Hudood storms
-
మళ్లీ పాత లెక్కే!
అనంతపురం అగ్రికల్చర్: మళ్లీ పాత లెక్కల ప్రకారమే వ్యవసాయ శాఖ అధికారులు కరువు నివేదిక తయారు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను తరువాత గత ఏడాది అక్టోబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 9 జిల్లాకు వర్తింపజేసే పరిస్థితి కనిపించడం లేదు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలనే దానిపై కొత్త స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) జిల్లాకు కూడా వర్తిస్తుందని అధికారులు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు పాత జీవో ప్రకారమే ముందుకు వెళుతున్నారు. జిల్లాలో పంట నష్టం అంచనాల తయారీలో డిసెంబర్ 10 నుంచే అధికారులు నిమగ్నమయ్యారు. తొలుత పాత స్కేల్ ఆఫ్ రిలీఫ్ను పరిగణనలోకి తీసుకున్నారు. పది రోజుల కిందట కొత్త జీవో ప్రకారం చేయాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు పంపారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ పీవీ శ్రీరామమూర్తి కూడా ధ్రువీకరించారు. అయితే.. మళ్లీ పాత స్కేల్ఆఫ్ రిలీఫ్ ప్రకారమే నివేదిక తయారు చేయాలంటూ రెండు రోజుల కిందట జిల్లా అధికారుల నుంచి క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. పాత లెక్కల ప్రకారం హెక్టారు వేరుశనగ పంటకు రూ.10 వేల నష్టపరిహారం ఉంది. జీవో9 ప్రకారమైతే రూ.15 వేలుగా నిర్ణయించారు. విశాఖ తుపాను, అనంతపురం జిల్లా కరువు.. రెండింటినీ ప్రకృతి వైపరీత్యాల కిందే పరిగణిస్తున్నారు. అయినా స్కేల్ ఆఫ్ రిలీఫ్ వర్తింపులో స్పష్టత లేదు. దీనివల్ల పంట నష్టం అంచనాల తయారీలో అధికారులు, సిబ్బంది గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పంట నష్టం అంచనాలు కూడా రూ.850 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని జేడీఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పాత నిబంధనల ప్రకారమే అంచనాలు తయారు చేస్తున్నట్లు జేడీఏ పీవీ శ్రీరామమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఒకవేళ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే నష్టపోయిన రైతుల సంఖ్యలో తేడా ఉండదని, అంచనా మొత్తం మాత్రమే మారుతుందని చెప్పారు. పంటలకు ‘స్కేల్ ఆఫ్ రిలీఫ్’ ఇలా... పంట పేరు పాత జీవో ప్రకారం జీవో 9 ప్రకారం (హెక్టారుకు రూ.లలో) (హెక్టారుకు రూ.లలో) వేరుశనగ, వరి, పత్తి 10,000 15,000 మొక్కజొన్న 8,333 12,500 పొద్దుతిరుగుడు 6,250 10,000 పప్పుధాన్యపు పంటలు 6,250 10,000 -
మీ చీకటిలో వెలుగులమై..
హుద్హుద్ బాధితుల కోసం చేయీచేయీ కలిపి... తరలివచ్చిన తారా లోకం రోజంతా వినోదాల విందు హుషారెత్తించిన నృత్యాలు ఉల్లాసభరితంగా క్రీడలు సందడిగా మేముసైతం హుదూద్ తుపాను తీవ్రతకు దెబ్బతిన్న విశాఖ ప్రాంతాన్ని ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కదలి వచ్చింది. బాధితులకు సాయమందించడంలో భాగంగా నిధులు సేకరించేందుకు నటీనటులు ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో సంగీత విభావరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో సినీతారల క్రీడా పోటీలు నిర్వహించారు. టికెట్ల ద్వారా వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిచారు. తారల ఆటపాటలతో.. అభిమానుల సందడితో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. -
రైతు చిత్తు!
‘తెల్లబంగారం'గా ముద్దుగా పిలుచుకునే పత్తి పంట ఈ ఏడాది రైతులను నిలువునా ముంచింది. ఎన్నో ఏళ్లుగా ఆర్థిక భరోసానిస్తున్న పంట ఈ సారి కంట నీరు పెట్టిస్తోంది. కొద్ది రోజుల కిందట సంభవించిన హుదూద్ తుపాను ప్రభావంతో పల్నాట కురిసిన వర్షాలు పత్తి పంటకు ఎసరు తెచ్చాయి. ఆ సమయంలో పడిన వర్షాలు ఆమ్ల గుణం కలిగి ఉండడంవల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయని వాపోతున్నారు. కారంపూడి ఈ ఖరీఫ్లో వర్షాలతోపాటు, కాలువలకు సాగర్ జలాలు ఆలస్యంగా రావడంతో ఎక్కువ సంఖ్యలో రైతులు పత్తి సాగు చేపట్టారు. వరికి బదులు మాగాణి భూముల్లో కూడా సాగు చేశారు. ఏపుగా పెరిగిన పైరును చూసి రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. దాని ప్రభావంతో ఇక్కడ కురిసిన వర్షాలకు పత్తి పంట అప్పటివ రకు బాగానే వున్నా క్రమేపి దెబ్బతినడం ప్రారంభించింది. పత్తి మొక్కలు నల్లగా మారి ఆకులు రాలి పోతున్నాయి. చివరకు మొక్కలు మోడు వారుతున్నాయి. మెట్ట భూములతోపాటు నీటి వసతి వున్న నేలల్లో సైతం ఇలా జరుగుతుండడంతో రైతులు సస్య రక్షణ చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండాపోతోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని రైతాంగం చెపుతోంది. హుదూద్ తుపాను తరువాత పత్తి రైతు పరిస్థితి తలకిందులైంది. పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరేదారేదంటున్నారు. ఎకరాకు కౌలు కలుపుకుని దాదాపు 43 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన దిగుబడి మూడు క్వింటాళ్లు మాత్రమే. మరో మూడు క్వింటాళ్ల వరకు రావచ్చంటున్నారు. ఆరు క్వింటాళ్లు రూ. 3,200 చొప్పున అమ్మినా రూ. 19,200 వస్తాయి. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఈ ఏడాది రెక్కల కష్టానికి తోడు పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయంటున్నారు. పొలం చూడబుద్ధి కావడం లేదు... ఏడెకరాలు వేశా. ఇప్పటికి 8 క్వింటాళ్లు వచ్చింది. తుపాను తరువాత పైరంతా క్రమేణా నల్లగా అయ్యింది. పొలం చూడబుద్ధి కావడం లేదు. ఈ పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. కౌలు ఎకరా 20 వేలు. ఇంక మా పరిస్థితి మీకే అర్థం అవుతుంది. ఇంత కష్టం వున్నా ధర వుందా అంటే అదీ లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. ధర మాత్రం కొన్నేళ్లుగా అంతే వుంటోంది. - రేళ్ల యల్లారెడ్డి, కౌలురైతు, లక్ష్మీపురం పెట్టుబడులు ఎలా తీర్చాలి ఎకరం 18 వేలు కౌలు. ఐదెకరాలు వేశా. లక్ష దాకా పెట్టుబడి అయ్యింది. ఇప్పటికి ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా నాలుగు క్వింటాళ్లు రావచ్చు. ధర చూస్తే రూ.2,950. క్వింటా పత్తి తీసినందుకు కూలీలకు వెయ్యి ఖర్చు. తుపాను తరువాత పైరు రోజు రోజుకు క్షీణించింది. ఆకులు నల్లగా మారి రాలి పోయాయి. పెట్టుబడులు ఎలా తీర్చాలి. - నడికోట చిరంజీవి, కౌలు రైతు, లక్ష్మీపురం సొంత పొలమైనా నష్టమే.. ఈ ఏడాది 13 ఎకరాలు వేశా. నాలుగు లక్షల పెట్టుబడి అయింది. ఇప్పటికి 20 క్వింటాళ్లు వచ్చింది. ఇంకా ఎకరాకు మూడు క్వింటాళ్లు రావచ్చు. గతంలో ఎకరాకు 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తుపాను వర్షం ఏమీ చేయదనుకున్నాం. కాని అప్పుడు కురిసిన వానలో తేడా వుంది. ఇప్పటికీ పంట పరిస్థితిని ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. వ్యవసాయాధికారులు ఇతరులు ఏమి చేస్తున్నట్లు. సొంత పొలమైనా నష్టం ఈ సారి ఎక్కువగా వుంది. ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. - గోగిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు సరస్వతి భూముల కేసులో మరో 23 మంది కోర్టుకు హాజరు పిడుగురాళ్ల: మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఇటీవల జరిగిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల కేసులో శనివారం మరో 23 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో శుక్రవారం 13 మందిని కోర్టుకు తీసుకెళ్లగా శ నివారం డీఎస్పీ వెంకటేశ్వరనాయక్ ఆధ్వర్యంలో మరో 23 మందిని నిందితులుగా పేర్కొంటూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జికోర్టు జడ్జి ఎస్ సుజాత ముందు హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో మొత్తం ఈకేసులో 92 మందిని కోర్టుకు హాజరు పరిచినట్లయింది. -
బాధితులకు అండగా ఉంటాం
ప్రతి ఒక్కరికి పరిహారమందే వరకు పోరాటం తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రకాష్కారత్ పర్యటన స్టీల్ప్లాంట్, కంచరపాలెంలలో మొక్కలు నాటిన కారత్ సాక్షి, విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్కారత్ భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పరిహారం అందేవరకు బాధితుల తరపున సీపీఎం పోరాడుతుందన్నారు. జిల్లా, రాష్ర్ట స్థాయిల్లో తమ పార్టీ నేతలు బాధితుల తరపున పోరాడతారని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ సాయం కోసం కేంద్రంపై తాము ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం పార్టీ రాష్ర్ట, జిల్లా నాయకులతో కలిసి కారత్ పర్యటించారు. తొలుత హుదూద్కు తీవ్రంగా దెబ్బతిన్న స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్కు జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, కార్మికులతో జరిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం ప్లాంట్ సాంకేతిక శిక్షణా కార్యాలయం ప్రాంగణంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు, జిల్లా కార్యదర్శి నరసింగరావు, ఉద్యోగ, కార్మిక సంఘ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ ప్లాంట్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. స్టీల్ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా తాము పోరడతామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కంచరపాలెం చేరుకున్న కారత్కు పార్టీ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి బి.గంగారావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పైకప్పులు లేచిపోయి..దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన కారత్ బాధితులతో మాట్లాడారు. సర్వస్వం కోల్పోయిన తమను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు టీడీపీ నాయకులు చెప్పిన వారి పేర్లనే జాబితాల్లో రాస్తున్నారని ఆయనకు వారు చెప్పారు. అక్కడ నుంచి కంచరపాలెం హైవేపై ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. పార్టీ కార్య కర్తలు, బాధితులనుద్దేశించి మాట్లాడుతూ హుదూద్ తుపాను కనివినీ ఎరుగని నష్టాన్ని మిగిల్చిందని..లక్షలాదిమంది ప్రజలను ఇబ్బందుల పాల్జేసిన ఈ విపత్తును జాతీయవిపత్తుగా ప్రకటించి విశాఖ పునర్నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని సూచించారు. అధికారులు పక్షపాత ధోరణిని విడనాడి దెబ్బతిన్న ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. లేకుంటే బాధితుల తరపున సీపీఎం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా నాయకులు కె.లోకనాథం, ఎన్.రామారావు, జే.అయోధ్యరామ్, ఆర్.భాగ్యలక్ష్మి, బొట్టు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. కారత్కు వినతుల వెల్లువ విశాఖ పర్యటనకు వచ్చేసిన కారత్కు వివిధ వర్గాలకు చెందిన వారు పెద్దఎత్తున వినతులు సమర్పించారు. తొలుత స్టీల్ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.రామారావు, డి.ఆదినారాయణలు స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణానికి కేంద్రం ఆదుకునేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్కు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, రైల్వేశాఖ 1000 రేక్స్ను ప్రత్యేకంగా కేటాయించాలని, నష్టానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు హైలెవల్ కమిటీని పంపించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని వారు కారత్ను కోరారు. హుదూద్ వల్ల హిందూస్థాన్ షిప్యార్డు లిమిటెడ్కు రూ.500 కోట్ల మేర నష్టంవాటిల్లిందని, నౌక నిర్మాణ ఆర్డర్స్ అన్ని హెచ్ఎస్ఎల్కే ఇప్పించేలా కృషి చేయాలని కోరుతూ హెచ్ఎస్ఎల్ స్టాఫ్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి.రమణమూర్తి, వి.నాగేశ్వరరావులు కారత్కు వినతిపత్రం సమర్పించారు. -
హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’
హుదూద్ బాధితుల సహాయార్థం శ్రీ సుధా ఆర్ట్స్, శ్రీ భవిరి ఆర్ట్స్ క్రియేషన్స్ ఆదివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ‘ఇంద్రధనుస్సు’ పేరిట సాంస్కృతిక కార్యక్రవూన్ని నిర్వహిస్తున్నారుు. ఉదయుం 10.00 గంటలకు ప్రారంభవుయ్యే ఈ కార్యక్రవుంలో హరికిషన్, జీవీఎన్ రాజు, భవిరి రవి మల్లెల, సుధాకర్ల మిమిక్రీ, కళాధర్ మైమ్, కె.జనార్దన్ మేజిక్ కార్యక్రమాలు ఉంటాయి. సినీ, టీవీ కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రవుంలో ఫన్నీ నృత్యాలు, పసందైన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. -
చీకటి పల్లెలు
ఇంకా అంధకారంలో4314 గ్రామాలు విశాఖలో పగటివేళ విద్యుత్ సరఫరా కట్ హుదూద్ కు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను దెబ్బకు విద్యు త్ వ్యవస్థ కుప్పకూలింది. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. లక్షలాది సర్వీసులకు సరఫరా నిలిచిపోయింది. సుమారు రూ.750 కోట్ల నష్టం వాటిల్లింది. అయితేనేం రెండు మూడు రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. ప్రజలకు విద్యుత్ వెలుగులు ఇచ్చాం. ప్రస్తుతం విద్యుత్ సరఫరాను దాదాపుగా అన్ని సర్వీసులకు పునరుద్ధరించేశాం. ఇవి ప్రభుత్వం చెబుతున్న గొప్పలు. కానీ అదే ప్రభుత్వాధికారుల వద్ద ఉన్న లెక్కలు ఈ మాటలు అవాస్తవాలని చెబుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం ఇప్పటికీ జిల్లాలో 4 లక్షల 96 వేల 966 సర్వీసులకు విద్యుత్ సరఫరా అందడం లేదు. నగరంలో పగటిపూట విద్యుత్ ఉండడం లేదు. ఒక్క గ్రామంలోనూ పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరించలేదు. కానీ అన్ని సర్వీసులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయినట్లేనని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నెల 12వ తేదీన జిల్లాపై విరుచుకుపడిన హుదూద్ తుపాను వల్ల తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరిధిలోని 11,28,840 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇతర జిల్లాలు, డిస్కంల నుంచి నిపుణులైన సిబ్బందిని పంపిస్తే తప్ప పునరుద్ధరణ చర్యలు అసాధ్యమని సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దీంతో చుట్టు పక్కల జిల్లాల నుంచి హుటాహుటిన వేలాది మంది విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బంది జిల్లాకు వచ్చారని వెంటనే విద్యుత్ వ్యవస్థను పూర్వస్థితికి తీసుకువచ్చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ వారంతా 18 రోజులు కష్టపడితే 6,31,874 సర్వీసులకు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేలా చేయగలిగారు. తుపాను బారిన పడి అంధకారంలో మగ్గుతున్న 4314 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చర్యలను అధికారులు పూర్తిగా విస్మరించారు. తుపాను వల్ల 132/33 కేవీ లైన్లు 16 దెబ్బతింటే వాటిలో 14 పునరుద్ధరించారు. 33/11కేవీ లైన్లు 144 దెబ్బతినగా 118 బాగుచేశారు. 33కేవీ ఫీడర్లు 92 పాడైతే 62 సరిచేశారు. 11కేవీ ఫీడర్లు 604 తెగిపోతే వాటిలో 399 అతికించారు. 8320 ఎల్టీ లైన్లలో ఒక్క లైను కూడా గాడిన పడలేదు. విద్యుత్ స్తంభాల పరిస్థితి కూడా అంతే. 33కేవీ విద్యుత్ స్తంభాలు 1564 విరిగిపోయాయి. వాటి స్థానంలో ఇప్పటి వరకూ 352 మాత్రమే కొత్తవి నిలబెట్టారు. 216 స్తంభాలు దెబ్బతిన్నాయి. వాటిలో 30 స్తంభాలే సరిచేశారు. 11కేవీ స్తంభా లు 10270 విరిగిపోతే 4120 కొత్త స్తంభాలు వేశారు. ఈ కేటగిరీలో 896 దెబ్బతింటే కేవలం 35 పనికొచ్చేలా చేశారు. ఎల్టీ స్తంభాలు 6250 విరిగిపోతే 2350 మార్చారు. 1100 వంగిపోతే 115 సరి చేశారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) నిర్మాణాలు 9736 కూలిపోతే వాటి స్థానంలో ఒక్క కొత్త నిర్మాణం కూడా జరగలేదు. ట్రాన్స్ఫార్మర్లు(డీటీఆర్స్) 14065 దెబ్బతింటే 7120 మాత్రమే మార్చారు. -
ఆధునికీకరణకు నిధులివ్వాలి
గోవాడ, తుమ్మపాల సుగర్స్కు రూ.100 కోట్లు చొప్పున మంజూరు చేయాలి ప్రభుత్వానికి వామపక్ష నేతల డిమాండ్ ఫ్యాక్టరీలను సందర్శించిన బృందం అనకాపల్లి: హుదూద్ తుపాను కారణంగా తీ వ్రంగా నష్టపోయిన గోవాడ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రూ.100 కోట్ల చొప్పు న మంజూరు చేయాలని జిల్లా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం, వామపక్ష నేతలు కొండబాబు, రామచంద్రరావు, వీవీఎమ్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఫ్యాక్టరీ యంత్రాలను, గొడౌన్, స్టోర్రూమ్ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీపై వేలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. తుపానుకు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. పంటనష్టాన్ని పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాలలో 25 కిలోల బియ్యం మూడునెలల పాటు ఉచితంగా ఇవ్వాలన్నారు. జిల్లాలో తుపానుపై నష్టం వివరాలు నమోదు చేసి తమ పార్టీ నేతలకు అందజేస్తామన్నారు. వామపక్ష నేతలు బాలకృష్ణ, కోన లక్షణ్, రాజాన దొరబాబు, ఆడారి అప్పారావు పాల్గొన్నారు. జాతీయ విపత్తుగా పరిగణించాలి చోడవరం: హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా పరిగణించి దెబ్బతిన్న సహకార చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్షాల బృందం డిమాండ్ చేసింది. సీపీఐ,సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ, సీపీఎం లిబరేషన్, ఎం సీపీఐ లకు చెందిన నాయకుల బృందం గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం సందర్శించింది. ఉత్తరాంధ్ర జిల్లాల ను తుపాను తీవ్రంగా నష్టపరిచినందున జాతీ య విపత్తుగా కేంద్రం పరిగణించాలని బృంద సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక వామపక్షాల నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, మట్టారమణ, నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. -
వసతి గృహాలకు హుదూద్ నష్టం రూ.2.12 కోట్లు
కూలిన ప్రహరీలు, దెబ్బతిన్న హాస్టళ్లు నష్టం అంచనాలు రూపొందించిన అధికారులు నిధులు మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక విశాఖపట్నం : తుపానుకు దెబ్బతిన్న సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు అధికారులు అంచనాలు రూపొందించారు. బీసీ సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన 107 వసతి గృహాలు దెబ్బతిన్నాయని అధికారుల విచారణలో తేలింది. వీటి మరమ్మతులకు రూ.2.12 కోట్లు అవసరమని అంచనాలు వేశారు. బీసీ సంక్షేమశాఖకు చెందిన 40 సొంత భవనాలలోని ప్రీమెట్రిక్ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. వసతి గృహాల ఆవరణలోని చెట్లు నేల కూలాయి. పలుచోట్ల ప్రహరీలు కూలిపోయాయి. కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పైకప్పులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. ఒక్కో హాస్టల్కు రూ.40 వేల నుంచి రూ.8 లక్షల వరకు నిధులు అవసరమని ఇంజినీర్లు అంచనాలు రూపొందించారు. నగరంలోని ఇసుకతోట, పెందుర్తి, జిల్లాలోని యలమంచిలి, పాయకరావుపేట, కె.కోటపాడు, కోరువాడ, భీమిలి, రెడ్డిపల్లి, పద్మనాభం, గొడిచెర్ల, నక్కపల్లి, వేములపూడి, నర్సీపట్నంలలోని వసతి గృహాలు బాగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.32 కోట్లు అంచనా కాగా, తక్షణం రూ.1.12 కోట్లు అవసర మని అధికారులు నివేదికలు పంపారు. ఎంవీపీ కాలనీలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయానికి రూ.75 వేల నష్టం వాటిల్లింది. సాంఘిక సంక్షేమ శాఖలో... తుపానుకు జిల్లాలోని 67 ఎస్సీ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. నగరంలోని కృష్ణానగర్, భీమిలి, మధురవాడ, చినగదిలి, ఆనందపురం, గాజువాక, పెదగంట్యాడ, చోడవరం, మాడుగుల, పరవాడ, గోపాలపట్నం, పెందుర్తి, కె.కోటపాడు, సబ్బవరం, యలమంచిలి, నర్సీపట్నం, గొలుగొండ, ఎస్.రాయవరం వసతి గృహాలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వివరాలు సేకరించారు. మిగిలిన చోట్ల స్వల్పంగా నష్టం జరిగింది. అన్ని చోట్ల ప్రహరీలు కూలిపోయాయి. వీటి మరమ్మతుల కోసం కనీసం రూ.80 లక్షలు అవసరమని అంచనాలు వేశారు. తక్షణం రూ.32 లక్షలు కావాలని నివేదికలు సిద్ధం చేశారు. ప్రభుత్వానికి నివేదించాం తుపానుకు దెబ్బతిన్న వసతి గృహాలలో ప్రస్తుతానికి విద్యార్థులకు భోజన, వసతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వసతి గృహాల మరమ్మతులకు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. - అన్నపూర్ణమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, విశాఖపట్నం -
ప్రతిష్ట పాతాళానికి..
ఏయూపై మంత్రి గంటా పెత్తనమేంటి? తుపాను నష్టం రూ.230 కోట్లా!? క్లాసులే జరగనప్పుడు పరీక్షలా? కలకలం రేపిన ఏయూ విభాగాధిపతుల వ్యాఖ్యలు ‘ఏయూపై మంత్రి గంటా పెత్తనమేమిటి?...ఆయన క్యాంపస్కు పదేపదే వచ్చి అధికారికంగా నిర్ణయాలు ప్రకటించేయడమేమిటి?... వీసీతో సహా ఏయూ అధికారులు అం తా ఆయనకు సాగిలపడటమేమిటి?... ఏయూ చరి త్రలో ఇంతవరకు ఇలాంటి దుస్థితి దాపురించలేదు. ఇ లా అయితే ఏయూ ప్రతిష్ట దిగజారి అదఃపాతాళానికి పడిపోతుంది’ ‘హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్లు నష్టం వచ్చిందని ఏ ప్రాతి పదికన ప్రకటించేశారు?, అంత నష్టం ఎక్కడ జరిగింది?. భవనాలు ఏమీ దెబ్బతినలేదు. ల్యాబ్లకు నష్టం జరగలేదు. చెట్లు కూలిపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని రూ.230 కోట్లుగా లెక్కించలేం కదా? ఆస్తి నష్టం జరగనప్పుడు అంత నష్టమని ఎ లా ప్రకటిస్తారు. దీని వెను క ఉన్న లోగుట్టు ఏమిటి?. దాతల నుంచి కేవలం ధన రూపంలోనే సహా యం కోరడం వెనుక మర్మమేమిటీ?’ ఏయూ విభాగాధిపతుల ఆవేదన ఇదీ. ప్రశ్న ల శరపరంపర ఇదీ. ఏయూ కేంద్రంగా సాగుతున్న అక్రమాలను సూటిగా నిలదీసిన వైనం ఇదీ. గత కొన్నేళ్లలో ఎన్నడూలేని రీతిలో విభాగాధిపతులు ఏయూ వ్యవహారాలపైన విరుచుకుపడ్డారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఇలా సాగింది... విభాగాధిపతుల సమావేశమే వేదికగా... ఏయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవీ విభాగాధిపతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే గాయత్రీదేవీ మాట్లాడుతూ నవంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దాంతో విభాగాధిపతులు అందరూ అవాక్కయ్యారు. తమను కనీసం సంప్రదించకుండా పరీక్షల షెడ్యూల్ను నిర్ణయించేయడమేమిటని విస్తుపోయారు. కొంతకాలంగా ఏయూ వ్యవహారాలలై ఆగ్రహంతో ఉన్న విభాగాధిపతులు దాంతో ఒక్కసారిగా తమ నిరసనను తెలిపారు. ‘తుపాను అనంతరం క్లాస్లు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇంకా 10 శాతం మంది విద్యార్థులు కూడా క్లాస్లకు రావడం లేదు. సిలబస్లు పూర్తికాలేదు. అలాంటిది నవంబర్ 10 నుంచి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?. తేదీలను ఖరారు చేసేముందు మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఏయూలో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రస్తావిస్తూ అంశాలవారీగా ఇలా నిలదీశారు. మంత్రి గంటా పెత్తనమేమిటీ?... ఏయూ వ్యవహారాలన్నింటినీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైజాక్ చేసేస్తున్న తీరును విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘అసలు యూనివర్సిటీపై విద్యాశాఖ మంత్రి పెత్తనం ఏమిటి? ఏయూ విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం వీసీకి, పాలకమండలికే ఉంది. విభాగాధిపతులను సంప్రదించి వీసీ పాలకమండలిలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వీసీ నేరుగా గవర్నర్కే జవాబుదారిగా ఉండాలి. కానీ ఇవేవీ లేకుండా మంత్రి గంటా చీటికిమాటికి క్యాంపస్కు వచ్చేసి సమావేశాలు పెట్టడం ఏమిటి?. మన ఇద్దరు ఉన్నతాధికారులు చిత్తందొరా అని వంతపాడటమేమిటి?అని తీవ్రస్థాయిలో నిరసించారు. ఏయూకు రూ.230 కోట్ల నష్టమా?.. హవ్వా! హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్ల నష్టం వచ్చినట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించడాన్ని విభాగాధిపతులు తప్పుబట్టారు. ఏ ప్రాతిపదికన లెక్కించి ఇంత భారీ నష్టం వచ్చినట్టు ప్రకటించారని ప్రశ్నించారు. ‘తుపాను వల్ల ఏయూ భవనాలకుగానీ ల్యాబ్లకుగానీ ఎలాంటి నష్టం కలగలేదు. కేవలం నాన్టీచింగ్ స్టాఫ్ క్వార్టర్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆ నష్టం రూ.50 లక్షల వరకు ఉండొచ్చు. ఇతర చిన్నాచితక నష్టం కలిగింది. అంతకుమించి ఏయూ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదు. మరి రూ.230 కోట్ల నష్టం అని ఎలా ప్రకటించారు? క్యాంపస్లో చెట్లు భారీగా కూలిపోయినమాట వాస్తవం. కానీ ఆ నష్టాన్ని డబ్బురూపేణా అంచనా వేయలేం కదా! కానీ రూ.230 కోట్లు నష్టం ఏర్పడినట్టు ప్రకటించడం వెనుక ఉద్దేశమేమిటి?’అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతవరకు నాన్టీచింగ్ సిబ్బంది క్వార్ట్ర్స్కు నీరు, విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరించకపోవడాన్నీ ప్రశ్నించారు. ఏయూలో తుపాను నష్టాలను తాము సరిచేస్తామని దాతలు వస్తుంటే మీరు వస్తు రూపేణా ఎలాంటి సహాయం చేయొద్దు... ఆ మొత్తాన్ని ఏయూ అకౌంట్లో వేయమని కోరుతున్నారు?, ఇదెంత వరకు సబబు?.. దాతలే నేరుగా దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేస్తామంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.. దీనివెనుక లోగుట్టు ఏమిటి?’అని కూడా ప్రశ్నించారు. ఇలా విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నేరుగా ప్రశ్నల శరపరంపర కురిపించడంతో ఆ సమావేశం ఆద్యంతం వాడిగా వేడిగా సాగింది. విభాగాధిపతులు లేవనెత్తిన అంశాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవి సమావేశాన్ని ముగించారు. మేమే బాధితులం.. మా జీతాల నుంచి కోతా? తుపాను బాధితులకు ఏయూ ఉద్యోగుల రెండురోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించడాన్ని కూడా విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘తుపాను వల్ల విశాఖలో నివసిస్తున్న ఏయూ ఉద్యోగులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడమే...ఇతర ప్రాంతాల ఉద్యోగులు, దాతల నుంచి విరాళాలు సేకరించడమే చేయాలి. అంతేగానీ తుపాను బాధితులు అయిన ఏయూ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే ఎలా? అసలు ఈ నిర్ణయాన్ని మంత్రి గంటా ఎలా ప్రకటిస్తారు? అందుకు ఏయూ ఉన్నతాధికారులు ఎలా ఆమోదిస్తారు? అని కడిగిపారేశారు. తాము అసలు జీతాల నుంచి కోతను ఆమోదించేది లేదని తేల్చిచెప్పేశారు. -
ఉపాధికి ఊతం
హుదూద్తో కొత్తపనుల గుర్తింపు పెద్దఎత్తున కల్పనకు ప్రణాళిక రైతులకు మేలు సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను ఉపాధి హామీ కూలీలకు ఊతమిస్తోంది. హుదూద్ సృష్టించిన విధ్వంసంతో పెద్ద ఎత్తున పనుల కల్పనకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హూదూద్ తుపానుకు పదిరోజుల ముందు వరకు ఉపాధి హామీ కూలీలకు రోజూ పాతికవేల పనిదినాలు కల్పించేవారు. ఒక పక్క వ్యవసాయ సీజన్..మరొక పక్క హూదూద్ దెబ్బతో ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఒక్క పనిదినాన్నికూడా కల్పించ లేని పరిస్థితి. రానున్న సీజన్లో చేపట్టనున్న పనుల కోసం ప్రణాళిక రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా హూదూద్ విధ్వంసంతో ఉత్తరాంధ్రలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైతులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా రైతులను ఆదుకునే లక్ష్యంతో కొత్త పనుల గుర్తించారు. వీటిలో ప్రధానంగా తుపానునేపథ్యంలో పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలు తొలగించడం, ధ్వంసమైన పొలం గట్లు, వరదగట్లు పటిష్టపరచడం, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ ఛానల్స్లో పేరుకుపోయిన డీసిల్టింగ్ తొలగింపు, పొలాల్లో నేలకొరిగిన చె ట్లు తొలగింపు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తోటలు.. పొలాల గట్లపై పడిపోయిన చెట్ల స్థానే కొత్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఉపాధి హామీలో చేపట్టాలని యోచిస్తున్నారు. మామిడి, జీడి, సపోటా, కొబ్బరి తదతర వాణిజ్య పంటలన్నీ హార్టికల్చర్ ప్రొగ్రామ్ ద్వారా రైతుల తోటల్లో ఉపాధి హామీ పథకంలో నాటనున్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ జరుగుతున్నందున..అది పూర్తి కాగానే ఎన్ని వేల ఎకరాల్లో తోటలు, పొలాల్లో చెట్లు నేలమట్టమయ్యాయో అంచనా వేసి తొలుత వాటిని తొలగించడం..ఆతర్వాత రైతుల సమ్మతితో కూలీలద్వారా వారు సాగు చేసే రకాలకు చెందిన మొక్కలను పెద్ద ఎత్తున నాటేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన మొక్కలను ఉద్యానవనశాఖ సరఫరా చేస్తుంది. ఉపాధి కూలీల ద్వారా రైతుల పొలాలు, తోటల్లో వాటిని నాటించనున్నారు. హూదూద్ నేపథ్యంలో ఉపాధి హామీ అధికారులు గుర్తించిన పనుల ఆమోదం కోసం జిల్లా కలెక్టర్ యువరాజ్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త పనులతో సంబంధం లేకుండా గతంలో ప్రతిపాదించిన రూ.400కోట్ల విలువైన పనులకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం చేపడుతున్న ప్లానింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వీటిని కూడా చేపడతామని జిల్లాడ్వామా పీడీ శ్రీరాములునాయుడు సాక్షికి తెలిపారు. -
పుట్టలు తవ్వి.. పాలు పోసి
హుదూద్ దెబ్బకు పుట్టలు మాయం మట్టిదిబ్బలకు కలుగులు తీసి పూజలు తొలిసారి భక్తులకు వింత అనుభవం సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను ప్రభావం నాగుల చవితిపై కూడా పడింది. తుపానుకు జిల్లాలో వేలాది చెట్లు నేలకొరిగాయి. వాటి కింద పుట్టలు చితికిపోయాయి. ఉన్న కొద్దిపాటి పుట్టలు వృక్ష వ్యర్థాలతో కప్పబడిపోయాయి. పుట్టలు కానరాక జనం అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ పుట్టలు తవ్వి చవితి చేసుకున్నారు. ఈ ఏడాది బాణాసంచాపై నిషేధం ఉండడంతో పండగ సందడి కానరాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదనే మాట ప్రతి ఒక్కరి నోటా వినిపించింది. వచ్చే ఏడాది ఈ సమయానికి జిల్లా తిరిగి పచ్చదనాన్ని సంతరించు కుని నాగేంద్రునికి సహజ సిద్ధ ఆవాసాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. హుదూద్ వంటి విపత్తుల నుంచి కాపాడమని నాగేంద్రుడిని వేడుకున్నారు. కార్తీకమాసం తొలి సోమవారం నాడే నాగులచవితి రావడంతో శివాలయాలల్లో భక్తులు పోటెత్తారు. కొన్ని శివాలయాల్లో పుట్టలు ఏర్పాటు చేయడంతో ఎక్కువమంది అక్కడే పూజలు చేశారు. సహజసిద్ధంగా ఏర్పడే పుట్టలో పాలుపోయడం పవిత్రంగా భావించే వారు తప్పనిసరై కృత్రిమ పుట్టలతో సర్దుకున్నారు. -
బదిలీలపై సందిగ్ధం
నవంబర్ 11 నుంచి బదిలీలపై నిషేధం ఇప్పటి వరకు ప్రారంభం కాని కసరత్తు తుపాను సహాయక చర్యల్లో అధికారులు బిజీ స్థానచలనాలు కలిగిస్తే నష్టం అంచనాలకు ఆటంకం ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం! విశాఖ రూరల్: ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. హుదూద్ తుపాను నేపథ్యంలో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. నవంబర్ 11వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బదిలీలకు సంబంధించి ఎటువంటి కసరత్తు జరగడం లేదు. పునరావాస, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న ఈ తరుణంలో స్థానచలనాలు ఉండే అవకాశం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం బదిలీలకు గడువు పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా స్థాయి అధికారి నుంచి గ్రామస్థాయి కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. జన్మభూమి కా ర్యక్రమానికి ముందే ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయిస్తూ సెప్టెంబర్లోనే బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 20వ తేదీలోగా బదిలీలు పూర్తి చేయాలని అందులో పేర్కొంది. దీంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ నెలాఖరులోనే బదిలీలు చేపట్టాలని భావించి తహశీల్దార్ల పోస్టింగ్లకు సంబంధించి జాబితాపై కసరత్తు కూడా చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కారణంగా జాబితాను ప్రకటించలేదు. ఈ సమయంలో ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి 20వ వరకు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానచలనాలు కలిగిస్తే కొత్తగా మండలాలకు వెళ్లిన అధికారులకు ఆయా ప్రాంతాల్లో సమస్యలపై అవగాహన ఉండే అవకాశముండదని, జన్మభూమి కార్యక్రమం విజయవంతం కాదని భావించి కొత్త జీవో జారీచేసింది. జన్మభూమి తరువాత బదిలీలు చేపట్టాలని ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇంతలో ఈ నెల 12న హుదూద్ తుపాను విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని కలిగింది. ఇప్పటికీ పునరావాస, సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల కంటే విశాఖలో పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పట్లో బదిలీలు చేపట్టే అవకాశం ఉండదని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో బదిలీలు చేస్తే సహాయ కార్యక్రమాలలో జాప్యం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇక్కడ బదిలీలకు గడువు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ బదిలీలపై మరో మూడు, నాలుగు రోజుల్లో ఒక స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. -
ఇదేం పరిహారం?
కాఫీ రైతులకు మొక్కుబడి సాయం జీఓను తప్పుబడుతున్న గిరిజనులు ఎకరానికి రూ.10 వేలేనని ఉత్తర్వులు 50 శాతం నిబంధనలతో అందేది నామమాత్రమే హుదూద్ తుపానుకు దెబ్బతిన్న కాఫీ రైతులకు ప్రభుత్వం మొక్కుబడి పరిహారాన్ని ప్రకటించింది. గిరిజన రైతులు 15 ఏళ్ల నుంచి ఫలాశయం పొందుతున్న కాఫీ తోటలు ధ్వంసమై ఆయా కుటుంబాలు వీధిన పడగా ఆదుకోవలసిన వేళ ప్రభుత్వం తూతూమంత్రంగా సాయం ప్రకటిస్తోంది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేయడాన్ని బాధిత రైతులు తప్పుపడుతున్నారు. పాడేరు: ఏడాదికి ఎకరం కాఫీ, మిరియాల పంటల ద్వారా రూ.లక్ష వరకు ఆదాయం పొందే కాఫీ రైతులను హుదూద్ తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. కాఫీ మొక్కలన్నీ నీడ నిచ్చే చెట్ల సంరక్షణలోనే ఎదిగి ఫలసాయాన్ని ఇస్తాయి. తుపానుకు నీడనిచ్చే చెట్లు, వాటికి అల్లుకున్న మిరియాల పాదులన్నీ నేలకూలడంతో కాఫీ రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో లక్షా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉండగా 96 వేల ఎకరాల తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఇందులో సుమారు 30 వేల ఎకరాల్లో పంట తుపాను ధాటికి ధ్వంసమైంది. ఫల సాయానికి దగ్గరగా ఉన్న మరో 10 వేల ఎకరాల్లో కాఫీ తోటలు కూడా నాశనమయ్యాయి. నీడనిచ్చే చెట్లు నేలకూలడంతో కాఫీ మొక్కలకు రక్షణ కరువైంది. ఇవన్నీ వాడిపోయి పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి నెలకొంది. విరగ్గాసినా దక్కని ఫలం : ఈ ఏడాది విరగ్గాసిన కాఫీ తోటల్లో ఫల సాయాన్ని నవంబరు మొదటివారంలో సేకరించాల్సిన తరుణంలో హుదూద్ తుపాను గిరిజన రైతుల ఆశలను అడియాసలు చేసింది. కోలుకోలేని దెబ్బను మిగిల్చిన తరుణంలో ప్రభుత్వం ఎకరం పంటకు రూ.లక్ష ఇచ్చినా కాఫీ రైతులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చలేం. అయితే తక్షణ సహాయం కింద ఎకరానికి రూ.లక్ష చెల్లించి మళ్లీ నీడనిచ్చే సిల్వర్ఓక్ వృక్షాల పెంపకం, అవి ఎదిగిన తరువాత కాఫీ సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ఏజెన్సీలో పర్యటించి హెక్టార్ పంటకు రూ.10 వేల నుంచి 20 వేలు మాత్రమే పరిహారం కింద ప్రకటించారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మోదాపల్లి ప్రాంతంలో ధ్వంసమైన కాఫీ తోటలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వంసమైన కాఫీ తోటలన్నింటిని పరిశీలించి ఎకరానికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాఫీ రైతులకు ఏర్పడిన అపార నష్టాన్ని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన కూడా తీవ్రంగా స్పందించి ఎక రం కాఫీ పంటకు రూ.లక్ష చెల్లించేంత వరకు బాధిత రైతుల తరఫున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అతి తక్కువ పరిహార జీవో ప్రభుత్వం తాజాగా నష్టపరిహారంపై ఉత్తర్వులు జారీచేసింది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేసి బాధిత కాఫీ రైతులకు మొక్కుబడి సాయాన్నే అందించేందుకు సిద్ధమవడాన్ని గిరిజన రైతులంతా తప్పుపడుతున్నారు. 50 శాతం కాఫీ పంట ధ్వంసమైతేనే నష్టపరిహారం చెల్లిస్తామని జీఓలో పేర్కొనడం బాధిత కాఫీ రైతులను మరింత బాధిస్తోంది. 10 ఏళ్ల దాటిన కాఫీ తోట 50 శాతం పైగా ధ్వంసమైతే ఎకరానికి రూ.10 వేలు, 5 నుంచి 10 ఏళ్ల లోపు తోటకు రూ.ఆరు వేలు, 5 ఏళ్లలోపు గల తోటలకు ఎకరానికి రూ.నాలుగు వేలు అతి తక్కువ పరిహారాన్ని ప్రభుత్వం అమలు చేయడం దారుణమని బాధిత కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని ధ్వంసమైన కాఫీ తోటలను పూర్తిగా తొలగించి కొత్తగా కాఫీసాగు చేపట్టాలంటే మరో ఆరేళ్లపాటు గిరిజన రైతులు అష్టకష్టాలు పడాల్సి ఉంది. ఫలసాయం వచ్చే వరకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.లక్ష చెల్లించి అన్ని విధాలా ఆదుకోవలసిన ప్రభుత్వం మొక్కుబడి సాయం ప్రకటించడంతోపాటు 50 శాతం నిబంధనలను అమలు చేయడం కూడా బాధిత కాఫీ రైతులకు అన్యాయం చేయడమేనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నిండుకుండలు
సరిహద్దు జలాశయాల్లో పుష్కలంగా నీరు బలిమెలలోకి 24 టీఎంసీలు కొత్తగా చేరిక ఏపీవాటాగా 72 టీఎంసీలు నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారుల సమీక్ష సీలేరు/ముంచంగిపుట్టు : జిల్లాను అతలాకుతలం చేసిన హుదూద్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని జలాశయాలకు మాత్రం మేలు చేసింది. తుపాను కారణంగా జోలాపుట్టు, బలిమెల, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు చేరింది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించే బలిమెల జలాశయంలోకి 24 టీఎంసీల వరదనీరు చేరిందని ఏపీజెన్కో సీలేరు ఇన్చార్జి సూపరింటెండెంట్ టీఎల్ రమేష్బాబు తెలిపారు. ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్, డుడుమ(డైవర్షన్) డ్యామ్లోకి భారీగా వరద నీరు చేరింది. తుపాను అనంతరం తొలిసారిగా ఒడిశా బలిమెలలో సరిహద్దు నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల అధికారులు శుక్రవారం సమీక్షించారు. నీటి వినియోగంపై లెక్కలు కట్టారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 124 టీఎంసీల నీరు ఉండగా ఇందులో ఏపీకి 72.8564 టీఎంసీలు, ఒడిశాకు కేవలం 51.4136 టీఎంసీలు నీరు ఉన్నట్టు నిర్ధారించారు. తుపానుకు ముందు 100 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం అదనంగా 24 టీఎంసీలు పెరిగినట్టు లెక్కలు కట్టారు. ఈ నీటితో రానున్న 4 నెలలపాటు విద్యుదుత్పత్తికి ఎటువంటి ఢోకా లేదని జెన్కో అధికారులు వెల్లడించారు. అదే విధంగా మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి డిమాండ్ లేదని, 6మిలియన్యూనిట్లు(ఎంయూ) విద్యుదుత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. ప్రమాద స్థాయిలో బలిమెల : బలిమెల జలాశయం నిండుగా ఉంది. తుపానుకు ప్రమాదస్థాయికి చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి అడుగు తేడాతో ప్రస్తుతం కళకళలాడుతుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు. శుక్రవారం సాయంత్రానికి 1515 అడుగులకు చేరుకొంది. మరో అడుగు నీరు చేరితే నీటిని విడిచి పెట్టాల్సిందే. అదే విధంగా జోలాపుట్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2750అడుగులు. ప్రస్తుతం 2749.45 అడుగుల నీరుంది. సీలేరులో 1360 అడుగులకు1352.1 అడుగుల నీరు చేరింది. డొంకరాయి 1037 అడుగులకు 1035.4 అడుగుల నీరుంది. స్పిల్వే డ్యాం నుంచి డుడుమ(డైవర్షన్) డ్యాంకు ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమ డ్యాంలో 2585.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరుజనరేటర్లతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. 1,2,3 జనరేటర్లతో 50 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. జోలాపుట్టుకు నీరందించే మత్స్యగెడ్డలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ సమావేశంలో ఏపీ జెన్కో సూపరిండెంట్ ఇంజినీర్ ఈఎల్ రమేష్, ఏడీ భీమశంకరం, ఏడీటీ సురేష్తోపాటు ఒడిశా బలిమెల హైడ్రో ప్రాజెక్టు జనరల్ మేనేజర్ పిఎన్ పాండా, డిప్యూటీ మేనేజర్ (ఎలక్రికల్) జ్యోతిబసు, నీటి వనరుల విభాగం ముఖ్య నిర్వహణ ఇంజినీర్ మహంతిదాస్ పాల్గొన్నారు. -
తక్షణం కేంద్ర సాయం అందుతుంది
విశాఖలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి విశాఖపట్నం/విజయనగరం అర్బన్: హుదూద్ తుపాను తాకిడితో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకునేలా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన కేంద్ర సాయం తక్షణం అందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసారి ఉత్తరాంధ్ర కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన విశాఖ కలెక్టరేట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా నష్టం, పునర్నిర్మాణానికి ఎంత సమయం పడుతుందనే అంశాలపై రెండున్నర గంటలపాటు సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను బాధితులకు అండగా ఉండేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దీపావళి పండుగైనా తాను రెండురోజులపాటు ఇక్కడే ఉండేందుకు వచ్చానన్నారు. -
నేడు తుపాను సాయం రూ.1,000 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.1,000 కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నట్టుగా సమాచారం అందిందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడుతో కలిసి ఏపీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వాల మాదిరి కాకుండా ప్రధాని హామీ మేరకు రూ.1,000 కోట్ల సాయం వెంటనే విడుదల కానుండడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఈ నిధులను కేటాయిస్తారని కంభంపాటి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రిని కలిశామని, నష్టపోయిన రైతులకు సహాయంతో పాటు పంటల బీమా అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు వచ్చిన వెంటనే కేంద్ర బృందాలను పంపుతామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. తుపాను కారణంగా ్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. -
జిల్లాకు చేరిన జగన్
లావేరు: అభిమానం వెల్లువెత్తింది. జన సంద్రం పోటెత్తింది. కష్టాల్లో ఉన్న హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. లావేరు మండలంలోని సుభద్రాపురం జంక్షన్ వద్దకు రాత్రి 9.10 గంటలకు చేరుకున్న జగన్కు పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ సుజయకృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి, నాయకులు గొర్లె కిరణ్కుమార్, బల్లాడ జనార్ధనరెడ్డి, మామిడి శ్రీకాంత్, పాలవలస విక్రాంత్, ఎం.వి. పద్మావతి, అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్. ప్రసాద్, గుమ్మా నగేష్, రణస్థలం జెడ్పీటీసీ గొర్లె రాజగోపాలరావు, మాజీ ఎంపీపీ దన్నాన రాజినాయుడు, మాజీ జెడ్పీటీసీలు టొంపల సీతారాం, సనపల నారాయణరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రొక్కం బాలకృష్ణలతో పాటు లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల వైఎస్సార్ సీపీ కేడర్ అధిక సంఖ్యలో తరలి వచ్చి జగన్కు ఘనస్వాగతం పలికారు. జనసంద్రమైన సుభద్రాపురం జంక్షన్జగన్ రాకతో లావేరు మండలంలోని సుభద్రాపురం జంక్షన్ జనసంద్రమైంది. సుభద్రాపురం జంక్షన్కు జగన్ వస్తున్నారని సమాచారం తెలియడంతో సాయంత్రం ఐదు గంటల నుంచే అధిక సంఖ్యలో జనం బారులు తీరారు. జగన్ రాక ఆలస్యమైనప్పటికీ మహిళలు, వృద్ధులు, యువత రాత్రి వరకూ ఎదురుచూసి స్వాగతం పలికారు.శ్రీకాకుళం అర్బన్: జగన్ మోహన్రెడ్డి సోమవారం రాత్రి శ్రీకాకుళంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లాలో నష్టపోయిన తుపాను బాధితులున మంగళవారం పరామర్శించనున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి సుజయ్కృష్ణ రంగారావు, పార్టీ హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, పార్టీ నాయకులు పాలవలస రాజశేఖరం, పాలవలస విక్రాంత్, గొర్లె కిరణ్, ఎం.వి.పద్మా -
సర్వే..శ్వరా!
శ్రీకాకుళం అగ్రికల్చర్: హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో పంటలన్నీ కోల్పోయిన అన్నదాతలు ప్రభుత్వం సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కొత్త కొత్త నిబంధనలు.. ఆంక్షలతో వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. హుదూద్ తీరం దాటి పది రోజులవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు సిద్ధం కాలేదు. ఇప్పటికీ తొలి రోజు అంచనాలనే అధికారులు చెబుతున్నారు.ఇవీ లెక్కలు: వరి 74351 హెక్టార్లు, మొక్కజొన్న 2680, పత్తి పంట 6090, చెరకు 3818, అపరాలు, ఇతర పంటలు 122 హెక్టార్లు వెరసి.. సుమారు 87,151 హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అరటి 1,578, కొబ్బరి 1,082 హెక్టార్లు, జీడిమామిడి 376, బొప్పాయి 38, మామిడి 24 మొత్తం 3,758 హెక్టార్లలోనూ నష్టం వాటిల్లిందనేది అధికారుల అంచనాలు. కానీ జిల్లాలో వరి పంట ఒక్కటే 1.50 లక్షల హెక్టార్ల పైబడి నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. అన్ని పంటలూ అధికారుల అంచనాలకు రెట్టింపులోనే ఉన్నాయని ఆవేదనభరితంగా చెబుతున్నారు. అంచనాల కోసం అధికారుల సర్వే మూడు రోజులుగా గ్రామాల్లో నష్టం అంచనాలకు అధికారులు రైతులతో కలిసి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు జియోగ్రాఫికల్ సర్వే చేపట్టడంతో ఈ ప్రక్రియ నత్తనడక సాగుతోంది. ఇలా అయితే జిల్లాలో పంట నష్టం అంచనాలు పూర్తి కావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులే చెబుతున్నారు. కారణం.. ఒక్కో రైతుకు చెందిన ఒక సర్వే నంబరు వివరాలను అప్లోడ్ చేయడానికి కనీసం అర్ధగంట సమయం పైబడి పడుతోంది. పంట ఎంతమేరకు పోయినా 50శాతం మాత్రమే చూపుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో జియెటాకింగ్ విధానంలో పంటనష్టం సర్వే చేయొద్దని పలు గ్రామాల్లో రైతులు అడ్డుకుంటున్నారు. సవాలక్ష ఆంక్షలు పంట నష్టం అంచనాల తయారీకి ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధించింది. రైతు ఆధార్ నంబర్, పేరు.. తదితర కుటుంబ వివరాలతోపాటు మొబైల్ నంబరు తదితర అన్ని వివరాలూ అవసరమని పేర్కొంది. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా జియోమెట్రిక్ విధానంలో సర్వేకు వీలుకాదు. సర్వే నంబర్లు విషయానికోస్తే సర్వే నంబరు, మొత్తం విస్తీర్ణం, ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది/ఎన్ని మొక్కలకు నష్టం జరిగింది. పంట కేటగిరి, చిన్నా, సన్నకారు రైతా.. పెద్ద రైతా.. పంట నష్టం శాతం ఎంతఅనేవి నమోదు చేయాలి. ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులు పంటలు వేస్తే ఒకే సర్వే నంబరులో వేర్వేరు రైతులతో జియోటాకింగ్ విధానంలో వారందరికీ ఫోటోలు తీయాలి. అంతేకాకుండా ఒకే సర్వే నంబరులో ఒకే రైతు వేర్వేరు పంటలు వేసినా అప్పుడు కూడా ఒకే రైతు అన్ని పంటల వద్ద ఫొటోలు తీయించాలి. ఇలా చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళం రూరల్ మండలంలో సుమారు 19 వేలకు పైబడి సర్వే నంబర్లున్నారు. ఒక్కో సర్వే నంబరులో సుమారు 10 నుంచి 20 పైబడి సబ్ డివిజన్లుంటాయి. వీటిలో అన్నదమ్ముల వాటాలు, ఇతరత్రా కారణాల వల్ల ఎ, బీ, సీ వంటి విభజనలు జరిగి ఉంటే మరిన్ని ఉంటాయి. వీటన్నంటికీ రైతులను పెట్టి ఫొటోలు తీయాలంటే కష్టమేనని రైతులు తీవ్రస్థాయిలో మథనపడుతున్నారు. వీటితో పాటు బ్యాంకు పేరు, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు ఖాతా నంబరు, అక్షాంశ.. రేఖాంశాలు, ఫొటో ఉండాలి. ఆధార్, ఫోన్ నంబర్లు లేని రైతులు అనేకం జిల్లాలో ఆధార్కార్డులు లేని రైతులు అనేకమంది ఉన్నారు. నేటికీ ఆధార్ కార్డుల కోసం త హశీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రద క్షణలు చేస్తున్నారు. అలాంటిది ఆధార్ నంబర్లు అంటే ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్లు లేనివారు లెక్కలేనంతమంది. దీంతో రైతులను మభ్యపెట్టి పరిహారం ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఈ కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి -
జగన్ హాజరుకు ప్రత్యేక కోర్టు మినహాయింపు
హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత హాజరు మినహారుుంపునకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వారం రోజులుగా జగన్ హుదూద్ తుపాను బాధితులను పరామర్శిస్తున్నారని, మరికొన్ని రోజులు అక్కడే ఉంటారని, ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని ఆయన తరఫు న్యాయవాది అశోక్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. -
విశాఖ పునర్నిర్మాణానికి మాస్టర్ప్లాన్
ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి నిధులకు ప్రయత్నం: ఏపీ సీఎం చంద్రబాబు * ఆస్తి నష్టం అంచనాలకు మించి ఉంది * అందరి సహకారంతోనే ఉత్తరాంధ్రను సాధారణ స్థితికి తెచ్చాం * విద్యుత్తు సంస్థలకు నష్టం రూ.1,400 కోట్లుదాకా ఉంది * అంకితభావంతో పనిచేసిన విశాఖ కలెక్టర్, ఉద్యోగులకు అభినందనలు సాక్షి, హైదరాబాద్/విశాఖ రూరల్: హుదూద్ తుపాను ధాటికి పూర్తిగా దెబ్బతిన్న విశాఖ నగర పునర్నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ల నుంచి నిధులు తెచ్చేందుకు మాస్టర్ప్లాన్ తయారు చేస్తామ ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖను సుందరవనంగా, ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా తయారు చేస్తామని తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అనంతరం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా అంచనాలకు అందనివిధంగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఆయువు పట్టు లాంటి ఆర్థిక నగరం కుదేలైందని, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన స్మార్ట్ సిటీ ఇబ్బందుల్లో ఉందని అన్నారు. తుపాను ఓ నగరాన్ని అల్లకల్లోలం చేసిన సంఘటన ఇటీవలి కాలంలో ఎక్క డా లేదన్నారు. 30 లక్షలమంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. త్వరలో తాను ప్రధాని మోదీని కలిసి నగర పునర్నిర్మాణంపై చర్చిస్తానన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నీతికి మారుపేరని, నిజాయితీ వీరి వారసత్వంలోనే ఉందని కితాబిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆరు రోజులపాటు తాను విశాఖలోనే ఉండి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా ఎన్ని చేయాలో అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన బాధ్య త నెరవేర్చానని, సంతోషంగా ఉందని చెప్పారు. మళ్లీ మంగళవారం రాత్రికి విశాఖ వస్తానని, రెండు రోజులిక్కడే ఉండి పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దుతానని అన్నారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చి మబెంగాల్ రాష్ట్రాలతోపాటు అధికార యం త్రాంగం, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తుపాను నష్టం నుంచి ఉత్తరాంధ్ర తేరుకునేలా చేయగలిగామని చెప్పారు. తుపాను వచ్చిన రెండోరోజే ప్రధాని మోదీ విశాఖకొచ్చి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వరంగానికే భారీ నష్టం తుపాను నష్టం ప్రభుత్వ రంగంలోనే భారీగా ఉందన్నారు. ఒక్క విద్యుత్తు శాఖ నష్టమే రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఉందని తెలిపారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. 30 వేల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని, వేలాది ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలాయని, వందలాది సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎన్టీపీసీలో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10 లక్షల సర్వీసు కనెక్షన్లు ఇవ్వగా, ఇంకా 13 లక్షల కనెక్షన్లను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు విద్యుత్ సరఫరా చేస్తామని, 22వ తేదీ నాటికి మండల కేంద్రాల్లో, 25వ తేదీకి జిల్లా మొత్తంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ రాని ప్రాంతాలు, ఏజెన్సీలో 5 లీటర్ల కిరోసిన్ ఇస్తామన్నారు.పరిశ్రమల పునరుద్ధరణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు. పచ్చదనానికి ప్రణాళిక విశాఖలో పచ్చదనం పరిరక్షణకు హార్టీకల్చర్ నిపుణులతో ప్రణాళిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. సోమవారం నుంచి చెట్లను ప్రూనింగ్ చేస్తామని చెప్పారు. అందమైన ల్యాండ్ స్కేపింగ్, తుపాన్లను తట్టుకొనేలా చెట్లను వేయడానికి ముంబై నుంచి కన్సల్టెంట్లు వచ్చారని అన్నారు. విశాఖ జిల్లాలో 13 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తామని చెప్పారు. ముకేష్ అంబానీ రూ.11 కోట్ల విరాళం తుపాను బాధితుల సహాయార్థం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రూ.11 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. 23న కాగడాల ర్యాలీ తుపాను చేసిన గాయాన్ని మరచిపోయేందు కు, విశాఖవాసుల్లో ఆత్మవిశ్వాసం నింపేం దుకు ఈ నెల 23న ఆర్కే బీచ్లో ‘తుపాను ను జయిద్దాం’ నినాదంతో కాగడాల ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక విశాఖ పునరుద్ధరణకు కృషి చేసిన ఇతర రాష్ట్రాల అధికారులు, సిబ్బందితో భారీ అభినందన సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇతర జిల్లాలవారికి విందు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ను ఆదేశించారు. సహాయక పనుల్లో కష్టపడిన వారిని గుర్తించి అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు. -
హుదూద్ నష్టం రూ. 65 వేల కోట్లు!?
ప్రభుత్వ, ప్రైవేటు, సేవా రంగాల ఆస్తులకు కలిగిన నష్టం విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలను కుదుపు కుది పేసిన హుదూద్ తుపాను కలిగించిన నష్టం అంచనాలకు అందకుండా ఉంది. నష్టా న్ని అంచనాకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తోంది. కాగా హుదూద్ వల్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, సేవా రంగ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టంపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. తుపాను వల్ల విశాఖపట్నంతోపాటు నాలుగు జిల్లాల్లో 44 మండలాలు దెబ్బతిన్నాయి. అన్నింటా కలిపి దాదాపు రూ.65వేలకోట్లకుపైగా భారీ నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. -
వైఎస్సార్ ఫౌండేషన్ ‘తుపాను నిధి’కి రూ.15 లక్షల విరాళం
హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తుపాను బాధితుల సహాయ నిధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ రూ.15 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు శనివారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు చెక్కు అందజేశారు. - సాక్షి, హైదరాబాద్ -
మరో 3 రోజుల్లో విశాఖకు 80% విద్యుత్తు
-
నేడు జిల్లాలో జగన్ పర్యటన
విశాఖపట్నం సిటీ: హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శనివారం అనకాపల్లి దరి తుంపాల గ్రామంలో తుపాను బీభత్సానికి పాడైన చెరకు తోటలను సందర్శిస్తారు. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. పాడేరు దరి మోదపల్లి, ఇరడాపల్లిలోని కాఫీ తోట లు, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని నందివలస ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తారు. తుపాను వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారని, జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉద్యోగ జేఏసీ రూ. 125 కోట్ల విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకునేందుకు ఏపీలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు కలిపి మొత్తం సుమారు రూ. 125 కోట్ల విరాళాన్ని ఇస్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఉద్యోగుల రెండ్రోజుల మూలవేతనాన్ని సీఎం రిలీఫ్ఫండ్కు అందిస్తున్నట్లు ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పి.అశోక్బాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
బాధితులకే నేరుగా పరిహారం: బాబు
హుదూద్ తుపాను బాధితులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని, మధ్యవర్తుల ప్రమేయం ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తుపాను నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ఇప్పటికే 152 బృందాలను అన్ని ప్రాంతాలకు పంపామన్నారు. మొత్తం 500 ట్యాబ్లను ఈ బృందాలకు ఇచ్చి ఆస్తి నష్టాలను ఫొటో, వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించామని చెప్పారు. ఆస్తి నష్టం వివరాలను డాక్యుమెంట్ రూపంలో హుదూద్ తుపాను పోర్టల్లో ఉంచుతామన్నారు. ఈ సర్వే వివరాలను పోర్టల్లో చూడవచ్చని, పొరపాట్లున్నా, అర్హులైన బాధితులు జాబితాలో లేకపోయినా ఈ వెబ్సైట్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. విద్యుత్, తాగు నీరు, రోడ్డు రవా ణా, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో ఆశించిన ప్రగతి కనిపిస్తోందన్నారు. రైవాడ కాల్వకు గండిపడటంతో పాటు ముఖ్యమైన పాయింట్లలో పైపులు దెబ్బతిన్నందువల్ల విశాఖ నగరంలో పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోయామన్నారు. శనివారం సాయంత్రానికి పనులు పూర్తి చేసి అన్ని ప్రాంతాలకూ నీరిస్తామన్నారు. నగరంలో అన్ని సెల్ఫోన్ల సిగ్నల్స్ను పునరుద్ధరించామని, ఎయిర్టెల్ 30 నిమిషాల ఉచిత టాక్ టైంతో పాటు క్రెడిట్ ప్రాతిపదికన రూ. 50ల టాక్ టైమ్ను వినియోగించుకునే వెసులుబాటు కల్పిం చిందని చెప్పారు. తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించే క్రమంలో తాను కొందరితో పరుషంగా మాట్లాడానని, తర్వాత క్షమాపణ చెబుతానని బాబు అన్నారు. నా మాటలు నమ్మితేనే గిరిజనుల అభివద్ధి: బాబు పాడేరు: గిరిజనులు తన మాట నమ్మితేనే బాగుపడతారని చంద్రబాబు చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. గిరిజనులకు మంచి చేసే కార్యక్రమాలనే చేపడతానని తెలిపారు. కొండ దిగువన ఉన్న గిరిజనులు అంగీకరిస్తే వారిని ఇతర ప్రాంతాలకు తరలించి మోడల్ కాలనీలు నిర్మించి ఇస్తానని చెప్పా రు. ఏజెన్సీలో పరిశ్రమలు ఏర్పడితే మరింత అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. టూరిజం అభివృద్ధి జరిగితే గిరిజనులకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ఏజెన్సీలో కాఫీ సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు శుక్రవారం పాడేరు ప్రాంతంలో పర్యటిం చారు. ఏజెన్సీవ్యాప్తంగా 3 కోట్ల సిల్వర్ ఓక్ విత్తనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. దెబ్బతిన్న కాఫీ తోటల్లో 11 ఏళ్లుగా కాపు ఉన్నవాటికి ఎకరాకు రూ.25 వేలు, 6 నుంచి 10 ఏళ్లలోపు వాటికి రూ.15 వేలు, 1 నుంచి 6 ఏళ్ల లోపు తోటలకు రూ.10 వేలు పరిహారాన్ని ప్రకటించారు. విశాఖ నగరానికి కొత్త పేరు విశాఖ నగరానికి కొత్త పేరు పెట్టే ఆలోచన ఉందని చంద్రబాబు అన్నారు. సరైన పేరు సూచించాలని కోరా రు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సింగపూర్ నుంచి ఒక బృందం శనివారం సాయంత్రం వస్తోందన్నారు. పట్టణంలో దెబ్బతిన్న చెట్లను ప్రత్యేక ట్రీట్మెంట్ పద్ధతిలో ప్రూనింగ్ చేయించి పచ్చదనాన్ని పునరుద్ధరిస్తామన్నారు. భూగర్భ పైపులైన్ వ్యవస్థ ద్వారా విద్యుత్, గ్యాస్, డ్రెయినేజీ, తాగు నీటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఎంత చేసినా కొందరు విమర్శిస్తూనే ఉన్నారన్నారు. ‘రాహుల్గాంధీ వస్తారట! ఇప్పుడెందుకు?’ అన్నారు. -
తుపాను సాయంలో కోత
పెంచిన ఐదు రోజులకే 60 శాతం పైగా తగ్గింపు హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులకు సహాయంలో అప్పుడే కోతలు ఆరంభమయ్యాయి. ఈ మేరకు స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్కు (సహాయ ప్యాకేజీ) సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హుదూద్సృష్టించిన విధ్వంసంలో ఇళ్లతో పాటు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి తక్షణం ఇచ్చే సహాయ ప్యాకేజీని పెంచుతూ ప్రభుత్వం ఈనెల 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలోనే సహాయంలో 60 శాతానికి పైగా కోత విధిస్తూ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. -
మరో 3 రోజుల్లో విశాఖకు 80% విద్యుత్తు
ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్జైన్ సీతమ్మధార(విశాఖపట్నం)/విజయనగరం: హుదూద్ తుపాను ధాటికి దారుణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను అతి త్వరలో సాధారణ స్థితికి తెచ్చేందుకు విద్యుత్శాఖ యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నట్టు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్జైన్ వెల్లడించారు. మరో మూడు రోజుల్లో విశాఖ నగర ప్రజలకు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖపట్నం, విజయనగరంలలో విలేకరులతో మాట్లాడారు. మొత్తంమీద విద్యుత్ శాఖకు రూ.1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. 74 విద్యుత్ టవర్లు తుపాను ధాటికి కుప్పకూలిపోయాయన్నారు. 440 కేవీ టవర్స్ 34, 220 కేవీ టవర్స్ 20, 132 కేవీ టవర్స్ మరో 20 ధ్వంసమయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 25వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయన్నారు. వీటిలో విజయనగరం జిల్లాలో 8 వేలు, విశాఖ జిల్లాలో 15 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 2వేలు స్తంభాలు కూలిపోయాయన్నారు. కాగా ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. విశాఖ నగరానికి సంబంధించి ఏడులక్షల మంది వినియోగదారులకుగానూ.. ఇప్పటి వరకు రెండులక్షల 70 వేల మందికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు చెప్పారు. సహాయక చర్యల్లో కష్టించి పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక ఇన్సెంటివ్లతోపాటు పదోన్నతుల్లో ప్రాధాన్యమిస్తామని తెలిపారు. -
అన్నదాత కుదేలు
యలమంచిలి సబ్డివిజన్లో 16వేల ఎకరాల్లో నీటమునిగిన వరి 8,500 ఎకరాల్లో చెరకుకు నష్టం యలమంచిలి : వరుస విపత్తులతో అన్నదాత కుదేలవుతున్నాడు. హుదూద్ తుపాను రూపంలో వరుసగా మూడో ఏడాది యలమంచిలి నియోజకవర్గంలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఈసారి పెనుగాలుల బీభత్సానికి పంటలతో పాటు మహావృక్షాలు నేలకొరగడంతో రైతులు మరింత ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. యలమంచిలి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలో దాదాపు 25వేలకుపైగా ఎకరాల్లో పంటలు నీటమునిగినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 16వేల ఎకరాల్లో వరి, 8,500 ఎకరాల్లో చెరకు, 515 ఎకరాల్లో పత్తి, కంది, మినుము, పెసలు, నువ్వు పంటలు ముంపులో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. యలమంచిలి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో 25,015 ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్టు యలమంచిలి అసిస్టెంట్ డెరైక్టర్ డి.మాలకొండయ్య గురువారం చెప్పారు. ప్రస్తుతం పంట పొలాల్లో వర్షపునీరు మెల్లగా బయటకు వస్తోందని, రెండు మూడు రోజుల్లో పూర్తి నష్టం అంచనా తెలుస్తుందని చెప్పారు. నీటమునిగిన పొలాల్లో నీరు తొలగిన వెంటనే వరిపంటకు ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, చెరకు తోటల్లో ఎకరానికి 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ కలిపిన ద్రావణాన్ని వినియోగిస్తే తెగుళ్లు సోకకుండా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని ఏడీ సూచించారు. ఎక్కువ చెరకు తోటల్లో గెడలు విరిగిపోవడంతో వాటిని ఎత్తికట్టడానికి కూడా వీలులేని పరిస్థితి ఉందన్నారు. పెనుగాలుల ధాటికి చెరకు పంటకు భారీగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ విస్తరణాధికారులు చెబుతున్నారు. మరోవైపు రైతులు రెండేళ్ల క్రితం నీలం తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకే ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదని, ఈసారైనా త్వరితగతిన పరిహా రం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. ఉద్యానపంటలకూ నష్టం... యలమంచిలి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలో సంప్రదాయ పంటలతో పాటు ఈసారి ఉద్యానపంటలకూ తీవ్ర నష్టం సంభవించింది. హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలుల తాకిడికి మామిడి, జీడితోటల్లో చెట్లు నేలకొరిగాయి. కొబ్బరిచెట్లు తలలు తెగినట్లు మోడువారాయి. పంటచేతికందే సమయంలో హుదూద్ తుపాను రూపంలో తమకు నష్టం చేకూర్చిందని యలమంచిలి ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలాది ఎకరాల్లో సంవత్సరాలు సంరక్షిస్తున్న మామిడి, జీడి, కొబ్బరి తోటలు నిర్జీవంగా మారిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. ప్రభుత్వం తమపై దయచూపి మెరుగైన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు. -
నదీముఖ రాజధానిపై పునరాలోచన!
తుపాను బీభత్సం నేపథ్యంలో సర్కారు తర్జనభర్జనలు విశాఖ నగరం దెబ్బతిన్న తీరుపై దృష్టి కృష్టా నదికి గతంలో వచ్చిన భారీ వరదలు పరిగణనలోకి.. ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు ప్రభుత్వ పెద్దల ముందు అధికారుల తాజా ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి నూజివీడు, విజయవాడ-ఏలూరు మధ్య ప్రాంతం హైదరాబాద్: నదీముఖ రాజధాని (రివర్ వ్యూ) నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. అన్ని విధాలా లాభనష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయానికి రావాలని భావిస్తోంది. హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో రాజధాని నిర్మాణంపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం ైవె కుంఠపురం నుంచి తాడేపల్లి మండలం సీతానగరం వరకు, కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మొదలుకుని కంచికచర్ల వరకు కృష్ణా నదీ ముఖంగా రాజధాని నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు పలు సమీక్షా సమావే శాలు నిర్వహించారు. చివరకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడింది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో రాజధాని విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. సముద్రానికి అంచున ఉండటం, గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో విశాఖ నగరానికి తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలింది. పరిశ్రమలు మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తిరిగి పూర్వ స్థితికి చేరుకోవాలంటే కనీసం రెండు, మూడు సంవత్సరాలు పట్టొచ్చని అధికారులు అంటున్నారు. కాగా ప్రస్తుతం రాజధాని నిర్మాణాన్ని సంకల్పించిన ప్రాంతంలో సైతం భారీ వరదలకు ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరించడంతో, ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యుడొకరు చెప్పారు. గతాన్ని ప్రస్తావిస్తున్న నిపుణులు కృష్ణా నదీ ముఖ రాజధాని నిర్మాణానికి పరిస్థితులు అనుకూలం కాదని పలువురు నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ ఈ ప్రాంతంలోనే నిర్మించాలని భావిస్తే ఉధృతమైన వరదలను సైతం తట్టుకునే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, ఇందుకు అనుకున్నదానికన్నా రెండింతల ఖర్చు అవుతుందన్న అభిప్రాయం ఉంది. గత చరిత్రను పరిశీలిస్తే కృష్ణా నదికి ప్రతి 20 లేదా 30 సంవత్సరాలకు ఒకసారి ఉధృతంగా వరదలు వస్తుంటాయి. 2009 సెప్టెంబర్ తొలి వారంలో కృష్ణా బ్యాక్ వాటర్ వల్ల కర్నూలు నగరం మునిగిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్న ైవైకుంఠపురం నుంచి కంచికచర్ల వరకు కృష్ణా నదికి చేరువగానే ఉంటారుు. దీనివల్ల ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. విజయవాడ, ఏలూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా సురక్షితమని వారు చెప్పినట్లు సమాచారం. కృష్ణా జిల్లా నూజివీడు అయితే అటు విజయవాడ, ఇటు ఏలూరుకు మధ్యలో ఉంటుందని కొందరు రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రివర్గం ఉపసంఘానికి తెలిపినట్టు తెలిసింది. నూజివీడు విజయవాడకు 44 కిలోమీటర్లు, ఏలూరుకు 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమట్టానికి 88 మీటర్ల(288 అడుగులు) ఎత్తులో ఉంది. అదే మంగళగిరి 43 మీటర్లు(141 అడుగులు), విజ యవాడ 23 మీటర్లు (75 అడుగులు), అమరావతి 36 మీటర్లు(118 అడుగులు) ఎత్తులోనే ఉంటాయని, అందువల్ల నూజివీడు అనువైందని వివరించినట్లు సమాచారం. గతంలో వరదలు వచ్చినపుడు విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలోకి, పక్కనే ఉన్న రింగ్రోడ్లోకి నీరు రావటం, తుమ్మలపాలెం, పరిటాల, కంచికచర్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడటం, కీసర వద్ద అప్రోచ్ బ్రిడ్జి కూలిపోవటాన్ని వారు ప్రస్తావించినట్లు తెలిసింది. తుపాను, వరదలు ఒకేసారి రావడం, సముద్రం ఆటుపోట్లకు గురైన సమయంలో ఒకవేళ నీటిని కృష్ణా నది నుంచి విడుదల చేసినా సముద్రంలో కలవకుండా వెనక్కు వచ్చే ప్రమాదముందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పురపాలక శాఖ పరిధిలోని డెరైక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గతంలో రాజధాని విషయంలో తయారు చేసిన ఒక నివేదికను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. దీనిలో విశాఖపట్నం రాజధానిగా అనువైంది కాదని, కర్నూలు జిల్లా రాయలసీమకు మధ్యలో లేదని, హైదరాబాద్కు దగ్గరగా ఉండటం వల్ల అంత వేగంగా అభివృద్ది చెందదని, గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతం అనువైనది అయినా రాష్ట్రంలోని నలుమూలలకు రోడ్డు కనెక్టివిటీ లేదని పేర్కొన్నారు. వరదలను అడ్డుకుంటే ఇబ్బంది ఉండదు: శ్రీధరన్ తుపానులు, వరదలు వంటివి నదీ ముఖ రాజధానికి పెద్ద సమస్య కాదని పట్టణ నిర్మాణ రంగ నిపుణులు, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంచాలకులు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.శ్రీధరన్ తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఆమ్స్టర్డామ్, బాన్ తదితర నగరాలు నదులకు ఆనుకునే ఉన్నాయని తెలిపారు. భారీ వర్షాల వల్ల వచ్చే వరదలు, ఆకస్మిక వరదలు వంటి వాటిని తట్టుకునే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన చెప్పారు. -
ఐపీవో ప్రణాళికల్లో వెనకడుగు లేదు: వైజాగ్ స్టీల్
న్యూఢిల్లీ: ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను కారణంగా భారీ నష్టం వాటిల్లినప్పటికీ ఐపీవో ప్రణాళికల్లో వెనకడుగు వేసేదిలేదని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్ఐఎన్ఎల్-వైజాగ్ స్టీల్) స్పష్టం చేసింది. లిస్టింగ్ వాయిదా కోసం ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థనా చేయలేదని తెలిపింది. కంపెనీవైపు నుంచి సమస్యల్లేవని, దీంతో వాయిదాపై డిజిన్వెస్ట్మెంట్ శాఖ(డీవోడీ)కు ఎలాంటి వినతినీ అందజేయలేదని వివరించింది. అయితే ఈ అంశంపై డీవోడీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ప్రణాళికల ప్రకారం వైజాగ్ స్టీల్ జనవరిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టాల్సి ఉంది. కాగా, కంపెనీ ఐపీవో ప్రణాళికలు వివిధ కారణాలవల్ల గతంలో మూడుసార్లు వాయిదా పడటం తెలిసిందే. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 10% వాటాను అమ్మకానికి పెట్టనుంది. కంపెనీలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 2,500 కోట్లవరకు సమీకరించాలని భావిస్తోంది. 2 వారాల్లో పూర్తి ఉత్పత్తి: సీఎండీ విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో ఉద్యోగుల భధ్రతకు ఎలాంటి ఢోకా లేదని స్టీల్ప్లాంటు సీఎండీ పి.మధుసూదన్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ సిటీ ఉద్యోగుల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తుపాను ప్రభావంతో ప్లాంటు భవనాలు, పైకప్పు రేకులు, అద్దాలు ధ్వంసమయ్యాయన్నారు. యంత్రాలకు ముప్పు వాటిల్లలేదన్నారు. ట్రాన్స్కో విద్యుత్ సరఫరాను గురువారం సరఫరా పునరుద్ధరించిందన్నారు. 2 వారాల్లో మళ్లీ పూర్తిస్థాయిలో ఉత్పత్తిని అందుకుంటామని చెప్పారు. -
అంతటా అంధకారం
హుదూద్ తుపాను విలయ తాండవానికి మండలంలోని అన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. కొళాయినీరు రాక, విద్యుత్ ఉపకరణాలు పనిచేయక పగలంతా అవస్థలు పడుతున్నారు. కటిక చీకట్లో, దోమల బెడదతో ఇంటిల్లిపాదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరోపక్క తుపాను దెబ్బకు పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. అచ్యుతాపురం : మండలంలో వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హైటెన్షన్ లైన్లో 10 భారీ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అన్ని లైన్లలో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్దరించడానికి సమయం పడుతుందని అనకాపల్లి డీఈ జి.రాజ్కుమార్ తె లిపారు. అత్యవసరంగా మండల కేంద్రానికి విద్యుత్ సరఫరా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అచ్యుతాపురం నుంచి గాజువాక ప్రధాన రహదారికి రాకపోకలు పునరుద్దరించగలిగారు. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే రహదారిలో చోడపల్లి వద్ద భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. బుధవారం నాటికి ఈ రహదారిలో అడ్డంకులు తొలగించగలమని ఎస్ఐ సన్యాశినాయుడు తెలిపారు. తిమ్మరాజుపేట జంక్షన్ నుంచి ఖాజీపాలెం, కొండకర్ల జంక్షన్ నుంచి ఎం.జగన్నాధపురం గ్రామాలకు ఇప్పటికీ రాకపోకలు జరగలేదు. ఈ రహదారిలో చెట్లను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో 20 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. పరిశ్రమలు కుదేలు స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్) పరిశ్రమలకు తుపాను తీవ్రనష్టాన్ని మిగిల్చింది. సెజ్లో ఉత్పత్తులను చేపడుతున్న 17 పరిశ్రమలు, నిర్మాణంలో ఉన్న 12 పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అభిజిత్ పరిశ్రమ నుంచి ఎగిరిన రేకులు మడుతూరు వరకూ పడ్డాయి. డబ్ల్యూఎస్ పరిశ్రమలో బ్రాండెక్స్ పరిశ్రమలో బ్రాండెక్స్ అపెరల్ సిటీ 1, 2, 3, పయినీర్, సీడ్స్, క్వాంటమ్, పరిశ్రమలలో యంత్రాలు పాడైపోయాయి. అచ్యుతాపురం పరిసరాల్లో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమల సీలింగ్ ఊడిపడడంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. పరిశ్రమలకు సామగ్రిని అందించే పలు వాహనాలు మార్గమధ్యలో దెబ్బతిన్నాయి. పలు కంటైనర్లు బోల్తాపడ్డాయి. పరిశ్రమలపై ఆధారపడి 15 వేల మంది కార్మికులు ఉన్నారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించి మరమ్మతులు చేపట్టడానికి సమయం పట్టే అవకాశం ఉంది. తమ ఉపాధిపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చిప్పాడ ధ్వంసం చిప్పాడ పరిస్థితి దయనీయంగా తయారయింది. ఏడేళ్ల క్రితమే చిప్పాడ గ్రామాన్ని తరలిస్తామని అధికారులు చెప్పారు. పునరావాసం కల్పించడంలో జాప్యం జరిగింది. దీంతో నిర్వాసితులు ఇప్పటివరకూ ఇళ్లు నిర్మించుకోలేదు. వెదురువాడ వద్ద స్థలాలు మంజూరు చేస్తామని ఇటీవల అధికారులు ప్రకటించారు. ఇంతలో తుపాను గ్రామాన్ని అతలాకుతలం చేసింది. గ్రామంలో పూరిగుడిసెలన్నీ నేలమట్టమయ్యాయి. గ్రామస్తులంతా నిరాశ్రయులయ్యారు. ప్రత్యామ్నాయ ప్రదేశాలు లేక చాలామంది కూలిన ఇళ్లలోనే తలదాచుకున్నారు. వెదురువాడ వద్ద స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని నిర్వాసితులు అధికారులను కోరుతున్నారు. -
ఉచితం సరే.. సరకులేవీ?
తుపాను బాధితులకు బియ్యంతో పాటు 9 సరకులు పంపిణీ చేస్తామని సీఎం హామీ అంత స్థాయిలో జిల్లాలో స్టాకు లేక అధికారుల మల్లగుల్లాలు విశాఖ రూరల్ : హుదూద్ తుపాను బాధితులకు బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరకులు ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చి న హామీ నేరవేరడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రకటించిన వస్తువుల్లో ఏ ఒక్కటీ జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. దీంతో వాటిని ఇతర జిల్లాల నుంచి సేకరించాలని నిర్ణయించారు. తుపాను కారణంగా ఎంత మంది తెల్లరేషన్కార్డుదారులకు నష్టం జరి గిందో అంచనాలు సిద్ధం చేశారు. ఆ స్థాయిలో ని త్యావసరాల సేకరణ నివేదిక తయారు చేయగా.. తాజాగా సీఎం ఆ వస్తువులను కేవలం కార్డుదారులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎంత మేర నిత్యావసరాలను సేకరించాలో తెలియక అధికారులు కిందామీదా పడుతున్నారు. సగం స్థాయిలో కూడా సరకులు లేవు తుపానుకు నష్టపోయిన ప్రతి కార్డుదారునికి 25 కిలోల బియ్యం, కిలో పంచదార, 2 కిలోల కంది పప్పు, అరకిలో కారం, అరకిలో ఉప్పు, పామాయిల్ లీటర్, కిరోసిన్ 5 లీటర్లు, బంగాళదుంపలు 3 కిలోలు, ఉల్లి 2 కిలోలు ఉచితంగా ఇస్తామని సీ ఎం హామీ ఇచ్చారు. దీని ప్రకారం పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తే తెల్ల కార్డుదారుల కు సగం స్థాయిలో సరకులు లేవని గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి సేకరణ ప్రస్తుతం జిల్లాలో ఉన్న మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో బియ్యం 6857.292 మెట్రిక్ టన్ను లు, పంచదార 152.750 మెట్రిక్ టన్నులు, కా రం 5 మెట్రిక్ టన్నులు, ఉప్పు 25 వేలు మెట్రిక్ టన్నులు, కిరోసిన్ 76 కిలోలీటర్లు మాత్రమే ఉన్నాయి. పామాయిల్, కృదిపప్పు లేవు. ఆయి ల్ గత ఏడు నెలలుగా తెల్లరేషన్కార్డులకు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. కానీ తుపాను బాధితులకు వీటిని ఇతర ప్రాంతాల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం సరిపడా లేనప్పటికీ ఎఫ్సీఐ నుంచి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎఫ్సీఐలో బియ్యం అవసరాలకు సరిపడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వస్తువులను మాత్రం ఇతర ప్రాంతాల నుంచి సేకరించాల్సి ఉంది. కార్డుదారులకే కాకుండా అపార్టుమెంట్లలో ఉన్న వారికి కూడా ఈ వస్తువులను ఉచితంగా ఇస్తామని సీఎం ప్రకటించారు. మొత్తం 9 లక్షల మందికి అందజేస్తామని చెప్పడంతో అంత స్థాయిలో సేకరణ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతటి స్థాయిలో అధికారులు సైతం ఇంకా ప్రణాళికలు కూడా రూపొందించలేదు. -
నేటి నుంచి నష్టం అంచనా
ఎన్యూమరేషన్కు 176 బృందాలు జోనల్ ఆఫీసర్లుగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, డిప్యూటీ కలెక్టర్లు ఒక్కొక్కరికి ఆరు వార్డులు/ మండలం బాధ్యత వీరిపై పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు విశాఖ రూరల్: హుదూద్ తుపాను నష్టం అంచనా గురువారం నుంచి చేపడుతున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం భావి స్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 176 బృందాలను ఏర్పాటు చేసింది. నష్టం అంచనా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఇతర జిల్లాల అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులుండే వీటిల్లో స్థానిక తహశీల్దార్, వీఆర్వో కూడా ఉంటారు. పం టలు, గృహాలు, మరణాలతో పాటు ఇతర నష్టాలను గురువారం నుంచి ఈ బృందాలు వారికి కేటాయించిన మండలాలు, వార్డుల్లో సర్వే చేయనున్నాయి. జోనల్ అధికారులుగా ఐఏఎస్లు ఈ 176 బృందాల పనితీరును పరిశీలించేందుకు జోన ల్ అధికారులుగా 35 మంది ఐఏఎస్లను నియమిం చారు. వీరితో పాటు ఐఎఫ్ఎస్, డిప్యూటీ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆ బాధ్యతలను అప్పగించా రు. ఒక్కో జోనల్ అధికారికి జీవీఎంసీ పరిధిలో అయితే ఆరు వార్డులు, గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక మం డలాన్ని కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 24 వార్డులను లేదా రూరల్లో ఏడు మండలాలను కలిపి ఒక జోన్గా విభజించారు. ఒక్కో జోన్లో నష్టం అంచనాల పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ను నియమించారు. ఎల్.వి.సుబ్రహ్మణ్యం, శ్యాంబా బు, అనిల్చంద్రపునీఠా, మన్మోహన్సింగ్, చొత్రాయ్, ఉషారాణి, కృష్ణయ్య(రిటైర్డ్)లు ఎన్యూమరేషన్ను పర్యవేక్షించనున్నారు. వారం రోజుల్లో పూర్తి నష్టం అంచనాలను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాప్యం జరిగే కొద్దీ బాధితులు మరింత నష్టపోతారని భావిస్తున్నారు.గత ఏడాది తుఫాన్ నష్టాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. అంచనాల రూపల్పనకు జాప్యంవల్లే ఇలా జరిగిందని అధికారుల మాట. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర బృందం వచ్చేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఆ అంచనాలను కేంద్రం ముందుంచి భారీగా పరిహారాన్ని రాబట్టాలని యోచిస్తున్నారు. -
మరో 3 రోజులు చీకటే!
4 రోజులుగా చీకట్లో మగ్గుతున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాకు మరో వారం! విశాఖ నగరానికి పాక్షిక సరఫరా.. నేడు మరికొంత విద్యుత్ కూలిపోయిన భారీ టవర్లు, స్తంభాల తొలగింపులో సమస్యలు ఎస్పీడీసీఎల్, తమిళనాడు, ఒడిశాల నుంచి వేలాది నిపుణుల తరలింపు హైదరాబాద్ : హుదూద్ తుపాను ధాటికి విలవిల్లాడిన ఉత్తరాంధ్ర అంధకారంలో మగ్గిపోతోంది. తుపాను వచ్చి నాలుగు రోజులైనా ఇప్పటికీ విద్యుత్ వ్యవస్థ కొంచెం కూడా కోలుకోలేదు. పెద్ద పెద్ద టవర్లు కూడా కూలిపోవడం, సబ్స్టేషన్లు పూర్తిగా దెబ్బ తినడం, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, కిలోమీటర్ల కొద్దీ లైన్లు దెబ్బ తినడంతో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ అగ్ని పరీక్షగా మారింది. దీంతో ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 22 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు మరో మూడు రోజులు చీకట్లు తప్పేలా కనిపించడంలేదు. పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాకు మరో వారం పట్టవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు గాజువాక సబ్ స్టేషన్లో కొంత మేరకు మరమ్మతులు పూర్తిచేసి, విశాఖ నగరానికి పాక్షికంగా పునరుద్ధరించగలిగారు.బుధవారం రాత్రికి విశాఖలోని గాజువాక, గోపాలపట్నం, ఎన్ఏడీ, విశాఖ కలెక్టరేట్, కేజీహెచ్, సర్క్యూట్ హౌస్, వైజాగ్ సెంట్రల్, విక్టోరియా ఆస్పత్రి, ఓల్డ్ పోస్టాఫీస్ ప్రాంతాలకు ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేశారు. గురువారం సాయంత్రానికి నగరంలో 50 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరిగే అవకాశం వుంది. చత్తీస్గడ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈఆర్ఎస్ (ఎమర్జెన్సీ రెస్టోర్ సిస్టం) పరికరాలను అమర్చి శనివారం రాత్రికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. నగర ప్రజల తాగు నీటి అవసరాలు, వైద్య సేవలకు ఇది ఉపయోగపడుతోంది. రైల్వే లైన్లకు కూడా కొంతవరకూ విద్యుత్ అందుతోంది. తాజా సమాచారం ప్రకారం కేవలం 70 వేల వినియోగదారులకు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది. వాస్తవ వినియోగంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా 12 శాతం, నగర పరిధిలో 12 శాతం మేర సరఫరా చేస్తున్నారు. సింహాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటు ఇప్పటికీ పనిచేయడంలేదు. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా లైన్లు తెగి వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. తొలగించడమే కష్టం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 5 వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు పని చేస్తున్నప్పటికీ, పనులు కొలిక్కి రావడంలేదు.విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 450 భారీ విద్యుత్ టవర్లు కుప్పకూలాయి. దాదాపు 20 వేల స్తంభాలు విరిగిపోయాయి. వీటన్నింటినీ తొలగిస్తే తప్ప కొత్త వాటిని వేయడం కష్టమని గుర్తించారు. ఆ తర్వాత సబ్ స్టేషన్లను పునరుద్ధరించినా, అవి రీఛార్జ్ అవడానికి 24 గంటలు పడుతుంది. ఇలా మరో వారం పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అంధకారం తప్పకపోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి 2 వేల మంది సిబ్బందిని రప్పించారు. వీళ్ళంతా తీగలు వేయడానికి, స్తంభాలు అమర్చడానికి, టవర్లు బాగు చేయడానికే ఉపయోగపడుతున్నారు. అయితే టెలిఫోన్, ఇతర కేబుల్స్ కూడా కలిసిపోవడంతో వాటిని వేరు చేయడం కష్టంగా ఉంది. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) వినతి మేరకు ఎస్పీడీసీఎల్ నుంచి 2 వేల మందిని, ఒడిశా నుంచి 1,000 మందిని, తమిళనాడు నుంచి 1,500 మందిని రప్పిస్తున్నారు. జిల్లాల పరిస్థితి మరీ ఘోరం! విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెందుర్తి, గరివిడి లైన్ల ద్వారా విద్యుత్ సరఫరాకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ మార్గంలో 8 ప్రధాన టవర్లు కూలిపోయాయి. దీంతోపాటు మూడు జిల్లాల్లో 132 కేవీ సబ్స్టేషన్లు 25, 33/11 కేవీ సబ్స్టేషన్లు 287, 11 కేవీ సబ్స్టేషన్లు 1,411, మరో 10,500 ఫీడర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని దారికి తెస్తే తప్ప ఈ మూడు జిల్లాల్లో పరిస్థితి మెరుగవదు.వీటన్నింటినీ బాగు చేయడానికి 4 నుంచి 7 రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. జనరేటర్ అద్దె గంటకు రూ.3 వేలు జనరేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1,000 వసూలు చేసే జనరేటర్ల వారు ఇప్పుడు విశాఖలో గంటకు రూ.3 వేలు డిమాండ్ చేస్తున్నారు. నీటి కోసం జనం పాట్లు ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలకు నీరు సరఫరా కావడంలేదు. తాగడానికి, కాలకృత్యాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా నీటి వ్యాపారులు రేట్లు పెంచేశారు. మామూలుగా రూ. 20కి లభించే 20 లీటర్ల వాటర్ క్యాన్కు ఇప్పుడు రూ. 70 నుంచి రూ.100 దాకా వసూలు చేస్తున్నారు. ఇంత డబ్బు చెల్లించి నీళ్లు కొనుక్కోలేని సాధారణ ప్రజలు కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు పంపే ట్యాంకర్ల కోసం రోడ్లపై బిందెలు, గిన్నెలతో నిరీక్షిస్తున్నారు. అపార్ట్మెంట్వాసులు గంటకు రూ.3 వేలు చెల్లించి జనరేటర్లతో నీటి ఏర్పాట్లు చేసుకున్నారు. మురికివాడల్లో నివసించే వారు సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నీటి ట్యాంకర్లు వచ్చినప్పటికీ, స్థానిక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అవి జనానికి పెద్దగా ఉపయోగపడట్లేదు. 48 గంటల్లో పునరుద్ధరణ: అజయ్జైన్ విశాఖపట్నం: విశాఖ మహానగరానికి మరో 48 గంటల్లో 70 శాతం వరకు విద్యుత్ పునరుద్ధరించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. సీతమ్మధార తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం విలేకరుల తో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గాజువాక, గోపాలపట్నం సబ్స్టేషన్లు పునరుద్ధరించినట్టు చెప్పారు. పెందుర్తి, గరివిడి పునరుద్ధరించి మరో 48 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రం నుంచి 10 నుంచి 20 మెగావాట్ల ఉత్పత్తిని తీసుకుని శ్రీకాకుళం, పార్వతీపురం పరిసర ప్రాంతాలకు అందిస్తున్నామన్నారు. నక్కవానిపాలెం సబ్స్టేషన్ పునరుద్ధరించి సీతమ్మధార ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. బుధవారం రాత్రికి 40 సబ్స్టేషన్లు పున రుద్ధరించి 50 నుంచి 70 వేలమంది వినియోగదారులకు విద్యుత్ అందిస్తామన్నారు. -
మేము సైతం..
సాక్షి, గుంటూరు తుపాను విలయంలో చిక్కుకున్న అభాగ్యులను చూసి మానవత్వం స్పందించింది. ఆకలితో అలమటిస్తూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు చేయూతనందించేందుకు జిల్లా నుంచి సహాయక బృందాలు విశాఖకు కదిలాయి. హుదూద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముఖ్యంగా సుందరనగరం విశాఖ కకావికలమైంది. ఈ నేపథ్యంలో సాటివారిని ఆదుకునేందుకు జిల్లా ప్రజలు, అధికార యంత్రాంగం మానవత్వంతో స్పందించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాల మేరకు జేసీ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, కూరగాయలు విశాఖకు తరలించారు. 15 రెవెన్యూ బృందాలు, 30 జన్మభూమి బృందాలు తరలి వెళ్లాయి. ఒక్కో రెవెన్యూ బృందంలో ఓ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు తహశీల్దార్లు, నలుగురు వీఆర్వోలు ఉన్నారు. దీంతో పాటు కార్పొరేషన్, మెడికల్ సిబ్బంది తరలివెళ్లారు. జిల్లా నుంచి తరలిన పదార్థాలు... సోమవారం ఉదయం 40 వేల భోజన ప్యాకెట్లు, 50 వేల మజ్జిగ ప్యాకెట్లను తరలించారు. మధ్యాహ్నం తరువాత రెండు లారీల కూరగాయలు, రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు, 20 వాటర్ ట్యాంకులను పంపించారు. దీంతో పాటు రెఢీ టు ఈట్ కింద ఒక ట్రక్కు బిస్కెట్లు, ఒక ట్రక్కు కేకులను పంపారు. మెడికల్ బృందాలు సైతం 6 లక్షల విలువైన అత్యవసర మందులను తీసుకొని తరలివెళ్లాయి. దీంతో పాటు సోమవారం రాత్రి 200 మంది విద్యుత్తు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లారు. కార్పొరేషన్ నుంచి... గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఏసుదాసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విశాఖకు వెళ్లాయి. ఇందులో పర్యావరణ శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ రాయల్ బాబు, ఏఈ రవీంద్రతో పాటు 400 మంది శానిటేషన్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లారు. వీరు వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, కొంత నగదు తీసుకెళ్లారు. హుదూద్ బాధితులకు ఇతోధిక సహాయం అందేలా చర్యలు తీసుకోవడంలో జిల్లా కలెక్టర్, జేసీ విశేషంగా కృషి చేస్తున్నారు. దీంతో పాటు అన్నిశాఖల సిబ్బంది, దాతల సహకారంతో మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖకు 23 మంది ఎంపీడీవోల పయనం పాతగుంటూరు : హుదూద్తుపాను బాధితుల సహాయక చర్యల కోసం జిల్లా నుంచి 23 మంది ఎంపీడీవోలను విశాఖపట్నం పంపినట్లు జిల్లా పరిషత్ సీఈవో బి.సుబ్బారావు సోమవారం తెలిపారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు వీరిని పంపినట్టు వివరించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ఎంపీడీవోలు అక్కడే ఉంటారని పేర్కొన్నారు. -
ఎక్కడ చూసినా క్యూలే..
హుదూద్ తుపాను సృష్టించిన భీకర నష్టం విశాఖ నగర వాసులకు అనేక కష్టాలు తెచ్చి పెట్టింది. పాలు, మంచినీళ్లు, హోటళ్లలో టిఫిన్, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు ఇలా ప్రతి చోట భారీ క్యూలో గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం దాకా ఇళ్లలోనే గడిపిన వేలాదిమంది నగరవాసులు ఆ తర్వాతే రోడ్ల మీదకు వచ్చారు. అరకొరగా వచ్చిన కార్పొరేషన్ నీటి ట్యాంకర్ల వద్ద వందలాది మంది క్యూ కట్టారు. పాల ప్యాకెట్లు బ్లాక్లో అర లీటరు రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నా వాటిని కొనడానికి జనం బారులు తీరారు. మంగళవారం ఉదయం నగరంలోని హోటళ్ల వద్ద జనం టిఫిన్ కోసం క్యూ కట్టాల్సి వచ్చింది. మూడు రోజులుగా నగరంలోని ఏటీఎం సెంటర్లన్నీ పనిచేయక పోవడంతో, మంగళవారం అక్కడక్కడా పనిచేసిన ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి నగరవాసులు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది. ఇక పెట్రోల్, డీజిల్ కోసమైతే నగరంలోని ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా వందలాది మంది ప్రజలు గంటల కొద్దీ ఎదురుచూడటం కన్పించింది. అనేక చోట్ల తోపులాటలు జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం నుంచి విశాఖ డెయిరీ నగరంలోని పలు చోట్ల మొబైల్ పాల విక్రయ కేంద్రాలు నిర్వహించింది. శనివారం రాత్రి నుంచే ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇన్వర్టర్లలో చార్జింగ్ అయిపోవడం, జనరేటర్లు ఉన్నా డీజిల్ దొరక్క పోవడంతో అనేకమంది ఉదయం ఇళ్లలో గడిపి రాత్రి పూట జనరేటర్ల మీద ఏసీలు, ఫ్యాన్లు పనిచేసే లాడ్జిల్లో దిగారు. ఐదురోజులుగా లాడ్జిలోనే..: కోల్కతా విద్యుత్ శాఖ ఇంజనీరుగా పనిచేస్తు న్న జె.ఎన్. ఘోష్ ఐదు రోజుల కిందట విశాఖపట్నం అందాలు చూడటానికి భార్య, కుమార్తెతో కలిసి వచ్చారు. రైళ్లు, బస్సులు, హైవే మీద వాహనాల రాకపోకలన్నీ నిలిపి వేయడంతో ఘోష్ విశాఖలోనే ఆగిపోవాల్సి వచ్చింది. లాడ్జిలో బస చేస్తున్న ఆయన వద్ద డబ్బులు అయిపోవడంతో అవస్థలు పడుతున్నారు. -
రైతులకు కోలుకోలేని దెబ్బ
ఉత్తరాంధ్ర వ్యవసాయ రంగానికి రూ.2 వేల కోట్ల నష్టం హైదరాబాద్/అనకాపల్లి: హుదూద్ తుపాను ఉత్తరాంధ్ర వ్యవసాయాన్ని కష్టాల కడలిలోకి తోసేసింది. తుపాను దెబ్బతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో నీట మునిగిన పంటలు.. ప్రత్యేకించి వరి పంట ఆ నీరు బయటక పోయే మార్గం లేక కుళ్లిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 70 వేల హెక్టార్లలో పంట నీట మునిగి ఉన్నట్టు వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. విజయనగరం జిల్లాలో సుమారు 62 వేల హెక్టార్లలో, విశాఖలో సుమారు 20 వేల హెక్టార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 15 వేల హెక్టార్ల విత్తనాభివృద్ధి క్షేత్రాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మొత్తంగా తుపాను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో రూ.2 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఉత్తరాంధ్రలో ఆరు లక్షల 60 వేల హెక్టార్ల సాధారణ విస్తార్ణం కాగా, ఈఏడాది ఖరీఫ్లో 5 లక్షల 82 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయి. దాదాపు అన్ని పంటలు హుదూద్ కారణంగా దెబ్బతిన్నాయని ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన కేంద్రం సహసంచాలకులు కె.వీరభద్రరావు తెలిపారు. వరి, చెరకు, మొక్కజొన్న, అపరాలు, కొబ్బరి, అరటి, బొప్పాయి, నూనె గింజలు, ఉద్యాన పంటలు హుదూద్ విధ్వంసానికి నేలకొరిగాయి. ప్రాథమిక అంచనాగా 85 శాతం పంట నష్టపోయినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
పచ్చటి విశాఖ మటుమాయం
నగరంలో 10 వేల చెట్లు నేలమట్టం వందేళ్ల నాటి భారీ వృక్షాలూ నేలకొరిగాయి ఉష్ణోగ్రత, కాలుష్యం పెరుగుతాయని ప్రజల ఆందోళన మళ్లీ పచ్చటి విశాఖ కనిపించాలంటే పదేళ్లు పట్టే అవకాశం పచ్చటి కొండలు, భారీ వృక్షాలతో ఎటు నుంచి చూసినా హరిత వనంలా కనిపించే విశాఖను హుదూద్ తుపాను మటుమాయం చేసింది.పర్యావరణానికి మారుపేరుగా నిలిచిన విశాఖ నగరంలో ఇప్పుడు పర్యావరణ పరిరక్షణే పెద్ద సవాలుగా మార్చింది. సముద్రం ఒడ్డున స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందబోతున్న ఉక్కు నగరాన్ని ఒక్క రోజులోనే అందవిహీనంగా మార్చింది. హూదూద్ ధాటికి నగరంలో 10 వేలకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. వందేళ్లకు పైగా పర్యావరణానికి అండగా నిలుస్తున్న భారీ వృక్షాలు సైతం పెనుగాలులకు నేలకొరిగాయి. దీంతో విశాఖకు తీరనం నష్టం కలిగింది. కశింకోట నుంచి విశాఖ శివారు వరకు ఎక్కడ చూసిన నేలకొరిగిన చెట్లే కనిపిస్తున్నాయి. మళ్లీ విశాఖ ఇలాంటి చెట్లతో అలరారాలంటే అనేక ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత పెద్ద చెట్లు పెరగడానికి పదేళ్లకు పైగానే పడుతుందని నగరంలోని సీనియర్ సిటిజన్ నరసింహాచార్యులు ఆవేదన వ్యక్తంచేశారు. నగర ప్రజలు మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టి, అన్ని చెట్లూ పెరగాలన్న గట్టి ప్రయత్నంతో పనిచేస్తేనే గానీ మళ్లీ పచ్చదనం పరుచుకునే అవకాశం లేదని ఆయన చెప్పారు. అందమైన గ్రేటర్ విశాఖలో చెట్లే ప్రధానమైనవి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎండ కూడా నేలను తాకలేనంత స్థాయిలో గుబురైన భారీ చెట్లు ఉండేవి. నగరం చుట్టుపక్కల కూడా భారీ సంఖ్యలో చెట్లు నగరానికి అందాన్నిచ్చేవి. వేసవి కాలంలో ఎంత ఎండ తీవ్రత ఉన్నా, ప్రజలకు ఈ చెట్లు ఉపశమనాన్ని కలిగించేవి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని సైతం ఇవే అదుపు చేసేవి. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆంధ్రా యూనివర్శిటీ, కేజీహెచ్, జూపార్కు, శివాజి పార్కు, కైలాసగిరి, పాత జైలు, ఉడా కార్యాలయం ప్రాంతాల్లో ఉన్న వందేళ్ల నాటి భారీ వృక్షాలు తుపాను ధాటికి కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. విశాఖ కొండల్లోని చెట్లన్నీ కూలిపోయి అవన్నీ ఇప్పుడు బోడిగా కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రతి వీధిలో కూలిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, రోడ్లు, వాహనాల మీద పడి వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. ఇంత భారీ సంఖ్యలో చెట్లు నేలకూలడంతో రాబోయే రోజుల్లో విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఉక్కపోతలు కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలు, పోర్టుల నుంచి వెలువడుతున్న కాలుష్యం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచి నగరంలో ఎండ పెరగడం, విద్యుత్ లేక పోవడంతో నగరవాసులు విపరీతమైన ఉక్కపోతతో తల్లడిల్లారు. -
ఎవ్వలూ పట్టించుకోనేదు
జగన్తో విన్నవించుకున్న తుపాను బాధితులు మేం చచ్చామో, బతికామో కూడా పట్టించుకోలేదని ఆవేదన రాత్రి వేళల్లోనూ మారుమూల పల్లెల్లో సాగిన పర్యటన కాకినాడ/ విశాఖపట్నం: పాకలన్నీ పడిపోనాయి... పడవలన్నీ పోనాయి... గంజినీళ్లు కూడా నేవు... పిల్లపాపలతో ఆకలితో చస్తున్నా మేమేటైపోనామని పట్టించుకోనాకి ఏలూ రానేదు... నువ్వొక్కడివే వచ్చావు బా బూ.. మీరు తప్ప మాకు న్యాయం చేసే వారేలేరు.. మేమెలా బతకాల నాయనా.. అంటూ హుదూద్ తుపాను బాధితులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు చూసి చలించిన జగన్ సర్కారు నిర్లక్ష్య ధోరణిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘‘ఈ ప్రభుత్వానికి, పాలకులకు వీసమెత్తు మానవత్వమైనా ఉందా? మూడురోజులుగా ప్రజలు పస్తులుంటే పట్టించుకోరా! వీళ్లసలు మనుషులేనా? తినడానికి గుప్పెడు మెతుకులు, తాగడానికి గుక్కెడు నీళ్లులేక ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం పలకరించడానికి కూడా రారా?’’ అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ని ర్వాసితులకు ప్రతి ఇంటికి రూ.5000 వెంటనే ఇవ్వాలి. దీంతో వారంతా తిండి, బట్ట కొనుక్కుంటారు. ప్రతి బోటుకు రూ.1.50 లక్షలు ఇవ్వాలి. ఎన్నో వలలు కొట్టుకుపోయాయి. ప్రతి వలకు రూ.40 వేలు చెల్లించాలి. ఇళ్లు దెబ్బతిన్నవారికి అవసరాన్నిబట్టి కనీసం రూ.50 వేలు అందజేయాలి. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కొత్త ఇల్లు కట్టివ్వాలి’’ అని డిమాండ్ చేశారు. హుదూద్ తుపానుతో కకావికలమైన తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జగన్ జగ్గంపేటలో పార్టీ తూర్పు గోదావరి జిల్లా శాఖ సమకూర్చిన వాటర్ ట్యాంకర్లను జెండా ఊపి తుపాను బాధిత ప్రాంతాలకు పంపించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత, యలమంచిలి ని యోజకవర్గం నారాయణపురంలోని దివిలి జం క్షన్, అచ్యుతాపురం జంక్షన్ మీదుగా తుపాను తీరం దాటిన పూడిమడక గ్రామానికి చేరుకున్నారు. అక్కడినుంచి ఉద్దపాలెం, తాళ్లదిబ్బ, పాపయ్యపాలెం, దుప్పితూరు, అచ్యుతాపురం, స్టీల్ప్లాంట్, గాజువాక మీదుగా రాత్రి 9 గంట లకు విశాఖ చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు. మీకు అండగా నేనుంటా... జగన్ పర్యటన ఆద్యంతం ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తుపాను తమకు తీరని నష్టం చేయగా అధికారులు అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. తుపాను తీరం దాటిన పూడిమడకలో జగన్ను చూడగానే మత్స్యకారులంతా బోరున విలపించారు. మూ డురోజులుగా తమను పట్టించుకున్న నాథుడే లేడని వాపోయారు. మీరు వస్తున్నారని తెలిసి ఈరోజు 8 కేజీల బియ్యం మాత్రమే కొందరికి పంపిణీ చేశారని వివరించారు. ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా తానున్నానంటూ జగన్ వారిని గుండెలకు హత్తుకుని ఓదార్చారు. పూడిమడకతోపాటు కొండపాలెం, కడపాలెం గ్రామాల్లో కాలినడకన తిరిగి తుఫానుకు దెబ్బతిన్న బోట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘పూడికమడక నుంచి చంద్రబాబును మనమంతా కలసి అడుగుదాం. అయ్యా చంద్రబాబునాయుడుగారూ! తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్టలు లేక తాగేందుకు నీరు లేక ఈ ప్రాంత ప్రజలు ఎలా బతుకుతా రు? ఈ ప్రాంతానికి జరిగిన తుపాను నష్టానికి ప్రభుత్వం మానవత్వంతో ముందుకు రావాలి. ఆదివారం రోజున తుపాను ఈ తీరాన్ని తాకిం ది. ఇవాళ మూడో రోజు. ఈ గ్రామానికి అధికారులు ఎవరైనా వచ్చారా? (రాలేదు రాలేదు అని స్థానికులు పెద్దపెట్టున నినాదాలుచేశారు) సీఎం చంద్రబాబు వస్తున్నారని చెప్పి బస్సులు పెట్టి మరీ జనాన్ని, అక్కా చెల్లెళ్లను అచ్యుతాపురం తీసుకుపోయారు. అచ్యుతాపురంలో ఏమైనా ఇచ్చారా? (ఇవ్వలేదు ఇవ్వలేదు అని స్థానికులు నినదించారు). అవే బస్సుల్లో ఊరికి వెనక్కి తీసుకువచ్చైనా దింపలేదు. మహిళలంతా నడుచుకుని గ్రామానికి తిరిగివచ్చారు. ఈ గ్రామానికి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసి, మూడు గంటల ముందు ఎనిమిది కేజీల బియ్యం ఇచ్చారని ఇక్కడివారు చెబుతున్నారు. జగన్ రాకుండా ఉండి ఉంటే ఆ బియ్యమైనా ఇచ్చి ఉండేవారా? బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? చింతపండు లేదు. పప్పు లేదు. చక్కెర లేదు. పాలు కూడా లేవు. కనీసం ఇప్పటికైనా కనికరం చూపండి’’ అని సర్కారును కోరారు. మీలో ఒక చెల్లెమ్మ ముందుకు వచ్చి చంద్రబాబును ఇక్కడి నుంచే డిమాండ్ చేయాలని కోరుతున్నా.. అని జగన్ పిలుపునివ్వగా సింహాచల మ్మ అనే మహిళ ముందుకు వచ్చి, తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టింది. ఈ పర్యటనలో పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు, శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ మంత్రులు సుభాష్చంద్రబోస్, పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు అమర్నాథ్, గురువులు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని చూసిన నాయకుడు జగన్ ఒక్కడే నేను పక్కా తెలుగుదేశం. నీరు, వర్షం, గాలి ఒకేసారి చుట్టుముట్టి మా బతుకులను అధోగతిపాలు చేసినా అయ్యో పాపం అని ఎవ్వరూ పట్టించుకోలేదు. మేం ఓటు వేసి గెలిపించిన చంద్రబాబు మా ఊరుకు రానేలేదు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. మమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేదు. అచ్యుతాపురం తీసుకెళ్లి వదిలేశారు. అక్కడనుంచి నడిచొచ్చాం. టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నా. మా గ్రామంలో తుపానుతో నష్టపోయిన అన్నీ చూసిన నాయకుడు జగన్. - సింహాచలమ్మ, పూడిమడక, విశాఖ జిల్లా -
ఆపన్నులకు అండగా...
ఏలూరు : హుదూద్ తుపాను బీభత్సంతో అన్నపానీయూలు దొరక్క అలమటిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకునేందుకు ‘పశ్చిమ’ ప్రజలు మేము సైతం అంటూ ముం దుకు వస్తున్నారు. మంగళవారం రాత్రి వరకూ 1.61 లక్షల ఆహార పొట్లాలు, 7.37 లక్షల మంచినీటి ప్యాకెట్లను అధికారుల ద్వారా తుపాను బాధిత ప్రాంతాలకు పంపిం చారు. బుధవారం మరో 1.16 లక్షల ఆహార పొట్లాలు పంపుతున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయానికి 41,400, గన్నవరం విమానాశ్రయానికి 2,400, రోడ్డు మార్గం ద్వారా 1,17,470 ఆహార పొట్లాలను పంపించినట్టు వివరించారు. వీటిలో తాడేపల్లిగూడెం నుంచి 12,500, తణుకు నుంచి 4,800, నిడదవోలు నుంచి 5,000, దేవరపల్లి నుంచి 4,000, తాళ్లపూడి నుంచి 5100 ఆహార పొట్లాలు అందాయని తెలిపారు. వీటిని ఆయూ మండలాల తహసిల్దార్ల ఆధ్వర్యంలో సమీకరించినట్టు తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో 12,400, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సహకారంతో 25 వేలు, జిల్లా పంచాయతీ అధికారి ద్వారా 2,400 ఆహార పొట్లాలను రోడ్డు మార్గంలో పంపించామన్నారు. వీటితోపాటు 10 టన్నుల కూరగాయలను కూడా పంపినట్టు పేర్కొన్నారు. నల్లజర్ల, ఏలూరు, తణుకు, పాలకొల్లు ప్రాంతాల నుంచి 7.37 లక్షల వాటర్ ప్యాకెట్లను, నిడదవోలు, ఏలూరు, భీమవరం నుండి 6 మంచినీటి ట్యాంకర్లను, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు నుంచి 33 వేల బిస్కెట్ ప్యాకెట్లను పంపించామన్నారు. ఏలూరు, ఆకివీడు, తణుకు నుంచి 16 జనరేటర్లను పంపుతున్నట్టు తెలిపారు. 5 వేల లీటర్ల పాలు తరలింపు ఏలూరు నుంచి 5 వేల లీటర్ల పాలను, 25 వేల బిస్కెట్ ప్యాకెట్లు, లక్ష మంచినీటి ప్యాకెట్లతోపాటు పులిహోర, పలావ్ ప్యాకెట్లను విశాఖపట్నానికి పంపినట్టు ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) చెప్పారు. విరాళాలు ఇవ్వాలనుకుంటే... తుపాను బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ 33913634404 (ఐఎఫ్ఎస్ కోడ్ నంబర్ : ఎస్బీఐఎన్ 0002724)కు సొమ్మును జమ చేయవచ్చని కలెక్టర్ కె.భాస్కర్ పేర్కొన్నారు. చెక్కులు, డీడీల రూపంలో విరాళం ఇవ్వాలనుకునేవారు డెప్యూటీ సెక్రటరీ, రెవెన్యూ శాఖ, 4వ ప్లోర్, ఎల్-బ్లాక్, సెక్రటేరియట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలని సూచించారు. ఇదిలావుండగా, తుపాను బాధితుల సహాయూర్థం 17వ డివిజన్ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్నార్ అధినేత నాగేశ్వరరావు రూ.3 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే బడేటి బుజ్జికి అందించారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ రూ.2 లక్షలు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి రూ.2 లక్షల విరాళం అందించేందుకు ముందుకు వచ్చారు. -
చితికిన బతుకులకు..కొండంత అండగా..
సాక్షి, రాజమండ్రి :హుదూద్ తీవ్ర తుపాను సృష్టించిన విలయంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ జిల్లా పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో జగ్గంపేటవద్ద విశాఖ తుపాను బాధితులకు అందించేందుకు సిద్ధం చేసిన ఐదు మంచినీటి ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ తరఫున వీటిని సమకూర్చారు. జగ్గంపేట నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరిన జగన్మోహన్రెడ్డి 2 గంటల సమయానికి తుని సమీపంలోని రాజుల కొత్తూరు గ్రామానికి చేరుకున్నారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో తుపాను సృష్టించిన బీభత్సం గురించి అక్కడ పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని విశాఖ జిల్లా నక్కపల్లి చేరుకున్నారు. తుపానుతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ జిల్లా పూడిమడక చేరుకున్నారు. హుదూద్ తుపాను తీరం దాటిన ఈ ప్రాంతంలో దెబ్బతిన్న మత్స్యకార గృహాలు పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉండి పోరాడతానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అక్కడ నుంచి విశాఖ జిల్లా గాజువాక చేరుకున్నారు. వెన్నంటి నిలిచిన నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు హైదరాబాద్ నుంచి పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చారు. అప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. వారితోపాటు జ్యోతుల నెహ్రూ; ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు; ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి; సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి; మాజీ మంత్రి పినిపే విశ్వరూప్; మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు; మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు; పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, జీవీ రమణ; పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి; జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్; రాజమండ్రి నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి; సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని; జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు; వివిధ సెల్ల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయ భాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, రెడ్డి రాధాకృష్ణ, రావూరి వెంకటేశ్వర్లు; కో ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, తోట సుబ్బారావునాయుడు; పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర కమిటీ సభ్యులు వాసిరెడ్డి జమీల్, తాడి విజయభాస్కరరెడ్డి, మాసా రాంజోగ్; కాకినాడ సిటీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్; ఇతర నాయకులు మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాల్, కొవ్వూరి త్రినాథరెడ్డి, బషీరుద్దీన్, ఆదిరెడ్డి వాసు, నక్కా చిట్టిబాబు, గుర్రం గౌతమ్ తదితరులు జగన్ వెంట ఉన్నారు. -
నరకం చూపించారు
సాక్షి, రాజమండ్రి :హుదూద్ తుపాను తీరాన్ని దాటి బలహీనపడినా.. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. మంగళవారం విశాఖపట్నం-రాజమండ్రి మధ్య ఆర్టీసీ ప్రయాణికులు నానా ఇబ్బందులూ పడ్డారు. తుపాను నేపథ్యంలో శనివారం నుంచి విశాఖ - రాజమండ్రి మధ్య రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. ఆదివారం నుంచి ఆర్టీసీ కూడా విశాఖపట్నం వెళ్లే సర్వీసులను నిలుపు చేసింది. దీంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. తుపాను అనంతరం 16వ నంబరు జాతీయ రహదారిపై అడ్డంకులను పాక్షికంగా తొలగించడంతో సోమవారం ఉదయం నుంచి విశాఖ - రాజమండ్రి మధ్య ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి మంగళవారం కూడా రైళ్లు తిరగకపోవడంతో ప్రయాణికులు పూర్తిగా ఆర్టీసీపైనే ఆధారపడ్డారు. ఈ పరిస్థితుల్లో వారిని సౌకర్యవంతంగా గమ్యానికి చేర్చడంపై దృష్టి పెట్టాల్సిన ఆర్టీసీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించ డం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. విశాఖపట్నం, రాజమండ్రి, అనకాపల్లి, కాకినాడ తదితర డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. విశాఖలోని సిటీ సర్వీసులను, పల్లెవెలుగు బస్సులను రాజమండ్రి, విజయవాడలకు స్పెషల్ సర్వీసులుగా తిప్పారు. వీటిల్లో సీట్లు సరిగ్గా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడపడితే అక్కడే ఆపేసి.. ఆర్టీసీ నిబంధనల ప్రకారం బస్సు స్టేషన్లలో తప్ప వేరే అనధికార ప్రదేశాల్లో బస్సులను ఆపి భోజనాలు, టిఫిన్లు చేయడం నిషిద్ధం. ఈ చర్యలు ప్రయాణీకుల భద్రతపై కూడా ప్రభావం చూపుతాయి. కానీ, ఈ నిబంధనను ఆర్టీసీ సిబ్బంది బేఖాతరు చేశారు. తుని నుంచి కత్తిపూడి మధ్య జాతీయ రహదారిపై ఉన్న ధాబాలవద్ద భోజన విరామం పేరుతో ఇష్టానుసారం ఆపేశారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో.. అన్నవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దాటిన తరువాత రాజమండ్రి మార్గంలోని ఒక ధాబా వద్ద సుమారు 40 బస్సులను ఆపారు. ఒకేసారి అధిక సంఖ్యలో బస్సులు రావడంతో ఆ ప్రాంతం ఆర్టీసీ బస్సు డిపోను తలపించింది. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు అసహనానికి గురై పలు డ్రైవర్లు, కండక్టర్లతో వాగ్వాదానికి దిగారు. అయితే, తుని తర్వాత రాజమండ్రి వరకూ బస్ కాంప్లెక్స్లలో హోటళ్లు లేవని, అందుకే బస్సులను అనధికారిక ప్రాంతాల్లో నిలుపు చేస్తున్నారని ఆర్టీసీ రాజమండ్రి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వరప్రసాద్ చెప్పారు. మొత్తమ్మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేయడంతో.. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య విశాఖలో బయలుదేరిన సర్వీసులు సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో రాజమండ్రి చేరాయి. మామూలుగా నాలుగున్నర గంటలు పట్టే ప్రయాణానికి సగటున ఆరు గంటలు పట్టిందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
స్టార్ నైట్తో విరాళాలు సేకరిస్తాం
ప్రకాశ్నగర్ (రాజమండ్రి) : హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు స్టార్ నైట్ కార్యక్రమం నిర్వహించి విరాళాలను సేకరించనున్నట్టు రాజమండ్రి ఎంపీ, మా అధ్యక్షుడు మాగంటి మురళీమోహన్ వెల్లడించారు. విశాఖలో తుపాను బాధితులకోసం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎంపీ మురళీమోహన్ దాతల సహకారంతో టన్ను పాలపొడి, మంచి నీటి ట్యాంకర్లు, బిస్కెట్లు మంగళవారం పంపించారు. ఆ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ తమ ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షల కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎంపీలందరూ ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా ఇస్తారన్నారు. స్పందించిన వారికి కృతజ్ఞతలు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రూ. లక్ష, రాజమండ్రి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ రూ.60 వేలు, మరో ఇద్దరు రూ. 80 వేలు విరాళంగా అందజేశారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఈ మొత్తంతో టన్ను పాల పొడి కొనుగోలు చేశామని చెప్పారు. బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా పంపామని, నగర బీజేపీ కార్యకర్తలు లారీతో వాటర్ ప్యాకెట్లు పంపినట్టు తెలి పారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గన్ని కృష్ణ, నల్లమిల్లి జగన్మోహన్రెడ్డి, నాళం నరసింహారావు, నేమాని పట్టాభి రామయ్య, జె. నాగేశ్వరరావు, జె. నూకరాజు, ఎ. రామకృష్ణ, బి. దత్తు, నాళం పద్మశ్రీ పాల్గొన్నారు. అమలాపురం ఎంపీ వితరణ అమలాపురం : విశాఖ బాధితుల సహా యార్ధం అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తన రెండు నెలల జీతం రూ.3 లక్షలను విరాళంగా ప్రకటిం చారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.25లక్షలుఅందిస్త్తున్నట్టు తెలిపారు. -
బాధితులకు అండగా ఉంటాం:వైఎస్ జగన్
విశాఖ: హుదూద్ తుపాను విలయం సృష్టించిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాజమండ్రి బయల్దేరి వెళ్లిన ఆయన అక్కడ నుంచి విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నక్కపల్లి మండలంలోని కాగిత గ్రామంలో ధ్వంసమైన జీడి, మామిడి తోటలను పరిశీలించిన అనంతరం బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాన్ ప్రభావంతో నష్టపోయిన వారికి తమ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని జగన్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందే వరకూ వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. తుపాను వల్ల ప్రజా జీవనం పూర్తిగా అతలాకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, పాక్షికంగా నష్టపోయిన తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన సాగుతుంది.బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్ సహాయక చర్యలు పూర్తయ్యేవరకు ఆ నాలుగు జిల్లాల్లోనే ఉండి ప్రజలకు బాసటగా నిలుస్తారు. -
బాధితులకు అండంగా ఉంటాం:వైఎస్ జగన్
-
రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్
-
రాజమండ్రి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: హుదూద్ తుపాను విలయం సృష్టించిన ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పర్యటన నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం రాజమండ్రి బయల్దేరారు. అక్కడ నుంచి ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళతారు. తుపాను వల్ల ప్రజా జీవనం పూర్తిగా అతలాకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, పాక్షికంగా నష్టపోయిన తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన సాగుతుంది. రోడ్డు మార్గంలో కారులో వెళ్లే అవకాశం లేకుంటే మోటారు సైకిల్ లేదా సైకిల్పై వైఎస్ జగన్ బాధిత ప్రాంతాలకు వెళతారు. తుపాను వల్ల దెబ్బ తిన్న ప్రాంతాలను సందర్శించి స్వయంగా అక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారిని పరామర్శించనున్నారు. ఓ వైపు ప్రజలను పరామర్శిస్తూ మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నారు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్ సహాయక చర్యలు పూర్తయ్యేవరకు ఆ నాలుగు జిల్లాల్లోనే ఉండి ప్రజలకు బాసటగా నిలుస్తారు. కాగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని మోడీ కూడా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు వైఎస్ జగన్ అనుమతి కోరనున్నారు. -
కన్నీరు తుడిచి..వెన్ను తట్టేందుకు
నేడు జిల్లా మీదుగా విశాఖ వెళ్లనున్న జగన్ ఆ జిల్లాలో తుపాను బాధితులకు పరామర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ :హుదూద్ తుపాను సృష్టించిన విలయంతో అతలాకుతలమైన విశాఖపట్నం జిల్లాలో బాధితులను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ సోమవారం తెలిపారు. జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 9 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట చేరుకుంటారు. విశాఖ జిల్లాలో బాధితుల కోసం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమకూర్చిన వాటర్ ట్యాంకర్లను తరలించే వాహనాలను జగ్గంపేట వద్ద జాతీయ రహదారిపై ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రాజుల కొత్తూరుకు సమీపంలో కొద్దిసేపు ఆగి, స్థానికులతో మాట్లాడి, విశాఖ జిల్లాలో తుపాను బాధితుల పరామర్శకు వెళతారు. -
ధ్వంసమైన తీరం
విశాఖపట్నం: హుదూద్ తుపాను విశాఖ తీరప్రాంతాన్ని కుదిపేసింది. మత్స్యకారుల జీవనాన్ని అతాలకుతలం చేసింది. బలమైన గాలులకు ఇళ్లు కూలిపోయాయి. బోట్లు ధ్వంసమయ్యూరుు. ఆదివారం ఉదయం నుంచి తినడానికి తిండిలేక, ఉండడానికి నీడలేక మత్స్యకారులు నిరాశ్రయులయ్యారు. దాదాపు 8 వేల కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. విశాఖ తీరానికి ఆనుకునే పెదజాలారిపేట ఉంది. ఇక్కడ సముద్రానికి 30 అడుగుల దూరంలో మత్స్యకారులు పాకలు వేసుకుని జీవిస్తున్నారు. ఎంత బీభత్సం జరిగినా తీరం వదిలి వెళ్లరు. చావైనా, బ్రతుకైనా గంగమ్మ తల్లి వద్దేనంటారు. ఇప్పటివరకు వచ్చిన తుపాన్లకు ఎదురొడ్డి నిలబడిన వీరు.. హుదూద్ ధాటికి నిలవలేకపోయూరు. మనుషులకు ప్రాణపాయం తప్పిందనేగాని.. వారి జీవనం మాత్రం అస్తవ్యస్తమైపోయింది. బలమైన గాలులకు గుడిసెలు, వాటిలోని వస్తువులు ఎగిరిపోయాయి. ఒడ్డున లంగర్లు వేసిన బోట్లు ధ్వంసమయ్యూరుు. బోట్ల ఇంజన్లు దెబ్బతిన్నారుు. వలలు గాలిలో కొట్టుకుపోయూరుు. తినడానికి తిండి లేని పరిస్థితి దాపురించింది. గుక్కెడు నీరు కూడా కరువైంది. సర్వం కోల్పోరుు నిరాశ్రయులయ్యూరు. బోటు రూ.2 లక్షలు, ఇంజన్ రూ.లక్ష, వలకు రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు ఖర్చవుతుందని మత్స్యకారులు చెప్పారు. జాలారిపేటలో దాదాపు 400 బోట్లు ఉన్నారుు. అన్నీ దె బ్బ తినడంతో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లింది. బోట్ల నష్టం పక్కన పెడితే మత్స్యకారులకు తినడానికి తిండి లేకుండా పోరుుంది. -
కుప్పకూలిన సమాచార వ్యవస్థ
విశాఖపట్నం:హుదూద్ తుపాను సృష్టించిన ప్రళయం విశాఖలోని వాతావరణ కేంద్రానికీ ఆటంకం కలిగించింది. సిబ్బంది విధులు నిర్వహించలేని పరిస్థితిని కల్పించింది. ఆదివారం హుదూద్ తుపాను తీరం దాటిన కొద్దిసేపటికే ఇక్కడి సమాచార వ్యవస్థ కుప్పకూలింది. కైలాసగిరిపై ఉన్న రాడార్ వ్యవస్థకూ ఆ సెగ తాకింది. తుపాను అనంతరం వచ్చిన వర్షం, గాలుల కారణంగా అప్పటికే రాడార్ కార్యాలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది బయటకు రాలేకపోయారు. కార్యాలయం వద్ద భారీగా నీరు చేరింది. చెట్లు కూలిపోయాయి. అద్దాలు పగిలిపోయాయి. ఫలితం గా రాడార్ సాయంతో గ్రాఫ్, మ్యాప్ల ద్వారా వాతావరణ సమాచారాన్ని సేకరించాల్సిన అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సమీపంలో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ కేబుల్ వ్యవస్థ నిలిచిపోవడంతో తుపాను అనంతరం వాతావరణంలో కలిగే మార్పుల్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇన్వర్టెర్ ద్వారా మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా కీలక సమాచారాన్ని తెలియజేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారులకు వాతావరణశాఖ అధికారులు విజ్ఞప్తి చేసినా సమీపంలో ఉన్న కేబులింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని, మరో 24 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ట్రాన్స్మిషన్ పనిచేస్తున్నా ఫలితాలు రావడం లేదని కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. నేడూ వర్షాలు!: హుదూద్ తుపాను ప్రభావం మంగళవారం కూడా కొనాసాగే అవకాశం ఉందని, ఫలితంగా తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంటుందన్నారు. -
విశోక సంద్రం!
21 మంది ప్రాణాలు బలి తీసుకున్న హుదూద్ అంచనాలకు అందని భారీ నష్టం మారిపోయిన మహానగరం రూపురేఖలు ఎటు చూసినా కూలిన వృక్షాలు, తెగిన విద్యుత్ వైర్లు, దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు ఆహారం దొరక్క జనం అవస్థలు బాధితులకు ఆమడదూరంలో ప్రభుత్వ యంత్రాంగం అంధకారంతో జనం దుర్భర జీవనం ఉక్కునగరంలో నిలిచిన ఉత్పత్తి విశాఖపట్నం: అంచనాలకు అందని హుదూద్ తుపాను బీభత్సం విశాఖ నగరంలో జనజీవనాన్ని కకావికలం చేసింది. ప్రళయ తాండవం చేసిన తుపాను విశాఖ జిల్లావ్యాప్తంగా 15 మంది, మిగతా జిల్లాలో ఆరుగురి ప్రాణాలు బలితీసుకుంది. ఆకలి కేకలు, క్షతగాత్రుల ఆక్రందనలతో సముద్రం ప్రతిధ్వనిస్తోంది. ఒక్కరోజులో హుదూద్ మిగిల్చిన భారీ నష్టం విశాఖ జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రోడ్డుమార్గంలో విశాఖ రావాలనుకున్నప్పటికీ జాతీయ రహదారిపై ప్రయాణం అనుకూలంగా లేదని అధికారులు వారించడంతో హెలికాప్టర్ ద్వారా నగరానికి చేరుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాగునీరూ కరువే హుదూద్తో భారీ ముప్పు తప్పదని ముందునుంచీ హెచ్చరికలు వస్తున్నా, ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. తుపాను నగరాన్ని ఢీకొట్టిన క్షణం నుంచి సోమవారం రాత్రి వరకూ నగరంలో ఒక్క ఆహార పొట్లాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ప్రజలను ఆదుకుంటామని, విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కేవలం నీటిమూటలుగానే మిగిలిపోయాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు మచ్చుకైనా దొరకడంలేదు. ఇళ్లల్లో నిల్వ ఉంచిన సరుకులు నిండుకోవడంతోపాటు ఫ్రిజ్లు పనిచేయకపోవడంతో పాడైపోతున్నాయి. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. పక్క జిల్లాల నుంచి ఆహారం, తాగునీరు హెలికాప్టర్లలో తెప్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ వాటి జాడ కనిపించలేదు. ఇదే అదునుగా కొందరు స్వార్థపరులు ఆహారాన్ని అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. మద్యం షాఫులు మినహా భారీ షాపింగ్మాల్స్తో సహా మరే ఇతర దుకాణాలు తెరుచుకోలేదు. పాలు, అల్పాహారం, భోజనం ఏది కావాలన్నా వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి సరుకును దాని అసలు రేటు కంటే ఐదు నుంచి పది రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారు. రోడ్డు, విద్యుత్ పునరుద్ధరణకు కృషి ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ఉభయగోదావరి జిల్లాల నుంచి వందలాదిమంది సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తరలించింది. జాతీయ రహదారుల వెంబడి కూలిపోయిన వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరించడానికే వారికి గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో నగరంలో కూలిన చెట్లను ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. సోమవారం రాత్రికి కూడా నగరంలో విద్యుత్ పునరుద్ధరణ సాధ్యంకాలేదు. మధ్యాహ్నం నుంచి బీఎస్ఎన్ఎల్తోపాటు మరికొన్ని సెల్ఫోన్ నెట్వర్క్ల సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఫోన్లు చార్జింగ్ లేకపోవడంతో పనిచేయలేదు. రవాణా వ్యవస్థను మధ్యాహ్నం సమయానికి కొద్దిగా పునరుద్ధరించారు. నగరం వీధుల్లో మాత్రం వాహనాలు తిరిగే అవకాశం లేకపోవడంతో ప్రజలు కాలినడకన వెళుతున్నారు. పెట్రోల్ బంకులు పనిచేయడం లేదు. ఎక్కడో ఓ చోట ఒకటి రెండు బంకులు తెరుచుకుంటే జనం తీర్థంలా క్యూ కడుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తినడానికి తిండి కరువైంది. తుపాను ధాటికి ఫిషింగ్ బోట్లు దెబ్బతిన్నాయి. జీవనాధారం కోల్పోయి వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి చోటా తుపాను మిగిల్చిన శిధిల సాక్ష్యాలు దర్శనమిస్తున్నాయి. సాగర తీరం కళావిహీనం విశాఖ సాగరతీర అందాలు తుపాను ధాటికి కళావిహీనమయ్యాయి. అలల తాకిడికి ఆర్కే బీచ్ అందాలు తుడుచుకుపోయాయి. సబ్మెరైన్ మ్యూజియం గోడ కూలిపోగా సబ్మెరైన్ సైతం కొంతమేర ధ్వంసమైంది. నేవీ అమరవీరుల స్థూపం(విక్టరీఎట్ సీ) పార్క్లో ఏర్పాటుచేసిన నమూనా యుద్ధవిమానం నేలకూలింది. తీరంలో ఇసుక రోడ్డుమీదకు వచ్చి రోడ్డంతా ఇసుకతో నల్లగా మారింది. సాగర్నగర్ , రుషికొండ, తెన్నేటి పార్క్, జోడుగుళ్లు పాలెం వద్ద సాగరతీరం కోతకు గురైంది. సముద్రం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది. వర్షం దాటికి తీరం వెంబడి రుషికొండ బీచ్ వద్ద రోడ్డు కోతకు గురై అందవిహీనంగా తయారైంది. వణికిపోయిన ఉక్కునగరం అంతర్జాతీయ ఖ్యాతిని విశాఖపట్నానికి తీసుకువచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం తుపాను ధాటికి పండుటాకులా వణికిపోయింది. ప్రచండ గాలుల ధాటికి స్టీల్ప్లాంట్లోని దాదాపు 12 విభాగాలు షట్డౌన్ అయ్యాయి. 1971లో ప్రారంభించిన ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జపాన్, జర్మనీ, యునెటైడ్ స్టేట్స్, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. స్టీల్ ప్లాంట్ అవసరాలకు నెలకొల్పిన 236 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సింహాద్రి (ఎన్టీపీసీ) ధర్మల్ పవర్ కేంద్రం పూర్తిగా పనిచేయడం మానేసింది. విశాఖ పోర్టులో దాదాపు ఐదువేల మెట్రిక్ టన్నుల యూరియా నీటమునిగింది. దీంతో భారీగా యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. -
జాగ్రత్తలతోనే రాజధాని భద్రం
పెను తుపాను వస్తే మన పరిస్థితి ఏమిటి! విశాఖలో బీభత్సంతో జిల్లావాసుల ఆందోళన ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టం తప్పదంటున్న నిపుణులు గుణపాఠాలు నేర్వని పాలకులు విపత్తులను తట్టుకునేలా రాజధాని నిర్మించాలని హితవు సాక్షి, విజయవాడ: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ మహా నగరాన్ని హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. ప్రశాంతతకు మారుపేరైన సాగర నగరంలో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తుతానికి మన జిల్లాకు ముప్పు తప్పినా భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి బీభత్సకాండ ఎదురైతే పరిస్థితి ఏమిటీ.. నవ్యాంధ్ర రాజధాని బెజవాడ ఎలా తట్టుకుంటుంది.. అనే అంశంపై సర్వాత్రా చర్చ సాగుతోంది. గతంలో అనేక విపత్తులు సంభవించినా పాలకులు, ప్రజలు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో హుదూద్ వంటి పెను తుపాను కృష్ణా జిల్లా తీరంలో కేంద్రీకృతమైతే 1977లో వచ్చిన దివీసీమ ఉప్పెన కన్నా తీవ్రమైన ఘోరకలి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం నూతన రాజధాని నగరాన్ని అయినా విపత్తులను తట్టుకునేలా సమగ్ర ప్రణాళికతో నిర్మించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. విజయవాడలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెను ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు. ఇన్ని జరిగినా గుణపాఠాలు నేర్వరా...! విజయవాడ కృష్ణా నదిని ఆనుకుని ఉంది. జిల్లాలో 120 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరం వెంబడి నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, బంటుమిల్లి, కృతివెన్ను తదితర మండలాల పరిధిలోని 53 రెవెన్యూ గ్రామాలు, 130 శివారు గ్రామాల్లో 88,255 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీరిలో అత్యధికంగా మత్స్యకా రులే ఉన్నారు. తుపాను వచ్చిన ప్రతిసారీ విజయవాడలోని కృష్ణా నది, బుడమేరు పక్కన నివసించేవారితోపాటు తీరప్రాంత వాసులు ఆస్తి నష్టపోతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా సుమారు లక్షన్నర మంది ప్రజలు చనిపోయారని అంచనా. అప్పట్లో సుమారు రూ.250 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. జనజీవనం సాధారణ స్థితికి రావడానికి ఏడాది పైగా పట్టింది. గత ఎడాది హెలెన్, లెహర్ తుపానుల వల్ల జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రూ.200 కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 2008లో కృష్ణా నదీకి వరద రావడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. 13 లోతట్టు ప్రాంతాలు వారం రోజులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు పడవల ద్వారానే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. మరోవైపు 13 డివిజన్లలో రెండు లక్షల మందికి పైగా కొండలపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. బుడమేరుకు వరద వస్తే రాజరాజేశ్వరీపేట, పాయకాపురం, ప్రకాష్నగర్, రాజీవ్నగర్ తదితర ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. కృష్ణా నదికి వరదలు వచ్చిన ప్రతిసారి ఇక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. అయినప్పటికీ మన పాలకులు ఇప్పటివరకు గుణపాఠం నేర్చుకోలేదు. ముప్పు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇలా చేస్తే మేలు.. నూతన రాజధానితోపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇక నుంచి అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెను ముప్పును నివారించే అవకాశం ఉంది. భవన నిర్మాణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విపత్తులను తట్టుకునేలా ప్రమాణాలు పాటించాలి. ప్రమాణాల విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదు. ఎక్కువమంది ప్రజలు పనిచేసే సంస్థలు రక్షణ చర్యలు విధిగా పాటించాలి. డ్రెయినేజీ వ్యవస్థను పక్కాగా రూపొందించాలి. కరెంటు స్తంభాల స్థానంలో భూగర్భ లైన్లు ఏర్పాటుచేయాలి. దీనివల్ల స్తంభాలు కూలిపోయి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండదు. ఇదే తరహాలో టెలిఫోన్ కేబుల్ వ్యవస్థను కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తే మంచిది. సెల్ఫోన్ టవర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే మేలు. సాధ్యమైనంత వరకు జనావాసాల మధ్య లేకుండా చూడాలి. హోర్డింగ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నాసిరకం ఇనుము వాడకుండా నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చూడాలి. కృష్ణా నది వెంబడి పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలి. బుడమేరులో ఆక్రమణలను తొలగించి ఎప్పటికప్పుడు పూడిక తీయాలి. తద్వారా నీరు సక్రమంగా పారుతుంది. ముంపు సమస్య తొలగిపోతుంది. జిల్లాలోని తీర ప్రాంతాల్లో శాశ్వత తుపాను రక్షిత కేంద్రాలను నిర్మించి, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుండాలి. తద్వారా విపత్తుల సమయంలో ప్రజలకు వీటిలో ఆశ్రయం కల్పించవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించని సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహించే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విషయంలో ఉదాసీనంగా వ్యవహరించరాదు. -
ఆహారం, నీరు అందించండి
సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం నష్ట పరిహారం పెంచుతూ జీవో విడుదల విశాఖపట్నం: ‘నష్టం అంచనాల సంగతి తర్వాత చూద్దాం. ముందు తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించండి’ అని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలపై సహచర మంత్రులు, అధికారులతో విశాఖపట్నంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యల కోసం విశాఖపట్నాన్ని 8 జోన్లుగా విభజించాలని, ఒక్కో జోన్కు ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జ్గా నియమించాలని ఆదేశించారు. సదరు ఇన్చార్జ్లు కేటాయించిన వార్డుల్లో పునరావాస చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. సీఎం మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 5 హెలికాప్టర్లతో బిర్యాని, పులి హోర ప్యాకెట్లు, తాగునీటి ప్యాకెట్లను తెప్పించాలని ఆదేశించారు. తెల్లరేషన్ కార్డున్న కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను వెంటనే అందించాలన్నారు. ►వాటర్ ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసే బాధ్యతను ఐజీ సురేంద్రబాబుకు అప్పగిం చారు. పాలు, నీటి ప్యాకెట్లు పంపించాలని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు కలెక్టర్లను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్లను క్లియర్ చేయమన్నారు. ►విద్యుత్ పునరుద్ధరణ కోసం అత్యవసరంగా కనీసం 200 స్తంభాలు కావాలని స్టీల్ప్లాంట్ అధికారులను కోరారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన టెలికం సేవలను పునరుద్ధరించాలన్నారు. సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ గులేరియా అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నష్ట పరిహారం పెంపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు, నష్టపోయిన పంటలు, ఇళ్లు, ఇతర వాటికి నష్టపరిహారాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి ఏఆర్ కుమార్ జీవో 9ని జారీ చేశారు. ►మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను రూ.1.50 లక్ష నుంచి 5 లక్షలకు పెంచారు. ►ప్రస్తుతం అంగవైకల్యం 80 శాతముంటే రూ. 62వేలు, అంగవైకల్యం 80 శాతాని కంటే తక్కువుంటే రూ.43,500 ఉంది. ఈ రెండింటికీ నష్టపరిహారాన్ని రూ. లక్షకు పెంచారు. ►తీవ్ర క్షతగాత్రులకు: వారం రోజుల కంటే ఎక్కువరోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే ఇప్పటి వరకు రూ.9,300 పరిహారాన్ని ఇస్తున్నా రు. ప్రస్తుతం దాన్ని రూ.50 వేలకు పెంచారు. వారం కంటే తక్కువ ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే ఇప్పటి వరకు రూ. 3,100 ఇస్తున్నారు. దాన్ని రూ.15 వేలకు పెంచారు. ►ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు దుస్తుల కోసం ఇంతవరకు రూ.1,300 ఇస్తున్నారు. దీన్ని రూ.2 వేలకు, వంటపాత్రల కోసం ఇస్తున్న రూ.1,400ను రూ. 2 వేలకు పెంచారు. ►బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద పెద్దలకు రూ.40 చొప్పున, పిల్లలకు రూ.30 చొప్పున చెల్లిస్తున్నారు. దానికి బదులుగా ఇక నుంచి వంట దినుసుల ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ►ఇక.. పూర్తిగా కూలిపోయిన పక్కా ఇళ్లకు ఇప్పటి వరకు రూ.70 వేలు పరిహారం ఇస్తున్నారు. ఇకపై దీనిని రూ.50 వేలు చేసి, ఐఏవై ఇళ్లను మంజూరు చేస్తారు. పూర్తిగా దెబ్బతిన్న కచ్చా ఇళ్లకు అయితే ఇంతవరకు రూ.15 వేలు ఇస్తున్నారు. దాన్ని రూ.25 వేలకు పెంచారు. ►తీవ్రంగా దెబ్బతిన్న కచ్చా ఇళ్ల పరిహారాన్ని రూ.3,200 నుంచి రూ.5 వేలకు, పాక్షికంగా దెబ్బతింటే రూ.5 వేలు, కూలిన పూరి గుడిసెలకు రూ. 5 వేలు ఇవ్వనున్నారు. ►పాడి పశువులు చనిపోతే పరిహారాన్ని రూ. 16,400 నుంచి రూ.20 వేలకు పెంచారు. పౌల్ట్రీ రంగానికి సంబంధించి కోడి పిల్లకు పరిహారాన్ని రూ.37 నుంచి రూ.50కి పెంచారు. ఇలాగైతే రాళ్లతో కొడతారు! మంత్రులు, అధికారులపై చంద్రబాబు ఆగ్రహం విశాఖపట్నం, రాజమండ్రి: ‘ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు మనం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తే ఎలా? మాటలు చెబుతున్నాం కానీ చేతల్లో చూపిం చడం లేదు. మన పనితీరు ఇలాగే ఉంటే జనం రాళ్లతో కొడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు. ఇతర జిల్లా అధికారుల నుంచి సహకారం లేదు’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘నష్టం అంచనాల సంగతి పక్కనపెట్టండి. వెంటనే తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించండి. సమాచార, రవాణా, విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించండి’ అని ఆదేశించారు. హుదూద్ పెను తుపానుతో కకావికలమైన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకున్న ఆయన తొలుత హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించి, తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విశాఖపట్నం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నేడు ప్రధాని ఏరియల్ సర్వే
అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులతో సమీక్ష హైదరాబాద్/న్యూఢిల్లీ: హుదూ ద్ తుపాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విశాఖపట్నానికి రానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటా రు. అక్కడి నుంచి నేరుగా 1.15కు ఏరియర్ సర్వేకు బయలుదేరి వెళతారు. ఏరియల్ సర్వేలో ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీనియర్ అధికారులు ఉంటారు. 2.05 గంటలకు తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించనున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, అన్ని శాఖల అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. 3.10 గంటలకు విశాఖపట్నం నుంచి తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ప్రధాని విశాఖపట్నం చేరుకుంటారు. తుపాను వల్ల సంభవించిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించటంతో పాటు తుపాను నష్టాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న విమానం ద్వారా ప్రధాని పరిశీలిస్తారని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. తుపానుపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి హుదూద్ పెనుతుపాను, ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస సహాయక చర్యలు తీరుతెన్నులపై వాకబు చేశారు. రహదారులు, రైల్వే లైన్లు, భవనాలు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ లైన్లు నష్టం వాటిల్లిందని ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. పంటనష్టంపై మరికొద్ది రోజుల్లో అంచనా వేయనున్నట్టు తెలిపారు. పునరావాస కల్పన, బాధితులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మోదీ ఆదేశించారు. -
వి‘ధ్వంసం’
హుదూద్ తుపానుకు ధ్వంసమైన చెట్లు నేలకూలిన విద్యుత్ స్తంభాలు గాలికి ఎగిరిపోయిన రేకులు ద్వారకానగర్ : హుదూద్ తుపాను పచ్చని చెట్లతో అందంగా అలరారుతున్న విశాఖ స్వరూపాన్ని మార్చేసింది. కేవలం 48 గంటల్లో సృష్టించిన బీభత్సంతో సమాచారం, రవాణా, విద్యుత్ వ్యవస్థను అతులాకుతలం చేసేసింది. నగరంలో రెండు రోజులుగా అంధకారం రాజ్యమేలుతోంది. నగరంలోని రోడ్ల్లకిరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలాయి. కొన్ని చెట్లు ఇళ్లపై పడటంతో ధ్వంసమయ్యాయి. రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించకపోవడంతో సిటీ బస్సులు నిలిచిపోయాయి. విశాఖనగర పరిధి సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న కాలనీలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పలుచోట్ల మంచినీటి పైపులు శిథిలమయ్యాయి. జగదాంబ, పూర్ణమార్కెట్, కురుపాం మార్కెట్, ద్వారకానగర్, దొండపర్తి, మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ, ఆశీల్మెట్ట జంక్షన్, వీఐపీ రోడ్డు, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు తదితర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలకు తీవ్రనష్టం వాటిల్లింది. దొండపర్తిలో ఉన్న బీఈ షాపింగ్మాల్, ఎస్మార్ట్ వ్యాపార సముదాయాల అద్దాలు పగిలిపోయాయి. షాపింగ్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, ఎల్సీడీ టీవీలు ధ్వంసమయ్యాయి. ద్వారకానగర్లో గల వస్త్ర దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. తీవ్ర ఈదురుగాలులకు ఇళ్లపై ఉన్న నీటి ట్యాంక్లు ఎగిరిపోయాయి. ఆశీల్మెట్ట జంక్షన్, రేసవానిపాలెం, వెంకోజీపాలెం, రవీంద్రనగర్లో పెట్రోల్బంక్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ బంకుల్లో పెట్రోల్ సరఫరా బంద్ చేశారు. చెట్లు కనుమరుగు హనుమంతవాక నుంచి జాతీయ రహదారి కిరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ద్వారకానగర్, అమర్నగర్, ఎంవీపీకాలనీ, విశాలాక్షినగర్, మధురానగర్, నెహ్రూనగర్, లలితానగర్, దొండపర్తి, శంకరమఠం, సీతంపేట, రైల్వే కాలనీ, తాటిచెట్లపాలెం, హెచ్బీకాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లపై, రోడ్లపై చెట్లు పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో లలితానగర్, శంకరమఠం రోడ్డు, దొండపర్తి, మధురానగర్ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. -
నష్టం అపారం!
భారీగా నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు 48 గంటలుగా అంధకారంలో జిల్లా పూర్తి పునరుద్ధరణకు మరో 2 రోజులు వేల ఇళ్లు నేలమట్టం నష్టం రూ.1500 కోట్లు పైమాటే విశాఖ రూరల్: విశాఖ మోడులా మారింది. హుదూద్ తుపాను జిల్లా రూపురేఖలను మార్చేసింది. పెనుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విశాఖ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఏడుగురి ప్రాణాలను హరించాయి. లెక్కలేనంత మందిని క్షతగాత్రులను చేశాయి. పైకప్పులు లేని ఇళ్లతో, కన్నీరు ఉప్పొంగుతున్న కళ్లతో ప్రజానీకం బావురుమంటోంది. ప్రజలకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. జిల్లాను విషాదంలో ముంచేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు హుదూద్ తుపాను కారణంగా జిల్లా రూపురేఖలు మారిపోయాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. 48 గంటలుగా జిల్లా అంధకారంలో మగ్గుతోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తం భించింది. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఉండడానికి నిలువ నీడలేదు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టినా ప్రకృతి ప్రకోపం ముందు నిలవలేకపోయారు. నస్టాన్ని నివారించలేకపోయారు. ఈ తుపాను కారణంగా జిల్లాలో రూ.1500 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. వేల ఇళ్లు నేలమట్టం : శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన పెను గా లులకు వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పూరిళ్లు, రేకులు, పెంకుటిళ్లే కాకుండా పక్కా ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నా యి. 10 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు భావిస్తున్నారు. అంధకారంలో జిల్లా : పెనుగాలులకు భారీ సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లను పూర్తిగా తొలగిస్తేనే గాని విద్యుత్ను పునరుద్ధరించే అవకాశం లేదు. దీంతో చెట్ల నరికివేతను వేగవంతంగా చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్ను పునరుద్ధరించాలంటే కనీసం 48 గంటలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. రూ.500 నుంచి రూ.600 కోట్లు వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్తంభించిన కమ్యూనికేషన్ హుదూద్ తుపాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్తంభించి పోయింది. టెలికాం సంస్థల సెల్ టవర్లకు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ విద్యుత్ అంతరాయం కారణంగా జిల్లాలో ఫోన్ సిగ్నల్కు అంతరాయం ఏర్పడింది. వీటిని పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న పంటలు : ప్రస్తుతం జిల్లాలో 1,78,743 హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా వరి 88,893 హెక్టార్లలోను, చెరకు 37,459 హెక్టార్లలోను, రాగి 20,324 హెక్టార్లలోను సాగు జరుగుతోం ది. మరికొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో హుదూద్ తుపాను పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. రూ.75 కోట్లు వరకు నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లు : భారీ వర్షం కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో దాదాపుగా 100 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఆర్ అండ్ బీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీని నష్టం రూ.40 కోట్లు వరకు ఉంటుందని భావిస్తున్నారు. -
ప్రకృతికి సెగ, తుపాన్ల పగ
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామెతకు కాలం చెల్లిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉపద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసికట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగలదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు. ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది. తూర్పు కోస్తాతీరంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల రూపురేఖలను హుదూద్ సర్వ నాశనం చేసింది. విశాఖ పట్నం దగ్గర తీరం దాటి, ఆ నగరానికి పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ రెండు రాష్ట్రాలలో జన జీవనాన్నీ, గ్రామా లనూ, అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలను (రోడ్డు, రైల్వే మార్గాలు సహా) ఛిన్నాభిన్నం చేసింది. లక్షల ఎక రాలలో రకరకాల పంటలను నేలమట్టం చేసింది. భారత నావికా వ్యవస్థలో కీలకమైన ఈస్ట్రన్ నావెల్ కమాండ్కు కీలకంగా ఉన్న నగరం విశాఖ. ఆ నగర సౌందర్యం తుపా ను విలయంలో ధ్వంసమైంది. ఒక శాడిస్టు మనోవికా రంతో హుదూద్ అక్కడే తీరం దాటింది. మరో తుపాను పొంచి ఉందా? గత సంవత్సరం ఇదే అక్టోబర్లో కోస్తాను అతలాకుతలం చేసిన ‘పైలీన్’ బీభత్సం కన్నా ఎన్నో రెట్లు బీభత్సాన్ని నిన్నటి హుదూద్ సృష్టించింది. విషాదం ఏమిటంటే హుదూద్ విసిరిన గాలులు పెట్టిన ఘోష సైతం ఇంకా ప్రజలకు మరపునకు రాలేదు. కానీ మరో దుర్వార్త అప్పు డే సిద్ధమైపోయింది. కొద్దిరోజులలోనే- బహుశా ఈ నెలా ఖరులో లేదా నవంబర్ ఒకటో తేదీ సమీపంలోనో మరో పెను తుపాను పట్టవచ్చునని, అది ఉత్తరాంధ్రప్రదేశ్- చెన్నై కోస్తా వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉందని ‘నాసా’(అమెరికా)కు చెందిన, జపాన్కు చెందిన శాస్త్ర వేత్తలు కొందరు అంచనా వేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ తుపాను పంజా విసరవచ్చు. లేదా తప్పి పోనూ వచ్చు. ఇది కూడా అండమాన్ దీవులలోనే తలెత్తే అవకాశం ఉందని వారి ఊహ. హుదూద్ అడుగుజాడలలో... ఆసియాను ముమ్మరించిన రెండు పెను తుపానులలో హుదూద్ ఒకటి. దీని ఫలితాన్ని చూశాం. మరొకటి వొంగ్ఫాంగ్. ఇది జపాన్ దిశగా కదులుతున్న విలయం. హుదూద్ మాదిరిగానే ఇది కూడా గంటలకు 180 కిలో మీటర్ల వేగంతో వీచే గాలులను మూట కట్టుకుని బయలు దేరింది. జపాన్లోని ఒకినావా నగరాన్ని గాలిదుమా రంతో, భారీ వర్షంతో ముంచెత్తింది. ఇక్కడితో తన ప్రతాపాన్ని చాలించకుండా జపాన్లోదే కియుషీ దీవిని కూడా కబళించనున్నదని అంచనా. అందుకే ముందస్తు చర్యగా అధికార యంత్రాంగం అక్కడ నివసించే లక్షన్నర జనాభాను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఇది కూడా హుదూద్ అడుగుజాడలలోనే ఆదివారమే తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో హుదూద్ తాకిడికి గుర య్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో తుపాను కారణంగా కోటిన్నర జనాభా అన్నపానీయాలు లేకుండా బితుకుబితుకు మం టూ బతికారు. అనేక ఇక్కట్లకు గురయ్యారు. అన్నింటి కన్నా విచిత్రం ఏమిటంటే- ఇంతవరకు నమోదైన చరి త్రను బట్టి భారత ఉపఖండంలో 35 రాకాసి తుపానులు సంభవించాయి. అందులో 27 భీకర తుపానులకు బంగా ళాఖాతమే పురుడుపోసింది. అందుకే హిందూ మహా సముద్రం ఉష్టమండల తుపానులకు కేంద్ర స్థానమైందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే పైలీన్ లేదా, హుదూ ద్, ఈ రెండూ కూడా గత పదేళ్ల నుంచి పర్యావరణంలో, వాతావరణంలో కలుగుతున్న మార్పుల ఫలితాలేనని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. హుదూద్ అంటే ఇజ్రాయెల్ జాతీ య పక్షి పేరు. ఈ తుపానుకు ఒమన్ ప్రభుత్వం ఈ పేరు పెట్టింది. పరిజ్ఞానం ప్రయోజనం ఎప్పుడు? వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామె తకు కాలం చెల్లిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉప ద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసిగట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగ లదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు. ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది. హుదూద్ విజృంభించబోతున్న సంగతి తెలిసిన తరువాత ఈ పనిని సైనిక, నావికా దళాలు చేపట్టాయి. రంగంలోకి దిగి వెళ్లగలిగినంత మేర చొచ్చుకుపోయి జనాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. నిజానికి ఇలాంటి విపత్తుల నుంచి కాపాడేందుకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు (డిజాస్టర్ మేనేజ్మెంట్) లేకపోలేదు. ప్రాణనష్టం జరగకుండా లేదా ఆ నష్టాన్ని బాగా తగ్గించడానికి, ఆస్తినష్టం జరగకుండా చూడడానికి ఈ వ్యవస్థలు రూపొందించిన పథకాలకు కూడా కొరతలేదు. కానీ ఆ వ్యవస్థలు పలు సందర్భాలలో ఎందుకు సకాలంలో స్పందించడం లేదు? ప్రభుత్వాలకు, అధికారులకు పాలనానుభవం ఉన్నప్పటికీ ప్రజానీకం అం టే శ్రద్ధాసక్తులు లేనందుకే కొన్ని లోటుపాట్లు జరుగుతు న్నాయి. ప్రజా సంక్షేమం బాధ్యత నుంచి తప్పించుకునే సంస్కృతికి అలవాటు పడడం వల్ల, విపత్తుల నుంచి బయటపడగల వ్యూహరచన కొరవడినందు వల్లనే తగ్గిం చుకోగల నష్టాల పైనా కష్టాల పైనా దృష్టి సారించడం లేదు. జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార వ్యవస్థను 2006లో ఏర్పాటు చేశారు. తరువాత క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఉపగ్రహ వ్యవస్థ జాతీయంగా కూడా నిలదొక్కుకుంటున్న కొద్దీ మన వాతావరణ శాస్త్ర వేత్తలు ప్రమాద హెచ్చరికలను ముందుగానే విడుదల చేయగలుగుతున్నారు. ఇంతకు ముందున్న పరిస్థితి వేరు. 1977 నాటి దివిసీమ రాకాసి తుపాను వల్ల జరిగిన భారీ ప్రాణనష్టం (10,000) గురించి, ముంచుకొస్తున్న ఆ తుపా ను గురించి ‘నాసా’(అమెరికా) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తే తప్ప మనకు తెలియలేదు. పెరుగుతున్న తుపాను ముప్పు బంగాళాఖాతం భారీ తుపానులకు నిలయంగా మారింది. అందులో పుట్టిన తుపానులు తూర్పు కోస్తాను అతలాకు తలం చేస్తున్నాయి. 1891-1977 మధ్య బంగాళాఖాతం లో 400 తుపానులు జనించాయి. అలాగే 1891-1969 మధ్య వచ్చిన 453 తుపానులకు ఈ తీరమే కారణమైనట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1891ను ఎందుకు మైలురా యిగా తీసుకున్నారంటే, ఆ సంవత్సరమే బందరు (మచి లీపట్నం)మీద ఘోర తుపాను పడగ విప్పింది. పట్టణ వీధులన్నీ జలమయం కావడంతో బాధితులను పడవల మీద తరలించవలసి వచ్చింది. దాదాపు అంతటి ఘోర మైన తుపానులను చవిచూసిన అనుభవం నెల్లూరు, చీరాల పట్టణాలకు కూడా ఉందని రికార్డులు వెల్ల డిస్తున్నాయి. 1969 నాటి నెల్లూరు పెను తుపాను తరు వాతనే మిటిగేషన్ కమిటీ ఉనికిలోకి వచ్చింది. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను సూచించ డమే ఈ కమిటీ ధ్యేయం. మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తుపాను బీభత్సం మరింత తీవ్రం కానున్న దని 1980లోనే అంచనా వేశారు. బీభత్సం పెరిగే కొద్దీ ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా పెరిగిపోతాయి. అందుచేత ప్రభుత్వ వ్యవస్థలు ముందస్తు జాగ్రత్తతోనే నివారణ చర్య లను బహుముఖంగా చేపట్టాలని, చావు నెత్తి మీదకు వచ్చే వరకు వేచి ఉండరాదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచా ర్యుడు సీవీ రాఘవులు ఒక అధ్యయన పత్రంలో స్పష్టం చేశారు. 1979 నాటి ఘోర తుపాను తరువాత ఆయన ఈ పత్రాన్ని రూపొందించారు. అతివృష్టి-అనావృష్టి తుపానులు కోస్తా ఆర్థిక వ్యవస్థను దఫదఫాలుగా నాశనం చేస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు రాయలసీమ వర్షాభా వ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు 12 శాతం తగ్గిపోయాయి. ఒక్క తెలంగాణలోనే వర్షపాతం 30 శాతం తగ్గింది. నిజానికి కడచిన దశాబ్దంగా దేశంలో వర్షపాతం తక్కువై వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని భారత ఉష్టమండల వాతావ రణ సంస్థ (పుణే) మాజీ సంచాలకుడు బీఎన్ గోస్వామి అంచనా వేశారు. దీని ప్రభావం ధాన్యం ఉత్పత్తి పైన, సగటు జాతీయోత్పత్తులపైనా కూడా ఉండబోతోంది. పర్యావరణంలో మార్పులతోను, పసిఫిక్ సముద్ర ప్రాం తంలో పుట్టి పెరుగుతున్న ఎల్-నినో, లానినో వాతావరణ వ్యవస్థల వల్ల తుపానులు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడు తున్నాయి. ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రపం చ పర్యావరణం వేడెక్కి పోవడం కూడా కారణమేనని, ఈ పరిణామంతో వాతావరణంలో ఆవిరి పెరిగిపోతోందని ప్రొఫెసర్ గోస్వామి అంచనా. ఒకటి వాస్తవం- ‘మట్టి ఎప్పటికప్పుడు కలవరిస్తుంటుంది/ వాన నీటి స్పర్శ కోసం’ అన్న సహజ సూత్రాన్ని మరచిపోరాదు. ఏబీకే ప్రసాద్ -
వర్ష బీభత్సం
మునగపాక : హుదూద్ తుపానుతో మండలంలో భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకవైపు భారీ ఈదురు గాలులు మరోవైపు వర్షాలు పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విపరీతమైన గాలులతో చెట్లు పలుచోట్ల పడిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్త స్తంభించిపోయింది. ఇళ్లల్లోనుంచి బయటకు రావడానికి ప్రజలు వణికిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. చాలా చోట్ల పూరిళ్లు నేలకొరిగాయి. గాలలకు చెరకు తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు వరిపొలాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఆయా ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. అరకు రూరల్ : హుదూద్ తుపాను బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి నుంచి వీచిన బలమైన గాలలుకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విశాఖ నుంచి అరకు వరకూ ఉన్న రహదారి మొత్తం నేల కూలిన చెట్లతో నిండిపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పద్మాపురం జంక్షన్ నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద, అరకు లోయ వరకూ రహదారంతా నేలకూలిన చెట్లతోనే నిండిపోయాయి. పుట్టగొల్లడ, అట్టగుడ, ఒసుబడల్లో గెడ్డలు పొంగిపొర్లాయి. దీని వల్ల సుంకరమెట్ట వారపు సంతకు వెళ్లిన వారివారి ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది వారికి తెలిసిన వారి ఇళ్ల వద్దే ఉండిపోయారు. -
పాను ప్రాంతాల్లో వెలుగులు నింపేందుకు..
తిరుపతి రూరల్: హుదూద్ తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించి పలు జిల్లా ల్లో అంధకారం నింపింది. ఈ నేపథ్యం లో తుపాను ప్రభావిత జిల్లాల్లో వెలుగులు నింపేందుకు డిస్కం నడుం బిగిం చింది. డిస్కం పరిధిలోని 8 జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తుపా ను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తరలివెళ్లారు. డిస్కం సీఎండీ హెచ్వై దొర ఆధ్వర్యంలో వీరు పనిచేయనున్నారు. 8 జిల్లాల నుంచి 2500 మంది ఆపరేషన్, మెయిన్టెనెన్స్ సిబ్బంది ఇప్పటికే బస్సుల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపినట్లు డిస్కం సీఎండీ హెచ్వై దొర తెలిపారు. డిస్కం డెరైక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ రాంసింగ్, డెరైక్టర్ ఆఫ్ హెచ్ఆర్ డి.నాగేశ్వరరాజులు సహా య పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆది వారం సాయంత్రం తిరుపతి సర్కిల్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో 270 మంది జెఎల్ఎంలు, ఏఎల్ఎంలు, లైన్ ఇన్స్పెక్టర్లు, ఏఇలు, ఏడీఇలు ఆపరేషన్, మెయిన్టెనెన్స్ సిబ్బంది 8 బస్సుల్లో వైజాగ్కు తరలి వెళ్లారు. ఎస్ఇ సుబ్బరాజు పచ్చజెండాను ఊపి బస్సులను పంపారు. వారం రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న సబ్స్టేషన్ను వీరు మరమత్తులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే చీఫ్ ఇంజనీర్ అనంత్కుమార్ వైజాగ్లో ఉండి పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు. -
ముప్పు తొలగిపోలేదు...
ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలకు హుదూద్ తుపాను ముప్పు ఇంకా తొలగిపోయాలేదు. ఆదివారం మధ్యాహ్నం విశాఖ వద్ద తీరం దాటిన తుపాను ఆరేడు గంటల్లో బలపీనపడి అల్పపీడనంగా మారుతుందని మొదట భారత వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే ఐఎండీ ఊహించినట్లుగా తుపాను త్వరగా బలహీనపడలేదు. ఇది నెమ్మదిగానే బలహీనపడుతూ వస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. ‘‘అతి తీవ్ర తుపాను ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారింది’’ అని ఆ అధికారి వివరించారు. దీనిప్రభావంతో ఆదివారం రాత్రికి ఉత్తరాంధ్రలో ఇంకా బలమైన పెను గాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తుపాను క్రమేపీ బలహీనపడి సోమవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. -
టెక్నాలజీతో అడ్డుకున్నాం: చంద్రబాబు
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా హుదూద్ తుపాను విపత్కర పరిస్థితులను అధిగమించగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మూ డు రోజులనుంచి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం నివారించగలిగామని చెప్పారు. ఆదివారం విజయవాడ వెళ్లే ముందు తుపాను ప్రభావం, సహాయక చర్యలపై సచివాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 1,200 మంది సర్పంచులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వంద మంది మాత్రమే లైన్లోకి వచ్చారన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు. విశాఖపట్నం దగ్గర్లోని పూడిమడక వద్ద తుపాను తీరం దాటిందన్నారు. ఏ సమయంలో దాటిందో తెలుసుకునేందుకు రాడార్ కేంద్రం పనిచేయడం లేదని, రాడార్తో అనుసంధానం తెగిపోయిందన్నారు. జీడి, కొబ్బరి తోటలు, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నష్టం వివరాలు సేకరించేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రాణ నష్టం ఏమాత్రం ఉండరాదని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటివరకూ ముగ్గురు మరణించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ‘విండ్ మెజర్ మెకానిజమ్’ అందుబాటులో లేదు తుపాను గాలుల వేగం గంటకు 180 నుంచి 200 కిలోమీటర్లుగా ఉందని చంద్రబాబు చెప్పారు. అయితే ‘విండ్ మెజర్ మెకానిజమ్’ అందుబాటులో లేదని, నేవీ సమాచారం ప్రకారం గాలుల తీవ్రత తెలిసిందన్నారు. నష్టం గురించి తెలుసుకునే వ్యవస్థ కూడా మనవద్ద లేదన్నారు. తుపాను సహాయక చర్యలు, నష్టం అంచనా వేసేందుకు ప్రభుత్వం మొబైల్ యాప్ రూపొందించిదని, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు దీన్ని డౌన్లోడ్ చేసుకుని సమాచారం అందించాలని కోరారు. డ్వాక్రా మహిళలు తుపాను బీభత్సానికి సంబంధించి ఫోటోలు తీసి స్మార్ట్ ఫోన్ల ద్వారా సమాచారం పంపించాలని సూచించారు. తక్షణం రూ.2,000 కోట్లివ్వండి హుదూద్ భారీ నష్టాన్ని కలిగించిన నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ.2,000 కోట్లు అందచేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఉప్పుటేరు పాయల్లోనే ఉప్పాడ బోట్లు
కృత్తివెన్ను : హుదూద్ తుపాను తాకిడికి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన 65 బోట్లు కృత్తివెన్ను మండలంలోని పల్లెపాలెం, పడతడికల్లోని ఉప్పుటేరు పాయలకు శనివారం రాత్రి చేరుకున్నాయి. తహశీల్దార్ పి.మధుసూధనరావు క థనం ప్రకారం ఉప్పాడకు చెందిన 65 బోట్లలో సుమారు 700 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఈ సమయంలో బంగళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను కారణంగా స్వగ్రామం చేరడానికి సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవటంతో సురక్షిత ప్రాంతమైన కృత్తివెన్ను మండలానికి వారు చేరుకున్నారు. మార్గమధ్యంలో అంతర్వేదిలో కొందరు మత్స్యకారులు దిగి స్వస్థలానికి వెళ్లిపోగా సుమారు 80 మంది మత్స్యకారులు కృత్తివెన్ను మండలంలో బోట్లకు లంగరు వేసి కాపలాగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు శనివారం రాత్రి వారి నుంచి పూర్తి వివరాలు సేకరించి వారికి పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం అల్పహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు. వాతావరణం కుదుట పడే వరకు ఇక్కడే... సముద్రంలో వాతావరణం ప్రశాంతత ఏర్పడి చేపలవేటకు అనుకూలించే వరకు ఉప్పాడకు చెందిన బోట్లు కృత్తివెన్ను మండలంలో ఉంటాయని ఆర్డీవో సాయిబాబు తెలిపారు. ఆదివారం కృత్తివెన్ను మండలానికి వచ్చిన ఆర్డీవో ఉప్పాడకు చెందిన మత్స్యకారులతో మాట్లాడారు. ఆర్డీవోతో పాటు మండల తుపాను ప్రత్యేకాధికారి, ఉపాధిహామీ అడిషనల్ పీడీ సురేష్, ఎంఈవో సత్యవతి ఉన్నారు. ప్రమాద సూచికలు ముందు మాకే తెలుస్తాయి సముద్రంలో వేటకు వెళ్లిన మాకు తీరం నుంచి వచ్చిన సమాచారం కన్నా సముద్రంలో అలల ఉధృతే తుపాను ప్రభావాన్ని మాకు ముందుగా తెలుపుతుంది. విషయం తెలుసుకున్న మేము ఉప్పాడ వైపు వెళ్లడానికి అంతగా అనుకూలం లేకపోవటంతో కృత్తివెన్ను మండలం సురక్షితమని ఇక్కడకు చేరుకున్నాం. సముద్రంలో ఉధృతి తగ్గాక తిరిగి స్వస్థలాలకు వెళతాం. - సత్తిరాజు, ఉప్పాడ బోట్లకు లంగరు వేశాం సముద్రంలో వాతావరణం భయానకంగా ఉండటంతో ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే తీరానికి చేరుకున్నాం. మాతో పాటు మరో 64 బోట్లు మండలంలోని వివిధ ప్రాంతాల్లో లంగరు వేసి నిలిపాం. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక తిరిగి మా స్వస్థలాకు వెళతాం. - సుబ్బారావు, ఉప్పాడ -
హుదూద్...అప్రమత్తం
రాంనగర్ : ‘‘హుదూద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది... రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా సమర్థంగా పనిచేయాలన్నారు. ప్రజలకు వైద్య సౌకర్యం అందించేందుకు 108 వాహనాలను సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్లు, ఇతర అధికారులు సెలవులో వెళ్లరాదని, విధిగా హెడ్క్వార్టర్లలోనే పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తి నీటిసామర్థ్యంతో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, బలహీనంగా ఉన్నవాటిని ముందస్తుగానే గుర్తించి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. సోమవారం భారీ వర్షాలు కురిస్తే పాఠశాలలకు అవసరమైతే సెలవు ప్రకటించాలని డీఈఓకు సూచించారు. పట్టణాలలో మురుగుకాల్వలు, పెద్ద డ్రెయినేజీలు చెత్తాచెదారంతో నిండి కాలనీలు జలమయం కాకుండా ఉండేందుకు ముందస్తుగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశిం చారు. ముఖ్యంగా రైల్వేట్రాక్ వెంట భారీగా వరద నీరు ప్రవహించడాన్ని గుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలనుంచి సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 1800-425-1442 నంబర్తో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏైవైనా సమస్యలు, సమాచారం ఉంటే ఈ నంబర్కు ఫోన్చేసి చెప్పాలని కోరారు. -
దడ పుట్టిస్తున్న హుదూద్
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ ప్రభావంతో శనివారం ఉదయం నుంచి జిల్లా అంతటా చెదురుమదురుగా వర్షాలుకురిశాయి. సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తీరప్రాంతంలో పెనుగాలులు ప్రారంభమయ్యాయి. తీర ప్రాంతంలో శనివారం వేకువ జాము నుంచే వర్షాలు ప్రారంభమయితే, జిల్లా మొత్తం శనివారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. విజయనగరంలో సాయంత్రం నుంచి వర్షం కురిసింది. ఎస్ కోట నియోజకవర్గంలో గాలులు వీస్తూ, చినుకు లు కురిశాయి. గజపతినగరంలో ఈదురుగాలులు వీచాయి. బొబ్బిలిలో ఉదయం నుంచి గాలులు వీస్తునే ఉన్నాయి. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పార్వతీపురంలో ఉదయం నుంచి గాలులు వీచాయి. తీరప్రాంతంలో సముద్రం అలలు ఎగసిపడుతూ, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. -
అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్
హైదరాబాద్: హుదూద్ తుపానుతో తెలంగాణ జిల్లాల్లోనూ భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆయా జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం రాష్ట్ర రెవెన్యూ, ప్రకృ తి విపత్తుల నిర్వహణ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనాతో మాట్లాడారు. ఉత్తర తెలంగా ణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని బీఆర్ మీనాకు సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ల నంబర్ల వివరాలు.. జిల్లా ఫోన్ నంబర్ ఆదిలాబాద్ 08732221144 కరీంనగర్ 18004254371 నిజామాబాద్ 18004256644 రంగారెడ్డి 18004250817 నల్లగొండ 18004251442 మెదక్ 08455273525 మహబూబ్నగర్ 9866098111 వరంగల్ 08702510777 ఖమ్మం 08742224204 -
హుదూద్పై పీఎం మోదీ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను ప్రభావంపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు సంసిద్ధతపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం అత్యవసరంగా అత్యున్నతస్థారుు సమావేశం నిర్వహించారు. ఆయూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించాల్సిందిగా హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు సూచించినట్లు అధికారిక ప్రకటన ఒకటి వెల్లడించింది. తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ప్రధాని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు ప్రకటన తెలిపింది. ఎన్సీఎంసీ సమావేశం: తుపాను పరిస్థితులను సమీక్షిం చేందుకు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) శని వారం ఢిల్లీలో మరోమారు సమావేశమైంది. కేబినెట్ కార్యద ర్శి అజిత్ సేథ్ భేటీకి అధ్యక్షత వహించారు. ఏపీ, ఒడిశాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. -
కన్నెర్రా? కనికరమా?
కొన్నిరోజులుగా కడలిలో కదం తొక్కుతూ ఉన్న ‘హుదూద్’.. తీరంపై దాడి చేసే ఘడియ చేరువవుతోంది. శనివారం నుంచే ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల హోరు.. తుపాను మోగిస్తున్న రణభేరిలా వినిపిస్తోంది. విశాఖ పరిసరాల్లో ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత తీరం దాటనున్న తుపాను ఎలాంటి హానీ తలపెట్టకుండా కనికరించాలని పలుచోట్ల తీరప్రాంతవాసులు గంగమ్మకు పూజలు చేశారు. మరోపక్క అధికారులు ఈ విపత్తు కలిగించే నష్టాన్ని నివారించేందుకు పలుచర్యలు చేపట్టారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తీరం దాటే వేళ ‘హుదూద్’ ఏ మేరకు కోరలు చాచుతుందోనన్న ఆందోళన జిల్లా అంతటా నెలకొంది. ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత విశాఖ పరిసరాల్లో తీరం దాటే అవకాశమున్న నేపథ్యంలో ఆ సమయంలో ఉత్పన్నమయ్యే దుష్పరిణామాల్ని ఎదుర్కొనే ప్రయత్నాల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఈ క్రమంలో తీర గ్రామాల వారిని శనివారం పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే తీరంలోని ఉప్పాడ, సుబ్బంపేట, మాయాపట్నం, సూరాడపేట, అమీనాబాద, కోనపాపపేట గ్రామాలు సహా కోనసీమలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని గ్రామాల మత్స్యకారులు ఇళ్లు విడిచి వచ్చేది లేదంటున్నారు. దాంతో పోలీసు బందోబస్తుతో బలవంతంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. కాట్రేనికోన మండల పరిధిలో సముద్రంలో దీవిలా ఉండే మగసానితిప్ప, నీళ్లరేవు, చిర్ర యానంల నుంచి 2500 మంది మత్స్యకారులను తరలించబోతే ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశాలతో వారిని పోలీసు బందోబస్తుతో తరలిస్తున్నారు. ఉప్పాడ తీరంలో జట్టీలు లేకపోవడంతో సుమారు 600 బోట్లకు లంగరేశారు. ఒక్కో బోటు రూ.20 లక్షలు విలువైనదని, తమకు బతుకుతెరువైన వాటిని విడిచి పెట్టి ఎలా రాగలమని మత్స్యకారులు అంటున్నారు. కాగా ఎలాంటి ఆపదా తలపెట్టకుండా శాంతించాలని మత్స్యకారులు గంగమ్మతల్లికి పూజలు చేశారు. ఛిన్నాభిన్నమైన బీచ్రోడ్డు.. తొండంగి నుంచి సఖినేటిపల్లి వరకు సముద్ర తీరం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో కల్లోలితంగా ఉంది. ఓడలరేవు సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంది. తీర గ్రామాల్లో మెరైన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఉప్పాడ-కాకినాడ లైట్హౌస్ బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన బండరాళ్లు కెరటాల ఉధృతికి రోడ్డుపైకి వచ్చేసి స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి. ఉప్పాడ రోడ్డు ఛిన్నాభిన్నమైంది. ఉప్పాడ తీరంలో జియోట్యూబ్ టెక్నాలజీతో నిర్మించిన రక్షణ గోడ దెబ్బతిని ఉప్పాడ గ్రామంలోకి సముద్రం నీరు చొచ్చుకువచ్చింది. తుపాను తాకిడి ఎంత తీవ్రంగా ఉంటుందోనని జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలను నిషేధించారు. ఈ నిషేధం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. కాకినాడకు హోప్ ఐలాండ్ వాసులు.. ఎస్.యానాం, కాట్రేనికోన మండలం మగసానితిప్ప, గచ్చకాయలపోర తీరంలో ఉన్న విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన 350 మంది వలస మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలంలో ఎస్.యానాం సముద్రతీరాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ నుంచి 200 మంది మత్స్యకారులను కాకినాడ శారదా హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. సముద్రంలో కాట్రేనికోన మండలంలో దీవిని పోలి ఉండే మగసాని తిప్ప నుంచి 60 మంది మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజోలు నియోజకవర్గంలో తూర్పుపాలెం, కేశనపల్లి, కేశవదాసుపాలెం, ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం తదితర తీరగ్రామాల్లోని మత్స్యకారులను అప్రమత్తం చే సి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయం, రాజోలు తహశీల్దార్ కార్యాలయాల నుంచి కలెక్టర్ నీతూ ప్రసాద్ ఢిల్లీలోని జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సహాయక చర్యల వివరాలను తెలిపారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. 70 కేంద్రాలకు 17 వేల మంది తరలింపు తుపాను ప్రభావం 79 గ్రామాల్లోని 45,748 కుటుంబాలపై పడే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. శనివారం రాత్రి 9 గంటలకు అందిన సమాచారం మేరకు సుమారు 17 వేల మందిని 70 పునరావాస కేంద్రాలకు తరలించారు. కాకినాడ డివిజన్ పరిధిలో కాకినాడ అర్బన్ మండలంలో రెండువేలమందిని మూడు కేంద్రాలకు, కాకినాడ రూరల్ మండలంలో 2001 మందిని కేంద్రాలకు, కరప మండలంలో 300 మందిని ఒక కేంద్రానికి, తాళ్ళరేవు మండలంలో 750 మందిని నాలుగు కేంద్రాలకు, యు.కొత్తపల్లి మండలంలో 6,060 మందిని 8 కేంద్రాలకు, పెద్దాపురం డివిజన్ పరిధిలోని తుని మండలంలో 650 మందిని ఏడు కేంద్రాలకు, తొండంగిలో 12 వందల మందిని తొమ్మిది కేంద్రాలకు, కోటనందూరులో 250 మందిని ఒక కేంద్రానికి, అమలాపురం డివిజన్లో కాట్రేనికోన మండలంలో 145 మందిని ఏడు కేంద్రాలకు, ఉప్పలగుప్తం మండలంలో 950 మందిని ఆరు కేంద్రాలకు, సఖినేటిపల్లి మండలంలో 730 మందిని మూడు కేంద్రాలకు, మామిడికుదురు మండలంలో 150 మందిని రెండు కేంద్రాలకు, అల్లవరం మండలంలో 440 మందిని నాలుగు కేంద్రాలకు, ఐ.పోలవరం మండలంలో 440 మందిని ఆరు కేంద్రాలకు తరలించి, పునరావాసం కల్పించారు. కాగా అపాయంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 85 మంది గజ ఈతగాళ్లను, 19 బోట్లను సిద్ధం చేశారు. -
రైళ్లకు హుదూద్ బ్రేక్
కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు హైదరాబాద్/విజయవాడ: హుదూద్ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు ఎక్స్ప్రెస్, ప్యా సింజర్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని పాక్షికం గా రద్దు చేసి, కొన్నింటిని దారి మళ్ళించి నడుపుతోం ది. తూర్పు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయనే హెచ్చరికలతో వీటిని రద్దు చేసినట్లు సీపీఆర్వో సాం బశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్ నుం చి బయలుదేరాల్సిన హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్తో పాటు 12న సాయంత్రం అ టునుంచి బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యూరుు. 11న రాత్రి 10.50 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరాల్సిన భువనేశ్వర్-బెంగళూ రు కంటోన్మెంట్ ప్రీమియం స్పెషల్, 12వ తేదీన రాయగడ-విజయవాడ ప్యాసింజర్, విజయవాడ-రాయగడ ప్యాసింజర్, విశాఖపట్నం-మచిలీపట్నం/నర్సాపూర్ ప్యాసింజర్, విశాఖపట్నం-రాజమండ్రి ప్యాసింజర్,మచిలీపట్నం/నర్సాపూర్-విశాఖపట్నం ప్యాసింజర్,నర్సాపూర్-భీమవరం ప్యాసింజర్ రైళ్ళు రద్దయ్యూరుు. విశాఖపట్నం-విజయవాడ ప్యాసిం జర్ను విశాఖ-రాజమండ్రి మధ్య రద్దు చేశారు. అలాగే విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్ పాక్షికంగా రద్దైంది. పలు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఇలావుండగా హుదూద్ తుపానును ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ప్రదీప్కుమార్, ఏడీఆర్ఎం సీతారాంప్రసాద్ వెల్లడించారు. శనివారం సా యంత్రం వారు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హుదూద్ తుపాను కారణంగా భువనేశ్వర్, విశాఖపట్నంల మధ్య సుమారు 40 రైళ్ల ను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఢిల్లీలో తెలిపారు. అనేక రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. భువనేశ్వర్లోని ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, ఖుర్దా రోడ్డు, సంబల్పూర్ డివిజనల్ ప్రధాన కార్యాలయూల్లో 24ఁ7 విపత్తు నిర్వహణ విభాగాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ప్రయాణికుల గుండెల్లో తుపాను
రాజమండ్రి సిటీ :‘హుదూద్’తుపాను ప్రభావంతో ఆదివారం జిల్లాలో రవాణా వ్యవస్థ అగమ్యగోచరంగా మార నుంది. దూర ప్రాంతాలకు వివిధ పనుల కోసం వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికుల పరిస్థితి అర్థం కాకుండా ఉంది. తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా రాజమండ్రి మీదుగా వెళ్లాల్సిన 23 రైళ్లు, రాజమండ్రి నుంచి బయలు దేరి విశాఖపట్నం-7, ఇచ్చాపురం- 2 వెళ్లే బస్సులను ఆదివారం సాయంత్రం వరకూ రద్దు చేస్తున్నట్టు ఆర్టీసీ ఆర్ఎం రమాకాంత్ ప్రకటించారు. దీంతో సుమారు 500 మంది విశాఖపట్నం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బస్సుల రద్దుతో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు అవ స్థలు పడ్డారు. తుపాను ప్రభావం జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారనుంది. జాతీయ రహదారిపై వాహనాలు రద్దు చేసినట్టయితే రాజమండ్రికి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చే పలు రకాల వస్తువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ఆదివారం ప్రయాణం చేసేందుకు దాదాపు 60 రోజుల క్రితం నుంచి కష్టపడి చేయించుకున్న రిజర్వేషన్లు తుపాను ప్రభావంతో రైళ్లు రద్దు కావడం ప్రయాణికులు నిరాశలో ఉన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిగణించిన రైల్వే శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజమండ్రి మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను ఖరగ్ఫూర్, నాగపూర్ మీదుగా దారి మళ్లించారు. పలురైళ్ల దారి మళ్లింపు తుపాను ప్రభావంతో ఆదివారం రాజమండ్రి మీదుగా న డవాల్సిన పలు రైళ్లను నాగపూర్, ఖరగ్పూర్ల మీదుగా దారి మళ్లించారు. రాజమండ్రి మీదుగా నడవబోవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. 12863 హౌరా-యశ్వంతపూర్ ,18047 అమరావతి ఎక్స్ప్రెస్, 12839 హౌరా-చెన్నై (మెయిల్), 15902 డిబ్రుఘర్-యశ్వంతపూర్, 12704 ఫలక్నామా ఎక్స్ప్రెస్, 12703 ఫలక్నామా ఎక్స్ప్రెస్, 12245 దురంతో హౌరా-యశ్వంతపూర్,18645 హౌరా-హైదరాబాద్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. ప్రత్యేక కౌంటర్లు, హెల్ప్లైన్ ఏర్పాటు ఆదివారం ైరె ళ్ల రద్దు, దారి మళ్లింపు కార ణంగా ప్రయాణికులకు టికెట్ సొమ్ము తిరిగి చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రమణ్యశాస్త్రి తెలిపారు. 0883 -2420543, 0883 02420541,088302420790 ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఈమేరకు రాజమండ్రి రైల్వే స్టేషన్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పర్యాటక బోట్లు రద్దు తుఫాన్ హెచ్చరిక ల నేపథ్యంలో ఆదివారం పాపికొండలు తరలివెళ్లే పర్యాటక బోట్లు, లాంచీలను రద్దు చేయాలని బోటు యజమానులకు ముందుగానే ఆదేశాలు జారీ చేశామని ధవళేశ్వరం బోటు సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ తెలిపారు. తొలుత ఆదివారం మాత్రమే రద్దు చేశామని, తుపాను ప్రభావాన్ని బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ఆదివారం రద్దయిన రైళ్ల వివరాలు... 18463 భువనేశ్వర్ - బెంగుళూరు(ప్రశాంతి), 12845 భువనేశ్వర్ -యశ్వంతపూర్, 17015 భువనేశ్వర్-సికింద్రాబాద్ (విశాఖ ఎక్స్ప్రెస్), 18401 పూరి-వాకా(వాకా ఎక్స్ప్రెస్), 22871 తిరుపతి -భువనేశ్వర్, 17479 హౌరా-తిరుపతి, 11020 భువనేశ్వర్- ముంబయ్(కోనార్క్), 22859 పూరి-మద్రాస్, 12717 విశాఖపట్నం-విజయవాడ (రత్నాచల్ ఎక్స్ప్రెస్), 17488 తిరుపతి-విశాఖపట్నం (తిరుమల ఎక్స్ప్రెస్), 12861 విశాఖపట్నం -హజరత్ నిజాముద్దీన్ (లింక్ ఎక్స్ప్రెస్), 12727 విశాఖపట్నం-సికింద్రాబాద్ (గోదావరి), 08507 విశాఖ-సికింద్రాబాద్ (జనసాధారణ్), 11019 ముంబయ్-భువనేశ్వర్( కోనార్క్), 17480 తిరుపతి -హౌరా ఎక్సప్రెస్, 17016 సికింద్రాబాద్ -భువనేశ్వర్ (విశాఖ ఎక్స్ప్రెస్), 18464 బెంగళూరు -భువనేశ్వర్ (ప్రశాంతి), 12718 విజయవాడ-విశాఖపట్నం (రత్నాచల్ ఎక్స్ప్రెస్), 12740 సికింద్రాబాద్-విశాఖపట్నం (గరీభీరధ్), 12806 సికింద్రాబాద్ -విశాఖపట్నం (జన్మభూమి), 12861 నిజాముద్దీన్ -విశాఖపట్నం (లింక్ ఎక్స్ప్రెస్),22204 విశాఖ దురంతో ఎక్స్ప్రెస్, 18520 లోకమాన్య తిలక్-విశాఖ (ఎల్టీటీ ఎక్స్ప్రెస్), 17239 గుంటూరు - విశాఖపట్నం (సింహాద్రి ఎక్స్ప్రెస్), 17487 విశాఖపట్నం -తిరుపతి (తిరుమల ఎక్స్ప్రెస్), -
అంతటా అప్రమత్తం
తొమ్మిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు ప్రత్యేకాధికారుల నియామకం కలెక్టర్ రఘునందన్రావు వెల్లడి మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎం.రఘునందన్రావు శనివారం తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తుపాను పరిస్థితులను అంచనా వేసి రక్షణ చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్, బందరు ఆర్డీవో కార్యాలయంతోపాటు అన్ని ప్రభావిత మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా మండలాలకు నియమించిన ప్రత్యేకాధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తీరప్రాంతంలోని 53 పంచాయతీలు, వాటిలోని 130 శివారు గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 88,257 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉండి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే 78 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో బియ్యం, కిరోసిన్తో పాటు నిత్యావసర సరుకులను సిద్ధం చేశామని కలెక్టర్ వివరించారు. గ్రామ స్థాయిలో టీమ్లను ఏర్పాటు చేసి ఇన్చార్జ్లను నియమించామని, సెల్ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వారి నుంచి సమాచారం సేకరిస్తామన్నారు. తుపాను ప్రభావంతో గ్రామాల్లోకి నీరు చొచ్చుకురావటంతోపాటు పెనుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలితే వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహదారులు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను నింపామని, పారిశుద్ధ్య చర్యల కోసం బ్లీచింగ్ నిల్వ చేసినట్లు వివరించారు. హుదూద్ తుపాను తీరం దాటే వరకు సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉంటుందని, మంగినపూడి బీచ్, హంసలదీవి బీచ్లకు పర్యాటకులను అనుమతించబోమని ఆయన చెప్పారు. ఈ బీచ్ల వెంబడి పోలీసు గస్తీని ఏర్పాటు చేశామని తెలిపారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి రప్పించామని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. మచిలీపట్నంలో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక హుదూద్ ప్రభావం పెరగడంతో మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్ వద్ద శనివారం ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. గిలకలదిండి హార్బర్, మంగినపూడి బీచ్లలో చేపల వేటకు ఉపయోగించే బోట్లను నిలిపి ఉంచారు. తుపాను పరిస్థితులపై పోలీసులను అప్రమత్తం చేసేందుకు ఎస్పీ జి.విజయకుమార్ కృత్తివెన్ను తదితర గ్రామాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చేపలవేటకు ఉపయోగించే వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ అధికారులు అప్రమత్తం హుదూద్ తుపాను వల్ల తీవ్ర ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెప్పడంతో విజయవాడ నుంచి ఐదుగురు ఏఈలు, 50 మంది సిబ్బందిని విశాఖపట్నం పంపారు. అవసరమైతే సోమవారం ఉదయం మరికొందరిని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. తుపాను కారణంగా మచిలీపట్నంతోపాటు జిల్లాలోని తీరప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని, సామగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోహన్కృష్ణ ‘సాక్షి’ కి తెలిపారు. -
ఉరుముతోంది ఉప్పెనలా..
నేటి మధ్యాహ్నం విశాఖ వద్ద తీరం తాకనున్న హుదూద్ తుపాను విశాఖపట్నం: భీకర రూపుదాల్చిన హుదూద్ తుపాను విశాఖపట్నం దిశగా దూసుకొస్తోంది. ఇది శనివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా విశాఖపట్నం వైపు కదులుతోంది. ‘‘ఈ తుపాను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ ప్రాంతంలో తీరాన్ని తాకనుంది. దీని ప్రభావం ఉదయం నుంచే కనిపిస్తుంది. తుపాను తీరం తాకే వరకు గాలుల వేగం పెరుగుతూ ఉంటుంది. తీరాన్ని తాకే సమయంలోనూ, తాకిన తరువాత 12 గంటల పాటు తీవ్ర ప్రభావం కొనసాగుతుంది’’ అని విశాఖ, ఢిల్లీల్లోని వాతావరణ విభాగాల అధికారులు శనివారం వెల్లడించారు. తుపాను విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల పరిధిలో తీరందాట వచ్చని, తీరం దాటే లోగా అది దిశ మార్చుకునే అవకాశాలు పెద్దగా లేవని కూడా అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావముండే తీరం ప్రాంతాల నుంచి శనివారం రాత్రికి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం ఉదయానికి మరో లక్షన్నర మందిని తరలించనున్నారు. దక్షిణ ఒడిశాలో సైతం మూడున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు... తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో సాధారణ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచే గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అర్థరా త్రి దాటిన తరవాత వేగం గంటకు 100 నుంచి 140 కిలోమీటర్లకు చేరుకోవచ్చని చెప్తున్నారు. ఇక తుపాను తీరం దాటే సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు విధ్వంసం సృష్టించే అవకాశాలూ ఉన్నాయని అప్రమత్తం చేస్తున్నారు. తీరం దాటే ముందు ఇంకా బలపడితే?! తీరం దాటడానికి ముందే హుదూద్ తుపాను మరింత తీవ్రంగా మారి ప్రళయభీకరంగా విరుచుకుపడవచ్చని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, దక్షిణ ఒడిశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు సర్వత్రా మోహరించి నష్టనివారణ చర్యలను వేగవంతం చేస్తున్నాయి. తీరం నుంచి బలవంతంగా ప్రజల తరలింపు... ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో 312 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల నుంచి శనివారం సాయంత్రం వరకూ 1.30 లక్షల మందిని ఈ శిబిరాలకు తరలించారు. ఆదివారం ఉదయానికి మరో 1.50 లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొదట 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ తుపాను తీవ్రత అమాంతంగా పెరగడంతో అదనంగా మరో 32 శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో 130, తూర్పుగోదావరి జిల్లాలో 97, పశ్చిమగోదావరి జిల్లాలో 23 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఉత్తరాంధ్ర తీరంలో పలుచోట్ల సముద్రం గ్రామాల్లోకి చొచ్చుకువస్తున్నా ప్రజలు పునరావాస శిబిరాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఒకసారి పునరావాస శిబిరాలకు వెళ్లిన వారు మళ్లీ వెనక్కి వచ్చేస్తుండటంతో అధికారులకు సమస్యగా మారింది. విశాఖ మీదుగా రైళ్లు, విమానాలు, బస్సు సర్వీసులు రద్దు.. తుపాను నేపధ్యంలో హౌరా - చెన్నై 16వ నంబరు జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి ఇచ్ఛాపురం వరకు.. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకూ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. విశాపట్నం మీదుగా ప్రయాణించే అన్ని రైలు సర్వీసులనూ ఆదివారం రద్దు చేశారు. శుక్రవారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన 37 రైళ్లకు అదనంగా శనివా రం మరో 15 రైళ్లను కూడా రద్దు చేశారు. నాలుగు రైళ్లను దారిమళ్లించారు. విశాఖ, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణాల కోసం రిజర్వేషన్లు చేయిచుకున్న ప్రయాణికులు చాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటల తరువాత విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఆర్టీసీ అధికారులు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో దూరప్రాంతాలకు ప్రయాణించే బస్సు సర్వీసులను, తీరప్రాంతాల్లో పర్యటించే పల్లె వెలుగు బస్సులను, విశాఖ నగరంలో సిటీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. శనివారం సాయంత్రం నుంచి విశాఖపట్నం బీచ్ రోడ్డులో జనసంచారాన్ని నిషేధించారు. అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తీరంలోకి చొచ్చుకొస్తున్న సాగరం... తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలల ఉధృతికి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని గోడ కూలిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకొచ్చింది. విశాఖ జిల్లాలో పలు చోట్ల, విజయనగరం జిల్లా పూసపాటిరేగలలో సముద్రం 150 మీటర్లు ముందుకుచొచ్చుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట వద్ద సముద్రం సుమారు 70 మీటర్ల మేరకు ముందుకు చొచ్చుకువచ్చింది. బందరువానిపేట, గణగళ్లపేట, ఇద్దివానిపాలెం, డొంకూరు తదితర తీర గ్రామాల్లోనూ సముద్రం ముందుకు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడ తీరంలో జియో ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించిన రక్షణ గోడ దెబ్బతిని ఉప్పాడ గ్రామంలోకి సముద్ర నీరు పోటెత్తింది. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు... హుదూద్ తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో పదో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ఎనిమిదో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. కాకినాడ లంగరు రేవు నుంచి శుక్ర, శనివారాల్లో సరుకు ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. పోర్టులో బెర్త్లను ఖాళీ చేసి సుమారు ఎనిమిది నౌకలను తీరం నుంచి డీప్ సీ (సముద్రం మధ్యలోకి)కి తరలించి లంగరేశారు. ప్రైవేటు యాజమాన్యంలోని కాకినాడ డీప్ వాటర్ పోర్టులో మూడు నౌకలను శనివారం బెర్త్ల నుంచి ఖాళీచేసి సముద్రంలోకి పంపించేశారు. ఇదిలావుంటే.. తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపాలెం మండలానికి చెందిన 65 బోట్లు శనివారం రాత్రి కృష్ణాజిల్లా పల్లెపాలెం, పడతడిక గ్రామాలకు చేరుకున్నాయి. 10 రోజుల క్రితం సుమారు 700 మంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. హుదూద్ తుపాను ప్రభావంతో వీరు వెనుతిరిగారు. అయితే.. తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు వీలుకాక కృష్ణాజిల్లా పల్లెపాలెం, పడతడిక గ్రామాలకు చేరుకున్నారు. ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధం... తుపాను ప్రభావంతో కడలి కనివినీ ఎరుగని రీతిలో అల్లకల్లోలంగా మారనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధమయ్యా యి. తుపాను తీరందాటిన తరువాత దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు సన్నద్ధమయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణీలు, బాలిం తలు వెంటనే ఆసుపత్రుల్లో చేరాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు యాంటిబయటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, వ్యాక్సిన్లు, పాముకాటు మందులు, ఇతర మందులను పీహెచ్సీలలో సిద్ధంగా ఉంచారు. ఉన్నతాధికారులు, మంత్రుల పర్యవేక్షణ... తుపాను సన్నద్ధతపై ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్సేథ్, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వి. ఆర్.కృష్ణారావులు శనివారం విడివిడిగా వీడియో కాన్ఫరెన్సులతో అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అధికార యంత్రాంగం మొత్తం తుపాను నష్టనివారణ చర్యల్లో నిమగ్నమైంది. ఉదయం నుంచే పెను ప్రభావం - భారత వాతావరణ శాఖ డీజీ రాథోడ్ వెల్లడి న్యూఢిల్లీ: హుదుద్ తుపాను తీవ్రత, దాని ప్రభావం ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో కనిపించడం ప్రారంభమవుతుందని భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఎల్.ఎస్.రాథోడ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుపాను తీరం తాకే వరకు గాలుల వేగం పెరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ ప్రాంతంలో తీరాన్ని తాకనుంది. తీరాన్ని తాకిన తరువాత 12 గంటల పాటు ఈ ప్రభావం కనిపిస్తుంది. తీరాన్ని దాటిన తరువాత తుపాను వాయువ్య దిశగా కదులుతుంది. ఈ నెల 13 నుంచి 15 తేదీల మధ్య తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి’’ అని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలోని గంజాం, గజపతి, కోరాపుట్, రాయగడ, నవరంగ్పూర్, మల్కన్గిరి, కలహండి, పల్బనీ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో అతి భారీ నుంచి అంతకుమించి వర్షాలు కురుస్తాయి. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిశాలోని ఉత్తర కోస్తా ప్రాంతంలోనూ ఈ వర్షాలు కురుస్తాయి’’ అని రాథోడ్ చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు సిద్ధం తుపాను సమయంలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు మొత్తం 22 బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కేటాయించారు. విశాఖపట్నం జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి 6 బెటాలియన్లను కేటాయించారు. శనివారం ఒడిశా నుంచి మరో 6 బెటాలియన్లను రప్పిస్తున్నారు. శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 4 బెటాలియన్లు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. రెండు కంపెనీల ఆర్మీ జవాన్లు విశాఖపట్నం చేరుకున్నారు. నేవీ 4 హెలికాప్టర్లతో 4 నౌకలను సిద్ధంగా ఉంచింది. సరిపడా ఆహారం, మందులు, దుప్పట్లు ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు 2 ప్లాటూన్ల బలగాలతో పాటు 30 మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. గజ ఈతగాళ్లతో విశాఖ జిల్లాలో 12 బోట్లు, శ్రీకాకుళంలో 10 బోట్లు, విజయనగరం జిల్లాలో 2 బోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 8 బోట్లను సిద్ధం చేసింది. -
అమ్మో అక్టోబర్ !
ప్రస్తుతం ‘హుదూద్’ ముప్పు జిల్లాకు భారీ వర్ష సూచన ఆందోళనలో తీరప్రాంత వాసులు వేటకు విరామం ప్రకటించిన మత్స్యకారులు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ చల్లపల్లి : 2011 అక్టోబర్ 6న ‘జల్’.. 2012 అక్టోబర్ 31న ‘ నీలం’.. 2013 అక్టోబర్ 10న పైలీన్.. ఇలా మూడేళ్లు వరుసగా అక్టోబర్లో తుపాన్లు సంభవించాయి. జిల్లాకు తీవ్ర నష్టం కలిగించాయి. హుదూద్ తుపాను కూడా ఇదే నెలలో రావడంతో తీర ప్రాంతవాసులు అక్టోబర్ అంటేనే వణికిపోతున్నారు. అల్లకల్లోలంగా సముద్రం హుదూద్ పెను తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని తీర ప్రాంతాల్లో శనివారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణం కన్నా మూడు నుంచి ఐదడుగుల మేర ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. కోడూరు మండలంలోని సాగరసంగమం వద్ద ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు రానున్న ఉపద్రవానికి సంకేతాలని మత్స్యకారులు చెబుతున్నారు. విశాఖపట్నానికి సమీపంలో కేంద్రీకృతమైన హుదూద్ తీరం దాటే సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో గంటకు 150 నుంచి 170 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చేస్తున్న హెచ్చరికలు తీరప్రాంత వాసులను కలవర పెడుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు మూడు రోజుల క్రితమే వేటను నిలిపివేశారు. వేటకు ఉపయోగించే పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే కోడూరు, నాగాయలంక, మోపిదేవి, అవనిగడ్డ, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వారు ఇప్పటికే ఆయా మండలాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాను తీవ్రతను బట్టి కోడూరు మండలంలోని తీరప్రాంత గ్రామాలైన పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, రామకృష్ణాపురం, బసవానిపాలెం, చింతకోళ్ల, నాగాయలంక మండలంలోని గుల్లలమోద, ఎదురుమొండి దీవులు, ఈలచెట్లదిబ్బ, సొర్లగొంది, సంగమేశ్వరం ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. తుపాను వల్ల ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. -
అప్రమత్తం
* లోతట్టు ప్రాంతాలకు ముంపు భయం * పూరిళ్లు, నాసిరకం ఇళ్లు కూలిపోయే ప్రమాదం * నేడు గంటకు 50 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం * విద్యుత్ వ్యవస్థకూ నష్టం వాటిల్లే ఆస్కారం * ఇప్పటికే 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ తుపాను దూసుకొస్తోంది. ఇది పెను తుపానుగా మారి ఉప్పెనై విరుచుకుపడొచ్చన్న వాతావరణం శాఖ హెచ్చరికలు తీవ్ర భయాందోళన కల్గిస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. శుక్రవారం చింతపల్లి తదితర తీరప్రాంత గ్రామాల వద్ద సముద్రం కొంత ముందుకు చొచ్చుకు రావడంతో పాటు పెరిగిన గాలుల తీవ్రతతో మత్స్యకారులు వణికిపోతున్నారు. తుపాను తీరం దాటే సమయంలో విధ్వంసం సృష్టించి లోతట్టు ప్రాంతాలు ముంచెత్తే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాక చర్య లు చేపట్టడానికి జాతీయ విపత్తు నివారణ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. పోలీసులు బలగాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల్ని తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారికి అవసరమైన భోజన ఏర్పాట్లు చేశారు.శనివారం ఉదయం నుంచి గంటకు 50 కిలో మీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రానికి ఆ గాలుల వేగం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే మూడో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. పెనుగాలులు వీచి చెట్లు, విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగి, విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమా దం ఉంది. పూరిళ్లు, నాసిరకం నిర్మాణం గల నివాసాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికానున్నాయి. ఈ పరిస్థితుల్ని ముందే అంచనా వేస్తూ యంత్రాంగం తగు ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. తొమ్మిది మండలాలపై ప్రభావం తుపాను ప్రభావం ప్రధానంగా జిల్లాలోని తొమ్మిది మండలాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది . భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం, ఎస్కోట, బొండపల్లి, గుర్ల, పార్వతీపురం, కొమరాడ, జామి మండలాల్లో నష్టం వాటిల్లనుంది. భారీ వర్షాల కారణంగా కొన్ని మండలాల్లో, నాగావళి నది వరద నీటితో మరి కొన్ని మండలాలకు, పెనుగాలుల వల్ల తీర ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది. 42 లోతట్టు ప్రాంతాలు ఈ మండలాల్లోని దాదాపు 42 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. వీటిలో ముఖ్యంగా విజయనగరం రాజీవ్ నగర్ కాలనీ, బుచ్చన్నకోనేరు ఏరియా, భోగాపురం మండలంలోని ముక్కాం, చోడపల్లిపేట, చినకొండరాజుపాలెం, కొంగవానిపాలెం, చేపలకంచేరు, ఎర్ర ముసలయ్యపాలెం, పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, కొత్తూరు, పెద్దూరు, పులిగెడ్డ, తమ్మయ్యపాలెం, బర్రిపేట, నీలగెద్దపేట, ఎస్కోట మండలం చామలాపల్లి, ముషిడిపల్లి, గోపాలపల్లి, మామిడిపల్లి, వేములాపల్లి, జామి మండలం కొట్టాం, బొండపల్లి మండలం గరుడుబిల్లి, పార్వతీపురం మండలం వరహాలెగడ్డ, కొమరాడ మండలం కూనేరు, చోళ్లపదం లోతట్టు గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న పూసపాటిరేగ, భోగాపురం మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెనుగాలులు, సముద్రం కెరటాల తాకిడికి నష్టం జరిగే అవకాశమున్న లోతట్టు ప్రాంతాలైన 21గ్రామాల ప్రజల కోసం ఇప్పటికే 12పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భోగాపురం మండలంలో ఐదు, పూసపాటిరేగ మండలంలో ఏడు కేంద్రాలను సన్నద్ధం చేశారు. 24,337మందిని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కోనాడ బీజీపేటకు సంబంధించి కోనాడ ఉన్నత పాఠశాల, తుపాను షెల్టర్ వద్ద, తిప్పవలసకు సంబంధించి ఆ గ్రామ ఉన్నత పాఠశాల వద్ద, పులిగెడ్డకు సంబంధించి సమీపంలో తుపాను షెల్టర్ వద్ద, తమ్మయ్యపాలెం, బర్రిపేటకు సంబంధించి ఆ గ్రామాల్లో ఉన్న ఎంపీయూపీ స్కూల్లో, పెద్దూరు, బర్రిపేటకు సంబంధించి చింతపల్లి ఎంపీయూపీ స్కూల్లో, నీలగెద్దపేట, కొత్తూరుకు సంబంధించి చింతపల్లి తుపాను షెల్టర్ వద్ద పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముక్కాం, చినకొండరాజుపాలెంకు సంబంధించి పెద్ద కొండరాజుపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద, చేపలకంచేరు, దిబ్బపాలెంకు సంబంధించి కొంగవానిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద, ఎర్రముసలయ్యపాలెం, బోయపాలెంకు సంబంధించి కంచేరు ఉన్నత పాఠాశాల వద్ద పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అప్రమత్తమైన వివిధ శాఖలు భారీ వర్షాలకు జిల్లాలో 21 ఇరిగేషన్ చెరువులు, 44 రైల్వే ట్రాక్కు ఆనుకుని ఉన్న చెరువులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీని దృష్ట్యా ఇరిగేషన్ ఇంజి నీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క డీఈ, ఏఈలను ప్రత్యేక అధికారులగా నియమించారు. అలాగే తాగునీటికి ఇబ్బందిలేకుండా ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు మత్స్యకార గ్రామాల కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 10 ట్యాంకులను సిద్ధం చేస్తున్నారు. పెనుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయే ప్రమాదం ఉన్నందున ట్రాన్స్కో అధికారులు కొన్ని విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచుతున్నారు. వర్షాలకు అధ్వాన్నంగా తయారయ్యే ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడమే కాకుండా క్లోరినేషన్ చేసి తాగునీరును అందించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర సరుకులను సరఫరా చేసేలా పౌర సరఫరా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లు కోతకు గురైన చోట ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు రోప్లు, ఇసుకబ్యాగులు, జేసీబీలను ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు, సందర్బోచిత వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యులు, సిబ్బందినందరినీ విధుల్లో ఉండాలని ఇప్పటికే ఆదేశించారు. తగు మందులు సిద్ధం చేశారు. తుపాను నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు * పూరిళ్లలో ఉండకూడదు. * పెనుగాలులు దృష్ట్యా రాకపోకలు మానుకోవాలి. * ప్రయాణాలు చేయకూడదు. * లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. * సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి * నాలుగైదు రోజులకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. * అధికారుల సూచనలు, సలహాలను పాటించాలి. * సీజనల్ వ్యాధులకు తగ్గట్టుగా మందులను ఉంచుకోవాలి. * ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడే విధంగా వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలి. -
పదేళ్లలో తుపాన్లు.. నష్టాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గత పదేళ్లలో ఏడు తుపాన్లు జిల్లాపై దాడి చేశాయి. వీటిలో నాలుగు అక్టోబర్ నెలలోనే సంభవించి తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్లో విరుచుకుపడిన పై-లీన్ తుపాను సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టాల్లో ముంచెత్తింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు అంతే తీవ్రస్థాయిలో హుదూద్ తుపాను హడలుగొడుతోంది. 2003 నుంచి సంభవించిన తుపాన్లు, వాటిల్లిన నష్టాన్ని పరిశీలిస్తే... * 2003 అక్టోబర్ 6,7 తేదీల్లో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల 51 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సుమారు 25వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. * 2004 అక్టోబరు 3, 4, 5 తేదీల్లో కురిసిన తుపాను వర్షాలకు 2,900 హెక్టార్లలో పంటలు పోయాయి. సుమారు 20 వేల మందిప్రజలు అవస్థలపాలయ్యారు. * 2005 సెప్టెంబరు 18,19 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో 15వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. సుమారు 40 వేల మంది ప్రజలు నష్టపోయారు. * 2010 డిసెంబర్ 5-8 తేదీల మధ్య దాడి చేసిన జల్ తుఫాన్ అపార నష్టం మిగిల్చింది. సుమారు 3 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపింది. 1.60 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పూరిళ్లు, కొన్ని చోట్ల పక్కా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు వందల కోట్ల నష్టం వాటిల్లింది. * 2011 అక్టోబరులో సంభవించిన నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. రెండేళ్ల క్రితం నాటి జల్ తుఫాన్తో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జిల్లా రైతాంగాన్ని ఇది మరింత కుంగదీసింది. * 2012 సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు లైలా తుఫాన్ దాడి చేసింది. దీని ఫలితంగా 3 లక్షల మంది ప్రభావితం కాగా 28వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. నలుగురు చనిపోగా, 24 పశువులు కూడా మృతి చెందాయి. వందల సంఖ్యలో పూరిళ్లు కూలిపోయాయి. సమాచార వ్యవస్థ, విద్యుత్, రోడ్లులకు భారీ ఎత్తున వందల కోట్లలో నష్టం సంభవించింది. * 2013 అక్టోబర్ 12న సంభవించిన పెను తుపాను పై-లీన్, అనంతరం కురిసిన భారీ వర్షాలకు ఉద్యాన, ఆహార పంటలు ఊడ్చుకుపోయాయి. సుమారు వెయ్యి కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. -
ముంచుకొస్తున్న ముప్పు!
మరో 12 గంటల్లో పెను తుపానుగా మారనున్న హుదూద్ విశాఖపట్నం/న్యూఢిల్లీ : పెనువేగంతో వస్తున్న హుదూద్ తుపానుతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. బంగాళాఖాతంలో అండమాన్లోని పోర్ట్బ్లెయిర్ వద్ద ఏర్పడిన హుదూద్ తుపాను క్రమంగా తీవ్రరూపు దాల్చి విశాఖపట్నంవైపు దూసుకువస్తోంది. మరో 12 గంటల్లో పెను తుపానుగా మారనుంది. బుధవారం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాను ఏమాత్రం దిశ మార్చుకోకుండా స్థిరంగా కదులుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయ దిశగా 675 కి.మీ. దూరంలో, ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ పెను తుపాను ఆదివారం మధ్యాహ్నానికి విశాఖపట్నం సమీపంలో తీరాన్ని తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. హుదూద్ ప్రభావంతో ప్రస్తుతం బంగాళాఖాతంలో గంటకు 60-70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది సముద్ర తీరం సమీపానికి వస్తున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, పెను గాలుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (6.5 సెంటీమీటర్ల నుంచి 12.4 సెం.మీ.), అతి భారీ వర్షాలు (12.5 సెం.మీ. నుంచి 24.4 సెం.మీ.) కురుస్తాయని తెలిపింది. ఒడిశాలోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో 24.5 సెం.మీ.కంటే ఎక్కువగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదివారానికి గాలుల తీవ్రత విపరీతంగా పెరుగుతుందని తెలిపింది. ఆదివారం 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీవ్రత ఒక్కసారిగా పెరిగి గంటకు 180 కి.మీ. వేగంతో పెనుగాలులు విరుచుకుపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు 2 మీటర్ల ఎత్తున ఎగసిపడవచ్చు. ఈ తుపానుకు కచ్చా ఇళ్లు కూడా దెబ్బ తినే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్తు, సమాచార వ్యవస్థ దెబ్బ తినే అవకాశముందని తెలిపింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశముందని చెప్పింది. గాలి దుమారం, వరదల ప్రమాదం ఉందని హెచ్చరించింది. హుదూద్ పరిధి 600 కి.మీ. వరకు ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఆ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుదూద్ ముప్పును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. తీరప్రాంతంలోని మండలాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 11 మండలాల పరిధిలోని 50 గ్రామాలకు ముప్పు ఉందని గుర్తించారు. శుక్రవారం ఈ గ్రామాలకు చెందిన 76 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించాలని నిర్ణయించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరూ 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను సహాయక చర్యలపై చర్చించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కూడా విశాఖలో అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. డిస్కంలు కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాయి. మరోపక్క.. ముందస్తు, సహాయక చర్యలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తోంది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ సేథ్ గురువారం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) 5 వేల మందితో కూడిన ఐదు బెటాలియన్లను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్లలోని ఈ ఐదు ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లలోని 51 బృందాలను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నంలకు రెండేసి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు ఒక్కో బృందాన్ని పంపారు. ఒడిశాకు 9 బృందాలను పంపనున్నారు. ఒడిశాలోని గంజం జిల్లాలో మూడు, ఖుర్దాలో రెండు, గజపతి, కటక్, పూరి, బాలేశ్వర్ జిల్లాల్లో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయించింది. పాట్నా, కోల్కతా, చెన్నైల నుంచి నాలుగేసి చొప్పున బెటాలియన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు బయల్దేరాయి. తుపాను సమయంలో వరదల నుంచి బాధితులని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 54 మంది గజ ఈతగాళ్లను, 162 పడవలను అత్యాధునిక పరికరాలతో పంపనున్నారు. మిలటరీకి చెందిన 4 బెటాలియన్లు కూడా రాష్ట్రానికి రానున్నాయి. నేవీ కూడా 30 బోట్లను, సిబ్బందిని సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు 14 శాటిలైట్ ఫోన్లను సమకూర్చింది. కాగా, తుపాను నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల వినియోగదారుల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూంలలో నిరంతరం అందుబాటులో ఉండే మానిటరింగ్ సెల్లు ఏర్పాటు చేశారు. -
హుదూద్..ఎలర్ట్
తరుముకొస్తున్న తుపానుపై అప్రమత్తం తీర మండలాలకు ప్రత్యేకాధికారులు 50 గ్రామాల తరలింపునకు సన్నాహాలు పునరావాస కేంద్రాల ఏర్పాటు రంగంలోకి భద్రతా దళాలు విశాఖ రూరల్ : హుదూద్ తుపానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపడుతోంది. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ ఇతర సహాయక బృందాలను రంగంలోకి దింపుతోంది. కలెక్టరేట్లో 1800-4250-0002 టోల్ఫ్రీ నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరంలోని 11 మండలాల్లో పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లాలో పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ను ప్రభుత్వం నియమించింది. తుపాను ఈ నెల 12న జిల్లా తీరాన్ని తాకవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 11న 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండగా తీరం దాటేరోజున 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 50 గ్రామాలు తరలింపునకు చర్యలు : తుపాను నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాలుగా గుర్తించిన 50 గ్రామాలను తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి 76 వేల మందిని 125 పునరావాస కేంద్రాలకు తరలించడానికి సన్నాహా లు చేస్తున్నారు. తుపాను తీరానికి సమీపించే సమ యం నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో 11వ తేదీ ఉదయం నుంచి లోతట్టు గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించాలని నిర్ణయించారు. సహాయక చర్యలకు భద్రతా దళాలు జిల్లాకు భద్రతా దళాలు చేరుకోనున్నాయి. నాలుగు మిలటరీ దళాలను కేంద్ర ప్రభుత్వం పంపిస్తోంది. నేవీ బృందాలతో పాటు 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు జిల్లాకు పంపిస్తున్నారు. ఒక్కో బృందంలో 40 మంది సభ్యులు ఉండనున్నారు. రెండు టీమ్లు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వాటిలో రెండింటిని పట్టణ ప్రాంతంలోను, ఒకటి అనకాపల్లి, మరొకటి యలమంచిలి ప్రాంతాలకు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే నేవల్ అధికారులు 30 బోట్లను సిద్ధం చేశారు. అవసరం మేరకు ఈ బోట్లను మండలాలకు పంపించాలని భావిస్తున్నారు. భారీ వర్షాలు కారణంగా సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వం జిల్లాకు 14 శాటిలైట్ ఫోన్స్ పంపించింది. అత్యవసర పరిస్థితులకు హెలీకాఫ్టర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు ఫైర్మెన్ బృందాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొననున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. అధికారులు తీర ప్రాంత గ్రామాలను సందర్శించి వేటకు వెళ్లిన వారిని వెనక్కు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంత మంది వేటలో ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. మరబోట్ల యజమానులు, వారి బోట్లు శుక్రవారం షిపింగ్ హార్బర్కు చేరేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. హెచ్చరికల కోసం ఎస్ఎంఎస్లు తుపానుపై లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు అధికారులు మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు(ఎస్ఎంఎస్)లు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ వినియోగదారులకు మెసేజ్లు పంపుతామని ఆ సంస్థలు అంగీకరించాయి. ప్రజలు సహకరించాలి జిల్లాలో ముంపు ప్రభావిత ప్రాంతాలుగా 50 గ్రామాలను గుర్తించాం. అక్కడి ప్రజలను 125 పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చేపడుతున్న ఈ తరలింపునకు ప్రజలు సహకరించాలి. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. పశువులను కట్టకుండా విడిచిపెట్టాలి. జిల్లా అధికారుల సూచనలు పాటించాలి. - జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్