Hackers
-
వామ్మో...వెడ్డింగ్ ఇన్విటేషన్లు!
పలమనేరు: గతంలో ఎవరిదైనా వివాహ శుభకార్యమైతే ఇళ్లకు వెళ్లి పెళ్లిపత్రికలు ఇచ్చేవారు. ఇప్పుడంతా డిజిటల్ మయమైంది. అన్నింటికీ స్మార్ట్ ఫోనే దిక్కుగా మారింది. అందులోనే వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులు, స్నేహితులకు పంపుతున్నారు. వెడ్డింగ్ కార్డు కాబట్టి తప్పకుండా వాట్సాప్లో వచ్చిన మెసేజీని టచ్ చేసి చూడాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంలా మారింది. ఆయా ప్రాంతాల్లో బాగా తెలిసిన వారి పెళ్లి డిటిటల్ కార్డును హ్యాకర్లు డౌన్లోడ్ చేసుకుని దాన్ని డాట్ ఏపీకే ఫైల్గా మార్చి వేలాదిమందికి వాట్సాప్లో పంపుతున్నారు. కచ్చితంగా చూడాలి కాబట్టి మనం ఆ మెసేజ్ను టచ్ చేశామో అంతే సంగతులు. మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లి మన వ్యక్తిగత డేటా, మన బ్యాంకు వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు స్కామర్లకు చేరిపోతోంది.వెలుగు చూసిందిలా...చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలోని నంగిళిలో ఓ వ్యాపారి తన కుమార్తె పెళ్లి కార్డులను మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయించి దాన్ని బంధువులకు, స్నేహితులకు వాట్సాప్కు పంపారు. దీన్నే కొందరు హ్యాకర్లు కాపీ చేసి అందులో డాట్ ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజి కిట్) ఫైల్ను సెట్చేసి పలువురి మొబైళ్లకు పంపారు. దీన్ని ఓపెన్ చేసినవారి ఫోన్లలోకి డాట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయి వారి మొబైళ్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు మొబైల్లో డాట్ ఏపీకే ఫైల్ను రీసెట్ చేయడం ద్వారా మెయిల్, పాస్వర్డ్ మార్చుకుని టూస్టెప్ వ్యాలిడేషన్ చేసుకుని ఆపై డిలీట్ చేసుకున్నారు. మరికొందరి ఖాతాల్లోంచి దాదాపు 1.60లక్షల దాకా పోగొట్టుకున్నట్టు తెలిసింది. దీంతో కొందరు బాధితులు మాత్రం సైబర్సెల్కు సెల్ఫోన్ ద్వారానే ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పోయిన నగదు వారికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్వేర్ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఎదురవుతున్న సవాళ్లు..ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్లు, వైరస్లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కొత్త అప్డేట్.. యాపిల్లో అదిరిపోయే ఫీచర్!రక్షణ వ్యవస్థలపై ఫోకస్ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.సైబర్ నేరాల లెక్కలివీ..వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది. -
లింక్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
నాలుగు రోజుల కిందట పలమనేరుకు చెందిన రాము అనే వ్యక్తి సెల్ఫోన్లోని వాట్సాప్కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా రూ.300 చెల్లించాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6వేలను విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న రాము బ్యాంక్కు వెళ్లి ఆరా తీస్తే విదేశాల నుంచి వాట్సాప్కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్వర్డ్ను సేకరించి డబ్బులు స్వాహా చేశారని తేలింది. ఇదే తరహాలో కొద్దిరోజులుగా పలమనేరు ప్రాంతంలో వందలాది మందికి జాతీయ బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైల్స్, యాప్ లింక్లు వస్తున్నాయి.హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్ల లింక్లను వాట్సాప్కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసినవారి సెల్ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్ను తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఆ యాప్ల కింద ఉన్న బగ్ లింక్ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. – పలమనేరుఎక్కువగా గ్రూపులకు... మన మొబైల్ నంబర్కు సాధారణంగా దేశం కోడ్ +91గా ముందుంటుంది. కానీ హ్యాకర్లు మన నంబర్ను హ్యాక్ చేసి దాని ముందు +44 పెట్టి ఇంటర్నెట్, డార్క్నెట్ ఆధారంగా వాట్సాప్లో మోసపూరిత బగ్స్, లింకులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ తరహా మెసేజ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ తెలిసిన వారిదిలాగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంటర్నేషనల్ కోడ్ మాత్రం మార్పు ఉంటుంది. ఈ విషయం తెలియని వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు మనవాళ్లే మెసేజ్ పంపారని ధైర్యంగా ఆ లింకును ఓపెన్ చేసి మోసపోతున్నారు. అదేవిధంగా గూగుల్, జూమ్ మీటింగ్లలో ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు డార్క్నెట్ ద్వారా ఆ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఒకరి నంబరు హ్యాక్ చేసి, అతని నంబరు ద్వారా మిగిలిన సభ్యులు అందరికీ మోసపూరిత యాప్లు, బగ్స్ లింక్లను కొన్ని నిమిషాల్లోనే పంపిస్తున్నారు. వారు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వీటిపై క్లిక్ చేస్తే సులభంగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మేలు... మన సెల్ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అయితే వెంటనే హ్యాక్ అయ్యిందేమోనని అనుమానించాలి. గత కొన్ని రోజులుగా ఏమైనా కొత్త లింక్లపై క్లిక్ చేశారా.. అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోసపూరిత లింక్, ఫైల్పై క్లిక్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్ను రీసెట్ కొట్టాలి. ఫోన్లోని ఈ–మెయిల్, పాస్వర్డ్లు అన్ని మార్చివేయడం మంచింది. హ్యాకింగ్ అనుమానం వస్తే ఫోన్పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి పూర్తిగా నిలిపివేయాలి. ఫోన్పే, గూగుల్ పే, పే టీఎం వంటి పేమెంట్ యాప్లు అన్ ఇన్స్టాల్ చేయాలి. కాగా, బ్యాంకుల నుంచి వాట్సాప్కు ఎటువంటి మెసేజ్లు, లింక్లు పంపించరని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు పేరుతో మెసేజ్ వస్తే వెంటనే సమీపంలోని బ్రాంచ్లో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
BEALERT: మీ డేటా జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్కుమార్ ఏకంగా పోలీసు వెబ్సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్లైన్లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.జియో లొకేషన్ను ట్యాగ్ చేయొద్దు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్లైన్లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.అఆ ‘పాస్వర్డ్లు’ వద్దే వద్దు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్వర్డ్లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.‘ఎక్స్టెన్షన్’లను తొలగించండి కంప్యూటర్, ల్యాప్టాప్ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్లు, బ్రౌజర్లకు ఎక్స్టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్టెన్షన్స్ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి.అదీకృత అప్డేట్స్ చేసుకోవాల్సిందే ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్డేట్స్ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.లాగిన్ వివరాలు వేరుగా ఉండాలిథర్డ్ పార్టీ యాప్ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమేఆన్లైన్లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు. -
20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్..
చైనాకు చెందిన హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇండియాతోపాటు ఇతర దేశాలకు చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని దొంగలించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. చైనా ప్రభుత్వం మద్దతున్న ఓ హ్యాకింగ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయి. ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు కథనాలు వెలువడ్డాయి. సాఫ్ట్వేర్ లోపాలతో.. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో తేలింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్కు చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని ఈ దాడులు చేసినట్లు తెలిసింది. గతవారం గిట్హబ్లో లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవని సమాచారం. చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది. 20 దేశాలు టార్గెట్.. ఇతర దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేలా సైబర్ దాడులకు పూనుకునేలా చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. భారత్, యూకే, తైవాన్, మలేషియాతోపాటు మొత్తం 20 దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో ఉంది. అయితే ఈ పత్రాల లీక్కు ఎవరు బాధ్యులో కనుగొనేందుకు చైనా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? ఏం చేశారంటే.. హ్యాకర్ల నుంచి లీకైన పత్రాల ద్వారా తెలిసిన సమాచరం ప్రకారం కథానాల్లో వెలువడిన వివరాలు ఇలా ఉన్నాయి.. భారత్ నుంచి 100 గిగాబైట్ల(జీబీ) ఇమిగ్రేషన్ డేటాను సేకరించారు. హ్యాకర్లు వివిధ దేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను దొంగలించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్ నుంచి 3 టెరాబైట్ల(టీబీ) కాల్ లాగ్స్ సమాచారాన్ని సేకరించారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు. -
మైక్రోసాఫ్ట్లో సైబర్ దాడుల కలకలం!
మైక్రోసాఫ్ట్లో సైబర్ దాడుల కలకలం రేపుతున్నాయి. రష్యాకు చెందిన హ్యాకర్లు తమ సంస్థపై సైబర్ దాడులు చేశారంటూ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన చేసింది. జనవరి 12న రష్యా హ్యాకర్స్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ సిస్టమ్స్పై దాడులు చేసి ఈమెయిల్స్ను దొంగిలించారు. వాటి సాయంతో సిబ్బంది అకౌంట్లలోని పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రష్యాలో సుపరిచితమైన హ్యాకింగ్ గ్రూప్స్ నోబెలియం, మిడ్నైట్ బ్లిజార్డ్ సభ్యులు నవంబర్ 2023 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థపై ‘పాస్వర్డ్ స్ప్రే అటాక్స్’ పాల్పడినట్లు తన బ్లాగ్లో పేర్కొంది. సంస్థకు చెందిన కంప్యూటర్లపై సైబర్ దాడులే లక్ష్యంగా ఒకే పాస్వర్డ్ను పలు మార్లు ఉపయోగించడంతో హ్యాకింగ్ సాధ్యమైనట్లు వెల్లడించింది. అయితే రష్యన్ గ్రూప్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ఇమెయిల్ అకౌంట్స్ను చాలా తక్కువ శాతం యాక్సెస్ చేయగలిగింది. ఆ ఈమెయిల్స్లో సీనియర్ లీడర్షిప్ టీమ్ సభ్యులు, సైబర్ సెక్యూరిటీ, లీగల్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని మైక్రోసాఫ్ట్ నిర్ధారించింది. మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ బృందం హ్యాకర్స్ దాడులు ఎందుకు చేశారో ఆరా తీసింది. ఇందులో రష్యన్ హ్యాకర్స్ గ్రూప్ మిడ్నైట్ బ్లిజార్డ్ గురించి సమాచారం ఉన్న ఈమెయిల్స్ సేకరించే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
గూగుల్ క్రోమ్ యూజర్లూ తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హై రిస్క్ వార్నింగ్
Google Chrome Users High Risk Warning గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లూ బీ అలర్ట్. గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం చోరీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. అప్డేట్ చేసుకోకపోతే సెక్యూరిటీ పరమైన సమస్యలు తప్పవంటూ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. భారతదేశంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా గుర్తించిన లోపాలను హై-రిస్క్గా వర్గీకరించింది. ముఖ్యంగా WebPలో హీప్ బఫర్ ఓవర్ఫ్లో ఎర్రర్, కస్టమ్ ట్యాబ్లు, ప్రాంప్ట్లు, ఇన్పుట్, ఇంటెంట్లు, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇంటర్స్టీషియల్స్ లోపాలను గుర్తించినట్టు తెలిపింది. అలాగే డౌన్లోడ్లు, ఆటోఫిల్లో వాటిల్లో పాలసీ సరిగ్గా అమలు కాలేదని తెలిపింది. గూగుల్ క్రోమ్ ఈ లోపాలను బాధితుడి సిస్టమ్కు అనధికారిక యాక్సెస్ని అందించేలా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఉంటుందని CERT-In వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ వినియోగదారులు తమ సిస్టమ్ ప్రొటెక్షన్ కోసం అప్డేట్ చేసుకోవడంఉత్తతమని సూచించింది. Google Chromeఅప్డేట్ చేసుకోవడం ఎలా? Chrome విండోను ఓపెన్ చేసి కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి. డ్రాప్డౌన్ మెను నుండి, హెల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి. " About Google Chrome"పై క్లిక్ చేయండి. అప్డేట్పై క్లిక్ చేసి, బ్రౌజర్ని రీస్టార్ట్ చేస్తే చాలు. -
ఎలాన్ మస్క్కు భారీ ఝలక్!
ఎక్స్. కామ్ అధినేత ఎలాన్ మస్క్కు హ్యాకర్లు ఝలక్ ఇచ్చారు. తమ దేశంలోనూ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలని వార్నింగ్ ఇస్తూ సూడాన్కు చెందిన యాకర్లు ఎక్స్. కామ్ను హ్యాక్ చేశారు. ఆపై సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ పనిచేయకుండా బ్లాక్ చేశారు. సుడాన్లోని ఓ రహస్య హ్యాకర్స్ బృందం ప్రపంచంలోని 12కు పైగా దేశాల్లో ఎక్స్. కామ్ పని చేయకుండా 2 గంటల పాటు నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రో బ్లాగింగ్ సైట్లో తలెత్తిన అంతరాయంతో యూజర్లు ఇబ్బంది పడినట్లు బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ నివేదించింది. ‘ఎలాన్ మస్క్కు మేమిచ్చే మెసేజ్ ఇదే. సూడాన్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలంటూ హ్యాకర్స్ గ్రూప్ టెలిగ్రాం ఛానల్లో ఓ మెసేజ్ను పోస్ట్ చేసింది.ఎక్స్. కామ్ను తమ అదుపులోకి తీసుకోవడంతో యూకే, యూఎస్కు చెందిన 20,000 మంది తమకు ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటిటెక్టర్ తెలిపింది. ఎక్స్.కామ్ హ్యాకింగ్కు కారణం అయితే, జరిగిన అంతరాయాన్ని ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ సందర్భంగా హ్యాకింగ్ గ్రూప్ సభ్యుడు హోఫా మాట్లాడుతూ.. సూడాన్లో కొనసాగుతున్న సివిల్ వార్పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో డిస్ట్రిబ్యూటెడ్ డెనిషన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) హ్యాకింగ్ దాడి జరిగింది. కానీ ఇంటర్నెట్ పనితీరు కారణంగా మా నినాదాన్ని గట్టిగా వినిపించ లేకపోతున్నాం. తరచుగా ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపాడు. కాబట్టే తమకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలం అవసరమని పేర్కొన్నాడు. ప్రిగోజిన్కు వ్యతిరేకంగా హ్యాకింగ్ గ్రూప్కు రష్యా సైబర్ మిలటరీ యూనిట్కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే రష్యాతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆ సంస్థ ఖండించింది. పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పారామిలటరీని అంతం చేయడానికి రష్యా ప్రభుత్వానికి మద్దతుగా ఈ హ్యాకింగ్ గ్రూప్ జూన్లో ఓ మెసేజ్ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హ్యాకింగ్ గ్రూప్ గతంలో ఫ్రాన్స్, నైజీరియా, ఇజ్రాయెల్, అమెరికాలో అలజడి సృష్టించింది. -
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ పేర్కొంది. ఆండ్రాయిడ్– 13 సహా పలు వెర్షన్లు వైరస్ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది. లేదంటే మొబైల్స్ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్ సోర్స్ కంపోనెంట్స్ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది. అప్డేషన్ ఇలా... ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల భద్రత కోసం లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్కు తక్షణం అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్లి సిస్టమ్పై క్లిక్ చేయాలి..సిస్టమ్ అప్ డేట్స్పై క్లిక్ చేయండి. అప్డేట్స్ ఉంటే డౌన్ లోడ్ చేసుకోండి. -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్లో అమెరికా ఎయిర్ బేస్కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మార్కెట్ లోకి స్పిన్ ఒకే అనే ఆండ్రాయిడ్ మాల్వార్
-
రూ. 251తో 14ఏళ్లకే సాఫ్ట్వేర్ కనిపెట్టిన 'కన్హయ శర్మ' - ఎవరు?
ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా పెద్దవారికైనా, పిల్లలకైనా రోజు గడవదు అంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పెద్దవారి సంగతి అలా ఉంచితే, పిల్లలు పుస్తకాల్లో కంటే మొబైల్, ఇంటర్నెట్, కంప్యూటర్లలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఇది తల్లిదండ్రులకు ఆందోళనగా మారిపోతోంది. అయితే అందుకు భిన్నంగా 'కన్హయ శర్మ' అనే యువకుడు చిన్నప్పుడే అద్భుతాలు సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇతడెవారు? ఇప్పుడేం చేస్తున్నాడు? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన 'కన్హయ శర్మ' కేవలం 14 ఏళ్ల వయసులోనే ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి రూ. 50వేలకు విక్రయించాడు. ప్రస్తుతం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో గొప్ప హ్యాకర్గా పేరు తెచ్చుకున్నాడు. కన్హయ శర్మ తండ్రి ఇండోర్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిలో తమ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కన్హయ శర్మ తన చిన్నతనంలోనే కేవలం రూ. 251తో ప్రారంభమైన ఇప్పుడు ఐటీ అండ్ లీగల్ సాఫ్ట్వేర్కు సంబంధించిన కంపెనీలను స్థాపించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నాడు. నిజానికి కన్హయ శర్మ ఇండోర్లోని సరాఫా విద్యా నికేతన్లో 8వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ నిర్మాణ పనులకు అవసరమయ్యే సామాగ్రి కోసం కూలీలు ఎంతగానో కష్టపడేవారు. ఇది చూసి కన్హయ ఒక కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టాలని నిర్ణయించుకుని 30 రోజుల్లోనే అనుకున్న విధంగానే సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. దానిని సంస్థ వారికి యాభైవేల రూపాయలకు విక్రయించాడు. ఇప్పటికీ వారు సాఫ్ట్వేర్నే ఉపయోగిస్తుండటం గమనార్హం. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) తాను 6, 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రపంచంతో చాలా సంబంధాలు ఉండేవని, కానీ ఏడో తరగతిలో ఆన్లైన్ సర్టిఫికేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని కన్హయ తెలిపారు. అయితే ప్రస్తుతం న్యాయ సేవలకు ఐటీ సాఫ్ట్వేర్ అభివృద్ధిని అందించే కంపెనీలను ప్రారంభించినట్లు కూడా తెలిపాడు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) కన్హయ శర్మ చదువుకునే రోజుల్లో తమ ఇంట్లో కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 5 నుంచి 6 లగ్జరీ కార్లు ఉన్నాయని వెల్లడించాడు. అంతే కాకుండా తనకు దేశంలోని ప్రభుత్వ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నట్లు, అక్కడి అధికారులకు, విద్యార్థులకు తానే ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) కన్హయ శర్మ హ్యాకింగ్ నైపుణ్యాలను చూసి దేశవ్యాప్తంగా అనేక పెద్ద ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అతనితో చేరడానికి 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ వాటిని కన్హయ తిరస్కరించారు. ప్రస్తుతం ఇతడు వాప్గో అండ్ లీగల్251 వ్యవస్థాపకుడు & CEOగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
నెట్ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు డేటా చోరీకి, ఆన్లైన్లో వినియోగదారులను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అధునాతన టెక్నిక్స్తో హ్యాకర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ స్కామ్ ఒకటి వెలుగులో వచ్చింది. హ్యాకర్లు ఫిషింగ్ ప్రచారం ద్వారా వినియోగదారుల చెల్లింపు వివరాలను చోరీ చేస్తున్నారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) నెట్ఫ్లిక్స్ స్కామ్ 2023 చెక్ పాయింట్ రీసెర్చ్ గుర్తించింది. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్లోని డేటా గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ, వీలైనంత ఎక్కువ మంది వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి హ్యాకర్లు ఫిషింగ్ ప్రయత్నాలను ప్లాన్ చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో, నెట్ఫ్లిక్స్ ఫిషింగ్ ప్రచారంలో ఎటాక్ చేసినట్టుగా గుర్తించింది. మరికొన్ని చెల్లింపు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించాయని తెలిపింది. యూజర్ ఏదైనా ఒక పేమెంట్ చేసినపుడు హ్యాకర్లు చొరబడతారు. తదుపరి బిల్లింగ్ అపుడు నెట్ఫ్లిక్స్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడిందంటూ ఫేక్ ఐడీనుంచి ఇమెయిల్ వస్తుంది. అంతేకాదు సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోండంటూ ఒక లింక్ను కూడా షేర్ చేస్తుంది. ఆ లింక్ను నమ్మి వివరాలు అందించారో వారి పని సులువు అవుతుంది. ఈ లింక్ వారి క్రెడిట్ కార్డ్ సమాచారం కోసం ఉద్దేశించిన మోసపూరిత వెబ్సైట్కి మళ్లించి మోసానికి పాల్పడతారు. బ్రాండ్ ఫిషింగ్ దాడులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది టెక్-అవగాహన లేని వారేనని చెక్ పాయింట్ తెలిపింది. ఈనేపథ్యంలో అయాచిత ఇమెయిల్స్ లేదా సందేశాలను స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ సూచించింది.ముఖ్యంగా అక్షరదోషాలు, తప్పుగా వ్రాసిన వెబ్సైట్లు, సరికాని తేదీలు ,మోసపూరిత ఇమెయిల్ లేదా లింక్ను సూచించే ఇతర కారకాలు వంటి ప్రమాద సంకేతాలను గుర్తించాలని ఇందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని డెంబిన్స్కీ సలహా ఇచ్చారు. డిసెంబర్ 2022లో, ముంబైకి చెందిన 74 ఏళ్ల వ్యక్తి తన నెట్ఫ్లిక్స్ ఖాతాను పునఃప్రారంభించే ప్రయత్నంలో 1,200 డాలర్లను కోల్పోయాడనీ పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి లేదా సబ్స్క్రిప్షన్ను పునరుద్ధరించడానికి వినియోగదారుని అభ్యర్థించే ఇమెయిల్ మూలాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలని హెచ్చరించింది. తాజా పరిణామంపై నెట్ఫ్లిక్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. (Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) ఎలా గుర్తించాలి ఆన్లైన్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఎల్లప్పుడూ పంపినవారి గుర్తింపును ధృవీకచుకోవాలి. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు వెబ్సైట్ URLని తనిఖీ చేయాలి. యాంటీ-ఫిషింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. తాజా భద్రతా ప్యాచ్లతో అప్డేట్ చేయడం ద్వారా ఫిషింగ్ దాడులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సైబర్ నేరగాళ్లకి అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రతమత్తంగా ఉండాలి. -
‘అజ్ఞాత’ శత్రువు.. దడపుట్టిస్తున్న ‘అనానిమస్ సూడాన్’
ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు... ఏ ప్రతిఫలం ఆశించట్లేదు... కేవలం ఉనికి చాటుకోవడానికే దాడులు చేస్తున్నారు! ఏ రోజు, ఎక్కడ, ఎవరిపై దాడి చేసేది ట్విట్టర్ ద్వారా ముందే ప్రకటించి మరీ దెబ్బతీస్తున్నారు!! ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ యుద్ధం చేస్తున్నారు!! గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘అనానిమస్ సూడాన్’వ్యవహారమిది. ఈ దాడులకు గురైన వాటిలో హైదరాబాద్కు చెందిన అనేక సంస్థలు సైతం ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ సంస్థ రెడ్వేర్ సేకరించిన ఆధారాల ప్రకారం సూడాన్కు చెందిన కొందరు హ్యాకర్లు ‘అనానిమస్ సూడాన్’గ్రూప్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాము ఈ–ఎటాక్స్ చేస్తున్నామని ఈ గ్యాంగ్ ప్రచారం చేసుకుంటోంది. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, యావత్ ప్రపంచానికి సైబర్ సవాల్ విసరడానికే తమ ‘ఆపరేషన్స్’అని చెప్పుకుంటోంది. గత నెల నుంచే ఎటాక్స్ మొదలుపెట్టిన ఈ హ్యాకర్లు... తొలుత ఫ్రాన్స్ను టార్గెట్ చేశారు. అక్కడి ఆస్పత్రు లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాల వెబ్సైట్లపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ రంగంలో వారి పేరు మారుమోగిపోయింది. ట్విట్టర్ ద్వారా ప్రకటించి మరీ... అనానిమస్ సూడాన్ గ్యాంగ్ తాము ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నెల 6న తమ ట్విట్టర్ ఖాతా హ్యష్ట్యాగ్ అనానిమస్ సూడాన్లో ‘ఆఫ్టర్ ఫ్రైడే.. ఇండియా విల్ బీ ది నెక్ట్స్ టార్గెట్’(శుక్రవారం తర్వాత భారతదేశమే మా లక్ష్యం) అంటూ ప్రకటించారు. ఆ తర్వాతి రోజే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్సైట్పై సైబర్ దాడి జరిగింది. అప్పటి నుంచి వరుసబెట్టి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్లలోని విమానాశ్రయాలు, ఆస్పత్రుల వెబ్సైట్లపై ఈ–ఎటాక్స్ జరిగాయి. అయితే ఈ–దాడులు పోలీసు, సైబర్క్రైమ్ అధికారుల రికార్డుల్లోకి వెళ్లకపోయినా ఈ బాధిత సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో డిమాండ్స్... కేవలం సవాళ్లే సాధారణంగా సైబర్ ఎటాక్స్ చేసే హ్యాకర్లు అనేక డిమాండ్లు చేస్తారు. వీలైనంత మేర బిట్కాయిన్ల రూపంలో సొమ్ము చేజిక్కించుకోవాలని, డేటా తస్కరించాలని చూస్తుంటారు. సంస్థలు, వ్యవస్థల్ని హడలెత్తిస్తున్న ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ తీరుతెన్నులే దీనికి ఉదాహరణ. అయితే అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ మాత్రం ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. చివరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఎటాక్ చేయడానికి సిద్ధమైన ఈ హ్యాకర్లు... కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం కోసమే వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత కాలంలో హాస్పిటల్స్, వాటి రికార్డులు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అనానిమస్ సూడాన్ హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. డాక్స్ ఎటాక్స్తో సర్వర్లు క్రాష్ ఇతర మాల్వేర్స్, హాకర్ల ఎటాక్స్కు భిన్నంగా అనానిమస్ సూడాన్ ఎటాక్స్ ఉంటున్నాయి. డీ డాక్స్గా పిలిచే డి్రస్టిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో వారు దాడి చేస్తుంటారు. ప్రతి సంస్థకు చెందిన వెబ్సైట్కు దాని సర్వర్ను బట్టి సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి ట్రాఫిక్ను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అంతకు మించిన హిట్స్ వస్తే కుప్పకూలిపోతుంది. పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయా బోర్డులకు చెందిన వెబ్సైట్లు మొరాయించడానికి ఇదే కారణం. అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ దీన్నే ఆధారంగా చేసుకున్నారు. టార్గెట్ చేసిన వెబ్సైట్లకు ప్రత్యేక ప్రొగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్, క్వెర్రీస్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ ట్రాఫిక్ను తట్టుకోలేని సర్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. ఈ కారణంగా నిజమైన వినియోగదారులు ఆ వెబ్సైట్ను సాంకేతిక నిపుణులు మళ్లీ సరిచేసే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’తోనూ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ‘అనానిమస్ సూడాన్’ఎటాక్స్ ఓవైపు కలకలం సృష్టిస్తుంటే మరోవైపు ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా అనే హాకర్ల గ్రూప్ సైతం దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తాజాగా ప్రకటించింది. ఐ4సీ పరిధిలోని సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ వింగ్ హాకర్ల కుట్రను బయటపెట్టింది. డినైయెల్ ఆఫ్ సర్వీస్ (డీఓఎస్), డిస్ట్రిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ (డీ–డాక్స్) విధానాల్లో ఈ హ్యాకర్లు ఆయా వెబ్సైట్స్ సర్వర్లు కుప్పకూలేలా చేయనున్నారని అప్రమత్తం చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లు వారి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాది ఢిల్లీ ఎయిమ్స్ జరిగిన సైబర్ దాడి ఈ తరహాకు చెందినదే అని, దేశంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్గా ఈ గ్రూప్ మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు సైబర్ దాడులు, హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వెబ్సైట్లను సైబర్ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలో కీలక సూచనలు చేసింది. ఉమ్మడిగా పని చేస్తే కట్టడి అనానిమస్ సూడాన్ ఎటాక్స్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వల్ల నష్టం తగ్గించడానికి పోలీసులతోపాటు సైబర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. హ్యాకర్ల టార్గెట్లో ఉన్న సంస్థలను అప్రమత్తం చేయడం, అవసరమైన స్థాయిలో ఫైర్ వాల్స్ అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థకూ పూర్తిస్థాయిలో సైబర్ భద్రత ఉండదు. అయితే కొత్త సవాళ్లకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి. – రాజేంద్రకుమార్, సైబర్ నిపుణుడు -
HYD: అతిపెద్ద సైబర్ స్కాం గుట్టురట్టు.. ఇన్సూరెన్స్, క్రెడిట్కార్డు, లోన్ డేటా..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్కామ్ను బయటపెట్టారు. దేశంలో కోట్లాది మంది పర్సనల్ డేటాను అమ్మకానికి పెట్టిన సైబర్ దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా 16 కోట్ల మంది దేశపౌరుల డేటా అమ్మకానికి గురైనట్టు వివరించారు. వివరాల ప్రకారం.. డేటాను చోరీ చేస్తూ అమ్ముతున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. డేటా దొంగతనంపై హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా, వీరిని ఢిల్లీ, నాగపూర్, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయ్యింది. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. ఈ ముఠా సభ్యులు ఇన్సూరెన్స్, క్రెడిట్కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇది కూడా చదవండి: గుట్టుగా అబార్షన్ల దందా! రూ.30వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్ష -
కాల్ చేసి స్కాన్ చేయాలని తొందరపెడుతున్నారా? ఖాతా ఖాళీ కావడం ఖాయం!
►కొండాపూర్కు చెందిన స్వామినాథన్ తన 3 బీహెచ్కే ఇంటిని నెలకు రూ.20 వేలకు అద్దెకు ఇస్తానంటూ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో యాడ్ ఇచ్చారు. రెండురోజుల తర్వాత ఒక వ్యక్తి తాను సీఐఎస్ఎఫ్ అధికారి రాజ్దీప్సింగ్ అని, తనకు పుణే నుంచి హైదరాబాద్కు బదిలీ అయ్యిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటి అద్దె అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పి తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మిగతా డబ్బు పంపిస్తానంటూ స్వామినాథన్ను గందరగోళానికి గురిచేసి, తాను పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయాలంటూ తొందరపెట్టాడు. స్వామినాథన్ అలానే చేయడంతో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.5 లక్షలు అవతలి వ్యక్తికి బదిలీ అయిపోయాయి. ►బల్క్ ఆర్డర్ల పేరిట ఒకేసారి 20 ఫ్రిజ్లు కావాలని ఓ షోరూం నిర్వాహకులకు ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేశాడు. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తానంటూ వాళ్లు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు పంపించానని, ఆ నగదు మధ్యలో ఆగిపోయిందని చెబుతూ తాను పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయాలంటూ కంగారు పెట్టాడు. అతడు చెప్పినట్టు చేసిన షోరూం నిర్వాహకులు రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. సాక్షి, హైదరాబాద్: నగదు లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. కొందరు అసలు నగదు అనే మాటే లేకుండా లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ పరిజ్ఞానం అంతగా లేని అమాయకుల్ని మాటలతో మభ్యపెట్టి, గందరగోళానికి గురిచేసి, కంగారు పెట్టేస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. రెగ్యులర్గా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే వారు కూడా కొన్నిసార్లు వీరి బారిన పడుతూ వేలు, లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కేటుగాళ్లు కూర్చున్న చోటు నుంచి కదలకుండానే తమ జేబులు నింపుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు.. తాజాగా క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ స్కానింగ్తో చేసే చెల్లింపులు ఆధారంగా చేసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సరికొత్త మోసం.. క్యూరిషింగ్ ఇటీవలి కాలంలో క్యూఆర్ కోడ్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జేబులో నగదు ఉండాల్సిన పనిలేదు. బ్యాంకులో డబ్బు, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. పెద్ద షోరూంలు మొదలుకుని చిన్న కిరాణా షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. నగదు చెల్లింపులకే కాదు.. పెద్ద కంపెనీలు తమ వెబ్సైట్లు, బిజినెస్ కార్డులు, బ్రోచర్లు, ఇలా ప్రతి సమాచారమూ స్కాన్ చేస్తే చాలు వచ్చేలా క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఇస్తున్నాయి. దీంతో సైబర్ దోపిడీగాళ్లు క్యూఆర్ కోడ్పై దృష్టి పెట్టారు. దీన్ని వినియోగిస్తూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును, అది కుదరకపోతే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తున్నారు. ఈ సరికొత్త సైబర్ మోసాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు క్యూరిషింగ్గా చెబుతున్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలి క్యూఆర్ కోడ్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూఆర్ కోడ్లను సృష్టిస్తున్నారు. వీటిని ఉపయోగించి మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్లోకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి. లేదంటే క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేయగానే మనల్ని అవి అన్సేఫ్ (సైబర్ నేరగాళ్ల అధీనంలో ఉండే) వెబ్సైట్లలోకి తీసుకెళ్లేలా యూఆర్ఎల్ లింకులు జత చేసి ఉంటున్నాయి’అని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ మోసాలకు ఇక్కడే ఎక్కువ.. ►గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఫ్రీ రీచార్జ్ వంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లలో జరిగే లావాదేవీలను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ►వెబ్సైట్లో వస్తువుల అమ్మకాల విషయంలో ఎక్కువగా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ►కోవిడ్ వెరిఫికేషన్ పేరిట కూడా సైబర్ నేరగాళ్లు ఫేక్ క్యూఆర్ కోడ్లను పోస్ట్ చేస్తున్నారు. ► బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాల్లో, ఇతర కంపెనీలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లపైనా నకిలీ క్యూఆర్ కోడ్ లింక్లు పెడుతున్నారు. ఇలా చేస్తే మేలు.. ►అపరిచితులు పంపే ఈ మెయిల్స్, వాట్సాప్, ఇతర డాక్యుమెంట్లలోని క్యూఆర్ కోడ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దు. ►క్యూఆర్ కోడ్ కింద రాసి ఉన్న యూఆర్ఎల్ లింక్, మనం స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా? అన్నది సరిచూసుకోవాలి. ►యూపీఐ ఐడీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు అపరిచితులతో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. ►ఓఎల్ఎక్స్ లేదా ఇతర వెబ్సైట్లలో వస్తువుల క్రయ, విక్రయాలు చేసేటప్పుడు వీలైనంత వరకు ఆన్లైన్ చెల్లింపుల కంటే నగదు లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్లైన్ చెల్లింపుల్లో తొందరపడొద్దు ఆన్లైన్ వెబ్సైట్లలో కొనుగోళ్లు చేసేటప్పుడు తొందరపడొద్దు. అవతలి వ్యక్తులు మనల్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, పిన్ ఎంటర్ చేయాలని గందరగోళ పెడుతున్నట్లయితే అది మోసమని గ్రహించాలి. మనకు పంపే క్యూఆర్ కోడ్ను గమనించినా..మన బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు కోతకు గురవుతాయని గుర్తించవచ్చు. – బి.రవికుమార్రెడ్డి, డీఎస్పీ, సీఐడీ సైబర్ క్రైమ్స్ -
రెచ్చిపోతున్న హ్యాకర్స్.. ‘ఐసీఎంఆర్’పై 6వేల సార్లు సైబర్ దాడి!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్పై సైబర్ దాడి జరిగి సర్వర్లు డౌన్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు హ్యాకర్స్. ఐసీఎంఆర్ వెబ్సైట్పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో ట్రేస్ చేయగా.. బ్లాక్లిస్ట్లో ఉన్న హాంకాంగ్కు చెందిన ఐపీగా తేలిందన్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్ ఫైర్వాల్, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్ వెబ్సైట్ హ్యాకింగ్కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు. మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్ ముందు ఉన్న సఫ్దార్గంజ్ ఆసుపత్రిపై డిసెంబర్ 4న సైబర్ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్ శెర్వాల్ తెలిపారు. ఎన్ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం! -
‘ఎయిమ్స్’ తరహాలో మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా!
చెన్నై: దేశ రాజధానిలోని ఢిల్లీ ఎయిమ్స్పై సైబర్ దాడితో గత 10 రోజులుగా సర్వర్లు పనిచేయడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ విషయం తేలకముందే మరో ఆసుపత్రిపై పంజా విసిరారు హ్యాకర్లు. సుమారు 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత వివరాలను ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్ సర్వర్లను హ్యాక్ చేసి రోగుల డేటాను పాపులర్ సైబర్ క్రైమ్ ఫోరమ్స్, టెలిగ్రామ్ ఛానళ్లలో అమ్మకానికి పెట్టినట్లు సైబర్ ముప్పుపై విశ్లేషించే సంస్థ ‘క్లౌడ్సెక్’ వెల్లడించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. క్లౌడ్సెక్ వివరాల ప్రకారం.. ‘థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్’ అనే థర్డ్ పార్టీ వెండర్ ద్వారా 2007 నుంచి 2011 మధ్య నమోదైన రోగుల వివరాలను దొంగిలించినట్లు తేలింది. అయితే, శ్రీ శరణ్ మెడికల్ సెంటర్కు థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ విధులు నిర్వర్తించటంపై సమాచారం లేదని పేర్కొంది. కొనుగోలుదారులు నమ్మేందుకు నమూనా జాబితాను ఆన్లైన్ ఉంచారు. లీక్ అయిన డేటాలో రోగుల పేర్లు, జన్మదినం, అడ్రస్, సంరక్షకుల పేర్లు, డాక్టర్ల వివరాలు ఉన్నాయి. డాక్టర్ల వివరాలతో ఏ ఆసుపత్రి డేటా హ్యాకింక్గు గురైందనే విషయాన్ని క్లౌడ్సెక్ గుర్తించింది. ఆన్లైన్ అమ్మకానికి ఉంచిన డేటాలోని డాక్లర్లు తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్లో పని చేశారని తెలిపింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు సమాచారం. ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన మరుసటి రోజునే తమిళనాడు శ్రీ శరణ్ ఆసుపత్రి డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: 8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు -
నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే!
ఓ టెక్కీ బ్యాంక్ నుంచి మెయిల్లో వచ్చిందని అనుకుని తన మొబైల్కు వచ్చిన క్యూ ఆర్కోడ్ ను స్కాన్ చేశాడు. వెంటనే అతని ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్ పిన్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు కూడా ఖాళీ అయింది, వ్యక్తిగత ఫోటోలను చూపి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. ఇటీవల టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. కాలానుగుణంగా కొత్త రకం దోపిడికి వ్యూహాలు రచ్చిస్తున్నారు. మన బ్యాంక్ నుంచి మనకి తెలియకుండానే నగదు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటిపై కాస్త అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్తో జాగ్రత్త.. క్యూఆర్ కోడ్ను స్కాన్ పేరుతో కేటుగాళ్లు కొత్త రకం దోపిడికి స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరు ఇబ్బందుల్లో పడక తప్పదు. బ్యాంక్ నుంచి నగదు తీసుకోవడానికి ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మోసపోగా మరో రెస్టారెంట్లో పెట్టిన క్యూ ఆర్కోడ్ను మార్చివేసి తమ అకౌంట్ కు నగదు జమఅయ్యేలా చేసి వంచనకు పాల్పడిన ఘటనలు ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోసగాళ్లు పలు కేంద్రాల్లో( రెస్టారెంట్లు, షాపుల్లో, కస్టమర్లు రద్దీ ఉండే ప్రాంతాలు) యజమానులకు తెలియకుండా అక్కడి క్యూ ఆర్కోడ్ను మార్చి తమ క్యూఆర్ సంకేతాన్ని ఉంచుతున్నారు. ఇది తెలియక కస్టమర్లు తమ బిల్లులు చెల్లించడానికి క్యూ ఆర్ కోడ్ని స్కాన్ చేసి అందులోకి డబ్బులను పంపుతున్నారు. అయితే చివరికి ఈ పైసలన్నీ మోసగాళ్ల ఖాతాల్లోకి జమఅవుతున్నాయి. మరో వైపు రెస్టారెంట్లో రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో దీనిపై విచారించిన యజమానులకు అసలు నిజం తెలియంతో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
8 యాప్లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే!
ప్రస్తుత 4జీ కాలంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్ఫోన్ ఉంటోంది. టెక్నాలజీ పుణ్యమా అని మనకు కావాల్సినవన్నీ మొబైల్లోనే ప్రత్యక్షమవుతన్నాయి. అయితే దీంతో పాటే కొన్ని సార్లు వైరస్, హాకర్ల రూపంలో ప్రమాదాలు వస్తుంటాయి. అందుకు మనం కాస్త జాగ్రత్త వహిస్తే వాటి నుంచి బయటపడచ్చు. ప్రస్తుతం మాగ్జిమమ్ ఇంగ్రావ్ అనే ఫ్రెంచ్ రీసెర్చర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులను హెచ్చరించారు. ప్రమాదకరమైన కొన్ని యాప్లను ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయని అవి మీ మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదన్నారు. అయితే ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్ వాటికి కనుగొని అందులో నుంచి తీసేసింది. అయినా కొందరు తెలియక వాటిని వేరొక సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగిస్తూనే ఉన్నారు. కాగా ఈ యాప్లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డిలీట్ చేసినప్పటికీ వీటి ఏపీకే (APK) వర్షన్స్ ఇంకా గూగుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని కొందరు దుండగులు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఫేక్ ప్రోఫైల్స్ క్రియేట్ చేశారు. వాటి ద్వారా యాడ్స్ క్రియేట్ చేసి ప్రొమోట్ చేస్తున్నారు. ఆ యాడ్లను క్లిక్ చేసిన యూజర్ల డేటాను హ్యాకర్లు చేజిక్కించుకుంటున్నారు. దీంతో వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. కనుకు వెంటనే మీ మొబైల్లో ఈ యాప్లు ఉంటే డిలీట్ చేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర 8 యాప్లు ఇవే.. 1. వోల్గా స్టార్ వీడియో ఎడిటర్, 2. క్రియేటివ్ త్రిడీ లాంచర్, 3. ఫన్నీ కెమెరా, 4. వావ్ బ్యూటీ కెమెరా, 5. జీఐజీ ఈమోజీ కీబోర్డ్, 6. రేజర్ కీబోర్డ్ ఎండ్ థీమ్, 7. ఫ్రీగ్లో కెమెరా, 8. కోకో కెమెరా. చదవండి: Suv Cars: రెండేళ్లైన వెయిట్ చేస్తాం.. ఎస్యూవీ కార్లకు క్రేజ్.. ఎందుకో తెలుసా! -
నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి డబ్బు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు ర్యాట్, కీలాగర్స్ వంటి మాల్వేర్స్ వాడారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. వీటి ద్వారానే హ్యాకర్లు బ్యాంక్ నెట్వర్క్లోకి ప్రవేశించి రూ.12.48 కోట్లు కొట్టేశారన్నారు. బుధవారం నైజీరియన్ ఇక్పా స్టీఫెన్ ఓర్జీని అరెస్టు చేశామని, దీంతో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 23కు చేరిందని చెప్పారు. బ్యాంక్ను కొల్లగొట్టిన హ్యాకర్లు నైజీరియా లేదా లండన్లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. గత నవంబర్ నుంచి సన్నాహాలు ప్రారంభించిన వీళ్లు మూడు మెయిల్ ఐడీల నుంచి బ్యాంక్ అధికారిక ఈ–మెయిల్ ఐడీకి ఆ నెల 4,10,16 తేదీల్లో 200 ఫిషింగ్ మెయిల్స్ పంపారు. ఆర్టీజీఎస్ అప్గ్రేడ్ తదితరాలకు సంబంధించిన మెయిల్స్గా ఉద్యోగులు భ్రమించేలా వీటిని రూపొందించారు. నవంబర్ 6న ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు వీటిని క్లిక్ చేశారు. ఫలితంగా దీనికి అటాచ్ చేసిన ఉన్న రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్) ఆ రెండు కంప్యూటర్లలోకి చొరబడింది. దీని ద్వారా బ్యాంక్ నెట్వర్క్లోకి ప్రవేశించి వాటిలోకి కీలాగర్స్ మాల్వేర్ను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు కంప్యూటర్లను వాడిన ఉద్యోగులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్తోపాటు అన్ని కార్యకలాపాలు హ్యాకర్కు చేరిపోయాయి. అత్యంత బలహీనంగా సైబర్ సెక్యూరిటీ రూ.వందలు, వేల కోట్ల ప్రజాధనంతో లావాదేవీలు జరిగే బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఈ విషయంలో మహేష్ బ్యాంక్ కక్కుర్తి, నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన ఫైర్ వాల్స్ను ఏర్పాటు చేసుకోలేదు. దీనివల్లనే హ్యాకర్లు బ్యాంకు నెట్వర్క్ను తమ అ«ధీనంలో పెట్టుకుని ఎంపికచేసిన నాలుగు ఖాతాల నుంచి రూ.12.48 కోట్లను వివిధ ఖాతాల్లోకి మళ్లించారు. దీనికి సహకరించిన వారికి 5–10 శాతం కమీషన్లు ఇచ్చారు. విదేశాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్న çప్రధాన హ్యాకర్లను కనిపెట్టడానికి ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. నాణ్యతలేని సాఫ్ట్వేర్ అందించిన ఇంట్రాసాఫ్ట్ సంస్థతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంక్ నిర్వాహకులను ఈ కేసులో సహ నిందితులుగా చేర్చామన్నారు. -
స్మార్ట్ఫోన్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్ను వెంటనే డిలీట్ చేయండి..! లేకపోతే అంతే సంగతులు..!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో...అంతే వేగంతో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. కొత్త మంది హ్యకర్లు ఏకంగా గూగుల్ప్లే స్టోర్లోకి నకిలీ యాప్స్ను చొప్పించి..సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్ను స్మార్ట్ఫోన్లలోకి ఎక్కిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా కార్టూనిఫైయర్ యాప్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్ల ఫేస్బుక్ డేటాను దొంగిలిస్తోన్నట్లు తెలుస్తోంది. లక్ష మందిపై ప్రభావం..! కార్టూనిఫైయర్ యాప్లో FaceStealer అనే మాల్వేర్ను గుర్తించారు. కార్టూనిఫైయర్ యాప్(cartoonifier app)తో హ్యకర్లు ఆయా యూజర్ల ఫేస్బుక్ ఖాతాల పాస్వర్డ్స్ను సొంతం చేసుకుంటున్నట్లు ప్రడియో(Pradeo) వెల్లడించింది. ఇప్పటికే ఈ యాప్ను సుమారు లక్షకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్స్టాల్ చేసినట్లు ప్రడియో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ యాప్పై గూగుల్ ప్రతినిధులు స్పందించారు. 'క్రాఫ్ట్సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్' పేరుతో ఉన్న యాప్ ఇకపై డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదని, ప్లే స్టోర్ నుంచి తొలగించమని గూగుల్ ప్రతినిధి ప్రముఖ టెక్ బ్లాగింగ్ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్కు తెలియజేశారు. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్లో సదరు యాప్స్ను చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం మంచిందంటూ సూచించారు. ఒక యాప్ను డౌన్లోడ్ చేసే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోండి. యాప్ను ఇన్స్టాల్ చేసే ముందు సంబంధింత యాప్ డెవలపర్ ఎవరో, తనీఖీ చేసి ధృవీకరించాలి. యాప్పై గల రివ్యూలను, రేటింగ్లను చూడడం మంచింది. మాల్వేర్ కల్గిన యాప్స్ను యూజర్లు రివ్యూలో రిపోర్ట్ చేస్తూ ఉంటారు. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మైక్రోఫోన్, కాంటాక్ట్స్, ఇతర డేటాను యాక్సెస్ చేసే వాటిని అసలు ఇన్స్టాల్ చేయకండి. ఎల్లప్పుడు Google Play Store లేదా Apple App store నుంచి మాత్రమే యాప్స్ను ఇన్స్టాల్ చేయాలి. చదవండి: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన రియల్మీ..! ధర ఎంతంటే..? -
శాంసంగ్కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లు.!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్కు హ్యాకర్లు గట్టిషాక్ను ఇచ్చారు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్స్కు చెందిన సోర్స్ కోడ్ను, కంపెనీ అంతర్గత విషయాలను హ్యకర్లు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. సోర్స్ కోడ్ను హ్యకర్లు దొంగిలించినట్లుగా శాంసంగ్ సోమవారం(మార్చి 8)న ధృవీకరించింది. అత్యంత సున్నితమైన సమాచారం..! ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్(Bleeping Computer) ప్రకారం..గెలాక్సీ స్మార్ట్ఫోన్స్కు సంబంధించిన సోర్స్ కోడ్ను 'Lapsus$' అనే హ్యకర్ల బృందం దొంగిలించినట్లు తెలుస్తోంది. సుమారు 190GB సీక్రెట్ డేటాను హ్యకర్లు సేకరించారు. సోర్స్ కోడ్తో పాటుగా, కంపెనీకి సంబంధించిన అంతర్గత డేటాను హ్యకర్లు బహిర్గతం చేశారు. ఇక ఈ సోర్స్ కోడ్లో సున్నితమైన కార్యకలాపాల కోసం ఉపయోగించే విశ్వసనీయ ఆప్లెట్ (TA) సోర్స్ కోడ్ , బూట్లోడర్ సోర్స్ కోడ్, శాంసంగ్ అకౌంట్కు చెందిన ప్రామాణీకరణ కోడ్ వంటివి ఉన్నాయి. కాగా ఈ హ్యకర్ల బృందం గత నెల ఫిబ్రవరిలో NVIDIA నుంచి కూడా డేటాను దొంగిలించింది. ఎలాంటి భయం లేదు..! ఈ సైబర్ దాడిపై శాంసంగ్ వివరణను ఇచ్చింది. ఈ సోర్స్ కోడ్లో గెలాక్సీ స్మార్ట్ఫోన్స్ ఆపరేషన్కు సంబంధించిన కొంత సోర్స్ కోడ్ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఆయా శాంసంగ్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. దీనిలో గెలాక్సీ యూజర్లకు, కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లేదని శాంసంగ్ వెల్లడించింది. ఇది కంపెనీ వ్యాపారం లేదా కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ అభిప్రాయపడింది. ఇటువంటి సంఘటనలను నిరోధించడానికి మరిన్ని పటిష్టమైన చర్యలను అమలు చేస్తామని శాంసంగ్ తెలిపింది. కాగా హ్యాక్ చేసిన డేటాను అత్యంత సున్నితమైనది పరిగణించబడుతుందని శాంసంగ్ పేర్కొంది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
Cryptocurrency: బాబ్బాబు.. కొట్టేసిందంతా వెనక్కి ఇచ్చేయండ్రా!
ఊహించని రీతిలో లాభాలను కురిపిస్తున్నాయనే ఆనందమే కాదు.. క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా హ్యాకర్ల ముప్పు పొంచి ఉండడంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు, ఆర్థిక విభాగాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల్లో ఇది కూడా ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ ‘క్యూబిట్ ఫైనాన్స్’ నుంచి సుమారు 80 మిలియన్ డాలర్ల (600 కోట్ల రూపాయలకు పైనే) క్రిప్టోకరెన్సీ చోరీకి గురైంది. పక్కాగా ప్లాన్ చేసిన హ్యాకర్లు ఈ ఏడాది ఆరంభంలోనే ఈ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇది గ్రహించిన క్యూబిట్ ఫైనాన్స్.. హ్యాకర్లతో బేరానికి దిగింది. మొదట కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చిన క్యూబిట్.. అటుపై కొంచెం తగ్గి ట్వీట్లు చేసింది. The protocol was exploited by; 0xd01ae1a708614948b2b5e0b7ab5be6afa01325c7 The hacker minted unlimited xETH to borrow on BSC. The team is currently working with security and network partners on next steps. We will share further updates when available. — Qubit Finance (@QubitFin) January 28, 2022 కొట్టేసిందంతా తిరిగి ఇచ్చేయాలని, బదులుగా.. మంచి నజరానా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఎలాంటి న్యాయపరమైన చర్యలకు వెళ్లమని మాటిస్తోంది కూడా. ఇక క్రిప్టోకరెన్సీలో అరుదైన సర్వీస్ను క్యూబిట్ అందిస్తోంది. దీని ప్రకారం.. బ్రిడ్జ్ అనే సర్వీస్లో వివిధ రకాల బ్లాక్చెయిన్స్ ఉంటాయి. డిపాజిట్ చేసిన క్రిప్టోకరెన్సీని వేరొకదాంట్లోనూ విత్డ్రా చేసుకోవచ్చు. An appeal to the exploiter: It's not too late to return to funds. We will pay the maximum bounty reward as mentioned as well as not seek any legal charges if you return the funds and do right by the community. — Qubit Finance (@QubitFin) January 28, 2022 అయితే 2020లో బినాన్స్ స్మార్ట్చెయిన్ను లాంఛ్ చేసినప్పటి నుంచి డెఫీ(అప్కమింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ) ప్రాజెక్టులకు హ్యాకింగ్ తలనొప్పులు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది ఏప్రిల్లో యురేనియం ఫైనాన్స్ నుంచి 50 మిలియన్ డాలర్లు, మే నెలలో వీనస్ ఫైనాన్స్ నుంచి 88 మిలియన్ డాలర్లు హ్యాకర్ల బారినపడింది. చదవండి: క్రిప్టో దెబ్బకి మిలియనీర్ల నుంచి బికారీలుగా మారిన వేలమంది! -
ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..
సాంకేతికతలోనూ గోప్యత పాటించే ఉత్తర కొరియాలో హ్యాకర్లు చెలరేగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలను లెక్కలేయకుండా!. చాలా కాలంగా సొంత దేశం, వినోదరంగంపై మాత్రమే ఫోకస్ హ్యాకర్లు.. ఈ మధ్యకాలంలో ప్రపంచం మీద పడ్డారు. 2021 ఒక్క ఏడాదిలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 30 కోట్ల రూపాయల్ని) విలువైన డిజిటల్ ఆస్తుల్ని కాజేశారు. వివిధ క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్స్పై ఏడు దాడుల ద్వారా ఈ మొత్తం కాజేసినట్లు బ్లాక్చెయిన్ అనాలసిస్ కంపెనీ ‘చెయినాలైసిస్’ ప్రకటించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలను లక్క్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమ దేశంలో హ్యాకర్లు లేరని, అలాంటి వాళ్లు దొరికితే మరణశిక్ష నుంచి తప్పించుకోలేరంటూ స్వయంగా అధ్యక్షుడు కిమ్ పలు సందర్భాల్లో బయటి దేశాలు(ప్రత్యేకించి అమెరికా) చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ వస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘లజారస్ గ్రూప్’.. నార్త్ కొరియా ఇంటెలిజెన్సీ బ్యూరో వెన్నుదన్నుతోనే నడుస్తోందని అనుమానాలు ఉన్నాయి. తద్వారా వెనకాల నుంచి ప్రొత్సహిస్తూ.. కిమ్ ప్రభుత్వం ఈ తతంగం నడిపిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ గ్రూప్ మీద కఠిన ఆంక్షలు విధించింది. ఇక ఉ.కొరియాలో 2020-2021 మధ్య.. నాలుగు నుంచి ఏడు శాతానికి సైబర్ నేరాలు పెరగ్గా.. దొచుకున్న సొత్తు విలువ సైతం 40 రెట్లు అధికంగా ఉందని చెయినాలైసిస్ చెబుతోంది. కిందటి ఏడాది ఫిబ్రవరి నెలలో 1.3 బిలియన్ డాలర్ల డబ్బు, క్రిప్టోకరెన్సీని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు నార్త్ కొరియన్ కంప్యూటర్ ప్రోగ్రామర్లపై నేరారోపణ అభియోగాల్ని నమోదు చేసింది. చిన్న చిన్న కంపెనీల దగ్గరి నుంచి హాలీవుడ్ ప్రముఖ స్టూడియోలు లక్క్ష్యంగా ఈ సైబర్ దాడి జరిగినట్లు అమెరికా న్యాయ విభాగం సైతం నిర్ధారించుకుంది. చదవండి: భారత్లో మెటావర్స్ ద్వారా వెడ్డింగ్ రిసెప్షన్! -
సరికొత్త ఆన్లైన్ మోసం.. ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే ఇక అంతే సంగతులు!
ఆన్లైన్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, మీడియా ఎంత చెబుతున్నా కొందరు అస్సలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దేశంలో చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. ఫోన్లో బ్యాంకు వివరాలు అడిగే వారికి ఎలాంటి సమాచారం ఇవ్వరాదని ముఖ్యంగా ఎటిఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అసలే తెలుపవద్దని వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎంత ప్రచారం చేస్తున్న అమాయకులు సైబర్ నేరగాళ్ల బారినపడి ఆన్లైన్ మోసాలకు గురవుతునే ఉన్నారు. తాజాగా మరోసారి హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతున్న కొత్త ఆన్లైన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు ప్రజలను మోసగించడానికి, వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు. ఈ కొత్త డిజిటల్ మోసాన్ని మొదట జర్నలిస్ట్ విశాల్ కుమార్ నివేదించారు. తన స్వంత అనుభవాలను పంచుకున్న కుమార్ హ్యాకర్లు తనను ఏ విధంగా మోసం చేయలని చూశారో పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ స్కామ్ ప్రకారం.. మొదట హ్యాకర్లు మీ సిమ్ కార్డ్ డాక్యుమెంటేషన్ అసంపూర్ణంగా ఉందని, వెంటనే వివరాలను పంచుకోవాలని లేకపోతే 24 గంటల్లోగా సేవలు డీయాక్టివేట్ చేయనున్నట్లు ఒక సందేశాన్ని ప్రజలకు పంపుతారు. వాస్తవానికి, అది హ్యాకర్లు పంపిన నకిలీ సందేశం మాత్రమే. ఈ నకిలీ యాప్స్ డౌన్లోడ్ చేయలని ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో మీ వివరాలను సేకరిస్తాయి. అందులో ఇచ్చిన ఒక నెంబర్ కి చేయాలి మెసేజ్ సూచిస్తుంది. కుమార్ ఆ కస్టమర్ కేర్ నెంబరుకు డయల్ చేశాడు. అప్పుడు ఆ నకిలీ కస్టమర్ Any Remote DeskTop అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని హ్యాకర్ సూచించినట్లు చెప్పాడు. అయితే, ఈ యాప్ ద్వారా అవతలి వ్యక్తి మీ స్క్రీన్ నమోదు చేసే వివరాలు మొత్తం చూసే అవకాశం ఉంది. మీరు గనుక డబ్బులు చెల్లించడానికి ఆ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగిస్తే ఆ వివరాలు హ్యాకర్స్ చేతికి చిక్కే అవకాశం ఉంది. అందుకని, కస్టమర్, ఈ-కెవైసీ పేరుతో ఎవరైనా కాల్ చేసిన, మెసేజ్ పంపిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్..!) -
డబ్బులు పోయాయని కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేస్తే.. రూ.12 లక్షలు మాయం!
ముంబై: మీరు గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి కాల్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. లేకపోతే, నెరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకుల్ని టార్గెట్ చేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతిలో మోసాలకు చేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎంత జాగ్రత్తగా ఉండాలని సూచించిన సైబర్ నేరాల రేటు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు తాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి గూగుల్లో కనిపించిన కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేస్తే ఒక సీనియర్ సిటిజన్ 11 లక్షలకు పైగా మోసపోయినట్లు ముంబై పోలీసులు నిన్న(జనవరి 15) తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలో అంధేరి ప్రాంతానికి చెందిన ఒక మహిళ గత ఏడాది జూలైలో ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసింది. పిజ్జా ఆర్డర్ కోసం ఫోన్లో నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు ఆమె రూ.9,999 కోల్పోయింది. అదేవిధంగా అక్టోబర్ 29న ఆన్లైన్లో డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తుండగా మళ్లీ రూ.1,496 నష్టపోయినట్లు ఆమె తెలిపారు. ఈ రెండు సందర్భాల్లో డబ్బులు పోవడంతో వాటిని తిరిగి పొందడం కోసం ఆ మహిళ గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి ఒక నెంబర్కు కాల్ చేసింది. ఆమెకు కాల్ చేసిన వ్యక్తి నిజమైన కంపెనీ కస్టమర్ కేర్ వ్యక్తిగా నటించాడు. ఆ నకిలీ వ్యక్తి డబ్బులు తిరిగి పొందటం కోసం మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆమె తను చెప్పిన విధంగానే చేసింది. కానీ, అది ఒక నకిలీ యాప్. ఆ యాప్లో నమోదు చేసిన ఖాతానెంబర్, పాస్వవర్డ్, ఓటీపీ వివరాలు అన్నీ మోసాగాళ్ల చేతకి చిక్కాయి. దీంతో రెచ్చిపోయిన మోసాగాళ్లు గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య కాలంలో ఆ మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.78 లక్షలు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మోసం అంత సైబర్ పోలీస్ స్టేషన్ సంప్రదించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 420 ఇతర నిబంధనల కింద ఆ మోసాగాళ్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ఎలన్ మస్క్కి టాలీవుడ్ ప్రముఖుల రిక్వెస్ట్!) -
స్మార్ట్ఫోన్ యూజర్లకు అలర్ట్...! ఈ లింకుల పట్ల జాగ్రత్త..! లేకపోతే..
స్మార్ట్ఫోన్ యూజర్లకు అలర్ట్..! గూగుల్ డాక్యుమెంట్స్,గూగుల్ స్లైడ్స్ ద్వారా హానికరమైన లింక్లతో వ్యక్తిగత డేటాను సేకరించి, బ్లాక్మెయిల్కు గురిచేస్తూన్నట్లు అమెరికన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఎక్కువగా వారే..! స్మార్ట్ఫోన్ యూజర్లకు హ్యాకర్లు హానికరమైన లింక్లను పంపుతున్నట్లుగా..అందులో ఎక్కువ ఔట్లుక్ యూజర్లు ఉన్నట్లుగా యూఎస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ అవనన్ తెలిపింది. సెక్యూరిటీ టూల్స్ను కూడా తప్పించుకుని గూగుల్ డాక్యుమెంట్స్, సైడ్స్ ద్వారా యూజర్లకు హానికరమైన లింక్లను పంపుతున్నట్లు అవనన్ పరిశోధకులు గుర్తించారు. ఈ దాడులపై గత ఏడాది జూన్లోనే అవనన్ నివేదించింది. ఆయా లింక్స్తో ఫిషింగ్ వెబ్సైట్ల సహాయంతో వ్యక్తిగత వివరాలను, బ్యాంకు అకౌంట్ వివరాలను హ్యకర్లు సంపాదిస్తున్నారని అవనన్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్ 2021 నుంచి ఔట్లుక్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరస్తులు ఎక్కువగా దాడిచేస్తున్నట్లు అవనన్ రీసెర్చర్ జెరెమీ ఫుచ్స్ చెప్పారు. ఈ రకమైన దాడులపై అవనన్ జనవరి 3 న గూగుల్కు కూడా నివేదించింది. ఈ నివేదికపై గూగుల్ ఇంకా స్పందించలేదు. అంతేకాకుండా ఈ సమస్యకు గూగుల్ ఇంకా పరిష్కరం చూపలేదని తెలుస్తోంది. ఇలా చేస్తే బెటర్..! ఆయా యూజర్లకు వచ్చే గూగుల్ డాక్స్, సైడ్స్ లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని అవనన్ పేర్కొంది. హ్యకర్లు పంపే ఈమెయిల్ చిరునామాలను క్రాస్ చెక్ చేయాలని తెలిపింది. గూగుల్ డాక్స్లో పంపే లింక్లను అసలు ఒపెన్ చేయకూడదని హెచ్చరించింది. చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! వెంటనే ఇలా చేస్తే మేలు..! -
ల్యాప్టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..
మీరు మీ సొంత/కంపెనీ ల్యాప్టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో ముఖ్యమైన పాస్వర్డ్లను సేవ్ చేస్తున్నారా? అయితే, ఇక మీ పని అయిపోయినట్టే. హ్యాకర్లు మీ ల్యాప్టాప్, పీసీలోని పాస్వర్డ్లను రెడ్ లైన్ మాల్ వేర్ సహాయంతో హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి నుంచి పనిచేసే వారి శాతం రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారు తమ కార్యాలయ పనులతో పాటు ముఖ్యమైన పనులకు సంబంధించిన పాస్వర్డ్లను ల్యాప్టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సేవ్ చేసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల భారీ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆహ్న్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యకాలంలో ఒక కంపెనీకి చెందిన ఉద్యోగి ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో ఇతర ఉద్యోగులు వాడే ల్యాప్టాప్లో పనిచేసేవారు. అయితే, ఆ ల్యాప్టాప్లో సమాచారాన్ని దొంగిలించే రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఉందనె విషయం అతనికి తెలియదు. ఈ విషయం తెలియక ఆ ఉద్యోగి తను వాడుతున్న ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ముఖ్యమైన పాస్వర్డ్లను సేవ్ చేశాడు. అప్పటికే ల్యాప్టాప్లో ఉన్న రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఆ సమాచారాన్ని మొత్తం హ్యాకర్ల చేతికి ఇచ్చింది. అయితే, మరో కీలక విషయం ఏమిటంటే. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డార్క్ వెబ్ సైట్లలో దీనిని $150కు కొనుగోలు చేయవచ్చు. అంటే, ఎవరైనా, మీ ల్యాప్టాప్, పీసీలలో ఈ స్పై సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇక మీ పని అంతే అని నిపుణులు అంటున్నారు. అందుకే, మీ సొంత ల్యాప్టాప్, పీసీలతో కంపెనీ ఇచ్చే వాటిలో పాస్వర్డ్లను సేవ్ చేసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ మొదట మార్చి 2020లో రష్యన్ డార్క్ వెబ్లో కనిపించింది. ఇలాంటి మాల్ వేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. (చదవండి: 50 బిలియన్ డాలర్ల లక్ష్యం..! యాపిల్..మేక్ ఇన్ ఇండియా..!) -
‘సారీ..మీరు ఎవరు..!’ అంటూ అమాయకంగా మెసేజ్..! తరువాత..
వాట్సాప్ యూజర్లకు అలర్ట్..! సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా హ్యకర్లు ‘ సారీ ఎవరు మీరు అంటూ మెసేజ్..’ చేసి తరువాత యూజర్లను నమ్మించి డబ్బుతో ఉడాయిస్తున్నారని తెలుస్తోంది. సారీ..మీరు ఎవరు...? ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్ను వేదికగా చేసుకొని అమాయక ప్రజలను బ్లాక్మెయిల్ చేయడానికి హ్యాకర్లకు అనువైన సోషల్ మీడియా పాట్ఫామ్స్గా వాట్సాప్ ఒకటిగా మారింది. తాజాగా వాట్సాప్లో మోసాలకు పాల్పడుతున్న కొత్త మోసం బయటపడింది. ‘సారీ..! మీరు ఎవరు..’ అంటూ వాట్సాప్ యూజర్లకు మెసేజ్ పంపుతూ కొత్త వాట్సాప్ స్కామ్కు తెర తీశారు హ్యకర్లు..! మెల్లగా నమ్మించి..! వాట్సాప్ యూజర్లకు ఎవరు మీరు అంటూ మెసేజ్ పంపుతూ ఆయా యూజర్లను నమ్మించి వారి వ్యక్తిగత విషయాలను, సోషల్ మీడియా ఖాతాలను హ్యకర్లు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడి వారి నుంచి డబ్బులను రాబట్టుతున్నారని తెలుస్తోంది. నిర్ధారించిన వాట్సాప్ ట్రాకర్..! స్కామర్స్ అమాయక ప్రజలపై తరచూగా సైబర్ నేరాలకు పాల్పడుతోన్నట్లు వాట్సాప్ డెవలప్మెంట్ ట్రాకర్ WABetaInfo గుర్తించింది. వాయిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ద్వారా యూజర్లను మభ్యపెడుతున్నట్లు ట్రాకర్ వెల్లడించింది. ఈ మోసాలకు తావు ఇవ్వకుండా అపరిచిత వ్యక్తుల వాట్సాప్ మెసేజ్కు యూజర్లు దూరంగా ఉండడమే మంచిదని టెక్ నిపుణులు సూచించారు. చదవండి: వాట్సాప్లో మూడో బ్లూటిక్ ఫీచర్! ఇంతకీ వాట్సాప్ ఏం చెప్పిందంటే.. -
మీరు ఈ స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్ డేటా హ్యకర్ల చేతిలోకి..!
ప్రపంచవ్యాప్తంగా క్వాలకమ్, మీడియాటెక్, హెలియో ప్రాసెసర్లను పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఎక్కువగా వాడుతున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా 37 శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉపయోగించిన మీడియాటెక్ ప్రాసెసర్లో భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ సంచలన విషయాలను వెల్లడించింది. చదవండి: మెటావర్స్తో ముప్పు! అంతకు మించి.. మీ కాల్స్ను మూడో వ్యక్తి వినగలరు..! మీడియాటెక్ ప్రాసెసర్స్తో నడిచే స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్ల కాల్స్ను మూడో వ్యక్తి వినే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదించింది. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక ప్రకారం.... మీడియాటెక్ చిప్ ఆడియో ప్రాసెసర్లో అనేక దుర్బలత్వాలు ఉన్నట్లు గుర్తించింది. ఒకవేళ వీటిని రెక్టిఫై చేయకుండా వదిలేస్తే హ్యాకర్లు సులభంగా వారి సంభాషణలు వినే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాటెక్ ప్రాసెసర్లను ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలు షావోమీ, ఒప్పో, రియల్మీ,వివో లాంటి కంపెనీలు వాడుతున్నాయి. పరిష్కరించిన మీడియాటెక్..! చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదించిన లోపాలపై మీడియాటెక్ స్పందించింది. పలు ప్రాసెసర్లలో లోపాలు ఉన్నది వాస్తవమైనప్పటికీ, ఈ లోపాల సహాయంతో ఇప్పటివరకు ఎలాంటి డేటా చౌర్యం జరిగిందనే రుజువులేదని మీడియా టెక్ భద్రత అధికారి టైగర్ హుజ్ వెల్లడించారు. ఆయా లోపాలను కంపెనీ వెంటనే గుర్తించి, పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ముందు జాగ్రత్తగా ఆయా స్మార్ట్ఫోన్ల యూజర్లు కొత్త సెక్యూరిటీ ప్యాచ్కి అప్డేట్ చేయాలని పేర్కొంది. వాటితో పాటుగా గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. CVE-2021-0661, CVE-2021-0662, CVE-2021-0663గా గుర్తించబడిన లోపాలను కంపెనీ పరిష్కరించిందని మీడియాటెక్ తన సెక్యూరిటీ బులెటిన్లో ప్రచురించింది. చదవండి: ప్రపంచంలోనే తొలిసారిగా...! మీడియాటెక్ నుంచి పవర్ఫుల్ ప్రాసెసర్..! -
ఇన్నోవా కారులో ముగ్గురు.. ఎలాంటి లెక్కలు లేవు.. రూ. కోటి స్వాధీనం
సాక్షి, మణికొండ: ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ఎలాంటి లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ. కోటి నగదును నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టగా టీఎస్ 15ఈబీ 3993 నెంబర్ గల ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఆపి తనిఖీ చేయగా నగదు దొరికింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియో: సీఎం ప్రాథమిక విచారణలో భాగంగా వారు రూ.కోటి రూపాయలను నగదుగా హ్యాకర్లకు ఇస్తే వారు ఇతరుల బ్యాంక్ అకౌంట్లనుంచి తస్కరించి తమకు రూ. 2 కోట్లను బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తారని అంగీకరించారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్కంట్యాక్స్ శాఖకు అప్పగిస్తామని, తదుపరి విచారణతో పాటు వీరి వ్యవహారాలపై మంగళవారం లోతుగా విచారణ జరుపుతామన్నారు. అప్పటి వరకు డబ్బుతో దొరికిన వారి పేర్లు.. వివరాలను ఇచ్చేందుకు నార్సింగి పోలీసులు నిరాకరించారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం -
భారత్ కేంద్రంగా ఇరాన్ హ్యాకర్లు భారీ కుట్ర!
న్యూఢిల్లీ: గత కొంత కాలం క్రితం చైనా హ్యాకర్లు ఇండియాలోని కొన్ని సంస్థలు హ్యాక్ చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఇరాన్ హ్యాకర్లు భారతదేశంలోని ఐటీ సేవల సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఐటీ సంస్థలను హెచ్చరించింది. జూలై 2021కి ముందు దేశంలో ఉన్న చిన్న కంపెనీలను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు ఇప్పుడు టెక్ దిగ్గజ కంపెనీలను సిద్దం అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. గతంతో పోలిస్తే దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు తెలిపింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న 40 కంటే ఎక్కువ ఐటీ కంపెనీలకు 1,600 నోటిఫికేషన్లను జారీ చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2020లో కంపెనీ జారీ చేసిన 48 నోటిఫికేషన్ల కంటే ఇది చాలా ఎక్కువ. “ఇరానియన్ హ్యాకర్లు దృష్టి ముఖ్యంగా గత ఆరు నెలల్లో పుంజుకున్న ఐటీ రంగం మీద ఉంది. మా నోటిఫికేషన్లలో దాదాపు 10-13% గత ఆరు నెలల్లో ఇరాన్ హ్యాకర్లకు సంబంధించినవే. అంతకు ముందు ఆరు నెలల్లోని రెండున్నర శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ” అని కంపెనీ తెలిపింది. (చదవండి: ఎలన్ మస్క్ ఆపసోపాలు, టిమ్ కుక్ అప్పుడే ప్రకటించేశాడు..?!) టెక్ దిగ్గజాలపై సైబర్ దాడులు ఈ హ్యాకర్లు ఇజ్రాయెల్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పాటు భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి" సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు మధ్యకాలంలో ఇరానియన్ హ్యాకర్లు భారతదేశంలోని కంపెనీలతో రాజీ చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సెంటర్, మైక్రోసాఫ్ట్ డీజిటల్ సెక్యూరిటీ యూనిట్ పేర్కొంది. ఇతర దేశాల అనుబంధ సంస్థలు, ఖాతాదారుల ఖాతాలను పరోక్షంగా అనుమతి పొందడం కోసం భారతీయ ఐటీ సంస్థలపై ఆకస్మిక దాడులకు చేసేందుకు సిద్దం అయినట్లు కంపెనీ ఊహించింది. భారతీయ ఐటీ సంస్థలు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు బ్యాకెండ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి. భారీగా మొబైల్ దాడులు "ఇటువంటి దాడులు ముఖ్యంగా వారికి లాభదాయకంగా ఉంటాయి. దాడి చేసేవారికి ఈ డేటా చాలా విలువైనది, ఎందుకంటే పెద్ద సంఖ్యలో వినియోగదారుల ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీల మీద దాడులు చేసే అవకాశం ఉన్నట్లు" అని భద్రతా సంస్థ కాస్పెర్స్కీ ఈ వారం ప్రారంభంలో ఒక నివేదికలో తెలిపింది. "అలాగే, రికార్డు స్థాయి సైబర్-దాడులతో ప్రపంచంలో అలజడి సృష్టించవచ్చు, ఎక్కువ సంఖ్యలో రాన్సమ్ వేర్ మొబైల్ దాడుల జరగవచ్చు" అని భద్రతా సంస్థ చెక్పాయింట్ రీసెర్చ్లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మాయా హోరోవిట్జ్ అన్నారు. (చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!) -
భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్వర్డ్ ఇదే..!
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్స్, సోషల్ మీడియా, యూపీఐ పేమెంట్స్ యాప్స్ వాడే వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. భద్రత కారణాల దృష్ట్యా లేదా మన ప్రైవసీ పరంగా పాస్వర్డ్లను ఏర్పాటుచేస్తాం. శక్తివంతమైన పాస్వర్డ్స్ను ఏర్పాటు చేయడంతో ఆయా అకౌంట్లను, స్మార్ట్ఫోన్లను, ల్యాప్ట్యాప్లను సైబర్ దాడులకు గురికాకుండా చూడవచ్చును. అయితే పాస్వర్డ్స్ విషయంలో భారతీయుల గురించి తాజాగా ప్రముఖ సెక్యూరిటీ దిగ్గజం నార్డ్ పాస్ భయంకర నిజాలను వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారని నార్డ్ పాస్ పేర్కొంది. చాలా మంది భారతీయులు ఎక్కువగా తమ సోషల్ మీడియా ఖాతాలకు ఒకే రకమైన పాస్ వర్డ్ ఏర్పాటుచేస్తున్నారని వెల్లడించింది. సైబర్ నేరస్తులకు సులువుగా ఉండే పాస్వర్డ్లను ఉంచుతున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. భారతీయుల వాడే 200 పాస్వర్డ్లో 62 పాస్వర్డ్లను సెకను కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేయవచచ్చును. అయితే ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్ రూపొందించడంలో అగ్రరాజ్యాలతో పోలిస్తే తక్కువ రిస్క్ భారతీయులు కల్గి ఉన్నట్లు నార్డ్పాస్ పేర్కొంది. భారతీయులు ఎక్కువ వాడే పాస్వర్డ్స్.. భారతీయులు ఎక్కువగా ‘password’ ను ఎక్కువగా తమ పాస్వర్డ్గా వాడుతున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. అంతేకాకుండా 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty, abc123, iloveyou వంటి పాస్వర్డ్లను వాడుతున్నుట్ల తెలుస్తోంది. వాటితో పాటుగా qwerty కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ పాస్వర్డ్లను సైబర్ నేరస్తులు కేవలం ఒక్క సెకనులో క్రాక్ చేయవచ్చునని నార్డ్ పాస్ స్పష్టం చేసింది. కొంతమంది తమ అభిమాన నటినటుల పేర్లను కూడా పాస్వర్డ్స్గా ఏర్పాటు చేస్తున్నారని నార్డ్ పాస్ తెలిపింది. అంతేకాకుండా sairam, krishna, omsairam పేర్లను కూడా పాస్వర్డ్గా పెడుతున్నట్లు తేలింది. శక్తివంతమైన పాస్వర్డ్ను ఇలా రూపొందించండి. సైబర్ నేరస్తుల నుంచి మీ అకౌంట్లను కాపాడుకోవాలంటే, బలమైన, శక్తివంతమైన పాస్వర్డ్ను ఏర్పాటుచేసుకోవడం చాలా మంచింది. మీరు ఏర్పాటు చేసే పాస్వర్డ్ లో కచ్చితంగా 12 అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. అప్పర్కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్ (!,@,#,.....మొదలైనవి) వాటిని పాస్వర్డ్గా ఉంచాలి. అంతేకాకుండా 2 అథనిటికేషన్ పాస్వర్డ్ ఉంచుకోవడం మరింత మంచింది. -
అమెరికా సంచలన నిర్ణయం.. వారిని పట్టిస్తే రూ. 74 కోట్లు మీవే!
రష్యా కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సంస్థ డార్క్ సైడ్లో కీలక నాయకత్వం వహిస్తున్న వారిని పట్టిస్తే 10 మిలియన్ డాలర్ల(సుమారు రూ.74 కోట్లు) రివార్డును ఇవ్వనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అక్టోబర్ 4న ప్రకటించింది. గత జూలైలో కలోనియల్ పైప్ లైన్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి చేసినట్లు ఎఫ్బిఐ తెలిపింది. ఈ కంపెనీ మీద సైబర్ దాడి చేయడం వల్ల గ్యాస్ ధరలు పెరగడం భారీగా పెరిగాయి. కొద్ది రోజుల పాటు యుఎస్ ఆగ్నేయంలో ఇంధన కొరత ఏర్పడటంతో బంకులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డార్క్ సైడ్ రాన్సమ్ వేర్ సంఘటనలో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారం తెలిపితే 5 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 37.18 కోట్లు) వరకు రివార్డును అందిస్తున్నట్లు గతంలో విదేశాంగ శాఖ తెలిపింది. "సైబర్ నేరస్థుల దోపిడీ నుంచి ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్ వేర్ బాధితులను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ తన చిత్తశుద్దిని ప్రదర్శిస్తుంది" అని డిపార్ట్ మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్ దాడి నుంచి బయటపడటానికి హ్యాకర్లకు బిట్ కాయిన్ రూపంలో దాదాపు $5 మిలియన్లను చెల్లించినట్లు కలోనియల్ పైప్ లైన్ తెలిపింది. అమెరికా న్యాయ శాఖ జూన్ నెలలో సుమారు 2.3 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 17.10 కోట్లు) సైబర్ నేరగాళ్ల నుంచి స్వాధీనం చేసుకుంది. అమెరికా ప్రభుత్వానికి, ప్రజలకు, సంస్థలకు నష్ట కలిగించే సైబర్ నేరగాళ్ల సమాచారాన్ని తెలిపితే $10 మిలియన్ల వరకు రివార్డును ఇవ్వనున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. (చదవండి: లండన్లో ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..!) -
ఏసర్ యూజర్లకు భారీ షాక్..!
ప్రముఖ తైవాన్ టెక్ దిగ్గజం ఏసర్ భారతదేశంలోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు దృవీకరించింది. 60జీబీ వినియోగదారుల డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి. యూజర్ల వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ కస్టమర్ డేటా, సున్నితమైన ఖాతాల సమాచారం, ఆర్థిక డేటాను యాక్సెస్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలోని 10,000 మంది కస్టమర్ల రికార్డులను కలిగి ఉన్న ఫైళ్లు, డేటాబేస్ కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేశారు. (చదవండి: ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!) భారతదేశం అంతటా ఏసర్ రిటైలర్లు, పంపిణీదారుల 3,000 సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని హ్యాకర్ బృందం పేర్కొంది. భారతదేశంలో తన స్థానిక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సిస్టమ్ పై దాడి చేసినట్లు ఏసర్ పేర్కొంది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏసర్ ధృవీకరించినట్లు నివేదిక తెలిపింది. ఈ విషయం గురుంచి దేశంలోని ఖాతాదారులందరిని అలర్ట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ దాడి గురుంచి స్థానిక అధికారులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఇఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు ఏసర్ పేర్కొంది. ఏడు నెలల్లో ఏసర్ పై జరిగిన రెండో సైబర్ సెక్యూరిటీ దాడి ఇది. మార్చిలో ఆర్ ఈవిల్ చేసిన రాన్సమ్ వేర్ దాడితో కంపెనీ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకులయి. దొంగిలించిన డేటాను తిరిగి పొందడం కోసం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లో ఏసర్ ను హ్యాకర్లు కోరారు. ఆ సమయంలో హ్యాకర్లు డిమాండ్ చేసిన అతిపెద్ద డిమాండ్ అది. -
వాటిని పాస్వర్డ్గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే
మనలో చాలా మంది ఇంట్లో వాళ్ల పేర్లు, డేటా ఆఫ్ బర్త్లు నచ్చిన నెంబర్లను పాస్వర్డ్లుగా ఉపయోగిస్తుంటాం. మరికొందరు సైబర్ నేరస్తుల నుంచి సేఫ్గా ఉండేందుకు 123లు, abcdలను పాస్వర్డ్లుగా మార్చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రం వాళ్లకు నచ్చిన హీరోల పేర్లను పాస్వర్డ్లుగా పెట్టుకుంటుంటారు. అలా పెట్టుకోవడం చాలా ప్రమాదమని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. హీరోల పేర్లు పాస్వర్డ్లుగా పెట్టుకుంటే 'దొంగ చేతికి తాళం' ఇచ్చిట్లవుతుందని తేలింది. మోజిల్లా ఫౌండేషన్ సంస్థ పాస్వర్డ్లపై రీసెర్చ్ నిర్వహించింది. ఆ రీసెర్చ్లో భాగంగా Haveibeenpwned.comలో దొరికిన వివరాల ఆధారంగా పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, వోల్వరైన్, ఐరన్ మ్యాన్, వండర్ ఉమెన్, డేర్ డెవిల్, థోర్, బ్లాక్ విడో, బ్లాక్ పంతార్ పేర్లను పెట్టుకున్న వారి అకౌంట్లు ఈజీగా హ్యక్ అయినట్ల వెల్లడించింది. వీరితో పాటు క్లార్క్ కెంట్, బ్రూసీ వ్యాన్, పీటర్ పార్కర్, హీరోల పేర్లతో పాటు ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, 12345, ఏబీసీడీలను పాస్వర్డ్లుగా పెట్టుకోవద్దని హెచ్చరించింది. అలా పెట్టుకున్న వారి అకౌంట్లు హ్యాక్ అయినట్లు స్పష్టం చేసింది. మరి ఎలాంటి పాస్వర్డ్లు పెట్టుకోవాలి హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్లను పెట్టుకోవాలని మోజిల్లా ఫౌండేషన్ తెలిపింది. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్తో పాటు '@#$*' ఇలా క్లిష్టమైన పాస్వర్డ్లను పెట్టుకోవాలని సూచించింది. మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్లు ఇవే ఇక తాము నిర్వహించిన రీసెర్చ్లో '12345', '54321' పాస్వర్డ్లు అత్యంత ప్రమాదకరమని మోజిల్లా ప్రతినిధులు తెలిపారు. 2020లో పాస్వర్డ్ మేనేజర్ అయిన 'నార్డ్ పాస్' ప్రకారం '123456' మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్ అని తెలిపింది. ఈ పాస్వర్డ్ను ఉపయోగించిన అకౌంట్లను హ్యాకర్లు 23 మిలియన్ల సార్లు హ్యాక్ చేసినట్లు వెల్లడించింది.'123456789' లను పాస్వర్డ్లుగా పెట్టుకుంటే సెకన్ల వ్యవధిలో హ్యాక్ చేస్తారని నార్డ్ పాస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: 18 వందల కోట్ల పాస్వర్డ్లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్..! -
ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిద రకాలుగా యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను సైబర్ నెరగాళ్లు టార్గెట్ చేశారు. ఇటీవల కనుగొన్న ఈ-మెయిల్ స్కామ్ వినియోగదారులకు నకిలీ బహుమతి కార్డులను ఆఫర్ చేస్తోంది. అయితే, వాస్తవానికి ఎలాంటి బహుమతులు పంపబడవు. యూజర్లు గనుక ఆ లింకు క్లిక్ చేస్తే వినియోగదారులు డబ్బు, మీ సున్నితమైన డేటాను కోల్పోతారు. వాస్తవానికి, ఈ మోసపూరిత ఈమెయిల్స్ లోపల లింక్ లను వినియోగదారులు క్లిక్ చేయడానికి బ్రాండింగ్ పేరుతో ఈమెయిల్స్ పంపుతున్నట్లు తెలుస్తుంది. నేడు అత్యంత ప్రజాదరణ పొందిన ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లలో జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను హ్యాకర్లు టార్గెట్ చేశారు. నకిలీ ఈ మెయిల్స్ పేరుతో విలువైన బహుమతులు ప్రముఖ కంపెనీల పేరుతో పంపిస్తున్నారు. వాస్తవానికి వారు ఎలాంటి బహుమతులు పంపరు. కానీ, ఈ గిఫ్ట్ కార్డులను 'క్లెయిం' చేసుకోవడానికి వినియోగదారులు మొదట ఒక చిన్న సర్వేలో పాల్గొనాలని ఆ లింకు సూచిస్తుంది.(చదవండి: అర్ధ శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!) దురదృష్టవశాత్తు, ఆ లింక్లపై క్లిక్ చేసే యూజర్లు వేరే వెబ్ సైట్ యాక్సెస్ చేస్తారు. అయితే, చివరకు వారికి ఎలాంటి బహుమతులు లేదా గిఫ్ట్ కార్డులు ఇవ్వబడవు. ఎక్స్ ప్రెస్ యుకె ప్రకారం.. మొదటి ఈ స్కామ్ మూడు నెలల క్రితం జూన్ లో గుర్తించారు. సర్వేలో పాల్గొన్న తర్వాత వారి సున్నితమైన వివరాలు హ్యాకర్లు కోరుతారు. మీరు గనుక ఆ లింకు క్లిక్ చేసి వివరాలు సమర్పించారో ఇక మీ పని అంతే. మీ ఖాతాలోని డబ్బులు కాజేయడంతో పాటు మిమ్మల్ని మరింత డబ్బు కోసం బ్లాక్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇలా.. తెలియని లింకులపై వినియోగదారులు అసలు క్లిక్ చేయవద్దు. తెలియని వెబ్సైట్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయవద్దు. ఈమెయిల్, బ్యాంకు కార్డు వివరాలు, పాస్వర్డ్లను ఎక్కడ నమోదు చేయవద్దు. (మరి ముఖ్యంగా సర్వేలో పాల్గొనాల్సి వస్తే) -
గూగుల్ సంచలన నిర్ణయం
Google Two Step Verification: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూజర్ భద్రత విషయంలో ఇక మీదట యూజర్ అనుమతితో సంబంధం లేకుండా వ్యవహరించబోతోంది!. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్ను.. మరింత కట్టుదిట్టం చేయనుంది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను అంత తేలికగా హ్యాక్ చేయలేరికా!. సాధారణంగా గూగుల్ అకౌంట్ను రెగ్యులర్ డివైజ్లలో లాగిన్ కానప్పుడు కన్ఫర్మ్ మెసేజ్ ఒకటి వస్తుంది. దానిని క్లిక్ చేస్తేనే అకౌంట్ లాగిన్ అవుతుంది. అయితే ఇక మీదట ఇది రెండు దశల్లో (2 సెటప్ వెరిఫికేషన్) జరగనుంది. హ్యాకర్లు అకౌంట్ను ట్రేస్ చేయడానికి వీల్లేని రేంజ్లో ఈ విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు రకరకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించి హ్యాకర్లు పాస్వర్డ్ను ఊహించడం లేదంటే దొంగతనంగా అకౌంట్ను లాగిన్ కావడం లాంటి చర్యలు సంక్లిష్టం కానున్నాయి. స్వయంగా గూగులే.. Two-Factor Authentication పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది గూగుల్. ఇందుకోసం గూగుల్ క్రోమ్, జీమెయిల్, ఇతరత్ర గూగుల్ అకౌంట్లను అప్డేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ను యూజర్ యాక్టివేట్(సెట్టింగ్స్ ద్వారా) చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్ పర్మిషన్ లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్ కల్లా 150 మిలియన్ గూగుల్ అకౌంట్లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్ క్రియేటర్లను Two-Factor Authentication ఫీచర్ను ఆన్ చేయాల్సిందిగా సూచించింది. ఒకవేళ యూజర్ ఈ వ్యవస్థ వద్దనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్లి ఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం డివైజ్లలో లాగిన్ అయ్యేవాళ్లకు 2 సెటప్ వెరిఫికేషన్ తప్పకుండా కనిపిస్తుంది. రెగ్యులర్ డివైజ్లలో అప్పుడప్పుడు నొటిఫికేషన్ రావొచ్చని గూగుల్ స్పష్టం చేసింది. చదవండి: ఈ యాప్స్ను ఫోన్ నుంచి అర్జెంట్గా డిలీట్ చేయండి -
ఈ టాటా గ్రూప్ లింకుపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు
గత కొద్ది రోజుల నుంచి ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. ఆ పోస్టులో టాటా గ్రూప్ 150వ వార్షికోత్సవం సందర్భంగా టాటా నెక్సాన్ కారును గెలుచుకోవడానికి ఈ పోస్టు క్లిక్ చేయండి అని ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆన్ లైన్ స్కామ్ లు చాలా సాధారణం అయ్యాయి. అందుకే, ఇటువంటి విషయాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఒకవేల మీరు గనుక ఇటువంటి లింక్స్ క్లిక్ చేస్తే మీ ఆర్థిక వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. హ్యాకర్లు నిరంతరం మీ డబ్బును దోచుకోవడానికి ఇలాంటి స్కామ్ లింక్స్ పంపిస్తారు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు గనుక టాటా గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, మిమ్మల్ని సరళమైన ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత చివర్లో బహుమతిని తెరవమని అడుగుతారు. మీరు మూడుసార్లు ప్రయత్నించడానికి ఛాన్స్ ఇస్తారు. ప్రజలు సాధారణంగా ఈ ఉచ్చులో పడతారు. బహుమతుల కోసం ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే, మీ వ్యక్తిగత వివరాలను పొందే సామర్ధ్యం ఉన్న వైరస్ లింక్ మీ పరికరంలో హ్యాకర్లు ఇన్ స్టాల్ చేస్తారు. అందుకే ఇటువంటి లింక్స్, పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!) #FakeNotSafe Tata Group or its companies are not responsible for this promotional activity. Please do not click on the link and/or forward it to others. Know more here: https://t.co/jJNfybI9ww pic.twitter.com/AA38T0oqHn — Tata Group (@TataCompanies) October 1, 2021 అదేవిధంగా, మీరు ఆన్లైన్లో మీ సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయవద్దు అని పేర్కొంటున్నారు. ఈ టాటా గ్రూప్ నకిలీ లింక్ విషయంలో ఆ సంస్థ స్పందించింది. టాటా గ్రూప్, మా సంస్థలకు ఈ నకిలీ ప్రచార లింకుకు ఎటువంటి సంబంధం లేదు. మేము దీనికి బాధ్యులం కాదు. ఈ లింకు మీద అసలు క్లిక్ చేయకండి, ఎవరికి ఫార్వార్డ్ చేయకండి అని ట్విటర్ ద్వారా తెలిపింది. -
ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!
నిన్న ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయింది. సర్వర్స్లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫేస్బుక్ టెక్నాలజీ ఆఫీసర్ స్పందిస్తూ యూజర్ల అందరికి క్షమాపణలను తెలియజేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను తిరిగి మాన్యువల్గా పునరుద్ధరించడంతో సుమారు 7 గంటల సమయం పట్టిన్నట్లు వెల్లడించారు. ఒక్కసారిగా ఫేస్బుక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్బర్గ్ సుమారు 7 బిలియన్డాలర్లకు పైగా నష్టపోయాడని పేర్కొంది. ఫేస్బుక్ యూజర్లకు మరో షాక్...! ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో షాక్ గురైన యూజర్లకు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ మరో షాకిచ్చింది. ఫేస్బుక్ గ్లోబల్ నెట్వర్క్స్ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్లో ఫేస్బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. ఫేస్బుక్ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్బుక్ ఖాతాలు డార్క్ వెబ్లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ నివేదించింది. కొంతమంది హ్యాకర్లు ఫేస్బుక్ వినియోగదారుల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణలు ఉన్నాయి. ఫేస్బుక్ యూజర్ల డేటాను డార్క్వెబ్లో కొనుగోలు చేద్దామనుకున్న ఓ వ్యక్తికి హ్యాకర్లనుంచి 5,000 డాలర్లను చెల్లించగా తిరిగి ఎటువంటి డేటాను పొందలేదని ఆ వ్యక్తి రిపోర్ట్చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ చివరలో, కొంతమంది హ్యాకర్లు తమ వద్ద 1.5 బిలియన్ ఫేస్బుక్ యూజర్ డేటా ఉందని పేర్కొంటూ పోస్ట్ చేసారు. స్పందించిన ఫేస్బుక్..! ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐనా సమయంలో యూజర్ల డేటా అసలు లీక్ అవ్వలేదని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూజర్ల డేటాకు డోకా లేదని వెల్లడించింది. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఫేస్బుక్ చర్యలను తీసుకుంటుందని తెలిపింది. ఎందుకైనా మంచిది ఇలా చేస్తే బెటర్..! ఫేస్బుక్ యూజర్లు తమ డేటాను చోరికి గురిఅవ్వకుండా ఉండడం కోసం 2 అథనిటికేషన్ పాస్వర్డ్ను యూజర్లు తమ ఖాతాలకు ఏర్పాటు చేయడం మంచిది. అంతేకాకుండా స్ట్రాగ్ పాస్వర్డ్లను కూడా తమ ఫేస్బుక్ అకౌంట్లకు ఏర్పాటు చేసుకోవాలని పలు టెక్నికల్ నిపుణులు వెల్లడిస్తున్నారు. “Data of Over 1.5 Billion Facebook Users Sold on Hacker Forum Information of over 1.5 billion Facebook users being sold on popular hacking-related forum, potentially enabling cybercriminals and unscrupulous advertisers to target Internet users globally” https://t.co/JE8uSJbOg9 — Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) October 4, 2021 చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్బుక్ ట్రెండ్! గ్యాప్లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్ -
ఈ 26 యాప్స్పై గూగుల్ నిషేధం..ఇవి చాలా డేంజర్!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో. అంత కంటే వేగంగా సైబర్ క్రైమ్ సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా వినియోగదారుల నుంచి డబ్బును దొంగిలించే 26 ఆండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ నిషేధించినట్లు తెలిపింది. హ్యాకర్లు కంప్యూటర్లలోకి చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్ భద్రత సంస్థ ఈ హానికరమైన యాప్స్ కనుగొనే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ జింపెరియం గూగుల్ సంస్థకు ఈ హానికర యాప్స్ గురుంచి పిర్యాదు చేసిన తర్వాత వాటిని గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ - ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్ లేటర్, బస్ - మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, లాకర్ టూల్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. కానీ, దుర దృష్టవశాత్తు ఈ హానికర ఆండ్రాయిడ్ యాప్స్ గురుంచి వాటిని వాడుతున్న చాలా మందికి తెలియదు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మొబైల్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక జారీ చేస్తుంది.(చదవండి: సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!) వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో తనిఖీ చేయకుండానే డౌన్లోడ్ చేసుకోవడానికి కారణం మిలియన్ల మంది వాటిని డౌన్ లోడ్ చేసుకోవడమే. టాప్ ఇన్ క్రామ్టెడ్ అనే ఆండ్రాయిడ్ యాప్ 5,00,000 నుంచి 10,00,000 సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో ఉన్న యాప్స్ ను కనీసం 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్(Zimperium zLabs) సెక్యూరిటీ రీసెర్చర్లు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లను గ్రిఫ్ట్ హార్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. హానికరమైన 26 యాప్స్: Handy Translator Pro Heart Rate and Pulse Tracker Geospot: GPS Location Tracker iCare – Find Location My Chat Translator Bus – Metrolis 2021 Free Translator Photo Locker Tool Fingerprint Changer Call Recoder Pro Instant Speech Translation Racers Car Driver Slime Simulator Keyboard Themes What’s Me Sticker Amazing Video Editor Safe Lock Heart Rhythm Smart Spot Locator CutCut Pro OFFRoaders – Survive Phone Finder by Clapping Bus Driving Simulator Fingerprint Defender Lifeel – scan and test Launcher iOS 15 -
సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!
ఫ్లూబోట్ మాల్వేర్ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు సంక్రమిస్తుంది. ఇప్పుడు వినియోగదారుల పరికరాల్లోకి ప్రవేశించడానికి మాల్వేర్ ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. ఒక నెల క్రితం భద్రతా సంస్థ ట్రెండ్ మైక్రో, న్యూజీలాండ్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్ వేర్ మరో కొత్త పద్దతిలో తిరిగి వచ్చినట్లు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. మొబైల్ యూజర్లను ఆకర్షించడం కోసం పార్శిల్ పేరుతో ఓ టెక్ట్స్ మెసేజ్ వస్తోంది. యూజర్లు లింక్ పై క్లిక్ చేసిన తర్వాత వారికి మరో పెద్ద సందేశం వస్తుంది. మీ మొబైల్/కంప్యూటరుకి ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్వేర్ సోకినట్లు ఒక హెచ్చరిక చేస్తుంది. వాస్తవానికి, ఇది గూగుల్ క్రోమ్ ప్రమాదకరమైన సేఫ్ బ్రౌజింగ్ సందేశాన్ని తెలిపే రెడ్ హెచ్చరిక స్క్రీన్'తో పోలి ఉంటుంది. "ఫ్లూబోట్ మాల్వేర్ తొలగించడం కోసం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండి" అని సందేశం రూపంలో ఇక్కడ క్లిక్ చేయండి చూపిస్తుంది. ఫ్లూబోట్ మాల్ వేర్ మాల్వేర్ తొలగించడం కోసం నిజమైన సెక్యూరిటీ అప్డేట్ చేయడానికి బదులుగా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఫ్లూబోట్ వైరస్ డౌన్ లోడ్ చేస్తారు. సెక్యూరిటీ అప్ డేట్ పేరుతో మీ మొబైల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఈ-మెయిల్, ట్విట్టర్ ఈ డేటా మొత్తాన్ని మాల్వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి ఫ్లూబోట్ అందిస్తుంది. అలాగే, మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ ద్వారా ఇతర వ్యక్తులకు పంపుతుంది. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?) We’ve broken down some details on the FluBot text scam currently infecting Android phones. Please share this with your friends and family and help us stop the spread. https://t.co/zoz8G9o8i0 — CERT NZ (@CERTNZ) October 1, 2021 ఫ్లూబాట్ నుంచి రక్షణ ఇలా.. ఇంతటి ఇబ్బందికరమైన ఫ్లూబాట్ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం మీ స్క్రీన్ పై వచ్చే పాప్ అప్ క్లిక్ చేయవద్దు. ఏ ఇతర లింక్స్ ద్వారా వచ్చే యాప్లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ లింక్స్ ఓపెన్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే మొబైల్ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. -
136 యాప్స్పై నిషేధం.. అర్జెంట్గా డిలీట్ చేయండి
Google Ban 136 Malicious Apps: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు హెచ్చరిక. ప్లేస్టోర్ నుంచి 136 యాప్స్ను నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్స్ ద్వారా ప్రమాదకరమైన మాల్వేర్ను ప్రయోగించి.. హ్యాకర్లు 70 దేశాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల నుంచి భారీగా నగదు కొల్లగొట్టినట్లు సమాచారం. తమ ప్రమేయం లేకుండా యూజర్లు కొద్దికొద్దిగా డబ్బును పొగొట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూజర్లు అర్జెంట్గా తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్ను తొలగించాలని గూగుల్ సూచించింది. యాప్స్ ద్వారా మాల్వేర్ దాడులతో హ్యాకర్లు తెలివిగా ఒకేసారి కాకుండా.. కొంచెం కొంచెంగా డబ్బును మాయం చేస్తున్నారట. డల్లాస్కు చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘జింపేరియమ్’ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 136 యాప్స్ మీద నిషేధం విధించింది గూగుల్. ఇంకా గూగుల్ప్లే స్టోర్ నుంచి తొలగించని ఈ యాప్స్ను.. ఫోన్ వాడకందారులే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఒకవేళ యాప్స్ తొలగించినప్పటికీ.. థర్డ్పార్టీ యాప్ మార్కెట్ ప్లేస్తోనూ నడిచే అవకాశం ఉందని, కాబట్టి యాప్స్ను తీసేయాలని గూగుల్ సూచిస్తోంది. బ్యాన్ చేసిన యాప్స్లో పాపులర్ యాప్స్ సైతం కొన్ని ఉండడం విశేషం. ఐకేర్-ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్లేటర్, జియోస్పాట్: జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, హార్ట్ రేట్ అండ్ పల్స్ ట్రాకర్, హ్యాండీ ట్రాన్స్లేటర్ ప్రో లాంటి యాప్స్ సైతం ఉన్నాయి. గ్రిఫ్ట్హోర్స్ ఆండ్రాయిడ్ ట్రోజన్ మొబైల్ ప్రీమియం సర్వీస్ ద్వారా దాదాపు కోటి మంది ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేశారని జింపేరియమ్ జీల్యాబ్ గుర్తించింది. ఫిషింగ్ టెక్నిక్లు, గిఫ్ట్ల పేరుతో టోకరా, తెలియకుండానే డాటాను తస్కరించడం లాంటి యాక్టివిటీస్ ద్వారా ఇప్పటికే భారీగా చోరీ చేయగా.. ఆండ్రాయిడ్ యూజర్లు కింద పేర్కొన్న యాప్స్ గనుక ఫోన్లలో ఉంటే.. వాటిని తొలగించాలని చెబుతోంది. Zimperium's zLabs team recently discovered an aggressive #mobile premium services campaign. This scam has hidden behind #malicious Android #apps acting as Trojans. The #Trojan attack, which we have named #GriftHorse, steals money from the victims. https://t.co/tz7R3KJ0yX — ZIMPERIUM (@ZIMPERIUM) September 29, 2021 Handy Translator Pro Heart Rate and Pulse Tracker Geospot: GPS Location Tracker iCare – Find Location My Chat Translator Bus – Metrolis 2021 Free Translator Photo Locker Tool Fingerprint Changer Call Recoder Pro Instant Speech Translation Racers Car Driver Slime Simulator Keyboard Themes What’s Me Sticker Amazing Video Editor Safe Lock Heart Rhythm Smart Spot Locator CutCut Pro OFFRoaders – Survive Phone Finder by Clapping Bus Driving Simulator Fingerprint Defender Lifeel – scan and test Launcher iOS 15 Idle Gun Tycoo\u202an\u202c Scanner App Scan Docs & Notes Chat Translator All Messengers Hunt Contact Icony Horoscope : Fortune Fitness Point Qibla AR Pro Heart Rate and Meal Tracker Mine Easy Translator PhoneControl Block Spam Calls Parallax paper 3D SnapLens – Photo Translator Qibla Pass Direction Caller-x Clap Photo Effect Pro iConnected Tracker Smart Call Recorder Daily Horoscope & Life Palmestry Qibla Compass (Kaaba Locator) Prookie-Cartoon Photo Editor Qibla Ultimate Truck – RoudDrive Offroad GPS Phone Tracker – Family Locator Call Recorder iCall PikCho Editor app Street Cars: pro Racing Cinema Hall: Free HD Movies Live Wallpaper & Background Intelligent Translator Pro Face Analyzer iTranslator_ Text & Voice & Photo Pulse App – Heart Rate Monitor Video & Photo Recovery Manager 2 Быстрые кредиты 24\7 Fitness Trainer ClipBuddy Vector arts Ludo Speak v2.0 Battery Live Wallpaper 4K Heart Rate Pro Health Monitor Locatoria – Find Location GetContacter Photo Lab AR Phone Booster – Battery Saver English Arabic Translator direct VPN Zone – Fast & Easy Proxy 100% Projector for Mobile Phone Forza H Mobile 4 Ultimate Edition Amazing Sticky Slime Simulator ASMR\u200f Clap To Find My Phone Screen Mirroring TV Cast Free Calls WorldWide My Locator Plus iSalam Qibla Compass Language Translator-Easy&Fast WiFi Unlock Password Pro X Pony Video Chat-Live Stream Zodiac : Hand Ludo Game Classic Loca – Find Location Easy TV Show Qibla correct Quran Coran Koran Dating App – Sweet Meet R Circle – Location Finder TagsContact Ela-Salaty: Muslim Prayer Times & Qibla Direction Qibla Compass Soul Scanner – Check Your CIAO – Live Video Chat Plant Camera Identifier Color Call Changer Squishy and Pop it Keyboard: Virtual Projector App Scanner Pro App: PDF Document QR Reader Pro FX Keyboard You Frame Call Record Pro Free Islamic Stickers 2021 QR Code Reader – Barcode Scanner Bag X-Ray 100% Scanner Phone Caller Screen 2021 Translate It – Online App Mobile Things Finder Proof-Caller Phone Search by Clap Second Translate PRO CallerID 3D Camera To Plan Qibla Finder – Qibla Direction Stickers Maker for WhatsApp Qibla direction watch (compass) Piano Bot Easy Lessons CallHelp: Second Phone Number FastPulse – Heart Rate Monitor Caller ID & Spam Blocker Free Coupons 2021 KFC Saudi – Get free delivery and 50% off coupons Skycoach HOO Live – Meet and Chat Easy Bass Booster Coupons & Gifts: InstaShop FindContact Launcher iOS for Android Call Blocker-Spam Call Blocker Call Blocker-Spam Call Blocker Live Mobile Number Tracker చదవండి: వాట్సాప్లో రూపాయి సింబల్ ఫీచర్.. ఇందుకోసమేనంట! -
ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!
Thousands Of Gamers Targeted In A New Cyberattack: మన నిత్యజీవితంలో స్మార్ట్ఫోన్స్, ఇంటర్నెట్ ఓక భాగమైపోయింది. చౌక ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ రాకతో తరుచూ ఆన్లైన్లో ఉంటూ..ఎప్పుడు ఎదో ఒక అంశంపై బ్రౌజ్ చేస్తు కాలక్షేపం చేస్తున్నాం. దీంతో ఇంటర్నెట్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. అదేస్థాయిలో సైబర్ నేరస్తులు యూజర్లపై దాడిచేస్తున్నారు. హ్యకర్లు కూడా కొత్త పుంతలను తొక్కుతూ...రకరకాలుగా దాడులకు పాల్పడుతున్నారు. సైబర్ నేరస్తులు రూట్ మార్చి గేమ్స్ ఆడే వారిపై విరుచుకుపడుతున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై పరిశోధకులు తన నివేదికలో వెల్లడించారు. చదవండి: Xiaomi: బెల్ట్తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..! ఆన్లైన్ గేమ్స్ ఆడే వారేలక్ష్యంగా దాడులు..! సైబర్ నేరగాళ్లు బ్లడీస్టీలర్ అని పిలువబడే కొత్త మాల్వేర్తో ఎక్కువగా గేమర్స్ను, వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని కాస్పర్ స్కై పేర్కొంది. బ్లడీస్టీలర్ మాల్వేర్తో సెషన్ డేటా , పాస్వర్డ్స్, కుకీ ఎక్స్ఫిల్ట్రేషన్ను హ్యకర్లు పొందుతున్నట్లు కాస్పర్స్కై పేర్కొంది. ఆన్లైన్ గేమ్స్ ఆడే యూజర్ల బ్యాంక్ కార్డ్ వివరాలను, బ్రౌజర్ ఆటోఫిల్డేటా, స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్ల నుంచి స్క్రీన్ షాట్లను హ్యాకర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. కాస్పర్ స్కై నివేదిక ప్రకారం... ఎపిక్ గేమ్స్, స్టీమ్, ఆరిజిన్, గాగ్. కామ్(GOG.com), బెథెస్డా, టెలిగ్రామ్, వైమ్ వరల్డ్ వంటి ఫ్లాట్ఫామ్స్ యూజర్ల సెషన్ వివరాలను హ్యకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన జీటీఏ ఫైవ్, ఫార్ట్నైట్, బ్యాటిల్ ఫీల్డ్,ఫిఫా 2022 గేమ్స్ ఉన్నాయి. రష్యన్ ఫోరమ్లో బ్లడీస్టీలర్ అనే మాల్వేర్ తొలిసారిగా మార్చి 2021లో కాస్పర్స్కై గుర్తించింది. ఈ మాల్వేర్ సహాయంతో గేమర్స్ నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజర్ల నుంచి డబ్బులను వసూలు చేస్తోన్నట్లు కాస్పర్స్కై పేర్కొంది. చదవండి: జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పూర్తిగా ఆన్లైన్లో జరుగుతాయి. శక్తివంతమైన కంప్యూటర్ల సహయంతో, బ్లాక్చైన్ టెక్నాలజీనుపయోగించి క్రిప్టో లావాదేవీలను జరుపుతుంటారు. బిట్కాయిన్స్ను కల్గిన పలు వ్యక్తులు తమ బిట్కాయిన్ వ్యాలెట్కు పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోనే సౌకర్యం ఉంటుంది. బిట్కాయిన్ వ్యాలెట్కు శక్తివంతమైన పాస్వర్డ్ సహాయంతో ఇతరులకు బిట్కాయిన్ల లావాదేవీలను చేయవచ్చును. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! పది లక్షల కోట్ల రూపాయలు గాల్లోనే...! బిట్కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం బిట్కాయిన్ యూజర్లు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ బిట్కాయిన్ వ్యాలెట్ పాస్వర్డ్ మర్చిపోతే... బిట్కాయిన్లు ఆన్లైన్లో అలానే ఉండిపోతాయి. ది న్యూయర్క్ టైమ్స్ ప్రకారం...దాదాపు 140 బిలియన్ డాలర్లు (రూ. 1,03,66,51,70,00,000 సుమారు పది లక్షల కోట్ల రూపాయలు) బిట్కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్స్ మర్చిపోవడంతో ఈ మొత్తాన్ని బిట్కాయిన్ యూజర్లు క్లెయిమ్ చేసుకోలేదని వెల్లడించింది. క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైనాలిసిస్ నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. 18.6 బిలియన్ బిట్కాయిన్ల మైనింగ్లో 20 శాతం మేర బిట్కాయిన్స్లో ఏలాంటి లావాదేవీలు లేకుండా నిద్రాణస్థితిలో ఉన్నాయని తెలిపింది.ఆయా బిట్కాయిన్ వ్యాలెట్ల యూజర్లు పాస్వర్డ్స్ను మర్చిపోవడమే దీనికి కారణమని చైనాలిసిస్ పేర్కొంది. ఆశాదీపంగా హ్యాకర్లే వారికి దిక్కు...! బిట్కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్స్ను మర్చిపోయినా బిట్కాయిన్ యూజర్లకు డార్క్వెబ్లోని ఆన్లైన్ హ్యాకర్లే దిక్కుగా కన్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా బిట్కాయిన్ వ్యాలెట్లను యాక్సెస్ చేసేందుకు బిట్కాయిన్ యూజర్లు హ్యకర్ల సహయాన్ని తీసుకుంటున్నారు. బిట్కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసిన హ్యకర్లకు కొత్త మొత్తాన్ని బిట్కాయిన్ యూజర్లు చెల్లిస్తున్నట్లు క్రిప్టో అసెట్ రికవరీ టీమ్ వెల్లడించింది. కాగా బిట్కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసే సంభావ్యత కేవలం 27 శాతంగానే ఉంది. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక
బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంకు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్తగా దాడులు చేస్తున్న మాల్వేర్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తూ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్'ను డ్రినిక్ అనే పేరుతో పిలుస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం దీనిని ఎస్ఎంఎస్ దొంగిలించడానికి ఉపయోగించేవారు. అయితే, ఇటీవల బ్యాంకు వినియోగదారుల సమాచారాన్ని దొంగలించేలా హ్యాకర్లు 'డ్రినిక్ మాల్వేర్'ను అభివృద్ధి చేశారు. సున్నితమైన బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి దీనిని తయారు చేశారు. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో సహా 27కి పైగా భారతీయ బ్యాంకుల వినియోగదారులను ఇప్పటికే ఈ మాల్వేర్ ఉపయోగించి దాడి చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సీఈఆర్ టీ-ఇన్ తెలిపింది. ఒక్కసారి దాడి జరిగితే ఖాతాదారుల సున్నితమైన డేటా, గోప్యత, భద్రతను గట్టిగా దెబ్బతీస్తాయని, అలాగే పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు అవకాశం ఉన్నట్లు సీఈఆర్ టీ-ఇన్ పేర్కొంది.(చదవండి: నకిలీ ఎస్ఎంఎస్.. హానికరమైన యాప్!) ఈ కొత్త మాల్వేర్ ఎలా పనిచేస్తుంది? బాధితుడు ఫిషింగ్ వెబ్సైట్ లింక్ కలిగి ఉన్న ఎస్ఎమ్ఎస్(ఆదాయపు పన్ను శాఖ, భారత ప్రభుత్వ వెబ్సైట్ పేరుతో) అందుకుంటారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తి చేయడం కోసం వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి, హానికరమైన ఎపికె(APK) ఫైలును డౌన్లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయాలని కోరుతారు. ఈ హానికరమైన ఆండ్రాయిడ్ యాప్ ఆదాయపు పన్ను శాఖ/ ఇతర ప్రభుత్వ యాప్ పేరుతో ఉండవచ్చు. ఒకవేల ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ఎమ్ఎస్, కాల్ లాగ్, కాంటాక్ట్ మొదలైన అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని యాప్ యూజర్ ని కోరుతుంది.(చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా!) ఒకవేళ యూజర్ వెబ్సైట్లో ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయకపోయిన, అనుమతులు ఇవ్వకపోయిన మీరు ముందుకు కొనసాగలేరు. ముందుకు సాగడం కోసం యూజర్ ని వివరాలు, అనుమతులు ఇవ్వాలని కోరుతుంది. ఆ తర్వాత డేటాలో పూర్తి పేరు, పాన్, ఆధార్ నెంబరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ చిరునామా, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్, సీఐఎఫ్ నెంబరు, డెబిట్ కార్డు నెంబరు, గడువు తేదీ, సీవీవీ, పిన్ వంటి ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ వివరాలను యూజర్ నమోదు చేసిన తర్వాత యూజర్ బ్యాంక్ ఖాతాకు రీఫండ్ చేసిన డబ్బు మొత్తం బ్యాంకు ఖాతాలో జమాచేయలా? అని అప్లికేషన్ పేర్కొంటుంది. వినియోగదారుడు గనుక అమౌంట్ లోనికి ప్రవేశించి "బదిలీ(Transfer)" క్లిక్ చేసినప్పుడు, అప్లికేషన్ ఒక నకిలీ అప్ డేట్ స్క్రీన్ ప్రదర్శిస్తుంది. కాబట్టి, బ్యాంక్ ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఫేక్ ఎస్ఎమ్ఎస్, కాల్స్, యాప్స్, వెబ్సైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిస్తుంది. ఏదైన అప్లికేషన్ ప్లే స్టోర్/ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఎవరైనా లేదా ఎక్కడైనా మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం కానీ, నమోదు చేయడం కానీ చేయవద్దు నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ఎప్పుడు మీ ఆర్ధిక వివరాలు ఆడగవని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. -
18 వందల కోట్ల పాస్వర్డ్లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్..!
నేటి టెక్నాలజీ యుగంలో సోషల్మీడియా, ఇతర యూపీఐ యాప్స్, మరికొన్ని యాప్స్లను మనలో చాలా మంది వాడుతుంటాం. మనకు సంబంధించిన ఫోటోలను, డాక్యుమెంట్లను, ఇతర సీక్రెట్ అంశాలను స్మార్ట్ఫోన్లలో, లేదా ఆన్లైన్ యాప్స్లో, ఇతరులనుంచి రక్షణ పొందేందుకుగాను ఆయా యాప్స్కు, ఆన్లైన్ సర్వీసులకు పాస్వర్డ్లను కచ్చితంగా ఏర్పాటుచేస్తాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనో, లేక పిన్తో బలమైన పాస్వర్డ్లను ఏర్పాటుచేస్తాం. చదవండి: భారత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారు ఇదే..! సెకనుకు 579పాస్వర్డ్లపై దాడి..! మనం ఎంత బలమైన పాస్వర్డ్ను ఏర్పాటుచేసిన హ్యాకర్లు వాటిని సులువుగా ట్రేస్ చేసి ఆయా వ్యక్తులు సమాచారాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానోక సందర్భంలో ప్రతి సెకనుకు 579పాస్వర్డ్లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్ తన నివేదికలో పేర్కొంది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్వర్డ్లపై దాడులు జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త వ్యూహం..! పాస్వర్డ్లకు స్వస్తి పలుకుతూ నూతన ఒరవడి సృష్టించాలని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మైక్రోసాఫ్ట్ ముమ్మరం చేస్తోంది. ఇకపై పాస్వర్డ్స్లేకుండా మైక్రోసాఫ్ట్ యాప్స్లో, ఖాతాలో లాగిన్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ దృష్టిసారించింది. పాస్వర్డ్స్లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ అథనిటికేటర్, విండోస్ హలో, లేదా వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ లాగిన్ ఫీచర్ విధానంతో మైక్రోసాఫ్ట్కు సంబంధించిన యాప్స్కు వర్తించేలా చేయనుంది. అందులో ఔట్లూక్ ,వన్డ్రైవ్ , మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్ యాప్స్కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్స్ లేకుంగా లాగిన్ అయ్యే ఫీచర్ను 2019లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్లో కమర్షియల్ యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్లు యూజర్లు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆప్షన్లో, అడిషనల్ సెక్యూరిటీ ఆప్షన్స్లో పాస్వర్డ్లెస్ అకౌంట్ ఆప్షన్ను టర్నఆన్ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ అథనికేటర్ యాప్స్నుంచి వచ్చే ఆన్స్క్రీన్ ప్రామ్ట్స్ తో లాగిన్ అవ్వచును. ఈ ఫీచర్ ప్రస్తుతం కమర్షియల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! -
హ్యాకర్స్ రూట్ మార్చారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు
హ్యాకర్స్ తమ పంథాని మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మాల్ వేర్ సాయంతో సంస్థలపై దాడులు చేసే సైబర్ నేరస్తులు ఇప్పుడు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయా స్కూళ్ల డేటా బేస్లో ఉన్న స్కూల్ చిల్డ్రన్స్ డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాతో సొమ్ము చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే అక్రమ వ్యాపార కార్యకలాపాలకు వేదికగా నిలిచే ‘డార్క్ వెబ్’లో అమ్ముకుంటున్నట్లు నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఈఏడాది 1200స్కూళ్లని టార్గెట్ చేసి.. నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) రిపోర్ట్ ప్రకారం..అమెరికాకు చెందిన ఓ జిల్లా స్కూల్కు చెందిన విద్యార్ధుల వ్యక్తిగత వివరాల్ని మాల్ వేర్ సాయంతో దొంగిలించారు. విద్యార్ధుల పేర్లు, డేటా బర్త్,సోషల్ సెక్యూరిటీ నెంబర్ల(ssn)ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా సైబర్ దాడులతో డబ్బుల్ని డిమాండ్ చేశారని, అలా ఇవ్వలేదనే విద్యార్ధుల వ్యక్తిగత డేటాను డార్కెవెబ్లో అమ్ముకున్నట్లు ఎఫ్బీఐ విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ సైబర్ దాడులతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టీచర్స్ సైతం ఈ సైబర్ దాడులు విద్యార్ధుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా,ఈజీ మనీ ఎర్నింగ్ కోసం హ్యాకర్స్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్ని టార్గెట్ చేయడంతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 1200 స్కూళ్లకు చెందిన కంప్యూటర్లను మాల్ వేర్తో దాడులు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడి ప్రకటన తరువాతే కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఐటీ విభాగాల్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సైబర్ నేరాలపై జరిగే న్యాయ విచారణకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన చేశారో లేదు. హ్యాకర్స్ దాడుల్ని ముమ్మరం చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సాయిధరమ్ తేజ్... చిత్రలహరిలో చెప్పింది ఇదే -
ఐక్యరాజ్య సమితికి సైబర్ సెగ, కీలక సమాచారం హ్యాక్!
ఐక్యరాజ్య సమితిపై సైబర్ ఎటాక్ జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వర్లకు ఉండే రక్షణ వ్యవస్థలను హ్యకర్లు చేధించారు. పలు దేశాల మధ్య జరిగిన చర్చలు, లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అవును నిజమే గుర్తు తెలియని హ్యాకర్లు ఐక్యరాజ్య సమితికి సంబంధించి పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యక్ చేశారని యూఎన సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో హ్యకింగ్ జరిగినట్టు గుర్తించామని, దీనికిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. హ్యకింగ్ ఇలా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనే దానిపై విచారణ కొనసాగుతోంది. యూన్కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉద్యోగికి చెందిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా హ్యకర్లు యూఎన్ సిస్టమ్స్తో అనుసంధానమైనట్టు గుర్తించారు. ఆగస్టు వరకు యూఎన్కి సంబంధించిన సిస్టమ్స్తో యాక్సెస్ సాధించిన హ్యకర్లు ఏప్రిల్ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించారు. అయితే వారు ఏ సమాచారం తస్కరించారు. అందులో భద్రతాపరంగా కీలకమైనవి ఏమైనా ఉన్నాయా ? అనే అంశాలను గుర్తించే పనిలో యూఎన్ భద్రతా సిబ్బంది ఉన్నారు. చదవండి: అశ్లీల వీడియోలకు పరోక్ష కారణం?.. ఎఫ్బీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు -
మీ ఫోన్లో నుంచి ఈ యాప్ వెంటనే తొలగించండి.. ముఖ్యంగా మహిళలు
ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ లో ఉన్న ఒక సెక్యూరిటీ బగ్ వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని బహిర్గతం చేస్తున్నట్లు ఒక భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ బంబుల్ యాప్ లో ఉన్న లోపం ద్వారా హ్యకర్లు దాడి చేసి వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బంబుల్ యాప్ ను ఇప్పటి వరకు కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర డేటింగ్ యాప్స్ కంటే ఈ డేటింగ్ యాప్ సురక్షితం అని మహిళా యూజర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే, వారి అనుమతి లేకుండా ఏ పురుషుడు వారికి మెసేజ్ పంపలేరు. అయితే, తాజాగా ఈ బగ్ బయటపడటంతో మహిళా వినియోగదారులకు ఎక్కువగా హాని కలిగే అవకాశం ఉంది. స్ట్రైప్ సంస్థలో పనిచేసే పరిశోధకులు రాబర్ట్ హీటన్, బంబుల్ యాప్స్ లో ఉన్న బగ్ ను కనుగొన్నారు. ఈ లోపం వల్ల వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బ్లాగ్ పోస్ట్ లో నివేదించారు. ఇందుకు గాను అతనికి $2,000 బహుమతి కూడా లభించింది. సైబర్ క్రిమినల్స్ వినియోగదారుల ఖచ్చితమైన ఇంటి చిరునామాను తెలుసుకోవడానికి, వారి కదలికలను ట్రాక్ చేయడానికి వారు బంబుల్ యాప్ ఉపయోగించేకునే అవకాశం ఉంది అని హీటన్ పేర్కొన్నారు. అందుకే ఈ యాప్ ఉన్న యూజర్లు వెంటనే మీ ఫోన్ నుంచి తొలగించాలని భద్రత నిపుణులు పేర్కొన్నారు.(చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు) -
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
Cyberattacks: ఒకే సంస్ధపై సగటున వారానికి 1,738 సార్లు..!
ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలల్లో పలు సంస్థలపై సైబర్దాడులు గణనీయంగా 29 శాతానికి పెరిగాయి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో సైబర్దాడులు అధికంగా జరిగాయి. యూఎస్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలు సైబర్దాడులకు గురైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ తెలిపింది. ఈ ఏడాదిలో ఆయా సంస్థలపై రాన్సమ్వేర్ దాడుల సంఖ్య 93 శాతం పెరిగిందని చెక్ పాయింట్ పేర్కొంది. చెక్పాయింట్ తన 'సైబర్ ఎటాక్ ట్రెండ్స్: 2021 మిడ్-ఇయర్ రిపోర్ట్' ను గురువారం విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో భాగంగా ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య రంగం, క్లిష్టమైన మౌలిక సదుపాయాలతో సహా అన్ని రంగాల్లోని సంస్థలపై సైబర్దాడులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. టార్గెట్ భారత్ ..! యూఎస్లో17 శాతం మేర సగటున వారానికి 443 సార్లు సైబర్దాడులు జరిగాయి. ముఖ్యంగా యూరప్లో సైబర్దాడులు 27 శాతం పెరుగుదల ఉండగా, లాటిన్ అమెరికాలో వృద్ధి 19 శాతం నమోదైంది. చెక్పాయింట్ తన నివేదిక భారత్పై జరిగిన సైబర్దాడులు ఒక్కింతా విస్మయానికి గురిచేసేలా ఉంది. భారత్కు చెందిన ఒక సంస్థపై గత ఆరునెలల్లో సగటున వారానికి 1,738 సార్లు దాడులను ఎదుర్కొన్నట్లు చెక్పాయింట్ పేర్కొంది. భారత్లో విద్య, పరిశోధన, ప్రభుత్వ, సైనిక, భీమా, చట్టపరమైన, తయారీ రంగాలకు చెందిన, ఆరోగ్య రంగాలకు చెందిన సంస్థలపై గణనీయంగా సైబర్దాడులు జరిగినట్లు చెక్పాయింట్ వెల్లడించింది. హాకర్లకు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే సైబర్దాడులకు భారత్ కీలక లక్ష్యంగా నిలుస్తోందని చెక్పాయింట్ పేర్కొంది. మరింత భీకరమైన దాడులు..! ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్వేర్ దాడుల్లో కూడా గణనీయమైన పురోగతి ఉందని చెక్పాయింట్ తెలిపింది. పలు సంస్థల ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించి, ఆయా సంస్థలు హాకర్లు అడిగినంతా డబ్బు చెల్లించకపోతే బహిరంగంగా డేటాను విడుదల చేస్తామని బెదిరింపులకు రాన్సమ్ వేర్ పాల్పడుతుంది. ఈ ఏడాదిలో రాన్సమ్ వేర్ సోలార్ విండ్స్ సప్లై చెయిన్స్ను లక్ష్యంగా చేసుకొని భారీగా సైబర్దాడులను నిర్వహించాయి. రాన్సమ్వేర్ దాడులను మరింత పెంచడానికి హాకర్లు కొత్త గ్రూప్లను ఏర్పాటు చేయనున్నట్లు చెక్పాయింట్ పేర్కొంది. భవిష్యత్తులో రాన్సమ్వేర్ దాడులు మరింత భీకరంగా ఉంటాయని చెక్పాయింట్ తన నివేదికలో తెలిపింది. -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక..!
ముంబై: చైనాకు చెందిన హాకర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని వారిపై సైబర్దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖాతాదారులకు కెవైసీని అప్డేట్ చేయాలని హ్యకర్లు ఒక వెబ్సైట్ లింక్ పంపుతున్నారని తెలిసింది. అంతేకాకుంగా రూ. 50 లక్షల విలువైన ఉచిత బహుమతులను సొంతం చేసుకోండి అంటూ వాట్సాప్లో ఖాతాదారులకు సందేశాలను పంపుతున్నారు. హ్యకర్లు పంపిన సందేశాలకు రిప్లై ఇస్తే అంతే సంగతులు..! ఖాతాదారుల విలువైన సమాచారాన్ని దోచుకోవడమే కాకుండా డబ్బులను ఖాతాల నుంచి ఊడ్చేస్తారని సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు. న్యూఢిల్లీకి చెందిన థింక్ట్యాంక్ సైబర్పీస్ పౌండేషన్ పరిశోధనా విభాగం, ఆటోబోట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు కొంతమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫిషింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారని వారి అధ్యయనంలో వెల్లడించారు. ఎస్బీఐ ఖాతాదారులకు కెవైసీ ధృవీకరణ చేయాలని చెప్పి, ఫోన్లకు మెసేజ్లను పంపుతున్నారని గుర్తించారు. ఈ మెసేజ్ను ఓపెన్ చేస్తే అధికారిక ఎస్బీఐ ఆన్లైన్ సైట్ పేజీని పోలి ఉన్న వెబ్సైట్ ఓపెన్ అవుతోంది. ఇది యూజర్ మొబైల్ నంబర్కు ఓటీపీని పంపి, ఎంటర్ చేయగానే ఖాతాదారులు వ్యక్తిగత వివరాలను హాకర్లు సేకరిస్తున్నారని ఈ బృందం గుర్తించింది. నకిలీ ఎస్బీఐ వెబ్సైట్తో ఖాతాదారులను దారిమళ్లించి వారి సమాచారాన్ని హాకర్లు పొందుతున్నారు. మరో సందర్భంలో..ఖాతాదారులకు ఆకర్షణీయమైన ఉచిత బహుమతులు అందిస్తామంటూ వాట్సాప్లో సందేశాలను హాకర్లు పంపిస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొంటే రూ. 50 లక్షల విలువైన బహుమతులు మీ సొంతం అంటూ హాకర్లు ఖాతాదారులను దారి మళ్లించి వారి విలువైన సమాచారాన్ని లాగేసుకుంటున్నారని తెలిసింది. కాగా ఎస్బీఐ యూజర్లకే కాకుండా ఐడీఎఫ్సీ, పీఎన్బీ, ఇండస్ఇండ్, కోటక్ బ్యాంక్ ఖాతాదారులపై ఫిషింగ్ స్కామ్ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఎస్మీఐ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఫిషింగ్ కుంభకోణానికి పాల్పడినట్లుగా పరిశోధన బృందం నిర్ధారించింది. -
ఆన్లైన్ అంగట్లో లింక్డిన్ యూజర్ల డేటా..!
వాషింగ్టన్: ఉపాధి ఆధారిత ఆన్లైన్ సేవలను అందించే లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో లీకైనట్లు తెలుస్తోంది. సుమారు 700 మిలియన్ల లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి. హాకర్లు యూజర్ల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారని తెలుస్తోంది. లింక్డిన్ సుమారు 756 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా..సుమారు 92 శాతం వరకు వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో లీకైంది. వినియోగదారుల ఈ మెయిల్, ఫోన్ నంబర్, పనిచేసే ఆఫీసు, పూర్తి పేరు, ఖాతా ఐడీలతో పాటుగా యూజర్ల సోషల్ మీడియా ఖాతాల లింకులు, వ్యక్తిగత వివరాలు లీకైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యూజర్ల సాలరీ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది. కాగా తాజాగా లింక్డిన్ డేటా లీక్పై స్పందించింది. లింక్డిన్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డేటా లీక్ జరగలేదని పేర్కొంది. కానీ ఇతర మ్యాడుల్ నెట్వర్స్క్తో హాకర్లు డేటాను పొందారని లింక్డిన్ తెలిపింది. కాగా డేటా లీక్పై లింక్డిన్ ప్రతినిధులు దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది. కంపెనీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో హాకర్లు ఇతర వనరులను ఉపయోగించి డేటాను పొందారని తెలిపింది. లింక్డిన్ తన యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యూజర్లు తమ ఖాతాలకు కచ్చితంగా 2FA టూ ఫ్యాక్టర్ అథణ్టికేషన్ను ఉండేలా చూసుకోవాలని లింక్డిన్ సూచించింది. సుమారు ఒక మిలియన్ యూజర్ల డేటాను హాకర్లు డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. చదవండి: Reliance: అబుదాబి కంపెనీతో భారీ డీల్ -
Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?!
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ది చెందుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే గాడ్జెట్స్ అంటే మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ వాచెస్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. చదవండి: దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్ ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కానీ వినియోగదారులు ఒక్కోసారి పూర్తిగా అవగాహాన లేకుండా ఫోన్ వినియోగించడంతో హ్యాకర్స్ దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్ఘతం చేసి రోడ్డు కీడ్చుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్ను హ్యాక్ అయ్యేందో? లేదో తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకుందాం. హ్యాక్ అయిన ఫోన్ గుర్తించండి ఇలా!: ♦మీరు ఫోన్ను జాగ్రత్తగానే ఉంచుకుంటారు. కానీ ఒక్కోసారి బ్యాటరీ ఛార్జీంగ్ అయిపోతుంది. అలా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడానికి కారణం హ్యాకింగ్కు గురైందని అర్ధం చేసుకోవాలి. వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకొని, బ్యాటరీ మార్చుకోవాలి. ♦ఒక్కోసారి ఫోన్ డెడ్ అవుతుంటుంది. ఇలాఫోన్ డెడ్ కావడానికి హ్యాకర్లు మాల్ వేర్ ను మన సెల్ ఫోన్ లోకి సెండ్ చేస్తారు. అలా వచ్చిన మాల్ వేర్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ♦ ఒక్కోసారి మీ ఫోన్ నుంచి టెక్ట్స్, కాల్స్ చేయలేరు. అలా వస్తున్నాయంటే సైబర్ నేరస్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లే లెక్క. మాల్ వేర్ సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తుంటారు. మిమ్మల్ని ఏమార్చేందుకు అన్ వాంటెండ్ కాల్స్, మెసేజ్లు సెండ్ చేస్తుంటారు. కావాలంటే మీకు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేయండి. కానీ మీరు గుర్తించలేరు. ♦ మీఫోన్ గూగుల్ క్రోమ్ లో మీకు కావాల్సిన సమచారం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద పాప్ అప్ యాడ్స్ వస్తుంటాయి. యాహు మీరు లక్షల్లో ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు. మీకు ఆఫ్రైజ్ మనీ కావాలంటే మేం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలని రిక్వెస్ట్లు పంపిస్తుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మీకు కాల్స్ వస్తుంటాయి. మీ ఫోన్ కాల్ ఆధారంగా మీజేబును ఖాళీ చేస్తుంటారు. హ్యాకర్స్లో కొంతమంది క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేలా పాప్ అప్ యాడ్స్ పంపుతుంటారు. మీతో బలవంతం క్లిక్ చేసే మీ బ్రెయిన్ ను వాష్ చేస్తుంటారు. కాబట్టి ఇలా యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది ♦ ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్లోకి ఎంటర్ అయ్యాడంటే.. మీ జీమెయిల్, బ్యాంక్ అకౌంట్లలోకి ఈజీగా వెళతాడు.పాస్వర్డ్ను రీసెట్ చేయడం,ఈమెయిల్స్ను పంపుతుంటారు. మీ డేటాను సేకరించి.. మీపేరు మీద క్రెడిట్ కార్డ్ లు తీసుకోవడం. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారు. ఇదిగో ఇలాంటివి సమస్యలు మీకు ఎదురవుతుంటే మీ ఫోన్ ను హ్యాక్ కు గురవుతుందని గుర్తుంచుకోవాలి. -
RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి
ప్రముఖ హ్యాకర్ ఫోరమ్లో భారీ మొత్తంలో పాస్వర్డ్ డేటాను లీక్ చేశారు. ఆ ఫోరమ్ 100జీబీ టెక్స్ట్ ఫైల్ను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఇందులో సుమారు 8.4 బిలియన్ల పాస్వర్డ్లు ఉన్నాయి. ఇందులో గతంలో లీకైన డేటా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లీకైన డేటలో పాస్వర్డ్లు 6-20 అక్షరాల పొడవు ఉన్నాయి. హ్యాకర్స్ పోస్ట్ చేసిన టెక్స్ట్ ఫైల్లో 82 బిలియన్ పాస్వర్డ్లు ఉన్నట్లు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నిపుణులు తెలిపారు. సైబర్ న్యూస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డేటా దాదాపు 8,45 9,060,239గా ఉంది. 100జీబీ టెక్స్ట్ ఫైల్కు అనే ఫోరమ్ యూజర్ 'రాక్యూ 2021(rockyou2021.txt)'గా పేరు పెట్టారు. బహుశా 2009లో రాక్ యూ డేటా పేరుతో లీకైన డేటా కూడా ఉండవచ్చు అని సమాచారం. అందుకే ఈన్ని పాస్వర్డ్లను కలిగి ఉన్న టెక్స్ట్ ఫైల్కు రాక్యూ 2021 అనే పేరు పెట్టవచ్చు. ఆ సమయంలో లీకైన 32 మిలియన్ పాస్వర్డ్లను సోషల్ మీడియా సర్వర్ ల నుంచి హ్యాక్ చేశారు. అలాగే ఆ ఏడాది సమయంలో 3.2 బిలియన్ పాస్వర్డ్లు లీక్ అయ్యాయి. ఇక్కడ రాక్యూ 2021 కూడా పెద్దదని గుర్తించాలసిందే. ఎందుకంటే రాక్ యూ పేరిట ఈ హ్యాకర్స్ గ్రూప్ చాలా డేటాను లీక్ చేశారు. వీరు కొన్ని ఏళ్లుగా ఈ డేటాను సేకరించారు. వాస్తవానికి, ఆన్లైన్లో కేవలం 4.7 బిలియన్ల మంది మాత్రమే ఉంటే, రాక్యూ 2021 పేరుతో విడుదల చేసిన మొత్తం డేటా ప్రపంచ ఆన్లైన్ నెటిజన్ డేటా కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది. మరోసారి ఇంత మొత్తంలో చాలా మంది డేటా లీక్ కావడంతో యూజర్ల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. యూజర్లు తమ వ్యక్తిగత డేటా లీక్ అయిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు తమ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయా? లేదా అనేది చెక్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీ పాస్వర్డ్ హ్యాకింగ్కు గురైతే వెంటనే పాస్వర్డ్లను ఛేంజ్ చేయడం ఉత్తమం అని సైబర్ నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్ -
హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్
రోజు రోజుకి హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ ముసగువీరుల దాటికి సాదారణ వ్యక్తులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యాకర్లకు భారీ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇటీవలు కలోనియల్ పైప్లైన్ కంప్యూటర్లను హ్యాక్ చేసి సుమారు 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హ్యాకర్లు, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం పంపిణీదారు అయిన జెబిఎస్పై సైబర్ దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా వ్యాపార లావాదేవీలు స్తంభించడంతో కంపెనీ వ్యాపారం బాగా దెబ్బతింది. జెబిఎస్ యుఎస్ఎ హోల్డింగ్స్ ఇంక్. సైబర్ క్రైమినల్స్ కు 11 మిలియన్ డాలర్ల(రూ. 80 కోట్ల) చెల్లించినట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రీ నౌగెరా వెల్లడించారు. జెబిఎస్ కంపెనీ అమెరికా దేశ మాంసం సరఫరాలో ఐదవ వంతును ఈ సంస్థే సరఫరా చేస్తుంది. జెబిఎస్పై ఆధారపడే రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, రైతులకు మరింత నష్టం కలగ కుండ ఉండటానికి నగదు చెల్లించాల్సి వచ్చినట్లు బ్రెజిల్ మాంసం సంస్థ జెబిఎస్ యుఎస్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రీ నోగుఇరా చెప్పారు. "నేరస్థులకు డబ్బు చెల్లించడం చాలా బాధాకరం, కాని మేము మా కస్టమర్ల కోసం సరైన పని చేసాము" అని నోగ్యురా బుధవారం ది వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మెజారిటీ జెబిఎస్ ప్లాంట్లు తిరిగి పనిచేస్తున్న తర్వాత ఈ చెల్లింపులు చేసినట్లు ఆయన అన్నారు. ఆస్ట్రేలియా నుంచి దక్షిణ అమెరికా, ఐరోపాకు గొడ్డు మాంసం, పౌల్ట్రీ, పంది మాంసం ప్రాసెస్ చేసి విక్రయించడంలో జెబిఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం సంస్థ. యుఎస్లో ఈ సంస్థ అతిపెద్ద గొడ్డు మాంసం సరఫరా దారుగా ఉంది. అమెరికాలో జెబిఎస్ కంపెనీకి తొమ్మిది గొడ్డుమాంసం ప్రాసెస్ చేసే కర్మాగారాలు ఉన్నాయి. వీటిపై గత వారం రాన్సమ్వేర్ ముఠా ఒకటి సైబర్ దాడి చేసింది. దీంతో ఆయా కర్మాగారాల్లో ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ముఠాతో కూడా రష్యాకు సంబంధాలు ఉండొచ్చని ఎఫ్బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాను ‘రెవిల్’ లేదా ‘సోడినోకిబి’ అంటారు. చదవండి: ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్టాప్ విడుదల -
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కు హ్యాకర్ గ్రూప్ బెదిరింపులు
ప్రముఖ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ లక్ష్యంగా చేసుకొని ప్రపంచ ప్రఖ్యాత హ్యాకర్ గ్రూప్ Anonymous హెచ్చరికలు జారీ చేసింది. ఎలోన్ మస్క్ ను బెదరిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో మస్క్ తన ట్వీట్లతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల జీవితాలను నాశనం చేశాడని ఆరోపిస్తూ టెస్లా సీఈఓను హెచ్చరించింది. మస్క్ ఇటీవల చేసిన కొన్ని ట్వీట్లు సగటు పని చేసే వ్యక్తి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు, అతని "పబ్లిక్ టెంపర్ టాంట్రమ్స్" కష్టపడి పనిచేసే వ్యక్తుల కలలను నాశనం చేస్తున్నట్లు ఈ వీడియోలో పేర్కొంది. టెస్లా సీఈఓ ఇటీవల వేసిన అనేక ఎత్తుగడలను ఈ వీడియోలో వివరించారు. కేవలం కంపెనీ భవిష్యత్ కోసమే ఈ ట్వీట్లు చేస్తునట్లు, క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుకు సంబంధం లేదని ఆరోపించారు. క్రిప్టోకరెన్సీకి సంబందించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పెట్టుబడి పెట్టేవారు ఎవరి చేత ప్రభావం కావొద్దు అని Anonymous హ్యాకర్ గ్రూప్ పేర్కొంది. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు సంబంధించి బిట్కాయిన్ చెల్లింపులను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం కంపెనీ స్వలాభం కోసం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ తయారీ కోసం ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలలో ప్రధానమైన లిథియం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి లిథియం గనులలో చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు ఈ వీడియోలో ప్రస్తావించారు. చదవండి: 5జీ టెక్నాలజీ చాలా సేఫ్: సీఓఏఐ -
Cyber Crime: రెచ్చిపోతున్న హ్యాకర్లు!
విజయవాడ: ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసి వ్యక్తిగత వివరాలు చోరీ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతూ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ ఘటనలు కృష్ణా జిల్లాలో అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. హ్యాకర్లు వ్యూహాత్మకంగా ఫేక్ యుఆర్ఎల్లను పంపి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో వినోదం, సమాచార మార్పిడి కోసం ప్రజలు అత్యధికంగా ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే వ్యక్తులు సగటున రోజుకు 8 నుంచి 10 గంటల వరకు ఫోన్తోనే గడుపుతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. దీనినే ఆసరాగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత సమాచారంతో దోపిడీ ప్రస్తుతం హ్యాకర్లు ఫేస్బుక్ ఖాతాపై కన్నెశారు. నకిలీ యుఆర్ఎల్లను ఫేక్బుక్ ఖాతాలకు/వాట్సప్కు ఆకర్షణీయమైన ఫోటోలతో పంపిస్తున్నారు. సదరు యుఆర్ఎల్ను క్లిక్ చేసిన వెంటనే ఫేస్బుక్ ఖాతా పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆనక మన ఫేస్బుక్ ఖాతా పాస్వర్డ్ మార్చేసి, అందులోని ఫోటోలను సేకరించి, ఫేస్ బుక్ను వారు నడిపిస్తున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని అనేక మంది ఈ నేరాగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫేస్బుక్ ఖాతాకు లాక్ వేయని వారు మాత్రమే సైబర్ నేరగాళ్లకు సులువుగా దొరుకుతున్నారు. హ్యాక్ చేసి డేటా చోరీ చేసిన అనంతరం ఖాతాను పూర్తిగా హ్యాకర్లే నడిపిస్తున్నారు. ఒకసారి ఖాతా హ్యాక్ అయితే ఫోన్లోని ఫేస్బుక్ సమాచారంతో పాటు, వాట్సప్ కాంటాక్ట్ లిస్ట్, ఫోన్ కాంటాక్ట్లిస్ట్, గ్యాలరీలోని కుటుంబ సభ్యుల ఫొటోలతో సహా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అసభ్యకరమైన ఫొటోలను ఖాతాలో పోస్ట్ చేయడం, మీరు అడిగినట్లే మీ బంధువులు, స్నేహితులను మెసేజ్ల ద్వారా డబ్బులు అప్పుగా అడగటం, అభ్యర్థించడం వంటివి చేస్తున్నారు. విషయం తెలుసుకోలేని కొందరు హ్యాకర్లకు లొంగిపోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరహా ఘటనలపై గడిచిన 15 రోజుల్లో 12 కేసులు విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెలుగులోకి రాని కేసులు అనేకం ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే సంప్రదించండి ఫేస్బుక్ అకౌంట్లకు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫేస్బుక్ సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ ఉంటుంది, దానిని ఉపయోగించి ఖాతాను భద్రంగా ఉంచుకోండి. ఫోన్కు వచ్చిన ప్రతి యుఆర్ఎల్ లింక్ను టచ్ చేయవద్దు. నకిలీ యుఆర్ఎల్ అని అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించండి. అకౌంట్ హ్యాక్కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి. – బి.రాజారావు, ఎసీపీ, సైబర్క్రైం, విజయవాడ -
ప్రమాదంలో లక్షల క్వాల్కామ్ స్మార్ట్ఫోన్లు
ప్రముఖ క్వాల్కామ్ సంస్థ కొత్తగా ఉత్పత్తి చేసిన ఫోన్ చిప్లలో ఒక బగ్ కనుగొనబడింది. దీని ద్వారా హ్యాకర్లు సులభంగా స్మార్ట్ఫోన్లు హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఫోన్ వినియోగదారు సంభాషణలు వినడానికి, డేటాను దొంగిలించడానికి, మాల్వేర్లను దాచడానికి క్వాల్కామ్ మోడెమ్లను ఉపయోగించుకోవచ్చని ఆ నివేదికలో తెలిపింది. క్వాల్కామ్ మొబైల్ స్టేషన్ మోడెమ్(ఎంఎస్ఎమ్) 1990ల నుంచి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఎస్ఎంఎస్ ద్వారా ఎంఎస్ఎంను రిమోట్గా హ్యాక్ చేయవచ్చని భద్రతా సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న 30 శాతం స్మార్ట్ఫోన్లపై ఈ బగ్ దోపిడీకి గురిచేస్తుందని పేర్కొంది. హ్యాకర్లు ఒక్కసారి చేస్తే వారు మీరు ఏమి మాట్లాడేది వినడం, సందేశాలను చదవడం స్వంత ప్రయోజనాల కోసం మీ డేటాను, సిమ్ను అన్లాక్ చేయవచ్చు. చెక్ పాయింట్ రీసెర్చ్.. ఈ బగ్ ప్రస్తుతం శామ్సంగ్, గూగుల్, షియోమీ, ఎల్జి తో సహా మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ తయారీదారుల మొబైల్స్ మీద ప్రభావితం చూపనుంది. ప్రపంచ మొత్తం జనాభాలో ప్రస్తుతం 40 శాతం మంది ఈ హాని కలిగించే చిప్స్ గల మొబైల్స్ వాడుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే 30 శాతం ప్రజలు వాడుతున్న ఫోన్లపై దాడులను నిర్వహించడానికి అవసరమైన యాజమాన్య ఇంటర్ఫేస్, క్వాల్కమ్ ఎంఎస్ఎం ఇంటర్ఫేస్(QMI) ద్వారా హ్యాక్ చేసే అవకాశం ఉంది. గతంలో దీనికి సంబందించి భద్రతా సమస్యను క్వాల్కామ్ పరిష్కరించినట్లు అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా 2020 డిసెంబర్ నుంచి వచ్చిన సెక్యూరిటీ పాచ్ ద్వారా ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్కు సంబంధించిన లోపాలపై గూగుల్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. చదవండి: ఈ కంపెనీ కార్లపై రూ.1.5 లక్షల వరకు ధర తగ్గింపు! -
డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు!
మీ ఫోన్ నంబర్ సహాయంతో రిమోట్గా మీ ఖాతాను హ్యకర్లు సస్పెండ్ చేయడానికి అనుమతించే ఒక భద్రత లోపాన్ని ఇటీవల కనుగొన్నట్లు భద్రతా పరిశోధకులు తెలిపారు. రిమోట్ అటాకర్ మీ ఫోన్లో వాట్సాప్ను క్రియారహితం చేసి, దాన్ని తిరిగి యాక్టివేట్ చేయకుండా కొద్దిగంటలసేపు చేయగలరు. ఇలా చేస్తే పెద్ద సంఖ్యలో వాట్సాప్ యూజర్లు భారీ ప్రమాదంలో పడనున్నారు. మీరు మీ వాట్సాప్ ఖాతా కోసం టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. భద్రతా పరిశోధకులు లూయిస్ మార్క్వెజ్ కార్పింటెరో, ఎర్నెస్టో కెనాల్స్ పెరెనా మొదటిసారిగా వాట్సాప్ ఖాతాను రిమోట్గా బ్లాక్ చేసే లోపాన్ని కనుగొన్నారు. భద్రతా పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్లలో ఇన్స్టాల్ చేయబడిన వాట్సాప్లో మీ ఫోన్ నంబర్ను నమోదు చేయడానికి అనుమతిస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్లో లభించే ఆరు అంకెల రిజిస్ట్రేషన్ కోడ్ను పొందకపోతే వారు మీ ఖాతాలో లాగిన్ కావడానికి అవకాశం ఉండదు. కానీ, వారికి కూడా కావాల్సింది కూడా అదే. మీ ఫోన్ నంబర్ను ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నించి తర్వాత వారి ఫోన్లో 12 గంటలు పాటు వాట్సాప్లోని కోడ్ ఎంట్రీలను కూడా బ్లాక్ చేస్తుంది. దీని తర్వాత వారు మీ ఫోన్ నంబర్ను యాప్ నుంచి బ్లాక్ చేయడానికి వాట్సాప్ సపోర్ట్ తీసుకొంటారు. వారికి కావలసింది క్రొత్త ఇమెయిల్ చిరునామా, ఫోన్ దొంగిలించబడిందని లేదా పోయిందని పేర్కొన్న సాధారణ ఇమెయిల్. ఆ ఇమెయిల్కు ప్రతిస్పందనగా, దాడి చేసేవారు వారి చివర నుంచి త్వరగా అందిస్తారని ధృవీకరించడానికి వాట్సాప్ అడుగుతుంది. ఇలా మీ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేస్తారు. అంటే మీరు ఇకపై మీ ఫోన్లో వాట్సాప్ యాప్ యాక్సెస్ చేయలేరు. హ్యాకర్ పంపిన ఈ-మెయిల్ ద్వారా మీ ఖాతా బ్లాక్ చేయబడుతుంది. మీ వాట్సాప్ ఖాతాలో టూ-స్టెప్-వెరిఫికేషన్ ఏమి చేయలేరు. సాధారణ సందర్భంలో మీరు మీ ఫోన్ నంబర్ను ధృవీకరించడం ద్వారా మీ వాట్సాప్ ఖాతాను తిరిగి ఆన్ లాక్ చేయవచ్చు. కానీ, మీ వాట్సాప్ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి అనేక విఫల ప్రయత్నాలు చేయడం వల్ల దాడి చేసిన వ్యక్తి ఇప్పటికే 12 గంటలు ఖాతాను లాక్ చేసి ఉంటే ఇది సాధ్యం కాదు. మీ ఫోన్ నంబర్లో కొత్త రిజిస్ట్రేషన్ కోడ్ను 12 గంటలు వరకు పొందకుండా పరిమితం చేయబడతారని అర్థం. ఇలా మళ్లీ 12 గంటల తర్వాత హ్యాకర్లు చేస్తే చాలా ప్రమాదం. వారు ఇలా చేయకుండా ఉండటానికి డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. అయితే, మీరు సమస్యను తప్పించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసే సమయంలో ఇచ్చిన మెయిల్ ద్వారా తిరిగి మీ ఖాతాను పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ లోపాన్ని సరిదిద్దడానికి చేస్తుందా? లేదా అనే దానిపై వాట్సాప్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఎవరైనా ఈ లోపాన్ని ఉపయోగించారా? లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. చదవండి: 10 కోట్లు దాటిన భారత్పే యూపీఐ లావాదేవీలు -
మొబీక్విక్ వినియోగదారులకు షాక్: భారీగా డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్ యూజర్లకు షాకింగ్ న్యూస్. లక్షలమంది మొబీక్విక్ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్వెబ్లో అమ్మకాని పెట్టారన్న వార్తలు మొబీక్విక్ వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది. 37 మిలియన్ల ఫైళ్లు, 3.5 మిలియన్ల వ్యక్తుల కెవైసీ వివరాలు, 100 మీలియన్ల ఫోన్ నంబర్లు, ఇమెయిళ్ళు, పాస్వర్డ్లు, జియోడేటా, బ్యాంక్ ఖాతాలు,సీసీ డేటా ఉన్నాయనే అంచనాలు యూజర్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. సుమారు 3.5 మిలియన్ల మంది డేటాను డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచినట్లు భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. కేవైసీ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటా ఇతర తదితరాలు హ్యాకింగ్ గురయ్యాయని, డార్క్ వెబ్ లింక్లో ఈ లీక్ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో నిధుల సమీకరణలో భాగంగా భారీ ఐపీఓకి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ డేటాబ్రీచ్ వార్తలతో మొబీక్విక్ ఇబ్బందుల్లో పడింది. ఫిబ్రవరిలో భద్రతా పరిశోధకుడు రాజ్శేఖర్ రాజహరియా ఈ లీక్ను మొదటిసారి నివేదించారు. ఫిబ్రవరి 26 న లీక్ వివరాలను ట్వీట్ చేశారు: “11 కోట్ల మంది భారతీయ కార్డ్ హోల్డర్ల కార్డ్ డేటా, వ్యక్తిగత వివరాలు, కెవైసి సాఫ్ట్ కాపీ (పాన్, ఆధార్, మొదలైనవి) భారతదేశంలోని కంపెనీ సర్వర్ నుండి లీక్ అయినట్లు తెలిపారు. మొబీక్విక్కు సంబంధించి నో-యు-కస్టమర్ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటాతో సహా 8.2 టెరాబైట్ల (టీబీ) డేటా చోరీ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి స్క్రీన్షాట్లను కూడా ఆయన పోస్ట్ చేశారు. 1.5 బిట్ కాయిన్ లేదా 86,000 డాలర్లకు ఈ డేటాను విక్రయానికి పెట్టినట్టు సమాచారం. “బహుశా చరిత్రలో అతిపెద్ద కేవైసీ డేటా లీక్.అభినందనలు మొబీక్విక్...’ అంటూ మరోహ్యాకర్ ఇలియట్ హ్యాండర్సన్ కూడా ట్వీట్ చేశారు. లీక్ అయిన డేటాలో ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ, కేవైసీ వివరాలున్నాయి కాబట్టి స్కామర్లకు ఈజీగా యాక్సెస్ లభిస్తుందని స్వతంత్ర భద్రతా పరిశోధకుడు ఇంద్రజీత్ భూయాన్ వ్యాఖ్యానించారు. Indian payment systems giant "Mobikwik" allegedly suffered what may be considered the largest KYC data leak in history. Over 37m files, KYC of 3.5m individuals, and a whopping 100m phone numbers, emails, passwords, geodata, bank accounts & CC data.@MobiKwik pic.twitter.com/dCFqTHEv1F — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) March 28, 2021 Probably the largest KYC data leak in history. Congrats Mobikwik... pic.twitter.com/qQFgIKloA8 — Elliot Alderson (@fs0c131y) March 29, 2021 యూజర్ల డేటా సేఫ్గా ఉంది : మొబీక్విక్ అయితే ఈ వార్తలను మొబీక్విక్ ఖండించింది. తమ సెక్యూరిటీ సిస్టంలోఎలాంటి లోపాలులేవని స్పష్టం చేసింది.దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, తమ వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని మోబిక్విక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. భద్రతా పరిశోధకులు అని పిలవబడే కొంతమంది సృష్టిస్తున్న పుకార్లని కొట్టిపాడేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో 200-250 మిలియన్ డాలర్లను సమీకరించడానికి ఐపీఓకు రావాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
సైబర్ నేరగాళ్ళు.. పోలీసులకే టోకరా!
దామెర: సామాన్య ప్రజల ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు లాగుతున్న సైబర్ నేర గాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీసులనే టార్గెట్ చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా దామెర పోలీస్స్టేషన్ (ఎస్హెచ్ఓ) పేరుతో గతంలో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచారు. అయితే, ఆదివారం రాత్రి ఈ అకౌంట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బు పంపాల్సిందిగా పలువురిని మెసెంజర్ ద్వారా కోరారు. ఈ విషయాన్ని స్థానికులు కొందరు గుర్తిం చి ఎస్సై భాస్కర్రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఆయన తాము ఎవరినీ డబ్బు అడగలేదని, అపరిచితులు ఎవరైనా డబ్బులు అడిగితే పంపవద్దని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ అకౌంట్ హ్యాక్ అయిన విషయం వాస్తవమేనని తెలిపారు. -
ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయండి
మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా, పదే పదే ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా. అయితే, మీరు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకోండి. కొన్ని యాప్స్ మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, ఆధార్, పాన్ నెంబర్స్ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును ఖాళీ చేసే అవకాశం ఉన్నట్లు బీజీఆర్ తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఆ నివేదికలో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ వివరాలు బహిర్గతం చేసింది. వీటి వల్ల సైబర్ క్రైమ్లు జరిగే ఆస్కారం ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. మీ ఫోన్లో కనుక ఈ కింద తెలిపిన యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేక్ వీపీఎన్ (Cake VPN) పసిఫిక్ వీపీఎన్ (Pacific VPN) ఈవీపీఎన్ (eVPN) బీట్ప్లేయర్ (BeatPlayer) క్యూర్/బార్కోడ్ స్కానర్ మ్యాక్స్ (QR/Barcode Scanner MAX) మ్యూజిక్ ప్లేయర్ (Music Player) టూల్టిప్నేటర్లైబ్రరీ (tooltipnatorlibrary) క్యూరికార్డర్ (QRecorder) -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక!
న్యూ ఢిల్లీ: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? అయితే మీరు కొంచెం జర జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్లు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసుకొని వల విసురుతున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్బీఐ అధికారులు తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు రూ.9,870 విలువైన ఎస్బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్స్ మెసేజ్లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్లో ఉన్న లింకుపై క్లిక్ చేసి పాయింట్లు రిడీమ్ చేసుకోవాలని మోసగాళ్లు ఎస్బీఐ కస్టమర్లకు మెసేజ్ పంపుతున్నట్లు న్యూ ఢిల్లీకి చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ తెలిపింది. మొబైల్ కు వచ్చిన మెసేజ్ ను క్లిక్ చేసినట్లయితే మీకు నకిలీ వెబ్సైట్కు ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ల్యాండింగ్ పేజీలో పాయింట్లు రిడీమ్ చేసుకోవడానికి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇ-మెయిల్, పుట్టిన తేదీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఎంపిన్ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సమర్పించాలని కోరుతుంది. ఇందులో మీరు కనుక ఎస్బీఐ విరాలను సమర్పిస్తే ఇక అంతే సంగతులు మీ డేటాను మోసగాళ్లు తస్కరించి మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కొట్టేస్తారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్లో ఉండే ఎస్బీఐ కస్టమర్లను మోసగాళ్లు టార్గెట్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందువల్ల మీరు ఇలాంటి మెసేజ్లతో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ భారీగా పడిపోయిన బంగారం ధరలు -
భారత టీకాపై చైనా హ్యాకర్ల దృష్టి
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బీజింగ్: కోవిడ్–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది. ‘ఏపీటీ 10’, ‘స్టోన్ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని పేర్కొంది. ‘భారత్ బయోటెక్’, ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలున్న సైఫర్మా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కోవిడ్–19 టీకాల్లో దాదాపు 60% భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ –19 వ్యాక్సిన్ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్కు పాల్పడుతోందని సైఫర్మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రితేశ్ తెలిపారు. వారి ప్రధాన లక్ష్యం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలు పంచుకుంటున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానేనన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ పబ్లిక్ సర్వర్లు బలహీనమైన వెబ్ సర్వర్లపై ఆధారపడి ఉన్నాయని వారు గుర్తించారని రితేశ్ తెలిపారు. సైఫర్మా వెల్లడించిన ఈ విషయాలపై సీరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, భారత్ బయోటెక్ కానీ స్పందించలేదు. చైనా విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. పవర్ గ్రిడ్ వ్యవస్థపై దాడి కూడా చైనా పనే భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్లో కీలకమైన పవర్ గ్రిడ్ వ్యవస్థను మాల్వేర్తో చైనా హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన మరో సంస్థ తాజాగా వెల్లడించింది. దాంతో, గత సంవత్సరం ముంబైలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో భారీ ఆటంకానికి హ్యాకింగే కారణమనే అనుమానాలు తాజాగా తలెత్తాయి. చైనా ప్రభుత్వంతో సంబంధమున్న ‘రెడ్ఎకో’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను పలుమార్లు లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైబర్ నిఘా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ తాజాగా వెల్లడించింది. 2020 జూన్ నుంచి పలుమార్లు 10 ముఖ్యమైన భారతీయ విద్యుత్ సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారంది. రెండు నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ‘ప్లగ్ ఎక్స్ మాల్వేర్ సీ2’ ద్వారా రక్షణ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. కాగా, భారత ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’ పనితీరుపై ఎలాంటి మాల్వేర్ దాడి ప్రభావం చూపలేదని, సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని విద్యుత్ శాఖ ప్రకటించింది. మాల్వేర్ కారణంగా ఎలాంటి డేటాను కోల్పోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, ‘రికార్డెడ్ ఫ్యూచర్’ ఆరోపణలను చైనా ఖండించింది. భారత పవర్ గ్రిడ్ను ఆటంకపరిచే హ్యాకింగ్ చర్యల్లో తమ పాత్ర ఉందన్న ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తోసిపుచ్చారు. అక్టోబర్ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. -
చైనా వక్రబుద్ది: టార్గెట్ కోవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: గతేడాది ముంబైలో సంభవించిన భారీ పవర్ కట్ వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉందనే వార్తను చదివాం. తాజాగా డ్రాగన్ దేశం మరో నీచానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిన్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. అంతేకాక ఇప్పటికే పలు దేశాలకు కేంద్రం మన వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. ఇక చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అంత సమర్థవంతమైంది కాదని ఆ దేశానికి చెందిన పలువురు పరిశోధకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా హ్యాకర్లు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ల ఐటీ సిస్టమ్ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారట. ఈ విషయాన్ని సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్మాన్ సాచ్స్ మద్దతుగల సైఫిర్మా అనే కంపెనీ వెల్లడించింది. చైనీస్ హ్యాకింగ్ కంపెనీ యాప్ట్10 అలియాస్ స్టోన్ పాండ అనే కంపెనీ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కంపెనీల ఐటి మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్వేర్లను హ్యాక్ చేసేందుకు యత్నించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ రేసులో భారత ఫార్మ కంపెనీలను ఢీకొట్టడం.. వాటి మేధో సంపత్తిని నిర్మూలించడం ఈ హ్యాకర్ల ముఖ్య ఉద్దేశం అని సైఫిర్మా వెల్లడించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనికాతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనుంది సీరం. ఈ నేపథ్యంలో చైనా యాప్ట్10 సీరంని టార్గెట్ చేసి.. వ్యాక్సిన్కు సంబంధించిన డాటాను కొల్లగొట్టేందుకు యత్నించినట్లు సైఫిర్మా తెలిపింది. యాప్ట్10 అనేది చైనీస్ మినిస్ట్రి ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో కలిసి పని చేస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 2018లో వెల్లడించింది. "సీరం ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే, వారు బలహీనమైన వెబ్ సర్వర్లను నడుపుతున్నారు. వారి పబ్లిక్ సర్వర్లు చాలా బలహీనంగా ఉన్నాయి.. ఇవి హాని కలిగించే వెబ్ సర్వర్లు. యాకర్లు ఈ బలహీనమైన వెబ్ అప్లికేషన్, కంటెంట్-మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా భయంకరమైనది’’ అని సైఫిర్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందన కోరగా.. ఎలాంటి సమాధానం లభించలేదు. అలానే సీరం, భారత్బయోటెక్లు కూడా దీనిపై స్పందిచలేదు అన్నారు. భారతదేశం, కెనడా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా,అమెరికాలోని కోవిడ్ వ్యాక్సిన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని రష్యా, ఉత్తర కొరియా నుంచి సైబర్ దాడులు జరిగినట్లు మైక్రోసాఫ్ట్ నవంబర్లో తెలిపింది. ఉత్తర కొరియా హ్యాకర్లు బ్రిటిష్ ఔషధ తయారీదారు అస్ట్రాజెనీకా వ్యవస్థల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ నివేదించింది. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ ముంబై పవర్కట్: డ్రాగన్ పనే! -
ముంబై పవర్కట్: డ్రాగన్ పనే!
న్యూఢిల్లీ: గతేడాది దేశ ఆర్థిక రాజధాని ముంబై వ్యాప్తంగా భారీ పవర్ కట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారి అజాగ్రత్త వల్లనో.. లేక మరే ఇతర కారణాల వల్లనో ఈ పవర్ కట్ సంభవించి ఉంటుందని భావించారు జనాలు. కానీ వాస్తవం ఇది కాదట. నాటి ముంబై పవర్ కట్ వెనక చైనా హ్యాకర్లు ఉన్నారట. ఈ విషయాన్ని ఓ అమెరికన్ సంస్థ వెల్లడించింది. డ్రాగన్ దేశం సరిహద్దుల్లోనే కాక మన దేశంలోకి కూడా తొంగి చూస్తోందనే వార్త ప్రస్తుతం ఆందోళనలు రేకెత్తిస్తోంది. కాగా గతేడాది సరిహద్దు ఉద్రిక్తత సమయంలోనే చైనా ఈ కుతంత్రానికి పాల్పడినట్లు తెలుస్తోంది.. ఆ సమయంలో డ్రాగన్.. మన దేశ విద్యుత్తు రంగంపై గురిపెట్టిందని.. మన ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు సంస్థల కంప్యూటర్ నెట్వర్క్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూప్లు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన సదరు సంస్థ వెల్లడించింది. గతేడాది అక్టోబరు 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా స్తంభించి అనేక రైళ్లు, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, స్టాక్ మార్కెట్ లావాదేవీలు వంటి తదితర కార్యక్రమాలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ కరెంట్ కట్కు.. సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఉద్రిక్తతల సమయంలో భారత పవర్గ్రిడ్పై చైనా సైబర్ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా ‘ముంబయి పవర్కట్’తో హెచ్చరించిందని సదరు సంస్థ తెలిపింది. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్ఎకో గ్రూప్ అనే సంస్థ భారత్లోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్ డిస్ప్యాచ్ సెంటర్లు, విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఐపీ అడ్రస్ల ద్వారా విద్యుత్ సరఫరాను నిర్వహించే కంట్రోల్ సిస్టమ్స్లోకి సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ప్రవేశపెట్టినట్లు రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక పేర్కొంది. మహారాష్ట్రలోని పద్గాలో గల లోడ్ డిస్పాచ్ సెంటర్లో ఈ మాల్వేర్ కారణంగానే సాంకేతిక లోపం తలెత్తిందని, ఇది ముంబయిలో భారీ పవర్కట్కు దారితీసిందని అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ.. చైనాలో తయారయ్యే విద్యుత్ పరికరాల్లో మాల్వేర్ ఉందేమో అన్న అంశంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఆయన ఈ విషయం చెప్పిన కొన్ని నెలలకే ముంబయిలో గ్రిడ్ విఫలం కావడం గమనార్హం. కాగా.. సరిహద్దు వివాదానికి తెరదించేలా ఇటీవల భారత్, చైనా కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పాంగాంగ్ సరస్సు వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. ఇలాంటి సమయంలో ఈ అధ్యయనం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: ఢిల్లీ ఓటమి.. అందుకే ముంబైలో పవర్ కట్! ఆ వ్యూహం మా దగ్గర పని చేయదు: నరవాణే -
ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ
బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్ఫోన్ స్క్రీన్ వంటి వాటికీ పాస్వర్డ్ ఎంత కఠినంగా ఉంటే మన ఖాతాలు అంత భద్రంగా ఉంటాయి. కానీ చాలా మంది అటు తిప్పి, ఇటు తిప్పి ఇంతక ముందు ఉపయోగించిన పాస్వర్డ్ లను వాడుతుంటారు. దీనివల్ల వారు హ్యాకింగ్ భారీన పడే అవకాశం ఉంది. అందుకే భద్రత నిపుణులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ లను మార్చుకోవాలని సూచిస్తుంటారు. ఎక్కువ శాతం ప్రజలు సులభంగా గుర్తు పెట్టుకోవడానికి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, బండి నెంబర్, క్రీడలు, ఆహారం, ప్రదేశాలు, జంతువులు లాంటి వాటిని పాస్వర్డ్స్గా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పాస్వర్డ్స్తో ప్రమాదం చాలా ఎక్కువ. మీ ఖాతాలను కొల్లగొట్టడానికి హ్యాకర్లకు పెద్ద కష్టం కాదు అని గుర్తు ఉంచుకోవాలి. సులభంగా గుర్తు ఉంటాయని పెట్టుకున్నపాస్వర్డ్స్ హ్యాకింగ్ గురి అవుతున్నాయి. డార్క్ వెబ్లో ఎక్కువగా కనిపించే పాస్వర్డ్స్తో ఈ జాబితాను రూపొందించి టెక్ నిపుణులు రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని వర్గాలుగా విభించిన ఎక్కువ శాతం మంది ఉపయోగించిన డార్క్ వెబ్లో కనిపించే అత్యంత సాధారణ పాస్వర్డ్లు ఇక్కడ ఉన్నాయి. పేర్లు: మాగీ క్రీడలు: బేస్ బాల్ ఆహారం: కుకీ స్థలాలు: న్యూయార్క్ జంతువులు: నిమ్మకాయ ప్రసిద్ధ వ్యక్తులు/పాత్రలు: టిగ్గర్ మీ పాస్వర్డ్ క్రింద సూచించిన వాటిలో ఉంటే తక్షణమే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి క్యాప్స్, స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్వర్డ్లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్పాస్ సూచిస్తుంది. అలాగే ప్రపంచంలో ఎక్కువగా డార్క్ వెబ్లో కనిపించే అత్యంత పాస్వర్డ్లు ఇక్కడ ఉన్నాయి. 1) 123456 2) password 3) 12345678 4) 12341234 5) 1asdasdasdasd 6) Qwerty123 7) Password1 8) 123456789 9) Qwerty1 10) 12345678secret 11) Abc123 12) 111111 13) stratfor 14) lemonfish 15) sunshine 16) 123123123 17) 1234567890 18) Password123 19) 123123 20) 1234567 -
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కు హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 25 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. కేవలం అక్కడితో ఆగకుండా ఆ సమాచారాన్ని అమ్మకానికి ఉంచడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం ఎయిర్టెల్ సిమ్ కార్డులను వాడుతున్న వారి చిరునామా, నగరం, ఆధార్ కార్డ్ నంబర్, లింగ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు టెలిఫోన్ నంబర్లను కొందరు హ్యాకర్లు ఎయిర్టెల్ సెర్వర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా దొంగలించారు.(చదవండి: రిలయన్స్ జోరుకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్!) అయితే, భారతదేశంలోని ఎయిర్టెల్ వినియోగదారులందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని వారి డేటాను విక్రయించాలనుకుంటున్నట్లు హ్యాకర్లు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజ్శేఖర్ రాజహర్యా ఈ సమాచారాన్ని వెల్లడించారు. హ్యాకర్లు ఎయిర్టెల్ భద్రతా బృందాలను బ్లాక్ మెయిల్ చేసి 3500 డాలర్లు విలువైన బిట్కాయిన్ల వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ డీల్ విఫలం అయ్యేసరికి హ్యాకర్లు వారి వెబ్సైట్లో డేటాను అమ్మకానికి ఉంచారు. దాని కోసం ఒక వెబ్సైట్ను సృష్టించారు. దొంగలించిన డేటాలో ఎక్కువ శాతం జమ్మూ&కాశ్మీర్ ప్రాంతంలోని చందాదారులవి అని తెలుస్తుంది.(చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం?) Another Big Data Breach? A Hacker Group alleged uploaded "shell" in @airtelindia Server. Now selling all India Airtel subscribers data including Aadhaar Number. Posted 2.5 Million as sample data. (in Jan 2021)#InfoSec #DataLeak #GDPR #databreaches #dataprotection #DataPrivacyDay pic.twitter.com/uxWopfKU0M — Rajshekhar Rajaharia (@rajaharia) February 2, 2021 ఈ వ్యవహారాన్ని రాజశేఖర్ రాజహర్యా అనే ఇంటర్నెట్ సెక్యురిటీ రీసెర్చర్ బయటపెట్టారు. తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశాడు. దీనిపై ఎయిర్టెల్ ప్రతినిధులు స్పందించారు. "ఎయిర్టెల్ తన వినియోగదారుల ప్రైవసీని కాపాడటానికి అనేక రకాల చర్యలను తీసుకుంటుందని.. తమ వద్ద నుంచి ఎలాంటి డేటా బయటకి లీక్ కాలేదని" ఎయిర్టెల్ తెలిపింది. -
అమెరికాను గడగడలాడించిన హ్యాకర్?
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం మనం ఊహించని దానికంటే వేగంగా విస్తరిస్తుంది. దీంతో మనకు మేలు ఎంతో జరుగుతుందో అంతకంటే ఎక్కువ కీడు జరుగుతుంది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం చాలా మంది నెటిజెన్స్ చిన్న చిన్న తప్పుల కారణంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లకు ఇంకొక పేరు హ్యాకర్స్. వీరి పేరు చెబితే సాదారణ ప్రజల నుంచి ప్రభుత్వాలు, దిగ్గజ ఐటీ కంపెనీలు వరకు ఇలా అందరూ వణికిపోతున్నారు. అంతలా ఉంది వీరి ప్రభావం మన అందరిమీద. ఇప్పుడు క్రైమ్ కేసులలో ఎక్కువగా సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3) ప్రస్తుతం మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అని దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. హ్యాకింగ్ చాలా ఏళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం మన 3జీ నెట్వర్క్ వచ్చినప్పటి నుంచే భాగా పెరిగి పోయింది. 3జీ రాకముందు హ్యాకర్స్ పెద్ద పెద్ద కంపెనీలను, ధనవంతులను, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఎక్కువ శాతం వారి ఖాతాలను హ్యాక్ చేసేవారు. కానీ ఈ 3జీ, 4జీ వచ్చాక ఇప్పుడు సాదారణ ప్రజలు కూడా ఎక్కువ శాతం హ్యాకింగ్ భారీన పడుతున్నారు. అందుకే సైబర్ నిపుణులు ఆన్లైన్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చాలా మంది హ్యాకర్స్ 2000 సంవత్సరం తర్వాత పుట్టుకొచ్చారు. కానీ ఒక హ్యాకర్ మాత్రం 1980 నుంచి 2000 వరకు ఈ ప్రపంచాన్ని వణికించాడు. ఇతను ప్రపంచంలోని ఐబీఎమ్, మోటోరోలా, నోకియా వంటి 40కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేశాడు. అలాగే ప్రపంచాన్ని వణికించిన మాఫియా డాన్ లకు చుక్కలు చూపించాడు. అసలు అతని పేరు చెబితే అమెరికా ప్రభుత్వం వణికిపోయేది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అతని ఎవరో కాదండీ కెవిన్ మిట్నిక్. మీరు ఇతని పేరు ఇప్పటి వరకు వినలేక పోవచ్చు. కెవిన్ మిట్నిక్ బాల్యం: కెవిన్ మిట్నిక్ కాలిఫోర్నియాలోని వన్ నుయ్స్(Van Nuys)లో 1963 ఆగస్టు 6న జన్మించాడు. ఇతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లోని జేమ్స్ మన్రో హైస్కూల్లో విద్యాభ్యాసం గడించాడు. ఆ సమయంలో అతను ఔత్సాహిక రేడియో ఆపరేటర్ అయ్యాడు. తర్వాత అతను లాస్ ఏంజిల్స్ పియర్స్ కాలేజీలో చేరాడు. కొంతకాలం, అతను స్టీఫెన్ ఎస్. వైజ్ టెంపుల్లో రిసెప్షనిస్ట్గా పనిచేశాడు.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!) కెవిన్ మిట్నిక్ మొదటి కంప్యూటర్ హ్యాకింగ్: కెవిన్ మిట్నిక్ 12 సంవత్సరాల వయస్సులో లాస్ ఏంజిల్స్ బస్సు వ్యవస్థలో ఉపయోగించే పంచ్ కార్డ్ వ్యవస్థను హ్యాక్ చేయడానికి సోషల్ ఇంజనీరింగ్, డంప్స్టర్ డైవింగ్ అనే టెక్నిక్ ఉపయోగించాడు. “స్కూల్ ప్రాజెక్ట్” కోసం తన సొంత టికెట్ పంచ్ ఎక్కడ కొనవచ్చో చెప్పమని ఒక బస్సు డ్రైవర్ను కోరాడు. ఇలా అతను బస్సు కంపెనీ పక్కన ఉన్న డంప్స్టర్లో దొరికిన ఉపయోగించని బదిలీ స్లిప్లను ఉపయోగించి లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ప్రయాణించేవాడు. ఇది అతని మొదటి హ్యాకింగ్ అనే చెప్పుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో ఇతరుల పేర్లు, పాస్వర్డ్లు, మోడెమ్ ఫోన్ నంబర్లతో సహా సమాచారాన్ని పొందేవాడు. మిట్నిక్ మొట్టమొదట కంప్యూటర్ నెట్వర్క్కు సంబందించి 1979లో హ్యాక్ చేశాడు. తన 16 ఏళ్ళ వయసులో ఒక స్నేహితుడు కంప్యూటరు సహాయంతో ఆర్ఎస్టిఎస్/ఇ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్(డిఇసి) కంప్యూటర్ నెట్వర్క్లోకి ప్రవేశించి, కంపెనీ సాఫ్ట్వేర్ను కాపీ చేశాడు. ఈ నేరానికి గాను 1988లో12 నెలల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే మూడు సంవత్సరాల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న కూడా మిట్నిక్ పసిఫిక్ బెల్ వాయిస్ మెయిల్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీంతో మళ్లీ అతని మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే పోలీసులకు దొరకాకుండా రెండున్నర సంవత్సరాలు పరారీలో ఉన్నాడు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!) అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, పోలీసులకు కెవిన్ మిట్నిక్ ఒక పెద్ద తల నొప్పిగా మారిపోయాడు. మిట్నిక్ డజన్ల కొద్దీ కంప్యూటర్ నెట్వర్క్లలో ప్రవేశించేవాడు. అతను తన స్థానాన్ని కనిపెట్టకుండా ఉండటానికి క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లను ఉపయోగించేవాడు. దేశంలోని అతిపెద్ద సెల్యులార్ టెలిఫోన్, కంప్యూటర్ కంపెనీల నుంచి విలువైన సమాచారాన్ని, సాఫ్ట్వేర్ను కాపీ చేశాడు. ఇతర కంప్యూటర్ నెట్వర్క్లను మార్చేవాడు, ప్రైవేట్ ఇ-మెయిల్లను రహస్యంగా చదివేవాడు. ఒకానొక సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద డాన్ ల ఫోన్ లను హ్యాక్ చేసి వారికీ చుక్కలు చూపించాడు. కెవిన్ మిట్నిక్ అరెస్ట్, జైలు శిక్ష కెవిన్ మిట్నిక్ 1995లో అమెరికాలోని 40 అతిపెద్ద కంపెనీలను హ్యాకింగ్ చేశాడు. వీటిలో ఐబిఎం, నోకియా మరియు మోటరోలా ఉన్నాయి. ఇలా రోజు రోజుకి అమెరికా ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని అతని పట్టించిన వారికి భారీ బహుమతి అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 15, 1995న ఎఫ్బిఐ నార్త్ కరోలినాలోని రాలీలోని తన అపార్ట్మెంట్ లో మిట్నిక్ ను అరెస్టు చేసింది. రెండున్నర సంవత్సరాల కంప్యూటర్ హ్యాకింగ్ కు సంబంధించిన అనేక నేరాలు అతని మీద ఉన్నాయి. అతను క్లోన్ చేసిన సెల్యులార్ ఫోన్లు, 100కి పైగా క్లోన్ సెల్యులార్ ఫోన్ కోడ్లు వంటివి అతనిని అరెస్టు చేసే సమయంలో కనుగొన్నారు.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) 1997 డిసెంబర్ లో యాహు! వెబ్సైట్ హ్యాక్ చేయబడింది క్రిస్మస్ దినోత్సవం నాటికి మిట్నిక్ విడుదల చేయాలి లేకపోతే ఇంటర్నెట్ “విపత్తు”ను సృష్టిస్తామని ఒక మెసేజ్ భాగా అప్పుడు వైరల్ అయ్యింది. యాహు! మాత్రం కేవలం ఇది ప్రజలను భయపెట్టడానికి మాత్రమే అని పేర్కొంది. మిట్నిక్పై వైర్ మోసం, ఎలక్ట్రానిక్ సమాచార మార్పిడి, ఫెడరల్ కంప్యూటర్ను హ్యాక్ చేయడం వంటి ఆరోపణలపై తనపై ఉన్నాయి. 1999లో లాస్ ఏంజిల్స్లోని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ముందు చివరకు చట్టవిరుద్ధంగా చేసిన తప్పులను అంగీకరించాడు. గతంలో కంప్యూటర్ మోసానికి 1989లో పోలీసుల పర్యవేక్షణ నుంచి పారీపోయినందుకు 22 నెలల జైలు శిక్ష, తర్వాత చట్టవిరుద్దంగా చేసిన తప్పులకు అతని మీద 46 నెలల జైలు శిక్ష విధించబడింది. మిట్నిక్ ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ జనవరి 21, 2003లో అతను పోలీసుల పర్యవేక్షణ నుంచి విడుదల అయ్యాడు. తన విడుదల అయ్యాక కూడా ఇంటర్నెట్ వాడకూడదు అనే నిబంధన ఉండేది. కమ్యూనికేషన్ కోసం కేవలం ల్యాండ్లైన్ టెలిఫోన్ వినియోగించాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఈ విషయంలో స్థానిక కొర్టులో కెవిన్ మిట్నిక్ పోరాడారు. చివరికి అతనికి అనుకూలంగా ఒక తీర్పును వచ్చిన తర్వాత ఇంటర్నెట్ను యాక్సెస్ వాడుకోవడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం కెవిన్ మిట్నిక్ ప్రపంచంలోని గూగుల్, ఫేస్బుక్ వంటి అతిపెద్ద కంపెనీలకు టాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. దీనికి గాను అతను అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు. -
వ్యాక్సిన్ పంపిణీ సంస్థలపై హ్యాకర్ల కన్ను: ఐబీఎం
న్యూయార్క్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను ఆరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాల ప్రజలు ఎదురు చుస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఫైజన్ వ్యాక్సిన్ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలకు హ్యాకర్లు ముంపు ఉందని ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం హెచ్చరించింది. వ్యాక్సిన్ రవాణా చేసే ఆయా సంస్థల డేటాపై అంతర్జాతీయ హ్యాకర్ల బృందం టార్గెట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తమ నిపుణుల బృందం హ్యాకర్ల కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఐబీఎం పేర్కొంది. ఈ సందర్భంగా ఐబీఎం ఆనలిస్ట్ క్లయిర్ జబోయివా మాట్లాడుతూ.. అంతర్జాతీయ హ్యాకర్లు ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ అంశంపై సమాచారం సేకరించేందుకు విపరీత ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ సైబర్ సెక్యూరిటీ బృందం గుర్తించిందన్నారు. (చదవండి: వ్యాక్సిన్ : లండన్కు క్యూ కట్టనున్న ఇండియన్స్) వివిధ హైయర్ రిఫ్రిజరేషన్ యూనిట్ల తయారి, మోడల్తో పాటు ధరలపై హ్యాకర్లు పరిశోధన చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ డేటాను సేకరించేందుకే హ్యాకర్లు ఈమెయిళ్ల రూపంలో వలలు విసురుతున్నారని, పక్కా ప్రణాళికతో డేటాను దొంగలించేందుకు హ్యాకర్లు అసాధారణ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అయితే ఈమెయిళ్లను చైనాకు చెందిన హైర్ బయోమెడికల్ అనే కోల్డ్ చైన్ సేవల సంస్థ ప్రతినిధి పేరుతో పంపుతున్నట్లు గుర్తించామన్నారు. కావునా వ్యాక్సిన్ పంపిణీ చేసే ఆయా సంస్థలు చాలా అప్రమత్తంగా ఉండాలని లేదంటే కరోనా వ్యాక్సిన్ కోల్డ్ చైన్ ప్రక్రియకు భంగం కలుగుతుందని జబోయివా హెచ్చిరించారు. (చదవండి: ప్రపంచానికి బ్రిటన్ యువరాజు హెచ్చరిక?) కాగా కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా అందించే క్రమంలో కోల్డ్ చైన్ విధానం పాటించాలని ఐపీఎం తెలిపారు. వ్యాక్సిన్ను ఉత్పత్తి కేంద్రాల నుంచే అత్యంత శీతలీకరణ ఏర్పాట్లతో రవాణా చేయాలని, ప్రజల వద్దకు వ్యాక్సిన్ డోసులు వెళ్లేవరకు అవి చల్లని వాతావరణంలోనే ఉండాలని వివరించారు. ఒకవేళ రవాణాలో శీతలకరణకు ఆటంకం ఏర్పడితే వ్యాక్సిన్ పాడైపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కరోనా వ్యాక్సిన్లను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాలని, ప్రస్తుతం ఫైజర్, బయో ఎన్ టెక్ ఎస్ఈ వంటి ఫార్మా కంపెనీలు కోల్డ్ చైన్ విధానంపై ఎలాంటి భద్రతలు పాటిస్తున్నారనే అంశాన్ని గమనిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ ఓ అద్భుతమే!) -
వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ కి ఎక్కువ మంది వినియోగదారులున్నారు. అందుకే ప్రస్తుతం హ్యాకర్లు వాట్సాప్ వినియోగదారులను ఎంచుకొంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మీ వాట్సాప్లోని ముఖ్యమైన, సున్నితమైన డేటాను సేకరించడానికి హ్యాకర్లు వాట్సాప్ కు వచ్చే ఓటీపీని మార్గంగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్ లోకి సులభంగా ప్రవేశించడంతో పాటు కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఏంటీ ఓటీపీ స్కాం వాట్సాప్ ఓటీపీ స్కాంలో భాగంగా.. మీకు మీ స్నేహితుడి పేరుతో తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. తన ఫోన్ నెంబర్ పనిచేయడంలేదని.. వాట్సాప్ ఖాతా వేరే ఫోన్లో ఉపయోగించేందుకు ఓటీపీ కోసం నీ ఫోన్ నంబర్ ఇచ్చానని.. ఆ ఓటీపీని తనకు పంపించాలని దాని సారాంశం. మీరు ఓటీపీని పంపడం కోసం మీ స్నేహితుడికి ఫోన్ చేస్తే నా ఫోన్ బాగానే చేస్తుందని చెప్పడంతో పాటు, నేను ఎవరికీ నా నెంబర్ ఇవ్వలేదని చెప్పడంతో మీరు ఆశ్చర్యపోతారు. మీరు కనుక వెంటనే వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే అది స్కాం అని తెలుస్తుంది. అందుకోసమే మీకు వేరే నెంబర్ నుండి ఓటీపీ వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. (చదవండి: వన్ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్) ఒక వేల మీరు ఓటీపీ కోడ్ను హ్యాకర్కు పంపితే, మీ మిత్రుడు తన స్వంత వాట్సాప్ ఖాతాకు తిరిగి లాగిన్ కాలేరు. అప్పుడు మీ మిత్రుడి ఖాతాపై పూర్తి నియంత్రణ హ్యాకర్ చేతికి వెళ్తుంది. వెంటనే మీ మిత్రుడి ఖాతాలోని ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేయడంతో పాటు మిమ్మల్ని డబ్బులు కూడా అడిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇదేవిదంగా మీ ఇతర స్నేహితుల ఖాతాలను కూడా హ్యాక్ చేయవచ్చు. అందుకని మనం, మనకు తెలియని నెంబర్ నుండి ఎటువంటి సందేశం వచ్చిన స్పందించకపోవడం మంచిది. అలానే మీ వాట్సాప్ ఖాతాకు టూ-స్టెప్ వెరిఫేకేషన్ను ఎనేబుల్ చేసుకోవడం చాలా మంచిది. దాని వల్ల ఓటీపీతో పాటు ఖాతా వెరిఫికేషన్కి ప్రత్యేక పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల పొరపాటున మీరు ఓటీపీ పంపినా పిన్ నంబరు ఉండదు కాబట్టి మీ ఖాతాను హ్యాక్ చేయలేరు. ఒక వేళ ఓటీపీ పంపి మీ ఖాతా హ్యాక్ అయితే వెంటనే మీ వాట్సాప్ని రీసెట్ చేసి తిరిగి లాగిన్ అవ్వండి. -
2020లో అత్యంత చెత్త పాస్వర్డ్ ఇదే
కంప్యూటర్ యుగం ఇది. ప్రతి చిన్న పనికి మనం టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, మెయిల్స్లలో మన వ్యక్తిగత సమాచారాన్ని దాచుకుంటున్నాం. ఈ సమాచారం అంతా బహిర్గతం కాకుండా ఉంచడంలో పాస్వర్డ్లు కీరోల్ పోషిస్తున్నాయి. అందుకే మనం క్రియేట్ చేసే పాస్ వర్డ్ చాలా కష్టంగా ఉండాలని నార్డ్ పాస్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. తేలికైన పాస్వర్డ్లను క్రియేట్ చేస్తే.. హ్యాకర్లు సులభంగా సమాచారాన్ని తస్కరిస్తారని హెచ్చరించింది. ఇక ఈ ఏడాదికి గాను ప్రపంచంలో అత్యంత చెత్త పాస్వర్డ్లు ఇవేనని కొన్ని రకాల పాస్వర్డ్లను విడుదల చేసింది. 2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ 123456 అని వెల్లడించింది. దీన్ని హ్యాకర్లు 2.3 కోట్ల సార్లు ఛేదించారట. దీని తర్వాత స్థానంలో 1234567889 ఉంది. మూడో స్థానంలో picture1 అనే పాస్ వర్డ్ నిలిచింది. వీటితో పాటు password,123456, qwerty, ‘111111’, ‘12345678’, ‘123123’, '12345' '1234567890’, ‘1234567’, ‘qwerty, ‘abc123’, ‘Million2’, ‘000000’, ‘1234’, ‘iloveyou’, ‘aaron431’, ‘password1’, ‘qqww1122’లను అత్యంత చెత్త పాస్ట్వర్డ్లుగా ప్రకటించింది. ప్రపంచంలో అనేకమంది ఇలా సాధారణమైన పాస్ వర్డ్ లు పెట్టుకుని హ్యాకర్ల బారినపడుతుంటారని నార్డ్ పాస్ వెల్లడించింది. ఆన్ లైన్ లో మన వ్యక్తిగత సమాచారం, ఆన్ బ్యాంకింగ్ లో మన డబ్బు సురక్షితంగా ఉండాలంటే క్లిష్టంగా ఉండే పాస్ వర్డ్ ను ఎంపిక చేసుకోవాలని, లేదంటే హ్యాకర్ల ఉచ్చులో పడాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. అలాగే ప్రతి 90 రోజులకు ఒకసారి పాస్ట్వర్డ్లను మార్చు కోవాలని సూచించింది. -
హ్యాకర్ల ఆటలు..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పుణ్యమా అని ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి, వాస్తవానికి మధ్య అంతరం దాదాపుగా చెరిగిపోయింది. ఐటీ ఉద్యోగాలు ఇళ్లకు చేరిపోవడం, పాఠశాలలు నట్టింట్లోకి వచ్చేయడం, కొత్త ఫోన్లు, ల్యాప్టాప్లు తరచూ కొనేస్తుండటంతో మనకొచ్చిన సౌలభ్యమేమిటో తెలియదు గానీ.. సైబర్ నేరగాళ్ల పంట పండుతోంది.. ఈ కోవిడ్ కాలంలోనూ హ్యాకర్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ భద్రతపై ఇకనైనా కాసింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఐటీ భద్రత సంస్థ నార్టన్ జరిపిన ఒక సర్వే ప్రకారం ఇటీవలి కాలంలో సైబర్ నేరాల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ పేరుతో సిద్ధం చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.. కోవిడ్ మహమ్మారి కాలంలో హ్యాకర్లు కంపెనీల నెట్వర్క్లలోకి చొరబడటం, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఎక్కువైంది. నార్టన్ లైఫ్లాక్ సైబర్ సేఫ్టీ ఇన్సైట్స్ 2019 నివేదిక ప్రకారం.. భారత్లో సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 39 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు తస్కరణ బారినపడ్డారు. మాల్వేర్ల సాయంతో కంప్యూటర్లపై పట్టు సాధించి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించడం సాధారణమైపోతోంది. ఈ సమాచారాన్ని బ్రోకర్లకు అమ్ముకుని హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు.(ఇలా కూడా మోసం చేస్తారు జాగ్రత్త!) సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ క్లుప్తంగా వీపీఎన్ చాలా ముఖ్యమని డిజిటల్ వెల్బీయింగ్ 2020 సర్వే ద్వారా స్పష్టమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న సిబ్బంది కంపెనీతో సురక్షిత పద్ధతిలో కనెక్టయ్యేందుకు వీపీఎన్ ఉపయోగపడుతుంది. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేయడం వల్ల హ్యాకర్ల పప్పులు ఉడకవు. వైర్లెస్ ఫిడిలిటీ లేదా వైఫై కనెక్షన్కూ భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడటం తక్కువవుతుందని, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫై విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఈ సర్వే తెలిపింది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ కోసం సర్వే చేసిన వారిలో 24 శాతం మంది పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్నట్లు తెలపడం ఇక్కడ గమనించదగ్గ విషయం.('నీకు కరోనా రాను') లాక్డౌన్ సమయంలో కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని దొంగిలించడం ఎక్కువైందని తేలింది. డార్క్వెబ్లో నిక్షిప్తమయ్యే ఈ సమాచారాన్ని తొలగించడం అంత సులువు కాదు. అందువల్లనే ఆన్లైన్లో ఎవరితోనైనా సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. -
అత్యంత చెత్త పాస్వర్డ్ల జాబితా ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్న తరుణంలో యూజర్నేమ్స్, పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా పెద్ద టాస్కే. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్ఫోన్ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఇలా ఒకటా రెండా.. ఎన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటికి తోడు సోషల్ మీడియా అకౌంట్లు ఉండనే ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన యూజర్నేమ్స్, పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవడమంటే కత్తిమీద సామే. అందుకే సులభంగా ఉండేలా 12345 లాంటివి, లేదంటే పుట్టిన రోజు తేదీలను పాస్వర్డ్లుగా తమ అకౌంట్లకు పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, ప్రజలు ఇప్పటికీ "123456789," ఐలవ్ యూ" లాంటి హ్యాక్-టు-హ్యాక్ పాస్వర్డ్లనే వాడుతున్నారట. నార్డ్పాస్ సంస్థ 2020 సంవత్సరానికిగాను అత్యంత చెత్త పాస్వర్డ్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం "123456" టాప్లోఉంది. ఈ ఏడాది 2,543,285 మంది ఇదే పాస్వర్డ్ వాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ విడుదల చేస్తున్న అత్యంత చెత్త పాస్వర్డ్ల జాబితాలో ఇదే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2015లో 123456 పాస్ వర్డ్ సదరు జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత పాస్వర్డ్ అనే పదం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో 123456 అనే పాస్వర్డ్ చెత్త పాస్వర్డ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఇంకా పొకేమాన్, చాకొలెట్ లాంటి పాస్వర్డ్లు కూడా ఇంకా వాడుతున్నారు. అయితే ఏడాది ఈ జాబితాలో పిక్చర్1, సెన్హా (పోర్చుగీసులో పాస్వర్డ్ అని అర్థం) అనే రెండు కొత్త పదాలు కొత్తగా చేరాయని తెలిపింది. 10 మోస్ట్ కామన్ పాస్వర్డ్లు 1. 123456 2. 123456789 3. పిక్చర్ 1 4. పాస్వర్డ్ 5. 12345678 6. 111111 7. 123123 8. 12345 9. 1234567890 10. సెన్హా మీ పాస్వర్డ్ జాబితాలో ఉంటే, తక్షణమే మార్పు చేయాలని సూచిస్తోంది. ప్రతి 90 రోజులకు క్యాప్స్, స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్వర్డ్లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్పాస్ సూచిస్తుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పెళ్లి డేటు, లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పాస్వర్డ్ ఉపయోగించకూడదని హెచ్చరించింది. హ్యాకర్లు మన ఖాతాలపై ఎటాక్ చేయకుండా ఉండేలా కఠినమైన పాస్వర్డ్లను తమ అకౌంట్లకు సెట్ చేసుకోవాలని, లేదంటే వ్యక్తిగత డేటాతోపాటు, నగదును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
చిదంబర రహస్య: హ్యాకర్స్ ఆఫ్ డెమాక్రసీ!
మందిరంలో నిద్రిస్తున్న రాజకుమారి మగత నిద్రతోనే తన శయ్యపైనుంచి లేచి ఎవరో ఆదేశించినట్టుగా ఎటో వెళ్లి పోతుంది. ఇటువంటి జానపద కథల్లో మాయగాళ్లు మంత్ర శక్తితో తాము లక్ష్యంగా ఎంచుకున్న వారి ఆలోచనల్ని స్వాధీనం లోకి తీసుకుని రిమోట్ కంట్రోల్తో నిర్దేశిస్తుంటారు. కొన్ని సైన్స్ ఫిక్షన్ కథలుంటాయి. ఈ కథల్లో శాస్త్రవేత్తలు మరమనుషుల్ని తయారుచేస్తారు. యజమాని ఆదేశాల ప్రకారం ఆ మరమనిషి అద్భుతాలు చేస్తుంది. హఠాత్తుగా మరమనిషిలో మార్పు వస్తుంది. యజమాని ఆదేశాలకు విరుద్ధంగా పని చేయడం ప్రారంభిస్తుంది. ఒక అదృశ్య హస్తమేదో ఆ మర మనిషి ప్రోగ్రామింగ్లో ఏవో మార్పులు చేస్తుంది. ఫలితంగా నిర్దేశిత లక్ష్యం నుంచి మరమనిషి తప్పుకుంటుంది. కంప్యూటర్లూ వాటి హార్డ్వేర్–సాఫ్ట్వేర్ల తాలూకు నెట్ వర్క్లు ఇప్పుడు సమస్త మానవాళి ఆలనాపాలనా చూస్తు న్నాయి. ఈ నెట్వర్క్లన్నీ వాటి నిర్దేశిత లక్ష్యాలతో పని చేస్తున్నాయి. నెట్వర్క్ల భద్రతా కుడ్యాలను కూడా ఛేదించే చోరులు చాలామంది తయారయ్యారు. వీళ్లను హ్యాకర్లు అని పిలుస్తున్నాం. ఈ హ్యాకర్లు కంప్యూటర్ల నెట్వర్కుల్లోకి అక్ర మంగా చొరబడుతారు. అత్యంత రహస్యమైన సమాచారాన్ని తస్కరిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల మీద దాడులు జరిపి జనం సొమ్మును తేరగా కొట్టేస్తుంటారు. ఇటువంటి సైబర్ దాడుల ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం మన జాతీయ స్థూల ఉత్పత్తితో దాదాపు సమానం. డిజిటలైజేషన్ పెరుగుతున్నకొద్దీ ఈ హ్యాకింగ్ దొంగల బెడద కూడా పెరుగు తుందట. మనుషుల్లో అక్కడక్కడా మంచివాళ్లు ఉన్నట్టే హ్యాకర్లలో కూడా కొందరు మంచివాళ్లు ఉంటారు. కంప్యూటర్ వ్యవస్థలను నియంత్రించి నిర్దేశిత లక్ష్యాల నుంచి దారి తప్పించే హ్యాకర్ల వంటి వాళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కూడా ఉన్నారు. కాకపోతే వారికి ప్రత్యేకంగా మనం ఏ పేరూ పెట్టుకోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థల హ్యాకింగ్లో ఆరితేరిన వ్యక్తి మన తెలుగువాడేనని ఘంటాపథంగా చెప్పు కోవచ్చు. కంప్యూటర్ను కనిపెట్టిన వ్యక్తి కూడా తానే కనుక, హ్యాకింగ్ పద్ధతుల్లో కూడా ఆయనకు అరివీర భయంకరమైన తెలివితేటలు ఉన్నాయని అంటారు. రాజకీయాల్లో విశ్రాంతి లేకుండా గడిపే ఆయన, వీలు చిక్కినప్పుడల్లా ఐఐటీ, ఐఐఎమ్, ఎయిమ్స్, ఎమ్ఐటీ, స్టాన్ఫోర్డ్ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. వారికి కొన్ని మెళకువలను కూడా నేర్పుతుంటారు. ఈరోజు కూడా బొంబాయి ఐఐటీ విద్యార్థులతో మాట్లాడారు. సైబరాబాద్ నిర్మించింది తానేనని మరోసారి వారికి గుర్తుచేశారు. కొన్ని సైబర్ టెక్నిక్స్ను కూడా వారికి నేర్పించే ఉంటారు. భారతీయులమైన మనం, మనల్ని పరిపాలించుకోవడం కోసం ఒక రాజ్యాంగాన్ని, దానిని అనుసరించి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ వ్యవస్థల మధ్య అప్పుడప్పుడూ అపార్థాలూ, అభిప్రాయభేదాలూ కలిగినా మౌలికంగా అవన్నీ సైద్ధాంతికమైనవే కనుక మన ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో మన సైబరాబాద్ నిర్మాత సుమారు పాతికేళ్ల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థల్లోకి తన ట్రోజన్ హార్స్లను జొప్పించడం ప్రారంభించారు. ఈ అనైతిక చర్యల వల్ల ఆయనకు వ్యక్తిగతంగా చాలాసార్లు లాభం కలిగింది. పద్దెని మిది అవినీతి కేసుల్లో దశాబ్దాల తరబడి ‘స్టే’లతో గడిపే అవకాశం చిక్కింది. చిన్నాచితక కేసుల్లో దర్యాప్తునకు కూడా సిద్ధంగా ఉండే సీబీఐ ఈయనపై దర్యాప్తు చేయడానికి తమవద్ద సిబ్బంది లేదనే చిత్రమైన సాకును చెప్పింది. అప్పటితరం వారికి అందరికీ తెలుసు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిం చినప్పుడు పార్టీ జెండాను ఆయనే స్వయంగా డిజైన్ చేసు కున్నారు. పార్టీ ఎన్నికల గుర్తును తానే ఎంపిక చేసుకున్నారు. వాటి గురించి ఆయన తన్మయత్వంతో మీడియా ముందు వివరించారు కూడా. అవన్నీ ప్రజలకు గుర్తే. అయినా కూడా ఆ గుర్తుతోనూ, ఆ జెండాతోనూ, ఆ పార్టీతోనూ ఎన్టీ రామారావుకు సంబంధం లేదని తీర్పు వచ్చేలా ఈయన ఆ కేసును నడప గలిగాడు. వ్యవస్థల హ్యాకింగ్లో మెజారిటీ మీడియా అండ దండలు ఈయనకు పుష్కలంగా లభించాయి. ఈ కార్య క్రమంలో ఇద్దరూ (పార్టీ–పచ్చమీడియా) భాగస్వాములుగా వ్యవహరించారు. వ్యవస్థల్లోని అనేక కీలక స్థానాల్లోకి చేరుకున్న ఆయన ట్రోజన్ హార్స్లు తనను ఆపదల నుంచి బయటపడే యడంతోపాటు, ఆయన ప్రత్యర్థులను బాధించడంలోనూ ప్రముఖపాత్రను పోషించాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రపూరిత కేసులను బనాయించారు. ఈ కేసులను, సీబీఐ విచారణ తీరుతెన్నులను పరిశీలించిన అనేకమంది ప్రముఖులు, న్యాయ నిపుణులూ విస్మయాన్ని ప్రకటించారు. సీబీఐ వాదన నిలబడేది కాదని బహిరంగంగానే మాట్లాడారు. అయినా సరే, పదేళ్ల కిందట తామే అల్లిన కథను ఒక వాస్తవమని భ్రమింప జేస్తూ డెమాక్రసీ హ్యాకర్లు ప్రచారంలో పెడుతూనే ఉన్నారు. నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఉరఫ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి. జానపద కథల్లోని రాజకుమారి మంత్రశక్తి ఫలితంగా మగత నిద్రలోనే నడుస్తూ వెళ్లినట్టుగా ఈయన పార్క్హయత్ హోటల్కు వెళ్లడం, తెలుగుదేశం అధినేత ఆంతరంగికులతో సమావేశం అవ్వడం, కెమెరాలకు చిక్కడం ఒక తాజా ఘటన. నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయిన తర్వాత అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 26 కోవిడ్ పాజిటివ్ కేసులను బూచిగా చూపి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలన్న నిబం ధనను విస్మరించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసిన సంఘటన ప్రజాస్వామ్య ప్రియులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ ప్రత్యర్థి తరహాలో ముఖ్యమంత్రిపై అభ్యంతరకరమైన రీతిలో కేంద్రానికి ఉత్తరం రాయడం ప్రజాస్వామిక చరిత్రలో నభూతో న భవిష్యతి! ప్రస్తుతం దాదాపుగా రోజుకు మూడువేల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వ హణకు తయారవ్వడం ఒక విడ్డూరం. కాకపోతే హ్యాకింగ్ ఆఫ్ డెమాక్రసీ మహిమ. ఓటుకు నోట్లు కేసు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది. రేవంత్రెడ్డి గుర్తే. సెబాస్టియన్ గుర్తే. స్టీఫెన్సన్ గుర్తే. 50 లక్షల సూట్కేసు బాగా గుర్తు. ‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ బ్రదర్’ అన్న ఆ కంఠస్వరం బ్లాక్బస్టర్ ఆఫ్ ద టూ థౌజండ్ ఫిఫ్టీన్. ‘దొరికిన దొంగవు నువ్వు చంద్రబాబూ... నిన్ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక కూడా బాగా పాపులర్. ఈ కేసుకు సంబంధించిన ఆడియోలు అందరూ విన్నారు. వీడియోలు అందరూ చూశారు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. అయితే, నిందితుల జాబితాలో ఆదిపురుషుని పేరు లేదు. నా మీద ఎన్నో ఆరో పణలు చేశారు. ఒక్కటీ నిరూపించలేకపోయారు అని ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. అలా నిరూపించలేకపోవడం వెనుక ఇంత చిదంబర రహస్యం ఉంది. సుప్రసిద్ధ అమెరికన్ మేధావి నోమ్ చోమ్స్కీ వందో పుస్తకం ‘రెక్వియమ్ ఫర్ ది అమెరికన్ డ్రీమ్’ ఆయనకు దాదాపు తొంభయ్యేళ్ల వయసులో ఈమధ్యనే అచ్చయింది. నయా ఉదారవాద ప్రజాస్వామ్యాలు క్రమంగా ఎలా ధనస్వామ్య వ్యవస్థలుగా రూపాంతరం చెందుతున్నాయో పది సూత్రాలతో ఆయన వివరించారు. ప్రధానంగా అమెరికన్ రాజకీయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ విశ్లేషణ చేసినప్పటికీ భారత రాజకీయ పరిణామాలు అందులో ముఖ్యంగా చంద్ర బాబు రాజకీయ ప్రయాణం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదార వాద విధానాల ఫలితంగా సంపద కేంద్రీకృతం కావడం క్రమంగా కేంద్రీకృత అధికారానికి దారితీస్తుంది. ఎన్నికల వ్యయం భారీగా పెరుగుతుంది. ఫలితంగా రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో మనుగడ సాగిస్తాయి. కనుక ఇవి అమలుచేసే విధానాల ఫలితంగా సంపద మరింత కేంద్రీ కృతమవుతుంది. కేంద్రీకృత సంపదకు, అధికారానికి విస్తృత ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి మాటలు నచ్చవు. ప్రజాస్వామ్యాన్ని పరిమితం చేయాలని అవి కోరుకుం టాయంటాడు చోమ్స్కీ. ఎన్టీఆర్పై కుట్రచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పరిపాలన కార్పొరేట్ సంస్థల ప్రాపకం కోసం పాకులాడే విధంగానే ఉండేది. ఆయన హయాంలోనే ఎన్నికల వ్యయం ఆకాశాన్ని అంటింది. సామాన్య ప్రజలు ఎన్నికల పోటీకి దూరం కావాల్సి వచ్చింది. చోమ్స్కీ చెప్పిన పది సూత్రాల్లో ఆరోది నియంత్రణ సంస్థ లను ఆక్రమించడం (రూల్ రెగ్యులేటర్స్). అంటే ఆర్థిక రంగాన్ని నియంత్రించే సంస్థను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆక్రమిం చుకోవడం, ప్రైవేట్ రవాణా రంగాన్ని నియంత్రించే సంస్థను ప్రైవేట్ రవాణా కంపెనీలు స్వాధీనం చేసుకోవడం, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్, ప్రైవేట్ విద్యుత్ సంస్థల అజమాయిషీలో ఉండటం అన్నమాట. ఫలితం ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను హ్యాక్ చేసి ట్రోజన్ మాల్వేర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆశించే ప్రయో జనం అక్షరాల అటువంటిదే. అందువల్లనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖకు విస్తారమైన మద్దతు లభించింది. ఆ లేఖపై చర్యలను చేపట్టడం ద్వారా వ్యవస్థల ప్రక్షాళనకు పూనుకోవాలని మేధావులు కోరుకుంటున్నారు. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
వాట్సాప్ డేటా హ్యాకింగ్ను అడ్డుకోండిలా..
న్యూఢిల్లీ: సైబర్ ప్రపంచాన్ని హ్యాకర్లు హడలెత్తిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ను సైతం హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని వాట్సాప్ డెవలపర్లు చెబుతున్నా ఆ ఫీచర్.. పేరుకే పరిమితమవుతోంది. మనం చేసే మెసేజులు, పంపించే వీడియోలు మూడో వ్యక్తి కంటపడవని వాట్సాప్ ప్రకటిస్తున్నా హ్యాకర్లు ఈజీగా తమ పని కానిచ్చేస్తున్నారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్ గ్రూప్'పై కేసు) ఇటువంటి తరుణంలో వాట్సాప్ సెట్టింగ్స్లో చిన్నచిన్న మార్పులు చేస్తే ఇక మీ చాటింగ్ మొత్తం సురక్షితంగా ఉంచుకోవచ్చు. వాట్సాప్లోని చాటింగ్ డేటా డిఫాల్ట్గా ప్రతిరోజూ గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ అవుతుంటుంది. గూగుల్ డ్రైవ్లోని సమాచారానికి కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని చెబుతున్నా ఇక్కడి నుంచే ఎక్కువగా యూజర్ల డేటా లీక్ అవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాట్ డేటా బ్యాకప్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. దీని కోసం ఏం చేయాలంటే... ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ 'ఆప్షన్' క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో మెనూ ఓపెన్ అవుతుంది. అందులో డార్క్ కలర్లో కనిపించే 'బ్యాకప్'పై క్లిక్ చేయాలి. మొత్తం ఐదు ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. అందులో 'never' లేదా 'only when i tap backup' ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఇకపై ఆటోమేటిక్గా బ్యాకప్ ప్రాసెస్ జరగదు. చాటింగ్ డేటా కూడా గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అవదు. ఒకవేళ ఎప్పుడైనా చాటింగ్ డేటా బ్యాకప్ తీసుకోవాలనుకున్నా వైఫై ద్వారా కాకుండా మొబైల్ డేటా ద్వారానైతే హ్యాకర్ల బారిన పడకుండా నిరోధించవచ్చు. -
బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్!
వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు ఇంకా నెలన్నర ఉండగానే హ్యాకర్ల బాంబు పేలింది. గత ఎన్నికల్లాగే ఈ ఎన్నికల్లోనూ విదేశీ హ్యాకర్లు తలదూర్చే ప్రమాదముందంటూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ప్రధానంగా రష్యా, చైనా, ఇరాన్ల నుంచి ఎన్నికలకు ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ మళ్లీ గెలవాలని రష్యా కోరుకుంటే, కచ్చితంగా ట్రంప్ ఓడిపోవాలన్నది చైనా, ఇరాన్ ఆశ. 2016 తరహాలో ఈ సారి కూడా అమెరికా ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ట్రంప్ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ హెచ్చరికలు పంపింది. రష్యా, చైనా, ఇరాన్ నుంచి హ్యాకర్ల ముప్పు వాటిల్లుతోందని, ప్రజల తీర్పును తారుమారు చేసే వ్యూహం పన్నుతున్నాయని, విదేశీ హ్యాకర్లపై తమకు కచ్చితమైన ఆధారాలున్నాయన్న మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2016 ఎన్నికల్లో డెమొక్రాట్ల ఆన్లైన్ క్యాంపెయిన్ అనూహ్యంగా దారి తప్పింది. డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సందేశాలు, వీడియో క్లిప్పులు, సోషల్ మీడియా మెసెజ్లు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లకు చేరలేదన్న ఆరోపణలున్నాయి. దీని వెనక రష్యా హ్యాకర్ల హస్తం ఉందంటూ అప్పట్లో గగ్గోలు పెట్టారు డెమొక్రాట్లు. ఆ విషయం దర్యాప్తులో తేలకుండానే 2020 ఎన్నికలు వచ్చాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థులు ఖరారై ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. మైక్రోసాఫ్ట్ బాంబు పేల్చింది. ఇప్పటికే విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్, బైడెన్ ప్రచారంపై సైబర్ రాడార్ పెట్టారని, 200 కంపెనీల సాయంతో రష్యా హ్యాకింగ్ చేస్తోన్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇప్పటికే రంగంలోకి రష్యా కంపెనీ స్ట్రోంటియం గ్రూప్ దిగిందని, గతంలో బ్రిటన్ ఎన్నికల్లోనూ చిచ్చుబెట్టినట్టు స్ట్రోంటియం గ్రూప్పై ఆరోపణలున్నాయని తెలిపింది. స్ట్రోంటియం గ్రూప్ రష్యా ఇంటలిజెన్స్ సర్వీస్కు దగ్గరి సంబంధాలున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అమెరికాకు చిరకాల ప్రత్యర్థి అయిన రష్యా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిచ్చు పెట్టబోతుందన్నది మైక్రోసాఫ్ట్ హెచ్చరిక. రష్యా ఇంటలిజెన్స్ సర్వీస్ జీఆర్యూ మిలిటరీ సర్వీసెస్కు అత్యంత సన్నిహితంగా మెలిగే సంస్థ స్ట్రోంటియం గ్రూప్. సైబర్ దాడులకు స్ట్రోంటియం గ్రూప్ పెట్టింది పేరు. ఇప్పుడిదే గ్రూప్ అమెరికాలోనూ ప్రజాభిప్రాయాన్ని తప్పుబట్టించే పనిలో పడిందన్నది మైక్రోసాఫ్ట్ వెల్లడించిన అంశం. ఇప్పటివరకు రష్యా కంపెనీ చేసిన సైబర్ అటాక్లను అడ్డుకున్నామని, అయితే ఇప్పుడు చైనా, ఇరాన్లు జత కలిసాయని, ఈ గ్రూప్ ఆట కట్టించకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. పార్టీలు, నాయకులు వాడుతున్న సోషల్ మీడియా యాప్లో చాలా లొసుగులున్నాయని, సరిగ్గా ఇక్కడే రష్యా, చైనా, ఇరాన్ సైబర్ అటాక్ చేస్తున్నాయని తెలిపింది. జో బైడెన్ క్యాంపెయిన్లో కీలకంగా ఉన్న కొందరి ఈమెయిల్ అకౌంట్లను ఇప్పటికే హ్యాక్ చేశారని, ట్రంప్ దగ్గరి మనుషుల్లోనూ కొందరి ఈమెయిల్ హ్యాక్ అయ్యాయని తెలిపింది. అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలైన రష్యా, చైనా, ఇరాన్ ఈ విషయంలో ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే అమెరికా ఎన్నికలపై చైనా డేగ కన్ను వేసినట్టు గుర్తించారు. హ్యాకింగ్లో సిద్ధహస్తులైన తన కంపెనీ జిర్కోనియంను చైనా రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. విద్యార్థి వీసాల రూపంలో అమెరికాలో ఉంటోన్న పలువురిని జిర్కోనియం రంగంలోకి దించినట్టు గుర్తించారు. హ్యాకింగ్ ఉప్పందగానే అమెరికా దాదాపు వెయ్యి మంది చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేసింది. హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్న దేశాలు.. ప్రధానంగా అమెరికా ప్రముఖ సంస్థల రికార్డులను టార్గెట్ చేసినట్టు గుర్తించారు. ఇరాన్ కంపెనీ పాస్పరస్ కూడా చైనా, రష్యాలకు దీటుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒక అడుగు ముందుకేసి ఏకంగా వైట్హౌజ్ అధికారులపై ఇరాన్ నిఘా పెట్టినట్టు తెలిసింది. మే, జూన్ నెలల్లో ఇరాన్ కంపెనీ పాస్పరస్ ప్రయత్నాలు చేసిందని, ఈ ప్రయత్నాలను పసిగట్టినట్టు గూగుల్ కంపెనీ వెల్లడించింది. (చదవండి: ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?!) రష్యా, చైనా, ఇరాన్.. మూడింటికి అమెరికా అంటే పీకలదాక కోపం ఉంది. ఇప్పుడు ఈ మూడు తమ కంపెనీలను రంగంలోకి దించాయి. చైనా కంపెనీ జిర్కోనియం ప్రముఖ సంస్థలను టార్గెట్ చేస్తే.. ఇరాన్ కంపెనీ పాస్పరస్ ఏకంగా వైట్ హౌజ్ అధికారుల ఖాతాలను తస్కరించినట్టు తెలిసింది. చైనా, ఇరాన్ చేసిన ప్రయత్నాలను తాము పసిగట్టినట్టు గూగుల్ కూడా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆరోపణలను రష్యా, చైనా వేర్వేరుగా ఖండించాయి. అమెరికా ఎన్నికలతో తమకు సంబంధం లేదంటూ రష్యా, చైనా, ఇరాన్ చెబుతున్నా.. అన్ని వేళ్లు మాత్రం ఆ మూడు దేశాలపైనే చూపిస్తున్నాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీలో అత్యున్నత సైబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే వీటిపై దృష్టి పెట్టింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు ఇచ్చిన సమాచారాన్ని మరింత విశ్లేషించే పనిలో హోంలాండ్ అధికారులు పడ్డారు. మూడు దేశాలది అమెరికాపై కోపమే అయినా ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. రష్యా మరోసారి ట్రంప్ గెలవాలని కోరుకుంటోండగా, చైనా మాత్రం ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దంటోంది. చైనా తరహాలోనే ఇరాన్ ఆలోచిస్తుంది. తమపై సైనిక దాడి చేసినందుకు ట్రంప్కు బుద్ధి చెప్పాలన్నది ఇరాన్ లక్ష్యం. ఎవరి టార్గెట్ ఎలా ఉన్నా.. ఇప్పటికే విలువైన కొంత సమాచారం హ్యాకర్లకు చిక్కినట్టు ఇంటలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. అగ్రరాజ్యమని చెప్పుకునే తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై హోంలాండ్ అధికారులు గుర్రుగా ఉన్నారు. హ్యాకర్ల ఆట పూర్తి స్థాయిలో కట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. (చదవండి: నిజంగా అమెరికాలో ఆ పరిస్థితి ఉందా?) -
విదేశీ హ్యాకర్ల నుంచి డబ్బు రికవరీ
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ విదేశీ కంపెనీ వ్యాపార లావాదేవీలకు వినియోగించే మెయిల్ను హ్యాకింగ్ చేసిన హ్యాకర్లు కొందరు ఆ కంపెనీ మెయిల్ ఐడీని పోలిన మరొక నకిలీ మెయిల్ రూపొందించి తద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కంపెనీని బురిడీ కొట్టించి రూ.1.14 కోట్లు కొల్లగొట్టారు. మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాసులును కలిసి సహాయం చేయాలని కోరగా.. పశ్చిమగోదావరి ఎస్పీతో మాట్లాడిన పోలీసు కమిషనర్ భీమవరం టూ టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయించి.. బెజవాడ సైబర్ క్రైం పోలీసులతో కేసు దర్యాప్తు చేయించి హ్యాకర్లు కొల్లగొట్టిన సొమ్ము నుంచి కొంత రికవరీ చేయించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సెంటర్కు అమెరికాలోని హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆ కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలను మెయిల్ ద్వారా జరుపుకునేవారు. ఇలాంటి మెయిల్స్ కోసం ఇంటర్నెట్లో సంచరించే హ్యాకర్లు భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సెంటర్ మెయిల్ను హ్యాక్ చేసి వారి వ్యాపార లావాదేవీలపై అవగాహనకు వచ్చారు. అనంతరం హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ మెయిల్ ఐడీని పోలిన నకిలీ మెయిల్ను సృష్టించారు. దాని ద్వారా భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కంపెనీకి మెయిల్స్ పంపి, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బును హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అకౌంట్లో కాకుండా.. తాము సూచించిన అకౌంట్ నందు జమ చేసే విధంగా హ్యాకర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. సదరు మెయిల్స్ నిజమైనవిగా భావించిన భీమవరం కమ్యూనిటీ సెంటర్ నిర్వాహకులు రూ. 1.14 కోట్ల (1,50,913 యూఎస్ డాలర్లు)ను రెండు దఫాలుగా హ్యాకర్లు సూచించిన అకౌంట్లో జూన్ నెలలో జమ చేశారు. ఆ తరువాత తాము మోసపోయామని గుర్తించిన నిర్వాహకులు విజయవాడ పోలీసు కమిషనర్ను కలిసి సహాయం చేయమని విజ్ఞప్తి చేశారు. దాంతో కమిషనర్ స్పందించి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడి.. భీమవరం టూ టౌన్ పోలీసుస్టేషన్లో బాధితుడి ద్వారా ఫిర్యాదు చేయించారు. దర్యాప్తునకు బెజవాడ సైబర్క్రైం పోలీసులు సహకారం అందించాలని ఆదేశించారు. రూ. 33.08 లక్షల రికవరీ.. నగర కమిషనర్ ఆదేశాలతో దర్యాప్తును కొనసాగించిన సైబర్క్రైం పోలీసులు బాధితులు పోగొట్టుకున్న నగదు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన హెచ్ఎస్బీసీ బ్యాంక్లో జమ అయినట్లు గుర్తించారు. తరువాత బాధితుడి అకౌంట్ ఉన్న ఎస్బీఐ ఫోరెక్స్ బ్రాంచ్ ద్వారా చెన్నై హెచ్ఎస్బీసీ బ్రాంచ్కు వివరాలు తెలిపారు. చెన్నై బ్రాంచ్ ద్వారా యూకే హెచ్ఎస్బీసీ బ్రాంచ్ను సంప్రదించిన సైబర్ పోలీసులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి బాధితుడు పోగొ ట్టుకున్న సొమ్ములో రూ.33,08,068 లక్షల నగదు (44, 551.11 యూఎస్ డాలర్లు)ను భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కంపెనీ అకౌంట్లో జమ చేయించారు. ఈ కేసు కౌంటర్ పార్ట్ అయిన హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ యాజమాన్యాన్ని విజయవాడ సైబర్క్రైం పోలీసులు సంప్రదించి వారి ద్వారా యూకేలోని వెస్ట్ యార్క్షైర్ పోలీసుస్టేషన్లో కూడా కేసు నమోదు చేయించారు. -
కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెబ్సైట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాకింగ్కు గురైంది. పాకిస్తాన్కు చెందిన హ్యాకర్స్ ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్సైట్లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయని గమనించిన సిబ్బంది వెబ్సైట్ హ్యాకింగ్కు గురైనట్లు నిర్ధారించింది. అయితే అది వ్యక్తిగత వెబ్సైట్ కావడంతో దేశ భద్రతకు సంబంధిచిన ఎలాంటి సమాచారం అందులో లేదని, కేవలం పార్టీ, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్సైట్ను హ్యాకింగ్ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. -
కోవిడ్ పరిశోధనలే చైనా హ్యాకర్ల లక్ష్యం
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల అత్యంత విలువైన వాణిజ్య రహస్యాలను ఇద్దరు చైనా హ్యాకర్లు తస్కరించారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. తాజాగా, ఈ హ్యాకర్లు కోవిడ్ టీకా కోసం పరిశోధనలు జరుపుతున్న అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. వ్యాక్సిన్ల అభివృద్ధి, చికిత్సలపై పరిశోధనలు జరుపుతున్న మసాచుసెట్స్, మేరీల్యాండ్లకు చెందిన ప్రముఖ సంస్థల కంప్యూటర్ నెట్వర్క్లో లోపాలపై పరిశోధన జరిపారని పేర్కొంది. ఈ హ్యాకర్లపై వాణిజ్య రహస్యాల దొంగతనం, కుట్ర అభియోగాలు మోపుతున్నట్లు తెలిపింది. తస్కరణకు గురైన సమాచారం హ్యాకర్లే కాకుండా చైనా ప్రభుత్వానికి కూడా ఎంతో విలువైందని వివరించింది. చైనా ప్రభుత్వం పరోక్షంగా నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. హ్యాకర్లు ఎలాంటి సమాచారాన్ని దొంగతనంగా గ్రహించారనే విషయం అమెరికా అధికారులు వెల్లడించలేదు. విదేశీ హ్యాకర్లపై అమెరికా ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం. రష్యా గూఢచర్యంపై యూకే టార్గెట్ రష్యా గూఢచార కార్యకలాపాలపై దృష్టిసారించాలని బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. అవాంఛనీయ, తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదమున్న నేపథ్యంలో రష్యాని ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీ విడుదల చేసిన 50 పేజీల రిపోర్టులో పేర్కొన్నారు. -
ట్విట్టర్కు నోటీసులు పంపిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్కు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ట్విట్టర్పై సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హ్యాక్కు గురైన ఖాతాలో భారతీయులు ఎవరెవరు ఉన్నారో తెలపాలని కేంద్రం ప్రభుత్వం ప్రశ్నించింది. దీనిపై వీలైనంత త్వరలో తమకు సమాధానం చెప్పాలని శనివారం జారీచేసిన నోటీసులో పేర్కొంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా కూడా పలువురు ఖాతాలు హ్యాక్కు గురైన విషయం తెలిసిందే. (ట్విటర్లో ఎడిట్ ఆప్షన్.. ఓ ట్విస్ట్!) అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. దీనిపై పలు దేశాల అధినేతలు సైతం ట్విటర్ సీఈవోకు లేఖలు రాశారు. (వణికిన ట్విట్టర్) -
పేట్రేగిన చైనా హ్యాకర్లు
న్యూఢిల్లీ: భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం భారత్కు చెందిన వెబ్సైట్లపైన చైనా హ్యాకర్ల దాడులు భారీ స్థాయిలో పెరిగినట్లు సింగపూర్ సంస్థ ఒకటి వెల్లడించింది. జూన్ 18వ తేదీ తర్వాత చైనా ఆర్మీ(పీఎల్ఏ)మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు ఒక్కసారిగా 300 శాతం మేర పెరిగాయని సైబర్ రీసెర్చ్ సంస్థ సైఫర్మా వెల్లడించింది. రెండు దేశాల సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జూన్ 15, 16వ తేదీల్లో ఘర్షణలు జరగ్గా ఆ తర్వాత నుంచి భారత వెబ్సైట్లే లక్ష్యంగా చైనా హ్యాకర్ల దాడుల్లో తీవ్రత, దూకుడు బాగా పెరిగినట్లు గుర్తించామని సైఫర్మా సీఎండీ కుమార్ రితేశ్ తాజాగా ‘ఇండియాటుడే’కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ)తో పంచుకున్నట్లు ఆయన వివరించారు. ‘హ్యాకర్లు మొదటి దశలో నిఘా వేసి భారత వెబ్సైట్ల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. దాని ఆధారంగా వారు లక్ష్యాలను నిర్ధారించుకుంటారు. రెండో దశలో సైబర్ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి’అని ఆయన తెలిపారు.‘జూన్ 18వ తేదీకి ముందు చైనా హ్యాకర్లు మొబైల్ ఫోన్ల తయారీ, నిర్మాణరంగం, టైర్లు, మీడియా కంపెనీలు, ఇతర ప్రభుత్వ రంగ ఏజెన్సీల వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకునే వారు. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం వెబ్సైట్లను పాడుచేయడం, వాటి ప్రతిష్టను దిగజార్చడం నుంచి కీలకమైన సమాచారాన్ని, సున్నితమైన వివరాలను, వినియోగదారుల డేటాను, మేధోహక్కులను దొంగిలించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు’అని వెల్లడించారు. ‘గతంలో పాకిస్తాన్, ఉత్తరకొరియా హ్యాకర్ల ద్వారా చైనా హ్యాకర్లు కార్యకలాపాలు సాగించేవారు. ఇప్పుడు వారే నేరుగా హ్యాకింగ్లో పాలుపంచుకుంటున్నారు. భారతీయ సంస్థల కీలక సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని కుమార్ రితేశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా చైనాలోని బీజింగ్, గ్వాంగ్ఝౌ, షెంజెన్, చెంగ్డులోని స్థావరాల నుంచి సైబర్ దాడులు ఎక్కువగా జరిగినట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ప్రభుత్వ అండతో నడిచే గోధిక్ పాండా, స్టోన్ పాండా అనే హ్యాకింగ్ ఏజెన్సీలు తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకు చైనాకు బదులుగా అమెరికా, యూరప్, ఇతర ఆసియా దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చైనా ఆర్మీకి చెందిన మౌలిక వసతులను ఇవి ఉపయోగించుకుంటాయి. ‘ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్లు భారత్పై ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారు. జూన్ తర్వాత వారి వైఖరిలో మార్పు వచ్చింది. వారి సంభాషణను డీకోడ్ చేయగా తరచుగా ‘భారత్కు గుణపాఠం చెప్పాలి’వంటివి ఎక్కువగా వాడుతున్నట్లు తేలింది. ప్రభుత్వ ప్రోద్బలంతో నడిచే హ్యాకింగ్ సంస్థలకు భౌగోళిక రాజకీయ లక్ష్యాలు ఉండేవి. కానీ, చైనా హ్యాకర్ల లక్ష్యం వాళ్ల పరిశ్రమలను కాపాడుకోవడమే’అని ఆయన తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన, అంతర్జాతీయంగా మంచి పేరున్న భారతీయ సంస్థలే చైనా హ్యాకర్ల ప్రస్తుత లక్ష్యం. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను మెరుగుపర్చుతున్నప్పటికీ హ్యాకర్లు అంతకంటే ముందుంటున్నారు. నోడల్ ఆర్గనైజేషన్ నుంచి మిగతా సంస్థలకు సమాచారం అందజేత నెమ్మదిగా సాగుతోంది. సైబర్ దాడులను ఎదుర్కోవాలంటే మాత్రం సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం సత్వరమే జరిగిపోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు -
భారత్పై సైబర్ దాడులకు పాల్పడ్డ చైనా
ముంబై : చైనాకు చెందిన హ్యాకర్లు గత ఐదు రోజుల్లో ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై నలభై వేలకు పైగానే సైబర్ దాడులకు ప్రయత్నించారని మహారాష్ట్ర పోలీసు సైబర్ వింగ్ అధికారి యశస్వి యాదవ్ మంగళవారం తెలిపారు. తూర్పులద్ధాఖ్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆన్లైన్ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ను హైజాక్ చేయడం, ఫిషింగ్ వంటి సమస్యలను సృష్టించే లక్ష్యంతో ప్రధానంగా ఈ దాడులు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గత ఐదు రోజుల్లోనే భారత సైబర్స్పేస్లోని వివిధ వనరులపై దాదాపు 40,300 సైబర్ దాడులు జరిగినట్లు యశస్వి యాదవ్ వెల్లడించారు. చైనాలోని చెంగ్డు ప్రాంతం నుంచే ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. (వాస్తవాధీన రేఖ నిర్థారణ అసాథ్యమేమీ కాదు.. ) భవిష్యత్తులో మరిన్ని ఆన్లైన్ నేరాలు జరగడానికి అవకాశం ఉందని ఇంటర్నెట్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక వాస్తవాదీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనా దేశాలు కీలకమైన ముందడుగు వేశాయి. తూర్పు లద్ధాఖ్లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి వెనుదిరగాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. (రష్యాలో వారిద్దరు భేటీ కావడం లేదు: భారత్ ) -
కరోనా లాక్డౌన్ వేళ హ్యాకర్లు బిజీ
-
200 కోట్లు కొట్టేద్దామని ప్లాన్ చేశారు!
పల్ఘర్: టాటా సన్స్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి రూ. 200 కోట్లు కాజేద్దామనుకున్న ఏడుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసే ముందే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం వారు ఇండస్ఇండ్ బ్యాంకులో పని చేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా ఖాతా వివరాలను తెలుసుకున్నారు. అయితే ఆ ఖాతాపై ఎలాంటి హ్యాక్ ప్రయత్నాలు జరగలేదని, తమ భద్రతా విభాగాలకు ఎలాంటి సమాచారం లేదని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకు పాలసీని దాటి వ్యవహరించే సిబ్బందిని తొలగిస్తామని చెప్పింది. అరెస్టైన వారిని నసీమ్ సిద్దిఖి (35), గునజివ్ బారాయియా (56), సరోజ్ ఛౌధరి (25), సతీశ్ గుప్తా (32), అనంత్ ఘోష్ (34), ఆనంద్నలవాడె (38)లుగా గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. (చదవండి: అప్పటిదాకా రూ. 50వేల విత్డ్రాయల్కే అనుమతి) -
500 మంది భారతీయులకు గూగుల్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 12 వేల హెచ్చరికలను పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. వాట్సాప్ వీడియో కాలింగ్లోని లోపం ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్ చేసినట్లు గూగుల్ తెలిపింది. -
అమ్మకానికి 13 లక్షల పేమెంట్ కార్డుల డేటా
న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్ అనే హ్యాకర్ల వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని హ్యాకర్లు ఓపెన్ సేల్లో ఉంచారు. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ. 922 కోట్లు కాగా ఒక్కో కార్డును దాదాపు రూ. 7వేలకు విక్రయిస్తున్నట్లుగా వెబ్సైట్లో ఉంచారు. డార్క్ వెబ్లోని జోకర్స్ స్టాష్లో వీటిని అందుబాటులో ఉంచారు. కార్డుల వివరాలను ఏదైనా ఏటీఎం నుంచిగానీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్ల ద్వారా సేకరించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్డులకు ఉండే మాగ్నటిక్ స్ట్రిప్లో వినియోగదారుడి వివరాలుంటాయి. వాటిని క్లోన్ చేయడం ద్వారా హ్యాకర్లు అకౌంట్లపై దాడి చేసే చాన్సుంది. గత జనవరిలో హ్యాకర్లు ఇలాగే 21 లక్షల అమెరికన్ కార్డుల వివరాలు హ్యాక్ చేసి ఓపెన్ సేల్లో ఉంచారు. -
తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై ఆన్లైన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), హన్మకొండ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్), వైజాగ్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)ల అధికారిక వెబ్సైట్లపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ర్యాన్సమ్వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను హ్యాకర్లు తస్కరించారు. అనంతరం సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. తస్కరించిన డేటాను వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు మెయిల్ పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 4 డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్ ఉండడంతో డేటా భద్రత సమస్య తప్పింది. తిరుపతిలో డిస్కంల సర్వర్లు.. నాలుగు డిస్కంల ద్వారానే 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ సంస్థల వెబ్సైట్లను తిరుపతి కేంద్రంగా టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్(టీసీఎస్) నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని మెయిల్స్ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్ చొరబడి వెబ్సైట్లను హ్యాక్ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్లు హ్యాకింగ్కు గురికావడంతో 2 రోజులుగా ఆన్లైన్, పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. టీసీఎస్ నిర్వహిస్తున్న వెబ్సైట్లే లక్ష్యం.. హ్యాకర్లు టీసీఎస్ కంపెనీ నిర్వహిస్తున్న పలు సంస్థల వెబ్సైట్లపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఇండియన్ ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్ను సైతం హ్యాకింగ్కు పాల్పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనితో పాటు ఆంధ్రాబ్యాంక్ వెబ్సైట్ను సైతం టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హ్యాకింగ్ నిజమే.. తమ సంస్థ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ధ్రువీకరించారు. సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను టీసీఎస్కు అప్పగించామని, టీసీఎస్తో కలసి సంస్థ ఐటీ నిపుణులు వెబ్సైట్ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్ కారణంగా వెబ్సైట్ హ్యాక్ అయ్యిందన్నారు. ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్లైన్స్ వెబ్సైట్లను హ్యాక్ చేసిన దుండగులే తమ వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు భావిస్తున్నామన్నారు. తిరుపతిలో డిస్కంల వెబ్సైట్లకు సంబంధించిన డేటా బ్యాకప్ ఉందన్నారు. బ్యాకప్ బాధ్యత టీసీఎస్దే.. తమ సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు టీసీఎస్ చూస్తోందని, పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్రావు అన్నారు. ఇప్పటికే వెబ్సైట్లోని కొన్ని ఆప్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. డిస్కంల వెబ్సైట్లు హ్యాకింగ్కు గురికావడంపై హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేశామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. -
‘ఇన్నోసెంట్’గా మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్: ఇన్నోసెంట్..పేరులో అమాయకత్వం ఉన్నా మనిషి మాత్రం మాయ దారి మోసగాడే. ఫిషింగ్ మెయిల్స్ చేసి కంపెనీ వివరాలు, ఫోన్ నంబర్ తెలుసుకుని.. దాని ద్వారా సిమ్ స్వాప్ చేసి సైలెంట్గా కంపెనీల బ్యాంకు ఖాతాల్ని గుల్లచేసేస్తుందీ అ‘మాయ’క బృందం. కంపెనీల ఖాతాలో డబ్బుల్ని కొల్లగొట్టే ప్రణాళికను నైజీరియాలో వేసి కోల్కతా కేంద్రంగా అమలుచేసి తప్పించుకునే ఎబిగో ఇన్నోసెంట్ ముఠాను అంతే చాకచక్యంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కోల్కతాలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్పై శనివారం నగరానికి తీసుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్తో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. సిమ్ స్వాపింగ్తో స్వాహా.. నైజీరియాకు చెందిన ఎబిగో ఇన్నోసెంట్ అలియాస్ జేమ్స్ కోల్కతాలో ఉన్న సమయంలో ఫుట్బాల్ ఆడేందుకు వచ్చిన మరో నైజీరియా వాసి ఒడాఫీ హెన్రీతో 2014లో పరిచయమేర్పడింది. వీరిద్దరూ కలసి సిమ్ స్వాపింగ్ ద్వారా చేసే మోసాలకు తెరదీశారు. డబ్బుల బదిలీకి నకిలీ పేర్లతో బ్యాంక్ ఖాతాలు సమకూర్చే కోల్కతాకు చెందిన సంతోశ్ బెనర్జీ, రిజిష్టర్డ్ సెల్నంబర్ వివరాల ద్వారా నకిలీ డాక్యుమెంట్లు, చిరునామాలు సృష్టించి డూప్లికేట్ సిమ్ సంపాదించే రాజత్ కుందులను హెన్రీకి పరిచయం చేశాడు. అనంతరం నైజీరియాకు వెళ్లిపోయిన ఎబిగో ఇన్నోసెంట్ హ్యాకర్లు హ్యాక్ చేసిన కంపెనీ వివరాలను డార్క్నెట్లో కొనుగోలు చేశాడు. భారత్లోని కంపెనీల ఈ–మెయిల్స్కు ఫిషింగ్ మెయిల్స్ పంపించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల వివరాలు, రిజిష్టర్డ్ మొబైల్ నంబర్, కంపెనీ పేరు, చిరునామాలను సేకరించి హెన్రీ, రాజత్ కుందు, సంతోశ్ బెనర్జీలకు చేరవేసేవాడు. మొబైల్ టెలికామ్ స్టోర్స్లో రాజత్ కుందు తనకు పరిచయమున్న వారి ద్వారా మొబైల్ నంబర్ వివరాలు తెలుసుకునేవాడు. కంపెనీకి చెందిన రబ్బర్ స్టాంప్ను తయారు చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోల్కతాకు చెందిన చందన్ వర్మకు ఇచ్చేవాడు. అతడు సంజీవ్ దాస్ అనే వ్యక్తితో కలిసి వెళ్లి బాధితుడి సిమ్కు నకిలీ సిమ్ తీసుకునేవాడు. అలసత్వంతో లక్షలు పోగొట్టుకున్నా.. 2017 జూన్ 17న రాత్రి ఎనిమిది గంటల సమయంలో నా సెల్నంబర్ పనిచేయడం ఆగింది. ఎయిర్టెల్ కాల్సెంటర్కు కాల్ చేస్తే మీ నంబర్ పనిచేస్తుందని చెప్పారు. సోమవారం ఆ కంపెనీ మొబైల్ స్టోర్స్కు వెళితే మీ సిమ్ యాక్టివ్లోనే ఉంది. మీరు డూప్లికేట్ సిమ్ తీసుకున్నారా అని తిరిగి ప్రశ్నించారు. ఆధార్కార్డు, ఫింగర్ ప్రింట్ తీసుకొని మళ్లీ డూప్లికేట్ సిమ్ ఇచ్చారు. అయితే అప్పటికే నా సెల్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా రూ.24 లక్షల నగదు బదిలీలు కోల్కతాలోని బ్యాంక్లకు వెళ్లాయని తెలిసింది. సరైన తనిఖీ లేకుండా డూప్లికేట్ సిమ్ జారీ చేసిన సంస్థపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. –గిరి, సిలికాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారమే...పని కానిచ్చేస్తారు ఆయా టెలికం స్టోర్స్ నుంచి అసలు సిమ్ కార్డులకు డూప్లికేట్లను శనివారాల్లోనే పొంది సాయంత్రానికల్లా రాజత్ కుందుకు చేర్చేవారు. అతడు అదేరోజు దానిని యాక్టివ్ చేసేవాడు. దీంతో ఆ కంపెనీలకు చెందిన వారి సెల్ నంబర్ల సేవలు రాత్రి ఎనిమిది గంటల సమయంలో నిలిచేపోయేవి. సెల్ సిగ్నల్స్ సరిగా లేవని భావించిన కంపెనీ యజమానులు తిరిగి సోమవారం లోపు ఆయా టెలికం స్టోర్స్కు వెళ్లేలోపు వీరి బ్యాంక్ ఖాతాల నుంచి దశలవారీగా నగదు ఖాళీ అయిపోయేది. అనంతరం కొంత డబ్బును వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి విత్డ్రా చేయడంతో పాటు దుకాణాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలుచేసేవారు. వీటిని సంతోశ్ బెనర్జీ విక్రయించి నగదు రూపంలోకి మార్చి హెన్రీకి అప్పగించేవాడు. అనంతరం ఈ డబ్బుతో బట్టలు, వస్తువులు కొనుగోలు చేసి నైజీరియాలోని ఇన్నోసెంట్కు పంపేవారు. దొంగలు దొరికారిలా.. ఈ విధంగానే నగరంలో ఎలిమ్ కెమికల్స్, షాలోమ్ కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాల నుంచి రూ. తొమ్మిది లక్షలు ఖాళీ కావడంతో చింతల్కు చెందిన వాటి యజమాని వెంకటకృష్ణ గతేడాది డిసెంబర్ 17న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంక్ఖాతా వివరాలతో పాటు సెల్నంబర్ల లోకేషన్ ఆధారంగా కోల్కతాలో ఉంటున్న ఆరుగురు నిందితులను అక్కడే అరెస్టు చేశారు. వీరి నుంచి 17 సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్, మూడు పాస్పోర్టులు, డెబిట్కార్డులు, ఆధార్కార్డులు, లామినేషన్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు చెన్నై,కోల్కతా,అహ్మదాబాద్, ఢిల్లీలోని 11 పరిశ్రమలను చీటింగ్ చేసినట్టు విచారణలో తేలింది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు.. గతంలో నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను రూ.24 లక్షలు మోసం చేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల్లో ఒకడైన సంతోష్ బెనర్జీని 2015లో ఇటువంటి కేసులో జైపూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని సీపీ సజ్జనార్ అన్నారు. కాగా ఇందులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎబిగో ఇన్నోసెంట్ను పట్టుకునేందుకు నైజీరియాకు లేఖ రాస్తామని తెలిపారు. వెరిఫికేషన్ లేకుండా సిమ్ జారీ చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. -
డేటా లీక్: ఫేసుబుక్కు షాక్
శాన్ ఫ్రాన్సిస్కో: కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా కుంభకోణంనుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్. శుక్రవారం స్వయంగా ఫేస్బుక్ వెల్లడించిన సమాచారం ప్రకారం భారీ ఎత్తున వినియోగదారుల డేటా చోరీకి గురైంది. గత నెలలో వార్తలొచ్చినట్టుగా 5కోట్ల మంది యూజర్ల కాకుండా కేవలం 2.9 కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత ఖాతాల పూర్తి సమాచారం హ్యాక్ అయిందని ధృవీకరించింది. దీంతో డేటా రక్షణ వ్యవహారంలో ఫేస్బుక్పై వినియోగదారులు, పెట్టుబడుదారుల భరోసాను మరింత దిగజార్చింది. ముఖ్యంగా యూజర్ల డేటా రక్షణలో కంపెనీ సమర్థత ప్రశ్నార్థకమైంది. మరోవైపు ఈ వార్తాలతో అమెరికా మార్కెట్లో ఫేస్బుక్ షేర్లు 2.6 శాతం క్షీణించగా, శుక్రవారం వివరాలను వెల్లడించిన తరువాత మరో 0.5 శాతం పడిపోయాయి. ఈ పతనం మున్ముందు మరింత కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టుల అభిప్రాయం 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందంటూ గతనెల చివరి వారంలో వార్తలు రావడం తెలిసిందే. డిజిటల్ లాగ్-ఇన్ కోడ్లను హ్యాక్ చేయడం ద్వారా 5 కోట్లమంది వివరాలను హ్యాకర్లు చోరీ చేసి ఉండొచ్చని ఫేస్బుక్ తెలిపింది. ఇటీవల చెక్–ఇన్ అయిన ప్రదేశాలు తదితర వివరాలను కూడా సేకరించారని హ్యాకర్లు ఫేస్బుక్ తెలిపింది. ఊహించిన దానికంటే తక్కువ మందిపైనే సైబర్దాడి ప్రభావం చూపిందని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ గై రోసెన్ తెలిపారు. ఒకసారి ఖాతాలోకి లాగిన్ అయ్యాక లాగౌట్ చేసి, మళ్లీ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేయకుండానే పాత వివరాలతో ఖాతాను తెరవడానికి ఉపయోగపడే ‘యాక్సెస్ టోకెన్ల'ను దొంగిలించడమే ధ్యేయంగా గత నెల సైబర్ దాడులు జరిగాయని ఆయన వివరించారు. ఎలాంటి వివరాలు లీక్ అయ్యాయి, అనుమానిత ఈమెయిల్స్ లాంటి వివరాలతో రాబోయే రోజుల్లో ప్రభావిత యూజర్లకు మెసేజ్లను పంపుతానని , లేదా కాల్ చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా 14 మిలియన్ల మంది వినియోగదారులకు సంబంధించి పుట్టిన తేదీలు, ఎంప్లాయిర్స్, విద్య, స్నేహితుల జాబితా హ్యాక్ అయ్యాయి. అయితే సుమారు 15 మిలియన్ల మంది వాడుకందారులకు చెందిన కేవలం పేరు, కాంటాక్టుల వివరాలను మాత్రమే చోరీ చేయగలిగారని..ఆ మేరకు హ్యాకర్లను తాము నిరోధించగలిగామని గై రోసెన్ తెలిపారు. -
కోహ్లిపై బంగ్లా ఫ్యాన్స్ ప్రతీకారం
ఢాకా: బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. భారత్తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ను థర్డ్ అంపైర్ స్టంపౌట్గా ప్రకటించడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా బంగ్లా ఫ్యాన్స్ ఏకీపారేశారు. తమ సెంచరీ హీరో లిటన్ దాస్ నాటౌట్ అయినా ఔటివ్వడం వల్లే టైటిల్ చేజారిందని బంగ్లాదేశ్ అభిమానులు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా కొందరు ఫ్యాన్స్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అఫిషియల్ వెబ్సైట్ను హ్యాక్ చేశారు. అందులో లిటన్ దాస్ అవుటైన ఫొటోలను పోస్ట్ చేశారు. దాన్ని ఎలా ఔటిస్తారో వివరణ ఇవ్వాలంటూ ఐసీసీని నిలదీస్తూ ఓ నోట్ను కూడా ఆ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. క్షమాపణలు చెప్పి, ఆ థర్డ్ అంపైర్పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే వెబ్సైట్ను మళ్లీ హ్యాక్ చేస్తామని హెచ్చరించారు. ఇది భారతీయులను అవమానించడం కోసం కాదని, తమ జట్టుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన మాత్రమేనని హ్యాకర్లు తెలిపారు. క్రికెట్లో ప్రతి దేశాన్ని సమానంగా చూడాలని కోరారు. ఈ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ నమోదు చేసిన లిటన్ దాస్(121) కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లాడు. బంతి మిస్ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్పై కాలు పెట్టాడు. కానీ అప్పటికే ఎంఎస్ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ను సంప్రదించాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ లిటన్ దాస్ను ఔట్గా ప్రకటించాడు. అదే సమయంలో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్ణయం బ్యాట్స్మన్కు అనుకూలంగా ఇవ్వకపోవడాన్ని బంగ్లా ఫ్యాన్స్ ప్రశ్నిస్తురు. అసలు బెన్ఫిట్ ఆఫ్ డౌట్ నిబంధనను థర్డ్ అంపైర్ మరచిపోయినట్లు ఉన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ చివరి బంతి వరకు పోరాడి మూడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు అంపైర్ తప్పుడు నిర్ణయం వల్లే తమ జట్టు ఓడిపోయిందని బంగ్లా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లి వెబ్సైట్లో హ్యాకర్స్ పోస్ట్ చేసిన ఫొటో -
ట్రాయ్ చైర్మన్ శర్మ బ్యాంక్ అకౌంట్ వివరాలు లీక్
-
ఇది మాములు షాక్ కాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సురక్షితం అన్నందుకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మను నెటిజన్లు ఓ రేంజ్లో అడుకుంటున్నారు. నిన్న ఆయన వ్యక్తిగత వివరాలను విచ్చలవిడిగా వైరల్ చేసిన హ్యాకర్లు.. పలువురు నెటిజన్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను తస్కరించిన హ్యాకర్లు తలా రూ.1ని ఆయన ఖాతాలో డిపాజిట్ చేశారు. అనంతరం ఈ స్క్రీన్ షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. పేటీఎం, భీమ్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్) ద్వారా ఆ డబ్బును జమ చేయటం విశేషం. అంతేకాకుండా శర్మకు 6 బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ల వివరాలను మొత్తం బయటపెట్టారు. ఆధార్ వివరాలు అత్యంత సురక్షితమనీ, దమ్ముంటే తన ఆధార్ ను దుర్వినియోగం చేయాలని ఆర్ ఎస్ శర్మ హ్యకర్లకు ట్విటర్లో ఇంతకుముందు సవాలు విసిరారు. తన ఆధార్ నంబర్ను కూడా బయటపెట్టారు. దీంతో రెచ్చిపోయిన హ్యాకర్లు శర్మ ఈ-మెయిల్, ఆయన అడ్రస్, పాన్, ఓటర్ ఐడీలు, పుట్టిన రోజు, ఎయిర్ ఇండియా ఆయనకిచ్చిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఐడీలను బయటపెట్టారు. మరికొందరు హ్యాకర్లయితే ఏకంగా ఆయన ఫొటో, వివరాలతో దొంగ ఆధార్ కార్డును తయారుచేసి ఫేస్ బుక్, ఆమేజాన్ క్లౌడ్ సర్వీసుల్లో రిజిస్టర్ అయ్యారు. మరో వ్యక్తి అయితే శర్మ అడ్రస్ కు వన్ ప్లస్ ఫోన్ ను క్యాష్ ఆన్ డెలివరి ఆర్డర్ పెట్టాడు. ఆధార్ నంబర్, తదితర వివరాలు బహిర్గతమవ్వడం ద్వారా అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని, ఆర్థిక వ్యవహారాలతోపాటు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భరోసా కోసం శర్మ ట్వీట్ చేసినందుకు ఇలా ట్రోలింగ్ను ఎదుర్కుంటున్నారు. -
ఆదిత్య బిర్లా గ్రూప్ టార్గెట్గా అతిపెద్ద ఎటాక్
ముంబై : భారత్ తొలిసారి అతిపెద్ద ‘క్రిప్టోజాకింగ్’ ఎటాక్ బారిన పడింది. దేశీయ అతిపెద్ద బహుళ జాతీయ దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ను టార్గెట్గా చేసుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలకు చెందిన 2000కు పైగా కంప్యూటర్లపై హ్యాకర్లు ఈ దాడికి దిగినట్టు తెలిసింది. కొత్త రకం సైబర్ మాల్వేర్ను వీరు గ్రూప్ కంపెనీల కంప్యూటర్లలోకి చొప్పించినట్టు వెల్లడైంది. ఈ కొత్త రకం మాల్వేర్ ద్వారా హ్యాకర్లు క్రిప్టో కరెన్సీను పొందడానికి టార్గెట్ టర్మినల్స్ను, వారి ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని దుర్వినియోగపరుస్తారు. గత నెలలోనే ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన అంతర్జాతీయ సబ్సిడరీల్లో ఈ ఎటాక్ను గుర్తించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొన్ని రోజుల్లోనే ఈ మాల్వేర్ తమ బిజినెస్ హౌజ్కు చెందిన తయారీ, ఇతర సర్వీసుల కంపెనీలను ఎటాక్ చేసినట్టు పేర్కొన్నాయి. అయితే హ్యాకర్లు ఉద్దేశ్యం సమాచారాన్ని దొంగలించడం కాదని, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమేనని తెలిపాయి. టార్గెట్ కంప్యూటర్లను హైజాక్ చేయకుండా.. క్రిప్టో కాయిన్లు కలిగిన ఆర్గనైజేషన్ పవర్ సప్లయ్కు అంతరాయం సృష్టించిన్నట్టు వెల్లడించాయి. ఈ ఎటాక్పై ఆదిత్య బిర్లా గ్రూప్ అధికార ప్రతినిధి స్పందిస్తూ... థ్రెట్ మేనేజ్మెంట్ వ్యవస్థల్లో తమ గ్రూప్ చాలా అడ్వాన్స్గా ఉంటుందని, ఎప్పడికప్పుడూ పరిశీలిస్తూ.. వ్యాపార కీలక అప్లికేషన్లను కాపాడుతూ ఉంటామని తెలిపారు. కానీ ఇటీవల తమ గ్రూప్ థ్రెట్ మేనేజ్మెంట్ వ్యవస్థలకు చెందిన కొన్ని డెస్క్టాప్ సిస్టమ్స్లో అనుమానిత కార్యకలాపాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇలా గుర్తించిన వెంటనే తమ అంతర్గత టీమ్తో విచారణ జరిపించామని, సిస్టమ్స్కు అంతరాయం కలిగిస్తున్న ఆ అనుమానిత కార్యకలాపాన్ని తొలగించినట్టు చెప్పారు. దీని వల్ల ఎలాంటి డేటాను కోల్పోలేదని తేల్చారు. దీనిపై ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేపట్టినట్టు అధికార ప్రతినిధి తెలిపారు. క్రిప్టోజాకింగ్... ఇది ఓ కొత్త రకం మాల్వేర్ ఇది కంప్యూటర్లను జోంబీస్లోకి మారుస్తోంది. హ్యాకర్ల ప్రధాన ఉద్దేశ్యం సమాచారాన్ని దొంగలించడం కాదు, క్రిప్టోకరెన్సీలను పొందడం ఈ డిజిటల్ సొమ్మును సేకరించే లక్ష్యంతో కంప్యూటర్లు, క్లౌడ్ సీపీయూల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేస్తారు ఫలితంగా మన కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది -
భారత ప్రభుత్వ వెబ్సైట్లపై హ్యాకర్ల దాడి
-
కోటీశ్వరులైపోవాలనుకునే వారే లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతికి మరో అస్త్రం చిక్కిందా..? ర్యాన్సమ్వేర్ వంటి సైబర్ నేరాలతో కాసులు కురవడం కష్టమైపోవడం.. ఈ రంగంలో పోటీ ఎక్కువ కావడంతో హ్యాకర్లు కొత్త బాట పట్టారా..? దీనికి అవుననే సమాధానం చెపుతోంది ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ సైమాంటిక్. రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోవాలనుకుని చట్టవ్యతిరేకమైన క్రిప్టో కరెన్సీ ఆర్జనలో మునిగితేలుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు క్రిప్టోజాకింగ్ చేస్తున్నారని వెల్లడించింది. గత ఏడాది కాలంలో ఇది చాలా ఎక్కువైందని, ఇది కాస్తా వ్యక్తులు, సంస్థల సమాచార భద్రతకు చేటు చేకూరుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్(ఐఎస్టీఆర్) విడుదల సందర్భంగా భారత్లో నెట్ వినియోగదారులు ఎదుర్కొంటున్న భద్రతా పరమైన సమస్యలను ఏకరవు పెట్టింది సైమాంటిక్ సంస్థ. దీని ప్రకారం.. బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ కోసం మైనింగ్ చేస్తున్న వారిని గుర్తించి వారి కంప్యూటర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడం గత ఏడాది కాలంలో దాదాపు 85 రెట్లు ఎక్కువైంది. క్రిప్టోకరెన్సీ విలువ ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వీటిపై చాలామందికి ఆసక్తి పెరిగిందని.. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని సైమాంటిక్ సంస్థ డైరెక్టర్ తరుణ కౌరా అంటున్నారు. సమాచారాన్ని సేకరించడంతోపాటు హ్యాకర్లు కొన్ని సందర్భాల్లో బాధితుల కంప్యూటర్ సామర్థ్యాన్నీ వాడేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. ఈ క్రిప్టోజాకింగ్ పెద్ద పెద్ద డేటా సెంటర్లు మొదలుకుని వ్యక్తిగత కంప్యూటర్ల స్థాయి వరకూ జరుగుతున్నట్లు తాము గుర్తించామన్నారు. సైమాంటిక్ గ్లోబల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆధారంగా తాము 157 దేశాల్లో జరిగే సైబర్ దాడులపై ఓ కన్నేసి ఉంచుతామని వివరించారు. ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేసి.. క్రిప్టో కరెన్సీ విషయంలో భారత్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండో స్థానంలోనూ, ప్రపంచం మొత్తమ్మీద తొమ్మిదో స్థానంలో ఉన్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఈ డిజిటల్ సొమ్మును సేకరించే లక్ష్యంతో కంప్యూటర్లు, క్లౌడ్ సీపీయూల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేస్తున్నారు. దీన్నే క్రిప్టోజాకింగ్ అంటున్నారు. ఫలితంగా మన కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది. దాంతోపాటు బ్యాటరీలు వేగంగా వేడెక్కిపోవచ్చు.. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్లు అస్సలు పనికి రాకుండా పోవచ్చు కూడా. సంస్థల విషయానికొస్తే.. ఈ క్రిప్టోజాకింగ్ వల్ల నెట్వర్క్ మొత్తం సమస్యలకు గురికావచ్చు.. క్లౌడ్ సీపీయూ వాడకం పెరగడం ద్వారా కంపెనీలకు ఖర్చులూ పెరిగిపోతాయి. ఇంకోలా చెప్పాలంటే మన మొబైల్, పీసీ, ట్యాబ్లెట్ లేదా ఇంటర్నెట్ ఆధారిత(ఐఓటీ) పరికరాల కంప్యూటింగ్ సామర్థ్యాన్ని వాడుకుని హ్యాకర్లు క్రిప్టోకరెన్సీని పొందుతారన్నమాట. గత ఏడాది కాలంలో ఐఓటీ పరికరాలపై హ్యాకర్ల దాడులు దాదాపు ఆరు రెట్లు ఎక్కవైనట్లు సైమాంటిక్ అంచనా కట్టింది. మొబైల్ మాల్వేర్లోనూ పెరుగుదల.. స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో హ్యాకర్లు ఈ ప్లాట్ఫామ్నూ తమ అవసరాలకు వాడుకోవడం ఎక్కువైంది. సైమాంటిక్ గత ఏడాదిలో ప్రతి రోజూ దాదాపు 24 వేల మాల్వేర్లను మొబైల్ ఫోన్లలోకి చేరకుండా అడ్డుకుందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని.. ఆపరేటింగ్ సిస్టమ్ను అప్టుడేట్గా ఉంచుకోకపోవడం వల్ల ఇక్కడ సమస్య మరింత జటిలమవుతోందని సైమాంటిక్ తన నివేదికలో తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారులనే తీసుకుంటే 20 శాతం మంది మాత్రమే తాజా వెర్షన్ను వాడుతున్నారని, 2.3 శాతం మంది తాజా మైనర్ రిలీజ్ను ఉపయోగిస్తున్నట్లు వివరించింది. అంతేకాక ‘గ్రే వేర్’ యాప్స్(అప్లికేషన్లా పనిచేస్తూనే కొన్ని ఇతర పనులు చేసేవి) ద్వారా ఫోన్ నంబర్లను ఇతరులకు చేరవేయడం పెరిగిపోతోందని నివేదిక తెలిపింది. గత ఏడాది ఈ గ్రే వేర్ల వాడకం దాదాపు 20 శాతం ఎక్కువైనట్లు అంచనా. సైబర్ దాడుల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు ఎప్పటికప్పుడు తమ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడంతోపాటు, యాంటీవైరస్ను వాడాలని సైమాంటిక్ సూచించింది. -
అశ్లీల ఫోటోపై కుల్దీప్ ట్వీట్..
తన అధికారిక ఇన్స్టాగ్రాం అకౌంట్ హ్యాకింగ్కు గురయిందని భారత స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ట్వీట్ చేశాడు. సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ను హ్యాక్ చేసి ఓ అశ్లీల ఫొటోను పోస్ట్ చేశారని, అందుకు తనను క్షమించాలని కోరాడు. తన పాస్వర్డ్ను మరింత భద్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు. కుల్డీప్ ఇన్స్టాగ్రాం అకౌంట్ హ్యాకింగ్ గురించి తెలియక, తమ అభిమాన క్రికెటర్ ఇలాంటి ఫొటోను పోస్ట్ చేశాడేంటని అభిమానులు అవాక్కయ్యారు. అయితే తనను తప్పుగా అనుకునే అవకాశం ఉందని భావించిన కుల్దీప్ వెంటనే వివరణ ఇవ్వడంతో ఆయన ఇన్స్టాగ్రాం ఫాలోవర్లు ఒక డైలమా నుంచి బయటపడ్డారు. దాదాపు 3లక్షల మంది కుల్దీప్కు ఇన్స్టాగ్రాం ఫాలోవర్లు ఉన్నారు. I would like to apologise for the unsolicited post that was posted by my Instagram account in the past few mins .my Instagram account was hacked by someone, I’ll take steps to improve my password protection. Thanks for understanding — Kuldeep yadav (@imkuldeep18) February 20, 2018 -
90 శాతం జీమెయిల్ అకౌంట్లకు హ్యాకర్ల ముప్పు
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా అధునాతన హ్యాకర్ల ముప్పు పెరుగుతున్నప్పటికీ, జీమెయిల్ అకౌంట్ యూజర్లు మాత్రం అసలు జాగ్రత్తగా లేరని తెలిసింది. దాదాపు 90 శాతం జీమెయిల్ అకౌంట్ యూజర్లకు సైబర్ దాడి పొంచుకుని ఉందని గూగుల్ తెలిపింది. 10 శాతం మంది కంటే తక్కువ మంది జీమెయిల్ యూజర్లు మాత్రమే హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు రెండు దశల ప్రమాణీకరణను కలిగి ఉన్నారని చెప్పింది. యూజర్ల అకౌంట్ల యాక్సస్ను పొందడానికి హ్యాకర్లకు అత్యుత్తమ మార్గం పాస్వర్డ్లని, ముఖ్యంగా వ్యాపారవేత్తలు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని, వెంటనే రెండు దశల ప్రమాణీకరణను అమలు చేసుకోవాలని గూగుల్ ఇంజనీర్లు తెలిపారు. కేవలం 12 శాతం మంది అమెరికన్లు మాత్రమే తమ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవడానికి పాస్వర్డ్ మేనేజర్ను కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన న్యూస్ వెబ్సైట్ టెక్ రిపబ్లిక్ రిపోర్టు చేసింది. అకౌంట్లు హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు, పాస్వర్డ్లను కాపాడుకోవడానికి రెండు దశల ప్రమాణీకరణ ఎంతో ముఖ్యమని తెలిపింది. 2011లో తొలిసారి గూగుల్ ఈ రెండు దశల ప్రమాణీకరణను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పటివరకు ఈ సురక్షిత చర్యలను ఎక్కువ మంది పాటించడం లేదు. లాగిన్ అయిన కొన్ని సెకన్లకే ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. కానీ ఈ ఫీచర్ను గూగుల్ యూజర్లందరికీ తప్పనిసరి చేయలేదు. ఇటీవల కాలంలో యూజర్ల భద్రతను మెరుగుపరుచేందుకు గూగుల్ పలు చర్యలను తీసుకుంటోంది. -
రూ.2.5 కోట్ల క్రిప్టోకరెన్సీ చోరీ
డిజిటల్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉండే కరెన్సీలకు హ్యాకింగ్ ముప్పు హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. ఒకవేళ హ్యాకర్లు వీటిపై దాడి చేస్తే పెట్టుబడులు పెట్టిన డబ్బునంతా కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అనుకున్నట్టే జరిగింది. డిజిటల్ వాలెట్ ప్రొవైడర్ బ్లాక్వాలెట్ను కొల్లగొట్టిన హ్యాకర్లు, ఏకంగా 4 లక్షల డాలర్ల అంటే రూ.2.5 కోట్ల స్టెల్లర్ క్రిప్టోకరెన్సీని దొంగలించారు. బ్లాక్వాలెట్ నిర్వహించే సర్వర్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని సీఎన్ఎన్ రిపోర్టు చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వ్యవస్థాపకుడే స్వయంగా తెలిపినట్టు పేర్కొంది. ఆన్లైన్ స్టెల్లర్ వాలెట్ బ్లాక్వాలెట్ హ్యాక్ అయినట్టు పేర్కొన్నట్టు తెలిపింది. ఆర్బిట్ 84 అనే ఖాతాదారుడికి చెందిన అకౌంట్ను హ్యాకర్లు ఛేదించి డీఎన్ఎస్ సెట్టింగ్స్ను తమకు అనుకూలంగా మార్చుకున్నారని బ్లాక్వాలెట్ పేర్కొంది. దీని నుంచి 4,00,000 డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని మళ్లించినట్టు తెలిపింది. ఫోరమ్స్ ద్వారా అటాక్స్ జరుగుతున్న విషయాన్ని బ్లాక్వాలెట్ తన యూజర్లకు తెలుపుతూ... అప్రమత్తంగా ఉండాలంటూ వార్నింగ్ ఇస్తోంది. హ్యాకర్లు దొంగలించిన ఈ క్రిప్టోకరెన్సీని బిట్టరెక్స్ అనే వర్చ్యువల్ కరెన్సీ ఎక్స్చేంజ్కు మరలించినట్టు తెలిసింది. మరో డిజిటల్ కరెన్సీలోకి వీటిని మార్చుతున్నట్టు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ హ్యాక్ కావడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో స్లొవేనియాకు చెందిన నైస్ హ్యాష్ అనే క్రిప్టో కరెన్సీ మైనింగ్ మార్కెట్ను హ్యాకర్లు కొల్లగొట్టారు. అప్పట్లో దాదాపు 4,736.42 బిట్కాయిన్లు అంటే 60మిలియన్ డాలర్లు(రూ.384 కోట్లు) గల్లంతయ్యాయి. దీంతో ఆ కంపెనీ సీఈవో రాజీనామా చేయాల్సి వచ్చింది. -
హ్యాకింగ్ షాక్:హ్యాకర్లకు ఉబెర్ భారీ చెల్లింపులు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్ మరోసారి హ్యాకింగ్బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ ధృవీకరించింది. సంస్థకు చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాహ్యాకింగ్ గురైనట్టు రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉబెర్ మంగళవారం ప్రకటించింది. అంతేకాదు హ్యాక్ అయిన సమాచారాన్ని తొలగించేందుకు హ్యాకర్లకు భారీ ఎత్తున చెల్లింపులు కూడా చేసిందట. హ్యాకర్లకురూ. 1,00,000 డాలర్లు ( సుమారు రూ.65కోట్లు) చెల్లించింది. ఈ వ్యవహారంలో ఉబెర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జో సుల్లివాన్, డిప్యూటీ అధికారి క్రైగ్ క్లార్క్లపై వేటువేసింది. హ్యాకింగ్ విషయాన్ని ఉబర్ సీఈవో డారా ఖోస్రోషాహి తన బ్లాగ్ పోస్ట్ లో ధ్రువీకరించారు. 2016 అక్టోబరులో జరిపిన ఉల్లంఘన గురించి ఇటీవలే తెలుసుకున్నామని చెప్పారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు.. దీన్ని తాము ఉపేక్షించమని డారా స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్లో హ్యాకర్లు ఈ డేటాను హ్యాక్ చేశారన్నారు. సంస్థ క్లౌడ్ సర్వర్ ద్వారా డేటాను హ్యాక్ చేశారన్నారు. ఇందులో రైడర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్ల వివరాలు ఉన్నట్లు ఉబర్ పేర్కొంది. గతాన్ని తుడిచిపెట్ట లేం. కానీ పొరపాట్లనుంచి నేర్చుకుంటామనీ,ఇందుకు ప్రతి యుబెర్ ఉద్యోగి తరఫున హామీ ఇస్తున్నానని ఖోస్రోషాహి చెప్పారు. ప్రతి అంశంలో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడానికి కష్టపడి పనిచేస్తున్నామని తెలిపారు. హ్యాకింగ్ గురించి కొన్ని రోజుల క్రితమే మాజీ సీఈవో, ఉబర్ సహా వ్యవస్థాపకుడు ట్రావిక్ కలోనిక్కు తెలిసిందట. అయితే సీఈవో అధికారికంగా ప్రకటించేవరకు విషయాన్ని బహిర్గతం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు. దొంగలించిన ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని సీఈవో డారా అన్నారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ హ్యాకింగ్ విషయాన్ని దాచి పెట్టిన ఉబెర్ హ్యాకింగ్పై ప్రత్యేక బోర్డు కమిటీతో విచారణ చేపట్టిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరోవైపు దొంగిలించిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ఆయా సంస్థలు భారీగా చెల్లింపులు చేస్తున్నాయని అమెరికాఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, ప్రయివేట్ సెక్యూరిటీ అధికారులు వ్యాఖ్యానించారు. ఇలాంటి చెల్లింపులు చేస్తున్న సంస్థల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. కాగా 2014 లో గాడ్ వ్యూ అని పిలిచే ఒక సాఫ్ట్వేర్ ద్వారా గతంలో యుబెర్ డ్రైవర్ల, వినియోగదారుల సమాచారం హ్యాకింగ్కు గురైంది. -
బ్లూవేల్తో మరో డేంజర్ కూడా...
సాక్షి, న్యూఢిల్లీ : డేంజర్ డెత్ గేమ్గా అభివర్ణిస్తున్న బ్లూవేల్ ఛాలెంజర్ మన దేశంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంది. నియంత్రణతోపాటు నిషేధం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతూనే ఉన్నాయి. అందుకు కారణం ఆటకు సంబంధించిన లింకులు విస్తరించకుండా ఆపలేకపోవటమే. బ్లూవేల్ లింకులు ఇంటర్నెట్లో దొరకదు. అలాగని ఏ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటానికి వీల్లేదు. కేవలం సోషల్ మీడియాల్లో లింకుల ద్వారానే ఆట విస్తరించేలా అడ్మిన్ రూపకల్పన చేశాడు. అయితే ఇంతకాలం యువత ప్రాణాలతో చెలాగటం ఆడుతున్న బ్లూవేల్ ఇప్పుడు మరో రూపంలో కూడా ముప్పును మోసుకోస్తుంది. ప్రమాదకరమైన వైరస్ను సైబర్ నేరగాళ్లు బ్లూవేల్ లింకుల పేరిట పంపుతూ వ్యాపింజేస్తున్నారు. బ్లూవేల్ పేరిట వచ్చే నోటిఫికేషన్లను గానీ, సమాచారాన్నీ గానీ క్లిక్ చేస్తే చాలూ మీఫోన్లోని వ్యక్తిగత సమాచారం హ్యాక్కి గురయ్యే అవకాశం ఉందని ఇషాన్ సిన్హా అనే సైబర్ నిపుణుడు హెచ్చరిస్తున్నారు. సుమారు 70 లింకులపై అధ్యయనం చేసిన ఆయన అవన్నీ నకిలీవని తేల్చేశారు. ఇప్పటికే పలువురు తమ డేటా చోరీకి గురైనట్లు సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్లూవేల్ నేపథ్యం తెలిసి కూడా ఆత్రుతతో ఓపెన్ చేసి నష్టపోతున్న వారే చాలా మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లూవేల్ పేరిట వచ్చే హ్యాష్ట్యాగ్లను కూడా క్లిక్ చేయకపోవటమే మంచిదని వారు ప్రజలకు సూచిస్తున్నారు. గూగుల్, యాహూ, ఫేక్ బుక్సహా పలు సోషల్ మీడియా దిగ్గజాలకు ఇప్పటికే కేంద్రం బ్లూవేల్ లింకులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఐఫోన్ ఎక్స్కు భద్రత కరువట
-
ఐఫోన్ ఎక్స్కు భద్రత కరువట
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్లో ముఖాన్ని గుర్తించే ఐడీ ఫీచర్ భద్రతకు ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డేటా బేస్లో నిక్షిప్తమై ఉంటాయని, వాటిని ఎవరైనా హ్యాకింగ్ చేసినట్లయితే ప్రభుత్వానికి తెలిసిపోతుందని వారంటున్నారు. అయితే ఐఫోన్ ఎక్స్లో ఏర్పాటు చేసిన ముఖాన్ని గుర్తించే ఐడీ ఫీచర్ను ఉపయోగించినప్పుడు దానికి సంబంధించిన డేటా ఆపిల్ కంపెనీకి చెందిన క్లౌడ్ సర్వర్లో కాకుండా ఫోన్లోనే నిక్షిప్తం అవుతుందని, అందువల్ల భద్రతకు గ్యారెంటీ లేదని నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఐపిల్ ఫోన్లో నిక్షిప్తమైన డేటాను చోరీకి గురైన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ ఆరోపణలు, అనుమానాలపై ఆపిల్ నిపుణులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
స్క్రిప్ట్లను హ్యాక్ చేస్తే.. భారీ రివార్డు
వాషింగ్టన్ : హ్యాకర్లకు హెచ్బీఓ భారీ రివార్డు ప్రకటించింది. తను నిర్మిస్తున్న టీవీ షో స్క్రిప్ట్లను దొంగలించిన వారికి భారీగా బౌంటీ పేమెంట్ను చెల్లించనున్నట్టు పేర్కొంది. కంపెనీలు తమ నెట్వర్క్స్లో హాని కలిగించే లోపాలను గుర్తించిన వారికి ఆఫర్ చేసే రివార్డు మాదిరి, హెచ్బీఓ కూడా తన టీవీ షో స్క్రిప్ట్లు దొంగతనం చేసే వారికి 2,50,000 డాలర్లు అంటే కోటిన్నరకు పైగా బౌంటీ పేమెంట్ను అందించనున్నట్టు తెలిపింది. గతవారమే హెచ్బీఓ తమ డేటాలో ఉల్లంఘన జరిగినట్టు గుర్తించింది. తన టీవీలో వస్తున్న ఫేమస్ షో గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఆదివారం ఎపిసోడ్ షోకి ముందే ఆన్లైన్లో లీకైంది. దీనికి స్పందనగా తమ టీవీ స్ట్రిప్ట్లను దొంగతనం చేసే హ్యాకర్లకు భారీ బౌంటీ పేమెంట్ను హెచ్బీఓ ప్రకటించింది. ''మిస్టర్ స్మిత్'' అనే హ్యాకర్ లేదా హ్యాకింగ్ గ్రూప్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు వెల్లడైంది. ఈ స్క్రిప్ట్లు మాత్రమే కాక, హెచ్బీఓ నుంచి 1.5 టెర్రాబైట్స్ల డేటాను పొందినట్టు ఆ హ్యాకర్ గ్రూప్ తెలిపింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి ఆరునెలల వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే 6 మిలియన్ డాలర్లకు పైగా వారు కోరుతున్నారు. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే ఎక్కువ మొత్తంలో ఫైల్స్ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. హెచ్బీఓలో జరిగిన ఈ భారీ డేటా దాడిపై ఫోరెన్సిక్ నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదట!
న్యూయార్క్: మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంలోకి వచ్చిందని, ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని హెచ్చరిస్తూ అనానిమస్ (గుర్తుతెలియని)గా చెప్పుకుంటున్న హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది. మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు. దక్షిణ కొరియాలో అమెరికా థాడ్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆ దేశ సైన్యాన్ని, సైనిక సంపత్తిని కూడా హ్యాకర్లు యుద్ధ సన్నాహాలుగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి చైనా పౌరులను వెనక్కి రావాల్సిందిగా చైనా ప్రభుత్వం ట్రావెల్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే ప్రాణాలతో బయటపడేందుకు పది నిమిషాలకు మించి సమయం దొరకదని చైనా పేర్కొంది. ప్రపంచ దేశాలు మూడు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తాయని హ్యాకర్లు పేర్కొన్నారు. ఎవరి నాయకత్వాన ఆ బృందాలు ఏర్పాడతాయనే విషాయాన్ని మాత్రం తెలపలేదు. అమెరికా, ఉత్తరకొరియా రెండు బృందాలుగా చీలిపోతే మరి మూడో బృందం ఏ దేశం నాయకత్వాన ఏర్పడుతుందనే విషయంలో హ్యాకర్ల మాటల్లో స్పష్టత లేదు. రష్యా పేరును అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని తాము చెప్పడం లేదని, యుద్ధం జరిగేందుకు కచ్చితమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రమే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. అనానిమస్ హ్యాకర్లు విడుదల చేసిన ఏడు నిమిషాల నిడివిగల వీడియోలో మాట్లాడిన హ్యాకర్ తనను గుర్తుపట్టకుండా చిత్రమైన మాస్క్ ధరించాడు. -
మీ ఐఫోన్కు హ్యాకర్ల ముప్పుందా? అయితే...
ఎంతో సురక్షితమైన ఫోన్గా పేరుగాంచిన ఐఫోన్ కూడా హ్యాకర్ల బారిన పడుతోంది. ఇటీవలే లక్షల కొద్దీ ఐఫోన్ల డేటాను టర్కిష్ క్రైమ్ ఫ్యామిలీ హ్యాకింగ్ చేసినట్టు చెప్పుకుంటోంది. ఐక్లౌడ్.కామ్, మి.కామ్ డొమైన్ల 559 మిలియన్ల ఆపిల్ ఈ-మెయిల్ అకౌంట్ల యాక్సస్ తమ వద్ద ఉందని, 75వేల డాలర్లను బిట్ కాయిన్ రూపంలో లేదా లక్షల డాలర్ల ఐట్యూన్ గిఫ్ట్ కార్డులను తమకివ్వాలని ఆపిల్ ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తోంది. లేదంటే ఐఫోన్ల పాస్వర్డులు రీసెట్ చేస్తామని, ఫోటోలు , వీడియోలు, టెక్ట్స్ మెసేజ్లు, ఇతర వ్యక్తిగత డేటాను తొలగిస్తామని హెచ్చరిస్తోంది. కానీ ఐఫోన్లు అసలు హ్యాకింగ్ బారినే పడలేదని వారి బ్లాక్ మెయిల్ను ఆపిల్ కొట్టిపారేసింది. ఒకవేళ ఐఫోన్ల డేటా హ్యాకర్ల బారిన పడిన మాట నిజమైతే.. హ్యాకర్స్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి మార్గాలున్నాయట. ఏప్రిల్ 7కంటే ముందస్తుగా ఈ ప్రక్రియను పూర్తిచేసి తమ ఐఫోన్ డేటాను కాపాడుకోవాలని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాకర్ల బారి నుంచి తప్పించుకునే మార్గాలు... అధిక ఎంట్రోపీకి పాస్ వర్డ్ మార్చుకోవడం: అధిక ఎంట్రోపీకి పాస్ వర్డును మార్చుకోవాలంట. ర్యాండమ్ నెంబర్లు, క్యాపిటల్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్లతో పాస్వర్డులను ఉంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. లాస్ట్ పాస్ మాదిరి పాస్ వర్డ్ మేనేజర్ ను మీరు సృష్టించుకోవచ్చట. ఈ పాస్ వర్డ్ మేనేజర్తో ఎప్పడికప్పుడూ పాస్ వర్డ్ లను మేనేజ్ చేస్తూ ఉంచుకోవాలని సూచిస్తున్నారు. హై-ఎంట్రోపీ పాస్ వర్డ్ ఈ విధంగా ఉంచుకోవచ్చు. ఉదాహరణకి 1A@0z# మాదిరి పాస్ వర్డులు పెట్టుకుంటే హ్యాకర్లు వాటిని కనుక్కోవడం కొంచెం కష్టమని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. సెక్యురిటీ ప్రశ్నలకు ఒకే మాదిరి సమాధానం లేకుండా... సెక్యురిటీ ప్రశ్నలకు సమాధానాలు బట్టి కూడా హ్యాకర్లు తమ డేటా బేస్ ను దొంగతనం చేస్తారు. సైట్ కి సైట్ కి సెక్యురిటీప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు మార్చుకోవాలని చెబుతున్నారు. మెయిన్ నెంబర్తో కీలకడేటాను కనెక్షన్ వద్దు... యూజర్లు తమ మెయిన్ నెంబర్ను ఈ-మెయిల్ అకౌంట్ సెక్యుర్గా పెడితే, అది హైజాకింగ్ బారిన పడే ముప్పు ఎక్కువగానే ఉందంట. మీ మెయిన్ నెంబర్ టెల్కో వద్ద ఉంటుంది. దాంతో పాటు గూగుల్ వాయిస్ కూడా మీ నెంబర్ ను మేనేజ్ చేయనప్పుడు అంత సురక్షితం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సిటివ్ అకౌంట్లకు వేరే నెంబర్లను ఇచ్చుకోవాలని అది గూగుల్ వాయిస్ నెంబర్ అయితే హ్యాకర్లు మీ అనుమతి లేకుండా ఫోన్లలోకి చొచ్చుకుని రాలేరట. ఎక్కువగా హ్యాకర్లు ఫోన్ నెంబర్లను దొంగతనం చేసే డేటాను దొంగలిస్తుంటారని టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టూ-ఫ్యాక్టర్ అథన్టికేషన్: టూ-ప్యాక్టర్ అథన్టికేషన్ ను వినియోగిస్తే బారి ముప్పు నుంచి తప్పించుకోవచ్చట. ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ లేదా వాయిస్ స్కాన్ లేదా బయోమెట్రిక్ సెన్సార్ వంటి వాటిని అథన్టికేషన్ గా వినియోగించుకోవచ్చు. -
హ్యాకర్ల గుప్పిట్లో ఐఫోన్ల డేటా: కంపెనీని బ్లాక్మెయిల్
హ్యాకర్ల బారిన పడకుండా ఎంతో సురక్షితమైన ఫోన్ గా ఐఫోన్ కు పేరుంది. అందుకే ఆపిల్ ఐఓఎస్ సిస్టమ్ అంత పాపులారిటీ చూరగొంది. కానీ ఐఫోన్లు కూడా హ్యాకర్ల బారిన పడతాయని వెల్లడవుతోంది. తాజాగా మిలియన్ల కొద్దీ ఐఫోన్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లిపోయిందట. ఆ ఐఫోన్ అకౌంట్ల ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు అన్ని హ్యాకర్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారట. 'టర్కిస్ క్రైమ్ ఫ్యామిలీ' అనే హ్యాకర్ల గ్రూప్ ఈ చోరీ చేసినట్టు వెల్లడవుతోంది. ఐక్లౌడ్, ఇతర ఆపిల్ ఈమెయిల్ అకౌంట్ల డేటాను తొలగించాలటే తమకు 75వేల డాలర్లను బిట్ కాయిన్ లేదా ఇథేరియన్ రూపంలో ఇవ్వాలని లేదా లక్ష డాలర్ల విలువైన ఐట్యూన్స్ గిఫ్ట్ కార్డులను తమకు ఇవ్వాల్సి ఉంటుందని ఆ హ్యాకర్ల గ్రూప్ కంపెనీని బ్లాక్ మెయిల్ చేస్తుందని తెలిసింది. కానీ ఆపిల్ కంపెనీ మాత్రం అసలు ఈ హ్యాకింగే జరుగలేదని తోసిపుచ్చింది. ఐక్లౌడ్, ఆపిల్ ఐడీలకు సంబంధించి ఎలాంటి ఆపిల్ సిస్టమ్స్ దొంగతనానికి గురికాలేదని తేల్చిచెబుతోంది. దాదాపు 559 మిలియన్ల(55కోట్లకుపైగా) ఆపిల్ ఈమెయిల్, ఐక్లౌడ్ అకౌంట్లను హ్యాకర్లు దొంగతనం చేసినట్టు చెబుతున్నారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఆపిల్స్ సెక్యురిటీ టీమ్ కు పంపిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ కంపెనీలపై‘ర్యాన్సమ్వేర్’ వల!
సైబర్ దాడులకు దిగిన పాకిస్తాన్ హ్యాకర్లు - ఈ-మెయిళ్లు, యాడ్ల ద్వారా వైరస్లు - కంప్యూటర్లలోని డేటాను లాక్ చేస్తూ సొమ్ము కోసం డిమాండ్లు - ఇటీవలే ఓ సంస్థ కంప్యూటర్లు హ్యాక్ - రూ. 420 కోట్లు ఇవ్వాలన్న హ్యాకర్లు! - రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సాక్షి, హైదరాబాద్: భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) భారతదేశంలోని సంస్థలపై సైబర్ దాడులకు దిగుతున్నారు. ‘ర్యాన్సమ్ వేర్’గా పిలిచే వైరస్లను ప్రముఖ సంస్థల కంప్యూటర్లలో చొప్పించి, లాక్ చేస్తున్నారు. తిరిగి అన్లాక్ చేసేం దుకు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సైబరాబాద్లోని ఓ ప్రముఖ సంస్థపై ఇటీవల ‘ర్యాన్సమ్ ఎటాక్’ చేసిన పాకిస్తాన్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఈ తరహా దాడులు పెరిగిపోవడంతో సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రంగంలోకి దిగింది. ఈ-మెయిళ్లు, ప్రకటనల ద్వారా.. పాకిస్తాన్ హ్యాకర్లు ‘సైబర్ ఎక్స్టార్షన్, బ్రౌజర్ లాకర్, రాన్సమ్వేర్’ వంటి వైరస్లను వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన సంస్థల్లోని కంప్యూటర్లకు ఈ-మెయిల్స్, యాడ్స్ రూపంలో ఈ వైరస్లను పంపిస్తున్నారు. వాటిలోని లింక్లపై క్లిక్ చేస్తే చాలు వైరస్ కంప్యూటర్లోకి చొరబడుతుంది. వెంటనే కంప్యూటర్లోని డేటా మొత్తాన్ని ‘ఎన్క్రిప్ట్’ చేసి, లాక్ చేస్తుంది. మానిటర్పై ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’ అనే సందేశం కనిపిస్తుంది. డేటాను అన్లాక్ చేసే పాస్వర్డ్ తమ వద్ద ఉందని చెబుతూ, అన్లాక్ చేయాలంటే భారీగా సొమ్ము ఇవ్వాలంటూ సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నా రు. ఈ కంప్యూటర్ల స్క్రీన్పై నిర్దేశిత గడువుకు సంబంధిం చిన కౌంట్డౌన్ సమయం కూడా కనిపిస్తుంది. సొమ్ము చెల్లించకపోతే తాము పాస్వర్డ్ను నిర్వీర్యం చేస్తామని, దాంతో డేటాను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని హ్యాక ర్లు బెదిరిస్తున్నారు. ఎవరైనా ఆ టైమర్ను, వైరస్ ప్రోగ్రామ్ను మార్చాలని ప్రయత్నించినా, నగదు డిపాజిట్ చేసిన ట్లు తప్పుడు వివరాలు పొందుపరిచినా కౌంట్డౌన్ సమ యం మరింత తగ్గిపోవడం ఈ వైరస్కు ఉన్న మరో లక్షణం. నాన్-సెమెట్రిక్ విధానంలో.. కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడం)లో సెమెట్రిక్, నాన్ సెమెట్రిక్ అని రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్లాకింగ్కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్-సెమెట్రిక్ విధానంలో మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే హ్యాకర్లు ఈ విధానంలోనే కంప్యూటర్లను లాక్ చేస్తారు. అంటే వారి వద్ద ఉన్న ప్రైవేట్ ‘కీ’ తెలిస్తే తప్ప డేటాను అన్లాక్ చేయడం సాధ్యం కాదు. ఫార్మాట్ చేస్తే అందులో డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కంపెనీలు విలువైన, అత్యవసరమైన డేటాను పోగొట్టుకోలేక.. మనీప్యాక్, ఓచర్స్, ఈ-మనీ, బిట్కాయిన్ రూపాల్లో హ్యాకర్లు డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించాల్సి వస్తోంది. హ్యాకర్లు సొమ్ము అందాక వైరస్ ప్రోగ్రామ్ ద్వారానే అన్లాక్ ‘కీ’ పంపుతున్నారు. దాన్ని వినియోగిస్తే కంప్యూటర్ యథాప్రకారం పనిచేసి, అందులోని డేటా భద్రంగా అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలపై.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ర్యాన్సమ్వేర్ బారినపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్చువల్ కరెన్సీ అయిన ‘బిట్ కాయిన్స్’ రూపంలో ఆ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ దాడులను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. దానితో కంప్యూటర్ లాక్ కావడంతో పాటు.. ఇలా లాక్ చేసినది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్లుగా స్క్రీన్పై కనిపిస్తుంది. అన్ని దేశాల్లో నేరంగా పరిగణించే చైల్డ్ పోర్న్ వెబ్సైట్లు చూశారనో, మరో ఉల్లంఘనగానో పేర్కొంటూ కంప్యూటర్ను లాక్ చేసినట్లు హ్యాకర్లు పేర్కొంటారు. ఈ వైరస్ల్లోని మరో లక్షణం ఏమిటంటే.. అవి వెబ్క్యామ్ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లొకేషన్లను మానిటర్పై డిస్ప్లే చేస్తాయి. అంతేకాదు ‘మీ కదకలను గమనిస్తున్నాం. తదుపరి చర్యలు చేపట్టకూడదంటే చేసిన తప్పుకు జరిమానా చెల్లించండి’ అనే డిమాండ్ కనిపిస్తుంది. దీంతో భయపడిపోయే వినియోగదారులు సొమ్ము చెల్లిస్తున్నారు. ఫోన్లకూ ఈ వైరస్ ముప్పు ‘‘కేవలం కంప్యూటర్లు మాత్రమే కాదు స్మార్ట్ఫోన్లకూ ర్యాన్సమ్ వేర్ ముప్పు ఉంది. ఫోన్లలో ఉన్న డేటాను సైతం సైబర్ నేరగాళ్లు లాక్ చేస్తున్నారు. ఎక్కువగా వ్యక్తిగత ఫోన్లు, కంప్యూటర్లతో పాటు చిన్న చిన్న కంపెనీలు మాత్రమే దీని బారినపడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు పటిష్టమైన ఫైర్వాల్స్ (రక్షణ సాఫ్ట్వేర్లు) ఏర్పాటు చేసుకోవడంతో వీటి బారినపడట్లేదు. గత పదేళ్లలో భారతదేశంలో 2,400 రెట్లు సైబర్ నేరాలు పెరిగాయి. ఇటీవల ఓ సంస్థను ఎటాక్ చేసిన పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేశారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఆ స్థాయి కార్పొరేట్ సంస్థకు అలా జరుగుతుందని మేం భావించట్లేదు..’’ - ఎ.భరణి, సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అనుమానాస్పద మెయిల్స్, యాడ్స్ ఓపెన్ చేయొద్దు ర్యాన్సమ్వేర్, బ్రౌజర్ లాకర్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ముప్పేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అపరిచిత ఐడీల నుంచి వచ్చే ఈమెయిల్స్, అనుమానాస్పద యాడ్స్ కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో మంచి యాంటీ వైరస్ ఏర్పాటు చేసుకోవడమే వీటిని పరిష్కారమని పేర్కొంటున్నారు. బ్రౌజర్ లాకర్ కొన్ని యాంటీ వైరస్లకు లొంగినా.. ర్యాన్సమ్వేర్కు మాత్రం పరిష్కారం లేదని అంటున్నారు. హ్యాకర్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే ప్రైవేట్ ‘కీ’ ఏర్పాటు చేయరని, దాంతో బాధితులంతా సొమ్ము చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ హ్యాకర్లు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్లను వినియోగిస్తారని, అందువల్ల పట్టుకోవడం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు. -
విక్రమసింహపురి వర్సిటీ వెబ్ సైట్ హ్యాకింగ్
నెల్లూరు: నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన వెబ్సైట్ను కొందరు వ్యక్తులు శనివారం మధ్యాహ్నం నుంచి మరోసారి హ్యాక్ చేశారు. కొంత మంది విద్యార్థులు డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల కోసం వీఎస్యూ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పనిచేయలేదు. అయితే గూగూల్ కెళ్లి వీఎస్యూ రిజల్ట్స్ టైపు చేస్తే ఓపెన్ అవుతుంది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. వీఎస్యూ అధికారులకు మాత్రం ‘సాక్షి’ సమాచారం ఇచ్చేదాక తెలియక పోవడం గమనార్హం. పాకిస్థాన్కు చెందిన కొంత మంది వ్యక్తులు వీఎస్యూ వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు తెలిసింది. పాకిస్థాన్ జిందాబాద్ అని, వెబ్సైట్కు సెక్యూరిటీ అనుకోవడం కేవలం మీ భ్రమని పోస్టు చేశారు. దీంతో పాటు ఈ నెల 14న దేశ వ్యాప్తంగా అనేక వెబ్సైట్లను హ్యాక్ చేస్తామని మెసేజ్ పెట్టారు. ఇదే వీఎస్యూ వెబ్సైట్ను గత నెల 30న పాకిస్థాన్కు చెందిన కొంతమంది హ్యాక్ చేశారు. అయితే వీఎస్యూ వెబ్సైట్పై సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెబ్సైట్ను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ సంస్థ నిర్వహణలో ఉంది. వీఎస్యూ వెబ్సైట్ హ్యాక్ విషయంలో వీఎస్యూ రిజిస్ట్రార్ శివశంకర్కు ఫోన్ చేయగా మాల్వేర్ ఇంజక్షన్ వైరస్ ఫైర్వాల్ను బ్లాక్ చేసినట్లు చెప్పారు. సంస్థ నిర్వాహకులకు ఈవిషయాన్ని తెలియజేసి వెబ్సైట్ను క్లోజ్ చేయించారని తెలిపారు. -
హ్యాకర్లకు ఆపిల్ బంపర్ ఆఫర్
-
యాపిల్ హ్యాకర్లకు బంపర్ ఆఫర్
-
యాపిల్ హ్యాకర్లకు బంపర్ ఆఫర్
టెక్ దిగ్గజం యాపిల్ సాప్ట్వేర్ అప్లికేషన్లలోకి తలదూర్చుతున్నారా...? లోపాలు వెతికే పనిలో పడ్డారా..? అయితే యాపిల్ సాప్ట్వేర్లో లోపాలను గుర్తించే వారికి ఇది బంపర్ ఆఫరే. లోపాలను గుర్తించి రివార్డులను కొట్టేయొచ్చట. తన కంపెనీ సాప్ట్వేర్లో భద్రతాపరమైన లోపాలను గుర్తించి, తెలియజేసినందుకు హ్యాకర్లకు 2లక్షల డాలర్ల(కోటి 33 లక్షలకు పైగా) వరకు రివార్డును ఆఫర్ చేయనున్నట్టు యాపిల్ ఇంక్ ప్రకటించింది. లాస్ వెగాస్లోని కంప్యూటర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రొగ్రామ్లో యాపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రారంభంలో లిమిటెడ్ రీసెర్చర్లకు ఈ రివార్డులను అందిస్తామని, ఈ ప్రొగ్రామ్ను మెల్లమెల్లగా విస్తరిస్తామని గూగుల్ తెలిపింది. కంపెనీ సాప్ట్వేర్లో భద్రతను సీరియస్గా తీసుకున్న యాపిల్, సమస్యను గుర్తించడంలో బయటి వ్యక్తుల సహకారాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సమాచారాన్ని ఇతరులకు విక్రయించకుండా డైరెక్టుగా కంపెనీకే అందించేలా హ్యాకర్లకు రివార్డులను అందించాలని యాపిల్ నిర్ణయించింది. తమ కంప్యూటర్ కోడ్ల్లో లోపాలు గుర్తించిన వారిని టెక్ దిగ్గజాలు "బగ్ బౌన్టీస్"గా పిలుస్తారు. గూగుల్, ఫేస్బుక్ వంటి ఇతర కంపెనీలు తమ సాప్ట్వేర్లో లోపాలను గుర్తించి, కంపెనీకి తెలియజేసినందుకు హ్యాకర్లకు ఎప్పటినుంచో రివార్డులను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం యాపిల్ సైతం ఈ బాటలోనే పయనించనుంది. -
వెబ్సైట్ను హ్యాక్ చేసి చెత్త రాతలు..
నోయిడా: నోయిడాలోని ప్రముఖ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్కు సంబంధించిన వెబ్సైట్ హ్యాకర్ల బారినపడింది. వెబ్సైట్ను ఓపెన్ చేస్తే.. దానిలో పాకిస్తాన్ జెండా దర్శనమివ్వడంతో అధికారులు షాక్ తిన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. సైట్ను అఫ్లైన్లో ఉంచారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్కు చెందిన ది స్కూల్ ఆఫ్ లా, డిజైన్ అండ్ ఇన్నొవేషన్ అకాడమీ వెబ్సైట్ సోమవారం రాత్రి హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. వెబ్సైట్లో హ్యాకర్లు పాకిస్తాన్ జెండాతో పాటు చైనా జెండాను ఉంచి.. భారత్కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 'మాస్టర్ జీ వెబ్సైట్ పాకిస్తానీ హ్యకర్లచే హ్యాక్ చేయబడింది' అంటూ వెబ్సైట్లో ఓ మెసేజ్ను సైతం ఉంచారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ జరుపుతున్నట్లు సర్కిల్ ఆఫీసర్ అరవింద్ యాదవ్ తెలిపారు. -
జూకర్బర్గ్కు పెద్ద ఝలక్
న్యూఢిల్లీ: ఫేస్ బుక్ భద్రమే కానీ.. దాని వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జూకర్ బర్గ్కు మాత్రం హ్యాకర్స్ గట్టి ఝలక్ ఇచ్చారు. లక్షల మంది సోషల్ మీడియా ఖాతాలు తన కనుసన్నల్లో నిలపగల ఆయన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలపై హ్యాకర్స్ దాడి చేశారు. జూకర్ బర్గ్ కు చెందిన ఏ ఒక్క సోషల్ మీడియా ఖాతాను వారు వదిలిపెట్టలేదు. ఇన్ స్టాగ్రం, లింక్డెన్, పింటరెస్ట్, ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్స్ను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా చెడకొట్టారని ఆయనకు సంబంధించిన అధికారులు తెలిపారు. అయితే, ఆయన ఈమెయిల్ అకౌంట్పై కూడా దాడి చేశారా అనే విషయం తెలియలేదు. అయితే, పైన పేర్కొన్న ఖాతాలన్నింటికి కూడా జూకర్ తన వ్యక్తిగత ఈమెయిల్ ను లింక్ గా పెట్టుకున్నట్లు సమాచారం. బహుశా దానిపై కూడా హ్యాకర్ల కన్ను పడే ఉంటుందని అంటున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఓ చిన్న యువగ్రూపు ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. జూకర్ బర్గ్ ఆన్ లైన్ వ్యవస్థకు ఎంతటి సెక్యూరిటీ ఉందో పరీక్షించేందుకే వారు ఇలా చేసి ఉంటారని సోషల్ మీడియాలో పలువురు చెప్తున్నారు. హ్యాక్ చేసిన వాళ్లు కొన్ని స్క్రీన్ షాట్లను.. ఆయన వాడిన డాడాడా (డీఏడీఏడీఏ) పాస్ వర్డ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ, కొద్ది సేపటికే అది ట్విట్టర్ ఖాతా నుంచి కనిపించకుండా పోయింది. ఫేస్ బుక్ కూడా ఈ వార్తలని నిజమేనని చెప్పింది. ప్రస్తుతానికి ఆయన ఇన్ స్టాగ్రం ఖాతా తెరుచుకోవడం లేదట. Ouch. Mark Zuckerberg's social media accounts have been hacked pic.twitter.com/KvVmXOIg5s — Ben Hall (@Ben_Hall) 5 June 2016 -
సొంత ఫేస్బుక్.. అంతలోనే హ్యాకయింది!
ఉత్తరకొరియా తాను సొంతంగా రూపొందించుకున్న ఫేస్బుక్ అంతలోనే హ్యాకయింది. హ్యాకర్లు దాన్ని ఆఫ్లైన్లోకి పంపేశారు. దాదాపు ఫేస్బుక్లాగే కనిపించే మరో సోషల్ మీడియా సైట్ను ఉత్తరకొరియాలో సృష్టించారు. దాన్ని ప్రపంచంలో ఎవరైనా యాక్సెస్ చేసేలా చూసుకున్నారు. 'పీహెచ్పీ డాల్ఫిన్' అనే సాఫ్ట్వేర్ టూల్ సాయంతో 'బెస్ట్ కొరియా' అనే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ను రూపొందించారు. దాన్ని ఎవరైనా కొనుక్కుని, తమ సొంత ఫేస్బుక్ లాంటి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, కొరియన్లు రూపొందించిన సొంత ఫేస్బుక్కు డీఫాల్ట్ పాస్వర్డ్ ఉండటంతో హ్యాకర్లకు పని చాలా సులభమైంది. ఓ స్కాటిష్ విద్యార్థి దాన్ని హ్యాక్ చేసి, అందులోని ప్రకటనల స్లాట్లన్నింటిలో తన సొంత మెసేజ్ ఒకటి పెట్టేశాడు. ''నేను ఈ సైట్ను తయారుచేయలేదు, కేవలం లాగిన్ వివరాలు కనుక్కున్నాను' అనే సందేశం పెట్టి, దాన్ని తన సొంత ట్విట్టర్ అకౌంటుకు లింక్ చేశాడు. దాంతో కొరియన్ల సొంత ఫేస్బుక్ కాస్తా బుక్కైపోయింది. ఈ సైట్ను ఉత్తర కొరియా సర్వర్లో రిజిస్టర్ చేసినా, దాన్ని సరిగ్గా ఎక్కడి నుంచి చేశారు, దాని వెనక ఎవరున్నారన్న విషయాలు మాత్రం తెలియలేదు. అసలు ఉత్తర కొరియాకు సొంత ఫేస్బుక్ ఎందుకు సృష్టించాలనుకున్నారో కూడా తెలియరాలేదు. ఆ దేశంలో కేవలం కొన్నివేల మందికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. అందులో కూడా ఫేస్బుక్ లాంటి పాశ్చాత్య సైట్లు చూసేందుకు వీల్లేదు. చాలా పరిమితులున్నాయి. గత సంవత్సరం దాదాపు పీహెచ్పీ డాల్ఫిన్ లాంటి టూల్తోనే ఐఎస్ఐఎస్ మద్దతుదారులు తమ సొంత ఫేస్బుక్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. కానీ దాన్ని కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. దాంతో కొద్ది రోజులకే అది పడుకుంది. -
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకూ హ్యాకింగ్ ముప్పు
హెల్సింకీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు హ్యాకింగ్ ముప్పు ఉందా? ఉందని చెబుతున్నారు ఫిన్లాండ్కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఎఫ్ సెక్యూర్’ సంస్థ నిపుణులు మిక్కో హిప్పోనెన్. ఇప్పటికే ఇలాంటి హ్యాకర్స్ ఉన్నారని, వారే రష్యాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ‘రాన్సమ్వేర్’ హ్యాకర్లని ఆయన తెలిపారు. వీరు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలోని కంప్యూటర్ వ్వవస్థలోకి ప్రవేశించి, వైరస్ ఎక్కించడం ద్వారా కారు కంట్రోల్ను తమ ఆధీనంలోకి తీసుకుంటారని, కారు యజమాని రాన్సమ్ (వారు అడిగినంత డబ్బు చెల్లిస్తేనే) చెల్లిస్తేనే కారుకు మళ్లీ యాక్సెస్ కల్పిస్తారని హిప్పోనెస్ చెబుతున్నారు. రాన్సమ్వేర్ హ్యాకర్లు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను యాక్సిడెంట్లకు గురిచేస్తారన్న భయం తనకు లేదని, వారూ డబ్బుకోసం హ్యాకింగ్ చేసే తత్వానికి చెందిన వారని ఆయన చెప్పారు. డ్రైవర్లెస్ కార్లను తీసుకొచ్చేందుకు కొన్ని కంపెనీలు ఇప్పటికే పోటీ పడుతున్న విషయం తెల్సిందే. వాటిలో గూగుల్ కంపెనీ కాస్త ముందుండి తన డ్రైవర్లెస్ కారుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న విషయమూ తెల్సిందే. మరో రెండేళ్లలో డ్రైవర్లెస్ కార్లను తీసుకొస్తామని ‘టెల్సా మోటార్స్’ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. రానున్న కాలమంతా డ్రైవర్లెస్ కార్లదేనని, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 25 శాతం కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే ఉంటాయని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. మరి, ఈ హ్యాకింగ్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రక్షించుకోవడం ఎలా? అని హిప్పోనెన్ను ప్రశ్నించగా, ఎప్పటికప్పుడు పటిష్టమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసుకుంటూ పోవడమేనని, ఓ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయగానే దానిలో ఉన్న లొసుగులను పట్టుకొని హ్యాకర్లు పుట్టుకొస్తుంటారని, వారి బారిన పడకుండా తప్పించుకొనేందుకు నిరంతర ప్రక్రియ అనువైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసుకుంటూ పోవడం ఒక్కటే దారని ఆయన అన్నారు. ఇటీవల గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాక్సిడెంట్కు గురవడం హ్యాకర్ల వల్ల జరగలేదని, ఎదురుగా వస్తున్న బస్సును సెన్సర్లు సరిగ్గా గుర్తించక పోవడం వల్లనే జరిగిందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
తిమింగలాల కోసం ..
టోక్యో: జపాన్ లో మరోసారి అధికారిక వెబ్సైట్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తాజాగా గురువారం ప్రధాన మంత్రి షింజో అబే అధికారిక వెబ్సైట్ను హాకర్స్ క్రాష్ చేశారు. దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న తిమింగలాల వేటను నిరసిస్తూ ఈ చర్యకు పూనుకున్నామని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారన్నారు. త్వరలోనే సైట్ ను పునరుద్ధరిస్తామని క్యాబినెట్ ముఖ్యకార్యదర్శి యోషిండే సుగా ప్రకటించారు. తిమింగలాలను వేటాటడం సరైంది కాదని, అంతరించి పోతున్న తిమింగలాల జాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన వెబ్సైట్ దాడులకు తమదే బాధ్యత అని కూడా ఆ గ్రూపు ప్రకటించింది. కాగా తిమింగాల వేటపై అనేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
కంపెనీలకు సైబర్ ముప్పు
గత ఏడాదిలో భారత్లోని 72 శాతం కంపెనీలు ఏదో ఒకరూపంలో సైబర్ దాడికి గురయ్యాయి. 63 శాతం సంస్థలు తమకు ఆర్థికనష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి. హ్యాకర్లు... ఆయా కంపెనీల సర్వర్లపై, కంప్యూటర్ నెట్వర్క్పై దాడి చేసి నష్టం కలిగిస్తున్నారు.కెపీఎంజీ సైబర్ క్రైమ్ సర్వే- 2015లో ఈ విషయం తేలింది. సర్వేలో వెల్లడైన అంశాలివీ... ►94% కంపెనీలు తమకు ప్రధానముప్పులో ఒకటిగా సైబర్ క్రైమ్ను పేర్కొన్నాయి. ►41% కంపెనీలు తమ బోర్డు సమావేశాల ఎజెండాలో సైబర్క్రైమ్ చర్చనీయాంశంగా ఉందని చెప్పాయి. ►74% బ్యాకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ రంగమే ప్రధాన టార్గెట్ అని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ►64% డెరైక్టర్లు లేదా మేనేజ్మెంట్పై ఎక్కువగా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని కంపెనీలు చెప్పాయి. కంపెనీలపై ప్రభావం ► 63% ఆర్థిక నష్టాలు ► 53% కొత్త ఆలోచనలు, కీలక డాటా చోరీ ► 49% సంస్థ పేరు దెబ్బతినడం ► 47% వ్యాపార ప్రక్రియకు విఘాతం ► 27% నియంత్రణ సంస్థ దృష్టిలో ఉల్లంఘనలు ► 11% ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతినడం ► 8% ఇతరాలు -
'మా హోటల్కు వచ్చారా.. మీ క్రెడిట్ కార్డు జాగ్రత్త'
ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఓ హోటల్ కు చెందిన సేల్ కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి క్రెడిట్ కార్డు సమాచారం హ్యాకింగ్కు గురైనట్లు ఆ హోటల్ యజమాన్యం తెలిపింది. అంతకుముందు తమ హోటల్స్లో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు ఉపయోగించినవారంతా ప్రతి రోజు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మంచిదని హెచ్చరించింది. అమెరికాలో హిల్టన్ అనే పేరుతో ప్రఖ్యాతిగాంచిన హోటల్స్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భద్రతా సంస్ధల సమాచారాన్ని, ప్రభుత్వశాఖల సమాచారాన్ని దొంగిలించే హ్యాకర్స్ ఈసారి తమ దృష్టిని హిల్టన్ హోటల్స్ పై పెట్టారు. ఆ హోటల్స్ లో క్రెడిట్ కార్డు ఉపయోగించినవారి సమాచారం దొంగిలించారు. దీంతో గత ఏడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూలై 27 మధ్య క్రెడిట్ కార్డులు ఉపయోగించినవాళ్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని, వారి ఖాతాలను తనిఖీ చేసుకుంటుండాలని ఆ హోటల్ ఓ ప్రకటనలో హెచ్చరించింది. క్రెడిట్ కార్డుల సమాచారం దొంగిలించిన వారు కేవలం కార్డు సమాచారం మాత్రం హ్యాక్ చేశారు తప్ప ఆ కార్డు యజమాని టెంపరరీ అడ్రస్ను గానీ, పర్మినెంట్ అడ్రస్ నుగానీ హ్యాక్ చేయలేదని స్పష్టం చేసింది. -
ఆ 'సైట్లు' చూస్తే.. అంతే!
ఈ ఏడాది మీరు శృంగార వెబ్సైట్లు చూశారా? అయితే ఏయే వీడియోలు చూశారు, ఏయే పోర్న్ వెబ్సైట్లను తిరిగేశారు.. ఇలా మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం బట్టబయలయ్యే అవకాశముంది. అజ్ఞాత (ఇన్ కాగ్నిటో) మోడ్లో చూసినా.. మీ ఆన్లైన్ చరిత్ర అంతా వెలికిరానుంది. పోర్న్ వెబ్సైట్లతోపాటు ఆన్లైన్ లో మీరేం చూశారో బ్రౌజింగ్ హిస్టరీతో సహా వెల్లడయ్యే అవకాశం ఉందని సాన్ ఫ్రాన్సికోకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రెట్ థామస్ వెల్లడించారు. హ్యాకర్లు లాగ్స్ లిస్ట్ను దొంగతనంగా పొందే అవకాశముందని, దానిద్వారా యూజర్ పేరు కూడా తెలుసుకోవచ్చునని, ఈ వివరాలతో క్రాస్-రిఫరెన్స్ చేసుకొని పోర్న్ వంటి వెబ్సైట్లలో లాగిన్ అయిన వివరాలను తెలుసుకోవచ్చునని ఆయన తన బ్లాగ్లో వెల్లడించారు. చాలాపెద్ద ఎత్తున హ్యాకింగ్ కు పాల్పడితే తప్ప ఈ వివరాలు తెలుసకునే అవకాశం లేదని, అయితే భవిష్యత్లో హ్యాకర్లు ఈ వివరాల కోసం దాడులు చేయవచ్చునని తెలిపారు. కాబట్టి టెక్నో నిపుణులు ఇలాంటి లీకులు జరుగకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, ఇలాంటి సున్నితమైన లీకుల వల్ల ఆన్లైన్ యూజర్లలో కల్లోలం తలెత్తే అవకాశముంనదదని పేర్కొన్నారు. -
కెల్లీబ్రూక్.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ!?
లండన్ః అంతర్జాలంలో ఇప్పుడు ఓ మాయాజాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సెలబ్రిటీల రూపంలో యూజర్ల వివరాలను హాక్ చేసేస్తోంది. అవునండీ... కనిపించింది కదాని అందంగా ఉన్న సెలబ్రిటీని చూస్తూ మైమరిచిపోతే ఇక అంతే... మీ నెట్ జీవితంలో హాకర్ టెర్రర్.. ప్రవేశించినట్లే... లండన్ కు చెందిన సెలబ్రిటీ కెల్లీబ్రూక్ ఇప్పుడు మోస్ట్ డేంజరస్ గా తయారైంది. ఇంటర్నెట్ అభిమానుల మనసుదోచేస్తూ... ఫోటోపై క్లిక్ మనిపిస్తే చాలు... ఏకంగా వారి ఖాతాల్లోకి చొరబడిపోతోంది. యునైటెడ్ కింగ్డమ్.. ఇప్పుడు కెల్లీబ్రూక్ ఫోటో చూస్తే భయపడిపోతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీగా ఆమె మారిపోయింది. కెల్లీ ఫొటోను హాకర్స్ డేంజరస్ సిగ్నల్ గా మార్చేశారు. కంప్యూటర్లలో వైరస్ గా వ్యాపింపజేసేస్తున్నారు. మోడల్ గా ఎంతో పేరున్న కెల్లీ బ్రూక్ ఫొటోను నెట్లో ముట్టుకుంటే చాలు... ఇన్ఫెక్షన్ లా వైరస్ వ్యాపించేస్తోంది. ఆమెతోపాటు మరి కొందరి ఫొటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్లను గడగడలాడిస్తున్నాయి. ఫెర్నాండెజ్ వెర్శిని, డచ్ డ్యాన్స్ డీజే... ఆర్మిన్ వాన్ బూరెన్లు కూడ కెల్లీ సరసన చేరిపోయారు. ఇంటర్నెట్లో వీరిలో ఎవ్వరి ఫొటోపై క్లిక్ చేసినా డేంజర్ లో పడినట్లే... ఒకప్పుడు ప్రపంచాన్ని కైపెక్కించిన సెక్సీయస్ట్ మహిళగా కెల్లీ బ్రూక్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు అంత కాకపోయినా.. గ్లామరస్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు నిలబెట్టుకుంది. అటువంటిది హాకర్ల బారిన పడి ప్రస్తుతం డేంజరస్ సెలబ్రిటీగా తయారైంది. యాక్టర్ గా మారిన మోడల్ కెల్లీ ఫొటోలు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నారు నెట్ సెక్యూరిటీ నిపుణులు. ఆమె ఫొటోలను ఇప్పుడు హ్యాకర్లు ఎక్కువగా వాడుతున్నారని, తెలియక ఆమె ఫొటోలను క్లిక్ చేస్తే వారి వెబ్ సైట్లు వైరస్ తో నిండిపోతాయని హెచ్చరిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన వెబ్ సెక్యూరిటీ సంస్థ మెక్ ఎఫీ మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల లిస్టులో కెల్లీ బ్రూక్ తో పాటు ఫెర్నాండెజ్ వెర్శింట్ ను కూడ టాప్ లిస్టులో చేర్చింది. -
‘హ్యాక్’ చేసి..అరెస్టయ్యారు
బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మళ్లింపు పరారీలో ప్రధాన సూత్రధారి సాక్షి, సిటీబ్యూరో : ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాల హ్యాకింగ్, ఫోన్ నంబర్ను క్లోనింగ్ చేసి నగదు బదిలీలు చేసేందుకు అంతర్రాష్ట మోసగాళ్లకు సహకరిస్తున్న ఇద్దరిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారంట్పై నగరానికి సోమవారం తీసుకొచ్చారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ ప్రభాకర్ రావు కథనం ప్రకారం.. తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ను హ్యాక్ చేసి సికింద్రాబాద్లోని ఎస్డీ రోడ్డులో ఉన్న విజయబ్యాంక్లోని ఖాతా నుంచి రూ.10,75,000 బదిలీ చేశారని యూనియన్ రోడ్డువేస్ యాజమాన్యం మే 15న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.8,75,000 కోల్కతాలోని ఐసీఐసీఐ బ్యాంక్కు, గోరఖ్పూర్లోని ఐసీఐసీఐ బ్యాంక్కు రూ 2,00,000 బదిలీ అయ్యాయని విచారణలో తేలింది. దీంతో కోల్కతాకు పోలీసు బృందం వెళ్లి...లబ్ధిదారుడైన అకౌంట్ హోల్డర్ మమతా మయీ సెంటర్ ప్రొఫెసర్ దేబశీష్ ఛటర్జీ, బెహలాకు చెందిన జోయ్దీప్ దత్తాను పట్టుకున్నారు. జోగీందర్ శర్మే సూత్రధారి.. ఖాతాదారుల కరెంట్ అకౌంట్ వివరాలతో పాటు చెక్బుక్లు, డెబిట్కార్డులు ఇస్తున్న వారికి మూడు శాతం కమీషన్, వీరిని చూపించిన మధ్యవర్తి జోయ్దీప్దత్తాకు పది శాతం కమీషన్ను కోల్కతాకే చెందిన జోగీందర్ శర్మ అలియాస్ జోగీ రాజ్ చెల్లిస్తున్నాడు. ఈ ఖాతా వివరాలను సేకరించాక వినియోగదారుల నెట్ బ్యాంకింగ్ను హ్యాక్ చేసి, అందులో ఉన్న సెల్ఫోన్ నంబర్ను క్లోనింగ్ చేసి డూప్లికేట్ సిమ్తో బ్యాంక్ నుంచి వచ్చే ఎస్ఎంఎస్లను పొందుతున్నాడు. మోసపూరితంగా సదరు ఖాతాల నుంచి డబ్బులను ఇతర ఖాతాలోకి మళ్లిస్తున్నాడు. జోయ్దీప్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో కోల్కతాకు చెందిన 43 మంది ఖాతాదారుల వివరాలు ఉన్నాయి. నిందితుల నుంచి 16 చెక్బుక్లు, 14 డెబిట్ కార్డులు, రెండు రబ్బర్ స్టాంప్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సూత్రధారుడైన జోగీందర్ శర్మ పరారీలో ఉన్నాడు. -
తిరుమలలో శ్రుతిమించిన అనధికార హాకర్ల ఆగడాలు
మామూళ్ల వసూళ్లలో అధికారులు వేల సంఖ్యలో తయారైన అనధికార హాకర్లు వ్యాపారాల్లో పెత్తనం కోసం ఆలయం వద్దే తరచూ ఘర్షణలు ఇబ్బంది పడుతున్న భక్తులు తిరుమల: తిరుమలలో అనధికార హాకర్లు పెరిగిపోయారు. కట్టడి చేయాల్సిన విభాగాల్లోని కొందరు అధికారులు కాసు ల వేటలో ఉన్నారు. ఫలితంగా సాక్షాత్తు ఆలయం వద్దే అనధికార హాకర్ల ఆగడాలు శ్రుతిమించాయి. ఆదివారం కొం దరు అనధికార హాకర్లు ముఠాలుగా విడిపోయి సీసాలతో దాడులకు దిగిన ఘట నలో చెన్నైకి చెందిన భక్తురాలు భాగ్య లక్ష్మి తలకు బలమైన గాయమై ఆస్పత్రి పాలైంది. వేలల్లో అనధికార హాకర్లు.. తిరుమలలో అనధికార హాకర్ల సంఖ్య వేలకు చేరింది. ప్రధానంగా ఆలయం వద్ద నుంచి కల్యాణకట్ట వరకు వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. సంపాదన కోసం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా సంబంధిత అధికారులెవరూ తొంగిచూడటం లేదు. అనధికార వ్యక్తుల ఏరివేతను సంబంధిత టీటీడీ, పోలీసు విభాగాలు ఏ మాత్రమూ పట్టిం చుకోలేదు. తిరుమల భద్రతా కారణాల రీత్యా అనధికార వ్యక్తుల వల్ల ఇబ్బందులుంటాయని తెలిసినా ఆ దిశగా ఇటు టీటీడీ విజిలెన్స్ కాని, పోలీసులు కాని పట్టించుకోవటం లేదు. తిరుమలలో వ్యాపారాలు సాగించేవారు గుర్తింపు కార్డులు ఉండాలన్న నిబంధన కూడా పట్టించుకోవటం లేదు. మామూళ్ల మత్తులో అధికారులు అనధికార వ్యక్తులను టీటీడీ, పోలీసు విభాగాలు ఎప్పటికప్పుడు ఏరివేయా ల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతుండడంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పైగా ఉన్నతాధికారులు సిబ్బందిని మామూళ్లు వసూ లు చేయటానికి వినియోగిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. లెసైన్సు, దుకాణదారులపై వేధింపులు టీటీడీ నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగించే దుకాణదారులు, లెసైన్సుదారులు మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తరచూ వారిపై దాడులు జరుగుతున్నాయి. తిరుమలతో సంబంధం లేని అనధికార వ్యక్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నా వారిని కట్టడి చేయటానికి ఏడాదిలో కనీసం గంట సమయం కూడా కేటాయించలేదనే విమర్శలున్నాయి. పైగా దుకాణదారులు, లెసైన్సుదారులకు దీటుగా అనధికార హాకర్లను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టీటీడీ ఈవో సాంబశివరావు, సీవీఎస్వో నాగేంద్రకుమార్, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి అనధికార హాకర్ల కట్టడికి కృషి చేయకపోతే భక్తులకు తిప్పలు తప్పవని అధికారిక దుకాణదారులు, లెసైన్సుదారులు కోరుతున్నారు. -
అక్రమ సంబంధాల గుట్టువిప్పిన హ్యాకర్లు
న్యూయార్క్: వివాహేతర సంబంధాల కోసమే వెలసిన ‘ఆశ్లే మాడిసన్’ అనే ఓ ఆన్లైన్ డేటింగ్ సైట్పై హ్యాకర్లు దాడి చేయడంతో ఈ సైట్ ద్వారా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నవారి గుట్టు కాస్త రట్టయింది. దీంతో కొంత మంది కొంప కొల్లేరుకాగా, వందలాది మంది సంబంధాలు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఇలా సంబంధాలు కుప్పకూలిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కోకథ. వారా కథలను ‘విష్పర్’ అనే యాప్ ద్వారా బయటపెట్టి లబోదిబోమంటున్నారు. ‘నా ప్రేయసిని నేను కోల్పోయాను. నా ఇల్లు కూడా పోయింది. పిల్లలకు కూడా మొహం చూపించలేక పోతున్నాను’ ఇది ఒకరి కథ. ‘నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులై పోయింది. సమాజంతో మొహం ఎత్తుకోలేక పోతున్నా’ ఇది మరొకరి బాధ. ‘నేను ఛీట్ చేశాను. కానీ నేను దొరకలేదు. మరొకరితో రాసక్రీడలు సాగిస్తున్న నా ప్రేయసి దొరికి పోయింది. అయినా ఆమెను క్షమించేశాను. అయినా ఆమె నన్ను విడిచి మరొకరితో వెళ్లి పోయింది’ ఇది ఇంకొకరి ఆవేదన. ‘నా మనసంతా కకావికలమైంది. గుట్టు చప్పుడు కాకుండా మరొకరితో సాగిస్తున్న సంబంధాలను ఇంకేమాత్రం భరించలేను’ ఇది మరొకరి రియాక్షన్. ‘నేను చేసిన ఛీటింగ్కు క్షమించమని వేడుకున్నా. అయినా నా ప్రేయసి నన్ను కాదని వెళ్లి పోయింది’....ఇలాంటి సీరియస్ కథలేకాకుండా. ప్రతీకార ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. ‘నేను ఆయన కోసం షాపింగ్ చేస్తుంటే అక్కడ మరో యువతితో కులుకుతాడా? అందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేనూ మరో యువకుడితో రాత్రి గడిపాను’ లాంటి వ్యాఖ్యలు కూడా విష్పర్లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ డేటింగ్ సైట్ను అర్జంట్గా మూసివేయకపోతే తమ దాడులను ఇలాగే కొనసాగిస్తామని, గుట్టుచప్పుడు కాకుండా నెరపుతున్న వివాహేతర సంబంధాలను రట్టుచేసి రచ్చ చేస్తామని కూడా ‘ఆశ్లే మాడిసన్’ సైట్ సీఈవోను హ్యాకర్లు హెచ్చరించారు. 2012లో ప్రారంభమైన ‘విష్పర్’ను కూడా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినీ విద్యార్థులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్ లేకుండా గ్రీటింగ్ కార్డుల రూపంలో యూజర్లు ఈ యాప్ ద్వారా తమ సందేశాలను పంపించే వీలుంది. -
హ్యాకర్కు రెండేళ్ల జైలు
సాక్షి,హైదరాబాద్: ఎస్ఐఎస్ ఇన్ఫోటెక్ సంస్థ సర్వర్ను హ్యాక్ చేసి విలువైన రీసెర్చ్ రిపోర్టును దొంగిలించిన కేసులో నిందితుడు ప్రభాకర్ సంపత్కు సీఐడీ ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.10 వేలు జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి భాస్కర్రావు మంగళవారం తీర్పునిచ్చారు. -
మలేసియా ఎయిర్లైన్స్ సైట్పై హ్యాకర్ల దాడి!
హాంగ్కాంగ్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదుల మద్దతుదారులు, మలేసియా ఎయిర్లైన్స్ అధికారుల మధ్య సోమవారం సైబర్ పోరు హోరాహోరీగా కొనసాగింది. మలేసియా ఎయిర్లైన్స్ వెబ్సైట్లోకి హ్యాకర్లు చొరబడటంతో తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 404 విమానం అదృశ్యమైందని, సైబర్ కాలిఫేట్ హ్యాకింగ్ చేసినట్లు వెబ్సైట్లో సందేశాన్ని ఉంచటంతో కలకలం రేగింది. విమానయాన సంస్థ సర్వర్ల నుంచి సేకరించిన డేటాను నాశనం చేస్తామని హ్యాకర్లు హెచ్చరించారు. ‘లిజర్డ్ స్క్వాడ్’ అనే సంస్థ దీన్ని తమ పనిగా ట్విట్టర్లో పేర్కొంది. తలకు టోపీ, కోట్ ధరించిన ఓ బల్లి బొమ్మను హ్యాకర్లు వెబ్సైట్లో ఉంచారు. తమ వెబ్సైట్ హ్యాకింగ్కు గురి కాలేదని, ఇంటర్నెట్ డొమైన్లోకి హ్యాకర్లు చొరబడి వినియోగదారులను దారి మళ్లిస్తున్నట్లు మలేషియా విమానయాన సంస్థ తెలిపింది. -
బ్యాడ్యూఎస్బీ.. మహా మొండి వైరస్!
హ్యాకర్లు ఇప్పటిదాకా రకరకాల కంప్యూటర్ వైరస్లను వ్యాప్తి చేశారు. ఐటీ నిపుణులు వాటిని తొలగించే సాఫ్ట్వేర్లనూ తయారు చేశారు. అయితే.. ఎలాంటి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లూ గుర్తించలేని, దాదాపుగా గుర్తించినా తొలగించలేని ఓ ప్రమాదకర వైరస్ ఇప్పుడు యూఎస్బీ డ్రైవ్ల ద్వారా వ్యాప్తి చెందుతోందట. ‘బ్యాడ్యూఎస్బీ’ అనే ఈ మాల్వేర్ ఒక్కసారి యూఎస్బీ డ్రైవ్కు ఇన్ఫెక్ట్ అయిందంటే చాలు.. డ్రైవ్ను కనెక్ట్ చేసిన ప్రతిసారీ కంప్యూటర్, ల్యాప్టాప్ వంటి అన్ని పరికరాల్లోకీ చేరిపోతుందని, గుర్తుతెలియని ప్రోగ్రామ్ను వాటిలో రన్ చేసి ఆ కంప్యూటర్లను హ్యాకర్లు ఆన్లైన్లో నియంత్రణలోకి తీసుకునేందుకు తోడ్పడుతుందని బెర్లిన్కు చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్స్ పరిశోధకులు చెబుతున్నా రు. కంప్యూటర్లోకి బ్యాడ్యూఎస్బీ మాల్వేర్ ప్రవేశిస్తే గనక .. ఆపరేటింగ్ సిస్టమ్ను రీఇన్స్టాల్ చేసుకోవడంతోపాటు అన్ని యూఎస్బీ పరికరాలనూ మార్చుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
పాస్వర్డ్ రక్షణకు కొత్త పద్ధతులు!
వాషింగ్టన్: ఎన్ని క్లిష్టమైన పాస్వర్డ్లు పెట్టుకున్నా ఆన్లైన్ దొంగలు(హ్యాకర్లు) వాటిని ఛేదిస్తున్న నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన కొందరు సహా పలువురు పరిశోధకులు పాస్వర్డ్ల రక్షణకు పలు అధునాతన పద్ధతులు కనిపెట్టారు. ఈ పద్ధతుల్లో పాస్వర్డ్లకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుం దని వారు అంటున్నారు. బర్మింగంలోని అలబామా వర్సిటీ, ఎర్విన్లోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ కొత్త పద్ధతులు కనుగొన్నారు. దీనిపై అలబా మా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నితీశ్ సక్సేనా మాట్లాడుతూ.. తాము రెండు ఫ్యాక్టర్లు కలిగిన నాలుగు రకాల స్కీములను పరీక్షించి చూశామన్నారు. ఇందులో... ప్రతి స్కీమ్ లో సర్వర్లు అనేక ర్యాండమ్ పాస్వర్డులను నిక్షిప్తం చేసుకుం టాయని, వాటికి సంబంధించి న రహస్య కోడ్ను వినియోగదారుడి సెల్ఫోన్లో భద్రపరుస్తారని చెప్పారు. ఈ స్కీముల్లో.. వినియోగదారుడు పాస్వర్డు, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సంబంధిత పిన్ను అతడి స్మార్ట్ఫోన్ బ్లూటూత్ కనెక్షన్ లేదా, క్యూఆర్ కోడ్ ద్వారా సర్వర్కు పంపుతుందని చెప్పారు. ఫలితంగా ఈ పాస్ వర్డ్లను ఎవరూ హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. -
బంగ్లా బ్యాంకు నుంచి కోటిన్నర లూటీ చేసిన హ్యాకర్లు
బంగ్లాదేశ్లో ఓ భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. అయితే ఒక్క దొంగ కూడా బ్యాంకులోకి ప్రవేశించకుండానే ఈ దోపిడీ జరిగిపోయింది. ఎలాగంటారా? హ్యాకర్ల మహిమ ఇది. లక్ష కాదు.. పది లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర రూపాయలను అక్కడి ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి హ్యాకర్లు దోచేసుకున్నట్లు ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోనాలీ బ్యాంకు వార్షిక సదస్సు జరిగినప్పుడు ఆయనీ విషయాన్ని బయటపెట్టారు. హ్యాకర్లు బ్యాంకు సెర్వర్లోకి ప్రవేశించి, దాదాపు కోటిన్నర రూపాయలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్లు బ్యాంకు కార్యదర్శి మహ్మద్ అస్లాం ఆలం తెలిపారు. ఈ సదస్సులోనే బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి ఎ.ఎం.ఎ. ముహిత్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. బ్యాంకు రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సి ఉందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆలం తెలిపారు. గతంలోనూ కిషోర్గంజ్ సోనాలీ బ్యాంకు దోపిడీ జరిగిందని, అలాగే గత సంవత్సరం మే 5న కొంతమంది దుండగులు బ్యాంకు ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారని, భద్రత సరిగా ఉంటే ఈ రెండు సంఘటనలను నివారించి ఉండేవారిమని ఆయన చెప్పారు. -
బంతి చాటు వల!
ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లు ఉచితం... అమితాబ్ బచ్చన్ మృతి... ఇదిగో వార్త, వీడియో లింక్! లాటరీ కొట్టేశారు... నగదు అందుకోవాలంటే...? ఇలాంటి ఫేస్బుక్ పోస్టింగ్స్, ఈమెయిళ్లు ఈమధ్య తరచూ కనబడుతున్నాయా? ఆసక్తి కొద్దో.. ఆశకొద్దో లింక్లు ఓపెన్ చేస్తున్నారా? అయితే మీరు హ్యాకర్ వలలో చిక్కినట్లే. హ్యాకర్ల గురించి, సైబర్ నేరాల గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేకపోదు. కానీ.. జూన్లో జరగనున్న ప్రపంచకప్ సాకర్ పోటీల నేపథ్యంలో వారు కొత్త కొత్త ఐడియాలు, ట్రిక్కులతో మిమ్మల్ని వలలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రఖ్యాత ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థలు సెమాంటిక్, నార్టన్ చెబుతున్నదాని ప్రకారం.. ఉచిత టికెట్లు, లాటరీల ముసుగులో ఇటీవలి కాలంలో హ్యాకర్ల విజృంభణ ప్రారంభమైంది. కాబట్టి జర జాగ్రత్త! దేశంలో ఫుట్బాల్పై ఆసక్తి తక్కువే కావచ్చుగానీ.. పాశ్చాత్యదేశాల్లో ఈ ఆటకున్న క్రేజ్ అంతా యిఇంతా కాదు. దీన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు రకరకాల మోసాలకు పాల్పడే అవకాశముంది. వీరి బుట్టలో పడితే... మీ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బు మాయమైపోవచ్చు... లేదా వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని ఇతరులు దొంగిలించవచ్చు. ఇదీకాదంటే.. మీ కంప్యూటర్/స్మార్ట్ఫోన్లలో మాల్వేర్ చేరిపోయి... మిమ్మల్ని సతాయించవచ్చు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు తోడ్పడే మెయిళ్లు నెట్లో షికార్లు చేస్తున్నాయని బ్యాంకింగ్ సర్వీసుల పేర్లతోనూ లింక్లు నెట్నిండా కనిపిస్తున్నాయని సెమాంటిక్ సెక్యూరిటీస్ గుర్తించింది. 'You are the winner of a pair of tickets to the FIFA World cup 2014 Brazil!'. "To promote World Cup 2014, you must register to compete for prizes worth 20 thousand Reais on behalf of CIELO a Brazilian credit and debit card operator". లాంటి శీర్షికలతో ఈ మెయిళ్లు/లింకులు కనిపిస్తే వాటిని తెరవవద్దని హెచ్చరిస్తోంది. రెస్ట్ ఇన్ పీస్ స్కామ్! అకస్మాత్తుగా ‘అమితాబ్ బచ్చన్ మృతి.. వీడియో లింక్’ అన్న శీర్షికతో ఫేస్బుక్లో పోస్టింగ్ కనిపించిందనుకోండి... ఏం చేస్తారు? ముందు వెనుకలు ఆలోచించకుండా... మరింత సమాచారం తెలుసుకునేందుకు, లేదా వీడియో చూసేందుకు లింక్ను క్లిక్ చేస్తారు. అదికాస్తా ప్రకటనలకు, లేదా సర్వేల సైట్లకు దారితీస్తుంది. ఎంత ఎక్కువ మంది క్లిక్ చేస్తే స్పామర్/హ్యాకర్కు అంత డబ్బు అన్నమాట. ఈ క్రమంలో మీ వ్యక్తిగత, ఇష్టాయిష్టాల సమాచారం ఇతరులకు తెలిసిపోతుందన్నమాట. నార్టన్ సంస్థ అంచనాల ప్రకారం... సైబర్ మోసాలకు బలయ్యే వాళ్లు భారత్లో ఎక్కువ. ర్యాన్సమ్ వేర్, ఐడెంటిటీ థెఫ్ట్ మోసాలకు 11 శాతం చొప్పున, ఫిషింగ్కు 9 శాతం మంది బలవుతున్నారు. ఇలా చేయండి... సోషల్ మీడియా వెబ్సైట్లలో వచ్చే సంచలనాత్మక కథనాలను చదివే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎన్నడూ వినని, కనని వెబ్సైట్ల నుంచి ప్లగ్ఇన్స్ లేదా ఇతర టూల్స్ను ఇన్స్టాల్ చేసుకోవద్దు. వెరిఫికేషన్ సర్వేల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దు పీసీ/స్మార్ట్ఫోన్ల సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. యాంటీస్పామ్ సిగ్నేచర్ల అప్డేషన్ కూడా అవసరమని గుర్తుంచుకోండి.