలాలు అందుబాటులో లేకపోవడం.. ఆర్థిక పరిస్థితుల సాకుతో గత ప్రభుత్వం కొత్త రైతుబజార్ల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో.. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు.. ఎక్కువ మందికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో కొత్త రైతుబజార్లకు సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.52.02 కోట్లతో 60 రైతుబజార్లను ఏర్పాటుచేస్తోంది. వీటిలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం, ఆలమూరు, వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆత్మకూరు, ఆళ్లగడ్డలలో రైతుబజార్లను దివంగత మహానేత వైఎస్సార్ జయంతి రోజైన రైతు దినోత్సవం నాడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మిగిలిన 54 రైతుబజార్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వీటి కోసం అవసరమైన స్థలాలను గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 16, కృష్ణాలో 10, చిత్తూరులో 8, వైఎస్సార్ జిల్లాలో 5, ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో మూడేసి, అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఈ రైతుబజార్ల ద్వారా కనీసం 6వేల మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
రైతు పక్షపాతి సీఎం జగన్
రాయదుర్గం: ఉచిత విద్యుత్తో పాటు జలయజ్ఞం ద్వారా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారని, తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఏపీ విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్ , వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం వల్ల ఉపయోగం లేదని, ఉచిత విద్యుత్ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారన్నారు. కానీ వైఎస్సార్ అధికారం చేపట్టిన వెంటనే రైతులను బతికించుకోవడం కోసం ఉచిత విద్యుత్తో పాటు ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారని గుర్తు చేశారు. అన్నదాతల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన వైఎస్సార్ జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తండ్రి ఒక అడుగు ముందుకేస్తే , తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సంక్షేమం కోసం వంద అడుగులు ముందుకేస్తున్నారని కొనియాడారు. కరోనా వచ్చినా , కష్టం వచ్చినా రైతు సంక్షేమ పథకాలు ఆపలేదని, రైతు సంక్షేమ ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. రైతుల అభివృద్ధికి పాటుపడుతున్న తమ ప్రభుత్వం రాయదుర్గంలో నేడు రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తోందన్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మిస్తున్న గోడౌన్లు, రైతు భరోసా కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, రైతు బజార్లు తదితర వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడారు. -
Andhra Pradesh: వేగంగా అగ్రి ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల అభివృద్ధిని కాంక్షించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, వారికి మరింత ప్రయోజనం కలిగించే దిశగా అగ్రి ప్రాజెక్టులన్నింటినీ నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.15,743 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వారు ఏ అవసరానికైనా ఊరు దాటి వెళ్లకుండా అన్ని వసతులు కల్పించాలన్నదే మనందరి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి అండగా నిలిచామని.. ఆధునిక వ్యవసాయ పరికరాలు, యాంత్రీకరణను వారికి అందుబాటులోకి తేవడం ద్వారా మరింత చేయూత ఇచ్చే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఎక్కడికక్కడ పంటలను ప్రాసెస్ చేయడం ద్వారా రైతులకు మంచి ధర వస్తుందని, ఇందు కోసం గ్రామ స్థాయిలో విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని విధాలా వీలైతే అన్ని విధాలా రైతులకు అండగా నిలవాలన్నదే మనందరి ప్రభుత్వ తాపత్రయమని, అందువల్ల అధికారులు వీటన్నింటిపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలని సూచించారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలతో ఎంతో మేలు ► మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు (ఎంపీఎఫ్సీ) రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్దే ఏర్పాటవుతున్నాయి. ఇందులో భాగంగా డ్రై స్టోరేజీ–డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు (పంటను ఎండబెట్టే వసతి), ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) గోదాములు, ఎస్సేయింగ్ (నాణ్యత పరీక్ష) ఎక్విప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రా, పశు సంవర్థక మౌలిక సదుపాయాల వరకు దాదాపు 16 రకాల ప్రాజెక్టులు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ► 4,277 డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు, పీడీఎస్ కోసం 60 గోదాములు, 1,483 సేకరణ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్, టర్మరిక్ (పసుపు) బాయిలర్లు, పాలిషర్లు.. 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, 10,678 ఎస్సేయింగ్ ఎక్విప్మెంట్, 10,678 సేకరణ కేంద్రాల ఎక్విప్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. బీఎంసీయూల నిర్మాణం మొదలు ► రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,885.76 కోట్ల అంచనా వ్యయంతో 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), రూ.942.77 కోట్లతో 8,051 ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాల (ఏఎంసీయూ) నిర్మాణానికి అంచనాలు రూపొందించాం. ► రాష్ట్రంలో ఇప్పటికే 9,051 చోట్ల బీఎంసీయూల కోసం భూమి గుర్తించగా, 6,252 యూనిట్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం బీఎంసీయూల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటి వల్ల రాష్ట్రంలో పాడిపై ఆధారపడిన అక్కచెల్లెమ్మల ఆదాయం పెరుగుతుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్లు ► ఒక్కో యూనిట్ వ్యయం రూ.15 లక్షల చొప్పున ఆర్బీకేల స్థాయిలో మొత్తం 10,750 కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ– అద్దెకు వ్యవసాయ పరికరాలు) ఏర్పాటు చేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 175 చోట్ల హైటెక్ హైవాల్యూ ఫామ్ మెకనైజేషన్ (అత్యాధునిక వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు) హబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో హబ్ వ్యయం దాదాపు రూ.1.5 కోట్లు అవుతుంది. ► ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉండే నాలుగు జిల్లాలలో ప్రత్యేక క్లస్టర్లను గుర్తిస్తున్నాం. ఆ మేరకు ఆయా జిల్లాలలో మండలానికి 5 చొప్పున క్లస్టర్ స్థాయిలో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కోటి రూ.25 లక్షల వ్యయం అంచనాతో మొత్తం 1,035 క్లస్టర్ స్థాయి సీహెచ్సీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాదికి 4 ఫిషింగ్ హార్బర్లు ► తొలి దశలో ఉప్పాడ (తూ.గో), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు)లో వచ్చే ఏడాది (2022) డిసెంబర్ నాటికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ► రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం. ► ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ► మత్స్యకారులు, ఆక్వా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రి ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, 100 ఆక్వా హబ్లు ఏర్పాటు చేస్తున్నాం. 25 హబ్ల పనులు ఈ నెలలో మొదలు కానున్నాయి. ► రూ.646.90 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 133 ప్రాసెసింగ్, ప్రిప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్వా హబ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం ► గత ఏడాది నవంబర్ 20న ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో అమూల్ పాల సేకరణ మొదలు పెట్టగా, ఈ ఏడాది మార్చి 29న గుంటూరు జిల్లాలో, ఏప్రిల్ 3న చిత్తూరు జిల్లాలోనే మరి కొన్ని గ్రామాలకు పాల సేకరణ విస్తరించారు. ► ఈ నెల 4 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ మొదలు పెడుతోంది. ► 4 జిల్లాలలో 12,342 మంది మహిళా రైతుల నుంచి 50.01 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న అమూల్.. రూ.23.42 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. తద్వారా మహిళా రైతులకు రూ.3.91 కోట్ల అదనపు ఆదాయం లభించింది. గ్రామ స్థాయిలో విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల స్థాయిలో 10,111 విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నాం. ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ► పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్కు అవకాశం ఉన్న పంటల గుర్తింపునకు చర్యలు తీసుకున్నాం. ఆ మేరకు యూనిట్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ చివరికి వీటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. -
రైతు ప్రయోజనాలకు ఆమడదూరంలో...
భారతీయ ప్రాచీన సాహిత్యంలో రైతుకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యతా లేదన్నది వాస్తవం. కౌటిల్యుడు, మనువు ఈ దేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తున్నాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే సేద్యానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన తొలి శూద్ర చింతనాపరుడు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలసి ఉంది. తమ ఆత్మగౌరవాన్ని, తరతరాలుగా చేస్తూవస్తున్న వృత్తి భవిష్యత్తును కాపాడుకోవడానికి భారీ స్థాయిలో రైతులు ఆందోళన జరుపుతున్న నేపథ్యంలో పాలక ఆరెస్సెస్ భావజాలం.. దాని వాణిజ్య అనుకూల సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి లేశమాత్రంగా అయినా అవకాశం ఉందా? 1925 నుంచి ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక హిందుత్వ జాతీయవాద విధాన పత్రాల కేసి చూసినట్లయితే, వ్యవసాయ అభివృద్ధి విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించిన దాఖలాను అవి ఏమాత్రం చూపించవు. ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్.. సారాంశంలో వ్యవసాయ వ్యతిరేకతను పుణికిపుచ్చుకున్న మనుధర్మం, కౌటిల్యుడి అర్థశాస్త్ర భావజాలానికి సంబంధించిన బలమైన సైద్ధాంతిక మూలాలను కలిగివుంది. ఆధునిక కాలంలో సావర్కర్, గోల్వాల్కర్ తమ రచనల ద్వారా కౌటిల్యుడు, మనువు పరంపరను కొనసాగించారు. ఇస్లాం వ్యతిరేతను నిలువెల్ల పుణికిపుచ్చుకున్న భావజాలంతో హిందుత్వ ప్రాపంచిక విధానం వ్యవసాయ వ్యతిరేకతను నిగూఢంగా పొందుపర్చుకుంది. జాతీయవాదం పేరిట తమ భావజాలాన్ని నిర్మించుకున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తిని ముందుకు తీసుకుపోవడం వారి చర్చల క్రమంలో ఎన్నడూ భాగం కాలేదు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని అఖిల భారత జమాత్–ఇ–ముస్లిమిన్ లేక జమాత్ ఇస్లామ్ హింద్ నేతృత్వంలోని వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ మత సంస్థకైనా లేక మత రాజకీయ పార్టీకైనా.. వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ప్రయోజనంపై దృష్టి సారించిన చరిత్ర లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్/బీజేపీలే భారతదేశాన్ని ఏలుతూ, రైతు వ్యతిరేక చట్టాలను రూపొందిస్తున్న తరుణంలో వీరి చరిత్రను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాంచజన్య, ఆర్గనైజర్ వంటి ఆరెసెస్ సిద్ధాంత పత్రికలను కానీ, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వంటి వాటి పరిశోధనా సంస్థల కార్యకలాపాలను కానీ గమనించిన ఎవరికైనా సరే భారతీయ వ్యవసాయంపై వీరు ఎన్నడూ దృష్టి సారించినట్లు కనబడదు. వీరు ఎల్ల ప్పుడూ ద్వేషిస్తూ ఉండే చైనాతో (అది కమ్యూనిస్టు దేశమైనా కాకున్నా సరే..) పోటీ పడేలా వ్యవసాయంలో సానుకూల సంస్కరణ, అభివృద్ధి తీసుకురావటం పట్ల వీరు ఎన్నడూ దృష్టి పెట్టలేదు. కౌటిల్యుడు, మరింత అధికంగా మనువు ఈదేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ఆర్ఎస్ఎస్ కానీ, దాని రాజకీయ విభాగమైన బీజేపీ కానీ ఆ భావజాలంతో ఎన్నడూ తెగతెంపులు చేసుకోలేదు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా వారి వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తూండటం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ కానీ, అమిత్ షా కానీ తమ నిఘంటువులోనే లేని ప్రగతిశీల వ్యవసాయ తాత్వితతను ఎలా ముందుకు తీసుకొస్తారు? చిన్నదైనా, పెద్దదైనా వాణిజ్య అనుకూల విధానమే వారి పరంపరగా ఉంటోంది. ఢిల్లీలో అధికారం స్వీకరించిన కొన్నేళ్లలోనే ఆ పరంపర మార్పుచెందుతుందా? ఆర్ఎస్ఎస్/బీజేపీల నియంత్రణలో ఉన్న ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ఆహార ఉత్పత్తిదారుల వ్యతిరేక తాత్వికతను కలిగి ఉన్న మనుధర్మ నుంచి కాస్తయినా పక్కకు తొలగడానికి సంసిద్ధత చూపడం లేదు. ఆనాడు ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్రుల గురించి మనువు ఏం చెప్పాడో చూడండి. వ్యవసాయంలో వారి కృషిని ఎన్నడూ మనువు ఒక శ్రమగా గుర్తించలేదు. 1. 123. బ్రాహ్మణులకు సేవ చేయటం ఒక్కటే శూద్రుడి అద్భుతమైన వృత్తిగా ప్రకటించడమైనది. దీనికి వెలుపల శూద్రులు ఎలాంటి పని చేసినా అది ఫలితాలను ఇవ్వకపోవచ్చు. 2. 129. శూద్రుడికి శక్తి ఉన్నప్పటికీ అతడు సంపదను సృష్టించకూడదు. శూద్రుడు సంపదను కలిగి ఉండటం బ్రాహ్మణుడిని నొప్పిస్తుంది. హిందుత్వ శక్తులు ఎన్నడూ అద్యయనం చేసి ఉండని చైనాలో, క్రీస్తు పూర్వం 770, 221 మధ్య కాలంలో వ్యవసాయప్రాధాన్యతా వాదం (అగ్రికల్చరిజం) అనే ప్రాపంచిక తత్వం ఉనికిలో ఉండేది. ఈ తాత్వికతకు ప్రాతినిధ్యం వహించిన ప్రధాన తత్వవేత్త జు జింగ్ (372–289 బీసీఈ). ప్రజల ప్రవృత్తి, ఇచ్ఛ అనేవి ఏ ఇతర వృత్తికంటే వ్యవసాయంమీదే ఆధారపడి ఉంటాయన్నది ఇతని ప్రధాన సిద్ధాంతం. క్రీస్తు పూర్వం మూడు, నాలుగు శతాబ్దాల నాటికి చైనా సమాజం పశుపాలన నుంచి బయటపడి ఈ అగ్రికల్చరిజం దన్నుతో వ్యవసాయ ఉత్పత్తివైపు అడుగేసింది. జూ జింగ్ తాత్విక రంగంలో వ్యవసాయదారుడిని ’పవిత్రమైన రైతు’గా భావించేవారు. మత గురువుల కంటే పవిత్ర రైతుకే అత్యధిక విలువ ఇచ్చేవారు. వ్యవసాయ వ్యతిరేక తత్వశాస్త్రమైన బ్రాహ్మనిజం కారణంగానే భారతదేశంలో రైతులకు ఏనాడు అలాంటి ప్రాధాన్యత లభించలేదు. వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలీని బ్రాహ్మణ రుషికి వ్యవసాయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరికి ఎన్నడూ తాత్విక, గౌరవనీయ పవిత్ర స్థానాన్ని దక్కనీకుండా చేశారు. శూద్రులు తమవైన వ్యవసాయ ఆధ్యాత్మిక విధులను నిర్వర్తించేవారు కానీ వీరి దేవతలకు బ్రాహ్మణ సాహిత్యంలో ఎలాంటి విలువా చూపేవారు కాదు. బ్రాహ్మణిజం శూద్రులను బానిసలుగా వ్యవస్థీకరించి వారిని ఉద్దేశపూర్వకంగా విద్యకు దూరం చేయడంతో వీరి తాత్విక అభివృద్ధి కూడా నిలిచిపోయింది. బ్రాహ్మణులు రూపొం దించిన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మను ధర్మశాస్త్రం వంటివాటిలో వ్యవసాయానికి కించిత్ చోటు లేదు. కానీ భారతదేశంలోని ప్రతి రచయితా వీటినే భారతీయ నాగరికత, సంస్కృతికి ఆకరాలుగా భావిస్తూ వచ్చేవారు. కానీ ఈ పుస్తకాల్లో ఏ ఒక్కటీ వ్యవసాయ ప్రాధాన్యత గురించి చాటిన పాపాన పోలేదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ భావజాలమైన భారతీయ సాంస్కృతిక వారసత్వం వ్యవసాయం నుంచి తీసుకున్నది కాదు. అసలు వ్యవసాయాన్ని సంస్కృతిలో భాగంగానే వీరు గుర్తించలేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్ది వరకు మన దేశంలోనూ వ్యవసాయం కాస్త అభివృద్ధి చెంది వ్యవసాయ ఉత్పత్తి ఒకమేరకు ప్రారంభమైన కాలంలోనే వ్యవసాయ ఉత్పత్తిని కించపరుస్తూ కౌటిల్యుడు అర్ధశాస్త్రం, మనువు ధర్మశాస్త్రం రాశారు. కులాన్ని ఆచరించే రుషులను, సన్యాసులను భారతీయ సంస్కృతి వారసత్వానికి సంబంధించి తిరుగులేని నమూనాగా బ్రాహ్మణవాదం ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ వీరికి ఉత్పత్తిలో, వ్యవసాయంలో ఏ పాత్రా లేదని గమనించాలి. శూద్ర రైతులను తమదైన ప్రత్యామ్నాయ చింతనను ఏర్పర్చుకోవడానికి కూడా అనుమతించలేదు. 19వ శతాబ్ది మధ్య కాలంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన మొట్టమొదటి శూద్ర చింతనాపరుడు. శూద్రులకు తాత్విక స్థాయి లేకుండా చేశారని, వారిని బానిసల స్థాయికి కుదించి వేశారని పూలే గుర్తించారు. బానిసగానే ఉన్నంత కాలం ఏ శూద్రుడు కూడా తన సొంత తాత్విక దృక్పథాన్ని నిర్మించుకోలేడు. కాబట్టే పూలే శూద్ర రైతుకు కేంద్ర స్థానమిచ్చి ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం రచించారు. అయితే ఫూలేకి నిరంతరం రచనలు చేస్తూ, తాత్విక దృక్పథాన్ని నిర్మించగల చారిత్రక వారసత్వం లేనందున గతకాలపు చైనా ప్రాపంచిక దృక్పథం వంటి పూర్తి స్థాయి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని ఆయన పెంపొందించలేకపోయారు. వ్యవస్థీకృతంగా రాయకుండా, ఎలాంటి ప్రాపంచిక దృక్పథం కూడా అభివృద్ధి చెందదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులు పూలే వ్యవసాయ తాత్వికతను పురోగమన స్థాయికి అనుమతించకుండా వేదవాడనే కొనసాగిస్తూ వచ్చాయి. కాబట్టి వేదకాలానికి ముందటి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని తిరిగి కనిపెట్టడం ద్వారా మన నిజమైన ప్రాచీన మూలాలపై చర్చను తప్పక కొనసాగించాలి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. ప్రభుత్వ పాఠశాలల్లో రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలిసి ఉంది. అలాగే మన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భారతీయ వ్యవసాయ ప్రాధాన్యతను ఆధిక్యతలో ఉంచుతూ పునర్నిర్మాణం చెందటం అవసరం. వ్యవసాయ రంగంలో ఉన్నతమైన అభివృద్ధి, మెరుగైన మార్కెట్ దిశగా అలాంటి మార్పును ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులు వ్యతిరేకించినట్లయితే, యూనివర్శిటీల్లోని రైతాంగ యువత నాయకత్వంలో నిజమైన అజాదీ కోసం సమరం ప్రారంభమవడం ఖాయం. వ్యాసకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కార్పొరేట్ సాగు మన సంస్కృతికి విరుద్ధం
‘ప్రపంచంలోని 70 శాతం పంటపొలాలలో గడ్డి బీడులను, పండ్లతోటలను ఒక్క శాతం బడా రైతాంగం (కార్పొరేట్లు) మాత్రమే వ్యవసాయం నిర్వహిస్తూ, ప్రకృతి సంక్షోబాలకు కారణమవుతూ సేద్యంలో అసమానత ప్రభావానికి కారకులవుతున్నారని’, ఆక్స్ఫామ్, ప్రపంచ అసమానతలపై అధ్యయనం చేస్తున్న సంస్థలతో కలిసి పనిచేసిన అంతర్జాతీయ భూముల అధ్యయన కేంద్రం పరిశోధనలలో తేలింది. 1980 నుండి వ్యవసాయ పొలాల నిర్వహణ పరోక్షంగా కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా కేంద్రీకృతమైందని అధ్యయన కేంద్ర ప్రతినిధి వార్డ్ అన్యూన్ తెలిపారు. కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా చిన్న, మధ్య తరగతి రైతులను నిర్లక్షం చేస్తూ ఏకపంట సాగుచేస్తుండటంతో భూసారం తగ్గుతూ, జీవవైవిధ్యం నశిస్తున్నది. కార్పొరేట్లు ప్రవేశపెడుతున్న ఈ ఏకపంటల విధానంతో పంజాబ్, హరియాణా రైతులను పెప్సీ, ఐటీసీ కంపెనీలకు బంగాళదుంప, టమాటా తప్ప వేరే పంటలు పండనీయడంలేదు. కనీసం 10 లక్షల ఎకరాలు కాంట్రాక్టు వ్యవసాయానికి సేకరించారు. పెరుగుతున్న భూమి విలువతోపాటు, భూమిని కోల్పోతున్న రైతులను మొదటిసారిగా పరిగణిస్తే ఇప్పటివరకు నమ్మిన దానికంటే 41 శాతం ఎక్కువని నివేదిక తెలియజేస్తున్నది. స్వల్పకాల లాభాలే ధ్యేయంగా కార్పొరేట్ వ్యవసాయం చేయడంతో ప్రపంచ వాతావరణం పైనా, ప్రజారోగ్యంపైనా ప్రతికూల ప్రభావం కల్గిస్తున్నది. పర్యావరణం, మహమ్మారులతో వ్యవసాయం ముడిపడి ఉండటంచేత ఇప్పుడు ప్రజల జీవితంలోని ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశంలో 6 శాతం ధనిక రైతుల దగ్గర 51 శాతం భూమి అధీనంలో ఉంది. 5 నుండి 10 ఎకరాలు ఉన్న రైతుల దగ్గర దేశంలోని మొత్తం సాగుభూమిలో సుమారు 10 శాతం ఉంది. 5 ఎకరాల లోపు రైతులు మొత్తం రైతాంగంలో 85 శాతం వరకూ ఉండగా, మొత్తం భూమిలో తమ వాటాగా వీరు 37 శాతం మాత్రమే కలిగిఉన్నారు, వీరిలో 23 శాతం దారిద్య్రపు రేఖ దిగువన ఉన్నారు. భూస్వాములు, పెద్ద రైతుల భూమిని 70 శాతం కౌలురైతులే సాగుచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా రైతాంగం చిన్నకమతాలను కలిగిఉన్నారు. ఇక్కడి వ్యవసాయం తక్కువ సమయంలో లాభార్జనే ధ్యేయంగా కాకుండా భూసారాన్ని భావితరాలకోసం పరిరక్షిస్తుంటారు. ప్రపంచం మొత్తంలో 80 నుండి 90 శాతం చిన్నకమతాల పొలాలు రైతుకుటుంబాలు మొత్తంగా గానీ లేక రైతుచే సాగుచేయబడుతూ వుండగా, నానాటికీ ఈ కమతాల సంఖ్య కార్పొరేట్ వ్యవసాయానికి బలైపోతూ కుచిం చుకుపోతోంది. గత 40 ఏళ్లనుండి అమెరికా, యూరపులో కార్పొరేట్ వ్యవసాయానికి రైతాంగం బలైపోతూ... వ్యవసాయ పెట్టుబడి నిధులకోసం, కఠినమైన ఒప్పందాలతో సాగుచేయవల్సి వస్తోంది. నేల నాణ్యత క్షీణిస్తూ. ఎరువులు, క్రిమిసంహారకాలు అపరిమితంగా వాడటంతోపాటు, అడవులను నరుకుతూ పర్యావరణ సమస్యలు సృష్టిస్తున్నారు. మెరుగైన పర్యావరణ నిర్వహణ కోసం, రైతాంగ గిట్టుబాటు వ్యవసాయం కోసం చిన్న, మధ్య తరగతి రైతాంగం కోసం, నిబంధనలలో మార్పులు తీసుకొచ్చి, కమ్యూనిటీ రైతులకు కూడా మద్దతును ప్రభుత్వం ప్రకటించాలి. పన్నులు తగ్గించి, ప్రభుత్వ సబ్సిడీలు పెంచి నేరుగా రైతుకే చేరే అవకాశం కల్పించాలి. రైతు గర్వపడే భూ హక్కును కాపాడాలి. చిన్న రైతులు, రైతుకుటుంబాలు, స్వదేశీ ప్రజలు భూమిని సాగుచేయడంలో చాలా జాగ్రత్తలతో మెలకువ వహిస్తారు. కేవలం పెట్టుబడి రాబట్టడానికేగాక రైతుగా గుర్తింపుకోసం, తమ సంస్కతిని భావితరాలు కొనసాగించటం కోసం వ్యవసాయాన్ని చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పర్యావరణాన్ని కాపాడుతూ, సగటు సెంటుభూమిలో ఎక్కువ ఉత్పాదకత చేస్తారు. ఈ విధానాన్ని కార్పొరేట్ వ్యవసాయం చేయలేదు. ప్రకృతిని, నేలను నమ్ముకున్న రైతాంగంలా కార్పొరేట్ వ్యవసాయం సాగు జరగదు. తన లాభాల కోసం కంపెనీలను మార్చినట్లుగా వ్యవసాయం నుండి కార్పొరేట్రంగం తప్పుకొంటుంది, భూమిని మాత్రం తన వద్దనే ఉంచుకొని పొలాలను బీళ్లుగా మార్చుతుంది. దీనితో ఆహారభద్రతకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రజానీకానికి పట్టెడన్నం పెట్టే రైతును దూరం చేసుకోవద్దు. నేడు ప్రపంచంలో 140 కోట్ల ప్రజలు ప్రత్యక్షంగా భూమిపై ఆధారపడి ఆహారం, వసతిని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు, వీరిని మనం రక్షించుకోవాలి. ఇటువంటి రైతాంగం అభద్రతకు గురవుతున్న కారణం చేతనే చలిని సైతం లెక్కచేయక, కార్పొరేట్ అనుకూలచట్టాలకు వ్యతిరేకంగా రాజధానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షులు మొబైల్ : 98494 91969 -
డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వంగా చేస్తున్న మేళ్లను పక్కదోవ పట్టించేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నివర్ తుఫాన్ ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నెల తిరక్కుండానే డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటల నష్టపోయిన రైతులకు ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రంగు మారిన ధాన్యాంతోపాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఎత్తిచూపారు. కాబట్టి రైతుల తరపున చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదన్నారు. తుఫాన్ వచ్చినప్పుడు.. వరదలొచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అండగా నిలిచానంటూ సీఎం వైఎస్ జగన్ గుర్తు చేస్తూ.. అదే చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో కూర్చున్నారని దుయ్యబట్టారు. అందుకే బుగ్గన రాజేంద్రనాథ్ సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని పేరు పెట్టారని వ్యంగాస్త్రాలు విసిరారు. శాసనసభ ద్వారా రైతులకు ఏం చేయబోతున్నామో చెప్పబోతుంటే.. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా డైరెక్షన్లో చంద్రబాబు డ్రామాలాడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు. (చదవండి: 40 ఏళ్లు నేర్చుకున్న సంస్కారం ఇదేనా..?) మొలకెత్తిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మంచిదా? కాదా? అన్నది ఒక్కసారి ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అనంతరం.. గత 18 నెలలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలను సీఎం వైఎస్ జగన్ సవివరంగా వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే.. చంద్రబాబు డ్రామా, స్క్రీన్ప్లే, దర్శకత్వం ఎల్లో మీడియా.. కాసేపటి క్రితం పెద్ద డ్రామా మన కళ్లతో మనం చూశాం. చంద్రబాబు యాక్టర్ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా కధ, స్క్రీన్ప్లే, డైరెక్షన్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి. ఎలాగూ దీనిపై ఇవాళ సభలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తోంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టం అవుతుంది అనే ఒక దుర్భుద్ధితో ఒక డ్రామా. చంద్రబాబు ఎందుకంత రెచ్చిపోయారో ఆయనకే తెలియదు. వారి పార్టీ మనిషే నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఆయన లేవనెత్తిన అంశాలపై క్లారిఫికేషన్ ఇచ్చాం. ఆ తర్వాత రామానాయుడే మాట్లాడాలి. కానీ వెంటనే చంద్రబాబు అందుకున్నారు. సడెన్గా లేచి నేను మాట్లాడతానని అన్నారు. ఒక టాపిక్ అనేది ఎప్పుడు కూడా ఒక పద్దతి ప్రకారం పోతుంది. అంతే కానీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్లీ అందుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. అది ఆయనకూ తెలుసు. తెలిసినా వెంటనే రెచ్చిపోవడం. అసలు ఆశ్చర్యకరం. ఐదేళ్లలో నేను ఎప్పుడూ అలా వ్యవహరించలేదు నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఎప్పుడూ పోడియమ్లోకి రాలేదు. దటీజ్ ది డీసెన్సీ ఎనీ బడీ ఫాలోస్. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఆయనే పోడియమ్లోకి రావడం, వచ్చిన వెంటనే అందరినీ నెట్టేసి కూర్చోవడం. ఆ తర్వాత పక్క నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 స్క్రీన్ప్లే ప్రకారం దాని ఎత్తుకోవడం, దాన్ని రేపు పొద్దున పేపర్లలో రాయడం. అవే హెడ్లైన్లు రైతుల కోసం ముఖ్యమంత్రి ఏం చెప్పారు? రైతులకు ఏ రకంగా దీని వల్ల మంచి జరుగుతుంది అన్నది రేపు పొద్దున హెడ్డింగ్స్ ఉండవు. చంద్రబాబు అనే వ్యక్తి ఫ్లోర్ మీద కూర్చోవడం. మార్షల్స్ ఎత్తుకోవడం, అవే హెడ్డింగ్లు. దీనికి సంబంధించిన డ్రామా. కధ. స్క్రీన్ప్లే, డైరెక్షన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. మా ఖర్మ, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థను ప్రతిపక్ష నాయకుడు నడుపుతా ఉన్నాడు అంటే, నిజంగా షేమ్. దురుద్దేశ రాజకీయాలు రైతులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఒక అనుకోని పరిస్థితి వచ్చింది. క్యాబినెట్లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ కూడా జరుగుతోంది. దీని మీద చర్చ జరుగుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెబుతారు? ఆ మాటల వల్ల తమకు ఏమైనా మంచి జరుగుతుందా? అన్న మాటలు వినడానికి చాలా మంది ఆరాటపడుతున్నారు. అటువంటివన్నీ కూడా కనిపించకూడదు. వినిపించకూడదు అని చెప్పి చంద్రబాబు చేస్తున్న దురుద్దేశ రాజకీయాలు చూస్తున్నాం. పదేళ్లలో లేని విధంగా అంతా సుభిక్షం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యింది. ఇది మాకు రెండో నవంబరు మాసం. ఈ నవంబరు చివరి నాటికి రాష్ట్రంలోని ఏ రిజర్వాయర్ తీసుకున్నా గతంలో చంద్రబాబు పాలన చూశాం. గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని రిజర్వాయర్లు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. గత పదేళ్లలో ఏనాడూ లేనంతగా భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యాయి. అయితే దురదష్టవశాత్తూ దీపం వెలుగు కింద చీకటి ఉన్నట్లు ఆగస్టు నుంచి నవంబరు వరకు అడపా దడపా కురిసిన వర్షాల వల్ల మన రైతులకు కొంత నష్టం కలిగింది. ఆ నష్టం జరిగినప్పుడు వెంటనే నిజాయితీగా సమీక్షించాను. వెంటనే ఆ సీజన్కు సంబంధించిన పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. అటువంటిది మనసున్న ప్రభుత్వంగా, రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా, రైతులకు తోడుగా ఉండేందుకు మన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగులు వేయడం జరిగింది. (చదవండి: సీబీఎన్ అంటే.. కరోనాకు భయపడే నాయుడు) రైతులకూ నాకూ మధ్య ఆత్మీయ బంధం ఇవన్నీ కూడా ఏదో ప్రతిపక్షం విమర్శిస్తుందనో చేయలేదు. పత్రికల్లో రాశారనో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. రైతులకూ నాకూ మధ్య ఉన్న బలమైన ఆత్మీయ అనుబంధంతోనే.. రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా తెలియజేస్తూ, ఈ విషయాలు చెబుతున్నాను. చరిత్రలో ఇదే ప్రథమం ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ఆ నష్టం వర్షాల వల్ల కావచ్చు, తుపాను వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు.. కారణం ఏదైనా ప్రకతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో నష్ట పరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే ప్రథమం. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాలా రూ.143 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత మొత్తంతో గత అక్టోబరు 27న ఇవ్వడం జరిగింది. అక్టోబరు నెలలో వచ్చిన అ«ధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నవంబరు 17న ఒక నెల కూడా తిరక్క ముందే రూ.132 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందించాం. మళ్లీ నవంబరులో నివర్ తుపాను వల్ల పంటలకు, ఇళ్లకు, రోడ్లకు, చెరువులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే చాలా వాటిని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరింత వివరంగా.. అన్ని విధాలా ఆదుకుంటాం.. భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. చిన్న వారు కావొచ్చు, పెద్ద వారు కావొచ్చు. అవ్వలు కావొచ్చు. తాతలు కావొచ్చు. చివరకు 3 ఏళ్ల పిల్లవాడు లేదా సంత్సరం పిల్లవాడు కూడా కావొచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి రూ.500 చొప్పున ఎంత మంది అయితే సహాయ శిబిరాల్లో ఉంటారో వారందరికీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక ఇంటిలో దాదాపు నలుగురు ఉంటారు. ఆ విధంగా ప్రతి ఇంటికి దాదాపు రూ.2 వేలు ఇచ్చినట్లు అవుతుంది. ఎవరైతే నీళ్లు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో. వారిని శిబిరాలకు తరలించడమే కాకుండా, అక్కడ వారిని అన్ని రకాలుగా చూసుకోవడమే కాకుండా, వారిని ఇంటికి పంపించేటప్పుడు, ఇళ్లకు వచ్చిన తర్వాత మళ్లీ ఇబ్బంది పడకుండా మనిషికి రూ.500 చొప్పున, ఒక ఇంట్లో ఉజ్జాయింపుగా నలుగురు ఉంటారనుకుంటే మొత్తం రూ.2 వేలు చేతిలో పెట్టి పంపడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు వచ్చే సరికే శిబిరాల నుంచి తిరిగి ఇళ్లలోకి వెళ్లిన వారందరి ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇస్తామని నెల్లూరు, కడప, చిత్తూరు తదితర జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. పంట ఇతర నష్టాలపై.. ఇదే కాకుండా పంట నష్టాలన్నింటినీ డిసెంబరు 15 నాటికి మదింపు చేసి, పరిహారాన్ని డిసెంబరు 31లోగా రైతులకు ఇవ్వబోతున్నాం. ఇది కూడా కరెక్టుగా చూస్తే నెలలోపే. ఇది చూసినప్పుడు నిజంగా ఇది ఎంత మంచి ప్రభుత్వం అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. అంతే కాకుండా ఆ డబ్బు కూడా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదొక్కటే కాకుండా, మళ్లీ పంట వేయడానికి కావాల్సిన విత్తనాలను రైతులకు 80 శాతం సబ్సిడీ మీద అందించడం జరుగుతోంది. ఆ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇళ్లకు జరిగిన నష్టానికి, పశువులు, కోళ్లు నష్టపోయిన వారికి, పడవలు, వలలు నష్టపోయిన వారి అంచనాలు కూడా డిసెంబరు 15 లోగా పూర్తి చేసి, డిసెంబరు 31లోగా పరిహారం కూడా ఇవ్వబోతున్నాం. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికే పరిహారం తుపాను వల్ల అనుకోకుండా 8 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని చెప్పి, వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, చెరువులకు జరిగిన నష్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అంచనా వేసి, వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్ సరఫరా నిల్చిపోయిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడంతో దాదాపు అన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. మిగిలిన చోట్ల కూడా రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. రంగు మారిన ధాన్యమే కాదు.. మొలకెత్తిన ధాన్యమూ కొనుగోలు ఇంకా ఈ వర్షాల వల్ల రాయలసీమ జిల్లాలే కాకుండా, ఈ పక్క కష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో కూడా పంటలు దెబ్బ తిన్నాయి. పంటలు నీట మునిగాయి. ధాన్యం రంగు మారింది. ఇంకా కొన్ని చోట్ల ధాన్యం మొలకలెత్తి కొందరు రైతులు అవస్థలు పడడం కూడా కనిపించింది. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఒక గొప్ప ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప, ఎప్పుడూ కూడా ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అటువంటిది రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో మొలకెత్తిన ధాన్యం కొనుగోలు ఎప్పుడూ జరగలేదు. ధాన్యం మొలకెత్తిన రైతులకు కూడా న్యాయం చేసేందుకు గ్రేడెడ్ ఎమ్మెస్పీతో ఒక బ్రాకెట్ కింద తీసుకువచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రైతులను కూడా ఆదుకోవాలి. వారికి కూడా మంచి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈక్రాపింగ్ డేటా ఆధారంగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రైతులకు బీమా ధీమా..! ఇన్సూరెన్సు కూడా ఇప్పుడు మన ప్రభుత్వమే బాధ్యతగా ఈ ఖరీఫ్ అంటే, 2020 ఖరీఫ్ నుంచి ఇన్సూరెన్సు బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే ఇన్సూరెన్సు కంపనీలు బాధ్యత తీసుకోవడం లేదు. అవి స్పందించే తీరు మానవత్వంతో ఉండడం లేదు. సమయానికి స్పందించడం లేదు. 2012కి సంబంధించిన క్లెయిమ్లు మన ప్రభుత్వం వచ్చాక కట్టి, క్లెయిమ్లకు వెళ్లడం. ప్రీమియమ్ ఎక్కువగా ఉండడంతో రైతులు పంటలకు ఇన్సూరెన్సు చేయకపోవడం చూశాం. దాని వల్ల పంట నష్టం పరిహారం రాకుండా పోయే పరిస్థితి రావడం గతంలో ఎక్కడా చూడడం జరగలేదు. అందుకే ఈ ఏడాది, 2020 ఖరీఫ్ సీజన్ నుంచి ఇన్సూరెన్సు బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడం జరుగుతోంది. అలా తీసుకుంటా ఉంది కాబట్టి, ఇప్పటి నుంచి జనవరి చివరి వరకు క్రాప్ కట్టింగ్ జరుగుతుంది కాబట్టి, దాన్ని బట్టి రైతులు ఎంత నష్టపోయారన్నది చూసి, ఫిబ్రవరిలో ప్రణాళిక శాక నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు మార్చి, ఏప్రిల్లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్ కూడా సెటిల్ చేస్తామని చెబుతున్నాను. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. క్రాప్ కటింగ్ పూర్తైన తర్వాత నెల, రెండు నెలల్లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్ అన్నది చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని చెబుతున్నాను. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కానీ, ప్రజలకు కానీ, అదే సీజన్లో (నివర్ తుపాను విషయంలో అయితే కేవలం నెల లోపల) పరిహారం, సబ్సిడీ వంటివి ఇవ్వడం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. రూ.2,194 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన టీడీపీ సర్కార్ గతంలో ఎలా జరిగింది అన్నది కూడా ఒక్కసారి టేబుళ్లలో చూడండి.. ఇన్పుట్ సబ్సిడీ అనేది గతంలో ఎలా జరిగేది అనేది చూస్తే, 2014 ఖరీఫ్లో నష్టం జరిగితే, ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వచ్చింది అని చూస్తే, జూలై 22, 2015న రూ.692 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరో విడత 2017లో ఇచ్చారు. అలా ఎంత ఆలస్యం చేశారని చూస్తే, 2014 ఖరీఫ్ నష్టానికి పరిహారం రెండున్నర ఏళ్ల తర్వాత ఇచ్చారు. 2015 ఖరీఫ్ నష్టం ఒక ఏడాది ఆలస్యంగా 2016 నవంబరులోనూ, అదే సీజన్ ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టానికి పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2017 మే నెలలో ఇచ్చారు. 2016 ఖరీఫ్లో నష్టానికి తొలి విడత పరిహారం ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో ఇవ్వగా, మిగిలిన పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2018లో ఇచ్చారు. 2017 రబీ నష్టం పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. ఇవి కాక 2018 ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రైతులకు ఏమీ ఇవ్వలేదు. 2018 ఖరీఫ్లో రూ.1838 కోట్లు, అదే ఏడాది రబీలో రూ.356 కోట్లు.. మొత్తంగా రూ.2194 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఏ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఆ సీజన్లోనే.. కానీ ఈరోజు ఏదైనా సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. అలా రైతులకు తోడుగా, అండగా నిలబడుతున్న చారిత్రక నిర్ణయం తీసుకుని మనం అమలు చేస్తుంటే వీళ్ల కామెంట్లు మనకు ఇవాళ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. 58.77 లక్షల మందికి పంటల బీమా సౌకర్యం ఇదే మాదిరిగా ఇన్సూరెన్సు పరిస్థితి కూడా ఒక్కసారి చూస్తే, అందులో రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి.. ప్రభుత్వమే ఇన్సూరెన్సు కట్టడం మొదలు పెట్టిన తర్వాత, రైతులకు అండగా నిలబడడం మొదలుపెట్టిన తర్వాత, ఒక్కసారి గమనిస్తే, 2016లో కేవలం 17.79 లక్షల రైతులు నమోదు చేసుకుంటే, ఆ తర్వాత 2019 వరకు మూడేళ్లు వరసగా చూస్తే సగటున 20.28 లక్షల రైతులు కూడా ఇన్సూరెన్సు తీసుకునే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజున ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్సు సొమ్ము కడతా ఉంది కాబట్టి 58.77 లక్షల రైతులు నమోదు చేసుకున్నారు. అంటే ఒక్కసారిగా 190 శాతం పెరుగుదల. అదే విధంగా ఇన్సూరెన్సులో ఏరియా కవరేజ్ కూడా చూస్తే, 201617లో కేవలం 20 లక్షల హెక్టార్లు, 201718లో చూస్తే 24 లక్షల హెక్టార్లు. అలా 201819 వరకు మూడేళ్లు సగటు చూసుకుంటే కేవలం 23.57 లక్షల హెక్టార్లలో మాత్రమే ఇన్సూరెన్సు కవర్ అయితే, 201920లో అంటే మన ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చాక 56.82 లక్షల ఎకరాలకు ఇన్సూరెన్సు చెల్లిస్తున్నాం. ఇది 141 శాతం పెరుగుదల. అదే విధంగా గత మూడేళ్లలో రైతులు కట్టిన సగటు ప్రీమియమ్ రూ.290 కోట్లు మాత్రమే. మన హయాంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూస్తే, ప్రభుత్వమే మొత్తం ప్రీమియమ్ కట్టడం మొదలు పెట్టాక రైతులు ప్రీమియమ్గా కట్టింది కేవలం రూ.26 లక్షలు మాత్రమే. అదే సమయంలో ప్రభుత్వం కట్టిన ప్రీమియమ్ రూ.1030 కోట్లు. అది కట్టడమే కాకుండా డిసెంబరు 15న ఇన్సూరెన్సు సొమ్ము క్లెయిమ్ ఇస్తామని తేదీ కూడా ప్రకటించడం జరిగింది. అదే గతంలో ప్రభుత్వం తరపున 2016 నుంచి 2019 వరకు మూడేళ్లలో సగటున కేవలం రూ.393 కోట్లు మాత్రమే కడితే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కట్టిన ఇన్సూరెన్సు ప్రీమియమ్ మొత్తం ఏకంగా రూ.1030 కోట్లు. పంట కోత ప్రయోగాలు పూర్తయిన వెంటనే పరిహారం చెల్లింపు.. అదే విధంగా ఇన్సూరెన్సు క్లెయిమ్స్ గతంలో చూస్తే, 2014 ఖరీఫ్ పరిహారం ఏడాది ఆలస్యంగా 2015లో వచ్చింది. అలాగే రబీ పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. 2016 రబీలో అయితే ఏడాదిన్నర తర్వాత ఇచ్చారు. ఆ విధంగా కనీసం ఏడాది, ఏడాదిన్నర ఆలస్యంగా పరిహారం ఇచ్చారు. అదే 2020కి సంబంధించి చూస్తే, ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్ చెల్లిస్తుంది కాబట్టి, జనవరి నెలాఖరు నాటికి ఈ సీజన్కు సంబంధించి క్రాప్ కట్టింగ్ ఎక్స్పరిమెంట్ పూర్తి కాగానే, మార్చి ఏప్రిల్లో పంట నష్టపరిహారం రైతులకు అందజేస్తాం. ఇది ప్రజలు, రైతుల పట్ల మా చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనం. రైతుల పక్షపాత ప్రభుత్వం ఇది కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. రాజకీయాలు, పార్టీలు కూడా చూడం.. అని చెప్పిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టే దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా అర కోటి మందికి పైగా రైతులకు.. రైతు భరోసా సొమ్మును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ అవుతోంది. అది కూడా వారి పాత అప్పుల కింద బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా ఇస్తున్నాం. దాదాపుగా 50 లక్షల రైతులకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం రూ.67,500 నేరుగా వారి చేతుల్లో పెట్టబోతున్నాం. నవరత్నాలులో మొట్టమొదటి పథకం రైతు భరోసా. రైతన్నలకు ఎన్నికల వాగ్దానంగా మేనిఫెస్టోలో చెప్పింది.. నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని. కానీ ఇప్పుడు రైతుగా తోడుగా ఉండేందుకు మానవత్వంతో ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తంగా రూ.67,500 అందుతోంది. అంటే, మాట ఇచ్చిన దానికన్నా ఒక్కో రైతుకు రూ.17,500 అదనంగా అందుతోంది. కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నాం. కోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ 18 నెలల కాలంలోనే దాదాపు రూ.13 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చాం. వచ్చే జనవరిలో ఇచ్చే రూ.2 వేలు కూడా ఇందులో కలిపాం. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సేవలు విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతు అవస్థ తెలిసిన వ్యక్తిని కాబట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమం ఇది. రైతు చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం. రైతు ఇంటి వద్దనే సేవలందించే విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ వారికి వైయస్సార్ జల కళ ద్వారా బోర్లు వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఏటా 50 వేల బోర్లు వేసే దిశగా అడుగులు. ఈ కార్యక్రమానికి అక్షరాలా రూ.4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గత ప్రభుత్వం బకాయిలనూ చెల్లించాం..! గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా పెట్టిన రూ.8655 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు. అవి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే ఇవాళ స్పష్టంగా చెబుతున్నాం. ధాన్యం సేకరణ తర్వాత రెండు వారాల్లోనే చెల్లించాలని చెబుతున్నాం. ఇంకా గత ప్రభుత్వం పెట్టిన విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ.384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న రూ.1030 కోట్లు.. ఇవన్నీ మన రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది. పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ రైతులకు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన విద్యుత్తును రూ.1800 కోట్లు వెచ్చించి ఫీడర్ల మెరుగు ద్వారా అందిస్తున్న ప్రభుత్వం మనది. మేము అ«ధికారంలోకి వచ్చే సరికి ఫీడర్లలో కెపాసిటీ లేక ఆ అవకాశం లేకపోవడంతో, ఆ మొత్తం ఖర్చు చేసి ఫీడర్ల కెపాసిటీ పెంచాం. వైయస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం 2019 ఖరీఫ్కు సంబంధించి ఇప్పటికే రూ.510 కోట్లు చెల్లించడం జరిగింది. డిసెంబర్ 15న రూ.1227 కోట్ల క్లెయిమ్లు చెల్లిస్తాం బీమా ప్రీమియమ్ను కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2019 ఖరీఫ్కు సంబంధించి రైతులు తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చొప్పున మాత్రమే చెల్లించగా, రాష్ట్రంలో రైతులందరి తరపున కట్టాల్సిన రూ.506 కోట్లు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన రూ.524 కోట్లు. అలా మొత్తం రూ.1030 కోట్లు బీమా ప్రీమియమ్ చెల్లించగా, ఈ డిసెంబరు 15న బీమా పరిహారం (క్లెయిమ్లు) రూ.1227 కోట్లు బీమా కంపెనీలు చెల్లించనున్నాయి. రైతులకు సాంకేతికంగా వెన్నుదన్ను 13 జిల్లాలలో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్లు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లు (గ్రామీణ నియోజకవర్గాలలో) ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నాణ్యత పరీక్షలు నిర్వహించి ధవీకరించిన వాటినే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మనది.రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. 2019-20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొగాకు, ఉల్లి, పసుపు, టమోటా, అరటి, బత్తాయి తదితర ఉత్పత్తులు 8,84,882 టన్నులు కొనుగోలు చేసి రూ.3491 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఇంకా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం మరో రూ.666 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు మంచి ధరలు అందించాలన్న లక్ష్యంతో ఫలానా పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే ధరలు నిర్ణయించి రైతులకు తెలియజేస్తున్నాం. అవన్నీ ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్లో పోటీ వాతావరణం కల్పిస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంటలను నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇందు కోసం సీఎంయాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రై జ్ అండ్ ప్రొక్యూర్మెంట్), ఏ రైతుకైనా కనీస గిట్టుబాటు ధర రాకపోతే వెంటనే నోటిఫై చేస్తారు.వెంటనే జేసీ స్పందిస్తారు. ఆ పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. అలా అలా కొనుగోలు చేసిన పంటల ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ అడిషన్) జోడించి, తిరిగి మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. అందుకే సెకండరీ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ ప్రాససింగ్ యూనిట్లు పెట్టాలన్న దానిపై కార్యాచరణ. త్వరలోనే గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి. గోదాములు, ఆర్బీకేలు, జనతా బజార్లు కనిపిస్తాయి.రెండో దశ ప్రాససింగ్ యూనిట్లు కూడా రాబోతున్నాయి. మొత్తం ఈ కార్యక్రమం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలకూ పెద్దపీట.. కేవలం వ్యవసాయంతో మాత్రమే లాభసాటి కాదని చెప్పి, చేయూత కార్యక్రమం తీసుకువచ్చాం. అందులో భాగంగా డెయిరీకి ప్రోత్సాహం. అందు కోసం ఏకంగా 4.68 లక్షల ఆవులు, గేదెల యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. అమూల్ సంస్థతో అవగాహన కూడా కుదుర్చుకున్నాం. రాష్ట్రంలో సహకార రంగం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి, అమూల్ను తీసుకురావడం జరుగుతోంది. అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా డెయిరీల పునరుద్ధరణ. వీటన్నింటి వల్ల గ్రామాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. అమూల్ రావడం వల్ల కలిగే ప్రయోజనం. అమూల్తో పాల ధర అధికం.. కడప, ప్రకాశం జిల్లాలలో చూస్తే లీటరు గేదె పాలను(6శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ.34 కు, దొడ్ల డెయిరీ రూ.32 కు కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.39 కి కొనుగోలు చేయబోతుంది. ఆ విధంగా రూ.5 నుంచి రూ.7 ఎక్కువ ఇవ్వబోతుంది. ఇక అవే గేదె పాలను ప్రకాశం జిల్లాలో లీటరుకు(10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) సంగం, హెరిటేజ్ సంస్ధలు రూ.58 లకు, జెర్సీ సంస్ధ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్ సంస్ధ రూ.64.97లకు కొనుగోలు చేయనుంది. ఆ విధంగా దాదాపు ఐదు నుంచి ఏడు రూపాయలు ఎక్కువగా చెల్లించబోతున్నది. ఇక ఆవు పాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో లీటరుకు హెరిటేజ్ సంస్ధ రూ.23.12లు , సంగం డెయిరీ రూ.25.20లు , జెర్సీ రూ.24.89 లు చెల్లిస్తుండగా.. అమూల్ రూ.28 చెల్లించనుంది. ఆ విధంగా దాదాపు రూ.3 నుంచి రూ.5 ఎక్కువ ధర రైతులకు రానుంది. గ్రామీణ వ్యవస్థలో రైతులకు ఎలా మేలు చేయాలనే ప్రభుత్వం ఉండాలి తప్ప, వారిని ఎలా పిండాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను మార్చబోతున్నది. ఆక్వా రైతులకు అండగా.. ఇంకా ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు చేప, రొయ్యలు గ్రామాల్లో జనతా బజార్లలో దొరుకుతాయి. ఆ విధంగా ఏర్పాట్లు. వాటకి కూడా ప్రాసెసింగ్ యూనిట్లు. కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటు. 35 చోట్ల ఆక్వా ల్యాబ్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆక్వా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. -
బ్యాంకర్లు సహకరించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక రంగానికి వ్యవసాయ రంగం వెన్నుముక. రాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఖరీఫ్ (జూన్)లో 7,500, రబీ (అక్టోబర్)లో రూ.4వేలు.. పంట చేతికొచ్చే సమయంలో మరో రూ.2వేలు సాయం చేస్తున్నాం. రాష్ట్రంలో 10,600కు పైగా ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశాం పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ-క్రాపింగ్ తప్పనిసరి. గతేడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలు కొన్నాం.. ఈ ఏడాది రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో గోడౌన్లు, మండల కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు... ప్రతి గ్రామంలో జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నాం. నాడు-నేడు కింద స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన చేపట్టాం. ఆస్పత్రుల్లో కూడా నాడు-నేడు కింద మార్పులు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్లు ఏర్పాటు చేస్తున్నాం. (చదవండి: పండుగ వేళ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు) ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు. వైఎస్సార్ చేయూత ద్వారా 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెండింగ్లో ఉన్న రూ.1,100 కోట్ల రాయితీ ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు రుణాలు ఇచ్చాం’అని సీఎం జగన్ పేర్కొన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలలో బ్యాంకర్స్ సహకారంపై చర్చించారు. బ్యాంకర్లు కూడా సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గౌతమ్రెడ్డి, కన్నబాబు, సీఎస్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
సాగు పండగై
వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చి వేసే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది 86.33 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంత కంటే 6.10 లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్లో 92,46,006.30 ఎకరాలు సాగులోకి రావొచ్చని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడటంతో ఈ సీజన్లో ఇప్పటికే అంటే గురువారం నాటికి 3,29,085.06 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 1,08,590.46 ఎకరాలు ఎక్కువ. గత ఏడాది ఇదే కాలానికి అంటే జూన్ ఒకటి నుంచి 17వ తేదీ వరకు 2,20,494.60 ఎకరాల్లో మాత్రమే పంటల్ని వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, అన్నదాతల ముంగిటకే అందిస్తున్న సేవలు, కలిసి వచ్చిన వాతావరణం.. వెరసి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా గత ఏడాది పంట దిగుబడులతో ఆనందంగా ఉన్న రైతాంగం.. ఈ ఖరీఫ్లో రెట్టించిన ఉత్సాహంతో సాగులో నిమగ్నమైంది. (ఎ.అమరయ్య, జీపీ వెంకటేశ్వర్లు) ‘కల్లా కపటం కానని వాడా.. లోకం పోకడ తెలియని వాడా..ఏరువాక సాగారో రన్నో చిన్నన్న.. నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న..నవ ధాన్యాలను గంపకెత్తుకొని.. చద్ది అన్నము మూట గట్టుకొని ముల్లు గర్రను చేతబట్టుకొని.. ఇల్లాలునీ వెంటబెట్టుకొని..’ అన్న పాటలోని జీవన సౌందర్యం ఊరూరా కనిపిస్తోంది. ► నగరాలు నిద్రలేవడానికి మునుపే పల్లెలు పొలం పనుల్లో మునిగి తేలుతున్నాయి. ఓవైపు చిరు జల్లులు, మరోవైపు మసకేసిన మబ్బు.. ఉదయం 8 గంటలు కావొస్తోంది.. అప్పటికే పొలంలో ట్రాక్టర్లు రయ్రయ్యిమంటూ రొద చేస్తున్నాయి. హాయ్, హోయ్ మంటూ అన్నదాతలు ఎడ్లను అదిలిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు, పిల్లలు పొలంలో దంటు ఏరుతున్నారు. ► రాత్రి కురిసిన చిరు జల్లుల వల్లనో ఏమో ట్రాక్టర్లు దుమ్ము లేపడం లేదు. పైరగాలికి గెనాల మీద చెట్ల కొమ్మలు రెపరెపలాడుతున్నాయి. నాగటి చాళ్లంట బయటపడే పురుగుల కోసం కొంగలు, కోనంకి పిట్టలు దేవులాట మొదలు పెట్టాయి. అరేయ్.. బువ్వ తిందాం రా అంటూ అవతలి చేలో దుక్కిదున్నుతున్న దోస్త్ను ఓ రైతు పిలుస్తున్నాడు. రైతు షేక్ సత్తార్ది ప్రముఖ చిత్రకారుడు సంజీవ్దేవ్ స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం. 75 సెంట్ల తన సొంత భూమిని ఖరీఫ్లో సాగుకు సిద్ధం చేస్తున్నాడు. రైతు భరోసా కింద ఇచ్చిన సొమ్ముతో వరి సాగు పనులు ప్రారంభిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు సీహెచ్ వీర్రాజు. తన పిల్లలు కాయకష్టం చేసే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గోదావరి కాలువలు వదిలిన ఈనెల 10కి ముందే ఆయన నారు సిద్ధం చేసుకున్నారు. గురువారం నాటికి 12 ఎకరాల్లో నాట్లు సైతం పూర్తి చేశారు. వేరుశనగ విత్తనాన్ని వెదపెడుతున్న ఈ రైతుది వైఎస్సార్ జిల్లా ముద్దనూరు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు ముందుగా పదును కావడంతో ఈ రైతు విత్తనం వేశారు. 5 ఎకరాల వరకు వేరుశనగను సాగు చేసే ఈ రైతుకు రైతు భరోసా కింద అందిన పెట్టుబడి సాయం కలిసి వచ్చింది. సకాలంలో విత్తనాలు వచ్చాయి. దీంతో భూమిని నమ్ముకున్న ఈ రైతు రాయలసీమలో ప్రధాన వాణిజ్య పంటైన వేరుశనగ సాగుకు ఉపక్రమించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ► ఖరీఫ్లో క్షేత్ర స్థాయి వాస్తవ సాగు పరిస్థితులను తెలుసుకునేందుకు బయలుదేరిన ‘సాక్షి’ ప్రతినిధులకు కనిపించిన దృశ్యాలివి. మొత్తం మీద ఈ ఏడాది ఖరీఫ్ కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో శుభారంభమైందన్న భావన కలిగింది. ► సకాలంలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం, అల్పపీడనం బలపడడంతో ఒక్క చిత్తూరు జిల్లా తప్ప మిగతా 12 జిల్లాల్లోనూ వ్యవసాయ పనులు చేపట్టేలా వానలు పడ్డాయి. అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ వరకు ఎక్కడ చూసినా ఖరీప్ పనులు ముమ్మరం అయ్యాయి. ► దక్షిణాంధ్ర జిల్లాల్లో దుక్కులు సిద్ధం చేస్తుండగా రాయలసీమ జిల్లాలలో వేరుశనగ విత్తడం ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 24 శాతం మేర పూర్తయింది. ► గోదావరి డెల్టా కాలువలకు నీళ్లు వదలడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో నాట్లు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా నాట్లు పడ్డాయి. వరి సాగు చేసే ప్రాంతంలో వరి నారుమళ్లు పోయడం ముమ్మరమైంది. ► కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాలలో వేసిన అపరాలు మొలక దశ దాటాయి. మరొక్కసారి పెద్ద వర్షం పడితే పంటల్ని వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయం ఎందుకు పండగైందంటే.. ► రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి. ► దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షాలు పడితే వేరుశనగ విత్తడం మరింత ముమ్మరం అవుతుందని రైతులు చెప్పారు. ► విత్తనాలను ముందే పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన హన్మంతరెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఈసారి ఎక్కువ మంది ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి సారించారు. ఖరీఫ్లో వరి సాగుకు అధిక వ్యయం అవుతుందన్న భావనలో పలువురు ఉన్నారు. ► ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురవాల్సిన సగటు వర్షపాతం 556 మిల్లీమీటర్లు. ఇప్పటికే కురవాల్సింది 62 మిల్లీమీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 63 మిల్లీమీటర్లు కురిసింది. ఫలితంగా ఒక్క చిత్తూరు జిల్లా మినహా 12 జిల్లాలలో మామూలు వర్షపాతం నమోదైంది. ► వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ఉల్లి పంటల్ని ఇప్పటికే 20 నుంచి 24 శాతం లోపు విస్తీర్ణంలో విత్తారు. రికార్డు దిగుబడే లక్ష్యం ► ఖరీఫ్ సాగుపై అధికారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గత ఏడాది కంటే మించి ఉత్పత్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2019–20) ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క ఖరీఫ్ నుంచే 87.64 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఇంతకుమించి రావొచ్చునని అధికారులు అంచనా. ► సీజన్కు కావాల్సిన ఎరువులు, పురుగు మందులకు ఎటువంటి ఢోకా లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. మరో వైపు కరోనా నేపథ్యంలో వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► అగ్రి దుకాణాల ద్వారా యంత్రాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వరిని నాటడానికి బదులు వెదజల్లే పద్ధతిని పాటించాలని సూచిస్తున్నారు. ► కరోనా వైరస్ భయంతో పొరుగు ఊళ్ల నుంచి వ్యవసాయ కూలీలను అనుమతించనందున ఏ ఊరికి ఆ ఊరి వాళ్లే గ్రూపులుగా ఏర్పడి పనులు చేసుకోవాలని రైతు సంఘాలు సూచించాయి. మొత్తంగా ఖరీఫ్ పంటలకు అన్నీ సానుకూల అంశాలేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతుల సమస్యకు త్వరలో పరిష్కారం ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల రాయితీలను కౌలు రైతులకు కూడా అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. కౌలు రైతులకు రుణాలు, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. 11 నెలల కాలానికి సాగు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సాయం అందిస్తాం. అర్హులైన వారందరికీ సాయం ఇస్తాం. – మంత్రి కన్నబాబు -
రైతు సంక్షేమానికి ఏటా రూ.70 వేల కోట్లు
సాక్షి, సంగారెడ్డి: ‘మాది రైతు ప్రభుత్వం.. రైతుల శ్రేయస్సుకోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పలు పథకాలను ప్రవేశపెట్టాం. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలకు కలిపి ఏటా రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది’అని ఆర్థికమంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి జెడ్పీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రైతులకు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతోనే ‘ప్రాధాన్యత సాగు’(నియంత్రిత) విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధుకు రూ.14 వేల కోట్లు, ఉచిత విద్యుత్కు రూ.10 వేల కోట్లు, రైతు బీమాకు రూ.1,200 కోట్లు, రైతులకు మద్దతు ధరకోసం ధాన్యం కొనుగోళ్లలో నష్టాలను భరించి రూ.4 వేల కోట్లు, సబ్సిడీ విత్తనాల సరఫరాకు రూ.600 కోట్లు, రుణమాఫీకి రూ.26 వేల కోట్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.15 నుంచి 20 వేల కోట్లు.. ఇలా పలు పథకాలకు ఏటా సుమారుగా రూ.70 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. వర్షాకాలం సీజన్ ఆరంభమైనందువల్ల ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. మహిళా స్వయం సంఘాలకు కూడా లైసెన్సులు ఇచ్చి ఎరువుల విక్రయానికి మార్క్ఫెడ్ ద్వారా ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. -
నెల రోజుల్లోనే 5 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: మొదట నుంచి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలోనూ వారికి అండగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా స్వయంగా వారి వద్దకే వెళ్లి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇందుకోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించింది. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన తక్కువ రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు సైతం జమ చేసింది. దీంతో రైతులు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ తమ పంట ఉత్పత్తులను మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలిగారు. ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో గత నెల రోజుల్లో ఏకంగా 5 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి అమ్మకాలు చేయించింది. ► చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రైతుల నుంచి నేరుగా టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతుబజార్లలో విక్రయించింది. దీంతో రైతుల్ని ఆదుకోవడమే కాకుండా రైతు బజార్ల ద్వారా కొనుగోలుదారులకు తక్కువ రేటుకే అందించింది. ► లాక్డౌన్తో రైతులు నష్టపోకుండా ఆంక్షలు సడలించి ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రవాణా పర్మిట్లు మంజూరు చేసింది. ► మార్కెటింగ్, ఉద్యాన శాఖలు సమష్టి ప్రణాళిక ద్వారా రైతుల నుంచి పండ్లను నేరుగా కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్ల ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేశాయి. ► ప్రభుత్వం రాయలసీమలో అరటి రైతులను ఆదుకునేందుకు టన్ను రూ.3,500 చొప్పున కొనుగోలు చేసి రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లు, స్వయం సహాయక గ్రూపుల ద్వారా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి అమ్మకాలు చేపట్టింది. ఇదే తరహాలో బత్తాయి, కూరగాయలు, టమాటా, ఉల్లి రైతులనూ ఆదుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ► రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా లాక్డౌన్ సమయంలో నెల రోజుల వ్యవధిలోనే 3,30,494 మెట్రిక్ టన్నుల పండ్లను, 1,70,949 మెట్రిక్ టన్నుల కూరగాయలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ► వీటిని గ్రామస్థాయిలో అమ్మేందుకు స్వయం సహాయక గ్రూపులను వినియోగించింది. ఈ అమ్మకాల ద్వారా గ్రూపులకు మంచి ఆదాయం లభించేలా చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► కరోనా విపత్తు తర్వాత గ్రామ స్థాయిలో రైతుల పంటల క్రయవిక్రయాలను విస్తృతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోజూ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రైతులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. భవిష్యత్తుకు కొత్త బాటలు సీఎం జగన్ రైతులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యల ద్వారా భవిష్యత్తుకు కొత్త బాటలు పడుతున్నాయి. పంటల క్రయ విక్రయాలు గ్రామ స్థాయి వరకు వెళ్లిపోయాయి. ఇక ప్రాసెసింగ్ ప్లాంట్లు, గిడ్డంగుల ఏర్పాటుతో రైతులకు భరోసా లభిస్తుంది. మంచి ధర రాని సమయం లో గిడ్డంగుల్లో పంటను నిల్వ చేసుకుంటారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులు తయారుచేసి పంటలకు అధిక ధరలను రైతులు పొందుతారు. వీటి ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ -
జగన్ వందరోజుల్లో చేసిచూపారు
-
‘రైతు పక్షపాతిగా సీఎం జగన్ పాలన’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పులమయంగా మారిస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను అమలు చేసేందుకు ఆయన కష్టపడుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై శుక్రవారం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలన రైతు పక్షపాతంగా సాగిందన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులను గట్టెక్కించేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతు బాగు కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా 70 లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కౌలు రైతులు కోసం సాగు హక్కు చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. కౌలు రైతులకు కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేశామన్నారు. పామాయిల్ రైతులకు రూ. 84 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. రూ. 119 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాయలసీమలో తీవ్ర కరువు నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ట్యాంకర్ రూ. 600 చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం దారుణమన్నారు. హుద్హుద్, తిత్లీ తుపాన్ బాధిత రైతులకు చంద్రబాబు కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐదేళ్ల చంద్రబాబు అరాచక పాలనను భరించలేకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేయ్యలేని పనులు సీఎం వైఎస్ జగన్ 100 రోజుల్లో చేసి చూపిస్తున్నారని చెప్పారు. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చిన ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఓటమిపై 100 రోజుల్లో సమీక్ష చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీలో అంతర్గత సంక్షభం నెలకొందని.. అందుకే చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్లిపోతారనే భయం పట్టుకుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఒక ఎస్సీ మహిళను వినాయకుడి వద్దకు వెళ్లకుండా టీడీపీ నేతలు అవమానించడం దారుణమన్నారు. సీఎం వైఎస్ జగన్ అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పటికే టీడీపీ ఖాళీ అయ్యేదని అన్నారు. 4 గురు టీడీపీ ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. -
రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను (2019-20) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. నవరత్నాల అమలే ప్రాధాన్యంగా బడ్జెట్ను రూపొందించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఇక ఏపీ బడ్జెట్లో రైతులకు సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకంతో 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆర్థికమంత్రి తెలిపారు. పంటల మీద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. వ్యవసాయానికి కేటాయింపులు ఇలా.. ధరల స్థిరీకరణ నిధి : రూ.3000 కోట్లు ప్రకృతి విపత్తుల నివారణ నిధి : రూ.2002 కోట్లు వైఎస్సార్ రైతు భీమా : 1163 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ : రూ.475 కోట్లు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్కు రూ. 4525 కోట్లు రైతులకు ఉచిత బోర్లకు : రూ.200 కోట్లు విత్తనాల పంపిణీ : రూ.200 కోట్లు -
రైతులకు ఆపన్నహస్తం
సాక్షి, తిరుపతి : వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. గత పాలకుల నిరాదరణకు గురై అప్పులతో ఉక్కిరిబిక్కిరైన అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ కుటుంబాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయి. అటువంటి కుటుంబాల పరిస్థితి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవీయకోణంలో ఆలోచించి వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. గత పాలకుల నిరాదరణకు గురైన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్కు వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వివరాలు పంపమని కలెక్టర్ నారాయణ భరత్ గుప్త వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. వ్యవ‘సాయం’ మరిచారు జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని విస్మరించింది. సకాలంలో విత్తనాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. రైతులు అప్పులు చేసి ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేశారు. పంట సాగు చేశాక వాతావరణం కరుణించకపోవడంతో బోర్లు వేసి తీవ్రంగా నష్టపోయిన వారు ఉన్నారు. చాలీ చాలని నీటితో పంట చేతికొచ్చి నా... గిట్టుబాటు ధరలు లేవు. అన్నదాతలు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేని దుస్థితి. ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 26మంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా పుంగనూరు పరిధిలో మరో రైతు ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడ్డాడు కరుణించని టీడీపీ ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ ప్రభుత్వం కరుణించలేదు. జిల్లాలో మొత్తం 26 మంది మరణిస్తే కేవలం 12 మందికి మాత్రమే పరిహారం అందించి చేతులు దులుపుకుంది. అందులోనూ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం అందజేశారు. మిగిలిన 14 మంది రైతు కుటుంబాలకు పరిహారం విషయంలో మొండిచెయ్యి చూపారు. తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో టి.నారాయణరెడ్డి, వి.కృష్ణప్ప, ఎం.పెద్దరెడ్డెప్ప, ఎన్.మోహన్రెడ్డి, జి.ఆనందరెడ్డి, వి.మల్లప్పనాయుడు, జి.గంగులప్ప ఉన్నారు. వీరిలో ముగ్గురికి మాత్రమే పరిహారం అందింది. వరదయ్యపాళెం మండలం యానాదివెట్టు దళితవాడకు చెందిన కౌలు రైతు దొడ్డి వెంకటయ్య ఎనిమిది నెలల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు పరిహారం చెల్లించకపోగా.. ఇతని ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన కౌలు రైతు రామయ్య అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు పరిహారం అందలేదు. రామసముద్రం మండలం రాగిమాకులపల్లె కొత్తూరు, పూరాండ్లపల్లె గ్రామానికి చెందిన హరి, రామ్మోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి కుటుంబాలకు పరిహారం విషయంలో మొండిచెయ్యే ఎదురైంది. చౌడేపల్లి మండలం కాటిపేరికి చెందిన రైతు ఎస్.అగస్తి రెడ్డి రూ.13 లక్షల అప్పులు తీర్చులేక 8 నెలల క్రితం ఉరివేసుకుని చనిపోయాడు. ఆయన కుటుంబానికి పరిహారం అందలేదు. ఇదే తరహాలో మిగిలిన బాధితులకు కూడా గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. -
రైతు ఆదాయం రెండున్నర రెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అన్నదాత ఆదాయం దాదాపు రెండున్నర రెట్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎస్ఎల్బీసీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని వెల్లడించింది. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో 2022 నాటికి రైతు ఆదాయం అధికంగా ఉంటుందని తెలిపింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ రైతు సంక్షేమ పథకాల కారణంగానే ఇది సాధ్యం కానుందని వెల్లడించింది. ఇందులో నాబార్డు పాత్ర కూడా కీలకమేనని పేర్కొంది. తలసరి రూ.2.01 లక్షలు 2015–16లో ప్రస్తుత ధరల ప్రకారం రైతుల సరాసరి ఆదాయం రూ.86,291. అందులో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రూ.63,492, వ్యవసాయేతర ఆదాయం రూ. 22,799. అదే జాతీయ స్థాయిలో అన్నదాత సగటు ఆదాయం రూ.96,703. అందులో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రూ. 58,246 కాగా.. వ్యవసాయేతర ఆదాయం రూ. 38,457. జాతీయస్థాయిలో రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయం తక్కువగా ఉండగా, రాష్ట్రంలో మాత్రం ఇది ఎక్కువగా ఉంది. కానీ వ్యవసాయేతర రంగాల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో మాత్రం తెలంగాణ రైతులకు తక్కువ మొత్తం లభిస్తోంది. 2022–23 నాటికి ప్రస్తుత ధరల ప్రకారం ఉన్న ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముందని ఎస్ఎల్బీసీ నివేదిక పేర్కొంది. 2022–23 నాటికి తెలంగాణలో రైతు ఆదాయం రూ.2,01,431 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదే జాతీయస్థాయిలో రైతు ఆదాయం రూ.2,19,724 ఉండనుంది. రాష్ట్రంలో రైతు పొందే ఆదాయంలో వ్యవసాయం ద్వారా రూ.1,56,522, వ్యవసాయేతర రంగాల ద్వారా రూ.44,909 పొందే అవకాశముందని ఎస్ఎల్బీసీ వెల్లడించింది. అదే జాతీయస్థాయిలో వ్యవసాయ ఆదాయం రూ.1,52,031 వ్యవసాయేతర ఆదాయం రూ. 67,693 ఉంటుందని తెలిపింది. పెరుగుదలకు కారణమైన అంశాలు 2014–15 నుంచి తెలంగాణలో వివిధ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం ద్వారానే రైతు ఆదాయం పెరుగుతుందని అంచనా వేసింది. పంటల ఉత్పాదకత ద్వారా 13.40% ఆదాయ వృద్ధి నమోదైంది. పశుసంవర్థక రంగాల ద్వారా 15.10% ఆదాయం సమకూరింది. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా 16.90%, పంటల మార్పిడి ద్వారా 4.60%, పంటలకు సరైన ధరలు 8.70%, ఇతర అంశాల ద్వారా 16.40% ఆదాయం సమకూరిందని తెలిపింది. రానున్న రోజుల్లో రైతుబంధు రైతు ఆదాయం పెరుగుదలలో కీలకం కానుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుబంధు ద్వారా అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు సమకూరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తాము చేపట్టే పలు కార్యక్రమాలు కూడా రైతు ఆదాయం పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటాయని నాబార్డు చెబుతోంది. రైతుల ఉత్పత్తి సంస్థలు (ఎఫ్పీవో), ఏరియా అభివృద్ధి పథకాలు, గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు, సూక్ష్మస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జేఎల్జీ) ద్వారా ఆర్థిక సాయం వంటివి కీలకమైనవని నాబార్డు చెబుతోంది. -
రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి
సాక్షి, హైదరాబాద్: పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను భారీగా పెంచి దానికి అదనంగా బోనస్ ఇచ్చేలా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. పంట సేకరణ సమయంలోనే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని ముసాయిదా మేనిఫెస్టోలో పేర్కొంది. ఇందుకోసం కోసం రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. అలాగే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీలు, ప్రజలు, రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా, విద్యార్థులకు సైకిళ్లు, 50 శాతం సబ్సిడీతో స్కూటీలు, ఉద్యోగుల కనీస వేతనం రూ. 26 వేలు చేయడం, నిరుద్యోగులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి వంటి అంశాలతో సిద్ధం చేసిన ముసాయిదా మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్కు మేనిఫెస్టో కమిటీ ఇటీవల అందజేసింది. వాటిపై త్వరలోనే మరోసారి చర్చించి ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. ముసాయిదా మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు - రైతులకు రూ . 2 లక్షల వరకు రుణమాఫీ. ప్రతి పొలంలో ఉచిత బోరుబావి. - నాణ్యమైన విత్తనాలు ఉచితంగా పంపిణీ - సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య, జీవిత బీమా - ప్రత్యేక వ్యవసాయ వార్షిక బడ్జెట్, కూరగాయల ధరల స్థిరీకరణ నిధి. - కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం - పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన వనరులను కేటాయించి మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం. - అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటన. - ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్, పోటీ పరీక్షల శిక్షణ - రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు. - రాష్ట్రంలో కనీస వేతనం రూ. 26 వేలు చేయడం. - సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగింపు. ్ఞ నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి. ్ఞ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానం ఎత్తివేత, పరీక్ష ఫీజుల రద్దు. - 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు హామీ లేని రుణాలు - ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం, అవి నిర్మించి వరకు నెలకు రూ 5 వేలు అద్దె చెల్లింపు. - బీపీఎల్ కుటుంబాల్లో 58 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 2 వేల పెన్షన్, వితంతువులకు రూ. 3 వేల పెన్షన్. - వెనుకబడిన కులాల కార్పొరేషన్కు ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయింపు. - రజకులను ఎస్సీల్లో, గంగపుత్రులు, వడ్డెర కులస్తులను ఎస్టీల్లో చేర్చేందుకు చర్యలు. - నేత, గీత, రజక, క్షార, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు తదితర కులవృత్తుల్లో 55 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 3 వేల పెన్షన్ - జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్ల పెంపు. - క్రీడారంగం అభివృద్ధికి రూ. 1,000 కోట్లతో క్రీడా నిధి ఏర్పాటు. వెయ్యిమంది క్రీడాకారులకు ఏటా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్కాలర్షిప్ మంజూరు. - జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెన్షన్. - కల్యాణలక్ష్మి పథకంతోపాటు పేద మహిళలకు వివాహ సమయంలో ఒక తులం బంగారు మంగళసూత్రం. - వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేటాయింపులు రూ. 2 వేల కోట్లకు పెంపు. - ఖాయిలాపడిన సంస్థల పునరుద్ధరణకు రూ. 2 వేల కోట్ల నిధి ఏర్పాటు. ్ఞ జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఏటా రూ. 100 కోట్ల బడ్జెట్. - రూ. 5 వేల కోట్లతో వెంచర్ కేపిటల్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం. - వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మంలలో ఐటీæ ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు. - జనగామ, భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మంచిర్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, నిర్మల్, జగిత్యాల పట్టణాల్లో బీపీవోల ఏర్పాటు. - జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటన - సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహణ. - పెట్రోల్, డీజిల్పై ధరలు కనీసం రూ. 20 తగ్గింపు - గ్రామ పంచాయతీలు, నగరాలు, పట్టణాల్లో నెలకు రూ. 6కే çనల్లాల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా. -
రైతు సంక్షేమమే మా ధ్యేయం
సంప్లా/రోహ్తక్: తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రైతులకు రుణాలు, పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మంగళవారం ఆయన హరియాణాలోని రోహ్తక్ జిల్లా గర్హి సంప్లిలో జాట్ నేత సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..‘స్వాతంత్య్రానికి ముందు రైతుల కోసం సర్ చోటూరామ్ ఎన్నో ఉద్యమాలు నడిపారు. అన్నదాతలు ఆర్థికంగా బలపడేందుకు, వారికోసం సంక్షేమ చట్టాలు తీసుకువచ్చేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు’ అని తెలిపారు. ‘రైతుల ఉత్పత్తులకు సరైన ధర లభించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. రైతులు, చిన్న వ్యాపారులకు రుణాలు అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. వారు వడ్డీ వ్యాపారులపై ఆధారపడే అవసరం ఉండదు’ అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని సొనిపట్ జిల్లా బర్హిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే రైల్ కోచ్ మరమ్మతు, ఆధునీకరణ కర్మాగారం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగారంలో ఏడాదికి 250 ప్యాసింజర్ కోచ్లకు మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉపాధి, పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 160 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2020–21కల్లా పూర్తవుతుందని ఉత్తర రైల్వే తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్, హరియాణా సీఎం ఖట్టర్, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ శిల్పి, పద్మ భూషణ్ గ్రహీత రామ్ వంజి సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 5,500 మంది రైతులు విగ్రహ నిర్మాణానికి అవసరమైన ఇనుమును విరాళంగా ఇచ్చారు. హడావుడిగా ఆవిష్కరణ షెడ్యూల్ కంటే ముందుగానే జాత్ నేత సర్ చోటూరామ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడం రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, జాట్ల మద్దతు తగ్గుతుండటంతో బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతోపాటు తొమ్మిది నెలల క్రితమే చోటూరామ్ విగ్రహ నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడంపై ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) పలు ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రధాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి వచ్చిందని భావిస్తున్నారు. వాస్తవానికి మనోహర్లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఒకటో తేదీన ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. -
29–30 తేదీల్లో సమీకృత ప్రకృతి సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
సెంటర్ ఫర్ ట్రెడిషినల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ సమీకృత ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్. నారాయణరెడ్డి ఈ నెల 29, 30 తేదీల్లో బెంగళూరుకు సమీపంలోని దొడ్డబళ్లాపూర్, మరలెనహళ్లి, శ్రీనివాసపురం గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాల కోసం.. 94495 96039, 83101 99215, 99017 30600. -
టీడీపీని నమ్మి స్నేహం చేస్తే వెన్నుపోటు పొడిచింది
-
టీఆర్ఎస్ అవినీతి పాలనను అంతం చేస్తాం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పంచ పాండవులు.. వంద మంది టీఆర్ఎస్ కౌరవులతో పోటీ పడుతున్నారు. దేశంలో కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతం చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి పాలనను అంతమొందిస్తాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 జిల్లాల్లో జన చైతన్య యాత్ర మొదటి విడతను విజయవంతంగా పూర్తి చేయడంపై ఆయన రాష్ట్ర బీజేపీకి అభినందన తెలిపారు. బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్ర తొలివిడత ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతుల సంక్షేమంకోసం 14 పంటలకు మద్దతు ధర ప్రకటించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే దక్కిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రైతులు సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటుందని ప్రధాని మోదీ రైతులకోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. రైతు బాంధవుడు మోదీ అని, రాష్ట్రంలో చేపట్టిన రైతుబంధు పథకంతో రైతులకు ఒరిగింది ఏమీలేదని, అది కేవలం భూస్వాముల పథకమని విమర్శించారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని, కానీ మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. నాడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి రూ.100 పంపితే గల్లీలోని లబ్ధిదారుడికి చేరేసరికి రూ.15 మాత్రమే అందేవన్నారు. అదే నేడు ప్రధాని మోదీ పాలనలో ఢిల్లీ నుంచి రూ.100 పంపితే గల్లీలో ఉన్న లబ్ధిదారుడికి రూ.100 అందుతున్నాయన్నారు. ప్రధాని మోదీ కేంద్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని అన్నారు. దేశంలో దళితుల అభివృద్ధి కోసం పంచతీర్థాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2014 ఎన్నికల వరకు దేశంలోని 29 రాష్ట్రాల్లో బీజేపీ 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఈ 4 ఏళ్లలోనే 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 4 ఏళ్లలో 106 సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. జన్ధన్ ఖాతాల ద్వారా దేశంలో 30 కోట్ల అకౌంట్లు తెరిపించామన్నారు. దీని ద్వారా రూ.3.85 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అందజేసినట్లు వివరించారు. కేంద్రం వెనుకబడిన తరగతుల సంక్షేమంకోసం బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిందని, అయితే దానిని రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకొని అమలు కాకుండా చేశాయని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇది కార్యరూపం దాల్చేలా చూస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా కావడానికి కేంద్ర సహకారం కూడా ఉందన్నారు. ఖమ్మంలో 2వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చామన్నారు. కాగా, రాష్ట్రంలో పంచ పాండవుల్లాగా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, 100 మంది కౌరవుల్లాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని విమర్శించారు. నాడు భారతంలో ఏ విధంగా జరిగిందో, రాబోయే ఎన్నికల్లో కూడా అదే విధంగా జరుగుతుందన్నారు. జనచైతన్య యాత్రల ద్వారా ప్రజలు బీజేపీకి ఎంతో దగ్గరయ్యారన్నారు. ఈ యాత్రతో బీజేపీకి రాష్ట్రంలో ప్రజాదరణ పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావుకు టీడీపీ ఒత్తిడితో టికెట్ ఇవ్వలేకపోయామని, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి సంకినేనికే టికెట్ ఇస్తామని, ఆయన గెలుపు ఖాయమని జవదేకర్ పేర్కొన్నారు. టీడీపీ వెన్నుపోటు పొడిచే పార్టీ అని, దాన్ని ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఇక నమ్మరన్నారు. బీజేపీ జెండా ఎగురవేస్తాం: లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ జనచైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తెలుపుతున్నారన్నారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ను గద్దె దించేందుకు మళ్లీ పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ జెండా దింపి బీజేపీ కాషాయ జెండాను ఎగురవేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్లో సామాజిక న్యాయం లేదన్నారు. బీజేపీ పాలనలో ముస్లింను రాష్ట్రపతి, తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ను కేంద్రమంత్రిని చేశామన్నారు. మోదీ దెబ్బకు కాంగ్రెస్, కమ్యూనిస్టుల కోటలు కూలుతున్నాయని, త్వరలో టీఆర్ఎస్ గడీలు బద్దలు కావడం ఖాయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బూటకమని, కమీషన్ల కోసమే దానిని చేపట్టారని అన్నారు. అంతా మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన జనచైతన్య యా త్ర ముగింపు సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణదాసు, నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖర్రావు, బద్దం బాల్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, ధర్మారావు, రామకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, మనోహర్రెడ్డి, వెదిరె శ్రీరాం, వెంకటేశ్వర్లు, సాంబమూర్తి, శ్రీనివాస్, మ«ధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రైతుబంధు నాకొద్దు’
జోగిపేట(అందోల్): రైతుబంధు పథకం పేరుతో తన తల్లి జానాబాయి పేర ఉన్న వ్యవసాయ భూమికి వచ్చే చెక్కును తీసుకోనని, దానిని గౌరవంగా తిరస్కరిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. సోమవారం ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి హరీశ్రావు సింగూరు పర్యటన సందర్భంగా దామోదర తల్లి జానాబాయి పేర ఉన్న 20 ఎకరాలకు పెట్టుబడి పథకం కింద రూ.1.60 లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయం తమకు వద్దన్నారు. రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది కౌలు రైతులే పంటలను పండించుకుంటున్నారన్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. బడా రైతుల గురించి కాకుండా చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రైతు కానుకగా భారీ పద్దు!
-
రైతు కానుకగా భారీ పద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఐదో భారీ బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రైతుల సంక్షేమం, వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రూపొందించింది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ అదే పంథాను అనుసరించనుంది. సుమారు రూ.1.81 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. నేడు ఉదయం 11 గంటలకు.. బడ్జెట్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రివర్గం.. 2018–19 బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆయన వరుసగా ఐదో బడ్జెట్ పెట్టనుండడం గమనార్హం. ఇక శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెడతారు. గతేడాది ప్రభుత్వం రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ప్రగతి పద్దుకు రూ.88,038 కోట్లు, నిర్వహణ పద్దుకు రూ.61,607 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయానికి పెద్దపీట నాలుగేళ్లలో రైతుల రుణమాఫీకి రూ.17 వేల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతుల కోసం భారీ వ్యయంతో కూడిన పథకా న్ని ఆవిష్కరిస్తోంది. దేశంలోనే వినూత్నంగా రైతులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేయనుంది. ఏటా రెండు పంట సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రైతులక్ష్మి పేరిట అమలు చేయనున్న ఈ పథకానికి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించనుంది. దీంతోపాటు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించే పథకాన్ని అమలు చేయనుంది. దీనికి రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75 వేల నుంచి రూ.1,00,116కు పెంచనుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఈ ఏడాది రూ.5,400 కోట్ల సబ్సిడీ చెల్లించనుంది. నిరుటి అంచనాలకు ఇంకా దూరమే! ఆదాయ వృద్ధి గణనీయంగా పెరిగినా.. గత బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం ఇప్పటికీ అందుకోలేకపోయింది. జీఎస్టీ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడి రూ.1.20 లక్షల కోట్లకు మించే అవకాశం లేదు. ప్రభుత్వం కాగ్కు సమర్పించిన నివేదికల ప్రకారం జనవరి నెలాఖరు వరకు తొలి పది నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ.66,116 కోట్లు వచ్చింది. ఇక కేంద్రం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచడంతో అదనపు అప్పు సమకూరింది. బడ్జెట్తోపాటు రెండు బిల్లులు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రెండు బిల్లులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర డీజీపీ నియామక అధికారం రాష్ట్రం చేతుల్లోనే ఉండేలా రూపొందించిన ‘హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్సెస్ యాక్ట్–2018’బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇక వైద్యవిద్యలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధనను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లును కూడా ఆమోదించింది. వీటితోపాటు నీటి పారుదల శాఖలో భారీ కార్పొరేషన్ ఏర్పాటు, సాయి సింధు ఫౌండేషన్కు 15 ఎకరాల స్థలం కేటాయింపు, విదేశీ భవన్కు రెండు ఎకరాలు, రాచకొండ కమిషనరేట్కు 56 ఎకరాల స్థలం కేటాయింపులు, ఛనాకా–కొరట ప్రాజెక్టు పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను చేర్చే అంశాలపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త పంచాయతీరాజ్ బిల్లుపై కేబినెట్ చర్చించినా.. ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టాలా.. వేచి చూడాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ అనంతర పరిణామాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ‘సాగు నీటి’కి రుణాలే..! సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో రూ.20 వేల కోట్ల మేర కేటాయించే అవకాశాలున్నాయి. కాళేశ్వరం, పాలమూరు కార్పొరేషన్ల ద్వారా రుణాలను సమీక రించనున్నారు. వివిధ సందర్భాల్లో సీఎం ప్రకటించిన కొత్త వరాలన్నింటికీ తాజా బడ్జెట్లో చోటు కల్పించనున్నారు. వైద్యారోగ్య రంగానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించే అవకాశాలు న్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు రూ.12 వేల చొప్పున ప్రోత్సాహకం, కేసీఆర్ కిట్ పంపిణీ పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులను సమీకరించనున్నారు. వీటికి బడ్జెటేతర కోటా లో రుణాలు సమీకరించనున్నారు. ఇక సబ్సిడీపై గొర్రెలు, బర్రెలు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూతనిచ్చేందుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తారు. ప్రగతిపద్దులో 15 శాతం తగ్గకుండా ఎస్సీ అభివృద్ధి నిధి, 9 శాతం తగ్గకుండా ఎస్టీల అభివృద్ధికి ని«ధులు కేటాయించనున్నట్లు తెలిసింది. -
ఖమ్మం, నల్లగొండ డీసీసీబీలకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను పొడిగిస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల ప్రకారం వాటి ప్రస్తుత పాలకవర్గాలకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేసిన సహకార శాఖనే, చివరకు రాజకీయ ఒత్తిళ్లతో పొడిగింపు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సహకార సంఘాల కాలపరిమితి ఈనెల 3తో, డీసీసీబీల కాలపరిమితి ఈనెల 17తో ముగిసింది. సహకార ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయడంతో వాటన్నింటికీ పర్సన్ ఇన్చార్జులను నియమించాల్సి వచ్చింది. అధికారులను కాకుండా ఆయా పాలకవర్గాలకే పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలుఇచ్చి ఆరు నెలలపాటు పొడిగింపు ఇచ్చారు. ఇక ఖమ్మం, నల్లగొండ పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను తదుపరి కొనసాగించకూడదని సహకారశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా జిల్లాల నుంచి మంత్రుల స్థాయిలో తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు వెనకడుగు వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షులను, డైరెక్టర్లనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మంలో ఆసుపత్రి నిర్మాణంపై ఆరోపణలు... రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంటరుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ.8.11 కోట్లు వసూలుచేసి ఆస్పత్రి నిర్మించింది. అంతేగాక రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా చెబుతున్నారు. వసూలుచేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్నట్లు పాలకవర్గం ఇచ్చిన వివరణ రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ స్పష్టంచేసింది. గతంలో వసూలు చేసిన నిధులు అయిపోతుండటంతో మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండటంపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలోనే ఖమ్మం డీసీసీబీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం డీసీసీబీ పాలకవర్గం అవకతవకలకు పాల్పడుతుందని, దాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి సహకార శాఖ సిఫార్సు చేసినా, చివరకు అదే పాలకవర్గానికి పర్సన్ ఇన్చార్జులుగా పొడిగింపు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
రైతు సంక్షేమం కోసమే పాదయాత్ర
కనిగిరి: సకాలంలో వర్షాలు కురిసి రైతులందరూ ఆనందంగా ఉండాలని కాంక్షిస్తూ తాను రైతు సుభిక్ష యాత్ర చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. ఉగ్ర సేన రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతు సుభిక్ష యాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులు త్వరతగతిన పూర్తి కావాలని, కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నట్లు తెలిపారు. ముందుగా పట్టణంలోని సాయిబాబా దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కనిగిరి నుంచి ఎన్ గొల్లపల్లి మీదుగా వెలిగండ్ల మండలం వైపు పాదయాత్ర సాగింది. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు బుడేసా, జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు షరీఫ్, ఏఎంసీ మాజీ డైరక్టర్లు సుందరరాజ, బొట్టు శ్రీను, పెన్నా రెండో నాగయ్య, వెంకట్రావు, జంషీర్, గౌస్బాషా, రీటా ఫయాజ్, కరీముల్లా, ఉండేల పిచ్చిరెడ్డి, ఉగ్రసేన నాయకులు పాల్గొన్నారు. -
భార్యా పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటా
గుంతకల్లు రూరల్: ‘‘ఆరుగాలం శ్రమించి పండించిన పంట భారీ వర్షాల కారణంగా కళ్ల ముందే నీటమునిగిపోతే పట్టించుకున్న అధికారులు లేరు. పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి సేవ చేసినా నేతలకు కనికరం లేదు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నా, రైతులకు ఎలాంటి మేలు చేకూరలేదు. పంటనష్టంతో ఏటా అప్పుల పాలవ్వడమే తప్ప మమ్మల్ని ఆదుకునే దిక్కులేదు. ఈ స్థితిలో బతికి బాధపడటం కంటే చావే శరణ్యమనిపిస్తోంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం, వేధిస్తున్న పంటనష్టం.. భరించలేక భార్యాపిల్లలతో కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాను’’ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసలుడుకి గ్రామ రైతు కొమ్మె నాగప్ప ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. శనివారం దీన్ని చూసి స్పందించిన బీజేపీ కిసాన్ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు నవీన్కుమార్.. వెంటనే గుంతకల్లు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, హార్టికల్చర్ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బాధితునితో చర్చలు చేపట్టారు. -
సమగ్ర విత్తన చట్టం కోసం కృషి
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తా నని, ఈ విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి, ప్రధాన మంత్రితో చర్చిస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీనిచ్చారు. తెలంగాణ భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని నారాయణగూడలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల భాగస్వామ్యంతోనే దేశం మరింత ప్రగతి సాధిస్తుందని, వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సాగునీరు, 24 గంటల కరెంట్ ఇస్తే కాలానుగుణంగా రైతులు అనేక పంటలను పండిస్తారని, దీంతో ఆత్మహత్యలనేవే ఉండవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు రూ.18 కోట్లు మంజూరు చేసిందన్నారు. -
అనుసంధానంతో రైతన్నకు ఉపశమనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: నదుల అనుసంధానం ద్వారా రైతన్నకు ఉపశమనం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో వ్యవసాయ సంక్షోభంపై స్వల్పకాలిక చర్చలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి సెషన్లో ఏదో ఒక రూపంలో ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. సభ్యులు సూచనలు చేస్తూనే ఉన్నారు. కానీ వాటి అమలులో జాప్యం జరుగుతోంది. రైతుల మానసిక క్షోభ అలాగే ఉండిపోతోంది. ఈ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా పయనిస్తోంది. రైతుల సంక్షేమం పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఇవన్నీ చేసినా ఏటా 12 వేలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. ముఖ్యంగా బ్యాంకు రుణాల పంపిణీ చిన్న, సన్నకారు, కౌలు రైతులకు సక్రమంగా అందట్లేదు. ఎరువులు, పురుగు మందులు తదితర ఉత్పాదితాలకోసం అప్పు తేవడం తప్పనిసరవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పావలా వడ్డీకే రుణాలిచ్చేలా చేశారు. విస్తృతమైన అవగాహన కల్పించగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రుణాలందేలా పట్టణ ప్రజల భాగస్వామ్యంతో ఒక నిధిని ఏర్పాటు చేసి వారికి సాయమందేలా చూడాలి’’ అని ఆయన సూచించారు. -
రైతు సర్వే 83 శాతం పూర్తి
- 46.17 లక్షల మంది రైతుల వివరాల సేకరణ - సర్వే పూర్తి కాకపోవడంపై సీఎం అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహించిన రైతు సమగ్ర సర్వేలో 46.17 లక్షల మంది సమాచారాన్ని సేకరించారు. మొత్తం 55.63 లక్షల మంది రైతులుండగా, సర్వే ముగిసిన ఈ నెల 15 నాటికి 83శాతం మంది నుంచి వివ రాలు సేకరించినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. ఇంకా 9.45 లక్షల మంది(17 శాతం) రైతుల వివరాలను సేక రించలేకపోయామంది. గడువు ఐదు రోజులు పెం చినా సర్వే పూర్తి కాకపోవడంపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై శుక్ర వారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు సమాచారాన్ని సేకరించాలని కోరారు. అయితే ప్రతీ రైతు వివరాలు నమోదు చేసే వరకు కొనసాగించాలని ఆదేశించినట్లు తెలిసింది. నిర్మల్లో 100 శాతం... వచ్చే ఏడాది వానాకాలం, యాసంగి ల్లో రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున ప్రోత్సాహకం ఇచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందు కోసం రైతుల సమగ్ర వివరాలు సేక రించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. గత నెల 17న ప్రారంభమైన సర్వేను జూన్ 10 నాటికి పూర్తిచేయాలని సూచించారు. అప్పటికీ పూర్తికాక పోవడంతో ఈ నెల 15 వరకు గడువు పెంచారు. మొత్తం30 జిల్లాల్లోని 558 మండలాలు, వాటిల్లోని 10,576 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో నూటికి నూరు శాతం సర్వే జరిగింది. అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో 64.4శాతమే జరిగింది. కాగా, రైతుల సమాచారం సేకరించి, దాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ల్యాప్టాప్లు ఇవ్వాలని సీఎం సూచించారు. కానీ ల్యాప్టాప్ల బదులు 1,780 ట్యాబ్లు ఇవ్వాలని నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. కేవలం 1,100 మందికి మాత్రమే వాటిని అందించింది. అందరికీ ట్యాబ్లు ఇవ్వకపోవడంవల్లే సర్వే ఆలస్యం జరిగిందన్న విమర్శలున్నాయి. -
రైతు సంక్షేమానికి పెద్దపీట
మంత్రి టి.హరీశ్రావు జహీరాబాద్: రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆదివారం రాత్రి సీడీసీ చైర్మన్ ఉమా కాంత్ పాటిల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అన్నదాతకు ఎక రాకు రూ.4 వేల వంతున ఎరువుల కింద అందించేందుకు నిర్ణయించిందని గుర్తు చేశా రు. పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకు సైతం ఈ పథకం వర్తిస్తుందన్నారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన కరెం టును పగటి పూటే అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో 24 గంటల పాటు నిరంత రాయ విద్యుత్ సరఫరాకు సీఎం ప్రయత్ని స్తున్నారన్నారు. ఈ సమావేశంలో జహీరా బాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఎం.డి.ఫరీ దుద్దీన్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న తదితరులు పాల్గొన్నారు. ఇక బాలురకూ కేజీబీవీలు సిద్దిపేట జోన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇకపై బాలుర కోసం కూడా నెలకొల్పుతామని మంత్రి హరీశ్రావు అన్నా రు. ఆదివారం ఆయన సిద్దిపేటలో విలేకరు లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లా కేంద్రాల్లో అర్బన్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి
ఉచిత ఎరువులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు: ఎంపీ వినోద్ సాక్షి, సిరిసిల్ల: రైతు సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునే కోర్టు కేసులను ఉపసంహరించు కోవాలని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి హైకోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. సుందిళ్ల, మేడిగడ్డ, కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేసులు వేశారని గుర్తు చేశారు. రైతులకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తే తప్పు లేదని అన్నారు. తొలకరి జల్లుపడగానే మే చివరలో రైతులు ఎరువులు కొనుగోలు చేయడానికి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయని చెప్పారు. ఉచిత ఎరువుల పథకాన్ని తమ వద్ద కాపీ కొట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ, కాంగ్రెస్ బుర్రలకు అలాంటి ఆలోచనలు రావని అన్నారు. -
యోగి రుణమాఫీ కూడా.. కంటి తుడుపేనా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రైతు రుణమాఫీ కంటితుడుపు మాత్రమేనని, దాంతో తమకు ఏమంత గొప్ప ప్రయోజనం ఉండబోదని రైతులు మండిపడుతున్నారు. దాదాపు లక్ష మంది సన్నకారు, చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేలా మొత్తం రూ. 36,359 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అది ప్రభుత్వానికి పండగ కావచ్చు గానీ, రైతులకు మాత్రం కాదని.. ఆకలితో ఏడుస్తున్న పిల్లాడికి లాలీపాప్ ఇచ్చినట్లే ఉందని మథుర జిల్లాలోని బోర్పా గ్రామానికి చెందిన కేదార్ సింగ్ అన్నారు. మొత్తం రైతులకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని తాము భావించినట్లు మథుర తాలూకా దామోదర్పురా గ్రామ సర్పంచ్, రైతు దేవీ సింగ్ చెప్పారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సమావేశాల్లో తమను ఘోరంగా మోసం చేశారని రాజన్ సింగ్ మండిపడ్డారు. రుణమాఫీ గురించి ప్రధానమంత్రి ఎన్నికల సభలలో చెప్పేటప్పుడు ఎవరెవరికి ఇది వర్తిస్తుందన్న విషయాన్ని అప్పట్లో చెప్పలేదని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దులిపేసుకొంటోందని, ఇదంతా కంటితుడుపు చర్యగా ఉంటోందని విమర్శించారు. కేవలం 2016-17 సంవత్సరంలో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని చెప్పడం కూడా అన్యాయమన్నారు. గత మూడేళ్లుగా ప్రకృతి ప్రకోపం వల్ల రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని, ఇలాంటి సమయంలో కేవలం లక్ష రూపాయల లోపు రుణాలే మాఫీ చేస్తామంటే ఇది సముద్రంలో నీటిబొట్టు వేయడం లాంటిదని దీన్ దయాళ్ గౌతమ్ అనే రైతు తెలిపారు. కొద్ది మంది రైతులు మాత్రం రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సాధారణంగా చిన్న రైతులకు బ్యాంకులు లక్ష రూపాయలకు మించి రుణాలు ఇవ్వవని కుశాల్ సింగ్ అనే రైతు అన్నారు. కేవలం గత సంవత్సరంలోనే పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇది మంచి వరం లాంటిదని లోకేంద్ర అనే ఇంకో రైతు చెప్పారు. ఇంతకుముందు తీసుకున్న రుణాలు కూడా కట్టలేని రైతులు ఉన్నారని, వాళ్లకు కూడా ఇది వర్తింపజేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
హీరోకు చేదు అనుభవం.. కారుపై దాడి
సాక్షి, బెంగళూరు : సినీనటులు జనాల్లోకి వస్తే ఆనందోత్సవాలతో అభిమానులు బ్రహ్మరథం పడుతారు. అది సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ కూడా అలాగే జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అదే అభిమానం ఆగ్రహంగా మారితే హీరోలకు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కన్నడ హీరో యశ్ ఆలస్యంగా రావడంతో ఆగ్రహం చెందిన అభిమానులు, గ్రామస్థులు ఆయన కారును సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. యాదగిరి జిల్లాలోని సురపుర గ్రామంలో కరువు బారిన పడ్డ రైతులను పరామర్శించడానికి యశ్ సోమవారం మధ్యాహ్నం గ్రామానికి రావాల్సివుంది. అయితే కొన్ని కారణాల వల్ల యశ్ రాత్రి 9 గంటలకు కూడా రాలేదు. అప్పటి వరకు యశ్ రాక కోసం కొండంత ఆశతో ఎదురు చూసిన అభిమానులు, ప్రజలు ఆయన రావడం మరింత ఆలస్యం కావడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పది గంటల దాటిన తర్వాత వచ్చిన హీరో కారుపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. దీంతో హీరో యశ్ ఒక్కసారిగా కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చివరకు ఆలస్యానికి గల కారణాలను యశ్ వివరించడంతో గ్రామస్తులు శాంతించారు. -
2015లో ఏపీలో 516 మంది రైతుల ఆత్మహత్య
రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రశ్నకు కేంద్రం సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో 516 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం తెలిపింది. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు కోరుతూ రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు శుక్రవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2014 సంవత్సరంలో 160 మంది, 2015లో 516 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 2014లో 898 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2015లో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మంత్రి తెలియజేశారు. -
బావుల తవ్వకాలు.. నవ్వుల పాలు!
ఇందూరు : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కలిపి మూడేళ్లలో 420 నూతన బావుల తవ్వకానికి రూ.8.70 కోట్లు మంజూరయ్యాయి. కానీ.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల్లో ఒక్క బావి మాత్రమే తవ్వకం పూర్తయింది.70 నూతన బావుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇంకా 349 బావుల తవ్వకం ప్రారంభించలేదు. కామారెడ్డి జిల్లాలో ఏడాదికి 60 చొప్పున బావులు మంజూరైనా ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే పూర్తయింది. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఏడాదికి 80 నూతన బావుల తవ్వకం కోసం నిధులు ఖర్చుకాలేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో బావుల తవ్వకం, సేంద్రియ ఎరువుల తయారీ, రైతుల జల సౌధలు(ఫారం ఫాండ్స్), పశువుల పాకలు మొదలైనవి రైతులకు ఉపయోగపడే పనులు ముందుకు సాగడం లేదు. ఒక్క బావిలో పూడిక తీయలేదు.. ఉమ్మడి జిల్లాల్లో 30 శాతం పంటలకు నీటి సరఫరా బావుల ద్వారానే కొనసాగుతోంది. 2014–15 సంవత్సరంలో కొత్త బావుల తవ్వకానికి, పూడిక తీతకు నూతన మార్గదర్శకాలు రూపొందించిన అధికారులు అటకెక్కించారు. అలాగే ఆ ఏడాది తవ్విన బావులకు సకాలంలో కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు బావుల తవ్వకం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమవుతున్నారు. తద్వారా రైతులు ఆసక్తి చూపడం లేదు. అలాగే ఉమ్మడి జిల్లాల్లో మూడు దశాబ్దాలలో తవ్విన పాత బావులు 49,500 వరకు ఉన్నాయి. అధికారులు రైతులకు అవగాహన కల్పించి గత వేసవిలో పూడికతీత పనులు చేయించి ఉంటే.. ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు బావుల్లోకి నీళ్లు చేరి భూగర్భ జలాలు బాగా పెరిగి వ్యవసాయానికి లాభసాటిగా ఉండేది. అధికారుల పనితీరు కారణంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాల్లోని 49 మండలాల్లో ఒక్క బావిలో కూడా పూడికతీత పనులు చేపట్టకపోవడం గమనార్హం. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు బావుల తవ్వకం కంటే గొట్టపు బావుల తవ్వకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తీయించడం, పారే నీటిని నిలువరించేందుకు వీలుగా అడ్డంగా రాతికట్టు కట్టించడం వంటివి చేపడితే బాగుండేది. వర్షం నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నీటి నిల్వ కుంటలు, పాత బావుల్లో పూడికతీత పనులు చేపడితే సమృద్ధిగా నీటి సంరక్షణ జరిగేది. ప్రమాదకర బావులను పూడ్చడం లేదు.. జిల్లాలో చాలా గ్రామాల్లో ఇంటికి ఆనుకుని, రోడ్ల పక్కన, వ్యవసాయ గట్ల పక్కన వృధాగా ఉండి ప్రమాదకంగా ఉన్న బావులను పూడ్చడానికి ఉపాధిహామీ పథకం ద్వారా అవకాశం ఉంది. ప్రమాదకర బావుల వల్ల చాలా మందితోపాటు పశువులు కూడా పడి మృతి చెందిన సంఘటనలున్నాయి. ఇలాంటి బావులను పూడ్చివేయడం రైతులకు, స్థానికులకు ఆర్థికంగా ఇబ్బందే. ముఖ్యంగా జక్రాన్పల్లి, ఆర్మూర్, గాంధారి, జుక్కల్ మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కావునా.. ఉపాధిహామీ పథకం కింద పాడుబడ్డ పాత బావులను పూడ్చి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంపీడీఓల సహాయంతో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో ఇలాంటి బావులను గుర్తించి పూడ్చివేయిస్తే బాగుంటుంది. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మునిపల్లి : రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. మంగళవారం మండలంలోని కంకోల్ గ్రామానికి చెందిన శ్రీశైలం స్వామిని రాయికోడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే బాబూమోహన్కు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరాబాద్కు వెళ్లారు. బాబూమోహన్ వైస్ చైర్మన్ కంకోల్ శ్రీశైలం స్వామికి స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు దగ్గరలో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 18వ తేదీన జోగిపేటలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల క్రిస్టియన్లు 2 వేల మందికి బట్టలు పంపిణీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దలోడి బస్వరాజ్ పాటీల్ ఎమ్మెల్యే బాబూమోహన్ను కోరారు. బాబూమోహన్ సానుకులంగా స్పందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, తాటిపల్లి సర్పంచ్ అల్లం నవాజ్రెడ్డి, కంకోల్ మాజీ సర్పంచ్ నిర్మాల షెట్టి పాల్గొన్నారు. -
కబ్జాకు గురైన మార్కెట్ స్థలం స్వాధీనం
శంకర్పల్లి: రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని వారి కోసం నిరంతరం పాటు పడుతామని శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్యాదవ్ తెలిపారు. శంకర్పల్లి మార్కెట్ కమిటీ సమీపంలో సర్వే నెంబర్196/ఎలో కొంత భాగం కబ్జాకు గురెంది దానిని బుధవారం పాలకమండలి సభ్యులు అందరూ కలిసి స్వాధీనం చేసుకొని సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో మొత్తం 7ఎకరాల30 గుంటల భూమి ఉందని అన్నారు. కాగా కొంత మంది అక్రమార్కులు మార్కెట్ కమిటీ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ పశువుల సంతను ఏర్పాటు చేశామని తెలిపారు. గ తంలో పశువుల సంత మార్కెట్ ఆవరణలో జరిగేదని దీంతో వ్యాపారులు , రైతులు ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఇప్పుడు స్వాదీనం చేసుకున్న స్థలంలో పశువుల సంతను తరలించడం వలన ఉల్లి వ్యాపారులకు, రైతులకు ఇక్కట్లు తొలి గిపోయాయని అన్నారు. త్వరలోనే రైతుల కొరకు విశ్రాంతి భవననిర్మాణం చేపడుతామని అందుకు ప్రభుత్వనికి ప్రతిపాదనలు పాలకవర్గం తీర్మాణం చేసి పంపుతామని అన్నారు. మార్కెట్ కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ 5నవంబర్ 2015 సంవత్సరంలో ఈ భూమినిమార్కెట్ కమిటీ అధీనంలోకి వచ్చిందని అందుకే స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పోలీసులు అన్నిరకాలుగా సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దండురాజేశ్వర్, సర్పంచ్ శ్రీధర్, గుడిమల్కాపూర్ మార్కెట్కమిటీ డెరైక్టర్ శేరి అనంత్రెడ్డి, మార్కెట్కమిటీ డెరైక్టర్లు వార్డు సభ్యులు, రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. రైతుల విజయం... కబ్జాకుగురైన మార్కెట్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం రైతుల విజయం అని భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాంరెడ్డి, పాండురంగం, ప్రకాశ్చారి అన్నారు. బుధవారం వారు మాట్లాడు తూ మార్కెట్ స్థలం కబ్జాకు గు రైందని ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా మంత్రి హరీష్రావు, జిల్లా కలెక్టర్తో మాట్లాడి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారని అన్నారు. అధికారులు వెను వెంటనే రికార్డులు పరిశీలించి స్థలం కబ్జాకు గురైందని గుర్తించి కలెక్టర్ అదేశంతో తిరిగి స్వాధీనం చేసుకు న్నారన్నారు. రెతు సంఘం స హాయకార్యదర్శి దేవిరెడ్డి, జనార్దన్రెడ్డి, మోహన్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు ఉన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పెద్దశంకరంపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీపీ రాయిని సంగమేశ్వర్ అధ్యక్షతన పెద్దశంకరంపేట మండల పరిషత్ సాధరణ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రబీ సీజన్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రియాంక కాలనీలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎంపీటీసీ నిరసన.. వేసవిలో తాగునీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని పెద్దశంకరంపేట ఎంపీటీసీ సుభాష్గౌడ్ సభలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఇతర సభ్యులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రాజు, ఎంపీటీసీలు వేణుగోపాల్ గౌడ్, మాణిక్రెడ్డి, స్వప్న, సర్పంచ్లు జంగం శ్రీనివాస్, మధు, కాశీరాం, నర్సింలు పాల్గొన్నారు. -
విత్తన వేరుశనగ కోసం ఎదురుచూపు
- ఎప్పుడు ఇచ్చేదీ చెప్పలేమంటున్న అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : రబీలో నీటి వసతి కింద పంట సాగు చేసేందుకు వీలుగా విత్తన వేరుశనగ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎపుడిస్తామో చెప్పలేమంటూ వ్యవసాయశాఖ అధికారులు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు రబీ పంటగా వేరుశనగ విత్తుకునేందుకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది నవంబర్ 8వ తేదీ నుంచి విత్తన వేరుశనగ పంపిణీ చేశారు. దీంతో రైతులు సకాలంలో విత్తుకున్నారు. ఈ సారి మాత్రం ఆ దిశగా ఎలాంటి సన్నాహాలు చేపట్టకపోవడంతో ఇస్తారో.. లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రబీలో బోరుబావులు, ఇతరత్రా నీటి వసతులున్న 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతూ వస్తోంది. ఏటా ఖరీఫ్లో విత్తన వేరుశనగ సమస్యను అధిగమించాలంటే రబీలో పండించే పంట కీలకం. వర్షాలను నమ్ముకుని సాగు చేసిన ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బ తినడంతో జిల్లాలో రైతుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. విత్తన వేరుశనగ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత కూడా చాలామందికి లేకపోయింది. రబీ రైతులకు 15 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ కేటాయించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా వాటి ధరలు, రాయితీలు, మార్గదర్శకాలు, పంపిణీ ఎప్పుడనేదీ చెప్పడం లేదు. ఆ దిశగా కసరత్తు చేసిన దాఖలాలు కూడా లేకపోవడంతో బాగా ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా గతేడాది మండల కేంద్రాల్లో పర్మిట్లు తీసుకుని అనంతపురం, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, పెనుకొండ, హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి డివిజన్ కేంద్రాల్లో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం క్వింటా ధర రూ.6,300గా నిర్ణయించి అందులో 33 శాతం రాయితీ పోనూ రూ.4,200లతో రైతులకు 15వేల క్వింటాళ్ల విత్తనం పంపిణీ చేశారు. ధరలు, రాయితీలు ఖరారు కాగానే ఈ సారి కూడా త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా
నకిరేకల్ : రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలో 3.8కోట్లతో నిమ్మ మార్కెట్కు, రూ. 3.7కోట్లతో మినీ ట్యాంక్ నిర్మాణ పనులకు స్థానిక పెద్ద చెరువు వద్ద సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. స్థానిక మెయిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. అందరికంటే ముఖ్యంగా రైతన్న బాగుండాలనదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో 45శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.25వేల కోట్ల నిధులతో రైతుల కోసం ఊరూరా మిషన్ కాకతీయ కింద చెరువుల బాగు కోసం ఖర్చుచేశామన్నారు. ఒకప్పుడు చెరువు మీదకు వెళ్తే సర్కారు, తుమ్మ చెట్లు తప్ప మరేవి కనపడేవి కావు. గత పాలకులు చెరువుల బాగు గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం హయూంలో గ్రామంలోని చెరువులు నీటితో నిండుగాా కళకళలాడుతూ ఊరికి జీవనోపాధిగా నిలిచాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాబోయే యాసంగి పంటలలో రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామన్నారు. ఒక్క చుక్క మూసీ నీటిని కూడా కృష్ణాలోకి పోనివ్వం.. ఈ జిల్లాలకు హరితహారంలో సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు రూ.285 కోట్లను మూసీ ఆధునీకరణ కోసం అడగగానే వెంటనే నిధులు మంజూరు చేశామని, త్వరలో టెండర్లు పిలిపించి ఈ ఎండాకాలంలోనే మూసీ కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టి ఒక్కచుక్క మూసీ నీటిని కృష్ణానదిలోకి పోనివ్వకుండా కృషి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా త్వరలోనే టెండర్లు వేసి అతిత్వరలోనే పనులు ప్రారంభించి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే ప్రయత్నం తమ ప్రభుత్వం చేయబోతుందన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అటవీశాఖ రాష్ట్ర చైర్మన్ బండ నరేందర్రెడ్డి, జెడ్పీచైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూలరవీందర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, నకిరేకల్, శాలిగౌరారం మండలాల జెడ్పీటీసీలు పెండెం ధనలక్ష్మి సదానందం, ఐతగోని సునిత, ఎంపీపీలు రేగట్టె మల్లికార్జున్రెడ్డి, లింగస్వామి, నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, సుంకరి మల్లేష్గౌడ్, పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, వివిధ మండలాల మండల శాఖ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, రహీంఖాన్, రాములు, వెంకన్న, శ్రీనివాస్ ఉన్నారు. -
కురవిలోని ఓ ఇంట్లో చోరీ
కురవి మండలకేంద్రంలోని ఖమ్మం ప్రధాన రహదారిలో కల్ల పెద్దిరెడ్డి అనే రైతుఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి గుర్తుతెలియని వ్యక్తులు గడ్డపారతో గొళ్లెం తొలగించారు. ఇంట్లో దాచిన 18 తులాల వెండిపట్టీలు, రూ.15 వేల నగదు, రూ.25 వేల విలువ చేసే బంగారు గొలుసు తస్కరించారు. చోరీ జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లు పొలంలో పనికి వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విత్తనాలు ఇచ్చేది ఇంకెప్పుడో..?
కడప అగ్రికల్చర్: జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. ఏటా సీజన్ కంటే ముందే అన్ని సిద్ధం చేసి విత్తనాలను జిల్లా యంత్రాంగం పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది రబీ సీజన్ మొదలైనా ఇప్పటికి సాగుకు తగ్గ ప్రణాళికలు తయారు చేయకపోవడం, విత్తనాలు ఎప్పుడిస్తారు? ఏఏ విత్తనాలు ఇస్తారు? విత్తనాలు తీసుకోవడానికి ఏమేమి సమర్పించాలి? అనే విషయాన్ని ఇంతవరకు వెల్లడించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభమైనా ఇంత వరకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల విత్తన కేటాయింపులు చేపట్టకపోవడంపై రైతు సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇటీవల రోజు మార్చి రోజు కురిసిన వర్షాలకు భూములు పదునెక్కాయి. విత్తనాలు పంపిణీ చేస్తే విత్తనం వేసుకుందామని రైతులు ఎదురు చూస్తున్నారు. కొన్ని మండలాల్లో సకాలంలో అదునులో పదునైంది. విత్తనం భూమిలో పడితేనే దిగుబడులు వస్తాయనేది రైతుల నమ్మకం. కానీ జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశ పరచడంతో ఖరీఫ్ పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 66.09 వేల హెక్టార్లలో సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోవడంతో కోట్లాది రూపాయల రాబడిని నష్టపోయారు. అయితే ఈ నష్టాన్ని, కష్టాన్ని దిగమింగుతూ రబీ సీజన్లో పంటల సాగుకు రైతులు సిద్ధపడుతున్నారు. కోటి ఆశలతో పంటలసాగు... నైరుతి రుతుపవనాలు నట్టేట ముంచాయని, ఇప్పుడు వస్తున్న ఈశాన్య రుతుపవనాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ శాన్యమైనా కరుణించకపోతుందా అని కోటి ఆశలతో పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ రబీలో బుడ్డశనగను 89,398 హెక్టార్లలోను, వేరుశనగ 18,283 హెక్టార్లలోను, నువ్వులు 7,780 హెక్టార్లలోను, ప్రొద్దుతిరుగుడు 31,791 హెక్టార్లలోను, పెసర 3409 హెక్టార్లలోను, మినుము 2660 హెక్టార్లలోను, జొన్న 11195 హెక్టార్లలోను, మొక్కజొన్న 2377 హెక్టార్లలోను, సజ్జ 1735 హెక్టార్లలోను , వరి 9913 హెక్టార్లలోను సాగు చేస్తారని ఒక అంచనా. అయితే ఇంతవరకు ఆయా పంటలకు విత్తనాలు ఏ మండలానికి ఎంతెంత ఇస్తారో ప్రణాళిక తయారు కాకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యవసాయశాఖ బుడ్డశనగలు 65,430 క్వింటాళ్లు, వేరుశనగకాయలు 27,500 క్వింటాళ్లకు అనుమతులు ఇచ్చింది. కానీ ఇతర విత్తనాలకు అనుమతులు ఇవ్వలేదు. రైతులకు కావలసిన విత్తనాలన్నీ ఇస్తామని చెబుతున్నా ఇంతవరకు పంపిణీ ప్రస్తావన లేదు. ఈ విత్తన పంపిణీ కాగితాల్లో మూలుగుతూనే ఉంది గాని, ఉన్నతస్థాయి అధికారుల ముద్ర ఎప్పుడు పడుతుందో, విత్తనం ఎప్పుడిస్తారోననే అయోమయం రైతుల్లో నెలకొంది. ఖరీఫ్తో పోలిస్తే రబీలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుంది. కానీ సకాలంలో విత్తనాలు ఇవ్వకపోతే ప్రయోజనం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా అయితే గత నెల సెప్టెంబర్లోనే రైతులకు బుడ్డశనగ, మినుములు,పెసలను అందించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఈనెల మొదటి వారంలో విత్తనాలు పంపిణీ చేసే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. ప్రతి రోజు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు వీడియో కాన్ఫరెన్సులు, టెలి కాన్ఫరెన్సులు, జిల్లా సమీక్ష సమావేశాలతో కాలం వెల్లదీస్తున్నారని ఆ శాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. గ్రామాల్లోని రైతులు విత్తనాలు ఎప్పుడిస్తారని ప్రతి రోజు ఫోన్లు చేసి మరీ అడుగుతుంటే చెప్పలేకపోతున్నామని ఓ మండల వ్యవసాయాధికారి సాక్షికి తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఏఏ పంటలు సాగు చేసుకుంటే బాగుంటుందని అడుగుదామనుకుంటే సమాచారం చెప్పే నాథుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో నల్లరేగడి, తువ్వ నేలలు పదునెక్కాయి. ఈ పదును పోకముందే కాసిన్ని విత్తనాలు ఇస్తే.. సాగు చేసుకుంటే దిగుబడులు వస్తాయని, అదును, పదును పోయాక విత్తనాలు ఇచ్చినా ఉపయోగం ఉండదని రైతులు అంటున్నారు. మండలాల వారీగా కేటాయింపులు,ఏఏ మండలాల్లో ఎప్పుడెప్పుడు పంపిణీ చేసేది వెంటనే ప్రకటించాలని రైతులు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. ు -
ఏడాదిగా ఎదురుచూపు
♦ ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతన్నల పాట్లు ♦ గత ఏడాది 16 వేల హెక్టార్లలో పంట నష్టం ♦ తుఫానుతో కుళ్లిపోయిన వేరుశనగ ♦ కంటితుడుపుగా రూ. 23.80 కోట్లతో ప్రతిపాదనలు ♦ నేటికీ విడుదల కాని నిధులు ♦ పట్టించుకోని పాలకులు అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయ, రెవెన్యూతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గతేడాది నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో (2015కు సంబంధించి) పంట నష్టం అంచనా వేశారు. 33 మండలాల పరిధిలో 23.80 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తేల్చిచెప్పారు. 16,311 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 15,167 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు పెట్టుబడిరాయితీ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. గత 15 సంవత్సరాల్లో ఎపుడూ లేని విధంగా నామమాత్రపు ఇన్పుట్ సబ్సిడీతో నివేదిక పంపేసి జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఏడాదవుతున్నా పరిహారాన్ని మంజూరు చేయించడంలో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తున్నారు. తుఫాను తాకిడికి అతలాకుతలం వాస్తవానికి గతేడాది నవంబర్లో వేరుశనగ పంట తొలగించే సమయంలో సంభవించిన తుఫాను వర్షాలకు వేరుశనగతో పాటు పత్తి, పెసర తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ నెలలో 2న 12.9 మి.మీ, 10న 11.5 మి.మీ, 11న 12 మి.మీ, 18న 18.7 మి.మీ, 25న 8.1 మి.మీ చొప్పున భారీ సగటు వర్షపాతం నమోదైంది. విరామం లేకుండా కదిరి, పుట్టపర్తి డివిజన్లలో భారీ గానూ ధర్మవరం, పెనుకొండ, హిందూపురం డివిజన్ల పరిధిలో మోస్తరుగా వర్షాలు పడ్డాయి. మొత్తమ్మీద నవంబర్ నెల సాధారణ వర్షపాతం 34.7 మి.మీ కాగా ఏకంగా 99.6 మి.మీ వర్షం కురిసింది. నెలలో నాలుగైదు రోజులు మినహా తక్కిన రోజుల్లో వర్షపాతం నమోదు కావడం విశేషం. దీంతో తొలగించిన వేరుశనగ పంట పొలాల్లోనే కుళ్లిపోయింది. వేరుశనగ కట్టె గ్రాసానికి కూడా పనికిరాలేదు. కాయలు రంగు మారి మొలకెత్తాయి. ఇంకా తొలగించని ప్రాంతాల్లో కూడా మొలకలు రావడంతో రైతులకు భారీగానే నష్టం జరిగింది. ఇలా అంతోఇంతో చేతికొచ్చిన పంట దక్కకుండా పోయింది. తుఫాను వర్షాలకు 30 వేల హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో వేరుశనగ దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ 16 వేల హెక్టార్లకే అధికారులు పరిమితం చేయడం విశేషం. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో పర్యటించి ఇన్పుట్ సబ్సిడీతో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ... ఇప్పటి వరకు పైసా కూడా మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. -
ప్రకతి వ్యవసాయ శిక్షణకు రెతులు
ప్రత్యేక వాహనం జెండా ఊపి ప్రారంభించిన జేడీఏ నెల్లూరు రూరల్ : తిరుపతిలో జరిగే నాలుగు రోజుల పెట్టుబడి లేని ప్రకతి వ్యవసాయ శిక్షణ జిల్లా నుంచి రైతులు, వ్యవసాయాధికారులు శనివారం బయలు దేరారు. స్థానిక మినీబైపాస్రోడ్డులో వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలను జేడీఏ కె.హేమమహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా, తిరుపతి నగరంలోని డాక్టర్ రామానాయుడు కల్యాణ మండపంలో ఈనెల 11వ తేదీ నుంచి 14 వరకు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి 300 మంది రైతులను, 100 మంది వ్యవసాయ అధికారులను, 8 ప్రత్యేక బస్సుల్లో పంపినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రకతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ రవిచంద్ర ప్రసాద్, ఏడీఏలు, ఏఓలు, రైతులు పాల్గొన్నారు. -
మీరా రైతుల గురించి మాట్లాడేది?
కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్రావు ఫైర్ గజ్వేల్: అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడేమో ‘రైతు రణభేరి’ పేరిట దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్లో ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ కనబరుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి.. ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నడు. వాస్తవాలు మాట్లాడతాడనుకునే జానారెడ్డి సైతం పచ్చి అబద్ధాలే చెబుతుండు’ అంటూ మండిపడ్డారు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన 93 మంది బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల ప్యాకేజీ అందించామని పేర్కొన్నారు. కళ్లు లేనోడికి మాటలతో చెప్పొచ్చు.. చెవులు వినబడనోళ్లకు రాసి చూపించొచ్చు.. అన్నీ ఉన్నా కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు కనబడటం లేదో అర్థం కావడం లేదన్నారు. మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకున్న వివరాలను ఉత్తరం రాసి అందిస్తానని, వీటిని పరిశీలించి అవసరమైతే పునఃపరిశీలన చేసుకోవాలని ఉత్తమ్, జానారెడ్డిలకు సూచించారు. మీరు తిరస్కరించిన రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాల స్థితిగతులపై పునర్విచారణ జరిపి రూ.42లక్షలు పెండింగ్ బకారుులు చెల్లించామని మంత్రి తెలిపారు. కోర్టుల్లో కేసులు వేయిస్తూ ఎన్ని రకాల కుట్రలు పన్నినా గోదావరి జలాలతో కరువును తరిమికొడతామని చెప్పారు. తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా గజ్వేల్లో రూ.కోటిన్నరతో ధాన్యం ఆరబెట్టే యంత్రం (డ్రయ్యర్)ను త్వరలోనే ఏర్పాటు చేరుుస్తామని ప్రకటించారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్రావు ఎడ్లబండిపై ఎక్కి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి మార్కెట్ యార్డు వరకు ర్యాలీగా వచ్చారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పలాస: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ చెప్పారు. పలాస మండలంలోని ఉద్దానం ప్రాంతంలోని వివిధ పంచాయతీల్లో బుధవారం రైతులకు ఆయన రుణవిముక్తి పత్రాలను అందజేశారు. గురుదాసుపురంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సొర్ర చంద్రయ్యకు మందులు నిమిత్తం రూ.3100లు అందజేశారు. అలాగే అదే గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి గ్రామాల్లో రైతులకు రుణ విముక్తి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, పలాస ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ వంకల కూర్మారావు, టీడీపీ నాయకుడు కుత్తుం లక్ష్మణకుమార్, బొడ్డపాడు సర్పంచ్ తామాడ త్రిలోచనరావు, ఎంపీటీసీ సభ్యుడు మద్దిల రామారావు, ఎంపీడీవో పైల సూర్యనారాయణ, వ్యవసాయ సహాయ సంచాలకులు చల్లా దశరథుడు, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు. పాఠశాల భవనం ప్రారంభం మందస: నాతుపురంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన పాఠశాల భవనాన్ని పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనానికి ఆర్వీఎం నిధులు నుంచి రూ.5.40 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి తాతారావు, కొర్ల కన్నారావు, డి.తిరుపతిరావు, సిర్ల కృష్ణారావు, జీకే నాయుడు, కోనారి తులసీరావు పాల్గొన్నారు. -
రైతుల హక్కులను కాలరాస్తున్న సర్కారు: మల్లు రవి
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన 123 జీవో రైతుల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ టీపీసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడో విడత రుణమాఫీని ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. కోదండరామ్పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందని విమర్శించారు. దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు గులాబీ రంగు వేయడంపై అన్ని జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. -
ప్రతిపక్ష ఎమ్మెల్యేకు గుర్తింపు ఉండదా ?
రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి బొబ్బిలి: టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వడంలేదని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్ముంనాయుడు అన్నారు. ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గుర్తింపు ఉండదా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో ఎమ్మెల్యేలకు కాకుండా పార్టీ కార్యకర్తలను చైర్మన్లుగా ప్రభుత్వం నియమిస్తోందిని చెప్పారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కమిటీతో కార్యకర్తలకు పనులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టును ఆశ్రయించి జన్మభూమి కమిటీలను రద్దు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు బెల్లాన రామినాయుడు, పాలవలస సూర్యనారాయణ తదతరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వమిస్తామన్న కౌలు మొత్తాన్ని తీసుకోండి
సీఆర్డీఏ రైతులకు హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: జరీబు భూముల వివాదంలో సీఆర్డీఏ అధికారులు కౌలు కింద ఎంత మొత్తం చెల్లించాలని నిర్ణయించారో, దాన్ని తీసుకోవాలని రైతులకు హైకోర్టు సూచించింది. కౌలు తీసుకున్నంత మాత్రాన రైతుల హక్కులు, వాదనలకు భంగం వాటిల్లదని భరోసానిచ్చింది. అంతేగాక ఈ చెల్లింపులు తాము వెలువరించే తుదితీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ గ్రామంలో కొన్ని సర్వేనంబర్లలో ఉన్న భూముల్ని మాత్రమే జరీబు భూములుగా పరిగణించడం అన్యాయమని, రెండుపంటలు పండుతున్న తమ భూముల్నీ జరీబు భూములుగా పరిగణించడంతోపాటు కృష్ణాయపాలెం గ్రామాన్ని సెమీ అర్బన్ విలేజ్గా పరిగణించి, ప్రయోజనాల్ని వర్తింపచేయాలంటూ కారుమంచి అనిల్కుమార్ అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం... హామీ ఇచ్చినట్టుగా కౌలు కింద చెల్లిస్తామన్న మొత్తాన్ని విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అంతేగాక ఆ మొత్తాన్ని తీసుకోవాలని పిటిషనర్కు సూచించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితరుల్ని ఆదేశించింది. -
'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
- విడుతల వారిగా మార్కెట్ను అభివృద్ధి చేస్తాం - జిల్లా కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం - ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్: వ్యవసాయ రైతుల సంక్షేమ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక మార్కెట్యార్డులో సింగిల్విండో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఏడ్చిన రాష్ట్రం అభివృద్ధి చెందదని, రైతులు సంతోషిస్తే రాష్ట్రాలు బాగుపడుతాయన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35200కోట్లు కేటాయించి ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్నారని ఆయన కొనియాడారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇక జిల్లా సస్యశ్యామలం కానుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతులు అష్టకష్టలు పడి పండించిన ధాన్యం తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి సాధ్యమైనంత త్వరగా రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. మార్కెట్యార్డులలో దళారి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాట్లు ఆయన తెలిపారు. అనంతరం మార్కెట్యార్డు ఆవరణలో ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కార్యదర్శి అనంతయ్యకు సూచించారు. అనంతరం తానుకూడా ఓ రైతునని, పంట పొలాల వద్ద నీరు పెట్టడం, నాగళితో దున్నడం వంటి వ్యవసాయపనులన్నింటిని చేశానని తన చిన్ననాటి ఙ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చెర్మైన్ కే.వెంకటయ్య, మార్కెట్ కార్యదర్శులు అనంతయ్య, నవీన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేశ్వర్గౌడ్, రామకృష్ణ, చందుయాదవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమం కోసం జెండాలు పక్కనబెట్టి ఉద్యమిద్దాం
రైతు సంఘాల సమాఖ్య నాయకులు ఇల్లూరు బైపాస్ కెనాల్ నిర్మాణం చేపట్టాలని ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా అనంతపురం సెంట్రల్ : రైతాంగ సంక్షేమం కోసం పార్టీ జెండాలు పక్కనబెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని రైతు సంఘాల సమాఖ్య నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇల్లూరు బైపాస్ కెనాల్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక లలితాకళాపరిషత్ నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా హెచ్చెల్సీ కార్యాలయం వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శిజగదీష్ మాట్లాడుతూ పనిలేని మంత్రులు రోజూ కాలవగట్లపై తిరుగుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా తటె ్టడు మన్ను ఎత్తారా.? ఒక్క ఎకరాకు నీరిచ్చారా అని ప్రశ్నించారు. హంద్రీనీవాను ఏడాదిలో పూర్తి చేస్తామని,. అసంపూర్తిగా ఉన్న పట్టిసీమను జాతికి అంకితం చేస్తామంటూ ప్రభుత్వం ప్రజల చెవుల్లో పూలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాఖ ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరిమెల శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో పెనకచేర్ల డ్యాం నుంచి హెచ్చెల్సీ 5వ డిస్ట్రిబ్యూటిరీ నుంచి ఇలూరు బైపాస్ కెనాల్ను సాధించుకున్నామని తెలిపారు. రూ. 2.5 కోట్లను దివంగత సీఎం వైఎస్ విడుదల చేశారని గుర్తు చేశారు. కాలువ పనులు మంజూరై పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకూ బైపాస్ కాల్వ పూర్తి కాలేదన్నారు. వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఇల్లూరు బైపాస్ కెనాల్ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తీవ్ర కరువు వల్ల తాగేందుకు కూడా చుక్కనీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాగు నీరు లేక రైతుల భూములు బీడువారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ప్రసంగించారు. అనంతరం హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రమణ, సీపీఐ నేతలు జాఫర్ , నారాయణస్వా మి, అల్లీపీరా, వైఎస్సార్సీపీ నేతలు ఆలమూ రు శ్రీనివాసరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు పెద్దన్న పాల్గొన్నారు. -
యూరియా కోసం పోలీస్ స్టేషన్ ముట్టడి
ఆదిలాబాద్(నార్నూర్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. సరఫరా సరిగా లేకపోవడంతో ఆదిలాబాద్ జిలా నార్నూర్ మండల కేంద్రంలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో రైతులు ఆగ్రహించి అధికారుల తీరుకు నిరసనగా పోలీస్స్టేషన్ను ముట్టడించారు. మండలంలో పత్తి, సోయా పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు ప్రస్తుతం సీజన్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంది. అయితే అందుకు సరిపడా సరఫరా చేసేందుకు వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
ప్రభుత్వం కోసం భవనాల పరిశీలన
- గుంటూరులో పురపాలక శాఖ కార్యాలయం ఏర్పాటు యోచన - మిర్చి యార్డు, రైతు సంక్షేమ భవనం, ఎఫ్సీఐ గోడౌన్లు...పరిశీలన అరండల్పేట (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ ప్రధాన కార్యాలయం గుంటూరులోని రైతుసంక్షేమ భవనంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు రాజధాని ప్రాంతమైన గుంటూరు-విజయవాడలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు శనివారం గుంటూరు నగరంలోనూ, పెదకాకాని ప్రాంతంలోనూ పర్యటించారు. ఖాళీగా ఉన్న పలు ప్రభుత్వ ప్రైవేటు భవనాలను పరిశీలించారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సభ్యులు గృహ నిర్మాణశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, పురపాలక శాఖ డెరైక్టర్ కన్నబాబులతోపాటు జిల్లా కలెక్టర్ కాంతి లాల్దండే తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రధానంగా వివిధ శాఖల ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భవనాల విస్తీర్ణం సరిపోతుందా? లేదా? అని పరిశీలించారు. ముఖ్యంగా నగరంలోని చుట్టుగుంట సెంటరులోని రైతు సంక్షేమ భవనాన్ని పరిశీలించారు. ఇక్కడ పురపాలకశాఖ కార్యాలయం ఏర్పాటు చే సే విషయమై అధికారులు చర్చించారు. భవనంలోని అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవనం విస్తీర్ణం, రవాణా సౌకర్యం వంటివాటితోపాటు ఇతర అంశాలపై కూడా చర్చించారు. అనంతరం మిర్చియార్డులోని షెడ్లను పరిశీలించారు. అక్కడ ఏఏ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందో చర్చించారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఆ షెడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఇక్కడ ఇరిగేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తర్వాత గుంటూరుకు 7 కిలోమీటర్ల దూరంలోని పెదకాకానిలో ఉన్న ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) గోడౌన్లను పరిశీలించారు. అక్కడ గౌడౌన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్సీఐ మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ గోడౌన్లు ఏ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉంటాయన్న విషయమై ఎఫ్సీఐ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎఫ్సీఐ మేనేజర్ సీహెచ్ వీరారెడ్డి మాట్లాడుతూ 36 ఎకరాల విస్తీర్ణంలో గోడౌన్స్ నిర్మించినట్లు తెలిపారు. మొత్తం 15 గోడౌన్లలో ప్రత్తి బేళ్ళు, బియ్యం బస్తాలు ఉన్నట్లు కమిటీ సభ్యులకు వివరించారు. తర్వాత కమిటీ సభ్యులు ఆచార్య నాగార్జున యూనివర్సీటీ ఎదురుగా, కంతేరు అడ్డరోడ్డు వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న గ్రీన్ పార్క్ ద్వారకా కృష్ణ అపార్ట్మెంట్స్ను పరిశీలించారు. ఐజేఎం లింగమనేని టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించిన ఈ అపార్ట్మెంట్స్, విల్లాల ప్లాన్లను పరిశీలించారు. అక్కడ ఖాళీగా ఉన్న ఫ్లాట్లు, విల్లాల లోపలి భాగాలను కూడా పరిశీలించారు. అక్కడ 300 ఫ్లాట్లు, 98 విల్లాలు ఐజేఎం ప్రతినిధులు అధికారులకు వివరించారు. -
రాష్ట్రానికి రాహుల్
* రైతుల పరామర్శ * కాంగ్రెస్లో ఉత్సాహం చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశవ్యాప్త పర్యటనలో ఉన్న అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్గాంధీ వచ్చేనెల రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను రాహుల్ తెలుసుకునేందుకు పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని, ప్రధాని మోదీ పరిపాలనను దుయ్యబడుతూ దేశంలో రాహుల్ పర్యటన సాగుతోంది. భూసేకరణ చట్టంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నందున అన్నదాతలను పరామర్శించేలా పర్యటనను ఖరారు చేసుకున్నారు. జూన్ 3వ వారంలో రాహుల్ పర్యటన ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పర్యటించే ప్రాంతాలు, తేదీలు ఖరారు కాలేదు. అయితే రైతులను పరామర్శించడమే ప్రధాన అజెండా అనేది మాత్రం ఖరారైంది. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గెయిల్ ఇండియా సంస్థ 340 కోట్లతో కొంజి, కుట్టనాడు, బెంగళూరు మీదుగా మంగళూరు వరకు గ్యాస్ పైప్లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ గ్యాస్పైప్లైన్ రాష్ట్రంలో కోయంబత్తూరు, తిరుప్పూరు, సేలం, ఈరోడ్డు, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి మీదుగా మంగళూరుకు మళ్లించాలని పథకం రూపొందించారు. అయితే ఈ గ్యాస్పైప్ లైన్ వల్ల తమ పంట పొలాలు నాశనం అవుతాయని రైతుల తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను స్వీకరించకుండా పైప్లైన్కు గుంతలు తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. మొండివైఖరి అవలంబిస్తే ఆత్మహత్యలు తప్పవని సైతం రైతులు బెదిరిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే రాహుల్గాంధీ తిరుచ్చిరాపల్లి, తంజావూరు, నాగపట్టినం జిల్లాలకు వెళ్లి ఆయా ప్రాంతాల రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారని భావిస్తున్నారు. అలాగే తేనీ జిల్లాలో 1500 కోట్లతో భూమికి అడుగుభాగంలో న్యూట్రినో తయారీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కూడా స్థానికంగానేగాక, రాజకీయంగా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని రాహుల్ పర్యటనను ఖరారు చేయనున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్తో పొత్తుపెట్టుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. విధిలేని పరిస్థితుల్లో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్ మట్టికరిచిపోయింది. గెలుపు మాట అటుంచి అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్ర పార్టీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. టీఎన్సీసీ అధ్యక్షునిగా జ్ఞానదేశికన్ స్థానంలో ఈవీకేఎస్ ఇళంగోవన్ నియమితులయ్యారు. మాజీ కేంద్రమంత్రి జీకే వాసన్ తమిళమానిల కాంగ్రెస్ను స్థాపించగా, జ్ఞానదేశికన్ సైతం అదే పార్టీలో చేరిపోయారు. చిదంబరం కాంగ్రెస్తో అంటీఅంటనట్లు వ్యవహరిస్తుండగా, ఆయన కుమారుడు కార్తీ కాంగ్రెస్తో విభేదిస్తూ వేరే శిబిరాలను నడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. -
‘మాఫీ’ తిప్పలు
కలెక్టరేట్ వద్ద రోజంతా క్యూలో రైతుల నిరీక్షణ ఆధారాలు ఇచ్చేందుకూ ఇబ్బందులే మహారాణిపేట : రుణమాఫీ అవుతుందనే ఆశతో ఇప్పటికీ చాలామంది రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. రోజుల తరబడి వ్యవసాయ పనులు మానుకొని నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అడిగినప్పుడల్లా జెరాక్స్ కాపీలు ఇస్తూనే ఉన్నారు. అధికారులు మాత్రం ఏదో సాకు చెప్పి రుణమాఫీ మాత్రం కాకుండా చేస్తున్నారు. రుణమాఫీ అవ్వని రైతుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు కలెక్టరే ట్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్రీవెన్స్కు సోమవారం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రైతులు తరలివచ్చారు. గ్రీవెన్స్ కౌంటర్ తెరవకముందే భారీ క్యూ కట్టారు. కొంతమంది జెరాక్స్ల కోసం ఎండలో తిరుగుతూ కనిపించారు. వీరిలో ఎవరిని కదిలించినా మాకు రుణమాఫీ వర్తించలేదని గోడు వెల్లబోసుకుంటున్నారు. ఆధార్ కార్డుంది.. రేషన్ కార్డూ ఉంది.. రుణం తాలూకా బ్యాంక్ కార్డు ఉంది. ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులన్నింటికీ మేము అర్హులమే. అయినా బ్యాంక్ అధికారులు ఏదో సాకు చెప్పి మమ్మల్ని రోజూ తిప్పుతున్నారు తప్ప మాఫీ మాత్రం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆధార్ ఎంటర్కాలేదట ఆధార్ కార్డు నెంబర్ ఎన్నిసార్లు ఇచ్చినా కంప్యూటర్లో ఎంటర్ కావడం లేదట. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇచ్చాను. ఇప్పుడు కూడా నా పేరు మీద ఆధార్ ఎంటర్ కావడం లేదనే అధికారులు చెప్తున్నారు. నేను నర్సీపట్నం ఏడీబీ బ్యాంకులో రూ. 34 వేలు లోన్ తీసుకున్నా ను. అప్పుడు ఆధార్కార్డు లేకుండానే లోన్ ఇచ్చారు. ఇప్పుడు రుణమాఫీ కోసం ఆధార్కార్డు అడిగితే ఆధార్కార్డు చేయించుకున్నాను. ఆ నెంబర్ ఇస్తే ఎంటర్ అవడం లేదని రుణమాఫీ ఆపేశారు. - సేనాపతి రామారావు, చెట్టుపల్లి, నర్సీపట్నం మండలం పేరులో తప్పుందన్నారు.. అనకాపల్లి ఏడీబీ బ్యాంకులో 2013లో రూ. లక్ష రుణం తీసుకున్నాను. ఆ రోజు నాకు కరణం నాగ జమున అనే పేరు మీద రుణం ఇచ్చారు. నా రేషన్ కార్డు, ఆధార్ కార్డులో మాత్రం కరణం జమున అని ఉంది. ఇప్పుడు రుణమాఫీ కోసం అడిగితే నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులో పేరు తప్పుపడింది. వాటిని మార్పించుకో అని చెప్పారు. అయితే నా దగ్గరున్న ఆధార్కార్డు, రేషన్ కార్డు ప్రకారం బ్యాంకులో నాగజమునకు బదులు జమున అని మార్పించుకున్నాను. తరువాత మా ఆయన పేరు వెంకటరావుకు బదులు వెంకటరమణ అని బ్యాంక్ వారు ఇచ్చిన రుణఖాతాలో పడింది. దాన్నీ మార్పించుకున్నాను. ఇప్పుడు ఆ ఆధారాలన్నింటితో ఇవ్వడానికి వచ్చాను. - కరణం జమున, మాటూరు, అనకాపల్లి మండలం -
రైతుల బాధలు నాకు తెలుసు: మోదీ
భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తోన్న విపక్షాలకు రైతుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కొరవడిందని, కేవలం రాజకీయాల కోసమే ఆందోళనలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రైతులతో కలిసి పెరిగిన తనకు వారి బాధలు తెలుసని, వ్యవసాయదారులకు భరోసా కల్పించడం తమ ప్రాధమ్యాలలో మొదటిదని అన్నారు. శుక్రవాంర బెంగళూరు నేషనల్ కాలేజీ మైదానంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో వారసులకు అటెండర్ స్థాయి ఉద్యోగాలకోసం రైతులు భూముల్ని అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. ఆ పరిస్థితులను సత్వరమే రూపుమాపాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యం చెడోపోయినప్పుడు మనం రక్త పరీక్షలు చేయిచుకున్నట్లే భూమి కూడా భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని, భూ సామర్థ్యంన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. అధిక శాతం భూమిని సాగులోకి తెవాల్సిన అవసరం ఉదన్న మోదీ.. చిన్న కమతాల ఏర్పాటువల్ల భూమి వృథా అవుతోందని అభిప్రాయపడ్డారు. కమతాలు లేకుండా ఒకే గాటున సాగే వ్యవసాయ విధానం రావాలన్నారు. మోదీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. - భూ సంస్కరణలు చేపట్టింది రైతుల మేలు కోసమే - మీరు గ్యాస్ సబ్సిడీని వదులుకుంటే.. పేదలు, అవసరమైనవాళ్లకు దానిని చేరవేసే అవకాశం ఉంటుంది. ఆవిధంగా కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. - భారతీయ యువతను భాగ్యవిధాతలుగా మార్చడమే 'మేక్ ఇన్ ఇండియా' ప్రధాన ఉద్దేశం - భూ సంస్కరణల చేపడితే రైతులకు మేలు జరుగుతుంది. ఒక్కసారి అది జరిగితే ఇక రైతుల జీవితాలు మారినట్లే - గ్రామ స్వరాజ్యంతోనే భారత్ అభివృద్ధి సాధ్యం. -
రైతుల హక్కులు కాపాడేందుకే..
నాగర్కర్నూల్రూరల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అర్ధం లేని వాగ్ధానాలతో రైతులను మోసం చేయడం తగదని, కేఎల్ఐ మూడో లిఫ్ట్ పనులు ప్రారంభం కాకుండానే పనులు ప్రారంభించినట్లు చెప్పడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, నాగం జనార్దన్రెడ్డి అన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకే ఈ నెల 17న స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక పీఆర్ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు కేఎల్ఐ పనులు ప్రారంభమైనట్లు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. వాప్తవానికి అక్కడ పనులు చేయాల్సింది గామన్ ఇండియా కంపెనీ అయితే, ఆ కాంట్రాక్టర్ ఇంతవరకు ప్రాజెక్టును పరిశీలించలేదన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టర్కు అనుభవం, అర్హతలు లేవని పనుల్లో అక్రమాలపై 2005 నుంచి తాను క్వాలిటీ కంట్రోల్, ఏసీపీ, కాగ్, ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. తన ఫిర్యాదుల కారణంగానే రూ. 500కోట్లు కాగ్ రిటర్న్ కట్టమని చెప్పిందని, సత్తిరెడ్డిని జైలుకు పంపింది కూడా తన ఫిర్యాదుల కారణంగానేనన్నారు. ప్రాజెక్టు నాణ్యతపై తానెప్పుడూ రాజీ పడలేదన్నారు. ఈ ప్రాజెక్టు రైతుల హక్కని, 52 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా నేటికి పూర్తి చేయకపోవడం రైతులను మోసగించినట్లేనన్నారు. 2004 సెప్టెంబర్ 25న టెండర్లు పిలిచి ప్రాజెక్టు నిర్మాణానికి *2990 కోట్లుగా నిర్ధారించారని, ఇప్పటికి *2739 కోట్లు ఖర్చయినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న దీపిక కన్స్ట్రక్షన్ కంపెనీకి పనుల్లో అనుభవం, అర్హత లేవని, వారు పనులు కొనసాగిసే మరో ఐదేళ్లకు కూడా పూర్తి కావన్నారు. ఇంకా 50వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందన్నారు. తక్షణమే పనులను గామన్ ఇండియాకు అప్పగించి 15 రోజులకోసారి నివేదికను తెప్పించుకుంటూ వేగవంతం చేయాలన్నారు. జూన్, జులై నాటికి మూడో లిఫ్ట్ ద్వారా రెండు మోటార్లు నడిపించి నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 17 లోపు పనులకు సరిపడా మెటీరియల్ అక్కడికి తీసుకురావటంతోపాటు రోజుకు 500 క్యూబిక్ మీటర్ల పని జరగాలని, అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న నాగర్కర్నూల్లో నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి ఇంజనీర్లను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 17న ఉదయం 10గంటలకు కేఎల్ఐ మూడో లిఫ్ట్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరానికి చేరుకుని దీక్ష ప్రారంభిస్తానని అన్నారు. ఈ దీక్షను ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలన్నారు. -
బిల్లుల చెల్లింపు ఎప్పుడో !
బోధన్ : చెరుకు రైతు ఏటా గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పడం లేదు. ఏడాది కాలం శ్రమిం చి పండించిన చెరుకును ఫ్యాక్టరీ క్రషింగ్కు పంపుతుంటే నిబంధనల ప్రకారం రావాల్సి బిల్లులు అందకపోగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతియేడు బిల్లుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితు వస్తున్నాయి. నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుని ధర చెల్లించాలని రైతులు చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే దిక్కలేదు. చక్కెర ఫ్యాక్టరీ ప్రైవే ట్ సంస్థ గుప్పిట్లోకి వెళ్లింది. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం విస్మరించాయి. ప్రైవేట్ ఫ్యా క్టరీ యాజమాన్యం లాభపేక్షధోరణితో వ్యవహరిస్తోందని రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకపక్షంగా ధర నిర్ణయిస్తోందనే ఆరోపణలు వసున్నాయి. చెరుకు సరఫరా చేసిన రైతులు ప్రస్తుతం బిల్లుల కోసం ఎదురు చూ స్తున్నారు, ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరి స్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర.. బోధన్ ఎన్డీఎస్ఎల్లో 2014-15 సీజ న్కు సంబంధించి గత డిసెంబర్ 1న క్రషింగ్ ప్రారంభించారు. సుమారు 90 వేల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ పూర్తయ్యిందని ఫ్యాక్టరీ అధికారులు పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో క్రషింగ్ పూర్తి అయ్యే అవకాశాలున్నా యి. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో రైతులకు బిల్లులు చెల్లిం చా లి. అయితే నెల పదిహేను రోజులు కావస్తు న్నా.. ఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు ఎప్పు డు చెల్లించేది స్పష్టం చేయలేదు.యాజమాన్యం ప్రకటించిన ధర ప్రకారం రైతులకు రూ. 20 కోట్లవరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఒత్తిడి మేరకు.. వాస్తవంగా అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను రద్దు చేసి తిరిగి స్వాధీ నం చేసుకుంటామని, పూర్వవైభవం తెస్తామ ని సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో హామీ ఇచ్చా రు. దీంతో ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం డోలాయమాన పరిస్థితిలో క్రషింగ్ ప్రా రంభించేందుకు సుముఖత చూపలేదు. ఈ పరిస్థితిని గమనించిన రైతులు స్థానిక ఎమ్మె ల్యే షకీల్ నేతృత్వంలో ఎంపీ కవిత, రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు . ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రైవేట్ యాజమాన్యం క్రషింగ్ ప్రారంభించింది.క్రషింగ్ప్రారంభం కథ సుఖాంతంగా ముగిసింది. టన్ను ధర రూ.2260 ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఈ ఏడాది క్రషింగ్ సీజన్ టన్ను ధర రూ.2200, ప్రభుత్వ కొనుగోలు ధర రూ. 60 కలుపుకుని రూ. 2260 ప్రకటించింది.గత ఏడాది సీజన్లో టన్ను ధర రూ. 2600 చెల్లించారు. ఈ ధరను కూడా రౌండ్ల వారీగా చెల్లించారు.ఈ ధరనైనా చెల్లించాలని రైతులు కోరుతున్నా యాజమాన్యం మౌనం వహించింది. ఈ ధర వివాదం మళ్లీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. ఈ నెల 5న హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో రైతుల సమావేశంలో సీఎం కేసీఆర్ ధర పై స్పష్టత ఇచ్చారు. టన్నుకు రూ. 2600 ధర చెల్లిస్తామని సీఎం కేసీఆర్ భరోసాఇచ్చారు.ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించిన టన్ను ధర రూ. 2260 చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. బిల్లుల చెల్లింపు పై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదు. బిల్లుల చెల్లింపులో ఇంకెంత కాలం జాప్యం జరుగుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైతుల హక్కులపై ఉక్కుపాదం
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనం, సచివాలయం నిర్మించిన రైసినాహిల్స్ ప్రాంతంలో వ్యవసాయ భూములు కోల్పోయిన వారి వారసులు, తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి నెలా జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపి పోతుంటారంటే మనకు నమ్మబుద్ధి కాకపోయినా, నిజం. ఇందుకు సంబంధించి ఈ సోమవారమే ఢిల్లీ హైకోర్టు స్థానిక ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కోర్టులో వ్యాజ్యం వేసిన సజ్జన్ సింగ్ ముత్తాత, ముత్తాత, ముత్తాతకు ముత్తాత అయిన షాదికి, ఇతరులకు చెందిన భూమిని ఏకపక్షంగా సేకరించారు. రోగి కోరిందే వైద్యుడిచ్చాడన్న సామెత చందంగా కార్పొరేట్ కోరిందే బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం అందించింది. ఏమిచ్చింది? రాచమార్గంలో వచ్చిన చట్టాన్ని నీరుగార్చే దొడ్డిదారి అస్త్రం ఆర్డినెన్స్ను. ఎందుకు? అభివృద్ధి- సంస్కరణల పేరిట. దీంతో ఏం జరుగుతుంది? నూటపాతికేళ్ల కింద బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టమే తిరిగి దిక్కవుతుంది. దాని పరిణామమేంటి? భూ యజమానుల హక్కులు హరీమని, వారి నోటికి తాళం పడుతుంది. వారి అంగీకారంతో పని లేకుండా, నష్టపరిహారానికి కచ్చితమైన భరోసా లేకుండా... పశుబలాన్ని ఉపయోగించి ఏ భూమినైనా ఏకపక్షంగా లాక్కునే హక్కు రాజ్యానికి మళ్లీ ధారాదత్తమౌతుంది. నిన్నటికి నిన్న పార్లమెం టరీ ప్రజాస్వామ్య పంథాలో తీవ్ర కసరత్తు చేసి తెచ్చుకున్న భూసేకరణ చట్టం- 2013కు తూట్లు పడతాయి. ఎకరం, రెండెకరాలున్న బడుగు, బలహీనజీవులు నిర్వాసితులవుతారు. సొంత వ్యవసాయమే కాకుండా భూమి ఆదరువుగా జరిగే వ్యవసాయాన్నే నమ్ముకొని కౌలు, వివిధ వృత్తులు, కూలిపని, ఇతరేతర అను బంధ వ్యాపకాలు, చిన్నచిన్న వ్యాపారాలతో జీవనోపాధి పొందేవారు దిక్కులేని వారవుతారు. పెద్ద మొత్తాల్లో భూసేకరణ చేసే చోట ఊళ్లకు ఊళ్లే ఛిద్రమౌ తాయి. ఇవీ రాగల పరిణామాలు. చర్చలకు ఆస్కారం లేని, హేతువుకు తావు లేని కర్కశ పంథాయే భూసేకరణకిక మార్గమౌతుంది. ప్రాణాలు పణంగా పెట్టి సగటు పౌరులు ప్రతిఘటిస్తారు. పోలీసు బలగాల్ని దించి ఉద్యమాల్ని ప్రభు త్వాలు అణచివేస్తాయి. రాజ్యం తన అప్రతిహత అధికారాలతో వందలు, వేలు, లక్షల ఎకరాల్ని చాపచుట్టి చెరపడుతుంది. తన అవసరాలు తీర్చుకొని, ఇంకా మిగిల్చిన భూమిని కార్పొరేట్లకు కైంకర్యం చేస్తుంది. నిర్దిష్టంగా నిర్వచనం లేని అభివృద్ధి, ఎవరికి మేలుజేస్తాయో తెలియని సంస్కరణల పేరిట ఇప్పుడు చేసే ఈ నిర్వాకం భూభద్రతని, భూసంస్కరణల్ని భూస్థాపితం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇది వ్యవస్థను వెనక్కి నడిపే తిరోగమన చర్యే అని నిరూపణ అవుతుందని సామాజికవేత్తలంటున్నారు. ఇప్పుడున్న చట్టానికేమయింది? రైతులు, ఇతర భూయజమానుల ఆమోదంతో నిమిత్తం లేకుండా దేశ ప్రయో జనాలని చెప్పి సర్కారు గుడ్డిగా భూసేకరణ జరిపే బ్రిటిష్ కాలం నాటి చట్టం కావటంతో ప్రజాక్షేత్రంలో ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. భూయజమాని ఆమోదం లేకుండా, ఎందుకోసమో హేతుబద్ధత లేకుండా, సేకరించి కార్పొరేట్ల వశం చేయడం వల్ల, అక్కడ వచ్చే పరిశ్రమలు, కార్పొరేట్ కార్యకలాపాలు పర్యావరణానికి, పౌరుల జీవన ప్రమాణాలకు ప్రతిబంధకంగా మారడం వల్ల ప్రజావ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ప్రతి భూసేకరణ ఓ యుద్ధ పరిస్థితిని తలపించేది. మానవహక్కుల ఉల్లంఘనగా దాఖలయ్యే పిటిషన్లతో న్యాయ వివాదాలు, అసాధారణ జాప్యాలకు దారితీయడం వంటి పరిస్థితులు తలె త్తాయి. ఈ స్థితిని అధిగమించడానికి చట్ట సవరణ అవసరమైంది. భూయజమా నుల అనుమతి, అవసరాల్ని సరిగ్గా అంచనా వేయడం, భూములు కోల్పోయే వారిపై ప్రభావం-సామాజిక ప్రభావాల్ని అంచనా వేయడం (ఎస్.ఐ.ఎ.) వం టివి తప్ప నిసరిగా చేస్తూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. భూమి కోల్పోతున్న వారికి సరైన పునరావాసం, పునఃస్థిరీకరణ, తగు నష్టపరిహారం ఇప్పించే అంశాలతో ఈ చట్టం వచ్చింది. ఉభయ ప్రయోజనకరమైన సంప్రదిం పులకు ఓ ప్రాతిపదిక ఏర్పడింది. ఈ చట్టం ఆషామాషీగా రాలేదు. రెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా భాగస్వాములతో చర్చ జరిగింది. ఈ కసరత్తు తర్వాత పార్లమెంటు ఆమోదం పొందిన భూసేకరణ చట్టం-13 సరిగ్గా ఏడాది కింద అమల్లోకొచ్చింది. రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు, రెండు పార్లమెంటు స్టాండింగ్ కమిటీల వడపోత తర్వాత ఉభయ సభల్లో చర్చ అనంతరం సదరు బిల్లు పలు సవరణలతో ఆమోదం పొంది చట్టరూపు సంతరించుకుంది. భూమి కోల్పోతున్న వారిలో కనీసం 80-70 శాతం మంది ఆమోదం తర్వాతే భూసేక రణ జరపాలని, ఆ ప్రాంతంలో సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలని, బాధితులకు తగు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధి చేసిన భూమిలో వాటా కల్పించాలని, మూడు పంటల భూముల్ని ముట్టుకోవద్దని... ఇలా చాలా అంశాల్ని పొందుపరిచారు. భూభద్ర తకు ఇది భరోసా కల్పించింది. కానీ, ఇలా చేయడం వల్ల భూసేకరణే కష్టమైం దని, ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల అమలు నిలిచిపోయిందని ప్రస్తుత ప్రభుత్వం అభిప్రాయం. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లో ఈ వాద నను బలోపేతంచేసి, సదరు చట్టాన్ని వీలైనంతగా తూట్లుపొడిచే యోచన ఈ ప్రభుత్వ పెద్దలు ప్రారంభించారు. పర్యవసానమే ప్రస్తుత ఆర్డినెన్స్. దీనిని కేంద్రమంత్రివర్గం ప్రతిపాదించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్తో సవరణకు గురవుతున్న చట్టం అమలే ఇక తరువాయి. కనిపించని నష్టం అపారం ఈ ఆర్డినెన్స్ ద్వారా జరిగే చట్ట సవరణ అనంతరం ఇక భూసేకరణకు పంచా యతీ, గ్రామసభల అనుమతి కూడా అవసరం ఉండదు. ఇది 73, 74 వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. తాము కేవలం భూసేకరణకున్న అవరోధాలు తొలగిస్తున్నామంటున్న ప్రభుత్వ పెద్దలు ‘మేం, చట్టంలో ఉన్న పరిహార, పునరావాస, పునఃస్థిరీకరణ వ్యవహారాల జోలికి వెళ్లడం లేదు’ అంటు న్నారు. కానీ, ఇది నిజం కాదు. భూములు కోల్పోయేవారి ఆమోదం అవసరం లేకుండా, ప్రభావాల అంచనాలు లేకుండా, షరతులు వర్తింపజేయకుండా సేక రించే ఏకపక్ష హక్కును ప్రభుత్వాలకు కల్పించడం వల్ల భూములు కోల్పోయే వారు, సహజంగానే తమ ‘బేరమాడేశక్తి’ని కూడా కోల్పోతారు. అప్పుడు వారికి దక్కేది తృణమో! పణమో! అభివృద్ధి పరచిన భూమిలో వాటా కూడా దక్కే అవకాశాలు లేవు. రైతులకు, సాధారణ పౌరులకు ఇంకా చాలా ప్రత్యక్ష, పరోక్ష నష్టాలకు ఆస్కారముంది. ప్రస్తుత చట్టంలో ఉన్న భూములు కోల్పోయే వారిపై ప్రభావాలు, సామాజిక ప్రభావాల అంచనా వల్ల బహుళ ప్రయోజనా లుండేవి. అది పౌర సమాజం పోరాడి సాధించుకున్న హక్కు. అది లేకపోతే సమాజానికి కనీసం అరడజన్ అరిష్టాలు తప్పవు. 1. ఏ అవసరానికి ఎంత భూమి సేకరి స్తారన్న హేతుబద్ధత లేకుండాపోయి, ఆయా ప్రాజెక్టులకు వాడగా మిగిలింది ఇతరేతర అవసరాలకు వాడి వినియోగ సమతూకం చెడగొట్టే ప్రమాదముంది. 2. లెక్కకు మించి భూసేకరణ జరిపి ప్రయివేటు, వ్యాపారశక్తుల పరం చేయడం వల్ల సామాన్యుల జీవనం దుర్భరమౌతుంది. 3. అభివృద్ధి పేరుతో సహజవన రుల్ని నిర్హేతుకంగా కొల్లగొట్టే రకరకాల పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు, కారి డార్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. 4. ప్రజలపై చూపే దుష్ర్పభావాల్ని లెక్క చేయకుండా పర్యావరణ సమతూకా నికి భంగం కలిగించే సంస్థల ఏర్పాటు ప్రమాదముంటుంది. 5. ఏడాదికి 3 పంటలిచ్చే భూముల్ని కూడా పెద్ద మొత్తా ల్లో సేకరించడంవల్ల ఆహార ఉత్పత్తిపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. వీటన్నింటికన్నా ముఖ్యమైంది భూయజమానుల మౌలిక హక్కు. దానికి తీవ్ర మైన భంగం కలుగుతుంది. ముందే భరోసా కల్పించాలి భూసేకరణ సమయంలో తను ఇష్టపూర్వకంగా ఆమోదం తెలిపే రీతిలో తగు పరిహారం, పునరావాసం, పునఃస్థిరీకరణ ఇప్పించే చట్టబద్ధమైన హక్కు లేకుం టే, తర్వాత లబ్ధి అన్నది దాదాపు అసాధ్యం. వారి జీవితాలు కల్లోలమౌతాయి. కొన్ని వందల, వేల కేసులు మనముందున్నాయి. సింగూరు వంటి చిన్న ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల వరకు చెప్పుకుంటే అన్నీ కన్నీటి గాథలే! విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిపిన భూసేకరణతో నిర్వాసితులైన రైతులు, దశాబ్దాలు నష్ట పరిహారం అందక జీవ నోపాధి కోసం అక్కడే దొంగలుగా మారి, పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటనలు ఉన్నాయి. పాట్నాలో రాజధాని నిర్మాణ సమయంలో భూముల కోల్పోయిన రైతుల వారసులు, అధికారికంగా ప్రకటించిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవ నం, సచివాలయం నిర్మించిన రైసినా హిల్స్ ప్రాంతంలో వ్యవసాయ భూములు కోల్పోయిన వారి వారసులు, తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి నెలా జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపి పోతుంటా రంటే మనకు నమ్మబుద్ధి కాకపోయినా, నిజం. ఈ కేసుకు సంబంధించి ఈ సోమవారమే ఢిల్లీ హైకోర్టు స్థానిక ప్రభుత్వానికి తాజాగా నోటీసులిచ్చింది. కోర్టులో వ్యాజ్యం వేసిన సజ్జన్ సింగ్ ముత్తాత, ముత్తాత, ముత్తాతకు ముత్తాత అయిన షాదికి, ఇతరులకు చెందిన భూమిని ఏకపక్షంగా సేకరించారు. కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మారుస్తున్నామని, 1894 భూసేకరణ చట్టం సెక్షన్ 6 కింద, 21 డిసెంబర్, 1911న ఉత్తర్వులిచ్చి 150 గ్రామాలకు చెందిన 17,000 ఎకరాల భూమిని సేకరించారు. ఇలా సేకరించిన భూమిని అధికారిక నిర్మా ణాల కోసమే కాకుండా ప్రయివేటు వ్యక్తులు, రాజ కీయ నాయకులకు ప్రభు త్వం ఆనాడే అప్పగించింది. కానీ, భూమి కోల్పోయిన వారికి రావాల్సిన 2,217 రూపాయల, 10 అణాల, 11 పైసల నష్టపరిహారం ఇప్పటికీ బాధితులకు అందలేదు. తగిన చట్టబద్ధమైన భద్రతతో రైతులకు ముందుగానే భరోసా కల్పించకుంటే భూములు కోల్పోయే నిర్వాసితుల దుస్థితి ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. రాజధాని పేరిట భూసమీకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్లో, ప్రాజె క్టులకు భూసేకరణ కోసం తెలంగాణలోనే కాదు, దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధినేతలు ఈ ఆర్డినెన్స్ కోసం కాచుక్కూర్చున్నారు. కానీ, సర్కారు అండతో అప్పనంగా భూములు కాజేయజూస్తున్న కార్పొరేట్ శక్తుల ఆయుధమే కాదు, రైతుల హక్కులపై ఉక్కుపాదం ఈ ఆర్డినెన్స్. ఈమెయిల్: dileepreddy@sakshi.com - దిలీప్ రెడ్డి -
రబీ..రంది
మెతుకుసీమ రైతులపై కాలం కక్షగట్టింది. కాలం కలిసిరాక ఖరీఫ్లో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతన్నలు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే వర్షాభావం, కరెంటు కోతలు, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో రబీలో 1.30 లక్షల సాధారణ విస్తీర్ణానికిగాను రైతులు ఇప్పటి వరకు కేవలం 27,510 హెక్టార్లలోనే పంటలు వేయగలిగారు. సాధారణ వర్షపాతం కంటే ఈసారి -45 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టాలు 15.57 మీటర్ల మేరకు పడిపోయాయి. వర్షాల జాడ లేకపోవటంతో సుమారు 75 శాతం మేర భూముల్లో రైతులు పంటలు వేయలేకపోయారు. సాక్షి, సంగారెడ్డి: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జిలాల్లో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అందులోనూ శనగ, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న తదితర పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. అక్కడక్కడా శనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న తదితర ఆరుతడిపంటలను రైతులు సాగు చేసినప్పటికీ వర్షాభావం ఈ పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. వర్షాభావానికితోడు వా తావరణంలో తేమ శాతం తగ్గటం కూడా శనగపంట దిగుబడి తగ్గేందుకు కారణమవుతోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. బోర్లకిందా పంటలేయని రైతులు! ఈ రబీలో బోరుబావుల కింద సైతం పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కరెంట కోతలు, ప్రభుత్వం హెచ్చరికలతో రైతులు వరి సాగు చేయలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,823 హెక్టార్లుండగా, రైతులు ఇప్పటి వరకు కేవలం 295 హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేశారు. బోరుబావులున్న రైతులు కూడా వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు వేసుకున్నారు. కరెంటు కోతలు, భూగర్భ జలమట్టాలు పడిపోవటంతో ఆరుతడి పంటలకు కూడా పూర్తిస్థాయిలో సాగునీరు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అడపా దడపా వర్షాలు కురిస్తేనే ఆరుతడి పంటలకు, బోరుబావుల కింద సాగులో ఉన్న పంటలకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వానల జాడ కానరాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే రైతులు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు వేసుకునేందుకు కొంత అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. భారీగా తగ్గిన విస్తీర్ణం వర్షాభావం కారణంగా రబీలో పంటల సాగు భారీగా తగ్గింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,30.962 హెక్టార్లు ఉండగా, రైతులు ఇప్పటి వరకు 27,510 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. గత రబీ సీజన్లో రైతులు 1,27, 868 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాదితో పోల్చిచూస్తే లక్ష ఎకరాల మేర సాగు విస్తీర్ణం తగ్గింది. రబీలో రైతులు ఎక్కువగా శనగ, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేసేవారు. కాగా ఈ దఫా రబీలో 31,313 హెక్టార్ల మేర శనగ పంట సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 11,376 హెక్టార్లలో శనగ పంట సాగైంది. అలాగే 12 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటకుగాను 6 వేల ఎకరాల్లోనే పంట సాగులో ఉంది. ఇక జొన్న 13,251 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా, 2,701 హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలు సాగుకావాల్సి ఉండగా, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు 2,618 హెక్టార్లలోనే సాగు చేస్తున్నారు. ఇలా ప్రధాన పంటలతోపాటు ఉల్లి, గోధుమ, మిర్చి, పప్పుధాన్యాల పంటల సాగు విస్తీర్ణం కూడా జిల్లాలో గణనీయంగా తగ్గింది. ఆశలన్నీ కరువు ప్రకటనపైనే ఇప్పటికే ఖరీఫ్లో తీవ్ర నష్టాలు చవి చూసిన రైతులు రబీలోనే బయటపడదామనుకున్నారు. కానీ కరెంటుకోతలు, వర్షాభావంతో రబీలోనూ నష్టాలే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వ కరువు ప్రకటనపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కరువు మండలాల ప్రకటనకు సంబంధించి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేసినా, ఇంత వరకు ప్రకటన వెలువడలేదు. ఇకనైనా ప్రభుత్వం జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. -
జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రు బైక్ ర్యాలీ
కాకినాడ : రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్ఆర్ సీపీ ఆ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి భారీ బైక్ ర్యాలీతో కాకినాడ కలెక్టరేట్ వద్దకు చేరుకోనున్నారు. అలాగే ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ నేతలు, రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. -
ఏం చేస్తారో.. ఏమో..!
కడుపు మండిన రైతులు రోడ్డెక్కి సరిగ్గా 50 రోజులైంది. అప్పట్లో ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఐదు రోజుల పాటు ఎన్సీఎస్ ఫ్యాక్టరీ ఆవరణ అట్టుడికిపోయింది. అర్ధరాత్రి రైతు సంఘం నేతల అరెస్ట్లతో పోరు తీవ్ర తరమైంది. మా కష్టాన్ని కాజేసిన ఫ్యాక్టరీ యాజమాన్యానికి కాపలా కాస్తారా అంటూ పోలీసులు, అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు. బకాయిలు, తమకు తెలియకుండా తమపేరుమీద తీసుకున్న రుణాలు చెల్లించాలని పట్టుబట్టారు. ఆస్తులు జప్తుచేసి, అప్పులు తీరుస్తామని అధికారులు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇంకా రూ.10 కోట్ల వరకూ ఫ్యాక్టరీ చెల్లించవలసి ఉంది. ఈ నేపథ్యంలో చెరుకు మద్దతు ధర నిర్ణయించడానికి ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించనున్నారు. దీంతో ఇటు రైతులు, అటు అధికారులు, పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సర్వత్రా ఉత్కంఠ ! * నేడు చెరుకు రైతులతో ఎన్సీఎస్ యాజమాన్యం సమావేశం * క్రషింగ్ ముందు రోజు చర్చలు నిర్వహించడంపై సందేహాలు * ఇప్పటివరకూ జరగని చెల్లింపులు బొబ్బిలి: ఎన్సీఎస్ చక్కెర కర్మాగారంలో శనివారం నిర్వహించనున్న సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయో, రైతుల డిమాండ్లకు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో, రైతులు, ఆయా సంఘాలు నాయకుల దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఉత్కంఠగా మారింది. ఫ్యాక్టరీలో క్రషింగ్ నాటికి రైతులందరికీ పూర్తిగా చెల్లింపులు చేయాలన్నది రైతు సంఘాల డిమాండ్. రాష్ట్రంలోని ఎక్కువ సామర్థ్యం గల ఫ్యాక్టరీ చెల్లించ ధర ప్రకారమే ఇక్కడ రైతులకు చెల్లించాలని, ఈ ఏడాది చెరుకును సరఫరా చేసిన 15 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇప్పటివరకూ రైతు సంఘం రైతుల తరఫున పోరాటాలు చేసి డిమాండ్లు పెట్టింది. అయితే వీటిపై ఎప్పటికప్పుడు యాజమాన్యం.... అధికారుల దగ్గర తలూపి చివరకు అమలు దగ్గరకు వచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో 17 మండలాలకు చెందిన రైతులు చెరకును సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 16 వేల మంది రైతులు సుమారు ఏడు వేల హెక్టార్లలో చెరుకు పండించారు. ప్రతీ ఏటా నవంబర్లో క్రషింగ్ చేస్తుంటారు. క్రషింగ్కు ముందు రైతులు, ప్రజాప్రతినిధులతో యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేయడం, దానిలో ధరను నిర్ణయించడం, 15 రోజులకు ఒక సారి చెల్లింపులు చేస్తామని హామీ ఇవ్వడం అనావాయితీగా వస్తోంది. అయితే గత మూడేళ్లుగా చెల్లింపులు సక్రమంగా లేకపోవడం, రైతుల పేరుతో ఎన్సీఎస్ కర్మాగారం బినామీ రుణాలు వాడేయడం వంటివి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అసలు చెల్లింపులు చేయలేదు. దాదాపు రూ.22 కోట్ల మేర ఫ్యాక్టరీ రైతులకు చెల్లించకుండా నేడూరేపూ అంటూ వాయిదా వేసింది. దీంతో అక్టోబరు 2న ఫ్యాక్టరీ దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ ఆందోళన అయిదు రోజుల పాటు కొనసాగింది. తమకు తెలియకుండా తమ పేరుమీద ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకులో రుణం తీసుకుందని పోలీసులకు రైతులు ఫిర్యాదు చేయడంతో ఎండీతో సహా ఇద్దరు డెరైక్టర్లను అరెస్టు చేశారు. డిసెంబరు నెలాఖరునాటికి చెల్లింపులు పూర్తిగా చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. దానిపై కూడా రైతులు మళ్లీ పోరాటాలకు దిగి తక్షణమే చెల్లింపులు చేసే విధంగా కౌంటర్ ఫైల్ కూడా దాఖలు అయ్యేలా ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 9న సుగర్ కేన్ కార్యాలయంలో రైతులు, యాజమాన్యంతో జేసీ రామారావు సమావేశం నిర్వహించారు. దానిలో 23వ తేదీన క్రషింగ్ ప్రారంభం నాటికి పూర్తిగా చెల్లింపులు చేస్తామని డెరైక్టరు శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అయితే అది ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు.. సరికదా క్రషింగ్కు వారం రోజుల ముందే సమావేశం పెడతామని చెప్పి, విస్మరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషింగ్కు ఒక రోజు ముందు సమావేశం పెట్టి మళ్లీ తమను మోసం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడి పించాలని, టన్నుకు రూ 2,700 మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫ్యాక్టరీ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి నిర్ణయాలను యాజమాన్యం ప్రకటిస్తుందో, దానిని అమలు చేయడానికి అధికారులు ఎటువంటి భరోసా ఇస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. సమావేశం దగ్గర ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. -
9 గంటల విద్యుత్ సరఫరా
తాడేపల్లిగూడెం రూరల్: వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ను ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సొసైటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. పత్రి రైతుకూ వ్యవసాయంలో యాత్రిక వసతి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను రైతు ముంగిటలోకి తీసుకువచ్చి మరింత ఆదాయం పొందేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. భూమిలో పోషకవిలువలు వృద్ధి చెందేలా రైతు వేసే పంటకు ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి దిగుబడి పెంచేవిధంగా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. ప్రతి రైతు పొలంలో సూక్ష్మపోషక విలువలు అందేలా ప్రభుత్వమే అవసరమైన సహాయ సహకరాలు అందిస్తుందన్నారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
రుణం.. రణం..
కొత్తప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న రైతాంగం ఇప్పుడు నైరాశ్యంలో పడింది. రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 2013-14 ఏడాదికాలానికి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామనడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. ‘ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య..ఓడ దిగాక బోడ మల్లయ్య’ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో నాలుగేళ్లుగా పంటలు పండక రెన్యూవల్, బుక్అడ్జస్టుమెంట్లు కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటని విపక్షాలు, రైతుసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. గురువారం జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం రూరల్, న్యూస్లైన్: కొత్త ప్రభుత్వం వస్తే రుణమాఫీ వస్తుందనుకున్న రైతుల ఆశలు ఇప్పుడు అడియాశలే అయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్..అధికారంలోకి రాగానే మెలిక పెట్టడంపై రైతులు భగ్గుమంటున్నారు. కేవలం గత సంవత్సరం రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రైతులు ఆందోళన కు దిగారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు కూడా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు ఆందోళనలు చేశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బక్కరైతు బిక్కు బిక్కు నిన్నటి వరకు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న కేసీఆర్ మాట మార్చడంతో సన్నచిన్నకారు రైతులే తీవ్రంగా నష్టపోనున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ భారీగా తోడవడంతో అప్పులు ఏలా తీర్చాలని బక్కరైతులు బిక్కు బిక్కు మంటున్నారు. జిల్లాలో మొత్తం 4.75 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 4,021 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. వీటిలో 3.80 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రూ.2,682 కోట్లు ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టి పాస్బుక్ఆధారంగా తీసుకున్న రుణాలు రూ.486 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు వివిధ కేటగిరీల కింద రైతులు రూ.853 కోట్ల రుణాలు పొందారు. 2013-14లో రూ.2,455 కోట్ల రుణాలను వివిధ కేటగిరీల కింద రైతులు తీసుకున్నారు. పంటరుణాలుగా రూ.1706 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి పాస్బుక్ ఆధారంగా రూ.385 కోట్లు, వివిధ కేటగిరీల కింద రూ.364 కోట్ల రుణాలను రైతులు పొందారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తే జిల్లాలోని సుమారు మూడు లక్షల మంది రైతులకు చెందిన రూ.3వేల కోట్లు మాఫీ అవుతాయి. అలాకాకుండా కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన ప్రకారం 2013 జూన్ 1వ తేదీ నుంచి 2014 జూన్ వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తే.. జిల్లాలో కేవలం రెండు లక్షల మంది రైతులకు చెందిన రూ. 900 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలు నిలువునా ఎండిపోవడం, నీటిపాలు కావడం చూశాం. కుటుంబం గడవలేని స్థితిలో ఉన్న రైతులు అప్పులు చెల్లించలేదు. కేవలం పెద్ద రైతులు మాత్రమే అప్పులు చెల్లించటం, రెన్యూవల్స్ చేయించటం వంటివి చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం బక్క రైతులకు కాకుండా ధనిక రైతులే అధికంగా లాభం పొందే అవకాశం ఉంది. ఆందోళనల బాటలో అన్నదాతలు.. గద్దెనెక్కక ముందు ఓ మాట..ఆ తర్వాత మరో మాట కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ జిల్లాలోని రైతులు ఆందోళనబాట పడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం జిల్లాలోని ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో రైతు సంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆందోళనకు సిద్ధం కావాలని రైతులకు పిలుపు నిచ్చారు. నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసేందుకు శుక్రవారం అన్ని రాజకీయపక్షాల రైతుసంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ముంపు మండలాల రైతులపై వీడని సందిగ్ధత.. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో తీసుకున్న నిర్ణయం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతానికి వర్తింస్తుందా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు సీమాంధ్రలో కలిస్తే అక్కడి తెలుగుదేశం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయాలి. జిల్లాలోని ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ వెలువడినప్పటికీ..ఇక్కడి రైతుల రుణాల విషయంలో మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలు చాలామంది భూములు కౌలుకు చేస్తున్నారు. గత ప్రభుత్వం కొంతమంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసింది. జిల్లాలో 70 వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. యేటా మే చివరి వారం నుంచి వారికి కూడా సాధారణ రైతుల్లాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ మొదటి వారం పూర్తికావస్తున్నా ఇంతవరకు అటు సాధారణ రైతులు, ఇటు కౌలు రైతులకు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు ఇవ్వలేదు. రుణమాఫీ విషయంలోనే ఇప్పటికీ ఓ స్పష్టతకు రాలేకపోయిన ప్రభుత్వం కొత్త రుణాల విషయాన్ని ఇంకా ఎంతకాలం నాన్చుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం గ్రామాల్లో వాస్తవంగా ఎంతమంది కౌలు రైతులు ఉన్నారనే విషయమై క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సర్వే చేయాలి. కానీ దీనిపై రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు లేవు. మేనెల రెండోవారంలోపే కౌలు రైతులను గుర్తించాలి. అనంతరం వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. గత ఏడాది పాలేరు నియోజకవర్గంలో రెండువేల మంది కౌలు రైతులను గుర్తించారు. వారికి రుణ అర్హత కార్డులు కూడా మంజూరు చేశారు. వారిలో కేవలం 500 మందికి కూడా బ్యాంక్ల్లో రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. కౌలు రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు కొర్రిలు పెట్టడం సర్వ సాధారణమైంది. ‘ఏ ఆధారం చూసి మీకు అప్పు ఇవ్వాలి? ఈ భూమిపై మీకేం హక్కు ఉంది? తీసుకున్న రుణం ఎలా తీర్చుతావు? కాబట్టి రుణం ఇవ్వడం కుదరదు..’ అంటూ బ్యాంకర్లు కొర్రీలు పెడుతుండటంతో కౌలు రైతులు వ్యవసాయ రుణానికి నోచుకోవడం లేదు. -
పల్లియార్డు సూపర్వైజర్ నోటిదురుసు
పల్లి, పసుపు యార్డుల్లో కాంటాలు నిలిపివేసిన దడువాయిలు,హమాలీలు మూడున్నర గంటలపాటు రైతుల నిరీక్షణ క్షమాపణ చెప్పిన అధికారి కాశిబుగ్గ, న్యూస్లైన్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని పల్లి, పసుపు యార్డులో బుధవారం సుమారు మూడున్నర గంటలపాటు కాంటాలు నిలిచిపోయాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పల్లియార్డులో పనిచేస్తున్న సూపర్వైజర్ సంజీవ్ ఉదయమే మద్యం సేవించి పలువురు హమాలీ కార్మికులతోపాటు దడువాయిలను దూషించాడు. దీంతో హమాలీ, దడువాయి కార్మికులు ఆ అధికారిని పల్లియార్డు నుంచి మార్చేదాకా కాంటాలు నిర్వహించమని మార్కెట్ కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. కాంటాలు ఆలస్యం కావడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. బస్తాల వద్ద, మార్కెట్ కార్యాలయం ఎదుట కునుకు తీస్తూ కొనుగోళ్ల కోసం నిరీక్షించారు. చివరగా రైతులంతా మూకుమ్మడిగా మార్కెట్ కార్యదర్శిని కలిసి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సమయంలోనే మార్కెట్కు వచ్చిన జేడీఎం సుధాకర్ కు కూడా రైతులు మొరపెట్టుకున్నారు. సూపర్వైజర్ సంజీవ్తో జేడీఎం, కార్యదర్శి దడువాయిలు, హమాలీలకు క్షమాపణ చెప్పించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎట్టకేలకు మూడున్నర గంటల అనంతరం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతంలోనూ ఈ అధికారి తీరు ఇంతే.. గతంలో పలుమార్లు ఈ సూపర్వైజర్ ఉదయం, మధ్యాహ్నం సమయంలో మద్యం సేవిస్తూ అధికారులతో పాటు హమాలీ, గుమస్తా, దడువాయిలను సైతం నానా రకాలుగా వేధించాడు. ఇప్పటికైనా మార్కెట్ ఉన్నతాధికారులు స్పందించి సూపర్వైజర్పై చర్య తీసుకోవాలని రైతులు, హమాలీ కార్మికులు, దడువాయిలు, గుమస్తాలు, ఉద్యోగులు, రైతులు కోరుతున్నారు. -
ఆమ్ఆద్మీ పార్టీకి రైతు బాసట
కొల్హాపూర్: దక్షిణ మహారాష్ట్రలో ‘సామాన్యుడి’కి రైతు బాసటగా నిలిచాడు. రైతు నాయకుడు రఘునాథ్దాదా పాటిల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో రాష్ట్రంలో ఆ పార్టీకి సామాన్యులతోపాటు రైతుల మద్దతు కూడా లభించనుంది. ‘షేత్కారీ సంఘటన’ సంస్థ స్థాపన ద్వారా కొల్హాపూర్, సంగ్లీ, సతారా జిల్లాల్లో మంచి పట్టు సంపాదించిన దాదా చేరికతో ఆప్కు మరింత ఊపు వచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, తమ పార్టీలో రఘునాథ్దాదా పాటిల్ చేరినట్లు బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు లాంఛనంగా ప్రకటించారు. ఆప్లో చేరిన తర్వాత రఘునాథ్ దాదా మీడియాతో మాట్లాడారు. ‘గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమితో నా సంస్థ కలిసి పనిచేసింది. అయితే రైతు సమస్యలపై వారి ఆలోచ నా విధానం మాకు సంతృప్తినివ్వలేదు. రైతులు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై మా సంస్థ కాంగ్రెస్, ఎన్సీపీ సర్కారుపై బయటనుంచి పోరాటాలు చేస్తుంటే బీజేపీ, శివసేన కూటమి ఏమాత్రం మాకు మద్దతుగా నిలవలేదు. విధాన సభలో రైతు సంబంధ విషయాలపై ఎన్నడూ మాట్లాడలేదు. అందువల్లనే ఆ కూటమిని వీడి నేడు నేను ఆప్లో చేరాల్సి వచ్చింది..’ అని దాదా తెలిపారు. ‘రాజుశెట్టి స్వాభిమాని షేట్కారీ సంఘటనతో సంబంధాలు వల్ల బీజేపీ, శివసేన కూటమికి ఒరిగేమీ లేదు. నేను రాజకీయాల్లో పోటీ చేయడానికి ఈ పార్టీలో చేరలేదు.. సమస్యలపై పోరాడటానికి ఒక వేదిక దొరుకుతుందని మాత్రమే ఇందులో చేరాను.. అయితే పార్టీ ఆదేశిస్తే హట్కానంగలే స్థానం నుంచి లోక్సభకు పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నాను..’ అని ఆయన స్పష్టం చేశారు. షేట్కారీ సంఘటన సంస్థకు దక్షణ మహారాష్ట్రలోనే కాక మహారాష్ట్ర మొత్తం రైతుల మద్దతు ఉందని దాదా తెలిపారు. ఆప్ కొల్హాపూర్ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ పవార్ మాట్లాడుతూ.. దాదా చేరికతో మా పార్టీకి గ్రామీణ స్థాయిలో మరింత పట్టు లభించనట్లయ్యింది. ఆయన పార్టీ అభ్యున్నతి కోసం కార్యకర్తలతో కలిసి చురుకుగా పనిచేస్తారని ఆశిస్తున్నాం..’ అని అన్నారు. ‘మా పార్టీలో చేరడానికి గ్రామీణ ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఎటువంటి శిబిరాలు నిర్వహించకుండానే సుమారు ఐదు వేల మంది ఇప్పటికే పార్టీలో చేరారు. వారితో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వయోజనులు, యువకులు, విద్యార్థులను సైతం పార్టీలో చేర్చుకుంటున్నాం. దాదా చేరికతో రైతులు సైతం మా పార్టీని ఆదరిస్తారు..’ అని నారాయణ్ పవార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై స్వాభిమాని షేట్కారీ సంఘటన నాయకుడు రాజు శెట్టి మాట్లాడుతూ.. ‘ఆప్లో ఎవరు చేరినా మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. దక్షిణ మహారాష్ట్రలో ఉన్న ఇతర రైతు సంఘాలు ఆప్తో కలిసినా మాతో పోటీ పడలేర’ంటూ పరోక్షంగా ఆప్లో దాదా చేరికపై వ్యాఖ్యానించారు. ‘వారి చర్య వల్ల రైతుల్లో ఎటువంటి విభజన రాదు. వారు మాతోనే ఉంటారు..’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ 2009 లోక్సభ ఎన్నికల్లో హట్కానంగలే నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నేను రఘునాథ్ దాదాపై రికార్డుస్థాయి మెజారిటీతో గెలిచాను. ఈసారీ అదే ఫలితం పునరావృతమవుతుంది..’ అని జోస్యం చెప్పారు. కాగా, గత లోక్సభ ఎన్నికల్లో హట్కానంగలే నియోజకవర్గంలో శివసేన తరఫున రఘునాథ్ దాదా పాటిల్ పోటీచేయగా, ఎన్సీపీ తరఫున నివేదిత మానే, స్వాభిమాని షేట్కారీ సంఘటన తరఫున రాజుశెట్టి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో రాజు శెట్టి 4,81,000 ఓట్లు సాధించి గెలుపొందగా, 3,85,000 వేల ఓట్లతో రెండోస్థానంలో నివేదిత, కేవలం 55 వేల ఓట్లతో దాదా మూడోస్థానంలో నిలిచారు.