focus
-
నకిలీ మెడిసిన్ పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
-
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్బులపై నిఘా..
-
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్ను నవంబర్ 15న హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు. -
హైడ్రా మరో సంచలన నిర్ణయం
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
‘వందేభారత్పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
గ్రేటర్ హైదరాబాద్ పై.. గ్రేట్ ఫోకస్
-
మోదీ 3.0: తొలి బడ్జెట్లో ఆర్థిక ఎజెండాపై దృష్టి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన ప్రభుత్వం త్వరలో తన మొదటి బడ్జెట్ను సమర్పించనుంది. ఈ నేపధ్యంలో మంత్రి సీతారామన్కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన సీతారామన్ తన ఆర్థిక ఎజెండాలో భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే 2047 నాటికి దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చడానికి తగిన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసేదిశగా ముందడుగు వేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ నుండి డివిడెండ్ రూపంలో ప్రభుత్వం అందుకున్న రూ. 2.11 లక్షల కోట్లు దేశ ఆర్థిక స్థితికి మెరుగుదలకు సహాయకారిగా మారినట్లు నిరూపితమయ్యింది.మోదీ 3.0 ప్రభుత్వానికి దేశంలోని వ్యవసాయ రంగంలో ఒత్తిడిని పరిష్కరించడం, ఉపాధి కల్పన, మూలధన వ్యయాల వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక ఏకీకరణ మార్గంలో ఉండటానికి ఆదాయ వృద్ధిని పెంచడం వంటివి కీలకంగా మారనున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీల ప్రైవేటీకరణకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.నిర్మలా సీతారామన్ 2019లో తొలిసారిగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి ఆమె ఈ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశం కోవిడ్ -19 మహమ్మారితో ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటిని సమర్థవంతంగా దాటగలిగింది. -
విశాఖ, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేష్ ఉన్నారు. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
మెడికల్ కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్
-
లోక్సభ ఎన్నికలపై దృష్టిసారించండి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యదర్శులు, జాతీయ ప్రధాన కార్యదర్శులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం సుమారు 5 గంటలపాటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలు మార్గదర్శనం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్లతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన చంద్రశేఖర్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సునీల్ బన్సల్, చంద్రశేఖర్లు రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. అంతేగాక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్తాన్లో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ 2017 సెపె్టంబర్ నుంచి పనిచేస్తున్నారు. ఆర్ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్కు చెందినవారు. 2017లో రాజస్తాన్ బాధ్యతలు తీసుకొనే ముందు చంద్రశేఖర్ పశి్చమ ఉత్తరప్రదేశ్, అంతకు ముందు వారణాశి ప్రాంతీయ సంస్థమంత్రిగా పనిచేశారు. అంతేగాక 2014లో చంద్రశేఖర్ ప్రధాని మోదీతో కలిసి వారణాశి లోక్సభ స్థానం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. నెలాఖరులో రాష్ట్రానికి అమిత్షా ? వచ్చేనెలలో ఐదు క్లస్టర్లలో బీజేపీ యాత్రలు సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులో కేంద్రమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా బీజేపీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణకు వచ్చేసరికి ఐదు క్లస్టర్లుగా విభజించారు. వీటికి నలుగురు రాష్ట్రప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ఇంకా సీనియర్నేత, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఇన్చార్జ్లుగావ్యవహరిస్తారని సమాచారం. మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో క్లస్టర్ ఇన్చార్జ్లతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీసంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వచ్చేనెలలో తెలంగాణలో 10 రోజులపాటు బీజేపీ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఐదు పార్లమెంట్ క్లస్టర్ల వారీగా ఈ యాత్రలు ఉంటాయి. ఇందులో భాగంగా తెలంగాణ అప్పులు తీరాలన్న, తెలంగాణ అభివృద్ధి చెందాలన్న మరోసారి మోదీ అధికారంలోకి రావాలన్న అంశం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్కుమార్గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్అలీ, ఫిరోజ్ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్పెద్దలున్నట్టు సమాచారం. -
హ్యాట్రిక్పై బీజేపీ గురి...!
వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది! ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. 50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది. పంజాబ్లో అకాలీదళ్, బిహార్లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది. నెలాఖరు నుంచి జాబితాలు...! జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది... 1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది. 2. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది. 3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు. 4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్బరేలీ, మెయిన్పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్బరేలీ, మెయిన్పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి. 5. ఇలాగే బిహార్లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు. 6. మధ్యప్రదేశ్లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్కు అప్పగించారు. 7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి. 8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్లో అమృత్సర్, ఆనంద్పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్పూర్ తదితర లోక్సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. 10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చీకటి వస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అధికారంలో ఉండగా పొరపాట్లు, లోటు పాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, ప్రభు త్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని కొంతనిర్లక్ష్యం చేశామని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కా దని, పది పదిహేనేళ్లు కాకపోతే 20 ఏళ్లకైనా పదవి నుంచి దిగాల్సిందేనని, అదే జీవితమని వ్యాఖ్యా నించారు. శాసనసభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించిందని, మన పార్టీ యంత్రాంగం కూడా సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం తెలంగాణ భవన్లో కరీంనగర్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి పునర్జన్మనిచ్చింది కరీంనగరే ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలి. ప్రత్యర్థి పార్టీలు సాగించే దుష్ప్రచారాలను ఎప్పటి కప్పుడు దీటుగా తిప్పికొట్టాలి. విద్యార్థి, యువ జన, మైనార్టీ సమ్మేళనాలతో పాటు సోషల్ మీడియా టీం సమావేశం నిర్వహించాలి. వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. ప్రతి ఓటు కీలకం. కాబట్టి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ నేతలపై ప్రజలకు విశ్వాసం లేదు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదమే 23 ఏళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం. పార్టీకి జన్మనిచ్చి, కష్టకాలంలో పునర్జన్మ నిచ్చింది కూడా కరీంనగరే. కేసీఆర్ను ఉద్యమ సమయంలో కాపాడుకుని, తెలంగాణను సగర్వంగా నిలిపింది కూడా కరీంనగరే..’ అని కేటీఆర్ కొనియాడారు. ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పదేళ్లు అకుంఠిత దీక్షతో పనిచేశాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాం. రెండుసార్లు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు తలెత్తుకునే పనులే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేశారు తప్ప తలదించుకునే పని చేయలేదు. ప్రభుత్వం, పార్టీ వేరు కాదనే ఉద్దేశంతో పనిచేశాం. సంస్థాగత నిర్మాణంపై అంతగా దృష్టి పెట్టలేదు. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలకు జిల్లా అధ్యక్షులను నియమించినా, పూర్తి కమిటీలు వేయలేదు. అనుబంధ కమిటీల నిర్మాణం చేయలేకపోయాం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కార్యకర్తలకు పనులు ఇవ్వలేదు. పనులిస్తే దుష్ప్రచారం చేస్తారని భావించామే తప్ప, చిన్న చూపుతో కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సర్పంచ్ మొదలుకొని అన్ని పదవుల్లో బీఆర్ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ, మనోడు గెలవాలనే కసితో పని చేయలేదు. ఇతర పార్టీల్లో నలుగురైదుగురే ఉన్నా కసితో పని చేశారు. అందుకే వారు విజయం సాధించారు..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరికీ భయపడొద్దు ‘నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్లు గర్వంతో విర్రవీగుతారు. కొత్త బిచ్చగాళ్ల తీరుగా పట్టించుకోవద్దు. కేసుల పేరుతో బెదిరించినా భయపడొద్దు. మేము అండగా ఉంటాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పోలింగ్ ఏజెంట్లను కూడా ప్రభావితం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్లోని ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను చూస్తే ఇతర పార్టీల కన్నా బీఆర్ఎస్కే అధిక్యం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఎక్కువ వేయిస్తే లక్ష ఓట్లతో విజయం సాధిస్తాం. ప్రశ్నించే గొంతుక వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. మాజీమంత్రి హరీశ్రావు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఎంపీ కె.కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి ఎన్నికల సన్నద్ధత విషయంలో పార్టీ వ్యూహాన్ని వివరించారు. -
సన్నద్ధతపై సుదీర్ఘంగా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల దిశగా సన్నద్ధ తను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కసరత్తు ముమ్మరం చేసింది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు గురువారం నందినగర్లోని నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో.. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్, బీజేపీల సన్నద్ధత, ఎత్తుగడలు, వాటిపై పైచేయి సాధించడం, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తదితర అంశాలపై చర్చించారు. కాగా ఆయా అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక, అంగబలంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రెండు పార్టీలు బరిలోకి దించుతాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సిట్టింగ్ ఎంపీలతో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మళ్లీ అవకాశం ఇస్తే ఎంత మేరకు పోటీ ఇవ్వగలరనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే ఎదురయ్యే లాభ, నష్టాలపైనా మదింపు జరుగుతోంది. టికెట్పై కొందరికి సంకేతాలు చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం సిట్టింగ్ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో గతంలో పోటీ చేసిన ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, గెడాం నగేశ్కు కూడా టికెట్ దాదాపు ఖాయం కావడంతో వారు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇలా కచ్చితంగా టికెట్ ఇవ్వాలని భావించిన నేతలకు మాత్రమే సంకేతాలు ఇచ్చి పార్టీ కేడర్ను సమన్వయ పరుచుకోవాల్సిందిగా సమాచారం ఇస్తున్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ స్థితిగతులపై సర్వే సంస్థల నివేదికలతో పాటు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లు తెలిసింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. అక్కడి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారా లేక గతంలో ఇచ్చిన హామీ మేరకు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డికి టికెట్ ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరిచిన మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని కేటీఆర్, హరీశ్తో జరిగిన భేటీలో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. జనవరి 3 నుంచి జనంలోకి పార్టీ కేడర్తో అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలోని మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. సుమారు నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సమావేశాలు ముమ్మరంగా జరిగేలా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది... ఆరునూరైనా 60 దాటాల్సిందే...! కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్)తో కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ను ఎలాగైనా సింగిల్ డిజిట్కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో... కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఉత్తరాది నేతలకు బాధ్యతలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్సింగ్ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, సునీల్ బన్సల్, స్వతంత్ర దేవ్ సింగ్, గుజరాత్కు చెందిన పర్ణేశ్ మోదీ, విజయ్ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
చేరికలపై హస్తం ఫోకస్..!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చి, అధికారం చేపట్టిన నేపథ్యంలో.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తోంది. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్లో పనిచేసి వెళ్లిన నేతలను, బీజేపీలోని కీలక నేతలను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో ఇప్పటికే పలువురు బీజేపీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరిపినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల నేతలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మొత్తమ్మీద 15 ఎంపీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రయోజనం కోసం.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను పదింట బీజేపీతోనే పోటీ ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు స్థానాలు, ఉత్తర తెలంగాణలోని లోక్సభ సీట్లలో కమలనాథుల నుంచి గట్టిపోటీ ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన లోక్సభ అభ్యర్థుల స్థాయి నేతలను చేర్చుకోవడం ద్వారా.. ఆదిలోనే బీజేపీకి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంతనాలు షురూ.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ కీలక నేతను చేర్చుకునే విషయంలో టీపీసీసీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆయనకు కరీంనగర్ లోక్సభ స్థానాన్ని ఆఫర్ చేయడంతోపాటు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత కలి్పస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలతోపాటు మెదక్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతతోనూ టచ్లోకి వెళ్లినట్టు తెలిసింది. మరో ఐదేళ్లదాకా తెలంగాణలో బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమని.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిస్తే, రాష్ట్రంలో బీఆర్ఎస్ను పక్కాగా నిలువరించవచ్చని సదరు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ శివారు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు బీసీ నేతలు గతంలో కాంగ్రెస్లో పనిచేసి ఉన్న నేపథ్యంలో.. వారిని కూడా పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలిసింది. మొత్తమ్మీద లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. -
2024 లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
-
వైద్య రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి
-
హైదరాబాద్ పబ్స్పై పోలీసుల ఫుల్ ఫోకస్
-
‘డీప్’గా పసిగట్టి..‘ఫేక్’ పనిపట్టండి
సాక్షి, హైదరాబాద్: డీప్ఫేక్పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆన్లైన్లో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ కట్టడికి కఠిన నిబంధనలు విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, డీప్ఫేక్తో మోసాలకు గురికాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి. ► ఫొటోలు, వీడియోలలో ఉన్న లైటింగ్, నీడలను నిశితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలు గమనిస్తే అది ఫేక్ అని ప్రాథమిక అంచనాకు రావొచ్చు. ► అసహజ ముఖకవళికలు ఉన్నట్టు గమనిస్తే దానిని డీప్ఫేక్తో తయారు చేసిన వీడియోగా భావించవచ్చు. ► ఆడియోలలో అసమానతలు, ఆడియో అస్పష్టంగా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► ఫొటోలు, వీడియోల బ్యాక్గ్రౌండ్లో అసమానతలు, ఏవైనా వస్తువులు సాధారణానికి భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్ఫేక్ అయి ఉండొచ్చు. ► ఫొటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడిన, నడుస్తున్న ప్లాట్ఫారమ్లు అసాధారణంగా ఉన్నాయా? కదలికలు నిశితంగా పరిశీలిస్తే ఏవైనా అనుమానాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► డీప్ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కూడా అవి నిజమైనవా..లేదా? గుర్తించవచ్చు. -
విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు. 1.84 లక్షల సీట్లు ఖాళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్లో అనుమతించలేదు. దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి. ఆదరణలేని స్కిల్ కోర్సులు డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్గ్రేడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్ డిమాండ్ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. మార్పులు అనివార్యం.. రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఎగుమతులపై దృష్టి పెడుతున్న భారత్.. కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు
న్యూఢిల్లీ: నైజీరియా, ఇథియోపియా, ఘనా వంటి సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలు, ఇతరత్రా గల్ఫ్ దేశాలకు ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా టారిఫ్యేతర అవరోధాలను తొలగించడంపై కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలున్న సహారా ప్రాంత దేశాలు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ మిషన్లతో వర్చువల్ సమావేశాలు నిర్వహింనట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా దేశాలతో ఆర్థిక, వ్యాపార సంబంధాలు, ఎగుమతుల స్థితిగతులు, టారిఫ్యేతర అడ్డంకులు మొదలైన వాటి గురిం చర్చింనట్లు వివరించారు. సహారా ప్రాంత దేశాలకు సంబంధిం దక్షిణాఫ్రికా .. భారత్కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022–23లో దక్షిణాఫ్రికాతో మొత్తం 18.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైంది. ఇందులో 8.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా (11.85 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 5.15 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టోగో (6.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 6 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టాంజానియా (6.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 3.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ఉన్నాయి. మిగతా ఆఫ్రికన్ దేశాల్లో మొజాంబిక్, అంగోలా, కెన్యా ఉన్నాయి. గల్ఫ్లో సౌదీ అరేబియా (52.76 బిలియన్ డాలర్లు), ఖతర్ (18.77 బిలియన్ డాలర్లు) తదితర దేశాలతో అత్యధికంగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఎగుమతులకు ఊతమిచ్చే క్రమంలో ప్రధానంగా ఆహారం, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వంటి రంగాలు, ప్రధాన మార్కెట్లపై దృష్టి పెట్టాలంటూ ఎగుమతిదార్లకు వాణిజ్య శాఖ సూంంది. అలాగే, అంతర్జాతీయంగా మరిన్ని ఎగ్జిబిషన్స్ వంటివి నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఎగుమతులు 7 శాతం తగ్గి సుమారు 245 బిలియన్ డాలర్లకు, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించి 392 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతో రోడ్షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. వార్రూమ్లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ వార్రూమ్తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్రూమ్లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపై భారత్ దృష్టి
ముంబై: విశ్వక్రీడల ఆతిథ్యంపై భారత్ దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్స్ ప్రారం¿ోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మోదీ మాట్లాడుతూ ‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు. 2036లో ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే ప్రణాళికల్లో ఉన్నాం. ఇది 140 కోట్ల భారతీయుల కల. దీన్ని ఐఓసీ సహకారంతో సాకారం చేస్తాం. దీనికంటే ముందు 2029లో యూత్ ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని మోదీ అన్నారు. క్రీడాస్ఫూర్తి అనేది విశ్వవ్యాప్తమని, ఇందులో పరాజితులెవరూ ఉండరని... కేవలం విజేతలు, నేర్చుకునేవారే ఉంటారని మోదీ చెప్పారు. 141వ ఐఓసీ సెషన్స్ శనివారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కొత్త క్రీడాంశాలకు చోటు కలి్పంచడం, ఓటింగ్, ఆమోదం తదితర నిర్ణయాలను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తీసుకుంటుంది. -
అప్పుడెట్లనో.. ఇప్పుడట్లనే ఉండాలే..!
మంచిర్యాల: ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దీంతో మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెంచారు. 2018 ఎన్నికల సమయంలో ప్రధానంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పడు కూడా అలాగే ఉండాలని వైన్స్ యజమానులకు ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మద్యం ఏరులై పారకుండా ఐఎంఎల్ డిపో నుంచి భారీ మద్యం కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 208 మద్యం దుకాణాలు, దాదాపు 45 వరకు బార్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిపై నిఘా పెంచారు. పరిమితికి మించి మద్యం నిల్వలు ఉంచినా, మద్యం తరలింపు చేపట్టినా ఎక్సైజ్, పోలీస్ శాఖలు పట్టుకుని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తికి పరిమితికి మించి మద్యం విక్రయించినా ఆ వైన్ దుకాణాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం నిఘా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాం. మద్యం అమ్మకాలు గతంలోని అమ్మకాలను పోల్చి చూస్తూ మద్యం విక్రయాలపై దృష్టి సారించాం. మద్యం నియంత్రణ చేపడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. మద్యం దుకాణా దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అక్రమ మద్యం రవాణా కట్టడికి రెండు చెక్పోస్ట్లు ఏర్పాటు చేశాం. అక్రమ మద్యం నిల్వలు, సరఫరా అరికట్టేలా మూడు తనిఖీ బృందాలు ప్రత్యేకంగా గస్తీ చేపడుతున్నాయి. – నరేందర్, సీఐ, ఎక్సైజ్ శాఖ, మంచిర్యాల -
తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
-
తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో వివాదం...రంగంలోకి రాహుల్ గాంధీ..
-
తెలంగాణపై బీజేపీ అగ్రత్రయ నేతల ఫోకస్
-
నమామీ గోదావరి..స్వచ్ఛ గోదావరే లక్ష్యంగా ఏపీ సర్కార్ కృషి
-
చంద్రబాబు ముడుపుల కేసులో కీలక మలుపులు
-
మీలో ఏకాగ్రత ఎంత? అందుకోసం ఏం చేయాలంటే..!
ఏకాగ్రత లేకుండా చదవడం లేదా ఏ పనినైనా చేయడం అంటే చిల్లికుండలో నీళ్లు నింపడం లాంటిదే.ఏకాగ్రత లేకుండా చేసే పనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే కొందరిలో ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత ఉండదు. అలా ఏకాగ్రత లేకపోవడానికి మానసిక, శారీరక సమస్యలు కారణం కావచ్చు. ఇంకొంతమందికి ఎక్కువ సమయం ఒకే విషయం మీద ఫోకస్ చేసినా ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రలేమి, ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్ మొదలైన ఆరోగ్య సమస్యలు కూడా కారణాలు కావచ్చు. ఏకాగ్రత పెరగాలంటే.. ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం.అందుకే ఏకాగ్రత పెంచుకోవడం అందరికీ అవసరం. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం ఏం చేయాలో చూద్దాం. ముందు మనం విద్యార్థుల కోసం చెప్పుకుందాం.. ⇒ చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. టీవీ, ఫోన్ , కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్కి దూరంగా ఉండాలి. ⇒ ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం. ⇒ ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఎప్పుడూ చేయకూడదు. ⇒ స్టడీసెషల్స్కు నలభైనుంచి యాభై నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించొద్దు. అలసిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో విరామం అవసరం. ⇒ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బాధలను, ఆందోళనలను మర్చిపోవాలి. ⇒ చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్ను, టాపిక్స్ను నోట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని రిఫర్ చేసుకోవాలి. యోగా, ధ్యానం మొదలైన టెక్నిక్స్ ఉపయోగపడతాయి. ఎస్క్యూ3ఆర్ పద్ధతి ఎస్ (సర్వే): చదివిన దాంట్లో ముఖ్యమైనవి ఒక సర్వే పుస్తకంలో రాసుకోవాలి. టైటిల్స్, సబ్–టైటిల్స్, క్యాప్షన్స్ లాంటివి రిఫరెన్స్కి బాగా తోడ్పడతాయి. క్యూ (క్వశ్చన్): పుస్తకంలో నోట్ చేసుకోవడం, చదవడం పూర్తయ్యాక క్వశ్చన్స్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆర్ 1 (రీడ్): చాప్టర్ పూర్తవగానే క్వశ్చన్ , దానికి సరైన జవాబును తెలుసుకొని చదువుకోవాలి. అలా చదివితే మర్చిపోవడం అంటూ జరగదు. ఆర్ 2 (రిసైట్): చదివిన వాటిని తిరిగి ప్రశ్నించుకుంటూ వాటి జవాబులను గుర్తు చేసుకోవాలి. సొంతంగా జవాబులను తయారు చేసుకోవాలి. అవసరమైతే ముందు రాసుకున్న నోట్స్ తీసి చూడాలి. ఆర్ 3 (రివ్యూ): చదివిన తర్వాత అవన్నీ మెదడులో తాజాగా ఉండాలంటే మళ్లీమళ్లీ చదవాలి. మామూలుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం– చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, చూస్తూ, ఒక నోటు పుస్తకంలో ముఖ్యమైన వాటిని రాసుకుంటూ చదివితే ఏకాగ్రత కోల్పోవడం తగ్గుతుంది. మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు (సెల్ ఫోను), వ్యక్తులను చదువుతున్నప్పుడు దూరం పెట్టాలి. వీలయినంత వరకు చదవడానికి ఒక ప్రదేశం (లైబ్రరీ, ఇంటి లో ఒక గది) నిర్ణయించుకుని అక్కడే ప్రతిరోజు చదివితే, మన బుర్రలో అది స్థిరపడి, ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే వేరే ఆలోచనలు తక్కువవుతాయి. కొంతమంది ఎక్కువసేపు ఒకచోట కూర్చోలేరు. అలాంటివారు 3–4 చోట్ల మధ్య మారుతూ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు. చదివే వ్యాసాలను ఫ్లో– చార్ట్స్, డయాగ్రమ్స్గా నోటు పుస్తకాలలో రాసుకుంటే బాగా గుర్తుంటాయి. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించినా తేలిగ్గా తీసుకోకుండా వాటిని పాటించడం వలన ఏకాగ్రత మెరుగుపరచుకోవచ్చు. (చదవండి: జంక్ ఫుడ్నే జంకేలా..తినడం స్టాప్ చేద్దాం ఇలా!) -
అగ్రత్రయ నేతల పర్యటనపైనే కాషాయ పార్టీ ఆశలు
-
బ్లాక్ స్పాట్స్పై నజర్
సాక్షి, హైదరాబాద్ : తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్లపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్స్పాట్స్గా గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్తోపాటు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, స్థానిక మున్సిపల్శాఖ అధికారుల సమన్వయంతో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో.. మరోమారు ప్రమాదాలకు తావులేకుండా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే.. కొంత కాలం తర్వాత ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలోంచి తొలగిస్తున్నట్టు అడిషనల్ డీజీ శివధర్రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,002 బ్లాక్స్పాట్స్ను గుర్తించారు. 2022 నాటికి వాటి సంఖ్య 951కి తగ్గింది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డు మలుపు లేదా ఇరుకుగా ఉండటం అయితే.. వెంటనే ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డు వెడల్పు చేయడం, లేదా మూల మలుపు ప్రమాదకరంగా లేకుండా మార్చడం వంటి ఇంజనీరింగ్ చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు సరిగా కనిపించేలా మార్కింగ్లు పెట్టడం.. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, గుంతలు పూడ్చడం వంటి తాత్కాలిక చర్యలను తీసుకుంటారు. బ్లాక్ స్పాట్ అంటే..? బ్లాక్ స్పాట్లను రెండు విధాలుగా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదుకు మించి రోడ్డు ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదంలో పది మంది కంటే ఎక్కువ మంది చనిపోయినా (అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యతో సంబంధం లేకుండా) ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా పరిగణిస్తారు. -
విశాఖ తీరంలో కొత్త అందాలు
-
టాలీవుడ్ రికార్డ్స్ పై కన్నేసిన కోలీవుడ్ మూవీస్
-
పాఠశాల విద్యపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోకస్
-
ఏపీలో బీచ్ ల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
-
పొలిటికల్ కారిడార్: నల్గొండలో కమలానికి దిక్కేది..?
-
మహేష్ సినిమాతో హాలీవుడ్ పై కన్నేసిన జక్కన్న
-
టీ కాంగ్రెస్ సీనియర్లకు హైకమాండ్ బుజ్జగింపు
-
తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్
-
తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్
-
కాంగ్రెస్ అసమ్మతి నేతలపై దృష్టిపెట్టిన బీజేపీ
-
బాక్సాఫీస్ ను పరుగులు పెట్టించబోతున్న కమల్ హాసన్
-
అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఇప్పట్నుంచే సమాయత్తం చేయడంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నికలో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ముఖ్య నేతలకు, సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఈనెల 15న తెలంగాణ భవన్లో శాసనసభ, పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సాయంత్రం వరకు సాగే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా క్షేత్రస్థాయిలో వెలుగు చూసిన పార్టీ అనుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ పార్టీ ఇన్చార్జిలను నియమించడం, మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించడం వంటి కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో కేసీఆర్ ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్లు.. జిల్లా పరిషత్ల చైర్మన్లు తదితరులను నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించి, ఆయా ప్రాంతాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్చార్జిల నియామక కసరత్తు పూర్తి తమ సొంత నియోజకవర్గంతో పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలోని మరో నియోజకవర్గం గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించనున్నారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంలో మంత్రులు, కొత్తగా నియమితులయ్యే పార్టీ ఇన్చార్జిలే కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. కాగా ఇన్చార్జిల నియామకానికి సంబంధించిన కసరత్తును కేసీఆర్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే నియోజకవర్గానికి చెందిన నేతలను కాకుండా ఇతర ప్రాంతాల వారిని ఇన్చార్జిలుగా నియమించే అవకాశముంది. మునుగోడు ఫీడ్బ్యాక్ ఆధారంగానే.. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. మండలాలు, గ్రామాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను మోహరించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులపై కొంత ఫీడ్ బ్యాక్ లభించింది. గ్రామాలు, పట్టణాల్లో యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు వివిధ సామాజిక వర్గాలు.. అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో తెలిసింది. స్థానిక నేతలు, కేడర్ పనితీరు, సమన్వయం, ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతలు వంటి అనేక అంశాలపై ఒక అవగాహన ఏర్పడింది. ఈ ఫీడ్బ్యాక్ను లోతుగా విశ్లేషించిన కేసీఆర్.. దాని ఆధారంగానే రాబోయే రోజుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన విధానంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడం, సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, దళితబంధు పురోగతి వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఎరలు, దాడులపై అప్రమత్తం! ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఎపిసోడ్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని భావిస్తున్న కేసీఆర్.. భవిష్యత్తులోనూ ఎరలు, ఈడీ, ఐటీ సంస్థల దాడులతో పార్టీ ముఖ్య నేతలను లొంగదీసుకునేందుకు బీజేపీ చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించవచ్చని చెబుతున్నారు. ప్రలోభాలకు లొంగకుండా గట్టిగా నిలబడే నేతలకు పార్టీ అండగా ఉంటుందనే భరోసాను కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఇవ్వనున్నారు. బీజేపీ ప్రలోభాలను తట్టుకుని నిలబడిన ఎమ్మెల్యేలకు భద్రత పెంచడం, వ్యక్తిగతంగా తన వెంట పర్యటనకు తీసుకెళ్లడం వంటి అంశాలను వివరించనున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు, వ్యాపార సంస్థలపై జరిగిన దాడులను ప్రస్తావించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరుస పర్యటనలు, సభలు సమావేశాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తన వరుస పర్యటనలు, సభలు, సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ను సన్నద్ధం చేసేందుకు కలెక్టరేట్ల ప్రారంభం, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, సభలు, సమావేశాలు విస్తృతంగా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇలావుండగా మంగళవారం నాటి కీలక భేటీ దృష్ట్యా.. అదేరోజు మునుగోడు నియోజవర్గంలో పలువురు మంత్రులతో నిర్వహించ తలపెట్టిన సమీక్ష సమావేశం వాయిదా పడే అవకాశముంది. చదవండి: ఎడారి గోసకు.. ఏదీ భరోసా! -
Focus Review: ఫోకస్ మూవీ రివ్యూ
టైటిల్: ఫోకస్ నటీనటులు: విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు నిర్మాత : వీరభద్రరావు పరిస దర్శకత్వం: జి. సూర్యతేజ సంగీతం: వినోద్ యజమాన్య సినిమాటోగ్రఫీ: ప్రభాకర్ రెడ్డి ఎడిటర్: సత్య. జీ విడుదల తేది: అక్టోబర్ 28, 2022 కథేంటంటే.. ఎస్పీ వివేక్ వర్మ(భాను చందర్), న్యాయమూరి ప్రమోద దేవి(సుహాసిని మణిరత్నం) భార్య భర్తలు. వృత్తిధర్మం పాటిస్తూ.. ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో వివేక్ వర్మ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఎస్సై విజయ్ శంకర్(విజయ్ శంకర్) టేకాప్ చేస్తాడు. అనేక మలుపుల తర్వాత ఈ కేసు దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ(అషురెడ్డి) రంగంలోకి దిగుతుంది. అసలు వివేక్ని హత్య చేసిందెవరు? హత్య కేసు దర్యాప్తు ఎందుకు క్రిటికల్గా మారింది? విజయ్ శంకర్ను తప్పించి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ ఎందుకు ఈ కేసును టేకప్ చేయాలని ప్రయత్నించింది? చివరకు అసలు హంతకులను ఎలా పట్టుకున్నారు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి. ఇలాంటి కథలను కొత్త దర్శకులు ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఫోకస్ చిత్రం కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథతోనే తెరకెక్కింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేసే విధంగా ట్విస్టులు ఉంటాయి. బలమైన సన్నివేశాలు లేకపోవడం, పేలవంగా కథనం సాగడం.. క్యారెక్టర్లలో క్లారిటీ లేకపోవడం లాంటి అంశాలు తొలి భాగంలో కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. సెకండాఫ్లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ట్విస్టు ఉంటుంది. స్క్రిప్టు పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే.. సినిమా స్థాయి మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఎస్సై విజయ్ శంకర్గా విజయ్ శంకర్ తనదైన నటనతో మెప్పించాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా మంచి నటనను కనబరిచాడు. అషురెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమగా అషురెడ్డి పర్వాలేదనిపించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సినిమాకు ప్రధాన బలం సుహాసిని పాత్ర అనే చెప్పాలి. అతిథి పాత్రకే పరిమితమైంది. జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. వినోద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ సత్య. జీ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
`ఫోకస్` టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది : శ్రీకాంత్
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్నచిత్రం `ఫోకస్`. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు, వీరభద్రరావు పరిస నిర్మాత. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. అక్టోబరు 28న ఈ మూవీ థియేటర్స్లో గ్రాండ్గా విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శకుడు సూర్యతేజ మంచి సబ్జెక్ట్ను ఎంచుకున్నారు. హీరో విజయ్ శంకర్ చాలా బాగా నటించాడు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు. ‘నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ‘ఫోకస్’. క్రైమ థ్రిల్లర్ జోనర్ని ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం ఫుల్మీల్స్లా ఉంటుంది’అని హీరో విజయ్ శంకర్ అన్నాడు. ఫోకస్ అనేది ఒక కొత్త తరహా క్రైమ్ థిల్లర్. తెలుగు ఆడియన్స్ ఈ జోనర్ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. కొత్తగా ఉంటే తప్పకుండా ఓన్ చేసుకుంటారు. ఊహించని మలుపులతో సరికొత్త కథ,కథనాలతో ఈ సినిమా రూపొందింది’అని దర్శకుడు సూర్యతేజ్ అన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాసిని, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు. -
టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ గురి
-
బిగ్ క్వశ్చన్ : కేసీఆర్ స్ట్రాటజీ ఢిల్లీలో వర్కవుట్ అవుతుందా ..?
-
జాతీయ పార్టీపై కేసీఆర్ కసరత్తు
-
మునుగోడు ఓటర్ల దయకోసం మూడు పార్టీల పాకులాట
-
అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ అపరేషన్
-
మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్
-
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ వరుస సమావేశాలు
-
కాకరేపుతోన్న మునుగోడు రాజకీయం
-
మునుగోడు పోరుకు సై అంటున్న బీజేపీ
-
తెలంగాణ కాంగ్రెస్పై ఏఐసీసీ ఫోకస్
-
తెలంగాణ కాంగ్రెస్ పై ఏఐసీసీ ఫోకస్
-
తెలంగాణ రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
-
బ్లూ ఎకానమీ.. ఆ దిశగా ఏపీ సర్కార్ వేగంగా అడుగులు..
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ)పై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డు విదేశీ పోర్టుల భాగస్వామ్య అంశాలపై దృష్టిసారించింది. యూరప్లోనే అతిపెద్ద పోర్టుగా పేరొందిన నెదర్లాండ్స్లోని రోట్టర్ డ్యామ్, బెల్జియంకు చెందిన యాంట్వెర్ప్లతో కలిసి పనిచేసేందుకు అడుగులు వేస్తోంది. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులను కలిసి రాష్ట్రంలోని పోర్టుల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏపీలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టడంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఆ రెండు సంస్థలను కోరినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అంతర్జాతీయ పోర్టులతో చేతులు కలపడం ద్వారా విదేశీ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం రాష్ట్ర పోర్టులకు వేగంగా కలుగుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రతిపాదనలపై రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తంచేశాయని, త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖతను వ్యక్తంచేసినట్లు ఆయన తెలిపారు. నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలోనూ.. అదే విధంగా.. షార్జాకు చెందిన డామన్ షిప్యార్డ్ ప్రతినిధులతో కూడా సమావేశం జరిగిందని, రాష్ట్రంలో నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించినట్లు రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటన సందర్భంగా ఆయా పోర్టులను సందర్శించి స్థానిక పరిశ్రమల ప్రతినిధులు, పోర్టు చైర్మన్లతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా దావోస్ పర్యటన అనంతరం విదేశీ పోర్టుల ప్రతినిధులను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానిస్తూ తాజాగా ఈ–మెయిల్స్ పంపామన్నారు. ఈ పర్యటనలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, మారిటైమ్ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, గత దుబాయ్ ఎక్స్పో సందర్భంగా షరాఫ్ గ్రూపు రాష్ట్ర లాజిస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపించిందని, త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు రవీంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. -
AP: టెన్త్ ఫెయిల్ అయ్యారా?.. అయితే ఇది మీకోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ‘ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని వివరించారు. విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్కు సమర్పించాలని నిర్దేశించారు. చదవండి: ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్న్యూస్.. తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పాఠశాలవిద్య కమిషనర్ మార్గదర్శకాలు అందిన వెంటనే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఏర్పాట్లపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు ఏ బాధ్యత నెరవేర్చాలో సూచనలు జారీచేస్తున్నారు. కొందరు డీఈవోలు జారీచేసిన సూచనలు.. ►సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా తన పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులంతా ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలి. ►షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాటు వారి సబ్జెక్టు విభాగం ప్రకారం బాధ్యత ఇవ్వాలి. ►సంబంధిత సీఆర్పీ సహాయంతో గూగుల్ ఫారం ద్వారా రోజువారీ హాజరు నివేదికను డీసీఈబీ సెక్రటరీకి సమర్పించాలి. ►సబ్జెక్టు టీచర్లందరూ తమ సబ్జెక్టుల్లో ఫలితాల మెరుగుదల కోసం సొంత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలి. ►సబ్జెక్టు వారీగా ప్లాన్తో పాటు టైమ్టేబుల్, దానికోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను గూగుల్ ఫారం ద్వారా ప్రధానోపాధ్యాయులు జూన్ 11వ తేదీ నాటికి డీసీఈబీలకు తెలియజేయాలి. ►రెమిడియల్ తరగతులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. ►ఈ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా డిప్యూటీ డీఈవోలు పర్యవేక్షించాలి. ►తక్కువ పనితీరు కనబరుస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. -
కంపెనీల కొనుగోళ్లపై సీఈవోల దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో దేశీయంగా వ్యాపారాలకు స్వల్పకాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, ఎకానమీ పుంజుకునే కొద్దీ భారతీయ సంస్థలు ఆయా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడం కొనసాగిస్తున్నాయి. ఈవై ఇండియా సీఈవో సర్వే 2022లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కార్యకలాపాలను విస్తరించుకోవడానికి సంబంధించి వ్యాపారాలను క్రమక్రమంగా నిర్మించుకుంటూ వెళ్లడం కన్నా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాలకే (ఎంఅండ్ఏ) ప్రాధాన్యం ఇవ్వాలని సీఈవోలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు, పెరుగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక సవాళ్ల మధ్య భారతీయ సీఈవోలు తమ రిస్కులను కొత్తగా మదింపు చేసుకుంటున్నారు. మారే పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ను తీర్చిదిద్దుకునేందుకు తమ పెట్టుబడుల వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ప్రకారం మహమ్మారి వల్ల తమ వ్యాపారాలకు స్వల్పకాలికంగా అవాంతరాయాలు ఏర్పడ్డాయని 50 శాతం మంది భారతీయ సీఈవోలు వెల్లడించారు. భౌగోళికరాజకీయ సవాళ్లు దీనికి మరింత ఆజ్యం పోశాయని, వ్యాపార కార్యకలాపాలకు మరిన్ని రిస్కులు తెచ్చిపెట్టాయని వివరించారు. వ్యూహాల్లో మార్పులు .. సవాళ్లను అధిగమించేందుకు తమ అంతర్జాతీయ కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు 80 శాతం మంది సీఈవోలు తెలిపారు. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించుకోవడం, సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు 63 శాతం మంది వివరించారు. ‘సాంప్రదాయేతర సంస్థల నుంచి పోటీతో పాటు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న అంశాన్ని భారతీయ సీఈవోలు గుర్తించారు‘ అని సర్వే వివరించింది. మహమ్మారి, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల వల్ల వస్తున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారతీయ సీఈవోలు ముందుండి తమ సంస్థలను నడిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. వ్యాపారంలో మార్పులు చేయడానికి, దీర్ఘకాలికంగా విలువను సృష్టించడానికి సంస్థల కొనుగోళ్లు, విలీనాల దోహదపడగలవని సీఈవోలు భావిస్తున్నట్లు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ తెలిపారు. -
హీరోయిన్గా అషూ రెడ్డి, ఫోకస్ పోస్టర్ చూశారా?
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ఫోకస్'. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవల విడుదలైన ఫోకస్ మూవీ టీజర్ ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేషాదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. తాజాగా ఆమె లుక్ను బి. సుమతి ఐపీఎస్ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుదల చేసి చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. 'ఫోకస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది. ఔట్ పుట్ పట్ల మా యూనిట్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అతి త్వరలో ఒక స్టార్ హీరోతో ఫోకస్ మూవీ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చదవండి: పాన్ ఇండియా సినిమాల సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్ బాలీవుడ్ రీమేక్లపై వర్మ వ్యంగ్యాస్త్రాలు -
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుహాసిని ‘ఫోకస్’ ఫస్ట్లుక్
విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలలో జి. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫోకస్’. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆసక్తికరమైన కథ-కథనాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, వేలంటైన్స్డే సందర్భంగా రిలీజైన పోస్టర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫోకస్ మూవీ నుంచి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ పోస్టర్ను సినీ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యతేజ తన డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై `ఫోకస్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్శంకర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడే టీజర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్రలు చాలా ఉన్నాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. ‘నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం `ఫోకస్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్ను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. భాను చందర్, షియాజీ షిండే, జీవా, సూర్య భగవాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
మర్డర్ కేసుపై ‘ఫోకస్’ పెట్టిన విజయ్ శంకర్
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ఫోకస్’ మూవీ తెరకెక్కుతోందని మూవీ యూనిట్ పేర్కొంది. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా, అషూరెడ్డి హీరోయిన్గా నటిస్తోంది.భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది. మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తాం’అని చిత్ర దర్శకుడు సూర్యతేజ తెలిపారు. -
కొవిషీల్డ్ సింగిల్ డోస్పై ఫోకస్
-
‘డీఎస్సీ–2018’ నియామకాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2018 నియామకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీచర్ పోస్టుల నియామకాలు చేపడతామని అధికారులు గతంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అయితే, హైకోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు నివేదించిన గడువులోగా కాకున్నా పది రోజులు అటు ఇటుగా ఈ నియామకాలు పూర్తి చేస్తామని అంటున్నారు. కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కారమయ్యేలా చూసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. టీచర్ పోస్టుల భర్తీపై ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో చర్చ జరిగింది. అన్ని తరగతులకూ టీచర్లుండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. డీఎస్సీ–2018లోని 7,902 పోస్టుల నియామకాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు.. రాష్ట్రంలో 7,902 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2018 అక్టోబర్ 10న ప్రభుత్వం టీఆర్టీ, టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి 2019 జనవరి 31 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. 6,08,155 మంది దరఖాస్తు చేయగా, 5,89,165 మందికి హాల్టికెట్లు జారీ చేశారు. వీరిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. అయితే, ఫలితాలు, మెరిట్ జాబితాలు, సెలెక్షన్ జాబితాల విడుదలకు షెడ్యూల్ ప్రకటించినా అవి అనుకున్న తేదీల్లో వెలువడలేదు. చివరకు మెరిట్ జాబితాలను ప్రకటించి జిల్లాల వారీగా అర్హులైన అభ్యర్థుల ఎంపికను ఆన్లైన్ విధానంలో చేపడుతూ సుదీర్ఘ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం కూడా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. మెరిట్ జాబితాల విడుదల ఆలస్యం కావడం ఒకటైతే, మరోవైపు సెలెక్షన్ జాబితాల విడుదలలో కూడా జాప్యం జరగడం నియామకాలకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. -
ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలంతా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పనిచేయాలనీ, గత ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయని ప్రజల మనసులను కూడా గెలుచుకుని, వచ్చే ఎన్నికల్లో వారంతా బీజేపీకే ఓటు వేసేలా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఓటు వేయని వారిపై లేదా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడిన వారిపై ద్వేష భావం వద్దనీ, అందరినీ కలుపుకుని పోతూ, అందరి మన్ననలూ పొందుతూ తర్వాతి ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయం చేసుకునేలా ప్రవర్తించాలని తమ ఎంపీలకు మోదీ మార్గ నిర్దేశం చేశారు. అన్ని చోట్లా ప్రజలతోపాటే క్యూల్లో నిలబడాలనీ, జనంతో కలిసిపోయి మనుషులందరితో మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. 380 మందికి పైగా బీజేపీ ఎంపీలకు శిక్షణనివ్వడం కోసం బీజేపీ శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముగింపు సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాలం నుంచి ఇప్పుడు ప్రధానిగా రెండోసారి గెలిచేంత వరకు, దాదాపు రెండు దశాబ్దాలుగా తాను ఎప్పుడూ అధికారంలోనే ఎలా ఉంటున్నదీ మోదీ వివరించారు. ఎంపీలు కూడా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ ఎంతో నిబద్ధతతో ఉండాలనీ, నియోజకవర్గంలోని ప్రజలను ఎప్పుడూ కలుస్తూ, వారి మధ్యనే ఎక్కువ కాలం గడపాలని ఆయన సూచించారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించవద్దనీ, రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకు, నియోజకవర్గానికి మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో ఏయే పోలింగ్ బూత్ల్లో ఓట్లు సరిగ్గా పడలేదో గుర్తించి, ఆ బూత్ల పరిధిలోని ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారిపై ద్వేషం పెంచుకోవడానికి బదులు మంచి చేస్తూ వారి ఆశీర్వాదం పొందాలంటూ ఎంపీలకు మోదీ పలు కిటుకులు చెప్పారు. కాగా, మోదీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు కచ్చితంగా చేరేలా చేసేందుకు ఎంపీలను ఉపయోగించుకోవాలని మంత్రులకు బీజేపీ సూచించింది. ఎంపీలతో ప్రతి నెలా మంత్రులు సమావేశమై పథకాల గురించి వారికి చెబుతుండాలనీ, ఈ భేటీలకు అన్ని పార్టీల ఎంపీలనూ ఆహ్వానించాలని తెలిపింది. -
2022 యూపీ ఎన్నికలపై ప్రియాంక గురి!
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తర ప్రదేశ్లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై పట్టుసాధించాలనే దిశగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలతో వారంలో కనీసం రెండు సార్లు సమావేశమవ్వాలని ఆమె యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించినప్పుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం కొరవడిందనేది స్పష్టమైంది. దీంతో ప్రియాంక గాంధీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలని నిశ్చయించుకున్నారు’ అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. గత బుధవారం ప్రియాంక.. ఆమె తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో కలిసి రాయ్బరేలీ నియోజకవర్గాన్ని సందర్శించారు. -
మేడ
‘‘హలో...’’ టార్చ్ లైట్ వెలుగు సహాయంతో ముందు గదిలోకి వచ్చిన ధీరజ్ ఆ ఇంట్లో వారిని ఉద్దేశించి పిలిచాడు. జవాబుగా అవతల నుంచి ఏ పలుకూ లేదు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్లి.. ‘‘ఎవరండీ ఇంట్లో?’’ అడిగాడు. కిటికీ రెక్కలు రెండూ ధడేల్ ధడేల్ మంటూ కొట్టుకున్న చప్పుడు. వినిపించిన వైపు టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూశాడు. గడియ పడి ఉన్నాయి. ఇందాకే కదా.. అంత గట్టిగా కొట్టుకున్నాయి.. ఆ క్షణంలోనే ఎలా గడియ పడ్డాయి? విస్మయపోతూనే తెరవడానికి ప్రయత్నించాడు. కొన్నేళ్ల నుంచీ తుప్పు పట్టినట్టున్నాయి ఆ బోల్ట్స్. ఎంత తెరిచినా రావట్లేదు. ఇంకాస్త గట్టిగా లాగితే కిటికీలే ఊడొచ్చేంత పాతగా ఉన్నాయ్. బహుశా ఆ పెద్ద చప్పుడు తన భ్రమేమో అనుకుని ఇంకాస్త ముందుకు వెళ్లాడు టార్చ్ వెలుగులోనే. ఈ సారి ఓ మూల నుంచి కిర్రుమంటూ శబ్దం వినిపించింది . అటు వైపు మళ్లాడు. యుగాల నాటి పెద్ద గుమ్మాన్ని తలపించే ద్వారం. తలుపు ఓరగా తెరిచి ఉంది. దాని దరికి రాగానే ఒక్కసారిగా గబ్బిలాల కంపు.. లోపల్నించి గబ్బిలాల రెక్కల చప్పుడు.. ఎలుకల కిచకిచలు. ఆ గదిలోకి వెళ్దామనుకొనీ వెళ్లక వెనకడుగు వేశాడు. ఆ వాసనకు, శబ్దాలకు చీదర కలిగి. టార్చ్ను ఆ ఫోకస్ నుంచి తిప్పబోతూ ఆగిపోయాడు. ఆ గదిలో వెలుతురు పడ్డ మేర చాలా శుభ్రంగా.. మార్బుల్ ఫ్లోర్ మెరుస్తూ కనిపించింది. రెండడుగులు లోపలికి వేసి.. గదంతా టార్చ్ లైట్ తిప్పాడు. నీట్గా.. సాంబ్రాణి వాసనతో ఆహ్లాదంగా ఉంది. షాక్ అయ్యాడు ధీరజ్. గదిలోంచి వెనక్కి వచ్చాడు. మళ్లీ గబ్బిలాల కంపు.. ఎలుకలు.. కిచకిచలు..ఇంకోసారి పరీక్షిద్దామని లోపలికి వెళ్లబోతుంటే పైన గదిలోంచి శబ్దం... తూగుటుయ్యాల ఊగుతున్నట్టు.. కూయి.... కూయి.. అంటూ!మేడ పైకి ఎక్కేందుకు మెట్ల కోసం చూశాడు.. ఎక్కడా కనపడలేదు. గబగబా ఆ ఇంటి వెనక్కి వెళ్లాడు చీకట్లో అదే టార్చ్ లైట్ సహాయంతో. అక్కడా మెట్లు కనపడలేదు. కుడి వైపు.. ఎడమ వైపు.. ముందు వైపు.. అలా ఇంటికి నాలుగు దిక్కులా వెదికాడు.. ఎక్కడ మెట్ల ఆనవాలు లేదు. మరి మేడ మీద గది ఉన్నట్టు.. ఉయ్యాల ఊగుతున్నట్టూ చప్పుడేంటి... తన భ్రాంతా? అని సణుక్కుంటూ మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఇల్లంతా టార్చ్ తిప్పాడు. గోడలన్నీ మంటల్లో పొగచూరినట్టుగా నల్లగా ఉన్నాయి. ఒక్కసారిగా హాహాకారాలు.. అరుపులు.. కేకలు.. బిందెల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్న సౌండ్.. గాజుల గలగలలు.. గాబరాగా నడుస్తుంటే వచ్చే పాదాల పట్టీల చప్పుడు.. దిమ్మ తిరిగింది ధీరజ్కి.. మొహమంతా ముచ్చెమటలు... ఆ శబ్దం అంతకంతకూ ఎక్కువవుతూ.. అదంతా తన చుట్టే జరుగుతున్నట్టనిపించి ఒక్కసారిగా ఆ ఇంటి బయటకు పరిగెత్తాడు. వాకిట్లోకి రాగానే .. చెవుల్లోంచి ఎవరో ఆ గోలను తీసి అవతల పారేసినట్టు ప్రశాంతంగా అనిపించింది ధీరజ్కు. ఇందాకటి అలజడీ లేదు. వెనక్కి తిరిగి చూసే సాహసం చేయకుండా గేట్ తోసుకుంటూ రోడ్డు మీదకు వచ్చిపడ్డాడు.భయం భయంగానే ఆ ఇంటి వైపు చూశాడు. లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది కొత్త ఇల్లులా! చుట్టూ మొక్కలు.. చెట్లతో ముస్తాబై ఉంది.. ఎప్పటిలా! ధీరజ్కు ముప్పై ఏళ్లుంటాయి. ఇంకా పెళ్లి కాలేదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ వీధిలోకి కొత్తగా చేరాడు. ఆ కాలనీకి వచ్చినప్పుడే ఆ మేడ మీద ధీరజ్ కన్ను పడింది. అందంగా కంటే కూడా దృష్టిని ఆకర్షించే ప్రత్యేకతేదో ఉంది ఈ మేడ మీద అని అనుకునేవాడు దాన్ని చూసినప్పుడల్లా. రోజూ షూటింగ్స్ ముగించుకొని ఇంటికొచ్చే సరికి అర్ధరాత్రి అవుతుంది. వీధి మొదట్లోనే క్యాబ్ దిగి...వీధి చివర ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ మేడ ముందుకు రాగానే దాన్నే తిరిగి తిరిగి చూస్తూ ముందుకు సాగడం అతనికి ఇష్టం. రాత్రి పన్నెండు దాటినా ఆ ఇల్లంతా లైట్లతో వెలుగుతూంటుంది. అంత రాత్రీ మనుషుల అలికిడి ఉన్నట్టే కనిపిస్తుంది. తన ఇంటికి రెండిళ్ల ముందు ఉంటుంది ఈ మేడ. తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని అడిగాడు.. ‘‘ఆ ఇల్లు ఎవరిది?’’ అని. ఏమీ అర్థం కానట్టు ‘‘ఏ ఇల్లు సార్?’’ అంది ఆమె. ‘‘అదే ఆ మూడో ఇల్లు?’’ చేతితో ఆ డైరెక్షన్ను చూపిస్తూ మరీ అడిగాడు. ‘‘మూడో ఇల్లా?’’ అంటూ ముక్కున వేలేసుకొని అతను చూపించిన వైపు చూసింది ఆమె.నటిస్తోందా? నిజంగానే తెలియదా? సందేహిసూ ్త ఇక ఆ ఇంటి గురించి రెట్టించలేదు.!ఆ ఉదయం.. తను పాల పాకెట్ తీసుకొని వస్తూంటే కనిపించింది పనమ్మాయి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్తూ. మరి ఆ రోజు ఎందుకలా నటించింది? తను ఆ ఇంటి గురించి అడిగితే అసలు అక్కడ ఇల్లే లేనట్టు?.. అనే అనుమానం అతని మెదడులో లిప్తపాటు కదిలి మాయమైపోయింది. ఇప్పుడు.. రాత్రి.. షూటింగ్ నుంచి వస్తూ వస్తూ.. ‘‘ఎలాగైనా లోపలికి వెళ్లి.. ఆ ఇల్లు ఎలా ఉంటుందో? అంత రాత్రి పూటా లైట్లన్నిటినీ ఎందుకు వెలిగిస్తారో? అందులో ఎంత పెద్ద కుటుంబం ఉంటోందో? లాంటి జిజ్ఞాస ధీరజ్ను లోపలికి లాక్కెళ్లింది. ఆ ఇల్లు లోపల కూడా అంతే అందంగా ఉంటే బాగుంటే షూటింగ్కి ఇస్తారేమో కనుక్కోవాలి అనీ నిశ్చయించుకున్నాడు. తీరా లోపలికెళ్లాక చూస్తే.. భూత్ బంగ్లాలా బెదరగొట్టింది.. ఇంటికెలా వచ్చాడో తెలియదు. రాగానే ఫ్రిజ్ తెరిచి గటగటా మంచి నీళ్లు తాగాడు. మార్గశిర మంచులో కూడా గ్రీష్మ తాపం.. చెమటతో ఒళ్లంతా తడిసి ముద్దయిపోయింది. అలాగే సోఫాలో కూలబడ్డాడు.. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడు.. చీకటి.. ఆ చీకట్లో ఓ మేడ.. ఇంట్లో హాహాకారాలు.. గాజుల గలగలలు.. మువ్వల సవ్వడి.. తూగుటుయ్యాల ఊగుతూ.. కిటికీ రెక్కలు కొట్టుకుంటూ.. తలుపు కిర్రున తెరుచుకుంటూ.. ముక్కు పుటాలు అదిరే గబ్బిలాల కంపు.. ఎలుకల కదలికలు.. సాంబ్రాణి వాసన..ఒక్కసారిగా తల విదిలించి.. కళ్లు తెరిచాడు.. ఎదురుగా.. పనమ్మాయి.. నవ్వుతోంది.. తెరలు తెరలుగా! ‘‘అక్కడ ఇల్లు కనిపించిందా నీకు? అంటే నువ్వు నా వాడివే అన్నమాట. ఆ రోజు కట్నం చాల్లేదని పెళ్లి పీటల మీద నుంచి నువ్వు వెళ్లిపోయేసరికి .. అవమానంతో ఒంటికి నిప్పంటించుకున్నా. ఒంటిని కాలుస్తున్న ఆ మంటలను తట్టుకోలేక ఇల్లంతా పరిగెత్తా .. ప్చ్.. నాతో పాటు మా వాళ్లూ కాలి బూడిదైపోయారు తెలుసా?’’ అంటూ బాధగా గోడకు ఒరిగింది ఆమె...‘‘ఎప్పటికైనా నువ్వొస్తావని తెలుసు. అందుకే ఆ ఇల్లు వదిలిపెట్టలేదెవ్వరం! ఇన్నేళ్లకు వెదుక్కుంటూ వచ్చావ్. రా.. మనింటికి పోదాం...’’ అంటూ ధీరజ్ చేయి పట్టుకుంది. చేతి నిండా గాజులు.. పరీక్షగా చూశాడు ఆమెను.. పెళ్లి కూతురు అలంకరణలో ఉంది.‘‘హేయ్ .. ఎవరు నువ్వు? నా చేయి వదులు..’’ అంటూ చేయి విదిలిస్తున్నాడు. గొంతు పెగలట్లేదు.. చేయి కదలట్లేదు.. అరుస్తున్నాడు.. విదిలిస్తున్నాడు.. పట్టు బిగిస్తూ నవ్వుతోంది ఆమె.. గట్టిగా.. క్రూరంగా! సరస్వతి రమ -
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహాలు
సాక్షి, వనపర్తి: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మరో 48 గంటలు సమయం ఉండగానే జిల్లాలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, తమ కేడర్తో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని వేర్వేరు గ్రామాల్లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రధాన నాయకులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండలంలోని విరాయపల్లిలో నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటివరకు నాగర్కర్నూల్ పార్లమెంట్ లోస్సభ స్థానాన్ని కైవసం చేసుకోలేదు. ఈ స్థానం ఏర్పడిన 1962 నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేనంత మెజార్టీతో ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని, కేసీఆర్కు, కేటీఆర్కు బహుమతి ఇవ్వాలనే ఆలోచనతో మంత్రి నిరంజన్రెడ్డి ఉన్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గం ఎన్నికల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గెలుపు దిశగా పార్టీ శ్రేణులకు సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇటీవల భారీ మెజార్టీతో శాసన సభ్యుడిగా సాధించిన విజయం కంటే.. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకోవాలనే కసితో మంత్రి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో నాయకుల మధ్య మనస్పర్థలపై దృష్టి సారించారని, సర్ధిచెప్పినట్లు తెలుస్తోంది. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి, టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని సూచించారు. దీంతో అధికార పార్టీలో నాయకులు, కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల నుంచి కొంతకాలంగా దశలవారీగా.. ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరటంతో అధికార పార్టీకి పెద్దమందడి మండలంతో పాటు నియోజకవర్గంలో మరింత బలం పెరిగినట్లు తెలుస్తోంది. ఎలాగైనా నిలబెట్టుకుందాం.. ఇదిలా ఉండగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క స్థానం కొల్లాపూర్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఉన్న కాసింత పట్టుతోనే విజయం కేతనం ఎగుర వేసేందుకు కుస్తీ పట్టాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎన్నికల యుద్ధానికి నాయకులను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశంలో సూచనలు చేశారని తెలుస్తోంది. నేడు జిల్లా కేంద్రంలో మంత్రి సమావేశం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులను, కార్యకర్తలను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదివారం తన నివాసంలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి మండలాలతో పాటు వనపర్తి పట్టణ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. -
పోలింగ్ కేంద్రాలపై నజర్
సాక్షి, జనగామ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సజావుగా ఎన్నికలు నిర్వహించడం కోసం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాలపై నిఘాను ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల్లో ప్రశాంతమైన పోలింగ్ నిర్వహణ కోసం అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. జిల్లా పరిధిలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపడానికి పోలీస్శాఖ తమ చర్యలను మొదలు పెట్టింది. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 857 పోలింగ్ కేంద్రాలున్నాయి. గతంలో జరిగిన అల్లర్లు, గొడవలు, ఘర్షణల కారణంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 857 పోలింగ్ కేంద్రాల్లో 102 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి పరిశీలన తరువాత సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను విభజన చేయనున్నారు. బైండోవర్లకు రంగం సిద్ధం.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు బైండోవర్లు చేపట్టాడానికి రంగం సిద్ధంచేశారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు, రౌడీలు, మాజీలు, దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తులను బైండోవర్ చేయనున్నారు. 2018 శాసన సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4,938 మందిని బైండోవర్ చేశారు. జనవరి నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో 200 మందిని బైండోవర్ చేశారు. రెవెన్యూ శాఖను సమన్వయం చేసుకుంటూ బైండోవర్లను మరోమారు చేపట్టనున్నారు. నగదు, మద్యం రవాణాకు అడ్డుకట్ట.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరోధించడానికి నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు చెక్ పోస్టుల చొప్పున జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి, సిద్దిపేట–సూర్యాపేట రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొట్లాది రూపాయల నగదు పట్టుబడింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో అదేస్థాయిలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతోపాటు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. గ్రామాల్లో మద్యం నిల్వలు లేకుండా చూడడంపై దృష్టి సారించారు. మద్యం షాపుల నుంచి గ్రామాలకు తరలిపోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. రూ.33 లక్షలు పట్టివేత పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని పోలీసుల తనిఖీలో భాగంగా జనగామ పట్టణంలోని ఆర్ అండ్బీ అతిథి గృహం ఆవరణలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి కారులో తీసుకు వెళుతున్న రూ.33.03 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేశం తెలిపారు. ఆంజనేయులు కారులో నగదు తీసుకు వెళుతున్నాడనే సమాచారం పోలీసులకు వచ్చిందన్నారు. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పిస్తే.. ఎన్నికల అధికారులు విడుదల చేస్తారన్నారు. డబ్బులను ఫ్లయింగ్ స్కాడ్ కు అప్పగించినట్లు తెలిపారు. నిఘా పెంచుతున్నాం.. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా నిఘాను పెంచుతున్నాం. శాసనసభ, గ్రామ పంచా యతీ ఎన్నికలను శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు లేకుండా నిర్వహించగలిగాం. సమస్యాత్మక కేంద్రాల్లోనూ అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదు. జనగామ అసెంబ్లీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. గతంలో జరిగిన ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాసరెడ్డి, డీసీపీ జనగామ -
బ్రహ్మజ్ఞానమంటే...
ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేద బుద్ధి ఉంటుందా? ఎక్కడి నుండో ఓ సేటు (వ్యాపారి) బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటూ రావడం, సాయిని తొందరచేస్తూ.. వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు– అంటూ కంగారు పెట్టడం... ఈ కథనంతా విన్నాం కదా! ఆ సేటు వెళ్లిపోయాక ‘కాకా.. శ్యామా.. ఇంకా మరి కొందరు మసీదులోకి వచ్చాక సాయి ఆ అందరూ అడిగిన మీదట బ్రహ్మజ్ఞానమంటే ఏమిటో చెప్పడం ప్రారంభించాడు. ఈ కళ్లు ‘కళ్లు’ కావు! ఎంతో లోతుగా ఉన్న బావి (నుయ్యి) నుండి నీటిని బిందెతో లేదా చేదతో పైకి తెచ్చుకోవాలంటే బిందె బరువూ నీళ్ల బరువూ అనే రెండింటినీ పైకి లాగడం అనే కారణంగా మరింత బరువు జత అవుతుంది కదా! ఆ కారణంగా మామూలుగా మనం అలాంటి బిందె– చేదలని నేల మీద ఉన్నప్పుడు మోసెయ్యగలిగినా కూడా, నూతి నుండి తెచ్చుకోవాలంటే అది మూడు రెట్ల బరువుతో సమానమైన పనిగా అనిపిస్తుంది.ఇదంతా ఎందుకంటే ఏదో సామాన్యమైన విషయాన్ని తెలుసుకుంటూంటే అక్కడక్కడ కొంత విన్నా వినకున్నా కూడా మనకి అర్థం అయిపోతుంది– అయిపోవచ్చునేమో కానీ, అదే మరి గట్టిదీ ఎంతో అర్థమున్నదీ అయిన బ్రహ్మజ్ఞానం లాంటి విశేషాలని తెలుసుకోదలిస్తే ప్రతి అక్షరాన్నీ శ్రద్ధగా వింటూ ఉండవలసిందే. మీరందరూ అలాంటి శ్రద్ధ, విశ్వాసం కలవాళ్లు కాబట్టి కొద్దిగా తెలియజేస్తాను.ఉదాహరణకి మనందరికీ కళ్లున్నాయి కదా! ఆ కళ్లతో ఏం చేస్తాం.? ఎదుటి వ్యక్తినీ, వస్తువులనీ పదార్థాలనీ పశుపక్షి మృగ జంతువులనీ... ఇలా అన్నింటినీ చూస్తాం. అయితే ఓ వ్యక్తినో ఓ వస్తువునో... ఇలా పై వాటిని చూస్తే భౌతికరూపం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తున్నాడు? లావున్నాడు? సన్నగా ఉన్నాడు... వంటి విశేషాలే తెలుస్తాయి. అంతేతప్ప ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాడు? ఎంత హోదాలో ఉన్నవాడు?.. వంటివేమీ ఎవరో అతడ్ని గురించి చెప్తే గానీ తెలియవు కదా! అలా అతని గొప్పదనాన్ని గురించి మనకి తెలియనంత వరకూ అతడు ఓ సామాన్యుడనేదే కదా మన అభిప్రాయం. అయితే అది నిజమా? కాదుగా! ఈ నేపథ్యంతో మన కళ్లని మనం నిజమని నమ్మకూడదు. ఇలా చెప్తూంటే ఇది ఏదోలా అనిపించవచ్చు మనకి. అయినా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది.ఉదాహరణకి ఓ బంగారపు చంద్రహారం, ఉంగరం, వడ్డాణం... ఇలా ఎన్నో బంగారు ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఆ ఆభరణాలని కరిగిస్తేనో... అన్నీ బంగారపు ముద్దలై కూచుంటాయి. అది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.అదే తీరుగా మరో ఉదాహరణని చూద్దాం. సముద్రంలో కెరటాలు, బుడగలు, నురగలు, సుడిగుండాలు.. ఇలా కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ కెరటాలూ, బుడగలూ.. అన్నీ ఆగిపోతే కనిపించేవి నీళ్లే. నీళ్లే ఇలా మరో మరో తీరు రూపాన్ని ధరించి కెరటాలూ, బుడగలూ, నురగలూ ఇలా అవుతాయి. ఇది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.మరొక్క ఉదాహరణని కూడా చూసి విషయాన్ని తెలుసుకుందాం. కుండ, పిడత, మూకుడు... ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ అన్నింటినీ పగలగొడితే కనిపించేది మట్టి మాత్రమే కదా!అంటే ఏమన్నమాట? ఒక మూల పదార్థం అదే బంగారం, నీరు, మట్టీ... అనే ఇలాంటివన్నీ చంద్రహారం వడ్డాణం– కెరటాలు, నురగలు – కుండా పిడతా వంటివిగా మారుతున్నాయి. ఒక రూపాన్ని పొందినప్పుడు ఇదే తీరుగా బ్రహ్మపదార్థాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకుందాం. చెట్టూ పుట్టా పర్వతం, సముద్రం 84 లక్షల జీవరాసులూ... ఇలా కనిపిస్తున్నాయి కదా ప్రపంచంలో. ఇలా కనిపించడం భౌతికదృష్టి. ఈ ప్రపంచాన్ని అలా ఒకటిగా కలిపి ముద్ద చేసేస్తే (అది ప్రళయకాలంలో జరుగుతుంది) అది బ్రహ్మపదార్థం (బంగారం నీరూ మట్టీ లాగా అన్నమాట). అంటే ఏది మూల పదార్థమో అది బ్రహ్మపదార్థం. ఏది వికృత పదార్థమో అది మనకి భౌతికదృష్టికి కనిపించే పదార్థమన్నమాట. ఈ దృష్టి మనకి గాఢంగా కలిగినప్పుడు చెట్టూ పుట్టా మనిషీ జంతువూ అనే భేదభావం ఏర్పడదు. చంద్రహారం కంటే వడ్డాణం వేరు కాదు– దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది బంగారమే కాబట్టి. అయితే పేరు, రూపం మాత్రమే వేరు. అలాగే కెరటమూ నురుగూ కూడా వేరు కాదు. దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది నీరే కాబట్టి.ఈ దృష్టిని మన కళ్లకి బాగా పట్టించినట్లయితే కుక్క, పాము, పక్షి, చేప, మనిషి... ఇలా కనిపించే అన్నింటిలోనూ కూడా పైకి కనిపించే(పేరూ రూపమూ ఆకృతీ...) రూపాన్ని తొలగించి చూస్తే అంతా బ్రహ్మపదార్థమే అని అర్థమవుతుంది. ఇది నిజం కాబట్టే మనకంటూ తెచ్చుకున్న ఆహారపదార్థాలని కుక్కలు, పిల్లులు, ఎలుకలు... ఇలా ఏవి తింటున్నా... మూల పదార్థ దృష్టితో చూస్తే అవన్నీ కూడా బ్రహ్మపదార్థం నుండి వచ్చినవే కాబట్టి– ఏ విధంగానూ మనకంటే వేరు కావు. రూపాన్ని బట్టి పేరుని బట్టీ వేరువేరు పేర్లతో పిలువబడుతున్నాయి తప్ప అన్నీ ఒకటే నిజానికి. ఒకే భూమి నుండి పూల చెట్లూ, పళ్ల చెట్లూ, తీగల పాదూ... పుడుతున్నాయో అదే తీరుగా బ్రహ్మపదార్థం ఒకటే అయినా దాని నుండి వచ్చే రూపాలని బట్టి పేర్లు మారుతుంటాయనేది సత్యం.నాలో ఉన్న బ్రహ్మపదార్థమే మీలోనూ ఉంది. అయితే పేర్లు మారడం కారణంగా ఇతను శ్యామా, అతను కాకా, మరొకతను గోల్కరే... అని ఇలా అందరి చేతా పిలిపించుకో బడుతున్నారు. నిజానికి ఈ అందరూ ఒకే బ్రహ్మపదార్థానికి సంబంధించిన వాళ్లే. ఈ దృష్టే గనుక మనకి గాఢంగా కలిగితే మరొకనికి కష్టాన్ని కలిగిద్దామనీ, మరొకనికి హానిని తలపెడదామనీ, ఏ ఒకరిద్దరికి మాత్రమే సహాయపడుదామనీ... ఆ తీరు ఆలోచన రాదు.’ వసుధైక కుటుంబక’ మనే మాట ఒకటుంది. వసుధ అంటే భూమి అని అర్థం. ‘ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబానికి చెందినదే సుమా!’ అని దానర్థం. ఈ దృష్టికి రాగలిగినప్పుడు ఎవరికైనా ద్రోహాన్ని తలపెడితే మనకి మనమే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్నామని అర్థమవుతుంది. దాంతో ద్రోహాన్ని తలపెట్టనేలేరు. అప్పుడు సర్వసమానభావం (ఎవరికి ద్రోహాన్ని తలపెట్టినా తనకి తానే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్న భావం) అలవడుతుంది. ఇదంతా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే ఒక తీరు విధానం. కాబట్టి మన కళ్లు ‘కళ్లు’ కావు. దృష్టి మారిన కళ్లు కావాలన్నమాట. ఇది ఒక తీరు. ఇక మరో తీరులో కూడా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే వీలుంది. ఇదేం శ్లోకం? మనందరికీ ప్రసిద్ధంగా తెలిసిన ఓ శ్లోకముంది.‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అనేది.సృష్టించేవాడు బ్రహ్మ. ఆయన పురుషుడే. రక్షించేవాడు విష్ణువు. ఆయనా పురుషుడే. లయింపజేసేవాడు శివుడు. ఆయనా పురుషుడే. పుట్టుక, రక్షణ, మరణం అనే మూడు క్రియలూ అయిపోతే ఇక మిగిలిందేమిటి? ఏం చేయవలసి ఉంది? లేదు కదా! మరి శ్లోకం అక్కడితో ముగిసిపోకుండా ‘సాక్షాత్పరబ్రహ్మ’ అనే ఒక మాట ద్వారా ఆ పరబ్రహ్మని గురువుగా చెప్పడమేమిటి? ఈ పరబ్రహ్మ పురుషుడా? స్త్రీ నా? లేక నపుంసకధర్మంతో ఉన్నవాడా? అని ఈ తీరుగా ఆలోచిస్తే తెలుస్తుంది బ్రహ్మపదార్థమేమిటో!?కొంత విసుగ్గా అర్థమయ్యీ కానట్టుగా అనిపించినా కొద్ది ఓపిక పడితే తెలుస్తుంది. తెలిశాక మన ఆలోచనా విధానమే మారుతుంది.పైన ఆకాశముంది. ఉందా? అంటే లేదు. ఎందుకని? కనిపిస్తూ.. ఉన్నట్లుగా ఉంటూ.. ఎప్పటికీ కనిపించకుండా ఉండేదే ఆకాశం కాబట్టి. ఆ మాటకొస్తే ఆకాశమనే మాటకి అర్థమే ‘శూన్యం’ అని. ఆ ఆకాశాన్ని పట్టుకుని వేలాడుతూ పగటివేళ సూర్యుడూ రాత్రివేళ చంద్రుడూ మనకి కనిపిస్తున్నారా? ఈ ఇద్దరూ కూడా ఏ మాత్రపు క్షణమాలస్యం కూడా చేయకుండా – ఎంతటి చలికాలమైనా, ఎండ కాలమైనా, వర్షకాలమైనా– వచ్చి కనిపిస్తూ ఉంటారా? వీళ్లు కాక ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు.. ఇలా ఎన్నో ఆ ఆకాశాన్ని పట్టుకుని అతుక్కుని కనిపిస్తూ ఉంటే ఆకాశాన్ని శూన్యపదార్థమని ఎలా అనగలం?కాబట్టి కనిపించని దాంట్లో కనిపించేదేదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని చూడగలగడం బ్రహ్మజ్ఞానం. పైగా నవగ్రహాలుంటాయక్కడే. పోనీ అవన్నీ ఓ వరుసలో నడుస్తున్న వ్యక్తుల్లా పక్క పక్కన లేక కొన్ని సమానమైన వరసల్లోనో నడుస్తారా? అంటే కానే కాదు. వాళ్లకి వాళ్లు నడవరు. నడిచేలా చేయబడతారు. అంటే వాళ్ల ప్రయత్నం ఏమీ లేకుండా వాహనం కదులుతుంటే దాంట్లో ఉన్న మనం ఏ మాత్రమూ కదలకుండా ఉంటామో, అయినా కదులుతూ వెళ్తున్నామో అలా నడిపింపబడుతూ ఉంటాయి. పోనీ ఒకే వరుసలో ఒకే పద్ధతిలో ఉంటాయా? అంటే కానేకాదు. కొందరు తూర్పుని చూస్తుంటే (శుక్రుడూ రవీ) మరి కొందరు పశ్చిమాన్ని చూస్తుంటే (శనిచంద్రులు) ఇంకొందరు ఉత్తరాన్ని చూస్తుంటే (బుధగురులు) మిగిలిన వాళ్లు దక్షిణముఖంగా ఉంటారా? వీళ్లలో కొందరు ఒక వేగంతో మరి కొందరు మరి కొంత వేగంతో ఇంకొందరు మరీ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారా? వీళ్లలో కొందరు సూర్యునికి ప్రదక్షిణాకారంతో కొందరు అప్రదక్షిణాకారంతో తిరుగుతారా? ఇలా తిరుగుతున్నా కూడా ఏనాడూ ఒకరినొకరు గుద్దుకోనే గుద్దుకోరా? ఈ నిర్మాణం ఎవరిది? ఈ నిర్వహణ ఎవరిది? వీళ్లే కనిపించని వాళ్లవుతుంటే వీళ్లని నిర్వహించే ఆయనెక్కడ కనిపిస్తాడు? ఈ తీరుగా ఆలోచిస్తూ పోతే ఓ అదృశ్య శక్తి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. అదే బ్రహ్మం. దీన్నే అదృశ్యుడుగా ఉన్న దైవంగా భావిస్తారు లౌకిక దృష్టితో జనమంతా. ఈ నిర్మాణాన్నీ వ్యవస్థనీ నిర్వహణా విధానాన్నీ ఏ మాత్రమూ గమనించకుండా ఆ శక్తికి ఓ పేరు పెట్టుకుని ఈయన చదువునీ ఆమె డబ్బునీ ఫలాని ఆయన ఆరోగ్యాన్నీ... ఇలా ఇస్తుంటారని పూజల్నీ పురస్కారాల్నీ, మళ్లీ వాటిని కూడా అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తూ పోతూ ఉండటమా? హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం కానే కాదు నా లక్ష్యం. సరిగా ఆ ధర్మాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారా? అనేదే నా ఆందోళన.అందుకే పైన అనుకున్న శ్లోకం ఓ మాటని చెప్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎంతో గొప్పగా అనుకుంటున్నా వాళ్లని కూడా నడిపించే బ్రహ్మపదార్థ మొకటుందని గమనించవలసి ఉందనీ, ఆయన్నే గురువుగా భావిస్తూ నమస్కరిస్తూ ఉండవలసిందనీను.ఆ పరబ్రహ్మనే కొందరు రాముడు, కృష్ణుడూ అంటుంటే మరికొందరు అల్లా అంటూంటారు. రాముడూ కృష్ణుడూ ఓ ప్రత్యేకమైన నిర్మాణ విధానంలో ఉన్న ఆలయాల్లో ఉంటూ ఉంటే, అల్లాహ్ మరో ప్రత్యేకమైన నిర్మాణవిధానంలో ఉన్న మసీదుల్లో ఉంటాడు. విధానం ఒక్కటే. రూపాలు వేరు. నివాసాలు వేరు. ఈ ప్రాంతం వాళ్లు జొన్నల్ని తింటే ఆ ప్రాంతం వాళ్లు గోధుమల్ని తింటే ఇంకో ప్రాంతం వాళ్లు వరి అన్నాన్ని తింటే ఆ తినబడే దాన్ని కొందరు అన్నమన్నారు. కొందరు రొట్టెలన్నారు. ఇంకొందరు మరో పేరుతో పిలిచారు. ఏమైనా ఈ భిన్నభిన్నతీరులున్నవన్నీ ఆకలిని పోగొట్టేందుకే కదా! ఈ దృష్టిగాని మనకి కలిగితే అప్పుడు ఈ విధానమంతా బ్రహ్మమే అనే ఆలోచనకి రాగలం. అందుకే ‘అల్లాహో మాలిక్’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండే నాకు ‘రాజారామ్ రాజారామ్’ అనే మంత్రం వేరుగా అనిపించదు. ఖాపర్దే భార్యకి ఇదే మంత్రాన్నిచ్చాను కూడా. హేమాడ్ పంత్ పుట్టుకకి బ్రాహ్మణుడయ్యుండీ సాయబునీ ఫకీరునీ అయిన నన్ను హిందూ దేవాలయ అర్చకుడయ్యుండీ ‘యా సాయీ!’ అని మరాఠీ భాషలో నన్నాహ్వానించినపుడు అందుకే ఆనందపడ్డాను– ‘ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టే సర్వదేవతలనీ ఒకే తీరుగా లెక్కించే గొప్పగుణం కలిగి కనిపిస్తున్నాడని.ఈ బ్రహ్మజ్ఞానమే మనకి కలిగిన రోజున మతద్వేషాలు దైవనిందలు దండయాత్రలు దేవాలయధ్వంసాలు మసీదుల్ని కూలగొట్టడాలు వంటివి ఉండనే ఉండవు. ఖురాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో సొంత బిడ్డలా చేతితో పట్టుకుంటామో అదే తీరుగా భగవద్గీతని కూడా చేతిలోకి తీసుకోగలుగుతాం.అంత దాకా ఎందుకు? నేను మొదటిసారి పెళ్లి వాళ్ల గుంపుతో షిర్డీకి వచ్చినప్పుడు ఈయనకి విడిది ఎక్కడియ్యాలా? అని అందరూ సంశయపడుతూ ఉంటేనూ, ఖండోబా దేవాలయ అర్చకుడు హేమాడ్పంత్ ‘పోనీ! ఈ ఆలయంలో ఓ గదిని కేటాయిద్దామా?’ అని ఆలోచిస్తూ ఉంటేనూ అందరూ కూడా ‘అతను సాయబు’ కాబట్టి పొరపాటున కూడా ఇక్కడికి రానియ్యద్దన్నారు. నేనూ అక్కడ ఉండదలచలేదు వారు ఉండవలసిందంటూ ఒకవేళ కోరినా. ఇది హిందువుల అజ్ఞాన దృష్టి అని నేననను.‘నువ్వు హిందూ దేవతలని కూడా కొలుస్తూ దేవతలని గురించి ప్రశంసిస్తూ దేవాలయాలకి వెళ్తూ ఆ మతం వాళ్లకి భోజనాలని పెడుతూ వాళ్లతో కలిసి మమేకంగా తిరుగుతూ కనిపిస్తున్నావు కాబట్టి మసీదు మెట్లని ఎక్కనియ్యం’ అంటూ మా వాళ్లు కూడా నన్ను రానీయలేదు. దాన్ని కూడా వారి అజ్ఞానమని నేననను. ఇంట్లో పిల్లవాడు తెలిసి తెలియని వయసులో కేవలం ఆటలమీదే దృష్టి ఉన్న దశలో బడికి వెళ్లనే వెళ్లనంటూ మారాం చేయడమే కాక ఏడుస్తూ చేతికి దొరికిన ప్రతి వస్తువునీ దూరంగా గిరవాటువేస్తున్న వేళ తల్లి మాత్రమే వాడికి పక్కవాళ్ల పిల్లల్నీ చదువుకున్న గొప్పవాళ్లనీ.... ఇలా చూపించి అర్థమయ్యేలా చెప్పి వాడంతట వాడే బడికి వెళ్లేలా చేస్తోంది. అదుగో అలాంటి బాల్యదశలో ఉన్నవాళ్లే ఈ భేదభావంతోనూ బ్రహ్మజ్ఞాన దృష్టి లేకుండానూ ఉంటారు– కనిపిస్తున్నారు కూడా. అది వాళ్ల తప్పు కాదు. వాళ్లకి సదవగాహన కలిగేలా చెప్పకపోవటం మన తప్పు మాత్రమే. అందుకే నా ఈ ప్రయత్నాలన్నీ. మసీదులో తులసి మొక్కా, హోమగుండానికి సంకేతరూపంగా ధునీ, భజనలకి ప్రతిరూపంగా నామజపం, భేదభావాలు రాకుండా వ్యాపించకుండా ఉండేందుకోసం– సాయబులకి ప్రీతి పాత్రమైన చందనోత్సవంతో హిందువులకిష్టమైన దైవకల్యాణాలూ– శ్రీరామనవమి ఉత్సవం రోజునే ఉరుసు ఉత్సవం... వంటివన్నీ జరుపుతున్నాం మసీదులో. ఇలా క్రమక్రమంగా మనం బుద్ధిలో అవగాహన పెంచుకోగలిగితే ఇక భేదభావం ఎక్కడుంటుంది?ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేదబుద్ధి ఉంటుందా? ఉండగలుగుతుందా? ఆ ఏకత్వ దృష్టిని సాధించడమే బ్రహ్మజ్ఞానమంటారు. (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
సేవల విస్తృతిపై అపోలో ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆసుపత్రుల విస్తరణ కంటే సేవల విస్తృతిపైనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్ చేస్తామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న ఆమె ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆసుపత్రుల పరంగా దేశంలో మేమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. అవసరమైన చోట హాస్పిటల్, ఫార్మసీల ఏర్పాటు ప్రక్రియ సహజంగా జరుగుతుంది. దానికంటే ముఖ్యంగా ఇప్పుడున్న మొత్తం ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవటంపై దృష్టి సారిస్తాం. హెల్త్ చెకప్స్ను ప్రమోట్ చేయడం, జన్యు ఔషధాలు, రోగుల ఇంటెస్టిన్ (ప్రేగు) అధ్యయనం ప్రధానాంశాలుగా చేసుకున్నాం. ఒక అడుగు ముందుకేసి వైద్య సేవల రంగాన్ని నిర్వచిస్తాం. చెన్నైలో అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ను 150 పడకల సామర్థ్యంతో నెలకొల్పాం. దక్షిణాసియాలో ఇది తొలి ప్రోటాన్ థెరపీ సెంటర్. క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక పెన్సిల్ బీమ్ టెక్నాలజీని వాడుతున్నాం. లక్నోలో 250 పడకలతో ఏర్పాటవుతున్న ఆసుపత్రి రెండు నెలల్లో ప్రారంభం కానుంది’ అని సంగీత రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో లాజిస్టిక్స్ పార్కులు తెలంగాణలో మరో రెండు లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అదానీ గ్రూప్, టెక్స్టైల్ రంగ సంస్థ వెల్స్పన్ గ్రూప్ వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడించారు. బుధవారమిక్కడ జరిగిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విషయం చెప్పారు. ‘తెలంగాణకు గడిచిన నాలుగున్నరేళ్లలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 60 శాతం కార్యరూపం దాల్చాయి. రానున్న కాలంలో ఇది 90–95 శాతానికి వెళ్తుందన్న నమ్మకం ఉంది. కొన్ని కంపెనీలు రెండు, మూడవ దఫా కూడా విస్తరించాయి. ఈ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానమే ఇందుకు కారణం. ఏడు కేసుల్లో మినహా 8,500 పైచిలుకు కంపెనీలకు 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేశాం’ అని గుర్తు చేశారు. -
ఆరోగ్యమస్తు
ఒకప్పుడు సౌందర్యంపైనే మక్కువ చూపిన మహిళలు నేడు శారీరక ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నారు. పురుషులకు దీటుగా మహిళలు సైతం వ్యాయామంతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సులపై ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఉదయం..సాయంత్రం వేళల్లో తీరిక దొరికినప్పుడు వాకింగ్ చేస్తూ ఒబెసిటీ లాంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): నిత్యం ఒడిదుడుకుల జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడం, ఆహార అలవాట్ల కారణంగా అత్యధిక శాతం మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఒబెసిటీ బారిన పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధిక శాతం ఉంటున్నట్లు అంచనా. నగర జనాభాలో 33 శాతం మంది ఒబెసీటీతో బాధపడుతుంటే మహిళలు 40 శాతంగా ఉన్నట్లు అంచనా. ఒబెసిటీ మహిళల్లో 13 నుంచి 18 ఏళ్ల వారు 20 శాతం మందిæ, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారు 33 శాతం మంది, 35 ఆ పైన వయస్సు కలిగిన వారు 40 శాతం మంది ఉన్నట్లు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్ వంటి వ్యా«ధులతో పాటు నడుంనొప్పి వంటి సమస్యలు వీరు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీని అధిగమించేందుకు మహిళలు ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నారు. వ్యాయామంపై ప్రత్యేక దృష్టి ఉదయం, సాయంత్రం పురుషులతో పాటు, మహిళలు వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తున్న వారిలో 45 ఏళ్లు పైబడినవారు ఉంటున్నారు. కాగా 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు ఏరోబిక్ చేస్తుండగా, యువత జుంబా డ్యాన్స్పై మక్కువ చూపుతున్నారు. దీంతో మహిళల కోసం ప్రత్యేక ఫిట్నెస్ సెంటర్లతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సు సెంటర్లు వెలుస్తున్నాయి. ఫిట్నెస్కు ప్రత్యేక ప్రొగ్రామ్స్ ► మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రొగ్రామ్స్ను అమలు చేస్తున్నారు. నిర్ధేశిత సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఫిట్నెస్కు ప్రయత్నిస్తున్నారు. ► గర్భిణులు ప్రసవం ముందు, ప్రసవం తర్వాత పెల్విస్ ఫ్లోర్ మజిల్స్ ఎక్స్ర్సైజ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సుఖప్రసవం జరిగేలా మజిల్స్ను సిద్ధంచేయడంతో పాటు ప్రసవం తర్వాత చర్మం యథాస్థితికి చేరుకునేందుకు పోస్ట్నేటల్ పెల్విస్ ఫ్లోర్ మజిల్స్ ఎక్స్ర్సైజ్ ఎంతగానో దోహదం చేస్తుంది. ► ప్రస్తుతం హార్మోన్ల లోపంతో సంతానలేమితో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారు మందులు వాడాల్సిన అవసరం లేకుండా వ్యాయామం, ఒత్తిడిని అధిగమించే టెక్నిక్స్, మెడిటేషన్ ద్వారా హార్మోన్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తున్నారు. ఇవి చాలా మందిలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ► పిల్లల్లో అధికశాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. అలాంటి వారికోసం అనేక వ్యాయామాలతో పాటు క్రీడల్లో భాగస్వామ్యం కల్పించేలా పలువురు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. జ పీసీఓడీ సమస్యతో నెలసరి సరిగా రాని వారికి లైఫ్ స్టయిల్ మోడిఫికేషన్, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటి పక్రియల ద్వారా సక్రమంగా వచ్చేలా చేయవచ్చునని వైద్యులు చెపుతున్నారు. ► అధిక బరువులో బాధపడుతున్న మహిళలు ఏరోబిక్పై ఆసక్తి చూపుతున్నారు. రోజుకి 20 నుంచి 35 నిమిషాలు ఎరోబిక్ చేయడం ద్వారా వెయిట్లాస్తో పాటు, ఒత్తిడిని అదిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ► జుంబా డ్యాన్స్పై ప్రస్తుతం యువతలో క్రేజ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారు జుంబా డ్యాన్స్ చేస్తున్నారు. అధిక బరువుతో బాధపడే వారు జుంబా డ్యాన్స్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు. వ్యాయామంతో ఎన్నో ఉపయోగాలు వ్యాయామం, ఏరోబిక్ చేయడం ద్వారా ఫిట్నెస్తో పాటు, ఒత్తిడిని అధిగమించవచ్చు. మెడిటేషన్, యోగాపై సైతం మహిళలు దృష్టి సారిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు, అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.గర్భిణులు సుఖప్రసవం కోసం ప్రీనేటల్, పోస్ట్నేటల్ పెల్విస్ ప్లోర్ వ్యాయామంపై మహిళలకు మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రసవం అనంతరం శరీర ఆకృతిలో మార్పులను నివారించేందుకు మంచి వ్యాయామ పద్ధతులు ఉన్నాయి. – డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరపిస్ట్ -
బంధించేదీ... విముక్తి కలిగించేదీ..!
ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్! పురాణం విందాం రారా’’ అని లోపలకి వెళ్లి కూర్చున్నాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగి చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక జూదగృహం వద్దకెళ్లాడు. కాని అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ల ప్రవర్తన అతనికి ఎబ్బెట్టుగా తోచాయి.‘ఛీ! ఎంత సిగ్గుచేటు, నా స్నేహితుడు పవిత్రమైన పురాణాన్ని వింటూ, సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేమో ఇక్కడికొచ్చి చేరాను’ అని పశ్చాత్తాప పడ్డాడు. ఇక రెండవ వాడేమో, పురాణం వింటున్నాడు కానీ, కాసేపటికి మనసులో ఏదో పురుగు తొలిచింది. అతని దృష్టి కాస్తా పురాణం మీదినుంచి స్నేహితుడిమీద, అతను వెళ్లిన ప్రదేశం మీదా మళ్లింది. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. ఎప్పుడో జరిగిపోయిన పాత కథలను వింటూ ఇక్కడ కూర్చుండిపోయాను. వాడు ఏ వ్యభిచార గృహంలోనో, జూదగృహంలోనో హాయిగా కాలక్షేపం చేస్తున్నట్టున్నాడు’ అని వాపోయాడు. కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు.యమభటులు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుంటూ పోతే, జూదగృహానికి వెళ్లిన వాడి జీవాన్ని విష్ణుభటులు సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లారు. భగవంతుడు మనిషిలో చూసేది అతనిలోని పవిత్రమైన భావాలను, నిర్మలమైన భక్తిని మాత్రమే. మనల్ని బంధించేదీ, విముక్తి కలిగించేదీ కూడా మనస్సే. మనసును అదుపులో పెట్టుకోగలిగితే చాలు... అంతా సౌఖ్యమే, ఆనందమే. -
శిష్యుడికే శిష్యుడైన సాయి
ఏం చిత్రమో గానీ సాయి చేసే లీలలు ఓ పట్టాన అర్థం కావు. కొద్ది లోతుగా ఆలోచిస్తే అర్థం కాకుండానూ ఉండవు. ‘లో’ అర్థం గాని తెలిసిందా.. ఇక జీవితాంతం గుర్తుంచుకోవల్సినంత గుర్తుంచుకునేంత అనుభవసంపద అందులో దాగి ఉంటుంది.అందుక్కాదూ పదులు వందలుగా, వందలు వేలుగా, వేలు లక్షలుగా, లక్షలు కోట్లుగా భక్తులు వచ్చి సాయిని దర్శిస్తున్నారు! ఈ నేపథ్యంలో ఓ కుమ్మరిపురుగు లాంటివాణ్ణి గురువుగా చేసుకుని సేవ చేసిన తుమ్మెదలాంటి సాయి చరిత్రని తెలుసుకుందాం! పరివర్తన ప్రతి వ్యక్తికీ జీవించిన మొత్తం కాలం ఒక్కలానే ఉండదు. మార్పులకి గురి అవుతూనే ఉంటుంది. ఒక్కో మార్పు ఒక్కో అనుభవాన్ని అందిస్తుంది. సాయి తన యవ్వనంలో పహిల్వాన్లా ఉండాలనుకుంటూ అలాంటి దుస్తుల్నే వేసుకుంటూ, జుట్టుని కూడా అలాగే పెంచుకుంటూ అందరికీ ఓ పహిల్వాన్లాగానే పై దృష్టికి అన్పించేవాడు. ఆ కాలంలో షిర్డీలో కుస్తీపోటీలు ఎక్కువ సంఖ్యలో సాగుతూ ఉండేవి. వేటితో మనకి దగ్గరతనముంటే ఆ లక్షణాలు మనకి ఎక్కువ అలవడుతాయనేది నిజం కదా! ఈ వస్త్రధారణ , జుట్టుపెంచడం మనసులో పహిల్వాన్ ఆలోచనలూ కారణంగా కుస్తీపోటీల్లో పాల్గొనాలని అన్పించింది సాయికి. అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఓ సారి తమలపాకులు, వక్కలు అమ్ముకుని వ్యాపారం చేస్తుండే మొహిద్దీన్ అనే వ్యాపారితో వాదం వచ్చింది. లోపల కుస్తీ పట్టాలనే ప్రబలమైన ఊహ ఉంది కదా! దాంతో వాదాన్ని పెంచుకున్నారిద్దరూ. కలియబడ్డారు. కుస్తీ పోటీలో తన వృత్తిగా కల మొహిద్దీన్ చేతిలో సాయి ఓడిపోయాడు. అంతే! పగ పెరగలేదు. ద్వేషం రగలలేదు. ఇంక కొంతమందిని కూడగట్టుకుని దొంగదెబ్బ తీసి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనిపించలేదు సాయికి. ఆలోచన సాగింది ఇలా..! నేనూ అతనూ కలియబడ్డాం. ఒకరినొకరు తన్నుకున్నాం కాళ్లతో. పిడికిళ్లతో పరస్పరం గుద్దుకున్నాం. జుట్టూ జుట్టూ పుచ్చుకుని కొట్టుకున్నాం. ఇదా నా సంస్కారం? ఇదా నేను సాధించదలిచిన దానికి ఎన్నుకున్న మార్గం? నేను సక్రమంగా సరైనమార్గంలో ఉంటూ పదిమందిని ఆ మార్గంలో నడిపించాల్సి ఉంటే దానికి ఎంచుకున్న మార్గం ఎంత హేయంగా ఉంది!’ అని తనని గురించి తానే సిగ్గుపడుతూ పరాభవించుకుంటూ కుస్తీవైపుకి దృష్టిని పోనియ్యకూడదనే నిర్ణయానికొచ్చాడు. ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పహిల్వాన్ దుస్తుల్ని తొలగించాడు. కఫనీ (శరీరం పొడవునా ఉండే పెద్ద లాల్చీ)ని ధరించాడు. లోపల కౌపీనాన్ని పెట్టుకున్నాడు.ఇదేకాలంలో ఓ సారి ‘గంగాగీర్’ అనే అతనిక్కూడా కుస్తీల మోజు పెద్దగా ఉండేది. దాంతో ఎక్కడ కుస్తీపట్లున్నా (షిర్డీలో ఈ వినోదం ఎక్కువ) వెళ్తూ ఉండేవాడు. ఓ సారి ఓ యోధునితో కుస్తీపట్టు పడుతుంటే గంగాగీర్కి ఓ ఆకాశవాణి చెప్పిందా? అన్నట్లు ఓ వాక్యం విన్పించింది! ‘‘వెర్రివాడా! భగవంతునితో కుస్తీ పడుతూ(క్రీడిస్తూ) ఈ దేహాన్ని విడిచేసినా అది గొప్పపని అవుతుంది గానీ ఇది ఓ క్రీడా? దీనిలో వచ్చే జయం విజయమా?’’ అని. అంతే! గంగాగీర్కి ఆ క్షణంలోనే జ్ఞానోదయమయింది. కావాలని కుస్తీలో ఓడిపోయాడు. కాలక్రమంలో సంసారాన్ని విడిచేసాడు. భగవంతునితో క్రీడిస్తూ (వినోదిస్తూ) ఉండాలనే నిర్ణయానికి అనుగుణంగా ‘పుణతాంబే’ అనే పవిత్ర స్థలంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని శిష్యులతో అక్కడే ఉండసాగాడు. ఇదంతా ఎందుకంటే ఏ వ్యక్తికైనా మంచిరోజులు రాబోతుంటే ‘పరివర్తన’ అనూహ్యంగా కలుగుతుందని చెప్పడానికే. ఖురాన్ పండితుని రాక ఇదిలా ఉండగా ‘రహతా’ అనే పేరున్న గ్రామానికి అహమద్నగర్ నుండి ‘జవహర్ అలీ’ అనే ఫకీరు (సాధువు) కొందరు శిష్యులతో సహా వచ్చాడు. ఎక్కడ తానుండాలా? ఉంటే బాగుంటుందా? మంచి ప్రచారం సాగుతుందా? అని గమనించి రహతా గ్రామంలోని వీరభద్రమందిరానికి దగ్గర్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కువమంది భక్తులొచ్చే ఆ మందిర సమీపంలో ఉంటే తనకి ప్రచారం బాగా ఉంటుందనేదే అలీ ఆలోచన.ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఫకీరైన అలీ సామాన్యుడు కాడు. మంచి పండితుడు. కురానే–ఎ–శరీఫ్ (ఖురాన్) అతనికి కంఠస్థం (కంఠంలో ఉంటుంది. ఎక్కడ అడిగితే అక్కడి ఆ గ్రంథంలోని విషయాన్ని పుస్తకాన్ని చూడకుండా చెప్పగలతనం). ఆ కారణంగా భక్తులు తెలుసుకోవాలనే తపనతో (జిజ్ఞాస) ఏ అనుమానాన్ని అడిగినా కురాన్–ఎ–శరీఫ్ని అవలీలగా ఆశువుగా చెప్పేస్తూ ఆ ప్రశ్నకి లేదా సందేహానికి సమాధానాన్ని సరిగ్గా అతుక్కుపోయేలా చెప్పి అందర్నీ తక్కువకాలంలో ఆకట్టేసుకున్నాడు. నిజం కూడా అంతేగా! సందేహాల్ని తీర్చగల సమర్థుణ్ణి అందరూ ఆసక్తితో సమీపిస్తారు గదా! దాంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తూండడం, ఆయన్ని గౌరవిస్తూండడం, కానుకలని సమర్పిస్తూ ఉండడం.. ఇలా ఆయన ప్రాచుర్యం ప్రసిద్ధి బాగా పెరిగిపోయింది. ఎప్పుడూ ప్రతివ్యక్తీ తనని తాను అదుపు చేసుకోవాల్సి ఉండేది పెరుగుదలలోనే. నిచ్చెనని ఎక్కుతూ వెళ్లేవానికి పడిపోయే ప్రమాదముంటుంది. గానీ నేల మీద నిలబడ్డవానికి ఏముంటుంది పడిపోతాననే భయం? అలీ అనే గురువుకి ఈ భక్తుల ఆదరణ పెరుగుతుండేసరికి ఓ దురాలోచన రానే వచ్చింది. వీరభద్రమందిరానికి (ఆలయం అనుకోవచ్చు) దగ్గరగా మహమ్మదీయ సంప్రదాయం ప్రకారం నిలబడి ప్రార్థించే ఓ గోడ (ఈద్గా)ని నిర్మించాలని నిర్ణయించాడు. భక్తుల అండదండలున్నాయి గదా! అనేదే అతని దృఢనిశ్చయం. మహమ్మదీయులంతా ‘ఈద్–ఉల్–ఫితర్’ అనే పండుగరోజున సామూహికంగా నిలిచి ప్రార్థించే పవిత్రస్థలమే ‘ఈద్గా’ అంటే. ఈ ఫకీర్ రహతాకి రావడం, గ్రామ ప్రజల్ని లోబరుచుకోవడం, ఆకర్షణకి గురయ్యే విధంగా చేసుకోవడం, ఆ క్రమంలో మహమ్మదీయ సంప్రదాయ ధోరణిలో ‘ఈద్గా’ని నిర్మించదలపెట్టడంతో హైందవ భక్తులకి కళ్లు విప్పారాయి. నిద్రావస్థలో ఉన్నామనే అభిప్రాయం సామూహికంగా కలిగింది. ఇంకా ఏ స్థితికి అలీ వెళ్లిపోతూ ఇంకెంత అథమస్థాయికి హైందవుల్ని తొక్కేస్తాడో అనిపించి అందరూ కలిసి ఆ ఫకీరుని రహతా నుండి వెళ్లగొట్టేశారు. గోడనిర్మాణం కాస్తా ఆగిపోయింది. అలీ ఎక్కడికి వెళ్లాలా? అని ఆలోచించుకుంటూ సాయి ఉన్న షిర్డీకి మకాం మార్చాడు. షిర్డీకే కాదు. సాయి సమీపంలో అంటే ఆయనవద్దే మసీదులో ఉండడం కోసం తన మకాంని షిర్డీ మసీదులోకి మార్చేశాడు. ఇంకేముంది? మసీదులో సాయి దర్శనాని కొచ్చే భక్తులందరితో తీపి తీపి సంభాషణలని చేస్తూ కురాన్–ఎ–శరీఫ్లోని వాక్యాలని చెప్తూ సాదరంగా సప్రమాణంగా విషయాలని వివరిస్తూ ఉంటే భక్తులందరికీ ‘సాయికి మించినవాడు అలీ’ అనే అభిప్రాయం దాదాపుగా వచ్చేసింది. దీన్ని అదనుగా తీసుకుని ‘అలీ’ కూడా సాయిని తన శిష్యునిగా చెప్పుకుంటూ ఉండేవాడు తన వద్దకి వచ్చిన భక్తులతో. ఆ సందర్భంలో సాయి కూడా ఆ అలీని తనకి ఎలా గురువువి? అని వ్యతిరేకించడం గానీ వాదించడం గానీ భక్తులతో నిజాన్ని చెప్పడం గానీ చేయలేదు సరికదా, ఆ అలీకి శిష్యునిగానే సాయి సేవలని చేయడం మొదలెట్టాడు కూడా. దీంతో భక్తులకి ఏం అర్థం కాలేదు పరిస్థితి.ఈ క్రమంలో అలీ తన మకాంని మళ్లీ ‘రహతా’ గ్రామానికే మార్చదలిచాడు. సాయికి అలీలోని లోపాలు బాగా తెలుస్తుండేవి. అలీకి సాయిలోని గొప్పదనాలు తెలుస్తుండేవి. దీంతో ఎంత తొందరగా ‘రహతా’ కి వెళ్తే అంతగానూ తన గురుస్థానం బలపడుతుందని భావించాడు అలీ. సాయితో మాట మాత్రం కూడా చెప్పకుండా సాయినీ శిష్యులనీ తీసుకుని ‘రహతా’ గ్రామానికి మకాం మార్చేశాడు. ఇలా తాము నమ్ముకున్నసాయి అకస్మాత్తుగా అలీకి లోబడిపోవడం, అంతేకాకుండా ఎంతకాలంనుండో ఉంటున్న షిర్డీ గ్రామాన్ని విడిచి భక్తుల్ని కూడా దూరం చేస్తూ, దూరం చేసుకుంటూ, వెళ్లిపోవడం అందరికీ చాలా బాధాకరమైంది. రహతానుండి వచ్చే కొందరి ద్వారా సాయి తన గురువు కానీ గురువైన అలీకి నీళ్లు కూడా మోసి తెస్తుండేవాడనీ, ఇది చేయదగినది, అది చేయరానిది అనే భేదం, ఉచ్చం నీచం అనే వివక్ష కూడా లేకుండా సేవ చేస్తున్నాడనీ తెలిసి ఎంతో మనోబాధ పడుతుండేవారు సాయి భక్తులంతా. కొందరు ఈ సాయికి ఏదో మంత్ర ప్రయోగం చేసి ఉంటాడని, ఇంకొందరు ఇక సాయికీ మనకీ సంబంధాలు దూరమైపోయినట్లేననీ, అలీ మన సాయిని వదిలిపెట్టనే పెట్టడనీ.. ఇలా ఎవరికి తోచిన ఆలోచనలతో వాళ్లు అంటూండేవారు. అనుకుంటుండేవారు. ఈ భక్తుల మాటలు నిజమే సుమా! అనుకోవడానికి వీలుగా సాయి తన గురువైన అలీతో షిర్డీ గ్రామానికి అలా చుట్టపు చూపుగా వచ్చేసి వెంటనే వెళ్లిపోతుండేవాడు కూడా. నాలుగు సంవత్సరాల నుండి షిర్డీ గ్రామంతో అంతా చిక్కని చక్కని అనుబంధమున్న సాయి ఎలా ఎందుకు పొరుగూర్లో ఉంటున్నాడనేది ఎవరికీ అంతుబట్టలేదు. బాబాతో దూరంగా ఉండడమనే ఈ వియోగాన్ని షిర్డీ ప్రజలు భక్తులైన జనానికి తట్టుకోలేనిదిగా అయింది. అంతా తమంత తాముగా ఒకచోటికి చేరి – రహతాకి వెళ్లి సాయిని ప్రార్థించి బ్రతిమాలి బామాలి విన్నవించి మన స్థితిని వివరించి ఎలాగైనా షిర్డీకి తెచ్చేసుకుందామని గట్టిగా తీర్మానించుకున్నారు ఇలా అందరూ ఒకటి కావడం ఒకే మాట మీద ఉండడం ఒకే తీర్మానాన్ని చేసుకోవడమనేదాన్నే ‘ఏకగ్రీవం’ (ఏక–ఒకే, గ్రీవం–కంఠంగా కావడం –కంఠం అనేది మాటని పలుకుతుంది కాబట్టి అందరిదీ ఒకే మాట కావడమని అర్థం) అంటారు. అలా అందరూ కలిసి రహతా గ్రామానికి వెళ్లారు. అలీ అనే ఆ గురువు లేని సమయాన్ని పసి గట్టి మొత్తానికి సాయిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుని సాయిని షిర్డీకి శాశ్వతంగా వచ్చేయవలసిందని విన్నవించుకున్నారు. సాయిలో ఉన్న గొప్పగుణాల్లో ఒకటి ఎదుటివారు చెప్పే విషయం మొత్తాన్ని పూర్తిగా వినడం, అలా వింటున్న కాలంలో తన అభిప్రాయమేదో దాన్ని చూచాయిగా కూడా తన ముఖకవళికలలో వ్యక్తం చేయకపోవడమూను. అంతేకాదు. పూర్తిగా విన్నాక తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పడమే తప్ప, వంకరగా మాట్లాడకపోవడం కూడా ఆయన విశిష్టలక్షణమే. వీరి ప్రార్థనని మొత్తమంతా విన్నాక సాయి వీళ్లందరికీ చక్కని సమాధానమిస్తాడనుకుంటే ఆ సాయి మాట్లాడుతూ.. షిర్డీవాసులారా! నా గురువైన అలీ మహా కోపిష్టి. ఆయనకి చెప్పనిదే నేను ఏ పనినీ చేయను, చేయకూడదు. మీరు నన్ను ఇలా దొంగతనంగా కలిశారని ఆయనకి తెలిసినా, దురదృష్టవశాత్తూ ఇప్పుడే మనం ఆయన కంటబడినా పరిస్థితి సక్రమంగా ఉండదు. ఇక నన్ను విడిచిపెట్టనే పెట్టడు సరికదా అనుక్షణం నా మీద నిఘా ఉంచనే ఉంచుతాడు. ఇలా మనం ఆయన కంటపడితే తీవ్రంగా అగ్నిలా ప్రజ్వరిల్లిపోతాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తాడు. మీ మాటని నేను వినడం మాట అటుంచి, నా మాట విని మీరు వెంటనే షిర్డీకి వెళ్లిపోండి అన్నాడు. షిర్డీ భక్తులందరికీ మతిపోయింది. ‘సాయి మనందరికీ దిక్కు’ అని అనుకుంటూ ఉంటే ఆయనకి దిక్కు మరొకరున్నారని ఆయన అనడమేమిటి? పైగా ఎప్పుడో పరిచితులమైన మనకంటే.. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఈ అలీ మీద ఇంత గౌరవం, భయమేమిటి సాయికి? అనుకుంటూ ఉండగానే సాయి అన్నట్లుగా అలీ అకస్మాత్తుగా అక్కడికి రానేవచ్చాడు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ‘‘ఈ ‘కుర్రవానికోసం’ వచ్చారా? ఇతణ్ణి పంపనే పంపను షిర్డీకి. నా శిష్యుడు ఇతను. ఇక్కణ్ణుండి పొండి’’ అన్నాడు అలీ. చల్లకొచ్చి ముంత దాచడం, శత్రువు ఎదురైనప్పుడు యుద్ధాన్ని మాని బతిమిలాడడం ప్రయోజనం లేని పని అని భావించి షిర్డీ ప్రజలంతా అలీ మీద వాగ్యుద్ధంతో తిరగబడ్డారు. దాంతో అలీకి లోపల కొద్దిగా జంకు కలిగింది. ‘సరే! నేను ఈ కుర్రవాణ్ణి పంపను. వస్తే మేమిద్దరం వస్తాం షిర్డీకి!’ అన్నాడు అలీ. అందరికీ అప్పటికి ఆమోదమయింది. అనుకున్నట్టుగా ఆ ఇద్దరూ షిర్డీకి వచ్చేశారు. షిర్డీవాసులందరికీ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇక ‘అలీ’ని ఎలా సాయి నుంచి వదిలించాలా? సాయిని ఎలా తమ వైపుకి రప్పించుకోవాలా? అని ఆలోచించారు భక్తులంతా. షిర్డీలో దేవీదాస్ అనే మహా తేజోవంతుడైన పండితుడు ఉన్నాడు. ఆయనకి ఎంతో గొప్పవారూ వయసులో పెద్దవారూ అయిన తాత్యా పాటిలు, షింపీ వంటి ఎందరో శిష్యులుగా అయి ఎన్నెన్నో విషయాలని ఈయన నుండి తెలుసుకుంటూ ఉండేవారు. అలాంటి దేవీదాసుకి సాయి భక్తులంతా విషయాన్ని పూస గుచ్చినట్లుగా చెప్పి.. శరణుకోరుతున్నామన్నారు. దేవీదాసు అలీ ఉన్న చోటుకొచ్చి అలీతో వాదం ప్రారంభించాడు. కేవలం కురాన్–ఎ–శరీఫ్ కంఠస్థం చేసి ఉండడమే తప్ప వాటిలోతులు తెలియని కారణంగా దేవిదాసు వాదపాండిత్యం ముందు అలీ తట్టుకోలేక ఓటమిని అంగీకరించి సాయిని విడిచేసి షిర్డీ నుండి పారిపోయాడు. మేఘం విడిచిన సూర్యునిలా మళ్లీ సాయి దేదీప్యమానంగా ప్రవేశించసాగాడు. కొన్నేళ్ల తర్వాత అలీ షిర్డీకి వచ్చి సాయి పాదాల మీద పడి మన్నింపవలసిందని వేడి పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు అందరి సమక్షంలోనూ. లో భావం..? సాయి ఎందుకిలా ప్రవర్తించాడనేది గట్టి ప్రశ్న కదా! వ్యక్తికి అహంకారమనేది ప్రారంభమే పెరుగుతున్న కాలంలో పతనమౌతామనే విషయం స్ఫురణలోకి రాదు. దీనికి ఉదాహరణే ‘అలీ’! మంచో చెడో ఒకరినంటూ గురువుగా ఎన్నుకున్నాక, అతణ్ని ఆశ్రయించాక శిష్యునిలానే గురువుకి శుశ్రూష చేయాల్సిందే తప్ప నడుమలో విడిచివేయకూడదు. నిజమైన గురువు ఎలా ఉండడో, ఎలా ఉండేవాడు మాత్రమే గురువో ఆ విషయాన్ని తెలియజేయ దలిచాడు సాయి. తెలియజెప్పాడు. లోకంలో ఎందరో కేవలం పాండిత్యం ద్వారా జనాన్ని ఆకర్షిస్తూ, ఆ తాము చెప్పేదాన్ని ఆచరించకుండా స్వప్రచారం ద్వారా ఎంతెంత ఎత్తులకి ఎదిగిపోతారో గమనిస్తూ వాళ్లని నిజమైన గురువులుగా ఎలా లెక్కించకూడదో తెలియజేసే వృత్తాంతమే ఈ సంఘటన. ఇలా జనం అందరికీ గుండెలలోతుగా విషయాన్ని అర్థమయ్యేలా చేసేందుకు సాయి ఆ కపట వంచన గురువుకి యథార్థ శిష్యునిగా సేవ చేశాడు. అందుకే సాయి లీలల్ని లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పేది కూడా! మహమ్మదీయుల ‘ఉరుసు’ పండుగని సాయి శ్రీరామనవమిగా మార్చాడు. అది ఎలా జరిగిందో చూద్దాం! ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
కమలం నజర్!
సాక్షి, వనపర్తి : కర్ణాటకలో అధికార పీఠం దక్కించుకున్న బీజేపీ ఇక తెలంగాణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాపై ప్రత్యేకంగా కన్నెసినట్లు కనిపిస్తోంది. వచ్చేనెలలో జిల్లాలో బీజేపీ చీఫ్ అమిత్షా పర్యటించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీశ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణను నాలుగు క్లస్టర్లుగా విభజించి పార్టీ బలోపేతం కోసం బాధ్యతలను సీనియర్ నేతలు రాంమాధవ్, మంగళ్పాండే, నరేంద్రసింగ్ తోమర్, బండారు దత్తాత్రేయకు అప్పగించారు. వీరికి కొన్ని పార్లమెంట్ స్థానాల పర్యవేక్షణ బాధ్యతలను కట్టబెట్టారు. పార్టీ బలోపేతంలో భాగంగా జూన్ 9న జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రానున్నారు. కర్ణాటకలో బలనిరూపణ ప్రక్రియ అంతా సవ్యంగా సాగితే ఇప్పటికే నిర్ణయించిన తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. జిల్లాకు ‘పరివర్తన్’ యాత్ర రాష్ట్రంలోని 65 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జూన్లో పరివర్తన్ యాత్ర పేరుతో బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ముందుగా 35 నియోజకవర్గాలు.. ఆ తరువాత 30 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. జిల్లాలో జరిగే ఈ బస్సు యాత్రలో అమిత్షా పాల్గొననున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వనపర్తికి రానుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నాయి. ఎందుకంటే పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనే అమిత్షా అడుగుపెడితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ పాగా వేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో వనపర్తి కూడా ఒకటి. అందులో భాగంగానే ఆయన పర్యటనను జిల్లాలో ఖరారు చేశారు. ద్వితీయశ్రేణి నాయకత్వంపై దృష్టి పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా అన్ని పార్టీల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, బూత్ స్థాయి నేతలను చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉండి నేడు కొంతమంది నాయకులకే పరిమితమైన టీడీపీపై ముందుగా దృష్టి సారించనున్నారని సమాచారం. ఆ తరువాత అధికార టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలను, కాంగ్రెస్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలపై దృష్టిసారించి పార్టీలో చేర్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడంతో బూత్స్థాయిలో పార్టీ ముందుగా బలోపేతమవుతుందని విశ్వసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం కేంద్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ బీజేపీకి రాకుండా చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పరివర్తన్ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతామని చెబుతున్నారు. -
గంజాంపై గురి
భువనేశ్వర్ : రాష్ట్ర రాజకీయాల్లో గంజాం జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యం వహిస్తున్నారు. బిజూ జనతా దళ్లో తిరుగులేని నాయకుని గంజాం జిల్లా రాష్ట్రానికి అందజేస్తుందనే విశిష్టత సంతరించుకుంది. అంతే కాదు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడి రాజకీయాలతో అవినాభావ సంబంధాల్ని పెన వేసుకుని ఉంది. దేశానికి తెలుగు బిడ్డ దివంగత పి.వి.నరసింహారావును ప్రధానమంత్రిగా అందజేసిన ఘనత కూడా గంజాం జిల్లా సొంతం చేసుకుంది. విపత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందజేసి ఆదుకున్న 1999వ సంవత్సరం నాటి పెనుతుపాను ఛాయలు నేటికీ చెరగని చరిత్రగా మిగిలిపోయాయి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేరణతో విపత్తు నిర్వహణలో ఒడిశా నేడు అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో వంటి ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు సాధించింది. ప్రపంచ దేశాలకు విపత్తు నిర్వహణలో మార్గదర్శిగా నిలిచింది. మారిన కాలమాన పరిస్థితుల దృష్ట్యా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవిభక్త గంజాం జిల్లాలో రాజకీయ విస్తరణ కోసం యోచిస్తున్నట్లు రాజకీయ శిబిరాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం ప్రాంతీయ పార్టీగా అంతర్ రాష్ట్ర తెలుగు ప్రజల్ని ఆకట్టుకునేందుకు లోపాయికారీగా రాజకీయ వ్యూహాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రాచీన సంబంధ బాంధవ్యాల్ని తెరపైకి తీసుకు వచ్చి ఒడిశా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు మోపేందుకు తెలుగుదేశం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో యువనాయకత్వం కొరత గంజాం జిల్లాలో యువతరం నాయకుల కొరతతో ప్రధాన రాజకీయ పక్షాలు అల్లాడుతున్నాయి. వయోవృద్ధ నాయకులతో ఉభయ కాంగ్రెస్, అధికార పక్షం బిజూ జనతా దళ్ ఈ జిల్లాలో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. వీరి తర్వాత ఉత్తరాధిపత్యం పగ్గాలు అందుకునేందుకు అవిభక్త గంజాం జిల్లాలో చురుకైన విద్యాధిక, రాజకీయ చాతుర్యత కలిగిన సారథుల్ని అన్వేషించడంలో ప్రధాన రాజకీయ పక్షాలు తలకిందులవుతున్నాయి. ఈ బలహీన పరిస్థితుల్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో తెలుగుదేశం చొరబడి స్థానికంగా ప్రత్యక్ష పోటీకి యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నవీన్ అటూ..ఇటు .. గంజాం జిల్లా ప్రత్యక్ష రాజకీయాల్లో ఊహాగానాల మేరకు తెలుగుదేశం పార్టీ అడుగిడితే ఈ జిల్లా రాజకీయ ముఖ చిత్రం అకస్మాత్తుగా కొత్త కాంతుల్ని పుంజుకుంటుంది. అధికారంలో కొనసాగుతున్న బిజూ జనతా దళ్తో మిత్ర పక్షంగా తెలుగుదేశం పోటీ చేసేందుకు బీజేడీ శిబిరంలో అనుకూల వాతావరణం కనిపించడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కని మిత్రులుగా చలామణి అవుతున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య పాలనాపరమైన విభేదాలు బలం పుంజుకున్నాయి. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్పై ఒడిశా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు కూడా దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ దూకుడుని సవాల్ చేసింది. అయినా రాజకీయంగా ఎటువంటి వివాదాన్ని ప్రేరేపించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అత్యంత జాగరూకత ప్రదర్శించారు. తాజాగా ఈస్ట్కోస్ట్ రైల్వేజోన్ పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో మాకూ కావాలనే శీర్షికతో కేంద్రంలో ప్రభుత్వాన్ని మింగుడు పడని పరిస్థితిలో ఆట పట్టించారు. తాజాగా కొఠియా గ్రామాల వివాదంలో తెలుగుదేశం ప్రభుత్వం పాలన తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా ప్రభుత్వ అధికారుల్ని రంగంలోకి దింపి ప్రత్యక్ష చర్యల్ని ప్రేరేపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరబాటుతనంపై ఆంక్షలు విధించారు. వైఎస్సార్సీపీ వైఖరిపట్ల ఉత్కంఠ సరిహద్దు గంజాం జిల్లా రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ చొరబాటుపట్ల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా ఆట పట్టిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదలికపట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపట్ల రాష్ట్ర ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. పలు స్థానిక ప్రాంతీయ పార్టీలు ఆయన నేతృత్వంపట్ల మక్కువ కనబరుస్తున్నాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా వైఎస్సార్సీపీ అధినేతపట్ల సదభిప్రాయంతో అడుగులు వేసిన సందర్భాలు లేకపోలేదు. రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణలో బీజేడీ, వైఎస్సార్సీపీ నాయకుల కార్యాచరణలో సమతుల్యత తారసపడుతుంది. దక్షిణ ఒడిశాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం తరచూ తారసపడుతుంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ పరిస్థితులు మరింత స్పష్టమవుతాయని భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అంతర్ రాష్ట్ర పార్టీలుగా ఆవిర్భవించి పోటీకి సిద్ధమవుతున్నట్లు రాజకీయ చర్చ సాగుతోంది. -
భారత్, అమెరికా ఎన్నికలపై దృష్టి
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్, అమెరికా సహా పలుదేశాల్లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న ఈ దేశాల్లో ఫేస్బుక్ కేంద్రంగా నకిలీ వార్తలు, వదంతులు వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో భా గంగా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) టూల్స్తో పాటు 15,000 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్తో పాటు హంగేరీ, బ్రెజిల్, మెక్సికోల్లో జరగనున్న ఎన్నికల సమగ్రతను కాపాడటానికి ఫేస్బుక్ కృషి చేస్తుందన్నారు. ఈ ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా దొంగలించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జుకర్బర్గ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం రష్యాకు చెందిన ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ తప్పుడు వార్తల్ని వ్యాప్తిచేయడం గుర్తించామన్నారు. ఐఆర్ఏకు సంబంధించిన అన్ని పేజీలను తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేఏడాది జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఏఐ టూల్స్తో 30వేల నకిలీ ఖాతాల్ని నిలిపేసినట్లు చెప్పారు. -
ఏకాగ్రతకు 10 మెట్లు
అర్జునుడు వీరత్వం వల్ల వీరుడు కాలేదు.కాన్సన్ట్రేషన్ వల్ల అయ్యాడు. పక్షి కన్ను మీద దృష్టి నిలపగలగడం వల్లే అతడు వీరుడుగా నిలబడగలిగాడు. ఏ మనిషికైనా ప్రథమ ఆయుధం ఏకాగ్రతే.అది వెంట ఉంటే మిగిలిన శక్తులన్నీ తోడు నిలుస్తాయి. లక్ష్య సాధన సులువవుతుంది. గమ్యం దరి చేరుతుంది.కాని ఆ ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంటే? దృష్టి ఒక అంశం మీద నుంచి మరో అంశం మీదకు వెంటవెంటనే మరులుతూ ఉంటే? సమస్య ఉన్నట్టే.ఏకాగ్రతను పెంచడానికి వ్యాయామాలూ, చిట్కాలు ఉన్నాయా?ఈ వ్యాయామాలు అందరికోసమే అయినా... ప్రత్యేకంగా ఇప్పుడు పరీక్షల సీజన్ కాబట్టి చదివే సమయంలో ఏకాగ్రత కలగడానికి ఏం చేయాలి? ఇక్కడ కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అనుసరించండి... ప్రయోజనం పొందండి. మీరు జిమ్లో చేరగానే పెద్ద బరువులెత్తుదామని ఉబలాటపడతారు. కానీ ఎత్తలేక ఇబ్బంది పడతారు. దాంతో తక్కువ బరువులతో మొదలుపెట్టి క్రమంగా శక్తిని పుంజుకుంటూ... ఒక దశ తర్వాత పెద్ద పెద్ద బరువులనూ చులాగ్గా, చురుగ్గా ఎత్తగలుగుతారు. ఏకాగ్రత విషయంలో కూడా ఇదే సూత్రం. మన మైండ్ కూడా ఒక మజిలే అని భావించి సాధన చేస్తే ఇది సాధ్యమే. థెరాన్ క్యూ డ్యుమాంట్ అనే రచయిత ‘ద పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్’ పుస్తకంలోని మెదడు తన ఏకాగ్రత శక్తినిపెంచుకోవడానికి కొన్ని వ్యాయామాలు సూచించాడు.వీటిలో కొన్ని హాస్యాస్పదంగా అనిపించినా, వాటిని అనుసరించిన వారికి తగిన ఫలితాలు కనిపించాయని చాలా మంది తేల్చిచెప్పారు. ఆ చిట్కాలూ, వ్యాయామ సూచనలు ఇలా ఉన్నాయి. కుర్చీలో కదలకుండా కూర్చోండి అభ్యాసం–1 ఒక కుర్చీలో సౌకర్యంగా కదలకుండా కూర్చోండి. మొదట మీకిది చాలా సులభం అనిపిస్తుంది. కానీ కష్టం. కొద్దిసేపు కూర్చున్న తర్వాత బోర్గా అనిపిస్తుంది. అటు ఇటు కదలాలని, లేవాలని అనిపిస్తుంది. ఏ కదలికలూ లేకుండా కనీసం 15 నిమిషాల పాటు అలా కదలకుండా కూర్చోండి. అంతసేపు మీరు ఎలాంటి కదలికలూ లేకుండా కూర్చోగలిగారంటే ఆ తర్వాత ఎంత సేపైనా కూర్చోవచ్చని మీకు తెలుస్తుంది. అలా కూర్చొని ఎంతసేపైనా చదవుకోగలమనే నమ్మకం (కాన్ఫిడెన్స్) కలగడానికి మొదటి మెట్టు ఈ సాధన. నీళ్లు నిండిన గ్లాసుపై దృష్టి నిలపండి అభ్యాసం–2 ఒక గ్లాసులో నిండుగా నీళ్లు నింపండి. ఆ గ్లాసును వేళ్లతో పట్టుకొని మీ చేయి చాచి, దాన్నే చూస్తూ ఉండండి. నీళ్లు ఏమాత్రం బయటకు తొణకకుండా ఎంతసేపు ఉంచగలరో చూడండి. కొందరికి మొదట నిమిషంలోనే తొణకవచ్చు. ఇదే వ్యాయామాన్ని కొనసాగిస్తూ మీ వ్యవధిని ఒక నిమిషం నుంచి 5 నిమిషాలకు పెంచండి. మొదట ఒక చేత్తో చేశాక, తర్వాత మరో చేతితోనూ దీన్ని చేయండి. మీకు తెలియకుండానే కదలిపోయే కండరాలపై నియంత్రణకు ఈ వ్యాయామం దోహదపడుతుంది. ప్రతి కండరపు కదలికా మీ నియంత్రణలోకి వచ్చేందుకు దోహదం చేస్తుందీ వ్యాయామం. వాసన చూసే శక్తిని పెంచుకోండి అభ్యాసం–3 మీరు తోటలో నడుస్తున్నప్పుడు రకరకాల పూల వాసనలు తెలుస్తుండవచ్చు. కాని ఏది ఏ పువ్వు వాసన అని నిర్దిష్టంగా పసిగట్టేలా సాధన చేయండి. వాసనలను బట్టి అక్కడ ఉన్న పూవులేమిటి, మీరు మిస్ అయినవేమిటి అని చూసుకుంటూ సాధన చేస్తే... మీ ఏకాగ్రత పెరిగినట్టే భావించవచ్చు. ఇలా సూక్ష్మంగా వాసనలను పసిగట్టే సామర్థ్యం పెంపొందితే... ఒకనాడు ఎప్పుడో పీల్చిన నైట్క్వీన్ వాసనకూ, మల్లె వాసనలను పసిగట్టగలగడమే కాదు... అంతగా తెలియని వారికి అవి వేర్వేరు అని వివరించవచ్చు కూడా. రిలాక్స్డ్గాగుండె చప్పుడు వినండి అభ్యాసం–4 మొదట మంచం మీద రిలాక్స్డ్గా పడుకోవాలి. ప్రతి కండరమూ వదులుగా రిలాక్స్డ్గా ఉండేలా చూడాలి. అప్పుడు మన గుండె స్పందన మీద దృష్టి సారించాలి. మీలోని గుండె అంత చిన్నగా ఉన్నప్పటికీ, ఆ గొప్ప అవయవం మీ ఒంటి మొత్తానికీ అనుక్షణం, ప్రతిక్షణం ఎలా రక్తసరఫరా చేస్తుందో ఊహించుకోండి. ఒక చివరన ఉన్న మీ కాలి బొటనవేలు మొదలు మీ తల వరకు అన్ని అవయవాలకూ అనునిత్యం రక్తం అందుతున్న తీరును ఊహిస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఈ అనుభూతితో కలిగే భావోద్వేగం... మిమ్మల్ని చాలా రిలాక్స్ చేయడంతో పాటు మీరు హాయిగా, సంతోషంగా ఉన్న ఫీలింగ్ కలగజేస్తుంది. మీరు సంతోషంగానూ, ఆరోగ్యకరంగానూ ఉన్నారన్న ఫీలింగ్ కారణంగా ఎలాంటి అంశంపైనైనా తదేకంగా, ఏకాగ్రతతో దృష్టికేంద్రీకరించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పొందడం సాధ్యమవుతుంది. నిద్రపై దృష్టి కేంద్రీకరించండి అభ్యాసం–5 దీన్ని ‘వాటర్ మెథడ్’ అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రభావపూర్వకమైనది. మీరు నిద్రించే గదిలోని ఒక బల్ల మీద ఒక గ్లాసు నిండా నీళ్లు నింపి ఉంచండి. ఒక కుర్చీని ఆ బల్ల దగ్గర వేసి, దానిలో మీరు రిలాక్స్డ్గా కూర్చొండి. అలా కూర్చున్న తర్వాత, నిలకడగా, స్పష్టంగా ఉన్న ఆ నీటిని తదేకంగా చూస్తూ... ఇలా ఆలోచించండి. ‘అబ్బ... ఆ నీళ్లు ఎంత స్పష్టంగా, పారదర్శకంగా, నిర్మలంగా ఉన్నాయి. నా మదిలోని ఆలోచనలు కూడా నెమ్మదించాలి. అవి అలా క్రమంగా నెమ్మదిస్తూ పోయి, నా హృదయం కూడా ఆ నీళ్లంతటి ప్రశాంతంగా మారాలి’ అంటూ మీకు మీరు చెప్పుకుంటూ పోండి. మీ నాడీకణాల్లో చెలరేగుతున్న ఆలోచనలను నెమ్మదించుకుంటూ పోతున్న అనుభూతి పొందుతూ అలా నిద్రలోకి జారుకుంటున్నట్లుగా భావించాలి. అలా మత్తుగా సోలిపోతున్నట్లుగా అనుభూతి చెందుతూ క్రమంగా బెడ్ మీదికి చేరి నిద్రలోకి జారిపోవాలి. ఈ అభ్యాసాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూపోతే... ఒకనాటికి నిద్రలేమి రోగులు కూడా ప్రశాంతంగా నిద్రపోతూ తమ నిద్రలేమి (ఇన్సామ్నియా) వ్యాధిని అధిగమించగలరు. అద్దం ముందు మాట్లాడండి అభ్యాసం–6 మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ ఉండండి. మీ ప్రతిబింబంలో మీ కళ్లు కనిపించే చోట మరో రెండు కళ్ల బొమ్మలు గీయండి. ఆ రెండు కళ్లూ మిమ్మల్నే చూస్తున్నట్లుగా భావించండి. నిటారుగా కూర్చొని మీరు కూడా తదేకంగా ఆ కళ్లనే చూస్తుండండి. ఎదురుగా ఆ కళ్లు కలిగిన వేరే వ్యక్తి అక్కడెవరో ఉన్నట్లుగా భావిస్తూ... మీలో మెదలుతున్న ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించండి. ఆ కళ్లు కలిగి ఉన్న వ్యక్తి మీకు చాలా నమ్మకమైన వ్యక్తిగా భావించండి. మీలో కలుగుతున్న పూర్తి అసంబద్ధమైన ఆలోచనలను సైతం నిస్సంకోచంగా ఆ కళ్లు కలిగి ఉన్న ఊహావ్యక్తితో పంచుకుంటున్నట్లుగా మాట్లాడుతూ ఉండండి. నెమ్మదిగా గాలిని ఊపిరితిత్తుల్లోకి లోతుగా పీల్చుకుంటూ ఉండండి. ఆ ఊహావ్యక్తితో అలా ఒక వాదనాసరళిలో మాట్లాడుతూ పోతే... అసంబద్ధమైన అంశాలే క్రమంగా సక్రమంగా మారిపోతాయి. ఒక సందిగ్ధపూరితమైన వేవరింగ్ కండిషన్ నుంచి మీకు స్పష్టత వచ్చేలా ఏకాగ్రత వైపునకు మీ ఆలోచనలు ప్రవహిస్తుంటాయి. మీరు ఈ అభ్యాసాన్ని కనీసం 3 నుంచి 5 నిమిషాలు చేసినా చాలు... మీరిలా సాధించిన ఆ ఏకాగ్రతతో క్రమబద్ధంగా లేని ఆ ఆలోచనలే సక్రమంగా మారుతాయి. మీకు మేలు చేకూర్చే మంచి ఆలోచనలుగా అవి ఆవిర్భవిస్తాయి. ఒకే ముక్కురంధ్రంతో శ్వాసించండి అభ్యాసం–7 ఒక కుర్చీలో ప్రశాంతంగా, నిటారుగా కూర్చొండి. మీ వేలితో ఒక ముక్కు రంధ్రాన్ని మూసేయండి. మరో ముక్కు రంధ్రంతో నెమ్మదిగా, గాఢంగా గాలిని లోపలికి పీలుస్తూ పోండి. ఊపిరితిత్తుల నిండా గాలి నిండాక ఒకే క్రమంలో 10 అంకెలు లెక్కబెట్టండి. అప్పుడు మెల్లగా గాలిని వదలండి. ఇలా మొదట కుడిముక్కు రంధ్రాన్ని మూసి ప్రాక్టీస్ చేశాక... తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి అదే ప్రక్రియను ప్రాక్టీస్ చేయండి. ఇలా రోజూ 20 సార్లు చేయండి. మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు, మీలో మంచి ఆక్సిజన్ చేరి, ఏకాగ్రతతో పాటు దృష్టికేంద్రీకరణ శక్తి పెరుగుతుంది. అనవసరపుఆలోచనలపై దృష్టి నిలపకండి అభ్యాసం 8 ముఖ్యమైన సమయంలో అనవసరమైన ఆలోచనలు దృష్టిని కేంద్రీకరించకుండా అడ్డుపడుతుంటాయి. అందుకే దేనిపై దృష్టి నిలపాలి అనే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుండాలి. అప్రాధాన్యమైన అంశానికి... అసలు పని పూర్తయ్యాక ప్రాధాన్యం ఇవ్వవచ్చంటూ మనకు మనం సజెషన్ ఇచ్చుకోవాలి. మొదట ప్రాధాన్యాంశం మీదే మన దృష్టి ఉండేలా ప్రాక్టీస్ చేయాలి. మన ప్రాధాన్యాంశాన్ని మనం పూర్తి చేయగానే మనకు జరగబోయే మేలు, మనకు లభించబోయే అభినందనలూ, మనం పొందే ఆనందాలను పదే పదే గుర్తు చేసుకోవాలి. దాంతో మీ అప్రాధాన్య ఆలోచనలు, మీకు అప్పటికి అప్రస్తుతమైన కోరికలు మనసు నుండి తొలగిపోతాయి. ఇలా క్రమంగా మీ మనసుపై అదుపు సాధించవచ్చు. ఇది సాధించిన వారికి... ఆ తర్వాత ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించడం పెద్ద లెక్క కాదు. స్పష్టత తెచ్చుకోండి అభ్యాసం–9 చదివే సమయంలో... మనం చదివే అంశాన్ని అర్థం చేసుకోకపోతే ఎంత చదివినా ప్రయోజనం ఉండదు. అందుకే చదివే సమయంలో అది మనకు ఎంత అర్థమైంది అన్న అంశాన్ని తెలుసుకోవడం కోసం ఒక అభ్యాసం చేయవచ్చు. మొదట ఒక విషయాన్ని పూర్తిగా చదవండి. ఆ తర్వాత మీరు చదివిన టెక్స్›్టలో మీకు అర్థమైనదాన్ని సంక్షిప్తంగా రాయండి. ఇలా రాసే క్రమంలో మీకు ఏకాగ్రత కుదరడమే కాకుండా... మీరు చదివి అర్థం చేసుకున్న విషయంలో మరింత స్పష్టత వస్తుంది. ఈ అభ్యాసం చేసే సమయంలో మీరు చదివిన అంశాలు కొన్నింటిని తొలుత మీరు మరచిపోయి ఉండవచ్చు. కానీ మీరు రాస్తున్న క్రమంలో అవి గుర్తుకువస్తూ ఉంటాయి. అలా మీకు గుర్తుకు వస్తూ ఉన్నయంటేనే... మీకు ఏకాగ్రత పెరుగుతోందని అర్థం. దృష్టి కేంద్రీకరణను గమనించండి అభ్యాసం–10 మీరు ప్రశాంతంగా కూర్చొని మీ గోడగడియారం లేదా చేతి గడియారంలోని సెకండ్ల ముల్లును చూస్తూ ఉండండి. ఒక ఐదు నిమిషాల పాటు మరే అంశంపైకీ దృష్టి పోకుండా కేవలం సెకండ్ల ముల్లునే గమనిస్తూ ఉంటానని మీకు మీరే చెప్పుకోండి. ఒక్కోసారి అకస్మాత్తుగా మీ దృష్టి సెకండ్ల ముల్లు నుంచి పక్కకు తొలగిపోవచ్చు. కానీ మళ్లీ దాన్ని తిరిగి సెకండ్ల ముల్లు మీదికి తెండి. ఇది మొదట చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ పోనుపోనూ మీకు ధ్యానం లాంటి స్థితిపైకి దృష్టి మళ్లించడం ఎలాగో తెలుస్తుంది. ఇలా మీరు అనవసరమైన ఆలోచనల్లోకి జారిపోకుండా ఉండటం ఎలాగో ప్రాక్టిస్ చేస్తే... తొందరలోనే మీకు పూర్తిగా ధ్యానం మీదే దృష్టి కేంద్రీకరించి, ఆ ధ్యానంలో నిమగ్నం కావడం ఎలాగో తెలుస్తుంది. అలా ఆ అభ్యాసాన్ని కొనసాగించుకుంటూ పోతే... ఎలాంటి ఆలోచనలూ లేకుండా మనసును పూర్తిగా ప్రశాంత పరచుకోవడం ఎలాగో తెలుస్తుంది. అప్పుడా ప్రశాంత చిత్తంతో ధ్యానం సాధ్యపడుతుంది. ఈ అభ్యాసం ముగించాక... మనం నిజంగా ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరిస్తే... దానిపై పూర్తిగా నిమగ్నం అయ్యే శక్తి మనకు సమకూరుతుంది. -
మాలోకం వేరు
గుంటూరు(ఎస్వీఎన్ కాలనీ): డక్ స్మైల్తో సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్టు పెట్టింది ఓ యువతి. వెంటనే హాయ్, యుఆర్ లుకింగ్ సో క్యూట్ అంటూ ఓ రిప్లై మెసేజ్. తరువాత లైకుల మీద లైకులు. ఫేవరబుల్ కామెంట్లు. ఇంకేముంది, కాసేపలా లోలోపల ఉబ్బితబ్బిబైపోయి. ధ్యాంక్యూ అటూ రిప్లై, అలా మొదలైన పరిచయం ఏ కాఫీ షాపులో మీట్ అయ్యేందుకో ఒకే అనిపిస్తుంది. అవును ఆన్లైన్ పరిచయాలు ఆన్లైన్ చాటింగ్తోనే ఆగిపోవట్లేదు. నేరుగా కలిసే వరకూ వెళ్తున్నాయి. అటు నుంచి మరో సంఘటలకు దారి తీస్తున్నాయి. నిండా పదహారేళ్లు కూడా లేని పిల్లలు సైతం ఇలాంటి పరిచయాలు వైపు మొగ్గు చూపడం ఇపుడు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇంటెల్ సెక్యూరిటీ, నాస్కామ్ పలు పట్టణాల్లో నిర్వహించిన టీన్స్ ట్వీన్స్ అండ్ టెక్నాలజీ స్టడీలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి. 8–14 ఏళ్లలోపు చిన్నారులు ఫేస్బుక్లో అకౌంట్ నిర్వహిస్తున్నారంటే యువతరం సోషల్ మీడియాకు ఎంతగా ఎడిక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ పరిచయాలు.. 19 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వినియోగించకూడదే నిబంధనలున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు. సోషల్ మీడియాలో 8 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు యాక్టివ్ కనిపిస్తున్నారు. 37 శాతం మందికిపైగా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల్ని నేరుగా కలుసుకుంటున్నట్లు ఇంటెల్ సెక్యూరిటీ స్టడీలో వెల్లడైంది. అంతేకాదు.. 57 శాతం మంది తెలిసీతెలియనితనంతో తమ వ్యక్తిగత విషయాలనే కాదు. కుటుంబ, ఆర్థిక వ్యవహారాల వివరాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తున్నారు. దీన్ని కొందరు క్యాష్ చేసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గుంటూరులోని ఒక పేరొందిన పాఠశాలలో ఉన్నత వర్గానికి చెందిన ఒక బాలిక ఇదే తరహా మోసానికి గురకావడం ఇందుకు నిదర్శనం. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇలా 72 శాతం మేరకు 8–15 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్లో యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు. 16–18 ఏళ్లలోపు యువత 20 శాతం చాటింగ్లకు సమయం కేటాయిస్తున్నారు. 19– 21 ఏళ్ల వరకు 8 శాతం మందిమాత్రమే ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటున్నారు. వీరందరూ రోజులో 2 నుంచి 4 గంటలపాటు నెట్తోనే గడిపేస్తున్నారు. మొత్తంగా 8–21 ఏళ్ల వయసు వారిలో 68 శాతం మంది ఫేస్బుక్ అకౌంట్లు కలిగి ఉన్నారని అధ్యయనం చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో 57 శాతం మంది పిల్లలు వ్యక్తిగత సమాచారంతోపాటు, ఫోన్ నంబర్లు పొందుపరుస్తున్నారు. 35 శాతం మంది పిల్లలు ఆన్లైన్లో పరిచయమైన అపరిచితుల్ని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. 55 శాతం మంది పిల్లలు తమ ఆన్లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రుల కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. 19 శాతం మంది పిల్లలకు కుటుంబసభ్యులతోపాటు, స్నేహితుల, ఇతరుల పాస్వర్డ్లు తెలుసు. వారిలో 68 శాతం మంది ఇతరుల అకౌంట్లను తెరుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న పిల్లల్లో 22 శాతం మంది సైబర్ వేధింపులకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా ఆడపిల్లలే ఉంటున్నారని తెలుస్తోంది. 51 శాతం మంది పిల్లలు ఇతరుల పాస్వర్డ్లు తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రులు 70 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా పిల్లలపై దుష్ప్రభావాలు చూపుతోందని ఆందోళన చెందుతున్నారు. 88 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ యాక్టివిటీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. యువతలో అధికంగా 25 శాతం మంది అపరిచితులతో సంభాషణ చేస్తున్నారని, 16 శాతం వ్యక్తిగత వివరాల వెల్లడిస్తున్నారని, 14 శాతం ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు గురయ్యారని, 12 శాతం సైబర్ బబ్లింగ్తో సతమతమయ్యారని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. బ్రౌజింగ్ వివరాలు కనిపించకుండా.. ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీని, వాట్సాప్, మెసెంజర్ చాటింగ్ డిటైల్స్ని తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా తల్లిదండ్రులు తరచుగా వ్యక్తిగత వివరాల తస్కరణ, ప్రైవసీ సెట్టింగ్స్, సైబర్ బబ్లింగ్, ఆన్లైన్ గుర్తింపు వంటి విషయాలపై పిల్లలతో చర్చిస్తుండడం గమనార్హం. 4.4 శాతం బాలలు పాస్వర్డ్లను తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. వేధింపుల కారణంగా 51 శాతం పిల్లలు ఇతరులను సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్నారు. 78 శాతం తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ వినియోగాన్ని నియంత్రింగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూలతలు ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, ఐఎంవో వీడియో కాలింగ్, ఆన్లైన్ షేర్, గూగుల్ ప్లస్ వంటి సామాజిక మాధ్యమాలు వ్యక్తులు, సమూహాల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించినవే. ప్రస్తుతం వీటితో మేలు కంటే దష్ఫ్రరిణామాలే అధికంగా తొంగి చూస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పాఠశాల స్థాయి విద్యార్థులు ఇంటికి రాగానే టీవీలో కార్టూన్ కార్యక్రమాలకు అతుక్కుపోయేవారు. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపుతున్న పీసీలు, ఇంటర్నెట్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్లోడ్, డౌన్లోడ్లతో కాలం గడిపేస్తున్నారు. ఇంటెల్ సెక్యూరిటీ చేసిన సర్వేలో నగరంలో 72 శాతం మంది 8–18 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్లో చురుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పిల్లలు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని (ఫోటోలు, ఫోన్ నంబర్లు వంటివి) పొందు పరుస్తున్నారు. పిల్లలపై తీవ్ర ప్రభావం సెల్ఫోన్లో సోషల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారులు సోషల్నెట్ వర్క్లతో బిజీ అవుతున్నారు. ఇది ఒకింత విజ్ఞాన ప్రపంచాన్ని చేరువ చేస్తున్నట్లు కనిపిస్తున్నా చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. పిల్లలను ఇతర వ్యాపకాల వైపు మళ్లిస్తే అన్లైన్ దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవచ్చు. – ఎన్ రాజ్యలక్ష్మి, మనస్తత్వ నిపుణులు, చేతన మనో వికాస కేంద్రం -
అల్లావుద్దీన్ అద్భుత శాపం
ఆదివారం పూట టీవీలో పాత తెలుగు సినిమాలు చూడడం అప్పారావుకు ఇష్టం. ఆ ఆదివారం అప్పారావు చూసిన సినిమా అక్కినేని–అంజలిదేవి జంటగా నటించిన ‘అల్లావుద్దీన్ అద్భుతదీపం’. ఈ సినిమా అప్పారావుకు తెగనచ్చేసింది. ‘ఈ సినిమాలో నాగేశ్వర్రావుకు దొరికినట్లు నాక్కూడ అద్భుతదీపం దొరికితే బాగుణ్ణు’ తనలో తాను అనుకున్నాడు అప్పారావు. ఆరోజు ఉదయం ఇంటి పెరట్లో తీరిగ్గా బ్రష్ చేసుకుంటూ డీప్గా ఆలోచిస్తున్న అప్పారావు దృష్టి వేపచెట్టు వెనుక ఉన్న పొదలపై పడింది. ఆ పొదల్లో ఏదో మెరిసినట్లుఅనిపించింది. ‘ఏమిటది?’ అనుకుంటూ ఆసక్తిగా అక్కడికి వెళ్లాడు.‘ఏదో దీపంలా ఉందే’ అనుకుంటూ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే...ఆకాశం అదిరేలా నవ్వు వినిపించింది. దీపంలో నుంచి జిన్నీ భూతం బయటికి వచ్చింది.‘మిస్టర్ అప్పారావు...ఈ క్షణం నుంచి నువ్వు నా యజమానివి. నువ్వు ఏది అడిగినా క్షణాల్లో అరేంజ్ చేస్తాను...’’ అంది భూతం.జిన్నీ భూతాన్ని చూడగానే చిలిపిగా ఒక ఆట ఆడుకోవాలనిపించింది అప్పారావుకు.‘‘చూడు జిన్నీ...నాకు మూడు సమస్యలు ఉన్నాయి. అవి తీర్చితే ఓకే. లేకపోతే వెయ్యి గుంజీలు నాన్స్టాప్గా తీయాలి’’ అన్నాడు అప్పారావు.‘ఓకే’ అంది జిన్నీ. ‘‘నా మొదటి సమస్య... నేను వాసన పసిగట్టే శక్తిని కోల్పోయాను. ఈ సమస్య తీర్చు’ అంటూ లేని సమస్యను చెప్పాడు అప్పారావు. ఒక చేత్తో వేడి వేడి చికెన్ బిర్యాని, మరో చేత్తో వేడివేడి చేపల పులుసుతో అప్పారావు ముందు నిలుచుంది జిన్నీ. వంటకాల ఘుమఘుమలు అదిరిపోతున్నాయి. అప్పారావు నోరు ఊరిపోతుంది.‘‘ఈ వంటకాల వేడి వేడి పొగలు కనిపిస్తున్నాయే తప్ప...వాసన ఏమాత్రం పసిగట్టలేకపోతున్నాను’ అలవోకగా అబద్ధం ఆడాడు అప్పారావు. ‘హాంఫట్’ అనగానే జిన్నీ చేతిలో కోతిబొమ్మతో ఉన్న చిన్న సీసా ఒకటి ప్రత్యక్షమైంది.‘‘బాస్...ఇందులో నుంచి రెండు చుక్కలు నోట్లో వేసుకోండి చాలు... మీరు కోల్పోయిన సెన్స్ ఆఫ్ టేస్ట్ తిరిగొస్తుంది’’ అంది జిన్నీ భూతం.‘‘అలాగే’’ అంటూ ఆ సీసాను చేతిలోకి తీసుకొని, నోట్లో వేసుకోబోయి నాలుక కర్చుకొని కోపంగా ఆరిచాడు.‘‘ఛీ...ఇది పెట్రోల్’’‘‘కాదని ఎవరన్నారు? ఇది పెట్రోలే!’’ అంది జిన్నీ.‘‘మందు ఇవ్వమంటే పెట్రోల్ ఇస్తావా? తమాషాగా ఉందా?’’ ఆగ్రహంతో అరిచాడు అప్పారావు. ‘‘అది తరువాత విషయం. నువ్వు వాసన పసిగట్టావా లేదా అనేదే ముఖ్యం!’’ అంది జిన్నీ. అప్పారావు ఒకటో సారి ఓడిపోయాడు.‘‘ఇప్పుడు నా రెండో సమస్య చెబుతాను. నా జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయాను. నిన్ను తప్ప ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాను’’ అన్నాడు అప్పారావు.అప్పుడు జిన్నీ చేతిలో ఆ కొత్తిబొమ్మ సీసా మళ్లీ ప్రత్యక్షమైంది.‘‘బాస్...ఈ సీసాలో నుంచి రెండు చుక్కలు నోట్లో వేసుకో చాలు. కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగి వస్తుంది’’ అని ఆ సీసాను అప్పారావుకు అందించబోయింది జిన్నీ.‘‘అబ్బ ఆశ...దోశ...అప్పడం వడ.... ఆ సీసాలో ఏముందో నాకు గుర్తు లేదనుకున్నావా? ఈ పెట్రోల్ చుక్కలు నాకెందుకు?’’ విసుక్కున్నాడు అప్పారావు.‘‘చూశారా...నీ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది’’ అంది భూతం.నాలుక కరుచుకున్నాడు అప్పారావు.‘‘నీ చివరి సమస్య ఏమిటో చెప్పు. అది కూడా తీరుస్తా’’ అంది జిన్నీ.‘‘నాకు ఈమధ్య కంటి సమస్య ఏర్పడింది.జస్ట్...పది అడుగుల దూరంలో ఉన్న దృశ్యాన్ని కూడా చూడలేకపోతున్నాను’’ అన్నాడు అప్పారావు.‘‘అయ్యా అప్పారావుగారు! ఈ సమస్యకు మాత్రం నా దగ్గర పరిష్కారం లేదు’’ అంది జిన్నీ. విజయగర్వంతో అప్పారావు ముఖం రాత్రిపూట క్రికెట్ స్టేడియంలా వెలిగిపోయింది. ‘‘నువ్వు ఓడిపోయావు కాబట్టి....ఒప్పందం ప్రకారం వెయ్యి గుంజీలు నాన్స్టాప్గా తీయాలి’’ అంటూ ఆదేశించాడు అప్పారావు. ‘‘అలాగే’’ అనుకుంటూ పది అడుగులు వెనక్కి వెళ్లింది జిన్నీ.రెండు నిమిషాల తరువాత: ‘‘అదేంటి...గుంజీలు తీయమంటే...గంగ్నామ్ డ్యాన్స్ చేస్తున్నావు?’’ కోపంగా జిన్నీపై అరిచాడు అప్పారావు.‘‘చూశావా...నీ కంటి సమస్య కూడా తీరిపోయింది. పది అడుగుల దూరంలోని దృశ్యాన్ని కూడా ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నావు’’ అంది జిన్నీ. అప్పారావు మరోసారి నాలుక కరుచుకున్నాడు.‘‘ ఇప్పటి వరకు నా సమస్యల గురించి మాత్రమే చెప్పాను. నాకో కోరిక ఉంది. అది తీర్చాలి’’ అడిగాడు అప్పారావు. ‘‘అలాగే’’ అంటూ ‘‘ఈసారి వీడిని నేను ఆడుకోవాలి’’ అనుకుంది జిన్నీ.‘‘నాకో గర్ల్ఫ్రెండ్ ఉంది. నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆమె దగ్గరే ఉండాలి. ఆమె ఎప్పుడూ నాతో మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడూ నా ముఖంలో ముఖం పెట్టి చూస్తూనే ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడంతోనే నా ముఖం చూడాలి. నేను లేకుంటే ఏదో కోల్పోయినట్లు ఉండాలి’’ చెప్పుకుంటూ పోయాడు అప్పారావు.‘‘ ఓకే’’ అంది జిన్నీ భూతం. వెంటనే స్మార్ట్ఫోన్గా మారిపోయాడు అప్పారావు.‘‘కోరిక తీర్చమంటే స్మార్ట్ఫోన్గా మార్చావేంటయ్యా మగడా...’’ ఆవేదనగా అరిచాడు సెల్రూప అప్పారావు.‘‘నువ్వు అడిగిన కోరికలు స్మార్ట్ఫోన్ అయితే తప్ప సాధ్యపడవు. మరో విషయం ఏమిటంటే..స్మార్ట్ఫోన్లో రకరకాల వెర్షన్లు ఉన్నట్లే అల్లావుద్దీన్ అద్భుతదీపంలోనూ ఉన్నాయి. నేను వరాల వెర్షన్ కాదు...శాపం వెర్షన్. నాకు అల్లావుద్దీన్ అద్భుతశాపం అని పేరు. అంటే నన్ను కోరికలు కోరినవాడు ఏదో ఒక శాపానికి గురవుతాడన్నమాట. ప్రసుత్తం నీకు అదే జరిగింది’’ గంభీరంగా పలికింది జిన్నీభూతం. – యాకుబ్ పాషా -
చైనాతో ఎప్పటికైనా ముప్పే!
న్యూఢిల్లీ: ఇన్నాళ్లుగా పాకిస్తాన్ సరిహద్దుపై పెడుతున్న దృష్టిని ఇకపై చైనా సరిహద్దుపైకి మరల్చాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. పొరుగుదేశాలను మంచి చేసుకుని భారత్కు ఇబ్బందులు సృష్టించేందుకు చైనా పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాల్సి ఉందన్నారు. పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా దూకుడుగా భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్మీడే సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘చాలా కాలంగా భారత ప్రభుత్వం పశ్చిమ సరిహద్దులపై దృష్టిపెడుతూ వస్తోంది. ఇప్పుడు ఉత్తరాన ఉన్న చైనా సరిహద్దుపైనా దృష్టి సారించాలి. ఉత్తర ప్రాంతంలో మౌలికవసతుల కల్పన వేగం పెంచాలి. మిలటరీ పరంగా చైనానుంచి ఏనాటికైనా ముప్పు ఉంటుంది. దీనికి దీటైన సమధానమిస్తాం’ అని అన్నారు. ఆ దేశాలకు హృదయపూర్వక మద్దతు ‘నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ చైనాతో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టాలి. ఈ దేశాలు భారత్నుంచి దూరంగా వెళ్లేందుకు మనం అనుమతించకూడదు’ అని అన్నారు. డోక్లాంలో చైనా బలగాల మోహరింపు ఉత్తర డోక్లాంలో చైనా సైన్యాన్ని మోహరిస్తోందని ఆయన తెలిపారు. శీతాకాలం తర్వాత చైనా మిగిలిన సరిహద్దు కేంద్రాల్లోనూ బలగాలను మోహరించే అవకాశం ఉందని.. దీనికి అనుగుణంగానే భారత బలగాలు వ్యవహరిస్తాయన్నారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు డ్రాగన్ దే శం ప్రయత్నిస్తే సమర్థవంతంగా తిప్పికొట్టే శక్తి భారత ఆర్మీకి ఉందని పునరుద్ఘాటించారు. మదర్సాలు, మసీదులపై నియంత్రణ కశ్మీర్లో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భారీమార్పులు తీసుకురావటంతోపాటు.. మసీదులు, మదర్సాలపై స్వల్ప నియంత్రణ అవసరమన్నారు. మరికొన్ని వివరాలు.. ► ఉగ్రవాద పోరులో అమరులైన వారి పిల్లల కోసం రెండు పాఠశాలల ఏర్పాటు. 3,4 ఏళ్లలో అమల్లోకి తెస్తాం. ► త్వరలోనే భారత, చైనా అధికారుల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)లు మాట్లాడుకునేందుకు హాట్లైన్ ఏర్పాటు. ► ప్రభుత్వం అనుమతిస్తే.. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులున్నాయంటూ చేస్తున్న బుకాయింపునకు సరైన సమాధానమిస్తాం. -
ఇక తెలంగాణపై అమిత్ షా నజర్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పూర్తికాలం తెలంగాణపై దృష్టిని కేంద్రీకరిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. జనవరిలో అమిత్షా, ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోదీ మార్గనిర్దేశకత్వంలో, అమిత్ షా వ్యూహరచనతో తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందన్నారు. గుజరాత్, హిమాచల్లో బీజేపీ గెలుస్తుందని, ఆ ప్రభావం తెలంగాణపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు సమావేశాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. -
వరంగల్ వైపు..చిత్ర పరిశ్రమ చూపు..
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన ఓరుగల్లు అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్ కూడా వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రతి బడ్జెట్లో నగర అభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ దృష్టి కూడా వరంగల్ వైపు మళ్లింది. దాదాపు ఇక్కడ18 సినిమాల షూటింగ్లు, ప్రమోషన్ వర్క్, విజయోత్సవాలను ఇక్కడ నిర్వహించారు. ఒకప్పుడు వరంగల్లో సినిమా కార్యక్రమాలు చేయాలంటే సినీ ప్రముఖులు వెనుకడుగు వేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. రోజు రోజుకు సినిమా ప్రమోషన్లు పెరిగిపోతున్నాయి. విడుదలకు ముందు సినిమా గురించి ప్రజలకు తెలిపేందుకు హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే గతంలో ప్రమోషన్ వర్క్ నిర్వహించే వారు. ఇప్పుడు వరంగల్లో సైతం జరుగుతున్నాయి. వరంగల్ విద్యాసంస్థలకు నిలయంగా మారడంతో విద్యార్థులు, యువత తాకిడి ఎక్కువగా ఉంటోంది. నిట్, కేఎంసీ, ఇంజనీరింగ్ కళాశాలు ఎక్కువగా ఉండడంతో అన్ని ప్రాంతాల కల్చర్ వరంగల్కు వచ్చేసింది. గరుడవేగ సినిమా విజయోత్సవం సందర్భంగా వరంగల్లోని దేవి థియేటర్కు హీరో రాజశేఖర్ టీం వచ్చింది. హీరో నాని నటించిన ఎంసీఏ సినిమా సగం షూటింగ్ వరంగల్, రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్, నిర్వహించారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో లండన్ బాబులు సినిమాలోని ఒక సాంగ్ను విడుదల చేశారు. రాజుగారి గది టీం హన్మకొండలోని అమృత థియేటర్కు వచ్చింది. రుద్రమదేవి సినిమాలోని మూడు పాటలను ఖిలా వరంగల్లోని శిల్పాల మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అనుష్క, దర్శకుడు గుణశేఖర్ వచ్చారు. పిల్ల నువ్వులేని జీవితం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రేజీనా వరంగల్లోని రాధిక, హన్మకొండలోని ఎషియన్ శ్రీదేవి మాల్కు వచ్చారు. గాలిపటం సినిమా విజయోత్సవం సందర్భంగా వరంగల్లోని రామ్లక్ష్మణ్ థియేటర్కు ప్రొడ్యూసర్ సంపత్ నంది, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలి యో, హీరో, హీరోహీరోయిన్ వచ్చి ప్రేక్షకులతో సందడి చేశారు. హీరోయిన్లు రేజీనా, సుఖన్య, హీరో రాహుల్ రవీంద్రన్ ములుగు రోడ్డులోని టాటా గోల్డ్ ప్లస్కు యాడ్ చిత్రీకరణ కోసం వచ్చారు. రేపు ఎంసీఏ ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో వరంగల్లో చిత్రీకరించిన ఎంసీఏ సినిమా ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ను హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో శనివారం నిర్వహించనున్నారు. ఇక్కడికి డైరెక్టర్, హీరో లు, హీరోయిన్లు రానున్నారు. ఇప్పటికే నిర్వాహకులు అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఆడియో విడుదల కూడా.. గ్రేటర్ వరంగల్ నగరానికి సినీ తారల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. సినిమాల ప్రమోషన్స్ కోసం ఎంతోమంది నగరానికి వస్తున్నారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతోందనే విషయం ప్రేక్షకులకు త్వరగా తెలుస్తోంది. సినిమాకు ముందు ప్రమోషన్, విడుదలైన అనంత రం విజయోత్సవ యాత్రలు కూడా వరంగల్లో చేస్తున్నారు. సినిమాలకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండడంతో థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషన్, విజయోత్సవ యాత్రలపై శ్రద్ధ చూపుతున్నారు. ఆడియో విడుదల సైతం వరంగల్లో ఉండే అభిమాన సంఘాల నాయకులతో చేయిస్తున్నారు. భీమవరం బుల్లోడు సినిమా ప్రమోషన్తోపాటు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హన్మకొండలోని శ్రీ దేవి మాల్లో జరిగింది. హీరో సునీల్, హీరోయిన్ ఎస్తేర్ తదితరులు వచ్చారు. చందమామ కథలు సినిమా ప్రమోషన్ నగర శివారులో వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. లెజెండ్ సినిమా విజయోత్సవ ర్యాలీ నగరంలో జరిగింది. సునీల్ థియేటర్లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను వచ్చి అభిమానులతో సందడి చేశారు. సినిమా తారలను చూసేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. గోల్డ్, బట్టల షాపులు, ఇతర షాపుల ప్రారంభోత్సవాలకు సినీ తారలను తీసుకొస్తున్నారు. మహేష్బాబు నటించిన నంబర్ వన్ సినిమా పాటను అభిమాన సంఘం నాయకుడు గందె నవీన్ అవిష్కరించారు. -
జాత్యహంకార దాడులపై భారత్ ఫోకస్
-
దేశీయ ఐటీరంగానికి ట్రంప్ ఒక వరం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారత ఐటీ పరిశ్రమపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఐటీ పరిశ్రమ హానికరమైనవిగా అందరూ భావిస్తోంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ మరోలా స్పందించారు. వాస్తవానికి ట్రంప్ విధానాలు, చేపడుతున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలే దేశీయ ఐటీ పరిశ్రమకు వరం లాంటివని వ్యాఖ్యానించారు. ఆందోళల్ని పక్కనపెట్టి దేశీయ ఐటీ వృద్ధికి కృషిచేయాలని ఆయన ఐటీ పరిశ్రమను కోరారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల ప్రారంభం సందర్భంగా ముకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధానాలు మరో రూపంలో ఐటీ పరిశ్రమకు సాయం చేస్తున్నట్టే అని చెప్పారు. దేశీయ ఐటీ మార్కెట్ కూడా భారీగా ఉన్న నేపథ్యంలో దేశంలోని ఐటీ సమస్యలను పరిష్కరించడంలో భారత ఐటి పరిశ్రమ దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఆలోచనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచం గోడలు నిర్మించాలని ఆలోచిస్తుండొచ్చు..కానీ దానికి ఇండియా ప్రభావితం కావాల్సిన అవసరం లేదన్నారు. భారతదేశం ద్వారాలు తెరిచే ఉండాలన్నారు. -
రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి
• తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో అనుకూల వాతావరణముందని నివేదిక • ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక రాష్ట్రానికి అమిత్షా! సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ అధినాయకత్వం పూర్తిగా దృష్టి సారించ నుంది. తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తమ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని జాతీయ నాయకత్వం పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో అత్యంత అనుకూల పరిస్థితు లున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇటీ వల బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి సతీశ్జీ మూడ్రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు కూడా అంతర్గత సమావేశంలో ఈ విషయాన్నే వెల్లడించినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణలో పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అంచ నా వేయనున్నారని తెలిసింది. దీంతో ఏ అంశాన్నీ ఆషామాషీగా తీసుకోకుండా జాతీ య నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో పార్టీ నాయక త్వానికి స్పష్టం చేసింది. కేంద్రం చేపడుతున్న పథకాలు, వాటి ద్వారా వివిధ వర్గాల ప్రజల కు అందుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. పరిస్థితులను బేరీజు వేసుకుని... రాష్ట్రంలో పార్టీకున్న అనుకూల పరిస్థితు లను బేరీజు వేసుకుని ముందుకు సాగాలని అధినా యకత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టడంతో పాటు టీఆర్ఎస్ విషయంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శిం చేందుకు నాయకత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఎస్సీల వర్గీకరణపై ప్రధానితో రాష్ట్ర ప్రభుత్వ అపాయింట్మెంట్ వాయిదా పడటంపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలపై రాష్ట్ర బీజేపీ ఘాటుగానే స్పందించింది. ఎన్ని కల ముందు టీఆర్ఎస్ వాగ్దానాలు, అధికారం లోకి వచ్చాక ఇచ్చిన హామీల అమల్లో ప్రభు త్వం వైఫల్యంపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనకు టీఆర్ఎస్ ప్రభు త్వం పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై రానున్న రోజుల్లో ఆందోళనలు తీవ్ర తరం చేసేందుకు సిద్ధమవుతోంది. యూపీలో బీజేపీ గెలిస్తే తెలంగాణలో పార్టీకి తప్పకుండా కలిసి వస్తుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. -
భారత్లో ఐఫోన్స్ తయారీకి యాపిల్ రెడీ
న్యూఢిల్లీ: అమెరికా, చైనాలో ఐఫోన్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. వ్యయాలు తగ్గించుకునే దిశగా ఇప్పటికే భారత్లో ఐఫోన్ల తయారీపై ఆసక్తి వ్యక్తం చేసిన యాపిల్.. తాజాగా ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకుంది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రమేశ్ అభిషేక్ సారథ్యంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందంతో భేటీ అయిన కంపెనీ వర్గాలు ఈ విషయాలు వివరించాయి. యాపిల్ ఐఫోన్ విభాగం గ్లోబల్ వైస్–ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రమణ్యన్ తదితర కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దిగుమతి చేసుకునే పరికరాలపై 15 సంవత్సరాల పాటు కస్టమ్స్ సుంకాల నుంచి, అలాగే కచ్చితంగా 30 శాతం పరికరాలు స్థానికంగా కొనుగోలు చేయాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని కంపెనీ కోరుతున్నట్లు సమాచారం. -
ఆ పార్టీల నిధులపై కన్ను
• ఆదాయపన్ను శాఖను కోరిన ఎన్నికల కమిషన్ • పోటీకి దూరంగా ఉన్న 200 పార్టీలపై దృష్టి న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న సుమారు 200 రాజకీయ పార్టీల నిధులపై కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) దృష్టి సారించింది. కాగితాలకే పరిమితమైన ఈ పార్టీలు మనీలాండరిం గ్కు సహకరిస్తున్నట్టుగా అనుమానిస్తున్న ఈసీ.. వీటికి అందిన నిధులపై ఓ కన్నేయాలని కోరుతూ ఆదాయపన్ను శాఖకు తాజాగా లేఖ రాసింది. ఈ పార్టీలు నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు సహ కారం అందించినట్టుగా ఈసీ అనుమాని స్తోంది. వీటిలో చాలా పార్టీలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఇవి విరాళాల రూపంలో నల్లధనాన్ని స్వీకరించి తెల్లగా మారుస్తూ కొందరికి సహకరిస్తున్నా యని భావిస్తోంది. 2005 నుంచి ఎన్నికల్లో పోటీ చేయని సుమారు 200 రాజకీయ పార్టీలను ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించింది. కొద్ది రోజుల్లో పార్టీల జాబితాను ఆదాయపన్ను శాఖ వర్గాలకు అందజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఏడు (బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ) జాతీయ పార్టీలు, 58 ప్రాంతీయ పార్టీలు, మరో 1780 రిజిస్టర్ అయినా గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయి. 20 వేలకు మించినవి రూ.102 కోట్లు జాతీయ పార్టీలకు 2015–16లో రూ.20 వేలకు మించిన విరాళాలు సుమారు రూ.102 కోట్లు వచ్చాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఇందులో బీజేపీకి అత్యధికంగా 613 విరాళాల నుంచి రూ.76.85 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 918 విరాళాల రూపంలో రూ.20.42 కోట్లు సమకూరాయి. ఈ నివేదికను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) రాజకీయ పార్టీలు ఈసీకి అందజేసిన డిక్లరేషన్ల ఆధారంగా రూపొందించాయి. -
ముద్రగడ ఉద్యమంపై నిఘా అస్త్రం
-
సొసైటీల అభివృద్ధిపై దృష్టి పెట్టండి
– ఆడిట్ను పకడ్బందీగా చేపట్టాలి. – సహకార శాఖ ప్రత్యేక కేటగిరి డిప్యూటి రిజిస్ట్రార్ వీరాచారి ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని సహకార శాఖ ప్రత్యేక కేటగిరీ డిప్యూటీ రిజిస్ట్రార్ వీరాచారి ఆదేశించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా సహకార అధికారులు, సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాల బలోపేతానికి ఐసీడీపీ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సహకార వ్యవస్థ పటిష్టతకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అన్ని సంఘాలు ఎరువుల వ్యాపారం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పీఏసీఎస్లను నిబందనల ప్రకారం ఆడిట్ చేయాలన్నారు. 2015–16 లో జరిగిన లావాదేవీలపై పక్కాగా ఆడిట్ నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 78 శాతం ఆడిట్ పూర్తయిందని, మిగిలిన 22శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి సుబ్బారావు, కర్నూలు డివిజన్ సహకార అధికారి ఉమామహేశ్వరీ, ఆడిట్ అధికారి నాగలింగేశ్వరి, డీసీసీబీ ఓఎస్డీ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. -
గంజాయి అక్రమ రవాణాపై నిఘా
ఎకై్సజ్ డెప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు చింతలపూడి : జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై నిఘాను పెంచినట్లు ఎకై్సజ్ డెప్యూటీ కమిషనర్ వైబి భాస్కరరావు తెలిపారు. చింతలపూడి ఎకై్సజ్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి రవాణా నిరోధానికి నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 65 మంది కానిస్టేబుళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరికల్లా వీరి శిక్షణ పూర్తవుతుందని చెప్పారు. అలాగే హైవేలలో రోడ్డు పక్కన ఉన్న మద్యం దుకాణాలను అక్కడి నుంచి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో తమ దాడుల్లో పట్టుబడిన 600 వాహనాలను వేలం వేయగా సుమారు రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. సారా తయారీకి వినియోగించే ముడి పదార్థాలు విక్రయించే వారిపై పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో డిప్యూటీ కమీషనర్ కార్యాలయంతోపాటు రెండు ఎకై్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలు, 13 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయని వివరించారు. అన్ని కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. -
బీసీసీఐ ఫిట్నెస్ మంత్ర
కాంట్రాక్టు క్రికెటర్లకు పరీక్షలు తప్పనిసరి ముంబై: ఆటగాళ్ల ఫిట్నెస్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక దృష్టి సారించింది. బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్న క్రికెటర్లందరికి ఇకపై క్రమం తప్పకుండా ఫిట్నెస్ టెస్టులు చేయాలని నిర్ణరుుంచింది. ఆటగాళ్లకు రెండు నెలలకోసారి... లేదంటే ప్రతి 45 రోజులకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు ఆటగాళ్ల వివరాలను భారత చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే బోర్డుకు సమర్పించారు. 2011 వన్డే ప్రపంచకప్కు ముందు కూడా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ తదనంతరం పూర్తిస్థారుులో ఈ ప్రక్రియను కొనసాగించలేకపోయారు. -
పాలమూరు,నల్గొండలో నయీంకు పూర్తి పట్టు
-
హైదరాబాద్ టు వైజాగ్.. గంటలోపే?
గూడ్సు బండిలో వెళ్లేవాణ్ణి గోదావరి ఎక్కిస్తే ఎలా ఉంటుంది? గమ్మత్తుగా ఉంటుంది. అమ్మో!! ఎంత స్పీడో! అనిపిస్తుంది. మరి గోదావరిలో వెళ్లేవారు కాస్తా... భోపాల్ శతాబ్ది ఎక్కితేనో? ఆశ్చర్యానికి అంతుండదు. ఆ వేగానికి కళ్లు తిరుగుతాయి!!. అవును మరి! దేశంలో గూడ్సు రైలు స్పీడు గంటకు పాతిక కిలోమీటర్లు. అదే గోదావరి అయితే రెట్టింపు... అంటే 57 కిలోమీటర్లు. ఇక భోపాల్ శతాబ్ది అయితే ఏకంగా గంటకు 150 కిలోమీటర్లు. దేశంలో అత్యధిక వేగంతో వెళుతున్న రైలు ఇదే. ఒకరకంగా హైస్పీడ్ రైలన్న మాట. ఇలాంటి రైళ్లను ఇంకా తెస్తామని, మరింత వేగంగా వెళ్లే హైస్పీడ్ రైళ్లను నడుపుతామని ప్రభుత్వాలు కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నాయి. ఈ మధ్యే చర్యలు ఊపందుకున్నాయి కూడా. మన దేశంలో ఇవి అందరికీ ఎప్పుడు అందుబాటులోకొస్తాయో తెలీదు. కొన్ని దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఇదంతా ఎందుకంటే... మనం హైస్పీడ్ రైళ్ల కోసం మాట్లాడుకుంటుంటే... ప్రపంచం హైపర్లూప్ టెక్నాలజీవైపు పరుగు పెడుతోంది. అంటే... భూమ్మీద అతివేగంగా వెళ్లే రైలన్నమాట. ఇంకా చెప్పాలంటే... భూమ్మీదే కాదు. ఆకాశంలో వెళ్లే విమానాలూ దీని వేగాన్ని అందుకోలేవు. మూడేళ్ల కిందట టెక్ దిగ్గజం ఇలాన్ మస్క్ బయటపెట్టిన ఈ ఆలోచన... మరో మూడేళ్లలో అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో పట్టాలెక్కడానిక్కూడా సిద్ధమవుతోంది. భారతదేశ నాయకత్వం చెబుతున్న హైస్పీడ్ రైళ్లు ఒట్టి దండగని, అవి భవిష్యత్తు తరాలకు పెను భారంగా మారతాయని కూడా ఈ హైపర్లూప్ టెక్నాలజీ కంపెనీలు చెబుతున్నాయి. ఇండియాలో రెండు కారిడార్లు దీన్ని అమలు చేయటానికి పనికొస్తాయని తాము గుర్తించినట్లు కూడా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో... అసలు ఈ టెక్నాలజీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఏఏ కంపెనీలు పనిచేస్తున్నాయి? ఎన్నాళ్లలో అమల్లోకి రావచ్చు? అసలు ఇండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిందెవరు? అవన్నీ నిజమేనా...? ఈ వివరాల విశ్లేషణే ఈ వారం ‘ఫోకస్’. భూమి మీద విమానాన్ని మించిన వేగం హైపర్లూప్ సొంతం * గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి వీలు- వాక్యూమ్ ట్యూబ్తో ట్రాక్... దానిపై ట్యూబుల్లాంటి పెట్టెలు- గాలి నిరోధం ఉండకపోవటంతో తక్కువ ఇంధనం చాలు * ట్రాక్పై సోలార్ ప్యానెళ్లు... గాలి మరలతో విద్యుదుత్పత్తి * సొంత అవసరాలకు పోగా 30 శాతం ఇంధనం మిగిలే అవకాశం- 2013లో ఆవిష్కరించిన స్పేస్ ఎక్స్ అధిపతి ఇలాన్ మస్క్ * రెండేళ్ల కిందట నిధులతో సహా ఆవిర్భవించిన రెండు కంపెనీలు * అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాల్లో చురుగ్గా టెస్ట్ ట్రాక్ నిర్మాణం * 2019 నాటికి ప్రయోగాత్మక పరుగు పూర్తి! * యూరప్, అమెరికాల్లో పలు లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు * ఇండియాలోనూ రెండు లైన్లను గుర్తించామన్న హెచ్టీటీ * హైస్పీడ్ రైళ్లు దండగని, భవిష్యత్తు తరాలకు భారమని వ్యాఖ్య * దానిబదులు హైపర్లూప్ నిర్మిస్తే మంచిదన్న హెచ్టీటీ సీఓఓ * స్లొవేకియాతో హెచ్టీటీ ఒప్పందం; దుబాయ్తో కూడా? ఇలాన్ మస్క్. టెక్నాలజీ ప్రపంచంలో ఈయన గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాలో పుట్టి, కెనడాలో చదివిన ఈ టెక్ మేధావి... 12 ఏళ్లకే ఓ గేమ్ను తయారుచేసి విక్రయించాడు. పాతికేళ్లకే ఓ సాఫ్ట్వేర్తో... న్యూయార్క్ టైమ్స్, షికాగో ట్రిబ్యూన్ వంటి పత్రికల్ని తన క్లయింట్లుగా చేసుకున్నాడు. పేమెంట్ దిగ్గజం ‘పే పాల్’, ఎలక్ట్రిక్ కార్ల సంచలనం ‘టెస్లా’... ప్రయివేటు ‘నాసా’గా మారిన ‘స్పేస్ ఎక్స్’... ఇవన్నీ మస్క్ సంచలనాలే. చౌక అంతరిక్ష ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తానని, అంగారకుడిపై కాలనీ నిర్మిస్తానని చెప్పటమే కాదు... అందుకోసం రాకెట్ల తయారీ సంస్థ ‘స్పేస్ఎక్స్’ను ఏర్పాటు చేసి, విజయవంతంగా రాకెట్లను తయారు చేసి చూపించాడు మస్క్. వాక్యూమ్ ట్యూబ్ల వంటి సాధనాల్లో భూమ్మీద అతి వేగంగా ప్రయాణించొచ్చుననే కాన్సెప్ట్ను 2013లో మస్క్ బయటపెట్టి... దానికి ‘హైపర్లూప్’ అనే పేరు పెట్టాడు. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని ఎవరైనా అభివద్ధి చేయొచ్చునని ప్రకటించాడు. అది జరిగిన ఏడాదికి... ఈ టెక్నాలజీ కోసం తాము నిధులు సమీకరించామని ‘హైపర్లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ (హెచ్టీటీ)’ సంస్థ ప్రకటించింది. తరవాత... తామూ రేసులో ఉన్నట్లు ‘హైపర్లూప్ ఒన్’ అనే మరో సంస్థ ప్రకటించింది. వైమానిక రంగంలో బోయింగ్, ఎయిర్బస్ల మాదిరి హైపర్లూప్ రంగంలో ప్రస్తుతం ఈ రెండే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? ♦ హైపర్లూప్ టెక్నాలజీని అమలు చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మార్గాల్ని ప్రతిపాదించారు. వాటిలో మొదటిది అమెరికాలోని లాస్ ఏంజిలిస్ - శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా. దూరం 560 కిలోమీటర్లు. 35 నిమిషాల్లో ప్రయాణించొచ్చనేది ఆలోచన. ♦ ఈ ఏడాది జనవరిలో... పారిస్ - ఆమ్స్టర్డ్యామ్ హైపర్లూప్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ♦ పోలండ్లోని క్రాకో నుంచి గాన్స్క్ వరకూ 581 కిలోమీటర్ల మార్గాన్ని హైపర్ పోలండ్ సంస్థ ప్రతిపాదించింది. ♦ ఫిన్లండ్లోని హెల్సింకీ నుంచి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ వరకూ సముద్ర మార్గంలో టన్నెల్ ద్వారా 484 కిలోమీటర్ల హైపర్లూప్ వేయాలనే ప్రణాళికలూ ఊపందుకున్నాయి. ♦ హెచ్టీటీ సంస్థ లాస్ ఏంజిలిస్- శాన్ఫ్రాన్సిస్కో మార్గంతో పాటు ఇతర మార్గాలనూ చూస్తోంది. ♦ హైపర్లూప్ ఒన్ సంస్థ మాత్రం లాస్ ఏంజిలిస్- లాస్వెగాస్ మార్గాన్ని ప్రతిపాదిస్తోంది. ♦ బ్రటిస్లావా - బుడాపెస్ట్ - వియెన్నా మధ్య హైపర్లూప్ను నడిపితే ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చెయ్యటానికి ఈ మధ్యే స్లొవేకియా ప్రభుత్వంతో హెచ్టీటీ ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది. ♦ దుబాయ్ ప్రభుత్వం కూడా హెచ్టీటీతో సంప్రతింపులు జరుపుతోందని, ఒప్పందం కుదిరితే తొలి హైపర్లూప్ అక్కడే పరుగు పెడుతుందని ఇంటర్నెట్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ♦ ఇండియాలో దీనికి అనుకూలమైన రెండు కారిడార్లను గుర్తించినట్లు హెచ్టీటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిబోప్ గ్రేష్టా ఇటీవలే చెప్పారు. ఇదీ టెక్నాలజీ..? హైస్పీడ్ రైళ్లలో ఉండే ఇబ్బందుల్లో ప్రధానమైనవి... 1. యంత్ర పరికరాల మధ్య ఘర్షణ, 2. గాలి నిరోధం. వేగం పెరుగుతున్న కొద్దీ గాలి నిరోధం ఎక్కువవుతుంది. దాన్ని అధిగమించాలంటే భారీ ఇంధనం కావాలి. ఇక ఘర్షణ వల్ల యంత్రపరికరాలు దెబ్బతినటం, నిర్వహణ వ్యయం భారీగా పెరగటం జరుగుతోంది. హైపర్లూప్లో వాడే ‘వాక్ట్రయిన్’లో ఈ రెండు సమస్యలూ ఉండవు. ఎందుకంటే వాక్ట్రయిన్ ఒక ట్యూబ్లో నడుస్తుంది. ఆ ట్యూబ్లో గాలి ఉండదు. వాక్యూమ్ లేదా పాక్షిక వాక్యూమ్ ఉంటుంది. దీంతో ఎంత వేగంగా వెళ్లినా గాలి నిరోధం ఉండదు. ఇక యంత్రపరికరాల మధ్య ఘర్షణ ఉండదు కనక నిర్వహణ వ్యవయమూ తక్కువే ఉంటుంది. పైలాన్లపై గానీ, భూగర్భంలో గానీ ట్యూబ్ లాంటి నిర్మాణం చేసి... ఆ ట్యూబ్లో చిన్న చిన్న ‘పోడ్’లాంటి వాక్ ట్రయిన్లు నడుపుతారన్న మాట. తొలి డిజైన్ ప్రకారం... ఈ పోడ్ల ఎత్తు కేవలం 7.4 అడుగులే ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 1,220 కి.మీ. హెచ్టీటీ.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్న 500 మంది ఇంజినీర్ల బందమే ఈ కంపెనీ. వీరంతా వారానికోసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలుస్తుంటారు. వీరికి జీతాల్లేవు కానీ కంపెనీలో వాటాలున్నాయి. 2015లోనే సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని పూర్తి చేయాలనుకుంది. కానీ కుదరలేదు. అయితే కాలిఫోర్నియాలో టెస్ట్ ట్రాక్ను నిర్మించడానికి సంబంధించి స్థానిక భూ యజమానులతో ఒప్పందాలు పూర్తయినట్లు గతేడాదే సంస్థ ప్రకటించింది. ట్రాక్ నిర్మాణంలో సహకారినికి ఓర్లికాన్ లేబోల్డ్ వాక్యూమ్, ఏకామ్ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. గతేడాది నవంబరులో పనలు మొదలయ్యాయి. 150 మిలియన్ డాలర్ల వ్యయంతో (రూ.1,000 కోట్లు) రెండున్నరేళ్లలో ప్రయోగం పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. హైపర్లూప్ ఒన్.. లాస్ ఏంజిలిస్- లాస్వెగాస్ మధ్య హైపర్లూప్ నడపాలని ఆలోచిస్తున్నామంటూ 2015లో ప్రకటించటం ద్వారా ఈ సంస్థ తెరమీదికొచ్చింది. ఇంజినీర్లు, డెరైక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి... నిర్వహణ ఖర్చుల కోసం 9 కోట్ల డాలర్ల నిధులను సమీకరించినట్లు కూడా ప్రకటించింది. 100 మంది ఇంజినీర్లున్న ఈ సంస్థకు... ఇలాన్ మస్క్తో గట్టి సంబంధాలున్న షెర్విన్ పిషేవర్ సహ వ్యవస్థాపకుడు. స్పేస్ ఎక్స్కు లీడ్ ఇంజినీర్గా వ్యవహరించిన బ్రోగన్ బాంబ్రోగన్ మరో వ్యవస్థాపకుడు. అంతేకాదు! మస్క్కు నేరుగా దీంతో సంబంధాలు లేకున్నా ఆయన సన్నిహితులు పలువురు దీన్లో ఉన్నారు. ఎప్పకటిప్పుడు ఆయనకు అన్నీ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది మే 11న హైపర్లూప్ ఒన్ తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రత్యక్షంగా పరీక్షించింది. జులైలో... హెల్సింకీ- స్టాక్హోమ్ మధ్య హైపర్లూప్కు అవకాశాలు బాగున్నాయంటూ తమ అధ్యయన నివేదికను బయటపెట్టింది. ఈ రెండింటి మధ్య ప్రయాణ సమయం అర్ధగంటకు పరిమితమవుతుందని, నిర్మాణ వ్యయం 19 బిలియన్ యూరోలుంటుందని అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో రూ.1,430 కోట్ల పైమాటే. ట్రాన్స్పాడ్.. ఈ సంస్థ ట్యూబ్లో నడిచే వాహనాల్ని (పాడ్) డిజైన్ చేస్తున్నట్లు చెబుతోంది. ఈ ఏడాది మార్చిలో కొత్త డిజైన్ను విడుదల చేసింది. వచ్చే నెల బెర్లిన్లో జరిగే ఇన్నో ట్రాన్స్రైల్ షోలో పూర్తిస్థాయి డిజైన్ను ఆవిష్కరిస్తామని చెబుతోంది. ఈ పాడ్ను వెయ్యి కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. నియంత్రణ పూర్తిగా కంప్యూటర్ ఆధారంగానే ఉంటుంది. సోలార్ పవర్తో నడిచేలా చూస్తున్నారు. 2020 నాటికి తొలి పాడ్ను ఉత్పత్తి చేస్తామని సంస్థ చెబుతోంది. టొరంటో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ... మాంట్రియల్ -టొరంటో మధ్య దీన్ని నడపాలని కూడా ప్రతిపాదిస్తోంది. ఇది యూరప్లోని పలు వర్సిటీలు, ఏరోస్పేస్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ప్రయోగాలకు ట్రాక్లు... ⇒ హెచ్టీటీ, హెచ్ఒన్లతో పాటు హైపర్లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్ను బయటపెట్టిన స్పేస్ ఎక్స్ కూడా ప్రయోగాలకు సిద్ధమయింది. ⇒ కాలిఫోర్నియాలోని క్వే వ్యాలీలో 8 కిలోమీటర్ల టెస్ట్ ట్రాక్ను హెచ్టీటీ నిర్మిస్తోంది. ⇒ కాలిఫోర్నియాలోని హాతోర్న్లో 1.6 కిలోమీటర్ల టెస్ట్ట్రాక్ను స్పేస్ఎక్స్ చేపట్టింది. ⇒ నెవెడాలోని నార్త్ లాస్ వెగాస్లో హైపర్లూప్ ఒన్ టెస్ట్ ట్రాక్ను ఏర్పాటు చేస్తోంది. -
చెరువులకు 'జీవం'
రాష్ట్రంలో చెరువులు జలకళతో తొణికిసలాడుతున్నాయి.. దశాబ్దాల తరబడి పూడికతీతకు నోచుకోక, కొన్నిచోట్ల ఆనవాళ్లే కోల్పోయిన చెరువులన్నీ ‘మిషన్ కాకతీయ’తో కొత్తరూపు సంతరించుకున్నాయి.. ఇటీవలి వర్షాలకు భారీగా నీరు చేరడంతో రైతన్నల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.. చెరువుల సామర్థ్యం పెరగడంతో వాటి కింది పొలాలన్నింటికీ జీవం రానుంది. చిన్న నీటి వనరుల పునరుద్ధరణ, అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలి విడతలో రూ.2,626 కోట్లతో పునరుద్ధరించిన 7,373 చెరువుల ద్వారా తెలంగాణలో వేలాది ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఈ వారం ఫోకస్.. - సాక్షి నెట్వర్క్ ⇒ రాష్ట్రవ్యాప్తంగా కళకళలాడుతున్న చెరువులు ⇒ పునరుద్ధరణతో పూర్తి సామర్థ్యం మేరకు నీటి నిల్వ ⇒ పలు చోట్ల రెండు పంటలకూ నీరిచ్చేందుకు వీలు ⇒ ఆయకట్టు స్థిరీకరణతో రైతుల్లో కొత్త ఆశలు ⇒ చిన్న నీటి వనరుల కింద పెరుగుతున్న సాగు విస్తీర్ణం మిషన్ కాకతీయ పథకం తొలి విడత కింద 8,049 చెరువులను ఎంపిక చేసి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అందులో 7,373 చెరువులు పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకున్నాయి. వాటిల్లో చాలా చెరువుల్లో ఇటీవలి వర్షాలకు నీరు చేరింది. దీంతో ఆయా చెరువుల కింద ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 549 చెరువుల మరమ్మతుకాగా.. 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, అందులో కొంత భాగం ఇప్పటికే సాగులోకి వచ్చిందని ఆ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతకుముందు ఈ చెరువుల కింద ఆయకట్టు 25 వేల ఎకరాలకు మించి లేదని అంటున్నారు. ఇందూరు.. నిండుగా నీరు! నిజామాబాద్ జిల్లాలో తొలి దశలో 618 చెరువులను పునరుద్ధరించారు. ఇటీవలి వర్షాలకు జిల్లాలోని 2,811 చెరువుల్లో నీరు చేరింది. అందులో 169 చెరువులు వంద శాతం నిండినట్టు లెక్కలు చెబుతున్నాయి. వాటిలో అత్యధికం పూడిక తీసిన చెరువులేనని అధికారులు అంటున్నారు. ‘నీళ్ల’గొండ.. నల్లగొండ జిల్లాలో రూ.40 కోట్లతో 760 చెరువులను పునరుద్ధరించారు. దాదాపు అన్ని చెరువుల్లోనూ నీళ్లు చేరాయి. అర్వపల్లి మండలం నాగారం పెద్దచెరువు ప్రస్తుతం అలుగు పోస్తోంది. ఈసారి చెరువు కింద ఉన్న 400 ఎకరాల ఆయకట్టు మొత్తం సాగులోకి రానుందని రైతులు చెబుతున్నారు. ఆత్మకూరు (ఎం) మండలం చాడ పెద్ద చెరువు కింద 401 ఎకరాల ఆయకట్టుకు చెందిన రైతులూ సమాయత్తమవుతున్నారు. పాలమూరు.. నీరే నీరు మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడతగా రూ.284.31 కోట్లతో 918 చెరువుల పనులు పూర్తిచేశారు. ఇటీవల భారీ వర్షాలు పడడం, చెరువుల సామర్థ్యం పెరగడంతో వాటిలో భారీగా నీరు చేరింది. జడ్చర్ల చెరువు కింద ఉన్న 25 ఎకరాల ఆయకట్టు చాలా ఏళ్ల తరువాత తిరిగి సాగులోకి రానుంది. చెరువు నిండడంతో పక్కనే ఉన్న ప్రాంతాల్లోని బోర్లలో నీటిమట్టం పెరిగిందని రైతులు చెబుతున్నారు. వరంగల్.. చెరువులు ఫుల్ వరంగల్ జిల్లాలో మొదటి విడత కింద 973 చెరువుల పనులు పూర్తి చేశారు. వానలు కురవడంతో అవన్నీ నిండిపోయాయి. అలుగు పారుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. మద్దూరు మండలం గాగిళ్లాపూర్ పెద్ద చెరువుకు కొత్త కళ వచ్చింది. దీని కింద ఆయకట్టు 639 ఎకరాలైతే.. ఏకంగా 1,500 ఎకరాలు సాగు చేసే స్థాయిలో నీరు చేరింది. ఆరేళ్లుగా ఎండిపోయిన ధూల్మిట్ట చెరువు పూడికతీతతో సామర్థ్యం పెరిగింది. పూర్తిగా నిండడంతో దీని కింద 104 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ఇక 232 ఎకరాల ఆయకట్టున్న నల్లకుంట చెరువు.. ఇప్పుడు ఏకంగా 1,200 ఎకరాలకు నీరిచ్చే స్థాయికి మెరుగుపడింది. చెరువు పూర్తిగా నిండిపోవడంతో చుట్టుపక్కల 5 గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో నీరు ఊరుతోంది. చేర్యాల మండలం ఆకునూరులోని పోకలమ్మ చెరువు కింద 97 ఎకరాలకు సాగునీరందనుంది. ‘జల’ సంద్రం ఈ చిత్రంలో కనిపిస్తున్నది వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాటలోని సోమసంద్రం చెరువు. నిజాంల కాలంలో 150 ఏళ్ల క్రితం దీనికి గండి పడింది. అప్పటినుంచి ఎవరూ పట్టించుకోలేదు. మిషన్ కాకతీయ తొలి విడతలో ఈ చెరువుకు రూ.26.30 లక్షలు కేటాయించి పనులు చేపట్టారు. గండ్లు పూడ్చి, పూడిక తీయడంతో ఇటీవలి వర్షాలకు పూర్తిగా నిండింది. చెరువు కింద ఆయకట్టుకు జీవమొచ్చింది. జల ‘సిరి’చెల్మ ఇది ఆదిలాబాద్ జిల్లాలోని సిరిచెల్మ చెరువు. దీన్నుంచి మొన్నటి వరకు 50 ఎకరాలకైనా నీరందేది కాదు. మొదటి విడత మిషన్ కాకతీయ కింద రూ.1.13 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. పూడిక తీసి, కట్టను బలోపేతం చేశారు. వాననీరు చెరువులోకి చేరేలా ఫీడర్ చానల్ నిర్మించారు. ప్రస్తుత వర్షాలతో చెరువులోకి నీళ్లు చేరాయి. ఇప్పుడు చెరువు కింద 300 ఎకరాల్లో రెండు పంటలకూ సాగు నీరందనుంది. మెతుకుసీమ తళుక్కు తొలి విడత కింద మెదక్ జిల్లాలో అత్యధికంగా 1,684 చెరువుల్లో రూ.670 కోట్లతో పనులు చేపట్టారు. 1,630 చెరువుల పనులు పూర్తయ్యాయి. అందోల్ మండలం అన్నసాగర్ చెరువులో రూ.46 లక్షల వ్యయంతో 45 వేల క్యూబిక్ మీటర్ల మేర పూడిక తీశారు. ప్రస్తుత వర్షాలతో భారీగా నీరు చేరింది. ఈ చెరువు కింద 350 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా... చాలా ఏళ్ల తరువాత అదంతా సాగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆ రెండు జిల్లాల్లో విచిత్ర పరిస్థితి ఇటీవలి భారీ వర్షాలతో కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గోదావరితో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ చెరువుల్లో మాత్రం నీరు చేరలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,517 చెరువులుంటే.. ఇప్పటివరకు 520 చెరువులు మాత్రమే నిండినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా చెరువుల్లో 20 నుంచి 75 శాతం నీరు మాత్రమే చేరిందని అంటున్నారు. ఈ జిల్లాలో తొలి విడత కింద 812 చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 823 చెరువుల్లో పూడిక తీశారు. ఇటీవల భారీ వర్షాలు పడినా అవేవీ నిండలేదు. జిల్లావ్యాప్తంగా 70 శాతం చెరువుల్లో అంతంతగానే నీళ్లు చేరాయని అధికారులు చెబుతున్నారు. దాంతో ఆయా చెరువుల కింద నాట్లు పడలేదు. అక్రమాలతో గుండె ‘చెరువే’ ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన చెరువులకు మహర్దశ పట్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వందల కోట్లు వెచ్చించి చేపట్టిన ఈ పథకం కింద కాంట్రాక్టులను చాలాచోట్ల అధికార పార్టీ నేతలే బినామీ పేర్లతో దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. మారుమూల గ్రామాల్లోని చెరువు పనులను నీటి పారుదల శాఖ అధికారులే ‘కాంట్రాక్టర్లు’గా మారి చేపట్టిన ఉదంతాలు వెలుగుచూశాయి. అలాగే చాలాచోట్ల చెరువుల పనులను నామమాత్రంగా చేసి రూ.లక్షల్లో బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. -
యాంత్రీకరణపై సర్కార్ నజర్
మహబూబ్నగర్ వ్యవసాయం: సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్నదే తమ లక్ష్యం అంటూ పదేపదే ముఖ్యమంత్రి చెబుతువస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా గడిచిన రెండేళ్ల కాలంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్షేమ పథకాలలో లబ్ధిపొందిన వారిపై ప్రభుత్వం నజర్ పెట్టింది. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తోంది. సదరు పరికరాలు రైతులు వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై ఇంటర్ డిస్ట్రిక్ స్వా్కడ్ టీంలను నియమించి క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. 2015–16 వార్షిక ఏడాదిలో జిల్లాలో వ్యవసాయాంత్రీకరణకు రూ. 5 కోట్ల రాయితీ యంత్ర పరికరాలను, ఆర్కేవీవై కింద రూ. 3.6 కోట్ల విలువలగల పరికరాలపై క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో పంపిణీ చేసిన పరికరాలు,ట్రాక్టర్లపై విచారించేందుకు రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఒక ఏడీఏ,ఒక ఎంఏఓతో కూడిన రెండు బృందాలు జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలో విచారణ చేట్టాయి.మంగళవారం షాద్నగర్,జడ్చర్ల,అచ్చంపేట,నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడమొదలైంది. -
దేశీయ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం
మద్దిలపాలెం: భాతతీయ దేశీయ ఉత్పత్తులైన జనపనార, చేనేతలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ఎంతైన అవసరం అని రాష్ట్ర మానవవనరుల, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం జౌళి సంస్థ ఆధ్వర్యంలో 70 వసంతాల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కార్యక్రమం ఏర్పాటయ్యింది. మద్దిలపాలెం సి.ఎం.ఆర్ సెంట్రల్లో ఏర్పాటయిన కార్యక్రమానికి ముఖ్య అతి««థిగా మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాన్వాస్పై త్రివర్ణ రంగులద్దారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ పరిశ్రమలైన జనపనార, చేనేత పరిశ్రమల ఉత్పత్తులపై ప్రజల్లో విస్తత ప్రచారం చేసే దిశగా కేంద్ర జౌళి పరిశ్రమలశాఖ మంత్రి స్మృతిఇరానీ ఆదేశాల మేరకు ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం అభినందనీయమన్నారు. దీరిలొ భాగంగా మంగళవారం నుంచి ఆగష్టు 15వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కార్యక్రమంలో విశాఖ మహానగరంలో ఉన్న యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్టు తెలిపారు. ఆగష్టు 15న అన్ని కలర్స్ ఇండిపెండెన్స్ నమూనాలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి ప్రత్యేక కార్యక్రమం రూపొందించనున్నట్టు తెలిపారు. జౌళి ఉత్పత్తులపై ఆధారపడే వేలాది మంది కార్మికులకు చేయూతనిచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కార్యక్రమంలో మదిని దోచే మనసులోని భావాలను వ్యక్తీకరించే అందమైన రూపాలనుందిచే రంగులు వేయడానికి సి.ఎం.ఆర్ ప్రాంగణంలో పెద్ద కాన్వాస్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జ్యూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ మూర్తి, సి.ఎం.ఆర్ అధినేత మావూరి వెంకటరమణ పాల్గొన్నారు. -
200 బ్రాండ్లను తొలగిస్తున్న మింత్ర?
బెంగళూరు: దేశ అతిపెద్ద ఆన్ లైన్ ఫ్యాషన్ రీటైలర్ మింత్రా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ గత ఏడాది కొనుగోలు చేసిన ఫ్యాషన్ పోర్టల్ మింత్రా దాదాపు 200 బ్రాండ్లను డీలిస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కనీసం 10 శాతం ఉత్పత్తులను తమ వ్యాపారంనుంచి తొలగిస్తున్నట్టు సమాచారం. తక్కువ ఆదరణ ఉన్న ఉత్పత్తులను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించి, ప్రముఖ బ్రాండ్లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందిట. ప్రస్తుతం నైక్, అదిదాస్,పూమా, లీ, లివైస్, యారో, క్యాట్,హార్లీ డేవిడ్ సన్, ఫెరారి తదితర 25 అంతర్జాతీయ బ్రాండ్లను ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. అమ్మకాల పరంగా బలహీనంగా ఉన్న బ్రాండ్లను తొలగించిన మింత్రా పెద్ద బ్రాండ్ దృష్టి సారించిందని బెంగుళూరు ఆధారిత కంపెనీ మింత్రా సన్నిహితులు తెలిపారు. 150-200 బ్రాండ్లను తొలగిస్తోందనీ, భవిష్యత్తులో మరిన్నింటిని తొలగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రోజుకు రెండు మూడు మాత్రమే విక్రయిస్తున్న బ్రాండ్లను తొలగించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మింత్రా నిరాకరించింది. కాగా మింత్రా కూడా ప్రపంచ బ్రాండ్లపై దృష్టి పెడుతుందనీ సీఈవో అనంత్ నారాయణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాదికి బిలియన్ డాలర్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. స్థిరమైన వృద్ధి రేటుతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అధికలాభాలు గడించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫరెవర్ 21 మింత్రా లో రంగప్రవేశంతో మింత్రా ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. -
ప్రధాని ఆఫ్రికా పర్యటనలో..
న్యూఢిల్లీః ప్రధాని ఆఫ్రికా పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆఫ్రికా, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం, సహకారం బలోపేతం చేయడంతోపాటు ఆయాదేశాల్లోని అనేక వనరుల వినియోగంపై దృష్టి సారించనున్నారు. పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు, పప్పుధాన్యాలు, విద్యుత్ శక్తి మొదలైన అంశాలపై చర్చించనున్నారు. జూలై 7న మొదలై.. ఐదురోజులపాటు కొనసాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో విద్యుత్, వాణిజ్య, పెట్టుబడి, ఆహారం, సముద్ర భద్రత, తీవ్రవాదం, సహకారం వంటి విషయాలపై దృష్టి సారించనున్నట్లు భారత విదేశాంగశాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి అమర్ సిన్హా తెలిపారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఒక్కోదేశంలోనూ అనేక ఒప్పందాలపై మోదీ సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలో.. చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అమిద్ అన్సారీలు ఆఫ్రికా దేశాల్లో పర్యటించగా... ప్రస్తుతం మోదీ పర్యటన మరింత దోహదం చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే భారతదేశం ఆఫ్రికా దేశాలనుంచి భారీ పరిమాణంలో పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటుండగా.. ఈ పర్యటనలో మొజాంబిక్ తో దీర్ఘ కాల సేకరణకు ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొద్ది నెల్లుగా భారత్ లో పప్పుధాన్యాల ధర తీవ్రంగా పెరగడం అనేక విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రధాని పప్పుధాన్యాల దిగుబడులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జోహాన్స్ బర్గ్, నైరోబిల్లో భారత సంతతికి చెందిన ప్రజలు గణనీయంగా ఉండటంతో ప్రధాని ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా నాలుగు దేశాల్లో జరిగే సమావేశాల్లో భారత సమాజంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సిన్హా తెలిపారు. పర్యటనలో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ ఎంతో లాభం చేకూరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ లో భారత్ లో నిర్వహించిన నాలుగు రోజుల ఆఫ్రికా దేశాల సదస్సుకు సుమారు 54 ఆఫ్రికా దేశాల ప్రభుత్వాధినేతలు, 40 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. గురువారం ప్రారంభం కానున్న మోదీ విదేశీ ప్రయాణంలో ముందుగా మొజాంబిక్ కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు ఫిలిఫె న్యూసితో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తారు. అనంతరం రెండు రోజులపాటు దక్షిణాఫ్రికాలోని జొహన్స్ బర్గ్, పీటర్ మారిట్జ్ బర్గ్, డర్బన్ నగరాల్లో పర్యటిస్తారు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంలో మహాత్మాగాంధీ ప్రయాణించిన చారిత్రక రైలులో మోదీ పీటర్మారిట్జ్ బర్గ్ ప్రయాణించనున్నారు. తెల్లవారు కాని వారికి అనుమతి లేదంటూ అప్పట్లో మహాత్మా గాంధీని మొదటి తరగతి కంపార్ట్ మెంట్ నుంచి బయటకు తోసేసిన కథనం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో భారత్ కు ఉన్న చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమాతోపాటు, ఇతర రాజకీయ నేతలతో మోదీ సమావేశం అవుతారు. జూలై 10న టాంజానియాలో, 11న కెన్యాలో మోదీ పర్యటన జరగనున్నట్లు ప్రధాని పర్యటనపై పూర్తి వివరాలను సిన్హా తెలిపారు. -
అడ్వాన్సడ్ అందకున్నా.. ఎన్నో ప్రత్యామ్నాయాలు..
వాట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ * జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించలేదా? * మెయిన్లో కటాఫ్ స్కోర్ సొంతం కాలేదా? అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! ఐఐటీలు మినహా ఎన్నో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటికీ అవకాశాలు సజీవంగానే ఉన్నాయంటున్నారు నిపుణులు! ఇతర ప్రత్యామ్నాయాలపైనా దృష్టిసారించాలని సూచిస్తున్నారు. ఆయా మార్గాలపై ఫోకస్! ఈ కటాఫ్ మార్కులు సాధించని వారికి ఇంకా 32 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్లు), 18 ట్రిపుల్ ఐటీలు, 18 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. వీటిలో 40 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి, జూన్లో ర్యాంకులు ప్రకటిస్తారు. ఇంటర్లో ఎక్కువ మార్కులు సాధించినవారికి జేఈఈ మెయిన్లో మంచి ర్యాంకు వచ్చే అవకాశముంది. ప్రముఖ ప్రైవేటు సంస్థలు బిట్స్ పిలానీ, విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీలు వరుసగా బిట్శాట్, విట్ఈఈఈ, ఎస్ఆర్ఎంజేఈఈఈ, ఎంయూఓఈటీ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేస్తున్నాయి. ఇవి రాసిన వారు అవకాశాలను విశ్లేషించుకొని, ముందడుగు వేయాలి. ఇతర రాష్ట్రాల కళాశాలల్లో * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్ యూనివర్సిటీలు/కళాశాలలు ప్రవేశాలకు తమ సొంత ప్రవేశపరీక్షల్లో సాధించిన ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్ ర్యాంకులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. * ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ ర్యాంకుల ద్వారా నచ్చిన కాలేజీలో, నచ్చిన బ్రాంచ్లో చేరేందుకు అవకాశముంది. * ఇతర రాష్ట్రాలు స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు కన్షార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామెడ్క్ యూజీఈటీ), కర్ణాటక సెట్, ఎంహెచ్టీ-సెట్ (మహారాష్ర్ట), కేరళ సెట్ వంటివాటిని చెప్పుకోవచ్చు. వీటిలో మంచి ర్యాంకు తెచ్చుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు. * కొన్ని రాష్ట్రాలు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా యూజీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో మెయిన్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటున్న కాలేజీలు 1000కు పైగా ఉన్నాయి. ‘ఐఐటీ’ లక్ష్యమైతే! ఈసారి నిరాశ ఎదురైనా, వచ్చే ఏడాది మరోసారి పరీక్ష రాసి, ఐఐటీలో చేరాలనే దృఢ సంకల్పం ఉన్నవారు ఆ దిశగా ప్రయత్నించవచ్చు. బలాలు, బలహీనతలను గుర్తించి, ఏడాదిపాటు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి. ఇప్పటికే కోచింగ్ తీసుకున్నవారు, ఇకపై ప్రాక్టీస్కు పూర్తిగా సమయం కేటాయించాలి. సందేహాల నివృత్తికి ఫ్యాకల్టీ సహాయం తీసుకోవాలి. ఈ ఏడాది సొంతంగా ప్రిపేరైన వారు రెగ్యులర్ కోచింగ్ లేదా సబ్జెక్టు నిపుణుల గెడైన్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. - ఎం.ఎన్.రావు,సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ చైతన్య విద్యాసంస్థలు,హైదరాబాద్. -
పాలేరుపై కాంగ్రెస్ దృష్టి
పోలింగ్ బూత్ల వారీగా ముఖ్య నేతల పర్యవేక్షణ సాక్షి, హైదరాబాద్: పాలేరు శాసనసభ ఉప ఎన్నికపై టీపీసీసీ దృష్టి కేంద్రీకరించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్చార్జీలుగా నియమించి, బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు టి.జీవన్రెడ్డి, పి.సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్లకు ఒక్కొక్క మండలం బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఎన్నికలకు అవసరమైన వనరులను సమీకరిస్తూనే, నియోజకవర్గంలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. దివంగత శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి అభ్యర్థిత్వంపై సానుభూతి ఉందని, పార్టీకి నిర్మాణం, గిరిజనుల్లో వెంకటరెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానం వంటివాటితో కాంగ్రెస్కు సానుకూల పరిస్థితి ఉందనే అంచనాలో టీపీసీసీ ఉంది. అయితే అధికార పార్టీకి ఉన్న అర్థ, అంగబలాలతో పాటు ఇతర పార్టీల నుంచి వలసలు టీపీసీసీలో ఆందోళన కలిగిస్తున్నా యి. అధికారపార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక పోకడలపై తెలంగాణ మేధావుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్నదనే అంచనాలో టీపీసీసీ ఉంది. దీనికి అనుగుణంగా గ్రామాల వారీగా, పోలింగ్ బూత్ల వారీ గా టీపీసీసీ నుంచి బాధ్యులు పనిచేస్తున్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి కూడా గురువారం నుంచి పాలేరులోనే ఉంటూ, ఇంటింటికీ తిరుగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఇక స్కూటర్ల పైనే సుజుకి ఫోకస్..
అమ్మకాల్లో 70% వాటా వీటిదే భవిష్యత్లో అధిక సామర్థ్యమున్న మోడళ్లు తీసుకొస్తాం... కంపెనీ జోనల్ మేనేజర్ ప్రభాకర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకి మోటార్సైకిల్ ఇండియా స్కూటర్ల విపణిపైనే ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా సంస్థ అమ్మకాల్లో వీటి వాటా అత్యధికంగా 65-70 శాతం ఉండడమే ఇందుకు కారణం. దీనికితోడు భారత్లో స్కూటర్ల మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. సుజుకి సైతం ఇదే స్థాయిలో పనితీరు కనబరుస్తోంది. దీంతో ట్రెండ్కు తగ్గట్టుగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు సంస్థ దక్షిణప్రాంత సేల్స్ జోనల్ మేనేజర్ డి.వి.ప్రభాకర్ తెలిపారు. సోమవారమిక్కడ నారాయణగూడలో నవకర్ సుజుకి షోరూంను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. దక్షిణాదితోపాటు పశ్చిమ భారత్లో స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని వివరించారు. 100-110 సీసీ బైక్ల యజమానులు స్కూటర్లకు మళ్లుతున్నారని చెప్పారు. 150 సీసీ స్కూటర్లు సైతం.. ప్రస్తుతం కంపెనీ 125 సీసీ వరకు సామర్థ్యమున్న స్కూటర్లను భారత్లో విక్రయిస్తోంది. 150 సీసీ స్కూటర్ 2017లో భారత్కు వచ్చే అవకాశం ఉందని ప్రభాకర్ వెల్లడించారు. యాక్సెస్ 125 మోడల్ను మరింత స్పోర్టీ లుక్తో తీర్చిదిద్ది ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయనున్నట్టు చెప్పారు. రాబోయే మోడళ్లన్నీ 125 సీసీ, ఆపై సామర్థ్యమున్నవే ఉంటాయన్నారు. భారత్లో మోటార్సైకిళ్ల విభాగంలో 150 సీసీ, ఆపై సామర్థ్యమున్న విభాగాలే వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ సైతం దీనికి అనుగుణంగా మోడళ్లను తెస్తుందని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కంపెనీ నెలకు అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయిస్తోంది. దీనిని 3,000 యూనిట్లకు పెంచాలన్నది లక్ష్యం. -
మనసు మాట వినాలంటే?!
ఆత్మబంధువు ‘‘ఆంటీ.. ఆంటీ...’’ అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చాడు చరణ్. ‘‘హాయ్ హీరో! ఏంటీ ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఆంటీ?’’ అని పలకరించింది రేఖ. ‘‘అదేం లేదాంటీ. కాలేజీ, స్టడీస్తో బిజీ. అందుకే రాలేకపోయా. సారీ!’’ ‘‘సారీ అక్కర్లేదులే. ఊరికే అన్నా. నువ్వు రాకపోయినా పర్లేదు, బాగా చదివితే చాలు. ఇంతకూ ఎలా చదువుతున్నావ్?’’ ‘‘బాగానే చదువుతున్నా అంటీ.. కానీ గుర్తుండటంలేదు. కాన్సట్రేషన్ కుదరడం లేదాంటీ.’’ ‘‘కాన్సట్రేషన్ కుదరడం లేదంటే ఎలానో కొంచెం చెప్తావా? ‘‘అంటే... ఓ గంట చదువుదామని కూర్చుంటే, అరగంటకే డిస్టర్బ్ అవుతున్నా. చదువుతుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.’’ ‘‘ఏవేవో ఆలోచనలంటే?’’ ‘‘అంటే... చదువుకి, చదువుతున్న సబ్జెక్ట్కి సంబంధం లేనివి.’’ ‘‘మ్మ్మ్.. నీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం కదా?’’ ‘‘ఔనాంటీ.’’ ‘‘ఫొటో తీసేటప్పుడు ఒకేసారి రెండు ఆబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయగలవా?’’ ‘‘కుదరదాంటీ. ఏదో ఒకదానిపైనే ఫోకస్ చేయగలం.’’ ‘‘కదా.. చదువు కూడా అంతే. నీ మనసు ఒకే సమయంలో రెండు విషయాలపైన ఫోకస్ చేయలేదు. చదువుతున్నప్పుడు వేరే ఆలోచనలు వస్తున్నాయంటే వాటికి నువ్వు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నట్లే.’’ ‘‘మరేం చేయాలాంటీ?’’ ‘‘నువ్వు చేయాల్సిన పనులను ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనసులోకి వచ్చినదాన్ని చేసేందుకు సమయం కేటాయించి ఆ సమయానికి చేసేయాలి.’’ ‘‘ఈజ్ ఇట్ సో ఈజీ?’’ ‘‘ఎస్, ఇటీజ్ సో ఈజీ వెన్ యూ నో ద ప్రాసెస్. ఉదాహరణకు నువ్వొక మ్యూజిక్ షోకి వెళ్లావనుకో. అక్కడ సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా నీ ఫ్రెండ్స్ చెప్పేది వినిపిస్తుంది కదా. అంటే నీ అన్కాన్షియస్ మైండ్ ఎలాంటి ప్రదేశంలోనైనా ఫోకస్ చూపించగలదని అర్థం. అంటే మన చుట్టూ ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా మనకు కావాల్సిన దానిమీదే మనం ఫోకస్ చేయగలం. అందుకే రోజూ ఒకే చోట, ఒకే సమయంలో చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆ సమయం చదువుకోవడానికని మనసు అర్థం చేసుకుంటుంది. చదువుకునేటప్పుడు పక్కదారులు పట్టకుండా మనతో సహకరిస్తుంది.’’ ‘‘నేను కూడా రోజూ నా రూమ్లో కూర్చునే చదువుకుంటా. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. ఓ గంటైనా ఏకాగ్రతతో చదువుదామనుకుంటా. కానీ పది, ఇరవై నిమిషాలకు మించి కాన్సట్రేషన్ కుదరడం లేదు.’’ ‘‘నువ్వే కాదు, ఏ మనిషైనా సరే 20 నుంచి 30 నిమిషాలకు మించి ఏకాగ్రత నిలపలేడు.’’ ‘‘అవునా ఆంటీ. మరి మా ఫ్రెండ్స్ గంటలకు గంటలు చదువుతామంటారే!’’ ‘‘వాళ్లు గంటలకు గంటలు చదవొచ్చు. కానీ ఏకాగ్రతతో కాదు. ప్రతి 20 లేదా 30 నిమిషాలకు మనసు పక్కదారి పడుతుంది. అంటే మనసులోకి వేరే ఆలోచనలేవో వస్తాయి. ఒకసారి ఏకాగ్రత కోల్పోతే తిరిగి తెచ్చుకోవడానికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది. అలా రోజుకు ఓ పదిసార్లు ఏకాగ్రత కోల్పోయామంటే రోజుకు 50 నుంచి 100 నిమిషాలు వృథా చేసినట్లే.’’ ‘‘అవునా... మరి ఎలా ఆంటీ?’’ ‘‘దానికో చిట్కా ఉందిలే కంగారు పడకు. మనకు ఇష్టమున్నా లేకున్నా ప్రతి 20 లేదా 30 నిమిషాలకు మనసు పక్కదారి పడుతుంది కాబట్టి 20 లేదా 30 నిమిషాలు చదివాక మనమే చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిది. కానీ బ్రేక్ తీసుకున్నప్పుడు టీవీ చూడకూడదు, పాటలు వినకూడదు. అలా చేస్తే మళ్లీ పుస్తకం పట్టుకున్నప్పుడు వాటికి సంబంధించిన దృశ్యాలు మనసులోకి వచ్చి చికాకు పెడతాయి.’’ ‘‘మరేం చేయాలి?’’ ‘‘బ్రేక్ టైమ్లో మెలోడియస్ ఇన్ స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినవచ్చు. లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయవచ్చు. ఓ గ్లాసు నీళ్లు తాగి అలా బయటకు వెళ్లి చల్లగాలి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత వెళ్లి పుస్తకం పట్టుకుంటే మనసు నిలుస్తుంది.’’ ‘‘థాంక్స్ అంటీ. మీరు చెప్పిన టిప్స్ పాటిస్తూ చదువుకుంటా’’ అంటూ హుషారుగా వెళ్లాడు చరణ్. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
యాప్ ట్రేడింగ్ పై ఎడల్ వైజ్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ట్రేడింగ్పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఎడల్వైజ్ ప్రకటించింది. చాలా సులభంగా ట్రేడింగ్ చేసుకునే విధంగా ఈమధ్యనే అభివృద్ధి చేసిన యాప్కు మంచి డిమాండ్ వస్తోందని ఎడల్వైజ్ గ్లోబల్ హెల్త్ మేనేజమెంట్ రిటైల్ హెడ్ రాహుల్ జైన్ తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో లక్షమంది ఖాతాదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎడల్వైజ్ ఖాతాదారుల సంఖ్య 3 లక్షలుండగా అందులో ఇప్పటి వరకు 30,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మొబైల్ ట్రేడింగ్ పెరుగుతోందని, గత మూడేళ్లుగా మొబైల్ ట్రేడింగ్లో 100% చొప్పున వృద్ధి నమోదైనట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులున్నా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో ఈక్విటీలు 13 నుంచి 14% సగటు రాబడులను అందిస్తుందని అంచనా వేస్తున్నట్లు జైన్ తెలిపారు. -
తెలుగు పర్యాటకులపై ఆస్ట్రేలియా దృష్టి
ఆస్ట్రేలియా టూరిజం ఇండియా మేనేజర్ నిషాంత్ కాషికర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతీయ పర్యాటకులపై ముఖ్యంగా తెలుగు రాష్ట్ర పర్యాటకులపై ఆస్ట్రేలియా ప్రత్యేకంగా దృష్టిసారించింది. భారతీయులు అమితంగా ఇష్టపడుతున్న పర్యాటక దేశాల్లో ఆష్ట్రేలియా మూడో స్థానంలో ఉందని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోందని ఆస్ట్రేలియా టూరిజం కంట్రీ మేనేజర్ నిషాంత్ కాషికర్ చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది ఇండియా నుంచి వచ్చిన పర్యాటకుల సంఖ్యలో 18 శాతం వృద్ధి నమోదైందని... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యాటకుల సంఖ్యలో మాత్రం ఈ వృద్ధి 21 శాతంగా ఉందని తెలియజేశారు. గతేడాది ఇండియా నుంచి 2,30,000 మంది ఆస్ట్రేలియా వెళితే అందులో 15,285 మంది ఈ రెండు రాష్ట్రాల నుంచి ఉన్నారు. భారతీయ పర్యాటకుల ద్వారా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి రూ.5,000 కోట్ల ఆదాయం రాగా, అందులో రెండు రాష్ట్రాల ప్రజలు నుంచి రూ.435 కోట్ల ఆదాయం వచ్చింది. రోడ్షోలో భాగంగా హైదరాబాద్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ వరల్డ్ కప్ క్రికెట్తో పాటు ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఆస్ట్రేలియా కరెన్సీ 15 శాతం తగ్గడం పర్యాటకులు సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పారు. 2020 నాటికి భారత దేశం నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యను మూడు లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
ప్యాకేజ్డ్ ఫుడ్పై అదాని దృష్టి...
♦ ఆహార వ్యాపారం వాటా 25% లక్ష్యం ♦ ప్రస్తుతం ఆదాయం రూ. 18,000 కోట్లు ♦ మరో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో రిఫైనరీలు ♦ అదాని విల్మర్ సీవోవో ఆంగ్షూ మల్లిక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాండెడ్ వంటనూనెల విక్రయంలో మొదటి స్థానంలో ఉన్న అదాని విల్మర్ ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. బ్రాండెడ్ ఆహార పదార్థాల వినయోగం పెరుగుతుండటంతో ఈ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అదాని విల్మర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆంగ్షూ మల్లిక్ తెలిపారు. ‘ఫార్చూన్’ బ్రాండ్ పేరుతో బియ్యం, పప్పులు, పిండి, సోయా నగెట్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాసుమతి బియ్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నామని, తెలుగు రాష్ర్ట ప్రజలకోసం త్వరలోనే సోనామసూరి, ఇతర రకాల బ్రాండెడ్ బియ్యాలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఆహార పదార్థాల విభాగం కేవలం 5 శాతంగా ఉందని, వచ్చే నాలుగేళ్లలో దీన్ని 25 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మల్లిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల ఉత్పత్తుల సామర్థ్యం 2.5 లక్షల టన్నులుగా ఉందని, దీన్ని వచ్చే నాలుగేళ్లలో 10 లక్షల టన్నులకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకోసం స్థానిక రైస్, ఫ్లోర్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రస్తుతం అదాని విలమర్ వ్యాపారం సుమారు రూ. 18,000 కోట్లు ఉండగా, ఇందులో రూ. 3,500 కోట్లు ఆహార విభాగం నుంచి వస్తుండగా, మిగిలినది వంటనూనెల నుంచి వస్తున్నట్లు తెలిపారు. దేశంలో బ్రాండెడ్ వంటనూనెల వ్యాపారం ఏటా సగటున 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోందన్నారు. ఇదే విధంగా వచ్చే నాలుగేళ్లు వృద్ధి చెందితే తమ రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 30 లక్షల టన్నుల నుంచి 35 లక్షల టన్నులకు పెంచాల్సి వస్తుందన్నారు. అదాని గ్రూపునకు కృష్ణపట్నం, మంత్రాలయంలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 22 సొంత రిఫైనరీలు, 24 లీజ్ ఆధారిత రిఫైనరీలను కలిగి వుంది. దేశవ్యాప్తంగా ఏటా 185 లక్షల టన్నుల వంట నూనెలు వినియోగిస్తుంటే ఇందులో బ్రాండెడ్ వాటా 55 శాతంగా ఉంది. అదానికి చెందిన ‘ఫార్చూన్’ బ్రాండ్ 19.5% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. దేశంలో సగటను ప్రతి మనిషి ఏటా 16 లీటర్ల వంట నూనెలను వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 24 లీటర్ల కంటే తక్కువగా ఉండటంతో ఈ రంగంలో విస్తరణకు అనేక అవకాశాలున్నట్లు మల్లిక్ వివరించారు. పేటీఎంతో ఒప్పందం: తెలుగు రాష్ట్రాల్లో ‘ఫార్చూన్’ బ్రాండ్ను విస్తరణకు అదాని విల్మర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్తో పాటు, బంగారం, కార్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎం ద్వారా నగదు చెల్లించిన వారికి లీటరుకు రూ. 30, 5 లీటర్లకు రూ. 100 క్యాష్ బ్యాక్ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ మార్చి 15 వరకు అమల్లో ఉంటుంది. -
డిజిటల్ ఇన్సూరెన్స్పై కోటక్లైఫ్ దృష్టి
ప్రీమియర్ లైఫ్ పేరుతో కొత్త పథకం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇన్సూరెన్స్పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. పాలసీలు విక్రయం దగ్గర నుంచి అన్ని లావాదేవీలు డిజిటల్ ఫ్లాట్ఫామ్ మీద అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కోటక్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సురేష్ అగర్వాల్ తెలిపారు. ఏడాదిలో వ్యాపారంలో 70 నుంచి 80% డిజిటల్ చానల్స్ ద్వారా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలి పారు. అంతకుముందు 99 ఏళ్లు బీమా రక్షణ కల్పించే హోల్లైఫ్ ప్లాన్ ‘ప్రీమియర్ లైఫ్’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్ట్ భద్రతపై కేంద్రం దృష్టి
-
అంతర్జాతీయ మార్కెట్పై దృష్టి
బాలిస్టిక్ సేఫ్టీ సిస్టమ్స్ డెరైక్టర్ పురుషోత్తం వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల వంటి భద్రత ఉపకరణాల తయారీలో ఉన్న బాలిస్టిక్ సేఫ్టీ సిస్టమ్స్ టెక్నాలజీ (బీఎస్ఎస్టీ) విదేశీ మార్కెట్లపై దృష్టి పెట్టింది. జర్మనీతోపాటు భారత్లోనూ ప్లాంటు ఉన్న ఈ సంస్థ... అంతర్జాతీయ ప్రమాణాలతోభద్రత ఉపకరణాలను రూపొందిస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ పురుషోత్తం మహావాది తెలియజేశారు. విక్రయానికి అంతర్జాతీయ మార్కెట్లే ఉత్తమమని, అక్కడి రక్షణ సంస్థలు ఖర్చుకు వెనుకాడవని వెల్లడించారు. డిఫెన్స్, ఏరోస్పేస్ సదస్సులో భాగంగా సోమవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. యునిసెఫ్ శాంతి దళాలు, ఖజకిస్తాన్ సైన్యం, కొచ్చిన్ షిప్యార్డ్, రిలయన్స్ తమ క్లయింట్ల జాబితాలో ఉన్నాయన్నారు. 2ప్లాంట్లకు కలిపి ఇప్పటి వరకు రూ.230 కోట్లకుపైగా ఖర్చు చేశామన్నారు. ప్రపంచంలో తొలిసారి స్మార్ట్ సెన్సార్స్తో కూడిన బాలిస్టిక్స్ హెల్త్ మానిటర్స్ను కంపెనీ రూపొందించింది. ప్రస్తుతం దీని పేటెంట్ పెండింగ్లో ఉందని కంపెనీ ప్రతినిధి ఎం.కృష్ణ మోహన్ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందో ఈ సెన్సార్స్ గుర్తించి అలర్ట్ చేస్తాయని చెప్పారు. రక్షణ రంగంలో ఉన్న మహిళల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను భారత్లో తొలిసారిగా తయారు చేశామన్నారు. ఫ్యాబ్ సిటీ వద్ద ఉన్న ప్లాంటుకు ఏటా 30 వేల జాకెట్లు, 30 వేల హెల్మెట్లు, 50 వేల బ్లాంకెట్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. -
బీవోటీ ప్రాజెక్టులపై అంబికా గ్రూప్ ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అగర్బత్తీల తయారీ, ఆతిథ్య రంగంలో ఉన్న అంబికా గ్రూప్ బీవోటీ ప్రాతిపదికన నిర్మాణ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రూ.75 కోట్ల విలువైన మూడు కమర్షియల్ ప్రాజెక్టులను గ్రూప్ విజయవంతంగా పూర్తి చేసి నిర్విహ స్తోంది. గ్రూప్ కంపెనీ అయిన ఫైన్ గ్రీన్ కన్స్ట్రక్షన్స్ భారత్లో తొలిసారిగా మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్ను తమిళనాడులో నిర్మించింది. ఆంధ్రప్రదేశ్లో మరో రెండు బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) ప్రాజెక్టులను చేపట్టబోతున్నట్టు ఫైన్ గ్రీన్ కన్స్ట్రక్షన్స్ డెరైక్టర్ అంబికా రామచంద్రరావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.60 కోట్లు ఉంటుందన్నారు. ‘ప్రధాన ప్రాంతాల్లో సొంతంగా స్థలం కొనుగోలు, కాంప్లెక్సు నిర్మాణం ఖరీదైన అంశం. అందుకే బీవోటీ విధానానికే మొగ్గు చూపుతున్నాం. అవకాశం ఉన్నచోట ఉత్తమ ప్రాజెక్టులను చేపట్టేందుకు మేం సిద్ధం’ అని వెల్లడించారు. మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్ తమిళనాడులోని సాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ‘అంబికా వీజీ కాంప్లెక్స్’ పేరుతో నిర్మించిన మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్కు (ఎంఎఫ్సీ) నవంబరు 30న ప్రారంభోత్సవం చేయనున్నారు. భారత్లో ఇదే తొలి మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్ కావడం విశేషం. రైలు ప్రయాణికులకు వినూత్న సౌకర్యాలు, సేవలు కల్పించేందుకు ఢిల్లీ రైల్వేస్తో కలిసి ఫైన్ గ్రీన్ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్టును చేపట్టిందని రామచంద్ర రావు తెలిపారు. హోటల్, వసతి గృహం, రెస్టారెంట్, దుకాణాలు, ఆఫీస్ స్పేస్, కార్ల పార్కింగ్కు విశాల స్థలం ఈ కాంప్లెక్స్లో అదనపు ఆకర ్షణ అని చెప్పారు. మూడు అంతస్తుల్లో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 45 ఏళ్ల పాటు కంపెనీ ఈ కాంప్లెక్స్ను నిర్వహించనుంది. కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10 కోట్లకుపైగా వ్యయం చేశారు. -
ఆఫ్లైన్పైనా ఇన్‘ఫోకస్’
ఆన్లైన్లో ధరతోనే మొబైల్స్ విక్రయం త్వరలో 2 ఇన్ 1 ట్యాబ్లెట్స్, టీవీలు సాక్షితో ఇన్ఫోకస్ కంట్రీ హెడ్ సచిన్ థాపర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న అమెరికా కంపెనీ ఇన్ఫోకస్ భారత్లో ఆఫ్లైన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఈ-కామర్స్ కంపెనీలకే పరిమితమైన ఇన్ఫోకస్ మొబైల్స్ ఇక నుంచి రిటైల్ స్టోర్లలోనూ లభ్యం కానున్నాయి. జనవరికల్లా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ ఔట్లెట్లకు విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇన్ఫోకస్కు చెందిన అన్ని మోడళ్లను ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ రూపొందిస్తోంది. ఇన్ఫోకస్ భారత్లో ప్రస్తుతం 6 స్మార్ట్ఫోన్లతోపాటు రెండు ఫీచర్ ఫోన్లను విక్రయిస్తోంది. ఫీచర్ ఫోన్లను కేవలం రిటైల్ ఔట్లెట్ల ద్వారానే అమ్మాలని కంపెనీ నిర్ణయించింది. ఒకే ధరలో లభ్యం.. ఇన్ఫోకస్ స్మార్ట్ఫోన్ల్ల ధర రూ.3,999 నుంచి ప్రారంభం. అయితే ఆన్లైన్లో ఉన్న ధరనే ఆఫ్లైన్లోనూ కొనసాగిస్తోంది. ఇది వ్మూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమని సంస్థ ఇండియా హెడ్ సచిన్ థాపర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నాణ్యమైన మోడళ్లను విలువకు తగ్గట్టుగా కస్టమర్లకు అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ‘ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లు రెండూ మాకు ముఖ్యం. భారత్లో ఇప్పటి వరకు 5 లక్షల స్మార్ట్ఫోన్లు విక్రయించాం. 2015-16లో 10 లక్షల యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా చేసుకున్నాం. ఫాక్స్కాన్కు చెందిన శ్రీసిటీ ప్లాంటులో నాలుగు మోడళ్లు తయారవుతున్నాయి. భారత్ నుంచి సార్క్, ఆఫ్రికా దేశాలకు మోడళ్లను ఒకట్రెండు నెలల్లో ఎగుమతి చేయనున్నాం’ అని తెలిపారు. కంపెనీ తన ఉత్పత్తులపై 12 నెలల వారంటీ ఇస్తోంది. 134 సర్వీసింగ్ కేంద్రాలున్నాయి. డిసెంబర్లో 2 ఇన్ 1.. కంపెనీ భారత్లో 2 ఇన్ 1 హైబ్రిడ్ ట్యాబ్లెట్స్ను ప్రవేశపెడుతోంది. డిసెంబర్లో ఒక మోడల్ వస్తోంది. అలాగే అల్ట్రా హై డెఫినిషన్, ఫుల్ హై డెఫినిషన్ టీవీలు జనవరి నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సచిన్ థాపర్ వెల్లడించారు. టీవీలు 24-60 అంగుళాల సైజులో ఉంటాయన్నారు. నెల రోజుల్లో మరో 5 స్మార్ట్ఫోన్లు రానున్నాయని పేర్కొన్నారు. టీవీలు ఫాక్స్కాన్కు చెందిన చెన్నై ప్లాంటులో తయారవుతాయని చెప్పారు. భారత్లో 2016 నాటికి బిలియన్ డాలర్ కంపెనీగా నిలవాలన్నది కంపెనీ లక్ష్యం. ఇందులో స్మార్ట్ఫోన్ల ద్వారా 70 శాతం సమకూరుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి అమెజాన్, స్నాప్డీల్లు ఆన్లైన్ భాగస్వాములుగా ఉన్నాయి. -
నయన్పై రాజకీయ కన్ను
నటి నయనతారపై రాజకీయ కన్ను పడుతోంది. ఆమె క్రేజ్ను వాడుకోవాలని తమిళనాట కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రాజకీయాల్లో సినీ తారలన్నది కొత్తేమీకాదు. ఇక్కడి నుంచి వెళ్లి రాష్ట్రాన్ని ఏలినవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నటిగా నయనతార స్టామినా గురించి ఇప్పుడు ప్రస్థావించనక్కర్లేదు. ఈ సంచలన తార బహుభాషా నటి. రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి అంచుల వరకూ వెళ్లి మూడు ముళ్లకు దూరమయ్యి నటనే వద్దనుకుని మళ్లీ దాన్నే ఆశ్రయించి విజయాల బాట పట్టిన సంచలన నటి నయన్. కోలీవుడ్లో రాజా రాణి చిత్రంతో రీఎంట్రీ అయ్యి హీరోయిన్గా సక్సెస్ అయిన ఈ కేరళా కుట్టికి మధ్యలో కొన్ని అపజయాలు ఎదురయ్యాయి. ఇటీవల తనీఒరువన్, మాయ చిత్రాలు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం ఐదారు చిత్రాలు చేతిలో ఉన్నాయి. రాయకీయ గాలం ఇటీవల నయనతార ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి సేలం వెళ్లారు. అక్కడ ఆమెను చూడటానికి ఒక పెద్ద కూటమే తరలి వచ్చింది. ఎంత పెద్ద కూటమి అంటే రాజకీయ వర్గాలే ఆశ్చర్యపడేంతగా. సుమారు ఐదు వేలకు పైగా వచ్చిన నయనతార అభిమానుల్ని చూసి రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిందట. ఆమెను ఎలాగయినా తమ పార్టీలోకి లాగాలని కొన్ని రాజకీయపార్టీలు ఆలోచనలు చేస్తున్నాయని సమాచారం. డీఎంకే ముందంజ బీజేపీ, డీఎంకే పార్టీలు నమనతారను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆల్ రెడీ ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో డీఎంకే కాస్త ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఒక డీఎంకే నేత స్పందిస్తూ రాజకీయంగా ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చాలా బలంగా ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో డీఎంకేకు ప్రచారాస్త్రంగా ఒక పాపులర్ వ్యక్తి అవసరం ఉందన్నారు. సేలంలో నటి నయనతార క్రేజ్ను చూసిన తరువాత ఆమెను పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచన వచ్చిన మాట నిజమేనన్నారు. కొన్నేళ్ల క్రితం నటి కుష్భూ డీఎంకే పార్టీలో చేరారని, తన పార్టీకి విశేష సేవలు అందిచారని అన్నారు. అయితే కుష్భూ నిర్మోహమాట వ్యాఖ్యలు, చర్యలు పార్టీలోని కొందర్ని ఇబ్బందికి గురి చేశాయన్నారు. దీంతో ఆమె పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేక పోయారని చెప్పారు. ఇప్పుడామె స్థానంలో నయనతార లాంటి ఒక స్టార్ నటి అవసరం అయ్యారని చెప్పుకొచ్చారు. నయనతార మాటేంటి నటి నయనతార గురించి రాజకీయ చర్చ వాడివేడిగా జరుగుతుంటే ఆమె వర్గం మాత్రం నయనతారకు ఇప్పట్లో రాజకీయ ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని అంటున్నారు. -
మాఫియాపై ఉక్కుపాదం
- గంజాయి స్మగ్లర్లు, మధ్యవర్తుల గుర్తింపునకు ఆరా - లావాదేవీల ముసుగులో నకిలీ కరెన్సీ చెలామణి పాడేరు/పెదబయలు: మన్యంలో గంజాయి మాఫియాపై పోలీసుశాఖ దృష్టి పెట్టింది. వివిధ మార్గాల్లో గమ్మత్తుగా తరలిపోతున్న దీని నియంత్రణకు నిఘా పెంచింది. జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఏవోబీతోపాటు మారుమూల గ్రామాల్లో సాగు విస్తరించి గంజాయి గుప్పుమంటోంది. పెదబయలు, ముంచంగిపుట్టు, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కొరవడి కొండలన్నీ గంజాయి వనాలుగా మారిపోయాయి. గంజాయి స్మగ్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గతంలో రోలుగుంట ఎస్ఐ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. గంజాయి దారిమళ్లింపు కేసులో నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్, ఎస్ఐ బదలీ విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు అరకులోయ మీదుగా దీని రవాణా ఎక్కువైంది.రోజుకి రెండు మూడు కేసులు నమోదవుతున్నాయి. గత నెల రోజుల్లో 40 కేసుల వరకు నమోదయ్యాయి. జూలై, ఆగస్టుల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. కోతల అనంతరం ఎండుగంజాయి ఏడాది పొడవునా మన్యం నుంచి రవాణా అవుతుంది. దీని తరలింపులో గంజాయి స్మగ్లర్లతోపాటు మధ్యవర్తులదీ కీలకపాత్రగా ఉంటోంది. పోలీసుల దాడులు, కేసులు ముమ్మరంతో రవాణాకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. గంజాయి రవాణాకు యువతను వినియోగిస్తున్నారు. టూరిస్టుల ముసుగులోనూ, ఫ్యామిలీ టూర్ మాదిరిగా తరలిస్తున్నారు. విద్యార్థులు, డ్రైవర్లను దీని ఉచ్చులోకి లాగుతున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణాను ప్రోత్సహిస్తూ తెరవెనుక ఉండి కీలకంగా వ్యవహరిస్తున్న మధ్యవర్తులపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే గంజాయి లావాదేవీల్లో నకిలీ కరెన్సీ చెలామణి, మావోయిస్టులకు ఆయుధాల పంపిణీ వంటి సంఘటనలు వెలుగు చూడటంతో పోలీసులు ఈ దిశగానూ నిఘా పెట్టారు. పెరిగిన పంట విస్తీర్ణం గతేడాది కంటే దీని సాగు విస్తీర్ణం ఈ ఏడాది బాగా పెరిగింది. తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చిన స్మగ్లర్లు దగ్గరుండి ఈ పంటకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు గిరిజన రైతులకు సరఫరా చేస్తున్నారు. మన్యంలోని వారపు సంతల్లోనూ వీటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది పోలీసు, ఎక్సైజ్ అధికారులకు పట్టడం లేదు. లాభసాటి పంట కావడంతో మన్యంలోని యువత కూ డా దీని సాగుపైనే దృష్టి పెడుతున్నారు. సాగును నియంత్రిస్తాం ఏజెన్సీలో గంజాయి సాగు నియంత్రణపై దృష్టిపెట్టాం. గతేడాది 100 ఎకరాల వరకు గంజాయి తోటలను ధ్వంసం చేశాం. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్మగ్లర్లు సాగును ప్రోత్సహిస్తున్నారు. స్మగ్లర్ల నుంచి డబ్బు తెచ్చి గిరిజనులకు ఇస్తున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగుప్రాంతాలను జియోలాజికల్ సర్వేతో గుర్తిస్తున్నాం. గిరిజన రైతులను కాఫీ, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించి గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. సాగు, రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న మధ్యవర్తుల ఆట కట్టించడంపై దృష్టి పెడుతున్నాం. - అట్టాడ బాబూజీ, ఏఎస్పీ, పాడేరు. -
తెలిసి... తెలిసీ
సోల్ అనగనగా ఒక చీమ. పరమ శివుడి కోసం తపస్సు చేసింది.శివుడు మెచ్చాడు. వరం కోరుకోమన్నాడు. మనుషుల మీద కసితో ‘నేను కుట్టగానే చావు తథ్యం కావాలి’ అంది చీమ. తథాస్తు అన్నాడు శివుడు. పాపం నాటి నుంచి ఆ చీమ కుట్టీ కుట్టగానే మరణిస్తోంది. (కుట్టగానే చంపేస్తాం కదా). ఇదే స్వయంకృతం! ‘నేను ఎవరిని కుడితే వారు చావాలి’ అని వరం అడగవలసిన చీమ, కుట్టిన వెంటనే చావాలి అంది. ఇక మిడాస్ కథ తెలిసిందే. అత్యాశ పరుడైన మిడాస్ తాను ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలని భగవంతుడిని కోరాడు. ఆయన తథాస్తు అన్నాడు. అంతే... నాటి నుంచి మిడాస్ పట్టిందల్లా బంగారమే. మంచినీళ్లు, అన్నం సహా అన్నీ బంగారమై పోయాయి. ఆకలి దప్పులు తీరక నానా ఇక్కట్లు పడ్డాడు. అది మిడాస్ స్వయంకృతం. ఆది నుంచి ఈ స్వయంకృతాపరాధాలు ఏదో ఒకరూపంలో మానవజన్మను పీడిస్తూనే ఉన్నాయి. ఈ పీడనపై చిన్న ఫోకస్. స్వయంకృతాలే మహాపరాధాలుగా నిలిచిన సంఘటనలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్... ప్రతిభతో ఎంత ప్రఖ్యాతి గడించాడో... స్వయం తప్పిదాలతో అంతే బ్లేమ్ అయ్యాడు. మాదకద్రవ్యాలకు బానిసై, కుస్తీ బరిలో ప్రత్యర్థి చెవి కొరికి, గర్ల్ఫ్రెండ్ని హింసించి... తనకున్న మంచిపేరును మట్టికరిపించాడు. కటకటాల పాలయ్యాడు. వరల్డ్ ట్రేడ్ టవర్స్ ఆకాశాన్నంటిన కీర్తిని కూడా భూస్థాపితం చేస్తుంది ఈ స్వయంకృతాపరాధం. దీనికి సాక్ష్యం అమెరికానే. జార్జ్ బుష్ జూనియర్ రూపంలో అమెరికా చేసిన తప్పిదం.. ఇరాక్తో యుద్ధం. దీని ఫలితమే 9/11 దాడులు. వాసికెక్కిన వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఆనవాలు లేకుండా నేల కూలాయి. ఎందరో ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. అయితే స్వయంకృతాపరాధాలు చేయడం అమెరికాకు కొత్తేం కాదు. గల్ఫ్ యుద్ధం కంటే ముందే వియత్నాం మీద విరుచుకుపడింది. చిన్న దేశం చేతిలో చిత్తుగా ఓడి తోక ముడిచింది. ఇది ఒక దేశం చేసిన, చేస్తున్న స్వయంకృతాపరాధానికి సాక్ష్యం. గ్లామర్ వరల్డ్.. పేరున్న వాళ్ల స్వయంకృతపరాధాలను సామాన్యులకూ ట్రాన్స్పరెంట్గా చూపించేది గ్లామర్ వరల్డే. అందులో సినిమా ఫస్ట్. బ్లాక్ అండ్ వైట్ జమానా తీసుకుంటే మహానటి సావిత్రి, గురుదత్ మొదలు సిల్క్స్మిత, ఉదయ్కిరణ్, చక్రిలు ఠక్కున గుర్తొస్తారు. అభినయ ఘనాపాటి సావిత్రి.. జెమినీ గణేశన్కు మూడో భార్యగా ఆయన చేయి అందుకోవడానికి సిద్ధపడ్డప్పుడు తెలుగులోని సీనియర్ నటులు వద్దని వారించారట. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావని హెచ్చరించారట కూడా. అయినా వాటిని వినిపించుకోక జెమినీ గణేశన్కు భార్య అయి తర్వాత మందుకు బానిస అయింది. తాగితాగి తనువు చాలించింది. గురుదత్ విషయానికి వస్తే .. ఆయన ప్రేమకు బానిస. ఆ బలహీనతే ఆయనను మందుకు మాలిమి చేసి ఆత్మహత్యతో చేయి కలిపేలా చేసింది. అలాగే తెలుగులో నిన్నటి తరం నటి.. సిల్క్స్మిత అంతే! రంగుల ప్రపంచంలోని నలుపుతెలుపుల షేడ్స్ని సరిగ్గా గుర్తించక ఉరితాడు బిగించుకుంది. చిన్న వయసులో ఉదయ్కిరణ్ చేసిన పనీ అదే ఆత్మహత్య. గెలుపు, ఓటములు సహజం అన్న విషయం తెలిసీ.. సినీమాయా జగత్తులో ఎలా మసులుకోవాలో అవగతమయ్యీ... తొందరపాటు అనే స్వయంకృతంతో ఆత్మహత్య అనే అపరాధానికి చోటిచ్చాడు. ఫలితంగా భూమ్మీద తన ఉనికినే కోల్పోయాడు. సంగీత దర్శకుడు చక్రి.. తన స్థూలకాయాన్ని తగ్గించుకునే పరిష్కారం ఉండీ.. భయం, నిర్లక్ష్యం అనే స్వయంకృతంతో హార్ట్ఎటాక్కు ప్రాణాలను అప్పగించాడు. ‘రుణ’గణమన నాగరికత నేర్చిన మనుషులు ఒప్పులకుప్పల్లా ఉండాల్సింది పోయి, వాణిజ్యబ్యాంకుల పోటీ పుణ్యమాని అప్పులకుప్పల్లా మిగులుతున్నారు. క్రెడిట్ కార్డులతో స్తోమతకు మించి ఖర్చు చేస్తున్నారు. కన్జూమర్ లోన్స్ ఊబిలో చిక్కుకుని, అవసరం ఉన్నా, లేకున్నా ఎడాపెడా విలాస వస్తువులను కొనుక్కొని, జీతాల్లో సింహభాగం ఈఎంఐలకు చెల్లిస్తూ, నిత్య రుణగ్రస్తుల్లా మిగులుతున్నారు. ఈ దా‘రుణ’భారం వ్యక్తులనే కాదు, దేశాలకు దేశాలనే కుంగదీస్తోంది. అగ్రరాజ్యాల రుణాల ఉచ్చులో చిక్కుకున్న చిన్న దేశాలు చితికిపోతున్నాయి. స్తోమతకు మించిన రుణాలు ఎవరికైనా స్వయంకృతాపరాధాలే! అభివృద్ధి అపరాధం అభివృద్ధి ... మానవజాతి చేస్తున్న స్వయంకృతాపరాధం. సౌకర్యవంతమైన జీవితం గడపడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమే. అయితే మితిమీరుతున్న ఈ అభివృద్ధి మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కోవడం లాంటిదే. మనం తెచ్చుకున్న సాంకేతిక విప్లవం, వ్యవసాయానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఈ భూమ్మీద జీవించే హక్కున్న మిగిలిన జీవుల బతుకును దుర్భరం చేస్తున్నాయి. అడవులను నరికేయడం, భూగర్భంలోంచి విచక్షణా రహితంగా నీటిని తోడేయడం పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది. కాలుష్యం పంచభూతాలను డిస్టర్బ్ చేస్తోంది. వర్షాల్లేవ్.. పంటల్లేవ్.. ధరలు ఆకాశానికి ఎగబాకుతుంటే జీవనప్రమాణం పాతాళానికి దిగజారుతోంది. స్వయంకృతాపరాధానికి వర్తమానంలో ఇంతకు మించిన సజీవ సాక్ష్యం లేదు. - సరస్వతి రమ భస్మాసుర హస్తం భస్మాసురుడు కఠోర తపస్సు చేశాడు. బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. నేను ఎవరి నెత్తిన చెయ్యి పెడితే వాడు చావాలి అని కోరుకున్నాడు.తథాస్తు అన్నాడు. తన వరం పని చేస్తోందో లేదో పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్ష కూడా వరమిచ్చిన శివుడి మీదే ప్రయోగించాలనుకున్నాడు. శివుడు పరుగులు తీశాడు. అది శివుడి స్వయంకృతం. శివుడు విధిలేక విష్ణుమూర్తిని శరణు కోరాడు. విష్ణుమూర్తి మోిహ నిగా అవతరించి, భస్మాసురుడికి నాట్యం నేర్పడం ప్రారంభించాడు. హస్త ముద్రలు, పాద విన్యాసం నేర్పుతూ తాను ఎలా చెబితే అలా నాట్యం చేయిస్తూ, శిరసు మీద హస్తం ఉంచే ముద్రను నేర్పడంతో భస్మాసురుడు భస్మమైపోయాడు. అది పూర్తిగా భస్మాసురుడి స్వయంకృతమే. అరణ్యవాసం సమయంలో సీతాదేవి బంగారులేడి కావాలని కోరుకుంది. అది మాయ అని లక్ష్మణుడు ఎంత వారించినా సీత వినిపించుకోలేదు. రాముడు లేడి కోసం వెళ్లాడు. రావణుడు మారువేషంలో సీతను అపహరించాడు. అది సీత స్వయంకృతం. ఇక రావణుడు... సీతాదేవిని ఎత్తుకు రావద్దని ఎందరు వారించినా వారి సలహాలను పెడచెవినపెట్టి, సీతను ఎత్తుకు వచ్చి లంకలో అశోకవనంలో ఉంచాడు. చివరకు ఏమయ్యింది. లంక నాశనమే కదా! అందుకు సంపూర్ణంగా రావణుడి స్వయంకృతమే కారణం కాదా? ఇక దుర్యోధనుడు, శకుని కలిసి మాయా జూదం ఆడతారని తెలిసుండీ, రాజ ధర్మం, క్షాత్ర ధర్మం అంటూ ధర్మరాజు జూదం ఆడాడు. ఒళ్లు మరచి సర్వస్వం కోల్పోయాడు. అది ధర్మరాజు స్వయంకృతమే. కీచకుడు ద్రౌపదిని చెరపట్టాలనుకున్నాడు. ఆమె ఎంత వారించినా కీచకుడు తన పట్టు విడువలేదు. వినాశకాలే విపరీత బుద్ధీ అన్న చందాన కీచకుడి చెవులకు హితవాక్యాలు నచ్చలేదు. చివరకు భీముడి చేతిలో హతుడయ్యాడు. ఇది కీచకుని స్వయంకృతం తప్ప మరొకటి కాదు. - డా. పురాణపండ వైజయంతి -
సీక్వెల్స్వైపు చూస్తున్న కమల్,రజనీ
-
జిల్లా స్థాయి ఉద్యోగాల భర్తీపై ఫోకస్
- తక్షణ అవసరమున్న పోస్టులకు నోటిఫికేషన్లు - విద్య, వైద్యం, పోలీసు, పురపాలక, పంచాయతీరాజ్లకు మొదటి ప్రాధాన్యం - రెండో దశలో జోనల్, మల్టీ జోనల్ నియామకాలు - ఖాళీలు, భర్తీ ప్రక్రియపై సీఎస్ సమీక్ష - 3 రోజుల్లోగా సమగ్ర నివేదికలివ్వాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: తొలి విడతగా జిల్లా స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రెండో దశలో జోనల్, మల్టీ జోనల్ పోస్టుల నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగాల విభజన పూర్తయ్యే వరకు రాష్ట్ర స్థాయి పోస్టుల నియామకాలను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించింది. జూలై నుంచి నోటిఫికేషన్ల జారీకి కసరత్తును వేగిరం చేసింది. విద్య, వైద్యం, పురపాలక, పంచాయతీరాజ్, హోం శాఖల్లోని ఖాళీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆయా విభాగాల్లో ఉన్న జిల్లాస్థాయి పోస్టులెన్ని.. అందులో మొదటి విడతగా భర్తీ చేయాల్సినవి ఎన్ని.. తదితర వివరాలతో సమగ్ర నివేదికను రెండు మూడు రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్శర్మ సంబంధిత కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం 5 విభాగాల కార్యదర్శులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో సీఎస్ సమావేశం ఏర్పాటు చేశారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల ఖాళీల వివరాలనూ విడిగా అందించాలని సూచించారు. విద్యాశాఖలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సి ఉంది. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ కారణంగా ఈ నియామకాలు ఆలస్యమవనున్నాయి. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న మిగతా పోస్టుల వివరాలు సేకరిస్తున్నారు. అత్యధికంగా పోలీసు విభాగంలో 12 వేలకు పైగా ఖాళీలున్నాయి. కానిస్టేబుల్ మొదలు ఎస్ఐల వరకు రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. వీటిపై సమావేశంలో చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్ పోస్టుల వరకు తొలుత భర్తీ చేసే అవకాశముంది. ఆ వివరాలతో పాటు కొత్త పీహెచ్సీలు, అప్గ్రేడ్ అయిన పీహెచ్సీల్లో ఉన్న ఖా ళీల వివరాలను అందించాలని సీఎస్ సూచిం చారు. దాదాపు వెయ్యి పోస్టుల వరకు తక్షణం భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు బదులిచ్చారు. 50 వేలకు చేరిన ఖాళీలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేసే సమయంలో 17,960 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం చెప్పటంతో ఆర్థిక శాఖ అందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. సీఎస్ రాజీవ్ శర్మ అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమై ఆగమేఘాలపై ఖాళీల వివరాలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఖాళీల సంఖ్య దాదాపు 50 వేలకు చేరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అందులో ఏ పోస్టులను ముందు భర్తీ చేయాలి... వీటిలో వేటిని టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ చేయాలి, ఏ పోస్టులను డిపార్టుమెంటల్ బోర్డుల ద్వారా చేపట్టాలి, జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీకి వేటిని అప్పగించాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విభాగాల వారీగా అధికారులతో సమావేశమై తక్షణ ప్రాధాన్యంగా భర్తీ చేయాల్సిన పోస్టులు, వాటికి అర్హతలు, ఎంపిక విధానంపై చర్చిస్తున్నారు. ప్రతిపాదనలన్నీ సిద్ధమయ్యాక ఉద్యోగాల భర్తీ ఫైలును సీఎంకు నివేదించనున్నారు. -
తీరమెక్కడో.. గమ్యమేమిటో..తెలియదుపాపం!
బర్మా రోహింగ్యా ముస్లింల దైన్యం ఒకవైపు ఆగర్భ దారిద్య్రం.. మరొకవైపు ఆధిపత్య జాతి హింసాకాండ! పుట్టిన గడ్డపైనే బతుకు దుర్భరం! హింసను తప్పించుకోవటానికి, ప్రాణాలు దక్కించుకోవటానికి, అసలు బతకటానికి మరో దేశానికి వలస పోవాల్సిన పరిస్థితి! మరి ఆ మరో దేశం.. వీరిని ఎలా రానిస్తుంది? అందుకే.. వారు మనుషులను అక్రమంగా రవాణా (స్మగ్లింగ్) చేసే మాఫియా కాళ్లు పట్టుకుని.. తమ జీవిత సంపాదన మొత్తాన్నీ ధారపోసి.. పడవల్లో దొంగతనంగా వెళుతున్నారు. అలా వచ్చే వారు పదులు, వందల సంఖ్యలో అయితే ఏమోగాని వేలల్లో వచ్చేస్తూ ఉంటే ఏ దేశమైనా ఏం చేస్తుంది?.. వీల్లేదు పొమ్మని తరిమేస్తుంది! ఇప్పుడు ప్రపంచంలో అదే జరుగుతోంది. ఫలితం.. పశ్చిమాన మధ్యదరా సముద్రంలో.. తూర్పున అండమాన్ సముద్రంలో.. పెను సం క్షోభాలు పుట్టాయి! అక్కడ సిరియా, పశ్చిమాసియా, ఆఫ్రికా వాసులైతే.. ఇక్కడ మయన్మార్ (బర్మా) రోహింగ్యా జాతి ప్రజలు! వీరితో పాటు ఉపాధి కోసం బయల్దేరిన బంగ్లాదేశ్ పేద జనాలు! తమ దేశంలో బతుకు లేక బయల్దేరిన వారు.. పొరుగుదేశాలు రానివ్వకపోతుండటంతో.. నడిసముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు! ఆకలిదప్పులతో అలమటిస్తూ చనిపోతున్నారు. చివరికి ప్రపంచం ఈ సంక్షోభంపై దృష్టిసారించింది. పరిష్కారం కనుగొనే దిశగా కృషి మొదలైంది! ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ‘ఫోకస్’... బర్మాలో ఏం జరుగుతోంది? రఖెనై రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలకు - స్థానిక రఖెనై బౌద్ధ మతస్థులకు మధ్య 2012లో మళ్లీ మత ఘర్షణలు తలెత్తాయి. ఆ క్రమంలో పశ్చిమ పట్టణ ప్రాంతాల్లోని మైనారిటీ ముస్లిం మతస్థులైన రోహింగ్యా ప్రజలపై జాతి, మత వివక్షాపూరిత హింసాకాండ మొదలైంది. ఊళ్లకు ఊళ్లు తగులబెట్టారు. ఈ హింసలో దాదాపు 100 మంది చనిపోయారు. రోహింగ్యాల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాయి. దాదాపు 1.50 లక్షల మంది రోహింగ్యాలు.. బర్మాలోనే అంతర్గత నిర్వాసితుల శరణార్థి శిబిరాల్లో బతుకుతున్నారు. వీరు ఆ శిబిరాల నుంచి అడుగు బయటపెట్టే అవకాశమే లేదు. రోహింగ్యాల జాతిని తుదముట్టించేందుకు ప్రభుత్వం, బౌద్ధ బృందాలు ‘మానవత్వంపై నేరాలకు’ (క్రైమ్స్ అగెనైస్ట్ హ్యుమానిటీ) పాల్పడ్డాయని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ 2013 ఏప్రిల్లో ఒక నివేదికలో తప్పుపట్టింది. 2012 అక్టోబర్లో రోహింగ్యాలపై దాడులు మొదలైన తర్వాతి నుంచి 2014 అక్టోబర్ వరకూ దాదాపు లక్ష మంది రోహింగ్యాలు బర్మా విడిచి వెళ్లిపోయారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకూ వలస వెళ్లిన రోహింగ్యాల సంఖ్య రెండు లక్షల వరకూ ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో బంగాళాఖాతం నుంచి దాదాపు 25,000 మంది పడవల్లో వలసలు వెళ్లారని.. వారిలో సగం మందికి పైగా.. రఖెనై రాష్ట్రం నుంచి బయల్దేరిన రోహింగ్యాలే ఉంటారని శరణార్థులపై ఐక్యరాజ్యసమితి దౌత్య కార్యాలయం పేర్కొంది. ఓ చిన్న దేశం.. పెద్ద మనసు ఆసియా దేశాలు పొరుగువారిపై కరుణ చూపటానికి నిరాకరిస్తుంటే.. కడు పేద దేశమైన గాంబియా మాత్రం ఎంతో పెద్ద మనసు చూపింది! బర్మా నుంచి వలస పోతూ సముద్రంలో చిక్కుకున్న వారందరి బాధ్యతనూ తాను తీసుకుంటానని ఆఫ్రికా ఖండంలోని ఈ పేద దేశం ప్రకటించింది. వారిని తమ దేశానికి పంపిస్తే శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఎందుకంటే.. ‘సాటి మానవులు, ముఖ్యంగా సాటి ముస్లింల కష్టాలు, కడగండ్లను తొలగించేందుకు సాయపడటం సాటి మానవులుగా, ముస్లింలుగా మన పవిత్ర కర్తవ్యం’ అని పేర్కొంది. ఈ వలస జీవుల భారాన్ని మోసేందుకు దక్షిణాసియా దేశాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. ఫిలిప్పీన్స్ కూడా సహాయం చేసేందుకు తన సంసిద్ధతను తెలిపింది. పొరుగు దేశాలు ఏమంటున్నాయి? రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల వలసలు పెరుగుతుండటంతో.. థాయ్లాండ్, మలేసియా, ఇండోనేసియాలు దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాయి. ఈ ఏడాది మే నెలలో తమ తీరాలకు బోట్లలో వస్తున్న రోహింగ్యాలను వెనక్కు పంపటం మొదలుపెట్టాయి. ఏ దేశమూ వారిని తమ దేశంలో అడుగుపెట్టేందుకు వీలు లేదని నిరాకరించాయి. దీంతో వేలాది మంది అండమాన్ సముద్రం (బంగాళాఖాతం) పైనే చిక్కుకుపోయారు. అసలే కడు పేదరికంలో ఉన్న ఈ వలస జనం.. బోట్లలో ఉన్న ఆహారం నిండుకోవటంతో ఆకలితో అలమటిస్తూ.. స్మగ్లర్లు వదిలేసి వెళ్లగా దుర్భరంగా గడుపుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నా రు. కొన్ని బోట్లు మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నెల 10వ తేదీ నుంచి 3,600 మందికి పైగా వలస జనం.. ఇండొనేసియా, మలేసియా, థాయ్లాండ్ తీరాలకు కొట్టుకొచ్చారు. ఈ పరిణామాలు వెలుగుచూడటంతో అంతర్జాతీయ సమాజం దృష్టిసారించింది. ఈ వలసల సమస్యని పరష్కరించాలని స్థానిక దేశాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో.. ఆగ్నేయాసియా సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన వలసల పడవల కోసం సమీప దేశాల నౌకాదళ ఓడలు గాలింపు చేపట్టాయి. సముద్రంపై చిక్కుకుని ఉన్న దాదాపు 7,000 మందికి తాత్కాలిక ఆశ్రయం ఇస్తామని మలేసియా, ఇండోనేసియాలు అంగీకరించాయి. బోట్లను తిప్పి పంపటం నిలిపివేస్తామని.. బోట్లలో అనారోగ్యానికి గురైన వారికి తమ తీరంలో వైద్య చికిత్స అందిస్తామని థాయ్లాండ్ పేర్కొంది. అయితే.. వారి కోసం ఎటువంటి శిబిరాలనూ ఏర్పాటు చేయబోనని తేల్చిచెప్పింది. ఆస్ట్రేలియా మాత్రం వారి బాధ్యతను ఏమాత్రం తీసుకునేందుకు నిరాకరించింది. ‘ఎందుకంటే.. బోట్లపై బయలుదేరటానికి ఏ కొంచెం ప్రోత్సాహం లభించినా.. ఈ సమస్య మరింత ఉధృతమవుతుంది’ అని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. బర్మానే ఈ సమస్యను పరిష్కరించాలని థాయ్లాండ్, మలేసియా, ఇండొనేసియాలు చెప్తున్నాయి. సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించే బాధ్యతను మయన్మార్ కూడా పంచుకోవాలని.. కానీ ఆ దేశం అందుకు విముఖంగా ఉందని అమెరికా శనివారం తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ప్రాంతీయ దేశాల ప్రభుత్వాలు థాయ్లాండ్లో సమావేశమై చర్చించాలని నిర్ణయించాయి. మూల కారణాలను పరిష్కరించాలి: యూఎన్ ‘‘మయన్మార్ నుంచి రోహింగ్యా ప్రజలు, బంగ్లాదేశ్ నుంచి వలసలు వేల సంఖ్యలో సముద్ర మార్గంలో పారిపోయేలా చేస్తున్న మానవ సంక్షోభం వెనుక గల మూలకారణాలను పరిష్కరించేందుకు ఆగ్నేయాసియా దేశాలు కృషి చేయాలి. మనుషుల ప్రాణాలను కాపాడటం ముఖ్యం. సముద్రంలో చిక్కుకుపోయిన వారి కోసం సహాయ చర్యలు చేపట్టాలి. పునరావాసం, పునఃసమ్మేళనంపై మయన్మార్, మలేసియా, థాయ్లాండ్ నేతలతో, ఇతర నేతలతోనూ చర్చిస్తున్నా’’ అని వియత్నాంలో పర్యటిస్తున్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్కిమూన్ శనివారం పేర్కొన్నారు. -సెంట్రల్ డెస్క్ బర్మా టు మలేసియా వలస వెళ్లే రోహింగ్యాలు చాలా మంది తొలుత పొరుగున ఉన్న బంగ్లాదేశ్కు వెళతారు. భూమార్గంలోనే అక్కడికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరింత మెరుగైన ఉపాధి కోసం.. సముద్ర మార్గంలో మలేసియా వెళ్లేందుకు సిద్ధమవుతారు. అలా వెళ్లే వారిలో బంగ్లాదేశీయులు కూడా ఉంటారు. ఇందుకోసం మనుషులను దొంగ రవాణా చేసే ముఠాలను ఆశ్రయిస్తారు. వారు వేలు, లక్షల రూపాయలు వసూలు చేసి.. చిన్న పడవల్లో సముద్రంపైకి తీసుకెళతారు. అక్కడ కాస్త పెద్ద పడవల్లో ఎక్కిస్తారు. ఒక్కరికి సరిపోయే చోట పది మందిని ఇరికిస్తారు. కనీసం కాళ్లు కదపటానికి కూడా చోటుండదు. అలా సముద్ర మార్గం ద్వారా వీరిని థాయ్లాండ్ తరలించి.. అక్కడ రహస్య శిబిరాల్లో బంధిస్తారు. ఈ క్రమంలో వారిపై హింస, అత్యాచారాలకూ పాల్పడతారు. వారి బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసి వదిలిపెడతారు. వారు థాయ్లాండ్ నుంచి అటవీ మార్గంలో మలేసియాకు చేరుకుంటారు. దక్షిణాసియాలో కెల్లా (భారత్ కన్నా కూడా) మలేసియాలో తలసరి ఆదాయం ఎక్కువ. అందుకే అక్కడ కూలి పని చేసుకున్నా జీవితం సాఫీగా గడిచిపోతుందని రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఈ మార్గం ఎంచుకుంటున్నారు. రోహింగ్యాలు ఎవరు? ప్రధానంగా బర్మాలోని తూర్పు రఖెనై రాష్ట్రంలో నివసించే ముస్లిం మత మైనారిటీ ప్రజలు రోహింగ్యాలు. వీరిని భారతీయ-ఆర్య వర్గానికి చెందిన వారిగా చెప్తున్నారు. బర్మాలో జనాభా మొత్తం ఐదు కోట్లు ఉంటే.. వారిలో దాదాపు 13 లక్షల మంది రోహింగ్యాలు. కొందరు పరిశోధకులు వారు అక్కడే పుట్టిపెరిగిన స్థానిక జాతి ప్రజలని చెప్తుంటే.. భారత్, బర్మాల్లో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నపుడు వీరు బెంగాల్ నుంచి బర్మాకు వ్యవసాయ కూలీలుగా వలస వచ్చారని చరిత్రకారులు చెప్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలోని రోహింగ్యా ముస్లిం సైనికులకు - స్థానిక రఖెనై బుద్ధిస్టులకు మధ్య మత ఘర్షణ తలెత్తింది. అది క్రమంగా ముదిరి రెండు వర్గాలుగా చీలిపోవటానికి కారణమైంది. బర్మా 1948లో స్వతంత్రం పొందింది. 1982లో సైనిక ప్రభుత్వం తెచ్చిన పౌర చట్టం.. రోహింగ్యా ప్రజలను దేశ పౌరులుగా గుర్తించలేదు. వీరిని ‘నివాస విదేశీయులు’గా వర్గీకరించారు. పౌరసత్వం లేదు కాబట్టి.. ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే హక్కు లేదు. ఆరోగ్య సే వలు అందవు. వీరి కదలికలపైనా ఆంక్షలున్నాయి. -
ఇక కోలీవుడ్ పైనే దృష్టి
ఇకపై కోలీవుడ్ పైనే ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు నటుడు అజ్మల్ అమీర్ పేర్కొన్నారు. కథానాయకుడిగా అయినా..ప్రతినాయకుడిగానయినా పాత్రగా మారిపోయే నటుల్లో అజ్మల్ ఒకరని చెప్పవచ్చు. తురుతురు తిరుతిరు లాంటి చిత్రాలలో హీరోగా నటించి పేరు తెచ్చుకున్న ఈ యువ నటుడు అంజాదే, కో వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. అలా, తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు సంపాధించుకున్న అజ్మల్ నటుడిగా తనను విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా తెలుగు, మలయాళ చిత్రాలపై దృష్టి సారించారు. తెలుగులో రెండు చిత్రాలు, మలయాళంలో కొన్ని చిత్రాలు చేసి మంచి పేరు పొందారు. దీంతో సహజంగానే తమిళంలో కొంచెం గ్యాప్ వచ్చిందంటారు అజ్మల్. ఆయన మాట్లాడుతూ మలయాళంలో ఒక చిత్రంలో మోహన్లాల్తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అయితే ఇతర భాషల్లో నటిస్తున్నా కోలీవుడ్లో రాణించాలన్నదే తన ఆశ అని అన్నారు. అందుకే ఇప్పుడు చెన్నైలో సెట్టిల్ అయినట్లు పేర్కొన్నారు. ఇక తమిళ చిత్రాలపైనే దృష్టి సారించనున్నట్టు చెప్పారు. ఇక్కడ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తునట్లు అజ్మల్ వెల్లడించారు. -
నేను అప్పట్లోనే కమలహాసన్ అభిమానిని
తమిళ చిత్రాలపై దృష్టి సారించినట్లున్నారు నటి విద్యాబాలన్. బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ బెంగళూరు భామ తమిళంలో చివరగా గురు చిత్రంలో నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ప్రధాన నాయకి ఐశ్వర్యారాయ్. కాగా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత ఒక తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్ర నిర్మాతతో విభేదాల కారణంగా తప్పుకున్నారు. దీంతో తమిళ చిత్రాలపైనే కోపం పెంచుకున్న విద్యాబాలన్ హిందీ, మలయాళ చిత్రాలకే పరిమితం అయిపోయారు. అలాంటిది తాజాగా తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేయడం విశేషం. ప్రస్తుతం హిందీలో అవకాశాలు తగ్గడమే కారణమా? ఇందుకు ఆమె ఏం చెబుతున్నారో చూద్దాం. నా ఆలోచనలు చిన్నతనంలో చెన్నైలో గడిపిన రోజులు వైపు మల్లుతున్నాయి. నేను అప్పట్లోనే కమలహాసన్ అభిమానిని. ఒకసారి ఆయన్ని కలవడానికి కమల్ ఇంటికితీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో లేరు. అయితే ఆయన ఆటోగ్రాఫ్తో కూడిన ఫొటో నాకు లభించింది. అప్పట్లో అదే పెద్ద థ్రిల్లింగ్ కలిగించిన విషయం. తమిళ చిత్రాలకు దూరం అయ్యారేంటి? అని చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే తమిళ, మలయాళం నాకు మాతృభాషలాంటివి. మంచి స్క్రిప్ట్ దొరికితే తమిళంలో నటించడానికి ఎప్పుడు సిద్ధమే. గత 2008 నుంచి నేను చిత్రాలను తగ్గించుకుంటున్నాను. ఏడాదికి ఒక్క చిత్రంలోనే నటిస్తున్నాను. షూటింగ్ ప్రాంతాలకు దూరంగా బాహ్య జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అంటున్నారు నటి విద్యాబాలన్. -
మావోయిస్టు దళాలపై ఆరా తీస్తున్నాం: ఐజీ అతుల్సింగ్
రాజమండ్రి : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచామని, ఆయా ప్రాంతాల్లో ఎన్ని దళాలు ఉన్నాయో సమాచారం సేకరిస్తున్నామని కోస్తా జిల్లాల ఐజీ (లా అండ్ ఆర్డర్) అతుల్సింగ్ చెప్పారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల ఎస్పీలతో రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం అతుల్ సింగ్ సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. ఖమ్మం నుంచి ఆ జిల్లాలో కొత్తగా కలిసిన చింతూరు మండల పరిధిలో కొంత మావోయిస్టుల ప్రభావం ఉందన్నారు. అక్కడ సీఆర్పీఎఫ్, ఇతర బలగాల నిఘా ఉందని, నిత్యం గాలింపు జరుగుతోందని చెప్పారు. -
టాలీవుడ్ పై ధనుష్ పోకస్
-
‘ఘోషా’ కాంట్రాక్ట్పై టీడీపీ నేతల కన్ను !
ప్రజల మేలు కోరవలసిన ఎమ్మెల్మేలు తమ సొంత లాభం చూసుకుంటున్నారు. అధికారులు నిబంధనలు పాటించకపోతే సరిదిద్దవలసిన ప్రజా ప్రతినిధులే ఆ గట్టుదాటి తాము చెప్పినట్టు చేయాలని పట్టుపడుతున్నారు. ఒకే కాంట్రాక్ట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో ఏం చేయాలో అర్థంకాక తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆస్పత్రి అధికారులు ఏం చేయాలో తెలియడం లేదని ‘ఘోషి’స్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం ఘోషా ఆస్పతి శానిటేషన్, సెక్యూరిటీ సర్వీసుల కాంట్రాక్ట్పై టీడీపీ నేతల కన్ను పడింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వాటిని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయతిస్తున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తన సోదరికున్న కన్సల్టెన్సీకి ఇవ్వాలని సూపరింటెండెంట్కు తన లెటర్ పాడ్పై లేఖ రాసి పంపిం చారు. అక్కడేది జరిగినా తెలియాలని, అవన్నీ నాకే ఇవ్వాలని మరో ఎమ్మెల్యే ఫోన్ చేసి సూపరింటెండెంట్ను ఆదేశించారు. దీంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వకూడదని, అలా ఇస్తే నిబంధనలకు విరుద్ధమని, అందుకు తామే బాధ్యులం కావల్సి వస్తుందని అధికారులు భయపడుతున్నారు. కాదంటే ఆ ఇద్దరి ఎమ్మెల్యేలతో పనిచేసినంత కాలం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఘోషా ఆస్పత్రి శానిటేషన్, సెక్యూరిటీ సర్వీసుల కాంట్రాక్ట్ను టెండర్ల ద్వారా పిలిచి అప్పగిస్తున్నారు. ఎవరైతే తక్కువగా కోట్ చేస్తారో వారికే కాంట్రాక్ట్ను కేటాయిస్తారు. గత ఏడాది వరకు ఇదే జరిగింది. పాత కాంట్రాక్టర్ గడువు ముగిసినా ఉన్నతాధికారులు కొత్తగా టెండర్లు పిలవకపోవడంతో నెల నెలా ఎక్స్టెన్షన్ ఇస్తూ పాత కాంట్రాక్టర్నే కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. తొలుత ద్వితీయ శ్రేణి నాయకులు హడావుడి చేశా రు. తమకివ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంతలోనే అదే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సదరు కాంట్రాక్ట్ విషయాన్ని తెలుసుకున్నారు. దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన సోదరికి ఉన్న కన్సల్టెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశిస్తూ ఒక ఎమ్మెల్యే ఏకంగా తన లెటర్ ప్యాడ్ మీద లేఖరాసి పంపించారు. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్ట్ ఉద్యోగి ద్వారా ఈ లేఖను అందజేశారు. ఆయన చేతే ఆ కాంట్రాక్ట్ను నిర్వహించేందుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ లేఖ పంపించడమే కాకుండా నేరుగా ఫోన్ చేసి ఎలాగైనా తమకే రావాలని ఒత్తిడి కూడా చేసినట్టు తెలిసింది. జిల్లాలో ఎక్కడెక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు ఉన్నాయి? వాటినెలా దక్కించుకోవాలి? ఏం చేస్తే ఉన్న ఫళంగా డబ్బులొస్తాయి? అని ఆరాటపడుతున్న మరో ఎమ్మెల్యే కూడా ఘోషా కాంట్రాక్ట్పై కన్నేశారు. తన నియోజకవర్గం పరిధిలోనిది కాకపోయినా ఘోషాలో అన్నీ తనకు తెలిసే జరగాలని, ఏం వచ్చినా నాకే ఇవ్వాలని, కాంట్రాక్టులు తనకే కట్టబెట్టాలని నేరుగా సూపరింటెండెంట్కు ఫోన్ చేసి ఆదేశించినట్టు తెలిసింది. ఈ విధంగా ఒకే కాంట్రాక్ట్ కోసం ఇదరు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు వైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో సూపరింటెం డెంట్ ఇరకాటంలో పడ్డారు. టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, అలాగని కాదంటే భవిష్యత్లో ఎక్కడ దెబ్బకొడతారేమోనని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లినట్టు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు కూడా డైలామాలో పడి ప్రభుత్వ స్థాయిలో టెండర్లు పిలుస్తారని, అక్కడేమైనా చేసుకోవాలే తప్ప ఇక్కడేమి చేయలేమనే వాదన పరోక్షంగా విన్పిస్తున్నట్టు తెలుస్తోంది. -
టెన్త్ ’ప్రయివేటు’కు నో
-
చేపల మార్కెట్పై తెలుగు తమ్ముళ్ల కన్ను
ఏలూరు, సెంట్రల్ : తెల్లదొరల కాలం నాటి ఏలూరు చేపల మార్కెట్పై పచ్చచొక్కా దొరల కన్నుపడింది. నివాస గృహాల నడుమ ఉందన్న సాకుతో, కంపు నెపంతో దీనిని ఊరికి దూరంగా తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇది ఏ పెద్దలకు ఇంపు కలిగించేందుకో తెలియదు కానీ, మాదేపల్లిరోడ్డులోని డంపింగ్ యార్డు పక్కకు దీన్ని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏలూరులోని గ జ్జెలవారి చెరువు సమీపంలోని చేపల మార్కెట్ 1936లో ఏర్పడింది. తొలుత చిన్న పాకలతో మొదలైన మార్కెట్ క్రమేపీ ఆధునికతను సంతరించుకుంటూ ప్రస్తుతమున్న రూపుకు వచ్చింది. గతేడాది అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని దీనిని రూ.మూడు కోట్లతో మరింత ఆధునీకరించి కొత్త సొబగులు అద్దారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని కూడా పొరుగునే ఉన్న విజయవాడలో ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఏలూరులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్ల కన్ను ఖరీదైన స్థలాలపై పడింది. ఇవేకాక ఉపయోగంలో ఉన్న స్థలాలను కూడా కబ్జా చేసేందుకు వల పన్నారు. దీనిలో భాగంగానే చేపల మార్కెట్పై దృషి సారించినట్టు తెలిసింది. కౌన్సిల్లో ఎలాగూ ఆధిపత్యం ఉండటంతో ఒక తీర్మానంతో గుట్టు చప్పుడు కాకుండా దాన్ని ఊరి చివరికి నెట్టేందుకు చకచకా పావులు కదిపారు. దీంతో ఈ చేపల మార్కెట్నే నమ్ముకుని తరతరాలుగా బతుకుతున్న వందలాది కుటుంబాలు వీధిన పడే దుస్థితి నెలకొంది. సుమారు నాలుగు ఎకరాల స్థలంలోని ఈ మార్కెట్లో సుమారు 23 రకాలైన సంఘాల వారు పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ చేపలు అమ్మే వారిలో అత్యధికులు మహిళలే కావడం విశేషం. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమమే ధ్యేయమని, మహిళల స్వావలంభనే లక్ష్యమని చంద్రబాబునాయుడు కూడా ప్రకటించారు. నిజమే కాబోలని నమ్మి తెలుగుదేశానికి ఓట్లేశారు అత్యధిక శాతం మహిళలు. అందులో చేపల అమ్మకమే ప్రధాన వృత్తిగా బతుకుతున్న ఏలూరులోని ఈ మహిళలు సైతం ఉన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనులు చూస్తుంటే బాబు చెప్పిం దంతా భూటకమని తేలిపోతుందని, ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో తాము ఉపాధి కోల్పోతామని చేపల మార్కెట్లోని పలువురు మహిళలు కలవరపడుతున్నారు. చేపల మార్కెట్ను తరలిస్తే ప్రతిఘటిస్తాం చేపల మార్కెట్ తరలిస్తే ప్రతిఘటిస్తామని బహుజన్ సమా జ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేతల రమేష్బాబు స్పష్టం చేశారు. కొత్తరోడ్డులోని ఎఫ్ఆర్ఈఈ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడుకున్న అప్రజాస్వామికమైన చర్యగా ఖండించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల సహకారంతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సయ్యద్ జానీ, ఎమ్.గిరిబాబు, డి.నాగేంద్రకుమార్, బుంగా నాగరాజు, స్వామిదాసు పాల్గొన్నారు. మాయదారి ప్రభుత్వం చంద్రబాబుది మహిళా ప్రభుత్వం కాదు.. మాయదారి ప్రభుత్వం. నిజంగా వారిది మహిళా ప్రభుత్వమే అయితే చేపల అమ్మకంతోనే బతుకుతున్న తమను ఊరికి దూరంగా గెంటేయిస్తారా? ఆయన చెప్పింది నిజమని నమ్మి ఓట్లేసి గెలిపించినందుకా మాకీ శిక్ష? - బచ్చా మణెమ్మ, చేపల అమ్మకందారు తరతరాలుగా ఇక్కడే ఉన్నాం తరతరాలుగా ఈ చేపల మార్కెట్నే నమ్ముకుని బతుకుతున్నాం. మాకీ చేపల అమ్మకం తప్ప మరోకటి తెలియదు. అలాంటిది ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేస్తే మా వ్యాపారం సాగేదెలా? మా వద్ద చేపలెవరు కొంటారు? - జయమ్మ, చేపల అమ్మకందారు చూస్తూ ఊరుకోం కొత్త ప్రభుత్వం వ స్తే మా తలరాత మారుతుందనుకున్నాం. తీరా చూస్తే అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నారు. మొత్తం మార్కెట్నే కబళించాలని చూస్తున్నారు. మా కడుపు కొడితే మేము చూస్తూ ఊరుకోం. ఉద్యమాలతో మా మార్కెట్ను కాపాడుకుంటాం. - బోను చక్రధర్, హోల్సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం నేత మార్కెట్ తరలింపును సహించం చావనైనా చస్తాం కానీ చేపల మార్కెట్ను ఇక్కడి నుంచి తరలిస్తే మాత్రం సహించం. ఎవరికో లబ్ది చేకూర్చేందుకు మమ్మల్నిక్కడి నుంచి పొమ్మంటే పోయేది లేదు. తొలుత శాంతియుతంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మా గోడు వెళ్లబోసుకుంటాం. - వై.గణేష్, చేపల మార్కెట్ అధ్యక్షుడు -
సారూ మరిచారా?మీరు జిల్లాకు కలెక్టరు కదా !
ఫోకస్ మొత్తం కుప్పంపైనేనా ? ఐదుగురు ఆర్డీవో స్థాయి అధికారుల నియామకం డెప్యుటేషన్పై 26మంది టీచర్ల బదలాయింపు వైద్యశాఖలోనూ 48 మందిని పంపిన వైనం అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కంకణం కలెక్టర్ పనితీరుపై జిల్లాలో జోరుగా చర్చ కుప్పం నియోజకవర్గం చాలా వెనుకబడింది...కచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే ! ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఫోకస్ మొత్తం కుప్పంపైనే ఉంచి తక్కిన నియోజకవర్గాలను విస్మరిస్తే...అది కూడా సరికాదనేది విశ్లేషకుల అభిప్రాయం. అచ్చం ఇదే తంతుతో ముందుకెళుతున్నారు కలెక్టర్ సిద్ధార్థ్జైన్. విధుల్లో చేరినప్పటి నుంచి ‘కుప్పం’పై కలెక్టర్ అనుసరిస్తున్న పాలన, విధానపరమైన నిర్ణయాలపై అధికారులతో పాటు, విశ్లేషకుల్లో జోరుగా చర్చసాగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లా కలెక్టర్లా కాకుండా కుప్పం ఆర్డీవోగా సిద్ధార్థ్జైన్ వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లా కలెక్టర్గా సిద్ధార్థ్జైన్ గత నెల 12న బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరినప్పటి నుంచి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. అధికారులను పరుగెత్తిస్తున్నారు. తనదైన ‘మార్క్’ను చూపించి పాలనను గాడిలో పెట్టాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా సమగ్రాభివృద్ధిపై కాకుండా కుప్పం నియోజకవర్గంపైనే కలెక్టర్ ఫోకస్ పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలరోజుల్లో కుప్పంపై కలెక్టర్ మార్క్ ఇది బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదు రోజులకే కలెక్టర్ కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నలుగురు ఆర్డీవో స్థాయి అధికారులను నియమించారు. ఆధార్ సీడింగ్తో పాటు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వారికి అప్పగించారు. వీరితో పాటు అమలాపురం ఆర్డీవో ప్రియాంకను కుప్పం ప్రత్యేకాధికారిగా రప్పించడంలో కూడా కలెక్టర్ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేకాధికారిగా రప్పించారని తెలిసింది. దీంతో కుప్పం నియోజకవర్గాన్ని ఐదుగురు ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తొలి గ్రీవెన్స్ సెల్ చిత్తూరులో నిర్వహించి, రెండో గ్రీవెన్స్డేను కుప్పంలో నిర్వహించారు. తాజాగా కుప్పంలో ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్యశాఖల్లో ఖాళీల భర్తీపై దృష్టి సారించారు. ఇటీవల 26మంది ప్రభుత్వ టీచర్లను జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కుప్పం నియోజకవర్గానికి డెప్యుటేషన్పై పంపించారు. అలాగే 48మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని కుప్పానికి పంపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం డెప్యుటేషన్పై ఎవరినీ ఎక్కడా నియమించకూడదు. పైగా కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా కలెక్టర్ చొరవ తీసుకుని కుప్పం ఖాళీల భర్తీకి ఉపక్రమించారు. జిల్లా వ్యాప్తంగా 2629 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కుప్పం నియోజకవర్గంలో 510 ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించకుండా కుప్పం వెళ్లేందుకు టీచర్ల నుంచి వినతిపత్రాలు తీసుకుని పంపించారు. ఇదే తరహాలో పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లెలోని మారుమాల ప్రాంతాల్లో ఖాళీలపై కలెక్టర్ ఎందుకు దృష్టిసారించడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏలుబడిలో పాతికేళ్ల నిర్లక్ష్యం: చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గ వాసి అయినప్పటికీ కుప్పం ప్రజలు పాతికేళ్లుగా చంద్రబాబును ఆరాధిస్తున్నారు. అందలం ఎక్కిస్తున్నారు. తొ మ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా కూడా ‘కుప్పం’ నుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇన్నేళ్లు ఆదరించిన కుప్పం వాసులను చంద్రబాబు మాత్రం పూర్తిగా విస్మరించారు. కుప్పంలోని వలసలను నివారించడం, ఉపాధి కల్పనపై దృష్టిసారించడం, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కుప్పం కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరి, సత్యవేడు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు కూడా అభవృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. జిల్లా కలెక్టర్గా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉంటుంది. అయితే తాగునీటికి కటకటలాడుతున్న పూతలపట్టు లాంటి నియోజకవర్గాలతో పాటు జిల్లా అభివృద్ధిపై పాక్షిక దృష్టి పెట్టి, కుప్పంపై మాత్రం పూర్తి దృషి సారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా ఇదే దోవలో వెళుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు బయటపడకపోయినా లోలోపల కలెక్టర్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. బాధ్యత లు తీసుకున్న నెలరోజుల్లోనే కలెక్టర్ తన మనసులోని ‘లక్ష్యాన్ని’ బయట పెట్టారని చెబుతున్నారు. అధికారపార్టీ నేతలు కూడా కలెక్టర్ తీరుపై నిరుత్సాహాంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా కలెక్టర్ వైఖరిపై నేరు గా మాట్లాడకున్నా, కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై అధికారుల అంతర్గత చ ర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నెలరోజులు ‘పాలనబండిని’ కు ప్పంవైపు నడిపిన కలెక్టర్ ఇప్పుడైనా దారి మారుస్తారో లేదో చూడాల్సిందే! -
జెడ్పీ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కలెక్టరేట్కు సమీపంలో జిల్లా పరిషత్కు ఉన్న రెండెకరాలకు పైగా భూమిలో ఒకప్పుడు జిల్లా పరిషత్ గోడౌన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఉండేవి. ఈ స్థలం కాకినాడ పాతబస్టాండ్ సమీపాన కచేరీపేట అంబేద్కర్కాలనీలో ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో గజం స్థలం దొరకడమే గగనమైపోతోంది. కలెక్టరేట్కు సమీపాన గజం ప్రస్తుతం రూ.20 వేలు పైనే పలుకుతోంది. ఈ లెక్కన జెడ్పీ భూమి విలువ 20 కోట్లుపైమాటే. ఆ భూమికి సమీపాన ఉన్న సీపీఎం కార్యాలయం సుందరయ్య భవన్ వద్ద గజం రూ.30 వేలకు పైనే ఉంది. జిల్లా పరిషత్ కూడా తమ చేతుల్లోనే ఉండటంతో నామమాత్రపు లీజుతో జిల్లా టీడీపీ కార్యాలయానికి ఆ భూమిని దఖలు చేయాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇతర నేతలను వెంటబెట్టుకుని ఇటీవల ఆ స్థలాన్ని పరిశీలించి వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జెడ్పీ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకుంటే నెల నెలా వేలరూపాయలు అద్దెల అవసరం ఉండదని తెలుగుతమ్ముళ్లు ఆశిస్తున్నారు. యనమల పర్యటించి వెళ్లాక స్థానికులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. వాస్తవానికి ఆ స్థలాన్ని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, సాంఘిక సంక్షేమ హాస్టల్, కమ్యూనిటీ హాలు...ఇలా పలు ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలన్నది కొన్నేళ్లుగా స్థానికుల డిమాండ్. ప్రధానంగా ఎస్సీ, మత్స్యకార సామాజికవర్గాలు కమ్యూనిటీ హాలు కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఉండే ది. మేడలైన్ ఏరియా నుంచి పాములు వస్తున్నాయనే కారణంతో ఆ పాఠశాలను ఫ్రేజర్పేట వార్ఫ్ రోడ్డుకు ఇవతల ఉన్న పగోడా మున్సిపల్ స్కూల్లో విలీనం చేశారు. అప్పటి నుంచి సుమారు కిలోమీటరు దూరాన ఉన్న పగోడా స్కూల్కుపిల్లలను పంపాల్సి వస్తోందని, భారీ వాహనాలతో రద్దీగా ఉండే వార్ఫ్ రోడ్డు దాటించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆ ప్రతిపాదనలను కాదంటారా? స్థానికుల డిమాండ్లకు తోడు ఈ స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతించాలని జిల్లా పరిషత్ ఉద్యోగులు కోరారు. 2008లో అప్పటి జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణు అధ్యక్షతన జెడ్పీ సమావేశం చేసిన తీర్మానం కలెక్టర్ ద్వారా సీసీఎల్ఏకు వెళ్లగా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని జెడ్పీ ఉద్యోగులు చెబుతున్నా రు. సుమారు 150 మందికి జి ప్లస్ టు ప్రాతిపదికన సామూహిక భవంతులు నిర్మించాలనే ఆ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ప్రజోపయోగమైన ఇన్ని ప్రతిపాదనలు, ఇన్ని డిమాండ్లను పక్కనబెట్టి టీడీపీకి కట్టబెట్టాలనుకుంటే పెద్ద ఉద్యమాన్ని ఎదుర్కొనక తప్పదని వివిధ ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆ స్థలం లీజుకు ఇవ్వాలనుకుంటే కమ్యూనిటీ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు, ఏడేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని జెడ్పీ ఉద్యోగులు అంటున్నారు. స్థానికుల డిమాండ్ను మన్నించాలి.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని ప్రజోపయోగకరమైన పనులకే వినియోగించాలన్న స్థానికుల డిమాండ్ను గుర్తించకపోవడం అన్యాయం. టీడీపీ కార్యాలయానికి అవసరమైతే ప్రైవేటు సైటు కొనుక్కోవాలే కానీ ఇలా ప్రజలకు సంబంధించిన స్థలంపై దృష్టి పెట్టడం సమంజసం కాదు. ఆ స్థలంలో పాఠశాల లేదా రెసిడెన్షియల్ స్కూల్, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. - మెల్లిం డేవిడ్రాజు, కచేరీపేట, కాకినాడ ప్రతి గజం ప్రజలకే చెందాలి.. ఆ స్థలంలోని ప్రతి గజం ప్రజలకే చెందాలి. జిల్లా పరిషత్ ఆస్తి అంటే ప్రజల ఆస్థి. అక్కడ సుమారు 100 కుటుంబాల నివసిస్తున్నాయి. అలాంటి చోట ప్రజల ఉపయోగానికే ఆ స్థలాన్ని వినియోగించాలి. అలా కాక పక్కదారి పట్టిస్తే స్థానికుల నుంచి ప్రతిఘటన తప్పదు. ఖాళీగా ఉండటంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. స్థానికులకు పనికొచ్చే నాలుగు మంచి పనులు చేపట్టాలి. - కాటే రాము, కచేరీపేట, కాకినాడ -
పారిశ్రామిక వాడల్లో భూములపై సర్కార్ కన్ను
బొబ్బిలి:రాష్ట్రంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వం కన్ను పారిశ్రామిక వాడల్లో ఖాళీగా ఉన్న భూములపై పడింది. అతి తక్కువ ధరకు వందలాది ఎకరాలు కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టకుండా ఏళ్ల తరబడి వృథాగా ఉంచేసిన భూములపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పారిశ్రామికవాడల్లో ఎక్కడెక్కడ ఎంతెంత భూములున్నాయో నివేదిక లు కోరుతోంది. రాష్ట్రంలో కొత్తగా పారిశ్రామిక విధానం వస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని వెనక్కి తీసుకోవడమా? లేక ఇప్పటి ధరలకు అనుగుణంగా లెక్క కట్టి మిగిలిన సొమ్మును రాబట్టుకుని ఆదాయాన్ని పెంచుకోవడమా అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గ్రోత్ సెంటర్లో ఖాళీగా 700 ఎకరాలు బొబ్బిలి గ్రోత్సెంటర్లో దాదాపు 700ఎకరాలు ఖాళీగా ఉ న్నాయి. ప్రధానంగా మూడు జిల్లాల అధికారులు ఇటువం టి భూములపైనే దృష్టిసారించారు. బొబ్బిలిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి 1995లో భూసేకరణ చేశారు. పట్టణంతో పాటు సమీపంలోని ఎనిమిది గ్రామాల నుంచి దాదాపు 1150 ఎకరాలను సేకరించారు. అప్పట్లో పరిశ్రమ లు స్థాపించడానికి ముందుకు వచ్చిన వారికి స్వ్కేర్ మీటరు రూ.200కు ఇస్తామని ప్రకటించి అందుకు అవసరమైన రహదారు లు, విద్యుత్తు, పరిపాలనాభవ నాల వంటివి నిర్మాణం చేశారు. గ్రోత్సెంటర్లో గ్రీన్బెల్టు, రిజర్వు సైటు, భవనాల కోసం 300 ఎకరాల వరకూ విడిచి పెట్టగా మిగిలిన 850 ఎకరాల్లో పరిశ్రమలకు దాదాపు 475 ప్లాట్లను వేశారు. అయితే పారి శ్రామికవేత్తలు ముందుకు రాకపోవడంతో స్క్వేర్ మీటర్ ధర రూ.50 తగ్గించారు. అప్పటికీ ఎవ్వరూ రాకపోవడంతో ఒక రూపాయికి ఇచ్చేం దుకు ప్రకటించినప్పటికీ పారిశ్రామికవేత్తలు ముందుకు రా లేదు. అయితే 2004లో వైఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించడంతో బొ బ్బిలి గ్రోత్సెంటర్పై అందరి దృష్టి పడింది. 2006 నుంచి ఇక్కడ స్థలాల కొనుగోలుకు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టా రు. అప్పటికి స్క్వేర్ మీటరు ధర రూ.75ఉంది. దాంతో ప్ర ధానంగా స్టీల్ప్లాంటు నిర్మాణం కోసం బీకే స్టీల్స్ కంపెనీ 244 ఎకరాలు తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్ప్లాంటు సంయుక్తంగా 112 ఎకరాలను మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (మోయిల్) అనే పరిశ్రమను పెట్టడానికి భూములు తీసుకున్నారు. వైజాగ్ స్టీల్ ఎక్సేంజ్ మినీ స్టీల్ప్లాంటుకు 88 ఎకరాలు తీసుకున్నారు. ఈ మూడు కంపెనీలే 444 ఎకరాల వరకూ తీసుకున్నాయి. అవి ఏర్పాటైతే వాటికి సంబంధించి అనుబంధ ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నా...ఫలితం లేక పోయింది. వాటితో పాటు దాదాపు 150 ప్లాంట్లలో సుమారు 2వందల ఎకరాల వరకూ పరిశ్రమలు స్థాపించకుండా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం గ్రోత్ సెంటర్లో 130 వరకూ వివిధ స్థాయిల్లో నిర్మాణాలు ఉండగా, 80 వరకూ పనిచేస్తున్నాయి. పరిశ్రమల కోసం స్థలాలు తీసుకుని ప్రారంభించని వారికి ఏపీఐఐసీ అధికారులు నోటీసులు ఇస్తున్నా, వాటికి ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ఎంచక్కా స్థలాలు వదలకుండా ఉంటున్నారు. ప్రస్తుతం గ్రోత్సెంటర్లో స్థలాల ధరలు స్క్వేర్ మీటరు రూ.750 వరకూ ఉంది. ఇంత విలువైన స్థలంలో వందలాది ఎకరాలు వృథాగా ఉండకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచి స్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల రాష్ర్టస్థాయిలో జరిగిన సమావేశంలో వీటిపై సుదీర్ఘంగా చర్చించినట్లు భోగట్టా. ముందుగా వాటి రద్దుకు నోటీసులు ఇవ్వడం, దానికి స్పందించి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్కకట్టి వ్యత్యాసాన్ని తీసుకోవడం ఒకటే మార్గమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో రానున్న నూతన పారిశ్రామిక విధానంలో దీనిని అమలుచేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2006లో కేవలం రూ.75కే స్వ్కేర్మీటరును తీసుకుని ఇప్పుడు దానికి రూ.750 వసూలు చేసి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. -
భూముల స్వాధీనం పై సర్కారు దృష్టి
-
నామినేటేడ్ పోస్టుల పై కమలదళం ఆశలు
-
అకర్ష్ టీడీపీ ఇన్ తెలంగాణ?
-
సీమాంధ్రపై దృష్టి పెట్టిన బడా కంపెనీలు
-
రెండో విడత ఎన్నికలపై పోలీసు అధికారుల దృష్టి
సాక్షి, హైదరాబాద్: మే 7న సీమాంధ్రలో జరిగే రెండో విడత పోలింగ్పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మరోవైపు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్కమిటీ కార్యకలాపాలపై గ్రేహౌండ్స్ బలగాలను అప్రమత్తం చేశారు. సీమాంధ్రలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో విశాఖ ఏజెన్సీ ఏరియాలో కూడా మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచారు. డీజీపీ ప్రసాదరావు సీమాంధ్రలో బందోబస్తు గురించి గురువారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా హింసాయుత సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన హెచ్చరికలతో అప్రమత్తం అయ్యారు. అలాగే ఏవోబీలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. -
ప్రచారానికి పేకప్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారం సాయంత్రం తెరపడనుంది. ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీ ల్లోని 206 వార్డులకు 1182 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 30 ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యం లో పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా యి. మున్సిపల్ వార్డుల్లో బహుముఖ పోటీ ఉండటంతో అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో చివరి క్షణం వ రకు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఈ నెల 18న అభ్యర్థుల తుది జాబి తా వార్డుల వారీగా ఖరారు కావడంతో ఎన్నికల గుర్తులను ఓటర్ల మనసులో నాటేందుకు వినూత్న పద్దతులు అవలంభిస్తున్నారు. అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల సంఘం నిఘా తీవ్రం చేయడంతో వీలైనంత తక్కువ హడావుడితో ప్రచారం నడిపిం చారు. గతంలో మాదిరిగా కార్లు, జీపులు వంటివి కాకుండా ఆటోలను ఎన్నికల గుర్తులతో అలంకరించి ప్రచారం చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్ల సందడి లేకుండా కేవలం కరపత్రాలు, డోర్ పోస్టర్లకే ప్రచార సామగ్రి పరిమితమైంది. గద్వాల మినహా మి గతా మున్సిపాలిటీల్లో పార్టీలు బహిరంగ సభల జోలికి వెళ్లలే దు. పార్టీల ముఖ్య నేతలు ప్రచార పర్వానికి దూరంగా ఉండటంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికే మొగ్గు చూపారు. రోడ్షోలు కూడా లేకపోవడంతో వార్డుల్లో చివరి రెండు రోజులు మాత్రమే ప్రచార హడావుడి కనిపించింది. పార్టీలకు కీలకం సాధారణ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీ ఆర్ఎస్ చాలా చోట్ల ముఖాముఖి తలపడుతుండగా, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ తమకు పట్టు ఉన్న చోట బరిలో ఉండటంతో గెలుపోటములు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవులు రిజర్వయినా పార్టీలు మాత్రం ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. చైర్మన్ అభ్యర్థులను ప్రకటిస్తే సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని అన్ని పార్టీలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ గిరీ ఆశిస్తున్న అభ్యర్థులున్న చోట వారిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ఎత్తుగడలు వేస్తున్నారు. స్వతంత్రులు పెద్ద సంఖ్యలో ఉండటం అన్ని పార్టీలను కలవర పరుస్తోంది. టికెట్ దక్కని ఔత్సాహికులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండటంతో అధికారిక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రచార పర్వం ముగియనుండటంతో ప్రలోభాల పర్వానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. -
కారుచీకటిపై కాంతి రేఖలు
‘‘వాటర్ట్యాంకు కడిగి సంవత్సరం దాటింది... నీళ్లలో చిన్న చిన్న పురుగులొస్తున్నయి. కిచెన్ల సాలెగూడులు మీదపడుతున్నయి’’ ... ఈ మాటలు వేణు చెవులకు వినీ వినిపించనట్టుగా వినిపించేవి. కళ్ళు లేని అతనికి మనోనేత్రం ముందు ఆ దృశ్యాలు కదలాడి కన్నీరుపెట్టించేవి. ‘‘ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాక ముప్ఫై నెలలు దాటింది. అప్పుచేసి హాస్టల్ నడిపిస్తున్నాను. నేనూ అంధుడిని కావడం వల్లేమో అధికారులకు కూడా లోకువైపోయాను’’... అంధుల ఆశ్రమం నడిపిస్తున్న భీమారావును ఆవేదనకు గురిచేస్తున్న వాస్తవమది. కళ్ళ ముందు వెక్కిరించే ఇలాంటి నిజాలు, మనసులోని వేదనలు, చూపున్నవారు చేస్తున్న మోసాలు ‘మిణుగురులు’ చిత్ర రూపంలో ఇప్పుడు వెండితెరపైకీ వచ్చాయి. ఆ వాస్తవాలను స్క్రీన్పై చూపే ప్రయత్నానికీ దృష్టి లోపమున్న వారే అండ అయ్యారు. చుట్టూ ఉన్న సమాజంలోని చీకటిపై వాళ్ళు వేసిన ఈ టార్చ లైట్ చూపున్నవారినీ ఆలోచనలో పడేస్తుంది. కళ్లతో చూస్తే అర్థం కాని కొన్ని వాస్తవాలను మనసుతో చూడండంటున్నారు విశాఖపట్నంలోని హెలన్కెల్లర్ అంధుల హాస్టల్ నిర్వాహకులు భీమారావు. ఆ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నవారే కాదు... ముప్ఫై ఏళ్ల క్రితం భీమారావుతో కలిసి ఆ ఆశ్రమాన్ని స్థాపించిన హేమంత్కుమార్, బాబూరావు, వసంతకుమార్లు కూడా అంధులే. అందుకేనేమో సినిమా దర్శక - నిర్మాత అయోధ్యకుమార్కీ భీమారావుకీ మాట కుదిరింది. అంధ బాలబాలికల హాస్టల్ జీవితాల్లోని చీకటిని చూపే ప్రయ త్నమైన ‘మిణుగురులు’కు తమ ఆశ్రమం నుంచి అండగా నిలి చారు. ఈ సినిమాలో నటించడం కోసం నలభైమంది అంధ బాలబాలికలు అవసరమనుకున్న దర్శకుడు రెండు నెలలపాటు రాష్ర్టంలో చాలా ఆశ్రమాలకు తిరిగారు. ఆయన తిరిగింది అంధుల కోసమే కాదు పరిస్థితులు తెలుసుకోడానికి కూడా. వాస్తవాల కోసం... సినిమాలో నటించడం అంటే చాలామంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు. కారణం అందరికీ తెలిసిందే... వెండితెరపై వారిని వారు చూసుకుని మురిసిపోవచ్చు. కాని అంధులు ముందుకు రావడంలో అలాంటి సరదాకు అవకాశం ఎక్కడిది? మరి ఎవరి కోసం వాళ్లు మూడునెలలపాటు తిప్పలుపడ్డారు. ‘‘మా అన్నయ్య, తమ్ముడు కూడా అంధులే. అందుకే నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. పిన్నికి కూడా ఇద్దరు పిల్లలు. వారికి కళ్లు కనపడతాయి. నేను, అన్నయ్య డిగ్రీ చదువుకున్నాం. తమ్ముడు ఇంటర్ పూర్తిచేశాడు. నేను మెహదీపట్నం దగ్గర సాలార్జంగ్ కాలనీ అంధుల ఆశ్రమంలో ఉంటున్నాను. మాది నల్గొండలోని వలిగొండ దగ్గర వేములకొండ గుట్ట గ్రామం. అమ్మ అక్కడే చిన్న హోటల్ నడుపుతుంది. ‘మిణుగురులు’లో నటించినందుకు ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా కథనం కళ్లున్నవారికి కొత్తగాని మాకు కాదు. చూపున్నవారికి మేం ఎంత లోకువో మాకు మాత్రమే తెలుసు. నా చిన్నప్పుడు వినపడ్డ కొన్ని మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతుంటాయి. సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఆనంద్. కామెడీ క్యారెక్టర్ చేశాను’’ అని చెప్పాడు వేణు. నటించాల్సిన పని లేదు... హెలెన్కెల్లర్ హాస్టల్ విద్యార్థి శంకర్ సినిమాలో ‘చందు’ క్యారెక్టర్ చేశాడు. ‘‘మాది విజయనగరం దగ్గర బొబ్బిలి. నాన్న వంటపాత్రలు తయారుచేస్తారు. ‘మిణుగురులు’ మా అంధుల సినిమా మాత్రమే కాదు...కళ్లుండి కూడా మా బాధల్ని పట్టించుకోనివారి కోసం తీసిన సినిమా’’ అని శంకర్ చెప్పే మాటలు అక్షరసత్యాలు. ‘‘శ్రీకాకుళంలోని పొందూరు దగ్గర మారుమూల గ్రామం మాది. నాన్న వ్యవసాయం చేస్తారు. నేను గత ఏడాది ఎమ్ఎ పూర్తిచేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుకుమార్. ఇందులో మాతోపాటు కళ్లున్న వారు కూడా కాంటాక్ట్ లెన్స పెట్టుకుని నటించారు. అయితే వారికంటే మేం చాలా సులువుగా నటించా మన్నారు అందరూ’’ అని ఎంతో హుషారుగా చెప్పాడు రాము. సినిమా చూసినా చాలు... ‘రాష్ర్టంలో ఉన్న హాస్టళ్లన్నీ తిరిగి చూడలేరు కాబట్టి మిణుగురులు సినిమా చూస్తే కొంతైనా అవగాహన వస్తుంది’ అని అంటాడు ఈ సినిమాలో ‘సునీల్’ పాత్ర పోషించిన పరమేశ్. వాస్తవాలను చిత్రీకరించడం కోసం... ‘‘నటనంటే ఏంటో తెలియని అంధులతో సినిమా చిత్రీకరణ అనగానే దర్శకుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుంది. కానీ నాకు మిగతావారితో పోలిస్తే అంధుల సన్నివేశాలే సులువుగా అనిపించాయి’’ అని అంటారు అయోధ్యకుమార్. పెద్ద పెద్ద యాక్టింగ్ స్కూళ్ల చుట్టూ తిరగకుండా అంధుల ఆశ్రమాల్లో అడుగుపెట్టిన అయోధ్యకుమార్ తెలుగు ప్రేక్షకులకి ఓ నలభైమంది రియల్హీరోలను పరిచయం చేశారనడంలో సందేహం లేదు. - భువనేశ్వరి, ఫొటోలు: పి. ఎన్ మూర్తి కళ్ళు తెరిపించే ప్రయత్నం ‘‘అయోధ్యకుమార్గారు తన సినిమాలో నటించడానికి అంధ విద్యార్థులు కావాలని అడగ్గానే నిమిషమైనా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కథ మొత్తం విన్నాక కెమెరా మా వైపే పెట్టారని అర్థమయింది. నేను ఒప్పుకున్నది ఓ హాస్టల్ యజమానిగా కాదు...ఓ అంధుడిగా. ‘ఆశ్రమాల్లో ఉండే అంధుల పట్ల ఎంతమంది నిజాయితీగా మసలుకుంటున్నారు? సినిమా రూపంగా అయినా కొందరి కళ్లు తెరిపించగల’మన్న అయోధ్యకుమార్తో ఏకీభవించాను. ఆయన ఎంచుకున్న 35 మంది అంధుల్ని మా హాస్టల్ నుంచి మూడునెలలపాటు సినిమా చిత్రీకరణకు పంపించాను. ఈ సినిమా చూసైనా అంధులను సాటివారిగా భావిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భీమారావు. -
ఎక్సైజ్ నేరాలపై దృష్టి పెట్టండి
కడప అర్బన్, న్యూస్లైన్ : జిల్లాలో ఎక్సైజ్ నేరాలపై దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 4వ తేది తిరుపతి కేంద్రంగా జోనల్ స్థాయి సమావేశాన్ని కమిషనర్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కడప, ప్రొద్దుటూరు డివిజన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ జిల్లాలో అన్ని స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టి వాటిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. 184 మద్యం షాపుల పరిధిలో ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు తెరవాలని, మిగతా సమయాల్లో షాపులు తెరిస్తే వాటికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మద్యం కొనుగోలు విషయంలో సంబంధిత యజమానులు జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాల్సిన మొత్తాన్ని మద్యం డిపోలకు నేరుగా చెల్లించాలన్నారు. ఒకరి మద్యం షాపులోని స్టాక్ను మరొకరు ఉపయోగించరాదన్నారు. అలా చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయించరాదన్నారు. పర్మిట్ రూములను నిబంధనల మేరకు ఉపయోగించాలన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమంపై దృష్టి పెట్టాలి
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్లైన్ : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితోపాటు గిరిజన సంక్షేమంపై దృష్టి సారిం చాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత శాఖ సహాయ మంత్రి పోరిక బలరామ్నాయక్ అన్నారు. కొత్తగూడెం లో సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెంట్రల్ కార్యాలయాన్ని ఆదివా రం ఆయన ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడారు. కొత్తగూడెంలో సింగరేణి మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం ఇప్పటికే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జశ్వాల్కు వినతిపత్రం అందించామని, సీబీఐ కేసుల కారణంగా కాస్త జాప్యమైందన్నారు. 300 పడకలతో ఉన్న సింగరేణి ప్రధాన ఆస్పత్రి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుకూలంగా మా రిందన్నారు. గని కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కనీసం రూ.25 లక్షలు అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కంపెనీ లోని నాల్గవ తరగతి ఉద్యోగాలను గిరిజ నులకు అందేలా చర్యలు తీసుకోవాలని, ఇది ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించాలని చెప్పారు. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతమైనందున విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. ఇల్లెందులో కొత్త మైనింగ్ గనులను త్వరలో ప్రారంభిస్తున్నామని వివరించారు. మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోనే సింగరేణి సంస్థ ఎక్కువగా ఉన్నందున అభివృద్ధి పనులు సక్రమం గా నిర్వహించేలా యాజమాన్యం చర్య లు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ డెరైక్టర్లు బి.రమేష్కుమార్, ఎ.మనోహర్రావు, విశ్వనాథరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.నాగ్యా, సీఎంఓఐఏ అధ్యక్షుడు మాదాసి మల్లేష్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ పి.బాలరాజు, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, మాధవ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడి, మార్కెటింగ్పై దృష్టి
జగిత్యాల జోన్, న్యూస్లైన్ :వ్యవసాయ పరిశోధనస్థానాల్లో పంటల సాగుతోపాటు మార్కెటింగ్పై దృష్టి పెట్టినట్లు ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రమేశ్కుమార్రెడ్డి చెప్పారు. జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధనస్థానాన్ని ఆయన శనివారం సందర్శించారు. పరిశోధనస్థానంలో సాగుచేసిన వరి, పసుపు, చెరుకు, సోయాబీన్ తదితర పంటలు పరిశీలించారు. వరి పంటను వివిధ పద్ధతుల ద్వారా సాగు చేసే విధానాలు, లాభనష్టాలపై పరిశోధనస్థానం డెరైక్టర్ కిషన్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు లాభదాయకంగా ఉండే పంటలపై ప్రత్యేక పరిశోధనలు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. రైతులు పంట పండిస్తున్నారుగానీ సరైన లాభాలను మాత్రం అర్జించడం లేదని, వారికి మార్కెటింగ్ నైపుణ్యాలను తెలియజేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసే ప్రతి ప్రయోగం రైతులను దృష్టిలో ఉంచుకుని చేయాలని సూచించారు. ప్రతీ పంటలో ఉపయోగించే ఆధునిక యంత్రాలను రైతుల చెంతకు చేరుస్తున్నామని వివరించారు. యువ శాస్త్రవేత్తలు పరిశోధన వ్యాసాలు రాసేందుకు ముందుకు రావాలని కోరారు. పరిశోధనస్థానంలో శాస్త్రవేత్తల కొరత ఉందని, వెంటనే తీర్చాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట అసిస్టెంట్ డీన్ ఆప్ ఎక్స్టెన్షన్ విజయాభినందన్రావు, సీనియర్ శాస్త్రవేత్త వెంకటయ్య, శాస్త్రవేత్తలు చంద్రమోహన్, తిరుమల్రావు, సుధారాణి, శ్రీలత, తిప్పె స్వామి, శోభారాణి పాల్గొన్నారు.