focus
-
నకిలీ మెడిసిన్ పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
-
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్బులపై నిఘా..
-
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్ను నవంబర్ 15న హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు. -
హైడ్రా మరో సంచలన నిర్ణయం
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
‘వందేభారత్పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
గ్రేటర్ హైదరాబాద్ పై.. గ్రేట్ ఫోకస్
-
మోదీ 3.0: తొలి బడ్జెట్లో ఆర్థిక ఎజెండాపై దృష్టి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన ప్రభుత్వం త్వరలో తన మొదటి బడ్జెట్ను సమర్పించనుంది. ఈ నేపధ్యంలో మంత్రి సీతారామన్కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన సీతారామన్ తన ఆర్థిక ఎజెండాలో భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే 2047 నాటికి దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చడానికి తగిన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసేదిశగా ముందడుగు వేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ నుండి డివిడెండ్ రూపంలో ప్రభుత్వం అందుకున్న రూ. 2.11 లక్షల కోట్లు దేశ ఆర్థిక స్థితికి మెరుగుదలకు సహాయకారిగా మారినట్లు నిరూపితమయ్యింది.మోదీ 3.0 ప్రభుత్వానికి దేశంలోని వ్యవసాయ రంగంలో ఒత్తిడిని పరిష్కరించడం, ఉపాధి కల్పన, మూలధన వ్యయాల వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక ఏకీకరణ మార్గంలో ఉండటానికి ఆదాయ వృద్ధిని పెంచడం వంటివి కీలకంగా మారనున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీల ప్రైవేటీకరణకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.నిర్మలా సీతారామన్ 2019లో తొలిసారిగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి ఆమె ఈ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశం కోవిడ్ -19 మహమ్మారితో ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటిని సమర్థవంతంగా దాటగలిగింది. -
విశాఖ, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేష్ ఉన్నారు. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
మెడికల్ కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్
-
లోక్సభ ఎన్నికలపై దృష్టిసారించండి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యదర్శులు, జాతీయ ప్రధాన కార్యదర్శులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం సుమారు 5 గంటలపాటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలు మార్గదర్శనం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్లతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన చంద్రశేఖర్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సునీల్ బన్సల్, చంద్రశేఖర్లు రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. అంతేగాక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్తాన్లో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ 2017 సెపె్టంబర్ నుంచి పనిచేస్తున్నారు. ఆర్ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్కు చెందినవారు. 2017లో రాజస్తాన్ బాధ్యతలు తీసుకొనే ముందు చంద్రశేఖర్ పశి్చమ ఉత్తరప్రదేశ్, అంతకు ముందు వారణాశి ప్రాంతీయ సంస్థమంత్రిగా పనిచేశారు. అంతేగాక 2014లో చంద్రశేఖర్ ప్రధాని మోదీతో కలిసి వారణాశి లోక్సభ స్థానం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. నెలాఖరులో రాష్ట్రానికి అమిత్షా ? వచ్చేనెలలో ఐదు క్లస్టర్లలో బీజేపీ యాత్రలు సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులో కేంద్రమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా బీజేపీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణకు వచ్చేసరికి ఐదు క్లస్టర్లుగా విభజించారు. వీటికి నలుగురు రాష్ట్రప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ఇంకా సీనియర్నేత, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఇన్చార్జ్లుగావ్యవహరిస్తారని సమాచారం. మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో క్లస్టర్ ఇన్చార్జ్లతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీసంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వచ్చేనెలలో తెలంగాణలో 10 రోజులపాటు బీజేపీ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఐదు పార్లమెంట్ క్లస్టర్ల వారీగా ఈ యాత్రలు ఉంటాయి. ఇందులో భాగంగా తెలంగాణ అప్పులు తీరాలన్న, తెలంగాణ అభివృద్ధి చెందాలన్న మరోసారి మోదీ అధికారంలోకి రావాలన్న అంశం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్కుమార్గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్అలీ, ఫిరోజ్ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్పెద్దలున్నట్టు సమాచారం. -
హ్యాట్రిక్పై బీజేపీ గురి...!
వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది! ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. 50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది. పంజాబ్లో అకాలీదళ్, బిహార్లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది. నెలాఖరు నుంచి జాబితాలు...! జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది... 1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది. 2. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది. 3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు. 4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్బరేలీ, మెయిన్పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్బరేలీ, మెయిన్పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి. 5. ఇలాగే బిహార్లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు. 6. మధ్యప్రదేశ్లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్కు అప్పగించారు. 7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి. 8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్లో అమృత్సర్, ఆనంద్పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్పూర్ తదితర లోక్సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. 10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చీకటి వస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అధికారంలో ఉండగా పొరపాట్లు, లోటు పాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, ప్రభు త్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని కొంతనిర్లక్ష్యం చేశామని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కా దని, పది పదిహేనేళ్లు కాకపోతే 20 ఏళ్లకైనా పదవి నుంచి దిగాల్సిందేనని, అదే జీవితమని వ్యాఖ్యా నించారు. శాసనసభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించిందని, మన పార్టీ యంత్రాంగం కూడా సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం తెలంగాణ భవన్లో కరీంనగర్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి పునర్జన్మనిచ్చింది కరీంనగరే ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలి. ప్రత్యర్థి పార్టీలు సాగించే దుష్ప్రచారాలను ఎప్పటి కప్పుడు దీటుగా తిప్పికొట్టాలి. విద్యార్థి, యువ జన, మైనార్టీ సమ్మేళనాలతో పాటు సోషల్ మీడియా టీం సమావేశం నిర్వహించాలి. వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. ప్రతి ఓటు కీలకం. కాబట్టి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ నేతలపై ప్రజలకు విశ్వాసం లేదు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదమే 23 ఏళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం. పార్టీకి జన్మనిచ్చి, కష్టకాలంలో పునర్జన్మ నిచ్చింది కూడా కరీంనగరే. కేసీఆర్ను ఉద్యమ సమయంలో కాపాడుకుని, తెలంగాణను సగర్వంగా నిలిపింది కూడా కరీంనగరే..’ అని కేటీఆర్ కొనియాడారు. ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పదేళ్లు అకుంఠిత దీక్షతో పనిచేశాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాం. రెండుసార్లు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు తలెత్తుకునే పనులే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేశారు తప్ప తలదించుకునే పని చేయలేదు. ప్రభుత్వం, పార్టీ వేరు కాదనే ఉద్దేశంతో పనిచేశాం. సంస్థాగత నిర్మాణంపై అంతగా దృష్టి పెట్టలేదు. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలకు జిల్లా అధ్యక్షులను నియమించినా, పూర్తి కమిటీలు వేయలేదు. అనుబంధ కమిటీల నిర్మాణం చేయలేకపోయాం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కార్యకర్తలకు పనులు ఇవ్వలేదు. పనులిస్తే దుష్ప్రచారం చేస్తారని భావించామే తప్ప, చిన్న చూపుతో కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సర్పంచ్ మొదలుకొని అన్ని పదవుల్లో బీఆర్ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ, మనోడు గెలవాలనే కసితో పని చేయలేదు. ఇతర పార్టీల్లో నలుగురైదుగురే ఉన్నా కసితో పని చేశారు. అందుకే వారు విజయం సాధించారు..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరికీ భయపడొద్దు ‘నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్లు గర్వంతో విర్రవీగుతారు. కొత్త బిచ్చగాళ్ల తీరుగా పట్టించుకోవద్దు. కేసుల పేరుతో బెదిరించినా భయపడొద్దు. మేము అండగా ఉంటాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పోలింగ్ ఏజెంట్లను కూడా ప్రభావితం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్లోని ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను చూస్తే ఇతర పార్టీల కన్నా బీఆర్ఎస్కే అధిక్యం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఎక్కువ వేయిస్తే లక్ష ఓట్లతో విజయం సాధిస్తాం. ప్రశ్నించే గొంతుక వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. మాజీమంత్రి హరీశ్రావు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఎంపీ కె.కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి ఎన్నికల సన్నద్ధత విషయంలో పార్టీ వ్యూహాన్ని వివరించారు. -
సన్నద్ధతపై సుదీర్ఘంగా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల దిశగా సన్నద్ధ తను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కసరత్తు ముమ్మరం చేసింది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు గురువారం నందినగర్లోని నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో.. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్, బీజేపీల సన్నద్ధత, ఎత్తుగడలు, వాటిపై పైచేయి సాధించడం, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తదితర అంశాలపై చర్చించారు. కాగా ఆయా అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక, అంగబలంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రెండు పార్టీలు బరిలోకి దించుతాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సిట్టింగ్ ఎంపీలతో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మళ్లీ అవకాశం ఇస్తే ఎంత మేరకు పోటీ ఇవ్వగలరనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే ఎదురయ్యే లాభ, నష్టాలపైనా మదింపు జరుగుతోంది. టికెట్పై కొందరికి సంకేతాలు చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం సిట్టింగ్ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో గతంలో పోటీ చేసిన ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, గెడాం నగేశ్కు కూడా టికెట్ దాదాపు ఖాయం కావడంతో వారు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇలా కచ్చితంగా టికెట్ ఇవ్వాలని భావించిన నేతలకు మాత్రమే సంకేతాలు ఇచ్చి పార్టీ కేడర్ను సమన్వయ పరుచుకోవాల్సిందిగా సమాచారం ఇస్తున్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ స్థితిగతులపై సర్వే సంస్థల నివేదికలతో పాటు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లు తెలిసింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. అక్కడి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారా లేక గతంలో ఇచ్చిన హామీ మేరకు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డికి టికెట్ ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరిచిన మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని కేటీఆర్, హరీశ్తో జరిగిన భేటీలో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. జనవరి 3 నుంచి జనంలోకి పార్టీ కేడర్తో అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలోని మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. సుమారు నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సమావేశాలు ముమ్మరంగా జరిగేలా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది... ఆరునూరైనా 60 దాటాల్సిందే...! కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్)తో కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ను ఎలాగైనా సింగిల్ డిజిట్కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో... కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఉత్తరాది నేతలకు బాధ్యతలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్సింగ్ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, సునీల్ బన్సల్, స్వతంత్ర దేవ్ సింగ్, గుజరాత్కు చెందిన పర్ణేశ్ మోదీ, విజయ్ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
చేరికలపై హస్తం ఫోకస్..!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చి, అధికారం చేపట్టిన నేపథ్యంలో.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తోంది. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్లో పనిచేసి వెళ్లిన నేతలను, బీజేపీలోని కీలక నేతలను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో ఇప్పటికే పలువురు బీజేపీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరిపినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల నేతలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మొత్తమ్మీద 15 ఎంపీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రయోజనం కోసం.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను పదింట బీజేపీతోనే పోటీ ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు స్థానాలు, ఉత్తర తెలంగాణలోని లోక్సభ సీట్లలో కమలనాథుల నుంచి గట్టిపోటీ ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన లోక్సభ అభ్యర్థుల స్థాయి నేతలను చేర్చుకోవడం ద్వారా.. ఆదిలోనే బీజేపీకి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంతనాలు షురూ.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ కీలక నేతను చేర్చుకునే విషయంలో టీపీసీసీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆయనకు కరీంనగర్ లోక్సభ స్థానాన్ని ఆఫర్ చేయడంతోపాటు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత కలి్పస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలతోపాటు మెదక్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతతోనూ టచ్లోకి వెళ్లినట్టు తెలిసింది. మరో ఐదేళ్లదాకా తెలంగాణలో బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమని.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిస్తే, రాష్ట్రంలో బీఆర్ఎస్ను పక్కాగా నిలువరించవచ్చని సదరు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ శివారు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు బీసీ నేతలు గతంలో కాంగ్రెస్లో పనిచేసి ఉన్న నేపథ్యంలో.. వారిని కూడా పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలిసింది. మొత్తమ్మీద లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. -
2024 లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
-
వైద్య రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి
-
హైదరాబాద్ పబ్స్పై పోలీసుల ఫుల్ ఫోకస్
-
‘డీప్’గా పసిగట్టి..‘ఫేక్’ పనిపట్టండి
సాక్షి, హైదరాబాద్: డీప్ఫేక్పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆన్లైన్లో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ కట్టడికి కఠిన నిబంధనలు విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, డీప్ఫేక్తో మోసాలకు గురికాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి. ► ఫొటోలు, వీడియోలలో ఉన్న లైటింగ్, నీడలను నిశితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలు గమనిస్తే అది ఫేక్ అని ప్రాథమిక అంచనాకు రావొచ్చు. ► అసహజ ముఖకవళికలు ఉన్నట్టు గమనిస్తే దానిని డీప్ఫేక్తో తయారు చేసిన వీడియోగా భావించవచ్చు. ► ఆడియోలలో అసమానతలు, ఆడియో అస్పష్టంగా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► ఫొటోలు, వీడియోల బ్యాక్గ్రౌండ్లో అసమానతలు, ఏవైనా వస్తువులు సాధారణానికి భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్ఫేక్ అయి ఉండొచ్చు. ► ఫొటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడిన, నడుస్తున్న ప్లాట్ఫారమ్లు అసాధారణంగా ఉన్నాయా? కదలికలు నిశితంగా పరిశీలిస్తే ఏవైనా అనుమానాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► డీప్ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కూడా అవి నిజమైనవా..లేదా? గుర్తించవచ్చు. -
విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు. 1.84 లక్షల సీట్లు ఖాళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్లో అనుమతించలేదు. దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి. ఆదరణలేని స్కిల్ కోర్సులు డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్గ్రేడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్ డిమాండ్ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. మార్పులు అనివార్యం.. రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఎగుమతులపై దృష్టి పెడుతున్న భారత్.. కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు
న్యూఢిల్లీ: నైజీరియా, ఇథియోపియా, ఘనా వంటి సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలు, ఇతరత్రా గల్ఫ్ దేశాలకు ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా టారిఫ్యేతర అవరోధాలను తొలగించడంపై కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలున్న సహారా ప్రాంత దేశాలు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ మిషన్లతో వర్చువల్ సమావేశాలు నిర్వహింనట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా దేశాలతో ఆర్థిక, వ్యాపార సంబంధాలు, ఎగుమతుల స్థితిగతులు, టారిఫ్యేతర అడ్డంకులు మొదలైన వాటి గురిం చర్చింనట్లు వివరించారు. సహారా ప్రాంత దేశాలకు సంబంధిం దక్షిణాఫ్రికా .. భారత్కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022–23లో దక్షిణాఫ్రికాతో మొత్తం 18.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైంది. ఇందులో 8.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా (11.85 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 5.15 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టోగో (6.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 6 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టాంజానియా (6.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 3.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ఉన్నాయి. మిగతా ఆఫ్రికన్ దేశాల్లో మొజాంబిక్, అంగోలా, కెన్యా ఉన్నాయి. గల్ఫ్లో సౌదీ అరేబియా (52.76 బిలియన్ డాలర్లు), ఖతర్ (18.77 బిలియన్ డాలర్లు) తదితర దేశాలతో అత్యధికంగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఎగుమతులకు ఊతమిచ్చే క్రమంలో ప్రధానంగా ఆహారం, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వంటి రంగాలు, ప్రధాన మార్కెట్లపై దృష్టి పెట్టాలంటూ ఎగుమతిదార్లకు వాణిజ్య శాఖ సూంంది. అలాగే, అంతర్జాతీయంగా మరిన్ని ఎగ్జిబిషన్స్ వంటివి నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఎగుమతులు 7 శాతం తగ్గి సుమారు 245 బిలియన్ డాలర్లకు, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించి 392 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతో రోడ్షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. వార్రూమ్లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ వార్రూమ్తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్రూమ్లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపై భారత్ దృష్టి
ముంబై: విశ్వక్రీడల ఆతిథ్యంపై భారత్ దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్స్ ప్రారం¿ోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మోదీ మాట్లాడుతూ ‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు. 2036లో ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే ప్రణాళికల్లో ఉన్నాం. ఇది 140 కోట్ల భారతీయుల కల. దీన్ని ఐఓసీ సహకారంతో సాకారం చేస్తాం. దీనికంటే ముందు 2029లో యూత్ ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని మోదీ అన్నారు. క్రీడాస్ఫూర్తి అనేది విశ్వవ్యాప్తమని, ఇందులో పరాజితులెవరూ ఉండరని... కేవలం విజేతలు, నేర్చుకునేవారే ఉంటారని మోదీ చెప్పారు. 141వ ఐఓసీ సెషన్స్ శనివారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కొత్త క్రీడాంశాలకు చోటు కలి్పంచడం, ఓటింగ్, ఆమోదం తదితర నిర్ణయాలను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తీసుకుంటుంది. -
అప్పుడెట్లనో.. ఇప్పుడట్లనే ఉండాలే..!
మంచిర్యాల: ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దీంతో మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెంచారు. 2018 ఎన్నికల సమయంలో ప్రధానంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పడు కూడా అలాగే ఉండాలని వైన్స్ యజమానులకు ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మద్యం ఏరులై పారకుండా ఐఎంఎల్ డిపో నుంచి భారీ మద్యం కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 208 మద్యం దుకాణాలు, దాదాపు 45 వరకు బార్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిపై నిఘా పెంచారు. పరిమితికి మించి మద్యం నిల్వలు ఉంచినా, మద్యం తరలింపు చేపట్టినా ఎక్సైజ్, పోలీస్ శాఖలు పట్టుకుని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తికి పరిమితికి మించి మద్యం విక్రయించినా ఆ వైన్ దుకాణాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం నిఘా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాం. మద్యం అమ్మకాలు గతంలోని అమ్మకాలను పోల్చి చూస్తూ మద్యం విక్రయాలపై దృష్టి సారించాం. మద్యం నియంత్రణ చేపడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. మద్యం దుకాణా దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అక్రమ మద్యం రవాణా కట్టడికి రెండు చెక్పోస్ట్లు ఏర్పాటు చేశాం. అక్రమ మద్యం నిల్వలు, సరఫరా అరికట్టేలా మూడు తనిఖీ బృందాలు ప్రత్యేకంగా గస్తీ చేపడుతున్నాయి. – నరేందర్, సీఐ, ఎక్సైజ్ శాఖ, మంచిర్యాల -
తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
-
తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో వివాదం...రంగంలోకి రాహుల్ గాంధీ..
-
తెలంగాణపై బీజేపీ అగ్రత్రయ నేతల ఫోకస్
-
నమామీ గోదావరి..స్వచ్ఛ గోదావరే లక్ష్యంగా ఏపీ సర్కార్ కృషి
-
చంద్రబాబు ముడుపుల కేసులో కీలక మలుపులు
-
మీలో ఏకాగ్రత ఎంత? అందుకోసం ఏం చేయాలంటే..!
ఏకాగ్రత లేకుండా చదవడం లేదా ఏ పనినైనా చేయడం అంటే చిల్లికుండలో నీళ్లు నింపడం లాంటిదే.ఏకాగ్రత లేకుండా చేసే పనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే కొందరిలో ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత ఉండదు. అలా ఏకాగ్రత లేకపోవడానికి మానసిక, శారీరక సమస్యలు కారణం కావచ్చు. ఇంకొంతమందికి ఎక్కువ సమయం ఒకే విషయం మీద ఫోకస్ చేసినా ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రలేమి, ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్ మొదలైన ఆరోగ్య సమస్యలు కూడా కారణాలు కావచ్చు. ఏకాగ్రత పెరగాలంటే.. ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం.అందుకే ఏకాగ్రత పెంచుకోవడం అందరికీ అవసరం. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం ఏం చేయాలో చూద్దాం. ముందు మనం విద్యార్థుల కోసం చెప్పుకుందాం.. ⇒ చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. టీవీ, ఫోన్ , కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్కి దూరంగా ఉండాలి. ⇒ ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం. ⇒ ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఎప్పుడూ చేయకూడదు. ⇒ స్టడీసెషల్స్కు నలభైనుంచి యాభై నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించొద్దు. అలసిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో విరామం అవసరం. ⇒ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బాధలను, ఆందోళనలను మర్చిపోవాలి. ⇒ చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్ను, టాపిక్స్ను నోట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని రిఫర్ చేసుకోవాలి. యోగా, ధ్యానం మొదలైన టెక్నిక్స్ ఉపయోగపడతాయి. ఎస్క్యూ3ఆర్ పద్ధతి ఎస్ (సర్వే): చదివిన దాంట్లో ముఖ్యమైనవి ఒక సర్వే పుస్తకంలో రాసుకోవాలి. టైటిల్స్, సబ్–టైటిల్స్, క్యాప్షన్స్ లాంటివి రిఫరెన్స్కి బాగా తోడ్పడతాయి. క్యూ (క్వశ్చన్): పుస్తకంలో నోట్ చేసుకోవడం, చదవడం పూర్తయ్యాక క్వశ్చన్స్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆర్ 1 (రీడ్): చాప్టర్ పూర్తవగానే క్వశ్చన్ , దానికి సరైన జవాబును తెలుసుకొని చదువుకోవాలి. అలా చదివితే మర్చిపోవడం అంటూ జరగదు. ఆర్ 2 (రిసైట్): చదివిన వాటిని తిరిగి ప్రశ్నించుకుంటూ వాటి జవాబులను గుర్తు చేసుకోవాలి. సొంతంగా జవాబులను తయారు చేసుకోవాలి. అవసరమైతే ముందు రాసుకున్న నోట్స్ తీసి చూడాలి. ఆర్ 3 (రివ్యూ): చదివిన తర్వాత అవన్నీ మెదడులో తాజాగా ఉండాలంటే మళ్లీమళ్లీ చదవాలి. మామూలుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం– చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, చూస్తూ, ఒక నోటు పుస్తకంలో ముఖ్యమైన వాటిని రాసుకుంటూ చదివితే ఏకాగ్రత కోల్పోవడం తగ్గుతుంది. మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు (సెల్ ఫోను), వ్యక్తులను చదువుతున్నప్పుడు దూరం పెట్టాలి. వీలయినంత వరకు చదవడానికి ఒక ప్రదేశం (లైబ్రరీ, ఇంటి లో ఒక గది) నిర్ణయించుకుని అక్కడే ప్రతిరోజు చదివితే, మన బుర్రలో అది స్థిరపడి, ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే వేరే ఆలోచనలు తక్కువవుతాయి. కొంతమంది ఎక్కువసేపు ఒకచోట కూర్చోలేరు. అలాంటివారు 3–4 చోట్ల మధ్య మారుతూ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు. చదివే వ్యాసాలను ఫ్లో– చార్ట్స్, డయాగ్రమ్స్గా నోటు పుస్తకాలలో రాసుకుంటే బాగా గుర్తుంటాయి. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించినా తేలిగ్గా తీసుకోకుండా వాటిని పాటించడం వలన ఏకాగ్రత మెరుగుపరచుకోవచ్చు. (చదవండి: జంక్ ఫుడ్నే జంకేలా..తినడం స్టాప్ చేద్దాం ఇలా!) -
అగ్రత్రయ నేతల పర్యటనపైనే కాషాయ పార్టీ ఆశలు
-
బ్లాక్ స్పాట్స్పై నజర్
సాక్షి, హైదరాబాద్ : తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్లపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్స్పాట్స్గా గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్తోపాటు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, స్థానిక మున్సిపల్శాఖ అధికారుల సమన్వయంతో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో.. మరోమారు ప్రమాదాలకు తావులేకుండా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే.. కొంత కాలం తర్వాత ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలోంచి తొలగిస్తున్నట్టు అడిషనల్ డీజీ శివధర్రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,002 బ్లాక్స్పాట్స్ను గుర్తించారు. 2022 నాటికి వాటి సంఖ్య 951కి తగ్గింది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డు మలుపు లేదా ఇరుకుగా ఉండటం అయితే.. వెంటనే ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డు వెడల్పు చేయడం, లేదా మూల మలుపు ప్రమాదకరంగా లేకుండా మార్చడం వంటి ఇంజనీరింగ్ చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు సరిగా కనిపించేలా మార్కింగ్లు పెట్టడం.. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, గుంతలు పూడ్చడం వంటి తాత్కాలిక చర్యలను తీసుకుంటారు. బ్లాక్ స్పాట్ అంటే..? బ్లాక్ స్పాట్లను రెండు విధాలుగా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదుకు మించి రోడ్డు ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదంలో పది మంది కంటే ఎక్కువ మంది చనిపోయినా (అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యతో సంబంధం లేకుండా) ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా పరిగణిస్తారు. -
విశాఖ తీరంలో కొత్త అందాలు
-
టాలీవుడ్ రికార్డ్స్ పై కన్నేసిన కోలీవుడ్ మూవీస్
-
పాఠశాల విద్యపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోకస్
-
ఏపీలో బీచ్ ల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
-
పొలిటికల్ కారిడార్: నల్గొండలో కమలానికి దిక్కేది..?
-
మహేష్ సినిమాతో హాలీవుడ్ పై కన్నేసిన జక్కన్న
-
టీ కాంగ్రెస్ సీనియర్లకు హైకమాండ్ బుజ్జగింపు
-
తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్
-
తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్
-
కాంగ్రెస్ అసమ్మతి నేతలపై దృష్టిపెట్టిన బీజేపీ
-
బాక్సాఫీస్ ను పరుగులు పెట్టించబోతున్న కమల్ హాసన్
-
అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఇప్పట్నుంచే సమాయత్తం చేయడంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నికలో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ముఖ్య నేతలకు, సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఈనెల 15న తెలంగాణ భవన్లో శాసనసభ, పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సాయంత్రం వరకు సాగే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా క్షేత్రస్థాయిలో వెలుగు చూసిన పార్టీ అనుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ పార్టీ ఇన్చార్జిలను నియమించడం, మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించడం వంటి కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో కేసీఆర్ ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్లు.. జిల్లా పరిషత్ల చైర్మన్లు తదితరులను నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించి, ఆయా ప్రాంతాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్చార్జిల నియామక కసరత్తు పూర్తి తమ సొంత నియోజకవర్గంతో పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలోని మరో నియోజకవర్గం గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించనున్నారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంలో మంత్రులు, కొత్తగా నియమితులయ్యే పార్టీ ఇన్చార్జిలే కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. కాగా ఇన్చార్జిల నియామకానికి సంబంధించిన కసరత్తును కేసీఆర్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే నియోజకవర్గానికి చెందిన నేతలను కాకుండా ఇతర ప్రాంతాల వారిని ఇన్చార్జిలుగా నియమించే అవకాశముంది. మునుగోడు ఫీడ్బ్యాక్ ఆధారంగానే.. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. మండలాలు, గ్రామాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను మోహరించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులపై కొంత ఫీడ్ బ్యాక్ లభించింది. గ్రామాలు, పట్టణాల్లో యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు వివిధ సామాజిక వర్గాలు.. అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో తెలిసింది. స్థానిక నేతలు, కేడర్ పనితీరు, సమన్వయం, ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతలు వంటి అనేక అంశాలపై ఒక అవగాహన ఏర్పడింది. ఈ ఫీడ్బ్యాక్ను లోతుగా విశ్లేషించిన కేసీఆర్.. దాని ఆధారంగానే రాబోయే రోజుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన విధానంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడం, సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, దళితబంధు పురోగతి వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఎరలు, దాడులపై అప్రమత్తం! ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఎపిసోడ్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని భావిస్తున్న కేసీఆర్.. భవిష్యత్తులోనూ ఎరలు, ఈడీ, ఐటీ సంస్థల దాడులతో పార్టీ ముఖ్య నేతలను లొంగదీసుకునేందుకు బీజేపీ చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించవచ్చని చెబుతున్నారు. ప్రలోభాలకు లొంగకుండా గట్టిగా నిలబడే నేతలకు పార్టీ అండగా ఉంటుందనే భరోసాను కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఇవ్వనున్నారు. బీజేపీ ప్రలోభాలను తట్టుకుని నిలబడిన ఎమ్మెల్యేలకు భద్రత పెంచడం, వ్యక్తిగతంగా తన వెంట పర్యటనకు తీసుకెళ్లడం వంటి అంశాలను వివరించనున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు, వ్యాపార సంస్థలపై జరిగిన దాడులను ప్రస్తావించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరుస పర్యటనలు, సభలు సమావేశాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తన వరుస పర్యటనలు, సభలు, సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ను సన్నద్ధం చేసేందుకు కలెక్టరేట్ల ప్రారంభం, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, సభలు, సమావేశాలు విస్తృతంగా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇలావుండగా మంగళవారం నాటి కీలక భేటీ దృష్ట్యా.. అదేరోజు మునుగోడు నియోజవర్గంలో పలువురు మంత్రులతో నిర్వహించ తలపెట్టిన సమీక్ష సమావేశం వాయిదా పడే అవకాశముంది. చదవండి: ఎడారి గోసకు.. ఏదీ భరోసా! -
Focus Review: ఫోకస్ మూవీ రివ్యూ
టైటిల్: ఫోకస్ నటీనటులు: విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు నిర్మాత : వీరభద్రరావు పరిస దర్శకత్వం: జి. సూర్యతేజ సంగీతం: వినోద్ యజమాన్య సినిమాటోగ్రఫీ: ప్రభాకర్ రెడ్డి ఎడిటర్: సత్య. జీ విడుదల తేది: అక్టోబర్ 28, 2022 కథేంటంటే.. ఎస్పీ వివేక్ వర్మ(భాను చందర్), న్యాయమూరి ప్రమోద దేవి(సుహాసిని మణిరత్నం) భార్య భర్తలు. వృత్తిధర్మం పాటిస్తూ.. ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో వివేక్ వర్మ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఎస్సై విజయ్ శంకర్(విజయ్ శంకర్) టేకాప్ చేస్తాడు. అనేక మలుపుల తర్వాత ఈ కేసు దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ(అషురెడ్డి) రంగంలోకి దిగుతుంది. అసలు వివేక్ని హత్య చేసిందెవరు? హత్య కేసు దర్యాప్తు ఎందుకు క్రిటికల్గా మారింది? విజయ్ శంకర్ను తప్పించి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ ఎందుకు ఈ కేసును టేకప్ చేయాలని ప్రయత్నించింది? చివరకు అసలు హంతకులను ఎలా పట్టుకున్నారు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి. ఇలాంటి కథలను కొత్త దర్శకులు ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఫోకస్ చిత్రం కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథతోనే తెరకెక్కింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేసే విధంగా ట్విస్టులు ఉంటాయి. బలమైన సన్నివేశాలు లేకపోవడం, పేలవంగా కథనం సాగడం.. క్యారెక్టర్లలో క్లారిటీ లేకపోవడం లాంటి అంశాలు తొలి భాగంలో కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. సెకండాఫ్లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ట్విస్టు ఉంటుంది. స్క్రిప్టు పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే.. సినిమా స్థాయి మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఎస్సై విజయ్ శంకర్గా విజయ్ శంకర్ తనదైన నటనతో మెప్పించాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా మంచి నటనను కనబరిచాడు. అషురెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమగా అషురెడ్డి పర్వాలేదనిపించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సినిమాకు ప్రధాన బలం సుహాసిని పాత్ర అనే చెప్పాలి. అతిథి పాత్రకే పరిమితమైంది. జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. వినోద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ సత్య. జీ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
`ఫోకస్` టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది : శ్రీకాంత్
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్నచిత్రం `ఫోకస్`. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు, వీరభద్రరావు పరిస నిర్మాత. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. అక్టోబరు 28న ఈ మూవీ థియేటర్స్లో గ్రాండ్గా విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శకుడు సూర్యతేజ మంచి సబ్జెక్ట్ను ఎంచుకున్నారు. హీరో విజయ్ శంకర్ చాలా బాగా నటించాడు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు. ‘నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ‘ఫోకస్’. క్రైమ థ్రిల్లర్ జోనర్ని ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం ఫుల్మీల్స్లా ఉంటుంది’అని హీరో విజయ్ శంకర్ అన్నాడు. ఫోకస్ అనేది ఒక కొత్త తరహా క్రైమ్ థిల్లర్. తెలుగు ఆడియన్స్ ఈ జోనర్ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. కొత్తగా ఉంటే తప్పకుండా ఓన్ చేసుకుంటారు. ఊహించని మలుపులతో సరికొత్త కథ,కథనాలతో ఈ సినిమా రూపొందింది’అని దర్శకుడు సూర్యతేజ్ అన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాసిని, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు. -
టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ గురి
-
బిగ్ క్వశ్చన్ : కేసీఆర్ స్ట్రాటజీ ఢిల్లీలో వర్కవుట్ అవుతుందా ..?
-
జాతీయ పార్టీపై కేసీఆర్ కసరత్తు
-
మునుగోడు ఓటర్ల దయకోసం మూడు పార్టీల పాకులాట
-
అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ అపరేషన్
-
మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్
-
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ వరుస సమావేశాలు
-
కాకరేపుతోన్న మునుగోడు రాజకీయం
-
మునుగోడు పోరుకు సై అంటున్న బీజేపీ
-
తెలంగాణ కాంగ్రెస్పై ఏఐసీసీ ఫోకస్
-
తెలంగాణ కాంగ్రెస్ పై ఏఐసీసీ ఫోకస్
-
తెలంగాణ రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
-
బ్లూ ఎకానమీ.. ఆ దిశగా ఏపీ సర్కార్ వేగంగా అడుగులు..
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ)పై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డు విదేశీ పోర్టుల భాగస్వామ్య అంశాలపై దృష్టిసారించింది. యూరప్లోనే అతిపెద్ద పోర్టుగా పేరొందిన నెదర్లాండ్స్లోని రోట్టర్ డ్యామ్, బెల్జియంకు చెందిన యాంట్వెర్ప్లతో కలిసి పనిచేసేందుకు అడుగులు వేస్తోంది. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులను కలిసి రాష్ట్రంలోని పోర్టుల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏపీలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టడంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఆ రెండు సంస్థలను కోరినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అంతర్జాతీయ పోర్టులతో చేతులు కలపడం ద్వారా విదేశీ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం రాష్ట్ర పోర్టులకు వేగంగా కలుగుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రతిపాదనలపై రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తంచేశాయని, త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖతను వ్యక్తంచేసినట్లు ఆయన తెలిపారు. నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలోనూ.. అదే విధంగా.. షార్జాకు చెందిన డామన్ షిప్యార్డ్ ప్రతినిధులతో కూడా సమావేశం జరిగిందని, రాష్ట్రంలో నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించినట్లు రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటన సందర్భంగా ఆయా పోర్టులను సందర్శించి స్థానిక పరిశ్రమల ప్రతినిధులు, పోర్టు చైర్మన్లతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా దావోస్ పర్యటన అనంతరం విదేశీ పోర్టుల ప్రతినిధులను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానిస్తూ తాజాగా ఈ–మెయిల్స్ పంపామన్నారు. ఈ పర్యటనలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, మారిటైమ్ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, గత దుబాయ్ ఎక్స్పో సందర్భంగా షరాఫ్ గ్రూపు రాష్ట్ర లాజిస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపించిందని, త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు రవీంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. -
AP: టెన్త్ ఫెయిల్ అయ్యారా?.. అయితే ఇది మీకోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ‘ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని వివరించారు. విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్కు సమర్పించాలని నిర్దేశించారు. చదవండి: ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్న్యూస్.. తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పాఠశాలవిద్య కమిషనర్ మార్గదర్శకాలు అందిన వెంటనే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఏర్పాట్లపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు ఏ బాధ్యత నెరవేర్చాలో సూచనలు జారీచేస్తున్నారు. కొందరు డీఈవోలు జారీచేసిన సూచనలు.. ►సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా తన పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులంతా ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలి. ►షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాటు వారి సబ్జెక్టు విభాగం ప్రకారం బాధ్యత ఇవ్వాలి. ►సంబంధిత సీఆర్పీ సహాయంతో గూగుల్ ఫారం ద్వారా రోజువారీ హాజరు నివేదికను డీసీఈబీ సెక్రటరీకి సమర్పించాలి. ►సబ్జెక్టు టీచర్లందరూ తమ సబ్జెక్టుల్లో ఫలితాల మెరుగుదల కోసం సొంత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలి. ►సబ్జెక్టు వారీగా ప్లాన్తో పాటు టైమ్టేబుల్, దానికోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను గూగుల్ ఫారం ద్వారా ప్రధానోపాధ్యాయులు జూన్ 11వ తేదీ నాటికి డీసీఈబీలకు తెలియజేయాలి. ►రెమిడియల్ తరగతులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. ►ఈ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా డిప్యూటీ డీఈవోలు పర్యవేక్షించాలి. ►తక్కువ పనితీరు కనబరుస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. -
కంపెనీల కొనుగోళ్లపై సీఈవోల దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో దేశీయంగా వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, ఎకానమీ పుంజుకునే కొద్దీ భారతీయ సంస్థలు ఆయా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడం కొనసాగిస్తున్నాయి. ఈవై ఇండియా సీఈవో సర్వే 2022లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కార్యకలాపాలను విస్తరించుకోవడానికి సంబంధించి వ్యాపారాలను క్రమక్రమంగా నిర్మించుకుంటూ వెళ్లడం కన్నా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాలకే (ఎంఅండ్ఏ) ప్రాధాన్యం ఇవ్వాలని సీఈవోలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు, పెరుగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ల మధ్య భారతీయ సీఈవోలు తమ రిస్కులను కొత్తగా మదింపు చేసుకుంటున్నారు. మారే పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ను తీర్చిదిద్దుకునేందుకు తమ పెట్టుబడుల వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ప్రకారం మహమ్మారి వల్ల తమ వ్యాపారాలకు స్వల్పకాలికంగా అవాంతరాయాలు ఏర్పడ్డాయని 50 శాతం మంది భారతీయ సీఈవోలు వెల్లడించారు. భౌగోళికరాజకీయ సవాళ్లు దీనికి మరింత ఆజ్యం పోశాయని, వ్యాపార కార్యకలాపాలకు మరిన్ని రిస్కులు తెచ్చిపెట్టాయని వివరించారు. వ్యూహాల్లో మార్పులు .. సవాళ్లను అధిగమించేందుకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు 80 శాతం మంది సీఈవోలు తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించుకోవడం, సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు 63 శాతం మంది వివరించారు. ‘సాంప్రదాయేతర సంస్థల నుంచి పోటీతో పాటు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న అంశాన్ని భారతీయ సీఈవోలు గుర్తించారు‘ అని సర్వే వివరించింది. మహమ్మారి, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారతీయ సీఈవోలు ముందుండి తమ సంస్థలను నడిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. వ్యాపారంలో మార్పులు చేయడానికి, దీర్ఘకాలికంగా విలువను సృష్టించడానికి సంస్థల కొనుగోళ్లు, విలీనాల దోహదపడగలవని సీఈవోలు భావిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ తెలిపారు. -
హీరోయిన్గా అషూ రెడ్డి, ఫోకస్ పోస్టర్ చూశారా?
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ఫోకస్'. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవల విడుదలైన ఫోకస్ మూవీ టీజర్ ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేషాదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. తాజాగా ఆమె లుక్ను బి. సుమతి ఐపీఎస్ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుదల చేసి చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. 'ఫోకస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది. ఔట్ పుట్ పట్ల మా యూనిట్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అతి త్వరలో ఒక స్టార్ హీరోతో ఫోకస్ మూవీ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చదవండి: పాన్ ఇండియా సినిమాల సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్ బాలీవుడ్ రీమేక్లపై వర్మ వ్యంగ్యాస్త్రాలు -
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుహాసిని ‘ఫోకస్’ ఫస్ట్లుక్
విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలలో జి. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫోకస్’. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆసక్తికరమైన కథ-కథనాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, వేలంటైన్స్డే సందర్భంగా రిలీజైన పోస్టర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫోకస్ మూవీ నుంచి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ పోస్టర్ను సినీ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యతేజ తన డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై `ఫోకస్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్శంకర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడే టీజర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్రలు చాలా ఉన్నాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. ‘నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం `ఫోకస్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్ను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. భాను చందర్, షియాజీ షిండే, జీవా, సూర్య భగవాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
మర్డర్ కేసుపై ‘ఫోకస్’ పెట్టిన విజయ్ శంకర్
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ఫోకస్’ మూవీ తెరకెక్కుతోందని మూవీ యూనిట్ పేర్కొంది. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా, అషూరెడ్డి హీరోయిన్గా నటిస్తోంది.భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది. మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తాం’అని చిత్ర దర్శకుడు సూర్యతేజ తెలిపారు. -
కొవిషీల్డ్ సింగిల్ డోస్పై ఫోకస్
-
‘డీఎస్సీ–2018’ నియామకాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2018 నియామకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీచర్ పోస్టుల నియామకాలు చేపడతామని అధికారులు గతంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అయితే, హైకోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు నివేదించిన గడువులోగా కాకున్నా పది రోజులు అటు ఇటుగా ఈ నియామకాలు పూర్తి చేస్తామని అంటున్నారు. కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కారమయ్యేలా చూసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. టీచర్ పోస్టుల భర్తీపై ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో చర్చ జరిగింది. అన్ని తరగతులకూ టీచర్లుండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. డీఎస్సీ–2018లోని 7,902 పోస్టుల నియామకాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు.. రాష్ట్రంలో 7,902 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2018 అక్టోబర్ 10న ప్రభుత్వం టీఆర్టీ, టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి 2019 జనవరి 31 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. 6,08,155 మంది దరఖాస్తు చేయగా, 5,89,165 మందికి హాల్టికెట్లు జారీ చేశారు. వీరిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. అయితే, ఫలితాలు, మెరిట్ జాబితాలు, సెలెక్షన్ జాబితాల విడుదలకు షెడ్యూల్ ప్రకటించినా అవి అనుకున్న తేదీల్లో వెలువడలేదు. చివరకు మెరిట్ జాబితాలను ప్రకటించి జిల్లాల వారీగా అర్హులైన అభ్యర్థుల ఎంపికను ఆన్లైన్ విధానంలో చేపడుతూ సుదీర్ఘ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం కూడా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. మెరిట్ జాబితాల విడుదల ఆలస్యం కావడం ఒకటైతే, మరోవైపు సెలెక్షన్ జాబితాల విడుదలలో కూడా జాప్యం జరగడం నియామకాలకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. -
ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలంతా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పనిచేయాలనీ, గత ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయని ప్రజల మనసులను కూడా గెలుచుకుని, వచ్చే ఎన్నికల్లో వారంతా బీజేపీకే ఓటు వేసేలా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఓటు వేయని వారిపై లేదా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడిన వారిపై ద్వేష భావం వద్దనీ, అందరినీ కలుపుకుని పోతూ, అందరి మన్ననలూ పొందుతూ తర్వాతి ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయం చేసుకునేలా ప్రవర్తించాలని తమ ఎంపీలకు మోదీ మార్గ నిర్దేశం చేశారు. అన్ని చోట్లా ప్రజలతోపాటే క్యూల్లో నిలబడాలనీ, జనంతో కలిసిపోయి మనుషులందరితో మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. 380 మందికి పైగా బీజేపీ ఎంపీలకు శిక్షణనివ్వడం కోసం బీజేపీ శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముగింపు సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాలం నుంచి ఇప్పుడు ప్రధానిగా రెండోసారి గెలిచేంత వరకు, దాదాపు రెండు దశాబ్దాలుగా తాను ఎప్పుడూ అధికారంలోనే ఎలా ఉంటున్నదీ మోదీ వివరించారు. ఎంపీలు కూడా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ ఎంతో నిబద్ధతతో ఉండాలనీ, నియోజకవర్గంలోని ప్రజలను ఎప్పుడూ కలుస్తూ, వారి మధ్యనే ఎక్కువ కాలం గడపాలని ఆయన సూచించారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించవద్దనీ, రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకు, నియోజకవర్గానికి మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో ఏయే పోలింగ్ బూత్ల్లో ఓట్లు సరిగ్గా పడలేదో గుర్తించి, ఆ బూత్ల పరిధిలోని ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారిపై ద్వేషం పెంచుకోవడానికి బదులు మంచి చేస్తూ వారి ఆశీర్వాదం పొందాలంటూ ఎంపీలకు మోదీ పలు కిటుకులు చెప్పారు. కాగా, మోదీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు కచ్చితంగా చేరేలా చేసేందుకు ఎంపీలను ఉపయోగించుకోవాలని మంత్రులకు బీజేపీ సూచించింది. ఎంపీలతో ప్రతి నెలా మంత్రులు సమావేశమై పథకాల గురించి వారికి చెబుతుండాలనీ, ఈ భేటీలకు అన్ని పార్టీల ఎంపీలనూ ఆహ్వానించాలని తెలిపింది. -
2022 యూపీ ఎన్నికలపై ప్రియాంక గురి!
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తర ప్రదేశ్లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై పట్టుసాధించాలనే దిశగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలతో వారంలో కనీసం రెండు సార్లు సమావేశమవ్వాలని ఆమె యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించినప్పుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం కొరవడిందనేది స్పష్టమైంది. దీంతో ప్రియాంక గాంధీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలని నిశ్చయించుకున్నారు’ అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. గత బుధవారం ప్రియాంక.. ఆమె తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో కలిసి రాయ్బరేలీ నియోజకవర్గాన్ని సందర్శించారు. -
మేడ
‘‘హలో...’’ టార్చ్ లైట్ వెలుగు సహాయంతో ముందు గదిలోకి వచ్చిన ధీరజ్ ఆ ఇంట్లో వారిని ఉద్దేశించి పిలిచాడు. జవాబుగా అవతల నుంచి ఏ పలుకూ లేదు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్లి.. ‘‘ఎవరండీ ఇంట్లో?’’ అడిగాడు. కిటికీ రెక్కలు రెండూ ధడేల్ ధడేల్ మంటూ కొట్టుకున్న చప్పుడు. వినిపించిన వైపు టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూశాడు. గడియ పడి ఉన్నాయి. ఇందాకే కదా.. అంత గట్టిగా కొట్టుకున్నాయి.. ఆ క్షణంలోనే ఎలా గడియ పడ్డాయి? విస్మయపోతూనే తెరవడానికి ప్రయత్నించాడు. కొన్నేళ్ల నుంచీ తుప్పు పట్టినట్టున్నాయి ఆ బోల్ట్స్. ఎంత తెరిచినా రావట్లేదు. ఇంకాస్త గట్టిగా లాగితే కిటికీలే ఊడొచ్చేంత పాతగా ఉన్నాయ్. బహుశా ఆ పెద్ద చప్పుడు తన భ్రమేమో అనుకుని ఇంకాస్త ముందుకు వెళ్లాడు టార్చ్ వెలుగులోనే. ఈ సారి ఓ మూల నుంచి కిర్రుమంటూ శబ్దం వినిపించింది . అటు వైపు మళ్లాడు. యుగాల నాటి పెద్ద గుమ్మాన్ని తలపించే ద్వారం. తలుపు ఓరగా తెరిచి ఉంది. దాని దరికి రాగానే ఒక్కసారిగా గబ్బిలాల కంపు.. లోపల్నించి గబ్బిలాల రెక్కల చప్పుడు.. ఎలుకల కిచకిచలు. ఆ గదిలోకి వెళ్దామనుకొనీ వెళ్లక వెనకడుగు వేశాడు. ఆ వాసనకు, శబ్దాలకు చీదర కలిగి. టార్చ్ను ఆ ఫోకస్ నుంచి తిప్పబోతూ ఆగిపోయాడు. ఆ గదిలో వెలుతురు పడ్డ మేర చాలా శుభ్రంగా.. మార్బుల్ ఫ్లోర్ మెరుస్తూ కనిపించింది. రెండడుగులు లోపలికి వేసి.. గదంతా టార్చ్ లైట్ తిప్పాడు. నీట్గా.. సాంబ్రాణి వాసనతో ఆహ్లాదంగా ఉంది. షాక్ అయ్యాడు ధీరజ్. గదిలోంచి వెనక్కి వచ్చాడు. మళ్లీ గబ్బిలాల కంపు.. ఎలుకలు.. కిచకిచలు..ఇంకోసారి పరీక్షిద్దామని లోపలికి వెళ్లబోతుంటే పైన గదిలోంచి శబ్దం... తూగుటుయ్యాల ఊగుతున్నట్టు.. కూయి.... కూయి.. అంటూ!మేడ పైకి ఎక్కేందుకు మెట్ల కోసం చూశాడు.. ఎక్కడా కనపడలేదు. గబగబా ఆ ఇంటి వెనక్కి వెళ్లాడు చీకట్లో అదే టార్చ్ లైట్ సహాయంతో. అక్కడా మెట్లు కనపడలేదు. కుడి వైపు.. ఎడమ వైపు.. ముందు వైపు.. అలా ఇంటికి నాలుగు దిక్కులా వెదికాడు.. ఎక్కడ మెట్ల ఆనవాలు లేదు. మరి మేడ మీద గది ఉన్నట్టు.. ఉయ్యాల ఊగుతున్నట్టూ చప్పుడేంటి... తన భ్రాంతా? అని సణుక్కుంటూ మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఇల్లంతా టార్చ్ తిప్పాడు. గోడలన్నీ మంటల్లో పొగచూరినట్టుగా నల్లగా ఉన్నాయి. ఒక్కసారిగా హాహాకారాలు.. అరుపులు.. కేకలు.. బిందెల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్న సౌండ్.. గాజుల గలగలలు.. గాబరాగా నడుస్తుంటే వచ్చే పాదాల పట్టీల చప్పుడు.. దిమ్మ తిరిగింది ధీరజ్కి.. మొహమంతా ముచ్చెమటలు... ఆ శబ్దం అంతకంతకూ ఎక్కువవుతూ.. అదంతా తన చుట్టే జరుగుతున్నట్టనిపించి ఒక్కసారిగా ఆ ఇంటి బయటకు పరిగెత్తాడు. వాకిట్లోకి రాగానే .. చెవుల్లోంచి ఎవరో ఆ గోలను తీసి అవతల పారేసినట్టు ప్రశాంతంగా అనిపించింది ధీరజ్కు. ఇందాకటి అలజడీ లేదు. వెనక్కి తిరిగి చూసే సాహసం చేయకుండా గేట్ తోసుకుంటూ రోడ్డు మీదకు వచ్చిపడ్డాడు.భయం భయంగానే ఆ ఇంటి వైపు చూశాడు. లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది కొత్త ఇల్లులా! చుట్టూ మొక్కలు.. చెట్లతో ముస్తాబై ఉంది.. ఎప్పటిలా! ధీరజ్కు ముప్పై ఏళ్లుంటాయి. ఇంకా పెళ్లి కాలేదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ వీధిలోకి కొత్తగా చేరాడు. ఆ కాలనీకి వచ్చినప్పుడే ఆ మేడ మీద ధీరజ్ కన్ను పడింది. అందంగా కంటే కూడా దృష్టిని ఆకర్షించే ప్రత్యేకతేదో ఉంది ఈ మేడ మీద అని అనుకునేవాడు దాన్ని చూసినప్పుడల్లా. రోజూ షూటింగ్స్ ముగించుకొని ఇంటికొచ్చే సరికి అర్ధరాత్రి అవుతుంది. వీధి మొదట్లోనే క్యాబ్ దిగి...వీధి చివర ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ మేడ ముందుకు రాగానే దాన్నే తిరిగి తిరిగి చూస్తూ ముందుకు సాగడం అతనికి ఇష్టం. రాత్రి పన్నెండు దాటినా ఆ ఇల్లంతా లైట్లతో వెలుగుతూంటుంది. అంత రాత్రీ మనుషుల అలికిడి ఉన్నట్టే కనిపిస్తుంది. తన ఇంటికి రెండిళ్ల ముందు ఉంటుంది ఈ మేడ. తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని అడిగాడు.. ‘‘ఆ ఇల్లు ఎవరిది?’’ అని. ఏమీ అర్థం కానట్టు ‘‘ఏ ఇల్లు సార్?’’ అంది ఆమె. ‘‘అదే ఆ మూడో ఇల్లు?’’ చేతితో ఆ డైరెక్షన్ను చూపిస్తూ మరీ అడిగాడు. ‘‘మూడో ఇల్లా?’’ అంటూ ముక్కున వేలేసుకొని అతను చూపించిన వైపు చూసింది ఆమె.నటిస్తోందా? నిజంగానే తెలియదా? సందేహిసూ ్త ఇక ఆ ఇంటి గురించి రెట్టించలేదు.!ఆ ఉదయం.. తను పాల పాకెట్ తీసుకొని వస్తూంటే కనిపించింది పనమ్మాయి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్తూ. మరి ఆ రోజు ఎందుకలా నటించింది? తను ఆ ఇంటి గురించి అడిగితే అసలు అక్కడ ఇల్లే లేనట్టు?.. అనే అనుమానం అతని మెదడులో లిప్తపాటు కదిలి మాయమైపోయింది. ఇప్పుడు.. రాత్రి.. షూటింగ్ నుంచి వస్తూ వస్తూ.. ‘‘ఎలాగైనా లోపలికి వెళ్లి.. ఆ ఇల్లు ఎలా ఉంటుందో? అంత రాత్రి పూటా లైట్లన్నిటినీ ఎందుకు వెలిగిస్తారో? అందులో ఎంత పెద్ద కుటుంబం ఉంటోందో? లాంటి జిజ్ఞాస ధీరజ్ను లోపలికి లాక్కెళ్లింది. ఆ ఇల్లు లోపల కూడా అంతే అందంగా ఉంటే బాగుంటే షూటింగ్కి ఇస్తారేమో కనుక్కోవాలి అనీ నిశ్చయించుకున్నాడు. తీరా లోపలికెళ్లాక చూస్తే.. భూత్ బంగ్లాలా బెదరగొట్టింది.. ఇంటికెలా వచ్చాడో తెలియదు. రాగానే ఫ్రిజ్ తెరిచి గటగటా మంచి నీళ్లు తాగాడు. మార్గశిర మంచులో కూడా గ్రీష్మ తాపం.. చెమటతో ఒళ్లంతా తడిసి ముద్దయిపోయింది. అలాగే సోఫాలో కూలబడ్డాడు.. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడు.. చీకటి.. ఆ చీకట్లో ఓ మేడ.. ఇంట్లో హాహాకారాలు.. గాజుల గలగలలు.. మువ్వల సవ్వడి.. తూగుటుయ్యాల ఊగుతూ.. కిటికీ రెక్కలు కొట్టుకుంటూ.. తలుపు కిర్రున తెరుచుకుంటూ.. ముక్కు పుటాలు అదిరే గబ్బిలాల కంపు.. ఎలుకల కదలికలు.. సాంబ్రాణి వాసన..ఒక్కసారిగా తల విదిలించి.. కళ్లు తెరిచాడు.. ఎదురుగా.. పనమ్మాయి.. నవ్వుతోంది.. తెరలు తెరలుగా! ‘‘అక్కడ ఇల్లు కనిపించిందా నీకు? అంటే నువ్వు నా వాడివే అన్నమాట. ఆ రోజు కట్నం చాల్లేదని పెళ్లి పీటల మీద నుంచి నువ్వు వెళ్లిపోయేసరికి .. అవమానంతో ఒంటికి నిప్పంటించుకున్నా. ఒంటిని కాలుస్తున్న ఆ మంటలను తట్టుకోలేక ఇల్లంతా పరిగెత్తా .. ప్చ్.. నాతో పాటు మా వాళ్లూ కాలి బూడిదైపోయారు తెలుసా?’’ అంటూ బాధగా గోడకు ఒరిగింది ఆమె...‘‘ఎప్పటికైనా నువ్వొస్తావని తెలుసు. అందుకే ఆ ఇల్లు వదిలిపెట్టలేదెవ్వరం! ఇన్నేళ్లకు వెదుక్కుంటూ వచ్చావ్. రా.. మనింటికి పోదాం...’’ అంటూ ధీరజ్ చేయి పట్టుకుంది. చేతి నిండా గాజులు.. పరీక్షగా చూశాడు ఆమెను.. పెళ్లి కూతురు అలంకరణలో ఉంది.‘‘హేయ్ .. ఎవరు నువ్వు? నా చేయి వదులు..’’ అంటూ చేయి విదిలిస్తున్నాడు. గొంతు పెగలట్లేదు.. చేయి కదలట్లేదు.. అరుస్తున్నాడు.. విదిలిస్తున్నాడు.. పట్టు బిగిస్తూ నవ్వుతోంది ఆమె.. గట్టిగా.. క్రూరంగా! సరస్వతి రమ -
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహాలు
సాక్షి, వనపర్తి: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మరో 48 గంటలు సమయం ఉండగానే జిల్లాలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, తమ కేడర్తో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని వేర్వేరు గ్రామాల్లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రధాన నాయకులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండలంలోని విరాయపల్లిలో నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటివరకు నాగర్కర్నూల్ పార్లమెంట్ లోస్సభ స్థానాన్ని కైవసం చేసుకోలేదు. ఈ స్థానం ఏర్పడిన 1962 నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేనంత మెజార్టీతో ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని, కేసీఆర్కు, కేటీఆర్కు బహుమతి ఇవ్వాలనే ఆలోచనతో మంత్రి నిరంజన్రెడ్డి ఉన్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గం ఎన్నికల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గెలుపు దిశగా పార్టీ శ్రేణులకు సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇటీవల భారీ మెజార్టీతో శాసన సభ్యుడిగా సాధించిన విజయం కంటే.. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకోవాలనే కసితో మంత్రి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో నాయకుల మధ్య మనస్పర్థలపై దృష్టి సారించారని, సర్ధిచెప్పినట్లు తెలుస్తోంది. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి, టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని సూచించారు. దీంతో అధికార పార్టీలో నాయకులు, కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల నుంచి కొంతకాలంగా దశలవారీగా.. ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరటంతో అధికార పార్టీకి పెద్దమందడి మండలంతో పాటు నియోజకవర్గంలో మరింత బలం పెరిగినట్లు తెలుస్తోంది. ఎలాగైనా నిలబెట్టుకుందాం.. ఇదిలా ఉండగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క స్థానం కొల్లాపూర్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఉన్న కాసింత పట్టుతోనే విజయం కేతనం ఎగుర వేసేందుకు కుస్తీ పట్టాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎన్నికల యుద్ధానికి నాయకులను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశంలో సూచనలు చేశారని తెలుస్తోంది. నేడు జిల్లా కేంద్రంలో మంత్రి సమావేశం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులను, కార్యకర్తలను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదివారం తన నివాసంలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి మండలాలతో పాటు వనపర్తి పట్టణ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. -
పోలింగ్ కేంద్రాలపై నజర్
సాక్షి, జనగామ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సజావుగా ఎన్నికలు నిర్వహించడం కోసం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాలపై నిఘాను ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల్లో ప్రశాంతమైన పోలింగ్ నిర్వహణ కోసం అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. జిల్లా పరిధిలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపడానికి పోలీస్శాఖ తమ చర్యలను మొదలు పెట్టింది. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 857 పోలింగ్ కేంద్రాలున్నాయి. గతంలో జరిగిన అల్లర్లు, గొడవలు, ఘర్షణల కారణంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 857 పోలింగ్ కేంద్రాల్లో 102 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి పరిశీలన తరువాత సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను విభజన చేయనున్నారు. బైండోవర్లకు రంగం సిద్ధం.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు బైండోవర్లు చేపట్టాడానికి రంగం సిద్ధంచేశారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు, రౌడీలు, మాజీలు, దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తులను బైండోవర్ చేయనున్నారు. 2018 శాసన సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4,938 మందిని బైండోవర్ చేశారు. జనవరి నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో 200 మందిని బైండోవర్ చేశారు. రెవెన్యూ శాఖను సమన్వయం చేసుకుంటూ బైండోవర్లను మరోమారు చేపట్టనున్నారు. నగదు, మద్యం రవాణాకు అడ్డుకట్ట.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరోధించడానికి నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు చెక్ పోస్టుల చొప్పున జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి, సిద్దిపేట–సూర్యాపేట రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొట్లాది రూపాయల నగదు పట్టుబడింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో అదేస్థాయిలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతోపాటు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. గ్రామాల్లో మద్యం నిల్వలు లేకుండా చూడడంపై దృష్టి సారించారు. మద్యం షాపుల నుంచి గ్రామాలకు తరలిపోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. రూ.33 లక్షలు పట్టివేత పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని పోలీసుల తనిఖీలో భాగంగా జనగామ పట్టణంలోని ఆర్ అండ్బీ అతిథి గృహం ఆవరణలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి కారులో తీసుకు వెళుతున్న రూ.33.03 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేశం తెలిపారు. ఆంజనేయులు కారులో నగదు తీసుకు వెళుతున్నాడనే సమాచారం పోలీసులకు వచ్చిందన్నారు. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పిస్తే.. ఎన్నికల అధికారులు విడుదల చేస్తారన్నారు. డబ్బులను ఫ్లయింగ్ స్కాడ్ కు అప్పగించినట్లు తెలిపారు. నిఘా పెంచుతున్నాం.. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా నిఘాను పెంచుతున్నాం. శాసనసభ, గ్రామ పంచా యతీ ఎన్నికలను శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు లేకుండా నిర్వహించగలిగాం. సమస్యాత్మక కేంద్రాల్లోనూ అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదు. జనగామ అసెంబ్లీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. గతంలో జరిగిన ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాసరెడ్డి, డీసీపీ జనగామ -
బ్రహ్మజ్ఞానమంటే...
ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేద బుద్ధి ఉంటుందా? ఎక్కడి నుండో ఓ సేటు (వ్యాపారి) బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటూ రావడం, సాయిని తొందరచేస్తూ.. వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు– అంటూ కంగారు పెట్టడం... ఈ కథనంతా విన్నాం కదా! ఆ సేటు వెళ్లిపోయాక ‘కాకా.. శ్యామా.. ఇంకా మరి కొందరు మసీదులోకి వచ్చాక సాయి ఆ అందరూ అడిగిన మీదట బ్రహ్మజ్ఞానమంటే ఏమిటో చెప్పడం ప్రారంభించాడు. ఈ కళ్లు ‘కళ్లు’ కావు! ఎంతో లోతుగా ఉన్న బావి (నుయ్యి) నుండి నీటిని బిందెతో లేదా చేదతో పైకి తెచ్చుకోవాలంటే బిందె బరువూ నీళ్ల బరువూ అనే రెండింటినీ పైకి లాగడం అనే కారణంగా మరింత బరువు జత అవుతుంది కదా! ఆ కారణంగా మామూలుగా మనం అలాంటి బిందె– చేదలని నేల మీద ఉన్నప్పుడు మోసెయ్యగలిగినా కూడా, నూతి నుండి తెచ్చుకోవాలంటే అది మూడు రెట్ల బరువుతో సమానమైన పనిగా అనిపిస్తుంది.ఇదంతా ఎందుకంటే ఏదో సామాన్యమైన విషయాన్ని తెలుసుకుంటూంటే అక్కడక్కడ కొంత విన్నా వినకున్నా కూడా మనకి అర్థం అయిపోతుంది– అయిపోవచ్చునేమో కానీ, అదే మరి గట్టిదీ ఎంతో అర్థమున్నదీ అయిన బ్రహ్మజ్ఞానం లాంటి విశేషాలని తెలుసుకోదలిస్తే ప్రతి అక్షరాన్నీ శ్రద్ధగా వింటూ ఉండవలసిందే. మీరందరూ అలాంటి శ్రద్ధ, విశ్వాసం కలవాళ్లు కాబట్టి కొద్దిగా తెలియజేస్తాను.ఉదాహరణకి మనందరికీ కళ్లున్నాయి కదా! ఆ కళ్లతో ఏం చేస్తాం.? ఎదుటి వ్యక్తినీ, వస్తువులనీ పదార్థాలనీ పశుపక్షి మృగ జంతువులనీ... ఇలా అన్నింటినీ చూస్తాం. అయితే ఓ వ్యక్తినో ఓ వస్తువునో... ఇలా పై వాటిని చూస్తే భౌతికరూపం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తున్నాడు? లావున్నాడు? సన్నగా ఉన్నాడు... వంటి విశేషాలే తెలుస్తాయి. అంతేతప్ప ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాడు? ఎంత హోదాలో ఉన్నవాడు?.. వంటివేమీ ఎవరో అతడ్ని గురించి చెప్తే గానీ తెలియవు కదా! అలా అతని గొప్పదనాన్ని గురించి మనకి తెలియనంత వరకూ అతడు ఓ సామాన్యుడనేదే కదా మన అభిప్రాయం. అయితే అది నిజమా? కాదుగా! ఈ నేపథ్యంతో మన కళ్లని మనం నిజమని నమ్మకూడదు. ఇలా చెప్తూంటే ఇది ఏదోలా అనిపించవచ్చు మనకి. అయినా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది.ఉదాహరణకి ఓ బంగారపు చంద్రహారం, ఉంగరం, వడ్డాణం... ఇలా ఎన్నో బంగారు ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఆ ఆభరణాలని కరిగిస్తేనో... అన్నీ బంగారపు ముద్దలై కూచుంటాయి. అది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.అదే తీరుగా మరో ఉదాహరణని చూద్దాం. సముద్రంలో కెరటాలు, బుడగలు, నురగలు, సుడిగుండాలు.. ఇలా కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ కెరటాలూ, బుడగలూ.. అన్నీ ఆగిపోతే కనిపించేవి నీళ్లే. నీళ్లే ఇలా మరో మరో తీరు రూపాన్ని ధరించి కెరటాలూ, బుడగలూ, నురగలూ ఇలా అవుతాయి. ఇది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.మరొక్క ఉదాహరణని కూడా చూసి విషయాన్ని తెలుసుకుందాం. కుండ, పిడత, మూకుడు... ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ అన్నింటినీ పగలగొడితే కనిపించేది మట్టి మాత్రమే కదా!అంటే ఏమన్నమాట? ఒక మూల పదార్థం అదే బంగారం, నీరు, మట్టీ... అనే ఇలాంటివన్నీ చంద్రహారం వడ్డాణం– కెరటాలు, నురగలు – కుండా పిడతా వంటివిగా మారుతున్నాయి. ఒక రూపాన్ని పొందినప్పుడు ఇదే తీరుగా బ్రహ్మపదార్థాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకుందాం. చెట్టూ పుట్టా పర్వతం, సముద్రం 84 లక్షల జీవరాసులూ... ఇలా కనిపిస్తున్నాయి కదా ప్రపంచంలో. ఇలా కనిపించడం భౌతికదృష్టి. ఈ ప్రపంచాన్ని అలా ఒకటిగా కలిపి ముద్ద చేసేస్తే (అది ప్రళయకాలంలో జరుగుతుంది) అది బ్రహ్మపదార్థం (బంగారం నీరూ మట్టీ లాగా అన్నమాట). అంటే ఏది మూల పదార్థమో అది బ్రహ్మపదార్థం. ఏది వికృత పదార్థమో అది మనకి భౌతికదృష్టికి కనిపించే పదార్థమన్నమాట. ఈ దృష్టి మనకి గాఢంగా కలిగినప్పుడు చెట్టూ పుట్టా మనిషీ జంతువూ అనే భేదభావం ఏర్పడదు. చంద్రహారం కంటే వడ్డాణం వేరు కాదు– దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది బంగారమే కాబట్టి. అయితే పేరు, రూపం మాత్రమే వేరు. అలాగే కెరటమూ నురుగూ కూడా వేరు కాదు. దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది నీరే కాబట్టి.ఈ దృష్టిని మన కళ్లకి బాగా పట్టించినట్లయితే కుక్క, పాము, పక్షి, చేప, మనిషి... ఇలా కనిపించే అన్నింటిలోనూ కూడా పైకి కనిపించే(పేరూ రూపమూ ఆకృతీ...) రూపాన్ని తొలగించి చూస్తే అంతా బ్రహ్మపదార్థమే అని అర్థమవుతుంది. ఇది నిజం కాబట్టే మనకంటూ తెచ్చుకున్న ఆహారపదార్థాలని కుక్కలు, పిల్లులు, ఎలుకలు... ఇలా ఏవి తింటున్నా... మూల పదార్థ దృష్టితో చూస్తే అవన్నీ కూడా బ్రహ్మపదార్థం నుండి వచ్చినవే కాబట్టి– ఏ విధంగానూ మనకంటే వేరు కావు. రూపాన్ని బట్టి పేరుని బట్టీ వేరువేరు పేర్లతో పిలువబడుతున్నాయి తప్ప అన్నీ ఒకటే నిజానికి. ఒకే భూమి నుండి పూల చెట్లూ, పళ్ల చెట్లూ, తీగల పాదూ... పుడుతున్నాయో అదే తీరుగా బ్రహ్మపదార్థం ఒకటే అయినా దాని నుండి వచ్చే రూపాలని బట్టి పేర్లు మారుతుంటాయనేది సత్యం.నాలో ఉన్న బ్రహ్మపదార్థమే మీలోనూ ఉంది. అయితే పేర్లు మారడం కారణంగా ఇతను శ్యామా, అతను కాకా, మరొకతను గోల్కరే... అని ఇలా అందరి చేతా పిలిపించుకో బడుతున్నారు. నిజానికి ఈ అందరూ ఒకే బ్రహ్మపదార్థానికి సంబంధించిన వాళ్లే. ఈ దృష్టే గనుక మనకి గాఢంగా కలిగితే మరొకనికి కష్టాన్ని కలిగిద్దామనీ, మరొకనికి హానిని తలపెడదామనీ, ఏ ఒకరిద్దరికి మాత్రమే సహాయపడుదామనీ... ఆ తీరు ఆలోచన రాదు.’ వసుధైక కుటుంబక’ మనే మాట ఒకటుంది. వసుధ అంటే భూమి అని అర్థం. ‘ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబానికి చెందినదే సుమా!’ అని దానర్థం. ఈ దృష్టికి రాగలిగినప్పుడు ఎవరికైనా ద్రోహాన్ని తలపెడితే మనకి మనమే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్నామని అర్థమవుతుంది. దాంతో ద్రోహాన్ని తలపెట్టనేలేరు. అప్పుడు సర్వసమానభావం (ఎవరికి ద్రోహాన్ని తలపెట్టినా తనకి తానే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్న భావం) అలవడుతుంది. ఇదంతా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే ఒక తీరు విధానం. కాబట్టి మన కళ్లు ‘కళ్లు’ కావు. దృష్టి మారిన కళ్లు కావాలన్నమాట. ఇది ఒక తీరు. ఇక మరో తీరులో కూడా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే వీలుంది. ఇదేం శ్లోకం? మనందరికీ ప్రసిద్ధంగా తెలిసిన ఓ శ్లోకముంది.‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అనేది.సృష్టించేవాడు బ్రహ్మ. ఆయన పురుషుడే. రక్షించేవాడు విష్ణువు. ఆయనా పురుషుడే. లయింపజేసేవాడు శివుడు. ఆయనా పురుషుడే. పుట్టుక, రక్షణ, మరణం అనే మూడు క్రియలూ అయిపోతే ఇక మిగిలిందేమిటి? ఏం చేయవలసి ఉంది? లేదు కదా! మరి శ్లోకం అక్కడితో ముగిసిపోకుండా ‘సాక్షాత్పరబ్రహ్మ’ అనే ఒక మాట ద్వారా ఆ పరబ్రహ్మని గురువుగా చెప్పడమేమిటి? ఈ పరబ్రహ్మ పురుషుడా? స్త్రీ నా? లేక నపుంసకధర్మంతో ఉన్నవాడా? అని ఈ తీరుగా ఆలోచిస్తే తెలుస్తుంది బ్రహ్మపదార్థమేమిటో!?కొంత విసుగ్గా అర్థమయ్యీ కానట్టుగా అనిపించినా కొద్ది ఓపిక పడితే తెలుస్తుంది. తెలిశాక మన ఆలోచనా విధానమే మారుతుంది.పైన ఆకాశముంది. ఉందా? అంటే లేదు. ఎందుకని? కనిపిస్తూ.. ఉన్నట్లుగా ఉంటూ.. ఎప్పటికీ కనిపించకుండా ఉండేదే ఆకాశం కాబట్టి. ఆ మాటకొస్తే ఆకాశమనే మాటకి అర్థమే ‘శూన్యం’ అని. ఆ ఆకాశాన్ని పట్టుకుని వేలాడుతూ పగటివేళ సూర్యుడూ రాత్రివేళ చంద్రుడూ మనకి కనిపిస్తున్నారా? ఈ ఇద్దరూ కూడా ఏ మాత్రపు క్షణమాలస్యం కూడా చేయకుండా – ఎంతటి చలికాలమైనా, ఎండ కాలమైనా, వర్షకాలమైనా– వచ్చి కనిపిస్తూ ఉంటారా? వీళ్లు కాక ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు.. ఇలా ఎన్నో ఆ ఆకాశాన్ని పట్టుకుని అతుక్కుని కనిపిస్తూ ఉంటే ఆకాశాన్ని శూన్యపదార్థమని ఎలా అనగలం?కాబట్టి కనిపించని దాంట్లో కనిపించేదేదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని చూడగలగడం బ్రహ్మజ్ఞానం. పైగా నవగ్రహాలుంటాయక్కడే. పోనీ అవన్నీ ఓ వరుసలో నడుస్తున్న వ్యక్తుల్లా పక్క పక్కన లేక కొన్ని సమానమైన వరసల్లోనో నడుస్తారా? అంటే కానే కాదు. వాళ్లకి వాళ్లు నడవరు. నడిచేలా చేయబడతారు. అంటే వాళ్ల ప్రయత్నం ఏమీ లేకుండా వాహనం కదులుతుంటే దాంట్లో ఉన్న మనం ఏ మాత్రమూ కదలకుండా ఉంటామో, అయినా కదులుతూ వెళ్తున్నామో అలా నడిపింపబడుతూ ఉంటాయి. పోనీ ఒకే వరుసలో ఒకే పద్ధతిలో ఉంటాయా? అంటే కానేకాదు. కొందరు తూర్పుని చూస్తుంటే (శుక్రుడూ రవీ) మరి కొందరు పశ్చిమాన్ని చూస్తుంటే (శనిచంద్రులు) ఇంకొందరు ఉత్తరాన్ని చూస్తుంటే (బుధగురులు) మిగిలిన వాళ్లు దక్షిణముఖంగా ఉంటారా? వీళ్లలో కొందరు ఒక వేగంతో మరి కొందరు మరి కొంత వేగంతో ఇంకొందరు మరీ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారా? వీళ్లలో కొందరు సూర్యునికి ప్రదక్షిణాకారంతో కొందరు అప్రదక్షిణాకారంతో తిరుగుతారా? ఇలా తిరుగుతున్నా కూడా ఏనాడూ ఒకరినొకరు గుద్దుకోనే గుద్దుకోరా? ఈ నిర్మాణం ఎవరిది? ఈ నిర్వహణ ఎవరిది? వీళ్లే కనిపించని వాళ్లవుతుంటే వీళ్లని నిర్వహించే ఆయనెక్కడ కనిపిస్తాడు? ఈ తీరుగా ఆలోచిస్తూ పోతే ఓ అదృశ్య శక్తి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. అదే బ్రహ్మం. దీన్నే అదృశ్యుడుగా ఉన్న దైవంగా భావిస్తారు లౌకిక దృష్టితో జనమంతా. ఈ నిర్మాణాన్నీ వ్యవస్థనీ నిర్వహణా విధానాన్నీ ఏ మాత్రమూ గమనించకుండా ఆ శక్తికి ఓ పేరు పెట్టుకుని ఈయన చదువునీ ఆమె డబ్బునీ ఫలాని ఆయన ఆరోగ్యాన్నీ... ఇలా ఇస్తుంటారని పూజల్నీ పురస్కారాల్నీ, మళ్లీ వాటిని కూడా అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తూ పోతూ ఉండటమా? హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం కానే కాదు నా లక్ష్యం. సరిగా ఆ ధర్మాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారా? అనేదే నా ఆందోళన.అందుకే పైన అనుకున్న శ్లోకం ఓ మాటని చెప్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎంతో గొప్పగా అనుకుంటున్నా వాళ్లని కూడా నడిపించే బ్రహ్మపదార్థ మొకటుందని గమనించవలసి ఉందనీ, ఆయన్నే గురువుగా భావిస్తూ నమస్కరిస్తూ ఉండవలసిందనీను.ఆ పరబ్రహ్మనే కొందరు రాముడు, కృష్ణుడూ అంటుంటే మరికొందరు అల్లా అంటూంటారు. రాముడూ కృష్ణుడూ ఓ ప్రత్యేకమైన నిర్మాణ విధానంలో ఉన్న ఆలయాల్లో ఉంటూ ఉంటే, అల్లాహ్ మరో ప్రత్యేకమైన నిర్మాణవిధానంలో ఉన్న మసీదుల్లో ఉంటాడు. విధానం ఒక్కటే. రూపాలు వేరు. నివాసాలు వేరు. ఈ ప్రాంతం వాళ్లు జొన్నల్ని తింటే ఆ ప్రాంతం వాళ్లు గోధుమల్ని తింటే ఇంకో ప్రాంతం వాళ్లు వరి అన్నాన్ని తింటే ఆ తినబడే దాన్ని కొందరు అన్నమన్నారు. కొందరు రొట్టెలన్నారు. ఇంకొందరు మరో పేరుతో పిలిచారు. ఏమైనా ఈ భిన్నభిన్నతీరులున్నవన్నీ ఆకలిని పోగొట్టేందుకే కదా! ఈ దృష్టిగాని మనకి కలిగితే అప్పుడు ఈ విధానమంతా బ్రహ్మమే అనే ఆలోచనకి రాగలం. అందుకే ‘అల్లాహో మాలిక్’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండే నాకు ‘రాజారామ్ రాజారామ్’ అనే మంత్రం వేరుగా అనిపించదు. ఖాపర్దే భార్యకి ఇదే మంత్రాన్నిచ్చాను కూడా. హేమాడ్ పంత్ పుట్టుకకి బ్రాహ్మణుడయ్యుండీ సాయబునీ ఫకీరునీ అయిన నన్ను హిందూ దేవాలయ అర్చకుడయ్యుండీ ‘యా సాయీ!’ అని మరాఠీ భాషలో నన్నాహ్వానించినపుడు అందుకే ఆనందపడ్డాను– ‘ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టే సర్వదేవతలనీ ఒకే తీరుగా లెక్కించే గొప్పగుణం కలిగి కనిపిస్తున్నాడని.ఈ బ్రహ్మజ్ఞానమే మనకి కలిగిన రోజున మతద్వేషాలు దైవనిందలు దండయాత్రలు దేవాలయధ్వంసాలు మసీదుల్ని కూలగొట్టడాలు వంటివి ఉండనే ఉండవు. ఖురాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో సొంత బిడ్డలా చేతితో పట్టుకుంటామో అదే తీరుగా భగవద్గీతని కూడా చేతిలోకి తీసుకోగలుగుతాం.అంత దాకా ఎందుకు? నేను మొదటిసారి పెళ్లి వాళ్ల గుంపుతో షిర్డీకి వచ్చినప్పుడు ఈయనకి విడిది ఎక్కడియ్యాలా? అని అందరూ సంశయపడుతూ ఉంటేనూ, ఖండోబా దేవాలయ అర్చకుడు హేమాడ్పంత్ ‘పోనీ! ఈ ఆలయంలో ఓ గదిని కేటాయిద్దామా?’ అని ఆలోచిస్తూ ఉంటేనూ అందరూ కూడా ‘అతను సాయబు’ కాబట్టి పొరపాటున కూడా ఇక్కడికి రానియ్యద్దన్నారు. నేనూ అక్కడ ఉండదలచలేదు వారు ఉండవలసిందంటూ ఒకవేళ కోరినా. ఇది హిందువుల అజ్ఞాన దృష్టి అని నేననను.‘నువ్వు హిందూ దేవతలని కూడా కొలుస్తూ దేవతలని గురించి ప్రశంసిస్తూ దేవాలయాలకి వెళ్తూ ఆ మతం వాళ్లకి భోజనాలని పెడుతూ వాళ్లతో కలిసి మమేకంగా తిరుగుతూ కనిపిస్తున్నావు కాబట్టి మసీదు మెట్లని ఎక్కనియ్యం’ అంటూ మా వాళ్లు కూడా నన్ను రానీయలేదు. దాన్ని కూడా వారి అజ్ఞానమని నేననను. ఇంట్లో పిల్లవాడు తెలిసి తెలియని వయసులో కేవలం ఆటలమీదే దృష్టి ఉన్న దశలో బడికి వెళ్లనే వెళ్లనంటూ మారాం చేయడమే కాక ఏడుస్తూ చేతికి దొరికిన ప్రతి వస్తువునీ దూరంగా గిరవాటువేస్తున్న వేళ తల్లి మాత్రమే వాడికి పక్కవాళ్ల పిల్లల్నీ చదువుకున్న గొప్పవాళ్లనీ.... ఇలా చూపించి అర్థమయ్యేలా చెప్పి వాడంతట వాడే బడికి వెళ్లేలా చేస్తోంది. అదుగో అలాంటి బాల్యదశలో ఉన్నవాళ్లే ఈ భేదభావంతోనూ బ్రహ్మజ్ఞాన దృష్టి లేకుండానూ ఉంటారు– కనిపిస్తున్నారు కూడా. అది వాళ్ల తప్పు కాదు. వాళ్లకి సదవగాహన కలిగేలా చెప్పకపోవటం మన తప్పు మాత్రమే. అందుకే నా ఈ ప్రయత్నాలన్నీ. మసీదులో తులసి మొక్కా, హోమగుండానికి సంకేతరూపంగా ధునీ, భజనలకి ప్రతిరూపంగా నామజపం, భేదభావాలు రాకుండా వ్యాపించకుండా ఉండేందుకోసం– సాయబులకి ప్రీతి పాత్రమైన చందనోత్సవంతో హిందువులకిష్టమైన దైవకల్యాణాలూ– శ్రీరామనవమి ఉత్సవం రోజునే ఉరుసు ఉత్సవం... వంటివన్నీ జరుపుతున్నాం మసీదులో. ఇలా క్రమక్రమంగా మనం బుద్ధిలో అవగాహన పెంచుకోగలిగితే ఇక భేదభావం ఎక్కడుంటుంది?ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేదబుద్ధి ఉంటుందా? ఉండగలుగుతుందా? ఆ ఏకత్వ దృష్టిని సాధించడమే బ్రహ్మజ్ఞానమంటారు. (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
సేవల విస్తృతిపై అపోలో ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆసుపత్రుల విస్తరణ కంటే సేవల విస్తృతిపైనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్ చేస్తామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న ఆమె ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆసుపత్రుల పరంగా దేశంలో మేమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. అవసరమైన చోట హాస్పిటల్, ఫార్మసీల ఏర్పాటు ప్రక్రియ సహజంగా జరుగుతుంది. దానికంటే ముఖ్యంగా ఇప్పుడున్న మొత్తం ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవటంపై దృష్టి సారిస్తాం. హెల్త్ చెకప్స్ను ప్రమోట్ చేయడం, జన్యు ఔషధాలు, రోగుల ఇంటెస్టిన్ (ప్రేగు) అధ్యయనం ప్రధానాంశాలుగా చేసుకున్నాం. ఒక అడుగు ముందుకేసి వైద్య సేవల రంగాన్ని నిర్వచిస్తాం. చెన్నైలో అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ను 150 పడకల సామర్థ్యంతో నెలకొల్పాం. దక్షిణాసియాలో ఇది తొలి ప్రోటాన్ థెరపీ సెంటర్. క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక పెన్సిల్ బీమ్ టెక్నాలజీని వాడుతున్నాం. లక్నోలో 250 పడకలతో ఏర్పాటవుతున్న ఆసుపత్రి రెండు నెలల్లో ప్రారంభం కానుంది’ అని సంగీత రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో లాజిస్టిక్స్ పార్కులు తెలంగాణలో మరో రెండు లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అదానీ గ్రూప్, టెక్స్టైల్ రంగ సంస్థ వెల్స్పన్ గ్రూప్ వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడించారు. బుధవారమిక్కడ జరిగిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విషయం చెప్పారు. ‘తెలంగాణకు గడిచిన నాలుగున్నరేళ్లలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 60 శాతం కార్యరూపం దాల్చాయి. రానున్న కాలంలో ఇది 90–95 శాతానికి వెళ్తుందన్న నమ్మకం ఉంది. కొన్ని కంపెనీలు రెండు, మూడవ దఫా కూడా విస్తరించాయి. ఈ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానమే ఇందుకు కారణం. ఏడు కేసుల్లో మినహా 8,500 పైచిలుకు కంపెనీలకు 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేశాం’ అని గుర్తు చేశారు. -
ఆరోగ్యమస్తు
ఒకప్పుడు సౌందర్యంపైనే మక్కువ చూపిన మహిళలు నేడు శారీరక ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నారు. పురుషులకు దీటుగా మహిళలు సైతం వ్యాయామంతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సులపై ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఉదయం..సాయంత్రం వేళల్లో తీరిక దొరికినప్పుడు వాకింగ్ చేస్తూ ఒబెసిటీ లాంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): నిత్యం ఒడిదుడుకుల జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడం, ఆహార అలవాట్ల కారణంగా అత్యధిక శాతం మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఒబెసిటీ బారిన పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధిక శాతం ఉంటున్నట్లు అంచనా. నగర జనాభాలో 33 శాతం మంది ఒబెసీటీతో బాధపడుతుంటే మహిళలు 40 శాతంగా ఉన్నట్లు అంచనా. ఒబెసిటీ మహిళల్లో 13 నుంచి 18 ఏళ్ల వారు 20 శాతం మందిæ, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారు 33 శాతం మంది, 35 ఆ పైన వయస్సు కలిగిన వారు 40 శాతం మంది ఉన్నట్లు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్ వంటి వ్యా«ధులతో పాటు నడుంనొప్పి వంటి సమస్యలు వీరు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీని అధిగమించేందుకు మహిళలు ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నారు. వ్యాయామంపై ప్రత్యేక దృష్టి ఉదయం, సాయంత్రం పురుషులతో పాటు, మహిళలు వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తున్న వారిలో 45 ఏళ్లు పైబడినవారు ఉంటున్నారు. కాగా 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు ఏరోబిక్ చేస్తుండగా, యువత జుంబా డ్యాన్స్పై మక్కువ చూపుతున్నారు. దీంతో మహిళల కోసం ప్రత్యేక ఫిట్నెస్ సెంటర్లతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సు సెంటర్లు వెలుస్తున్నాయి. ఫిట్నెస్కు ప్రత్యేక ప్రొగ్రామ్స్ ► మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రొగ్రామ్స్ను అమలు చేస్తున్నారు. నిర్ధేశిత సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఫిట్నెస్కు ప్రయత్నిస్తున్నారు. ► గర్భిణులు ప్రసవం ముందు, ప్రసవం తర్వాత పెల్విస్ ఫ్లోర్ మజిల్స్ ఎక్స్ర్సైజ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సుఖప్రసవం జరిగేలా మజిల్స్ను సిద్ధంచేయడంతో పాటు ప్రసవం తర్వాత చర్మం యథాస్థితికి చేరుకునేందుకు పోస్ట్నేటల్ పెల్విస్ ఫ్లోర్ మజిల్స్ ఎక్స్ర్సైజ్ ఎంతగానో దోహదం చేస్తుంది. ► ప్రస్తుతం హార్మోన్ల లోపంతో సంతానలేమితో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారు మందులు వాడాల్సిన అవసరం లేకుండా వ్యాయామం, ఒత్తిడిని అధిగమించే టెక్నిక్స్, మెడిటేషన్ ద్వారా హార్మోన్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తున్నారు. ఇవి చాలా మందిలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ► పిల్లల్లో అధికశాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. అలాంటి వారికోసం అనేక వ్యాయామాలతో పాటు క్రీడల్లో భాగస్వామ్యం కల్పించేలా పలువురు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. జ పీసీఓడీ సమస్యతో నెలసరి సరిగా రాని వారికి లైఫ్ స్టయిల్ మోడిఫికేషన్, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటి పక్రియల ద్వారా సక్రమంగా వచ్చేలా చేయవచ్చునని వైద్యులు చెపుతున్నారు. ► అధిక బరువులో బాధపడుతున్న మహిళలు ఏరోబిక్పై ఆసక్తి చూపుతున్నారు. రోజుకి 20 నుంచి 35 నిమిషాలు ఎరోబిక్ చేయడం ద్వారా వెయిట్లాస్తో పాటు, ఒత్తిడిని అదిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ► జుంబా డ్యాన్స్పై ప్రస్తుతం యువతలో క్రేజ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారు జుంబా డ్యాన్స్ చేస్తున్నారు. అధిక బరువుతో బాధపడే వారు జుంబా డ్యాన్స్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు. వ్యాయామంతో ఎన్నో ఉపయోగాలు వ్యాయామం, ఏరోబిక్ చేయడం ద్వారా ఫిట్నెస్తో పాటు, ఒత్తిడిని అధిగమించవచ్చు. మెడిటేషన్, యోగాపై సైతం మహిళలు దృష్టి సారిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు, అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.గర్భిణులు సుఖప్రసవం కోసం ప్రీనేటల్, పోస్ట్నేటల్ పెల్విస్ ప్లోర్ వ్యాయామంపై మహిళలకు మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రసవం అనంతరం శరీర ఆకృతిలో మార్పులను నివారించేందుకు మంచి వ్యాయామ పద్ధతులు ఉన్నాయి. – డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరపిస్ట్ -
బంధించేదీ... విముక్తి కలిగించేదీ..!
ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్! పురాణం విందాం రారా’’ అని లోపలకి వెళ్లి కూర్చున్నాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగి చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక జూదగృహం వద్దకెళ్లాడు. కాని అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ల ప్రవర్తన అతనికి ఎబ్బెట్టుగా తోచాయి.‘ఛీ! ఎంత సిగ్గుచేటు, నా స్నేహితుడు పవిత్రమైన పురాణాన్ని వింటూ, సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేమో ఇక్కడికొచ్చి చేరాను’ అని పశ్చాత్తాప పడ్డాడు. ఇక రెండవ వాడేమో, పురాణం వింటున్నాడు కానీ, కాసేపటికి మనసులో ఏదో పురుగు తొలిచింది. అతని దృష్టి కాస్తా పురాణం మీదినుంచి స్నేహితుడిమీద, అతను వెళ్లిన ప్రదేశం మీదా మళ్లింది. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. ఎప్పుడో జరిగిపోయిన పాత కథలను వింటూ ఇక్కడ కూర్చుండిపోయాను. వాడు ఏ వ్యభిచార గృహంలోనో, జూదగృహంలోనో హాయిగా కాలక్షేపం చేస్తున్నట్టున్నాడు’ అని వాపోయాడు. కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు.యమభటులు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుంటూ పోతే, జూదగృహానికి వెళ్లిన వాడి జీవాన్ని విష్ణుభటులు సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లారు. భగవంతుడు మనిషిలో చూసేది అతనిలోని పవిత్రమైన భావాలను, నిర్మలమైన భక్తిని మాత్రమే. మనల్ని బంధించేదీ, విముక్తి కలిగించేదీ కూడా మనస్సే. మనసును అదుపులో పెట్టుకోగలిగితే చాలు... అంతా సౌఖ్యమే, ఆనందమే.