Immunity
-
World Cancer Day: గట్ బయోమ్లాగే... క్యాన్సర్ బయోమ్ ట్యూమరమ్మతు
మానవుల జీర్ణవ్యవస్థ (గట్) లో ప్రతి చదరపు సెంటీమీటరుకు కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. మనిషి దేహం మొత్తంలో 30 ట్రిలియన్ కణాలుంటాయని అంచనా వేస్తే గట్లో నివాసముండే సూక్ష్మజీవుల సంఖ్య 38 ట్రిలియన్లు! ఈ సూక్ష్మజీవుల సముదాయాన్ని డాక్టర్లు ‘మైక్రోబియమ్’ గా చెబుతుంటారు. ఈ సూక్ష్మ జీవజాలపు సమతౌల్యతే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సమర్థంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మానవుల మూడ్స్ను సైతం ఈ మైక్రోబయోమ్ ప్రభావితం చేస్తుంది. అలాంటి సూక్ష్మజీవుల సముదాయమే క్యాన్సర్ గడ్డ (ట్యూమర్)లోనూ ఉంటుందని తెలుసుకున్నారు పరిశోధకులు. గట్లో ఉండేవి ‘గట్ బయోమ్’ అయితే ట్యూమర్లో ఉండేవి ‘ట్యూమర్ బయోమ్’!! ట్యూమర్ పెరుగుదలనూ, చికిత్స సమయంలో ట్యూమర్ ప్రతిస్పందించే తీరునూ ఈ ‘ట్యూమర్ బయోమ్’ ప్రభావితం చేస్తుంది. నేడు (ఫిబ్రవరి 4న) ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా చికిత్సతో పాటు అనేక అంశాలను ప్రభావితం చేసే ఈ ‘ట్యూమర్ సూక్ష్మక్రిముల’ గురించి తెలుసుకుందాం.ఆరోగ్య స్పృహ ఉన్న వర్గాల్లో గట్ బయోమ్ గురించి బాగానే తెలుసు. కానీ అదే తరహాలో క్యాన్సర్ గడ్డలోనూ సూక్ష్మజీవుల సముదాయాలుంటాయన్న విషయం చాలామందికి పెద్దగా తెలియకపోయినప్పటికీ ఇది వాస్తవం. నిజానికి ఈ ‘బయోమ్’ ఎంత ప్రభావశీలమైనదంటే... క్యాన్సర్ కణం ఎలా ప్రవర్తించాలన్న అంశాన్నీ ఇది ప్రభావితం చేస్తుంది. ట్యూమర్ ఇన్ఫ్లమేషన్ను ఇది పెంచనూవచ్చు, తగ్గించనూవచ్చు.జెనెటిక్స్తో మరింత తోడ్పాటు... ట్యూమర్ మైక్రోబయోమ్ సహాయంతో క్యాన్సర్ చికిత్సలను మరింత ప్రభావవంతంగా అందించడానికి జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) మంచి తోడ్పాటును అందిస్తుంది. జన్యుశాస్త్ర సహాయంతో ట్యూమర్లోని మైక్రోబయోమ్ మనకు అనుకూలంగా పనిచేస్తోందా లేక ప్రతికూలంగా ఉందా, దాని బట్టి ఎలాంటి చికిత్స అందిస్తే మంచి ఫలితాలొస్తాయి వంటి అంశాలను అధ్యయనం చేస్తూ, మైక్రోబయోమ్నూ జెనెటిక్ ప్రోఫైలింగ్నూ సమన్వయం చేసుకోవడం వల్ల మరింత ప్రభావవంతమైన చికిత్సను అందించవచ్చు. ఇలా చేయడం వల్ల వచ్చే ఫలితాలూ అద్భుతంగా ఉంటాయి. అక్కడి సూక్ష్మజీవుల జన్యుపటలాల అధ్యయన విశ్లేషణలతో అవెలా మనుగడ సాగిస్తున్నాయీ, వాటిని ఎదుర్కొనేలా బాధితులకు సరిగ్గా సరిపడేలా వ్యక్తిగతమైన మందుల రూపకల్పన ఎలా అన్న విషయాలను తెలుసుకోవచ్చు. దాంతో క్యాన్సర్ చికిత్సలను మరింత సమర్థంగా జరిగేలా చూడవచ్చు. ఫలితంగా బాధితుల్లో వ్యాధిని పూర్తిగా నయం చేయడానికీ, వారు కోలుకుని మంచి నాణ్యమైన జీవితాన్ని అనుభవించడానికీ ఈ అధ్యయనాలు తోడ్పడతాయి.జీవక్రియలు ఓ సింఫనీ అనుకుంటే... జీవనశైలీ, ఆహారాలతో ప్రయోజనాలివి... మానవ జీవితంలోని జీవక్రియలను ఓ సింఫనీతో పోల్చవచ్చు. సింఫనీ అంటే అనేక మంది గాయకులు ఒకే స్వరంతో స్వరం కలిపి ఒకే లయలో పాడటం. అప్పుడు ఓ అద్భుత సంగీతం (మెలొడీ) ఆవిష్కృతమవుతుంది. ఇందులో కణాలన్నీ మంచి గాయకులనుకుంటే మంచి మైక్రోబియమంతా లయాత్మకంగా వాద్యాలను వాయించే అద్భుత సంగీతకారులు (మ్యూజీషియన్స్). అప్పుడు వినిపించేదంతా హాయినిగొలిపే ‘ఆరోగ్య’కరమైన సంగీతం. ఈ హెల్దీ సంగీత లహరి అలా హాయిగా సాగిపోతుండగా మనం తీసుకునే అనారోగ్యకరమైన, పోషకరహితమైన ఆహారం కారణంగా వినిపించే కొన్ని అనారోగ్యల అపస్వరాల ఆలాపాల వల్ల కలిగే అనర్థాలు! ఇక ఈ పోలికలో ట్యూమర్ అనేది చక్కగా సాగే సింఫనీని చెడగొట్టేలా అన్నీ అపస్వరాలతో గట్టిగా గానాన్ని వినిపించే సోలో గాయకుడూ, అలాగే ‘ట్యూమర్’లోనూ ఉన్న మైక్రో బయోమ్ కూడా వినిపించే అందరూ సమన్వయంతో పాడుతుండగా వినిపించే ఈ అపస్వరాల అనారోగ్యం కర్ణ కఠోరంగా వినిపించే ‘రుగ్మత’.ఇలాంటి సమయాల్లో మనం తీసుకునే పోషకాలతో కూడిన మంచి ఆహారంలోని ఫైబర్ పుష్కలంగా ఉండే న్యూట్రిషన్, ప్రొబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లూ ఇవన్నీ ఆ అపస్వరాలను అధిగమిస్తూ, వాటిని కప్పేస్తూ గట్టిగా వినిపించే సుస్వరాలు. అనుసరించే అద్భుతారోగ్యకరమైన జీవనశైలి (లైఫ్స్టైల్) కూడా అదనంగా వినిపిస్తుండే ఆర్కెస్ట్రైజేషన్! ఇలా చేస్తున్నప్పుడు సమన్వయంతో సాగే సింఫనీలో పూర్తిగా అపస్వరాలే పైచేయి సాధించకుండా కనీసం వాటిని కప్పేస్తూ తప్పులను దొర్లనివ్వకుండా, దొరకనివ్వకుండా చేసే ‘కోకఫోనీ’! అంటే... ఈ పోలికను క్యాన్సర్ జబ్బుతో అన్వయించినప్పుడు... మంచి చికిత్స, మంచి ఆహారం, మంచి లైఫ్స్టైల్తో జబ్బు మరింత పెరగదు. అనర్థాలు కనిపించవు. అపస్వరాలను డామినేట్ చేసేలా చికిత్స, ఆహారనియమాలూ, జీవనశైలి సాగితే క్రమంగా అపస్వరాలే వినిపించనివ్వకుండా చేసేలా మనకు మేలు చేసే మంచి మైక్రోబియమ్ పెరుగుతుంది. ఆ చెడు మైక్రోబియమ్ను అది డామినేట్ చేసి మరీ చికిత్సతో క్యాన్సర్ నయం చేయడానికి సహాయపడుతుందని ఈ పోలిక చెబుతోంది. ఈ ఏడాది థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వచ్చే రెండేళ్ల పాటు (అంటే 2025 నుంచి 2027 వరకు) అమల్లో ఉండే ‘థీమ్’... ‘యునైటెడ్ బై యునీక్’! ప్రతి క్యాన్సర్ బాధితుడూ ఓ ప్రత్యేక వ్యక్తి. ఈ బయోమ్ కారణంగా అతడిలోని జబ్బు అతడికే ప్రత్యేకం. అందుకే ఒక వ్యక్తిలో క్యాన్సర్ ప్రవర్తించే తీరును బట్టి వ్యక్తిగతంగా అతడికే ప్రత్యేకమైన మందుల రూపకల్పనకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఎంతోమంది ప్రత్యేక వ్యక్తులంతా ఐక్యంగా కలిసి క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలన్నదే ఈ థీమ్ అర్థం. తెలుగులో చెప్పుకోవాలంటే... ఇది ‘ప్రత్యేకుల ఐక్యత’! అంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వాలన్నీ ఏకమై క్యాన్సర్ను తుదముట్టించేందుకు ప్రయత్నించాలంటూ ఈ ప్రత్యేకమైన థీమ్ పిలుపునిస్తోంది. కొన్ని ట్యూమర్ బయోమ్తో సమర్థమైన ఇమ్యూనో చికిత్స సాధ్యం...క్యాన్సర్కు అందించే చికిత్సల్లో కీమో, రేడియేషన్, శస్త్రచికిత్సలతో పాటు ఇమ్యూనో థెరపీ అన్నది కూడా ఓ ప్రభావవంతమైన చికిత్స. ప్రతి వ్యక్తిలో ప్రతిరోజూ 200 నుంచి 1000 క్యాన్సర్ కణాలు పుడుతుంటాయి. మనందరిలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) వాటిని తుదముట్టిస్తుంది. ఆ వ్యవస్థ విఫలమైనప్పుడు అలా తుదముట్టించే ప్రక్రియలో ఒక్క క్యాన్సర్ కణమైనా తప్పించుకుని బతికితే అప్పుడు బాధితులకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఈ ఇమ్యూనో థెరపీలో బాధితుల వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తారు. ఫలితంగా క్యాన్సర్ రాకముందు వ్యాధినిరోధక వ్యవస్థ రోజూ పుట్టే క్యాన్సర్ కణాలను మట్టుబెట్టే ప్రక్రియే ఈ ఇమ్యూనోథెరపీలోనూ జరుగుతుంది. ఈ థెరపీ సమయంలో క్యాన్సర్ ట్యూమర్లోనూ, ఆ పరిసరాల్లోనూ ఉండే సూక్ష్మజీవుల సముదాయం మానవులకు మేలు చేసేదైతే ఈ చికిత్సకు ఆ బయోమ్ మరింత దోహదపడి ట్యూమర్ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.ట్యూమర్కు కీడు చేసే బయోమ్తో బాధితుడికి మేలు...గట్ బ్యాక్టీరియమ్లో మేలు చేసేవి ఎక్కువగా ఉన్నప్పుడు అవి మంచి ఆరోగ్యాన్నిస్తూ, చెడు బయోమ్ పెరిగినప్పుడు ఆరోగ్యం చెడిపోయినట్టే... క్యాన్సర్ ట్యూమర్లోనూ... ఆ గడ్డకు సహాయం చేసే బయోమ్ పెరిగితే అది చికిత్సను అడ్డుకుంటుంది. ట్రీట్మెంట్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే... ఇక దానికి చేటు చేసే బయోమ్ పెరిగినప్పుడు... ఆ సూక్ష్మజీవుల సముదాయం క్యాన్సర్ గడ్డ పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. ట్యూమర్ చుట్టూ అలాంటి బయోమ్ ఉన్నప్పుడు పేషెంట్స్కు అందించే చికిత్సకు... ముఖ్యంగా ‘కీమో’ చికిత్సకు బాధితులు సానుకూలంగా స్పందిస్తుంటారు. అలా ట్యూమర్ మైక్రోబయోమ్కూ క్యాన్సర్ చికిత్సకూ మధ్య పరస్పరం ప్రతిస్పందనలు కొనసాగుతుంటాయి.క్యాన్సర్ ‘ఏ టు జడ్’ స్క్రీనింగ్స్ ఇలా! చాప కింది నీరులా వ్యాపిస్తున్నప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. అయితే క్యాన్సర్ను వీలైనంత త్వరగా అంటే... దాని నాలుగు దశల్లో... మొదటి లేదా రెండోదశలోనైనా కనుక్కోగలిగితే క్యాన్సర్ను నయం చేసుకోవడం కష్టమేం కాదు. అయితే క్యాన్సర్స్ను ముందుగానే గుర్తించడమెలా, మహిళలకూ, పురుషులకూ లేదా ఈ ఇద్దరిలోనూ వచ్చే సాధారణ క్యాన్సర్లేమిటి... ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోడానికి ఉపయోగపడే ప్రత్యేక కథనాన్ని సాక్షి హెల్త్ ప్లస్లో చూడవచ్చు.ట్యూమర్ బయోమ్తో ఉపయోగాలు→ ఈ బయోమ్ కనుగొనడంతో క్యాన్సర్కు మరింత సమర్థమైన చికిత్సలు సాధ్యం → మైక్రోబయోమ్ ప్రతిస్పందనలకు అనుగుణంగా కొత్త మందుల రూపకల్పన→ జన్యుశాస్త్ర, బయోమ్ల సమన్వయాలతో సరికొత్త థెరపీలు కనుగొనే వీలుడా‘‘ ఏవీఎస్ సురేశ్,సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ -
వైరస్ల పనిపట్టే కృత్రిమ ప్రోటీన్.. పరిశోధకుల కీలక విజయం
పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్లాల్నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్యూ సైంటిస్టులు హెచ్ఎస్పీ70 అనే మానవ ప్రోటీన్ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్ఎస్పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్ఎస్పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది. వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్ఎస్పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది. హీట్షాక్ ప్రోటీన్ హీట్షాక్ ప్రోటీన్కి పొట్టిరూపమే హెచ్ఎస్పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్ఎస్పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్ఎస్పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్ఎస్పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్ఎస్పీను నిలువరించడం ద్వారా వైరస్ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.‘‘హెచ్ఎస్పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్లపై దాడిచేస్తాయి. కానీ వైరస్లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ని కరిగించే బెడ్టైమ్ 'టీ'..!ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది. -
వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!
ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. వాయు కాలుష్యం అంతకంతకు తీవ్రమై దేశరాజధాని ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలను అల్లాడిపోయేలా చేస్తుంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంది. ముఖ్యంగా ఈ పొగమంచు కారణంగా పిల్లలు, పెద్దలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీని కారణంగా ప్రజలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటి సమస్యల నుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ షాట్ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదేంటో, ఎలా తయారు చేయాలో సవివరంగా తెలుసుకుందామా..!.సీనియర్ సిటీజన్లు, చిన్నారులు వాయు కాలుష్యంతో ప్రభావితం కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూనిటీ బూస్టింగ్ షాట్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనికోసం అల్లం, నారింజ, ఉసిరిలతో చేసిన పానీయాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తెలిపారు. తయారీ విధానం..పెద్ద అల్లం ముక్కను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.నారింజ, గింజతో సహా ఉసిరికాయలను తీసుకోండిఈ మూడింటిని మొత్తగా గ్రైండ్ చేసి వడకట్టండిదీన్ని ఐస్ ట్రైలో వేసి స్టోర్ చేసుకోండికావాల్సినప్పుడూ ఈ ఐస్క్యూబ్ని గ్లాస్లో వేసుకుని కొద్దిగా వేడినీరు జోడించండి. దీన్ని రోజు తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి వృద్ధి అవ్వడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Palak Nagpal - Clinical Nutritionist (@nutritionwithpalaknagpal) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వ్యైద్యులను సంప్రదించడం మంచిది.(చదవండి: నోరూరించే కేఎఫ్సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
మార్కెట్లో దండిగా ఉసిరి : ఇలా ట్రై చేస్తే.. ఆరోగ్యసిరి!
ఇంట్లో ఉసిరి ఉంటే... ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అందుకే ఉసిరిని ఆరోగ్యసిరి అంటాం. హైబీపీ ఉంటే ఒక డ్రింక్ తాగుదాం.డయాబెటిక్ అయితే మరో డ్రింక్. ఎనిమిక్గా ఉంటే తియ్యటి క్యాండీ. రోజుకో ఉసిరి కాయ తింటే చాలు...గట్ హెల్త్ గట్టిగా ఉంటుంది.ఆమ్లా జ్యూస్ కావలసినవి: ఉసిరి కాయలు: నాలుగు; అల్లం– అంగుళం ముక్క; నిమ్మరసం – టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; నీరు – 200 ఎంఎల్తయారీ: ∙గింజలు తొలగించి ఉసిరి కాయలను ముక్కలుగా తరగాలి అల్లం తొక్కు తీసి ముక్కలు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙నీరు కలిపి మరొకసారి తిప్పి గ్లాసులో పోయాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. ఇది డయాబెటిస్కి దివ్యమైన ఔషథం.ఆమ్లా కాండీ కావలసినవి: ఉసిరికాయలు– పావుకేజీ; చక్కెర– 150 గ్రాములు; జీలకర్ర ΄ పొడి– టీ స్పూన్; అల్లం తరుగు– టీ స్పూన్; చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు.తయారీ: ∙ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి నీటిని మరిగించి అందులో ఉసిరికాయలను వేసి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేయాలి వేడి తగ్గిన తర్వాత ఉసిరికాయలను ముక్కలుగా తరగాలి, గింజలు తీసేయాలి. ఆ ముక్కల మీద జీలకర్ర పొడి, చక్కెర కలిపి పాత్రకు మూత పెట్టి ఆ రోజంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి రోజుకి చక్కెర కరిగి నీరుగా మారుతుంది. మూడవ రోజుకు ఆ నీటిని ముక్కలు చాలా వరకు పీల్చుకుంటాయి. మరో రెండు రోజులు ఎండబెట్టాలి. ఐదవ రోజుకు ముక్కలు చక్కెర నీటిని పూర్తిగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కూడా ముక్కలను తాకినప్పుడు కొంత తేమగా అనిపిస్తుంది. ఉసిరి ముక్కల మీద చక్కెర పొడిని చల్లాలి. వాటిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుని రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు తినాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. హనీ ఆమ్లా డ్రింక్ ఒక గ్లాసు డ్రింక్కి టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. కావలసినవి: ఉసిరికాయలు– నాలుగు; గోరువెచ్చటి నీరు– 200 మి.లీ; పుదీన ఆకులు– నాలుగు; తేనె – టీ స్పూన్.తయారీ: ∙ఉసిరికాయ ముక్కలు, పుదీన ఆకులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చటి నీటిని కలపాలి. అందులో తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది హైబీపీ ఉన్న వాళ్లకు మంచిది. గమనిక: ఉసిరి కాయల డ్రింకులు చేసుకోవడానికి తాజా కాయలు అందుబాటులో లేకపోతే ఆమ్ల పౌడర్ తీసుకోవచ్చు. -
సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!
ఇటీవల చాలామందికి డాక్టర్లు అత్యంత ఖరీదైన బయాటిక్స్ ప్రిస్క్రయిబ్ చేస్తుండటం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. జీర్ణవ్యవస్థ పొడవునా ఉంటూ మనకు మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. అవి ఉండటం వల్లనే వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అందుకే పెరుగు తినడం అన్నివిధాలా ఆరోగ్యానికి మేలు చేసే విషయం మాత్రమే కాదు... ఎన్నో రకాల వ్యాధులను దూరంగా ఉంచేందుకు ఓ సమర్థమైన మార్గం కూడా. పెరుగుతో ఉండే ప్రయోజనాలు చూద్దాం. జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సంఖ్యలో ఉండే బ్యార్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూడటం మాత్రమే కాకుండా... కడుపులో మంటను తగ్గిస్తాయి. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ టాబ్లెట్ తీసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది నేచురల్గా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. ∙చర్మంలో తేమ ఎల్లప్పుడూ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందన్నది ఆహార నిపుణుల మాట. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్త΄ోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో ΄ోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సెంటిఫిక్ సెషన్స్లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మహిళల్లో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్న మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. (చదవండి: -
ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఇలా చేయండి
ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి ఎక్కువగా దృష్టిపెట్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అసలు ఎందుకిలా అయ్యింది? ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ప్రతిరోజు మనకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెడితే లక్షలకు లక్షలు ఆసుపత్రులకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో కొన్ని తెలుసుకుందాం.. హెల్త్ టిప్స్ తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్లు సమృద్ధిగా ఉండటం వల్ల నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే ఒంటికి వెంటనే శక్తి వస్తుంది. సోయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్ని శరీరం బాగా గ్రహిస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. -
మామూలు అరటిపండు కాదు.. ‘సూపర్ బనానా’.. ప్రపంచంలో ఇదే తొలిసారి
‘రోజుకో యాపిల్.. డాక్టర్ను దూరం పెడుతుంద’ని ఓ సామెత ఉంది. అది సీజనల్. రేటు కూడా కాస్త ఎక్కువే. అదే సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది అరటి పండు. ధర కూడా తక్కువే. మరి యాపిల్లా అరటిపండుతోనూ బోలెడన్ని పోషకాలు అందితే.. తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యం సొంతం. ఈ ఆలోచనతోనే ఉగాండా, ఆ్రస్టేలియా శాస్త్రవేత్తలు బిల్గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సూపర్ బనానా’ను రూపొందించారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. కోట్ల మందికి ప్రయోజనం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, కంటి చూపు దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి లేక రోగాల పాలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే విటమిన్ ఏ, ఇతర పోషకాలు అధికంగా ఉండే సూపర్ బనానాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బనానా21 ప్రాజెక్టు పేరిట.. జన్యు మార్పిడితో.. ♦ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు చెందినఫౌండేషన్ ఆర్థిక సాయం, ఆ్రస్టేలియా వ్యవసాయ శాస్త్రవేత్త జేమ్స్ డేల్ సహకారంతో ఉగాండా జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు ‘సూపర్ బనానా’పై 2005లో పరిశోధన చేపట్టారు. ♦ అత్యవసర పోషకాలన్నీ ఉండటంతోపాటు తెగుళ్లు, ఫంగస్లను తట్టుకోవడం, కరువు ప్రాంతాల్లోనూ పండించగలిగేలా నీటి ఎద్దడిని తట్టుకోగలగడం వంటి లక్షణాలు ఉండేలా అరటిని అభివృద్ధి చేశారు. ♦ జన్యు మార్పిడి విధానంలో సుమారు 18 ఏళ్లపరిశోధన తర్వాత.. విటమిన్ ఏ సహా అత్యవసర పోషకాలన్నీ ఉండేలా సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేయగలిగారు. ప్రపంచంలో ఇదే మొదటిసారి.. ఇలా పోషకాలన్నీ ఉండేలా జన్యుమార్పిడి అరటి పండ్లను అభివృద్ధి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కొత్త అరటి రకం సాగుకు సిద్ధమైనట్టేనని, అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు. -
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే డాక్టర్ రెడ్డీస్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా పిల్లల పోషణ ఉత్పత్తుల్లోకి ప్రవేశించింది. సెలీహెల్త్ కిడ్జ్ ఇమ్యునో ప్లస్ పేరుతో రోగ నిరోధక శక్తిని పెంచే గమ్మీస్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..? వెల్మ్యూన్, ప్రీబయోటిక్స్, విటమిన్లు, లవణాల వంటి పదార్ధాల కలయికతో శాస్త్రీయంగా వీటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 30 గమ్మీస్తో కూడిన ప్యాక్ ధర రూ.480 ఉంది. మందుల షాపుల్లో, ఆన్లైన్లో లభిస్తుంది. (అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్: భారీగా పెరిగిన ఈ-కామర్స్ ఎగుమతులు) -
మనసు కడలిలో ఒత్తిడి ఉప్పెన
విజయవాడ పటమటకు చెందిన 45 ఏళ్ల రమేష్ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఏడాది కిందట ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, దీర్ఘ ఆలోచనలు చేయడంతో పలు రోగాల బారిన పడ్డాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా జబ్బు ఏమీ లేదని తిప్పి పంపేవారు. ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తేల్చారు. లబ్బీపేటకు చెందిన 35 ఏళ్ల వెంకటేష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటే వరకూ సెల్ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే సమయానికి గానీ నిద్రలేచే వాడు కాదు. నిత్యం ఇలా హడావుడిగా బయలు దేరడం, ఆఫీసుకు పరుగులు పెట్టే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. అవి తీవ్రరూపం దాల్చడంతో సైకాలజిస్టును ఆశ్రయించాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): తల తిరుగుతుంది.. కడుపులో తిప్పుతుంది.. గుండె పట్టుకుంటుంది.. ఏ పనినీ సక్రమంగా చేయనివ్వదు.. చివరకు ఆత్మహత్యకు దారి తీస్తుంది..! అదే డిప్రెషన్. ఇది ఈ కాలపు ప్రధాన సమస్య. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇటీవల అందరూ నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిరంతరం ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుందని, ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా గుర్తించండి.. నిద్రలేమి, ఎల్లప్పుడూ దిగులుగా ఉండటం.. ఏకాగ్రతా లోపించడం వంటి సమస్యలు ఉంటే మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్ట పరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్తో పాటు, ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాట పడకూడదు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి. కొరవడిన మానసికోల్లాసం నగరంలోని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో వారిలోని సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, ఒత్తిళ్లకు గురవుతున్నట్లు మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువుల్లో రోబోలుగా మారుతున్నారు. వారిలో సామాజిక, నైతిక విలువులు కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు. ఒత్తిడితో దుష్ప్రభావాలు ♦ నిద్ర పట్టక పోవడం ♦ ఆకలి లేక పోవడం, లేక ఎక్కువ ఆహారం తినడం ♦ఎక్కువ తినేవారు ఒబెసిటీకి గురవడం ♦ హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు ♦ మధుమేహం, రక్తపోటు అదుపులోలేకపోవడం ♦ తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు ♦ వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలో ఇన్ఫెక్షన్స్ సోకడం జరుగుతుంది. ఇలా జయించొచ్చు ♦ రోజుకు 7 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి, ఒకే సమయానికి రోజూ పడుకోవాలి. ♦ సమతుల ఆహారం తీసుకోవాలి. ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ♦ యోగ, మెడిటేషన్పై దృష్టి సారించి, క్రమం తప్పకుండా పాటించాలి ♦ సెల్ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. ♦ భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. ♦ అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. ఒత్తిళ్లతో రుగ్మతలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతుంటారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో పీరియడ్స్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నిద్రలేక పోవడం, ఎక్కువ ఆహారం తినడం కారణంగా ఊబకాయులుగా మారిపోతున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స పొందడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. – డాక్టర్ విజయలక్ష్మి, మానసిక వైద్య నిపుణురాలు, విజయవాడ యువతలో తీవ్రమైన ఒత్తిడి ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వాటికి అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్టలేక పోవడం, వ్యాపారాలు, ఇలా అనేక రంగాల వారు కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు -
క్షయకు చెక్ పెట్టొచ్చు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్షయ నివారించదగిన వ్యాధే. సరైన చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. వాస్తవంగా 2023 నాటికే క్షయ రహిత సమాజం నిర్మాణం కావాలని ప్రభుత్వాలు భావించినప్పటికీ, క్షయ వ్యాధి గ్రస్తులు చికిత్స పొందడంలో అలసత్వం వహించడంతో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ‘నేను క్షయను నివారించగలను’ అనే నినాదంతో వ్యాధిపై ఈ ఏడాది అవగాహన కలిగిస్తున్నారు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా జరుపుతున్నారు. వ్యాప్తి ఇలా.... క్షయ వ్యాధి గ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి ద్వారా బయటకు వచ్చే వ్యాధి కారక మైక్రో బ్యాక్టీరియా ఇతరులలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. క్షయ వ్యాధి గ్రస్తులు మందులు ప్రారంభించిన రెండు వారాల తర్వాత అతని నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. లక్షణాలివే.. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలిలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్రే ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. నియంత్రణ సాధ్యమే.. క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్టీఈపీ)లో భాగంగా రోగులకు ఉచితంగా మందులు అందచేస్తోంది. క్షయ రోగులు చికిత్సతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజూ రెండు గుడ్లు, పాలు, ఆకుకూరలు, చిక్కుడు, గోరు చిక్కుడు, నాన్వెజ్కి సంబంధించి కైమా వంటివి తీసుకుంటే మంచిది. క్షయకు చికిత్స పొందుతున్న వారికి పోషకాహారం కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ. 500లు ఇస్తోంది. నివారించదగిన వ్యాధే క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నివారించవచ్చు. ప్రభుత్వం మంచి మందులు సరఫరా చేస్తోంది. కొందరు రెండు, మూడు నెలలు మందులు వాడి మానేయడంతో మొండి క్షయగా రూపాంతరం చెందుతోంది. ప్రతిరోజూ పల్మనాలజీ ఓపీకి 20 నుంచి 30 మంది క్షయ వ్యాధి లక్షణాలతో రోగులు వస్తున్నారు. వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్రే తీసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. – డాక్టర్ కె.శిరీష, పల్మనాలజిస్టు, జీజీహెచ్, విజయవాడ -
మీకు తెలుసా
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..? రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త. ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట. అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. -
‘కోవిడ్-19’పై గుడ్న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ
జెనివా: కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త అందించింది. కోవిడ్-19 వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని 90 శాతం మందిలో కొంత మేర రోగనిరోధక శక్తి పెంపొందినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్కు గురికావటం లేక వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచంలోని 90 శాతం మందిలో కోవిడ్ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది’ అని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. కోవిడ్-19 మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని, అయితే, వైరస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోల్ అధనోమ్. వైరస్పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. అంతకు ముందు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది. ఇదీ చదవండి: Viral Video: భయానక దృశ్యం.. చెరువులో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి -
వ్యాధి నిరోధక సంజీవని... యోగా!
యోగా అంటే కలయిక. మన శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఒక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ. దీనిని నిరంతర సాధన చేస్తే మన గమ్యమైన ముక్తి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. అనగా మనస్సును ఐహిక బంధం నుండి వేరుచేయడం అన్న మాట. దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించడం వల్ల బంధ విముక్తి పొంది సమున్నత స్థితికి చేరటమే యోగా అని అరబిందో నిర్వ చించారు. యోగాలో చాలా రకాలున్నాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, పతంజలి యోగం, కుండలినీ యోగం, హఠ యోగం, మంత్ర యోగం, లయ యోగం, రాజ యోగం, జైన యోగం, బౌద్ధ యోగం వంటివి వాటిలో కొన్ని. అయితే ప్రతి యోగా పద్ధతికి సంబంధించి... నియమావళి, సూత్రాలు, ఆచరణ వేరు వేరుగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది మన శరీర ఆరోగ్యానికి సంబంధించినదైన పతంజలి యోగా. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే రక్తనాళాల్లో అవరోధాలు తొలగిపోయి ప్రతి అవ యవం కండిషన్లో ఉంటుంది. దీనికి తోడు యుక్తా హారం తీసుకొని జీవనశైలిలో మార్పు తెచ్చుకొంటే ఆరోగ్య సమస్యలను రూపుమాపవచ్చు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరం లోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటి అన్ని వ్యవస్థలూ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి. యోగా చేసేవారు గురువు సూచనలు పాటించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారూ, గర్భిణులూ డాక్టర్ సూచనలు పాటించాలి. వ్యాధి ఒక్కరోజులో సంక్రమించదు. వ్యాధి పెరుగుదల ఐదు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఏ లక్షణాలూ పైకి కనపడవు కానీ శరీరంలో వ్యాధి పెరుగుతుంది. ద్వితీయ దశలో పైకి స్వల్ప లక్షణాలు కనపడతాయి. మూడవ దశలో వ్యాధి లక్షణాలు బాగా కనపడి బాధను కల్గిస్తాయి. ఈ దశలో త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందివ్వాలి. లేకపోతే నాలుగవ దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో అవసరమైన శస్త్ర చికిత్స చేసి అంగవైకల్యానికి పరిమితం చేస్తారు. ఐదో దశ పునరావాసం లేక మరణం. వీటిలో మొదటి రెండు దశల్లోనూ యోగా వల్ల ఉత్పత్తి అయిన రోగ నిరోధక శక్తితో వ్యాధిని విజయ వంతంగా నిరోధించవచ్చు. నేడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియాలజీ, న్యూరాలజీ, డయబెటాలజీ వంటి క్లినిక్లలో అనేక వందల మంది రోగులను ప్రతిరోజూ చూస్తున్నాం. రోగుల సంఖ్య అధికమవ్వటం వల్ల డాక్టర్లు వైద్య ప్రమా ణాలు పాటించని లేని స్థితికి చేరి వైద్యం చేస్తున్నారు. ఈ రోగుల సంఖ్యను గణనీయంగా యోగా వల్ల తగ్గించవచ్చు. అంతేకాదు యోగా చేసిన వెంటనే సదరు వ్యక్తి శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదల అవుతుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు యోగా వల్ల స్థూల శరీరం తగ్గి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. యోగా వల్ల రక్తనాళాలు, నాడులకు ఉన్న సాగే గుణం సురక్షిత మవుతుంది. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు సమస్థితిలోకి వచ్చి అసహ్యం, అసూయ, కోపం వంటి మానసిక ఉద్రేకాలు తగ్గుతాయి. యోగా రక్తపోటు, మధుమేహ మందుల డోసును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజూ ఒక గంట యోగా చెయ్యాలి. - వి.వి. రత్నాకరుడు రిటైర్డ్ నాన్ మెడికల్ ఫేకల్టీ ఆఫీసర్ (జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి..? అందులో ఉండే విటమిన్లేంటి?
మహబూబ్నగర్ రూరల్: కరోనా వైరస్ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక పోష కాలు ఉన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించింది. పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)ను ఎఫ్సీఐ ద్వారా సేకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకారం అందిస్తోంది. బియ్యంలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలు కలపటంతో ఆ ఆహారం తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా కరోనాలాంటి పలురకాల వైరస్లను మానవులు తట్టుకుంటారని భావిస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తయారీకి జిల్లాలోని రైస్మిల్లుల్లో యంత్రాలను మార్చాలని యజమానులకు అధికారులు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఏప్రిల్లో సరఫరా చేయగా.. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులు, రేషన్ లబ్ధిదారులకు కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి👉🏻Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటు.. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థ అందించిన నిల్వలకు అదనంగా పోషకాలు కలుపుతున్నారు. ఇందుకు మిల్లుల్లో బ్లెండింగ్ యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు సుమా రు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 10 పారా బాయిల్డ్ రైస్మిల్లుల్లో వీటిని ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 700 క్వింటాళ్ల ఫోర్టిఫైడ్ నిల్వలను సరఫరా చేస్తున్నారు. మరో అయిదు మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–ఏ, జింక్, ఇతర విటమిన్లు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021 యాసంగిలో పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యం 7,540 మెట్రిక్ టన్నులు ఈ మిల్లులకు కేటాయించగా.. ఫోర్టిఫైడ్ రైస్ పౌరసరఫరాలశాఖ గోదాములకు చేరింది. ఉపయోగం ఏంటి? సాధారణ బియ్యంలో ఐరన్ విటమిన్ డి, బి–12తో పాటు మరిన్ని పోషకాలు కలపటంతో సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి. గోధుమలు, మినుములు, పెసర, అపరాలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మారుస్తారు. వీటిని కెనరల్స్ అంటారు. ఈ కెనరల్స్ పౌడర్ను ముద్దల రూపంలోకి మార్చి క్వింటా సాధారణ బియ్యానికి కిలో కెనరల్స్ కలుపుతారు. సాధారణ బియ్యంలో కార్బొహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. తోడుగా కెనరల్స్ కలపటంతో పిండి పదార్థాలు, పోషకాలు జమవుతాయి. పోషకాలు కలిపిన బియ్యం వండితే బలవర్ధక ఆహారం తయారవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్వింటాకు కిలో చొప్పున.. వంద కిలోల సాధారణ బియ్యానికి కిలో పోషకాల నిల్వలను కలుపుతున్నారు. మిల్లుల్లో ఓవైపు మరపట్టిన.. మరోవైపు పోషకాల నిల్వలు వచ్చి ఒకేచోట పడేలా యంత్రాలను అమర్చుతున్నారు. ఉత్తర్వులు రావాలి.. పోషకాల మిళిత బియ్యాన్ని ఇప్పటికే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మున్ముందు పాఠశాలలలు, రేషన్ లబ్ధిదారులకు అందిస్తాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. – జగదీశ్కుమార్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మహబూబ్నగర్ చదవండి👇🏽 కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు!
కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రస్తుతం ఇంటింటా నాటు కోడి రుచులు ఘుమఘుమలాడుతున్నాయి. రహదారికి ఇరువైపులా నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. చదవండి👉 Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే.. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్పిస్తున్నాయి. నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్నిస్తున్నాయి. పలమనేరు/బైరెడ్డిపల్లె: ఆదివారం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే. అందులోనూ నాటుకోడి చారు దానికి కాంబినేషన్గా రాగిముద్ద ఇప్పుడు జిల్లాలో ఓ ట్రెండ్గా మారింది. కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు మాంసాహారంపై దృష్టి సారించారు. మందులతో పెంచే బ్రాయిలర్ కోళ్లకంటే నాటు కోళ్లలో మంచి ప్రోటీన్లు ఉండడంతో వీటికి గిరాకీ పెరిగింది. రాయలసీమ ప్రత్యేక వంటగా పేరొందిన రాగిముద్దకు నాటుకోడి పులుసుంటే ఆ మజానే వేరు. దీనికున్న డిమాండ్ను చూసి చిత్తూరుతోపాటు కర్ణాటకలోని కోలారు, చింతామణి, చిక్కబళ్లాపుర, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ నాటుకోడిచారు రాగిముద్ద హోటళ్లు భారీగా వెలిశాయి. పెరుగుతున్న పెంపకం-వినియోగం గతంలో పల్లెల్లో ప్రతి ఇంటికి పెరటి కోళ్లు ఉండేవి. బంధువులు ఇంటికొచ్చినా, పండుగలొచ్చినా కోడి కూర వండడం అప్పటి సంప్రదాయం. కాల క్రమేణా జీవనశైలిలో వచ్చిన మార్పుతో పెరటికోళ్ల పెంపకం తగ్గింది. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే బ్రాయిలర్కోళ్ల వినియోగం పెరిగింది. కేవలం 40 రోజుల్లో పెరిగే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అంతంతమాత్రమే. దీనికితోడు కోవిడ్ కారణంగా ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలు అన్వేషించి, రుచిని అందించే నాటు కోడిని ఎంచుకున్నారు. చదవండి👉: నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్టెస్టులు దీంతో నాటుకోళ్ల పెంపకంతోపాటు వినియోగమూ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 80 దాకా నాటుకోళ్ల ఫారాలున్నాయి. కోవిడ్కారణంగా కొలువులు వదిలేసి వచ్చిని సాఫ్ట్వేర్లు సైతం నాటుకోళ్ల ఫామ్లు పెట్టి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు రోజుకు సగటున 30 టన్నులుగా ఉంది. నాటుకోళ్ల అమ్మకాలు 5 టన్నులుగా ఉండేది. ప్రస్తుతం రోజువారీ నాటుకోళ్ల వినియోగం 8 టన్నులకు చేరుకుందని వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంత ప్రసిద్ధి పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెలో ప్రతి శనివారం జరిగే నాటుకోళ్ల సంత రాయలసీమలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోళ్ల సంత మూడు దశాబ్దాలుగా సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి నాటుకోళ్లను పెంచేవాళ్లు ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తారు. వీటిని కొనేందుకు వందలాదిమంది వ్యాపారులు బయటి రాష్ట్రాలనుంచి సంతకు వస్తుంటారు. ఇక్కడ లక్షల్లో నాటుకోళ్ల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరునుంచి ఖరీదైన కార్లలో వచ్చే వారు ఇక్కడి పందెంకోళ్లు, బెనిసికోళ్లను కొనుగోలు చేస్తుంటారు. నాటుకోడి పులుసు హోటళ్లు పలమనేరు, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, రాయచోటి ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలారు, ముళబాగిలు, బంగారుపేట, కేజీఎఫ్, మాలూరు, విజయపుర, షిడ్లగట్ట, దొడ్డబళ్లాపురల్లో నాటుకోడిచారు– రాగిముద్ద హోటళ్లు, దాబాలు ప్రత్యేకంగా వెలిశాయి. చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఇళ్లలోనే నాటు కోడివంటలు చేసి తోపుడు బండ్లపై విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన వాహనాల్లోనూ నాటుకోడి పులుసు అమ్మకాలు సాగుతున్నాయి. పుంజు రూ.5 వేలు ప్రస్తుతం నాటుకోడి(లైవ్) కిలో రూ.250 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి బరువునుబట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఈ సంతకొచ్చే కోడిపుంజుల్లో కొన్ని పందెంకోళ్లుంటాయి. వీటి ధర డిమాండ్ను బట్టి రూ.3వేల నుంచి 5వేల దాకా పలుకుతుంటాయి. మాంసం కోసమైతే కోడి పుంజు, బెనిసికోడి, నల్లకోడి, కోడిపెట్ట, గుడ్లుకోడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎంతో ఆరోగ్యం నాటుకోడిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్-బి6తో పాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్, జింక్ ధాతువులు అందుతాయి. జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బందులుండవు. వీటికి పూర్తి సహజ సిద్ధంగా తయారైన ఆహారాన్ని అందిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కోడికి పూర్వ వైభవం వచ్చింది. పెరిగిన గిరాకీ నేను బైరెడ్డిపల్లి సంతలో 20 ఏళ్లుగా నాటుకోళ్లను కొంటున్నాను. గత రెండేల్లుగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. నాటుకోడి మాంసం తినేవారి సంఖ్య పెరిగింది. బ్రాయిలర్ కోడిమాంసం కంటే కొంచెం ఎక్కువ ధర అయినప్పటికీ జనం ఎగబడి కొంటున్నారు. మాకు వ్యాపారం బాగానే ఉంది. ఇక్కడ కోళ్లను కొని కర్ణాటకలో అమ్ముతుంటాం. ప్రతివారం కోళ్ల సంతకు వస్తుంటాం. – రియాజ్, నంగిళి, కర్ణాటక ఈ కోళ్ల రుచే వేరు ఎన్నో ఏళ్లుగా బైరెడ్డిపల్లెలో నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాను. మా కర్ణాటకలో బైరెడ్డిపల్లె నాటుకోళ్ల్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే వీటిని రైతుల పొలాలవద్ద, పల్లెల్లో పెంచుతారు. అవి ప్రకృతిలో తిరుగుతూ పెరుగుతాయి కాబట్టి రుచిగా ఉంటాయి. ఫారాల్లో పెంచే నాటుకోళ్లు క్రాసింగ్ కాబట్టి అంతరుచి రాదు. నాటుకోడి పులుసు తినేటపుడే నాటుదా ఫారమ్దా అని తెలిసిపోతుంది. శ్రీధర్, కోళ్లవ్యాపారి, ముళబాగిళు, కర్ణాటక -
‘ఎన్ని కోవిడ్ వేవ్లు వచ్చినా పర్లేదు.. అయితే, అవి మాత్రం మరవొద్దు’
న్యూఢిల్లీ: భారత్లో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇకపై ఎన్ని వేవ్లు వచ్చినా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో పెరిగిన నిరోధక శక్తి వల్ల ఇకపై వచ్చే వేవ్లు ప్రభావం చూపలేవని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. ‘‘కరోనాలో ఇప్పటికే వెయ్యికి పైగా మ్యుటేషన్లు జరిగాయి. వాటిలో ఐదు వేరియెంట్లే ఎక్కువ ప్రభావం చూపాయి. కరోనా రెండో వేవ్ భారత్లో తీవ్ర ప్రభావం చూపినా డెల్టా వేరియెంట్ వల్ల అత్యధికుల్లో ఏర్పడ్డ రోగనిరోధక శక్తి ఇకపై వచ్చే వేవ్ల నుంచి కాపాడుతుంది’’ అన్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని సఫ్దర్జంగ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ జుగల్ కిశోర్ చెప్పారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12–16 వారాలు (84 రోజులు)గా ఉంది. -
Health Tips: కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు... బాదం, రాగి దోశ, బెల్లం, కిచిడి..
కోవిడ్ బారిన పడ్డవారు, ఇప్పుడిప్పుడే దానినుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆహార చిట్కాలు... ►నాలుగైదు బాదం పప్పులు, పది కిస్మిస్లను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానబెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. బాదం పప్పు శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. ►రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన దోశ వంటి వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు వాటిలోని పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగులలో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లోని క్యాల్షియం, ఫాస్పరస్లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది. ►బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ,ఇ, డి, కే, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమేగాక, ఎముకలు గట్టిపడతాయి. ►రాత్రి పూట తీసుకునే ఆహారంలో కిచిడి ఉండాలి. దీనిలో పదిరకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. పలుచటి మజ్జిగ, సగ్గుజావ, రాగిజావ వంటివి తాగాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని సమస్థితితో ఉంచడమేగాక జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
పాదాలు కదలడం లేదా? అయితే గులియన్ బ్యారీ సిండ్రోమ్!
కొంతమందిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గాక... ఎందుకోగానీ.... వారి సొంత వ్యాధినిరోధక శక్తే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాంటి ఓ రుగ్మతే ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’. ఇందులో బాధితుడు చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంటాడు. కానీ అతడి దేహం కాళ్ల దగ్గర్నుంచి అచేతనం కావడం మొదలై క్రమంగా పైపైకి పాకుతూ ఉంటుంది. గతంలో చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ రుగ్మత ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. సంక్షిప్తంగా ‘జీబీ సిండ్రోమ్’ అని పిలిచే... ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ గురించి తెలిపే కథనమిది. ఓ చిన్న కేస్స్టడీ ద్వారా గులియన్ బ్యారీ సిండ్రోమ్ తీవ్రత ఎలా ఉంటుందో చూద్దాం. జీవన్ టాయిలెట్కు వెళ్లాడు. పనిపూర్తయ్యాక లేచి నిలబడి ఎప్పటిలాగే బయటకు వచ్చేద్దామనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా పాదాలు కదలడం లేదు. అత్యంత కష్టంగా బయటకు వచ్చాడు. కాళ్లెందుకు స్వాధీనంలో లేవో తెలియలేదు. దాంతో హాస్పిటల్లో చేరాడు. తొలుత పాదాలూ, కాళ్లే కాదు... క్రమంగా నడుమూ... అటు తర్వాత చేతులు, మెడ... ఇలా దేహంలోని అన్ని అవయవాలూ అచేతనమైపోవడం మొదలైంది. బయటకు కనిపిస్తున్న ఆ లక్షణాలను గమనించిన డాక్టర్లు దాన్ని ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’గా భావించారు. కారణం... మనకు ఏవైనా వైరస్ల వల్ల జ్వరం/ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనలోని రోగనిరోధక శక్తి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసి, ఆ జ్వరానికి/ఇన్ఫెక్షన్కు కారణమైన వైరస్ను తుదముట్టిస్తుంది. కరోనా సోకినప్పుడు కూడా యాంటీబాడీస్ ఆ వైరస్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో ఒక్కోసారి అది నరాలనూ దెబ్బతీసే అవకాశముంది. అలా జరిగినప్పుడు ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ కనిపించవచ్చు. అయితే నరాలు ఏ మేరకు దెబ్బతిన్నాయన్న విషయం మనలో తయారైన యాంటీబాడీస్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన 70 శాతం మందిలో సాధారణంగా రెండు వారాల్లో వారు నడవలేని పరిస్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. దాదాపు ఒక నెల రోజులు మొదలుకొని ఆర్నెల్ల తర్వాత వారు కోలుకుని పూర్తిగా నార్మల్ కాగలరు. అయితే 10 శాతం మందిలో మాత్రం సమస్య మరింత ముదిరి శ్వాస తీసుకోడానికి ఉపయోగపడే కండరాలు కూడా చచ్చుబడిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు మింగే శక్తిని కూడా కోల్పోతారు. మెడలను నిలపలేరు. బాధితులు ఇలాంటి దశకు చేరుకుంటే మాత్రం వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించాలి. ఇక మిగతా 20 శాతం మందిలో ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకిలా జరుగుతుందంటే...? మన మెదడు... దేహంలోని ప్రతి అవయవాన్నీ నియంత్రిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. మెదడు నుంచే నరాల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ, కండరాలకు ఆదేశాలూ, సమాచారాలూ అందుతూ ఉంటాయి. ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్’ అనే పొర (మైలీన్ షీత్) ఉంటుంది. వాస్తవానికి ఈ పొర కారణంగానే ‘కదలిక’లకు సంబంధించిన సమాచారమంతా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో అయా అవయవాలకు అందుతూ ఉంటుంది. ఒక్కోసారి మన వ్యాధినిరోధకతకు దోహదపడే యాంటీబాడీస్... ఏ కారణం వల్లనో ఈ ‘మైలీన్’ పొరను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు నుంచి అందే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రసారానికి అంతరాయం కలుగుతుంది. దాంతో కండరాలను కదిలించడం సాధ్యం కాదు. ఆ విధంగా మైలీన్ పొర దెబ్బతిన్న ప్రతి కండరమూ అచేతనమవుతుంది. తీవ్రత స్థాయులు వ్యాధి తీవ్రత చాలా స్వల్పం మొదలు కొని అత్యంత తీవ్రం వరకు ఉండవచ్చు. స్వల్పంగా ఉంటే నడవడం కష్టం కావచ్చు. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితుడు పూర్తిగా మంచానికే పరిమితమవుతాడు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం జరగవచ్చు. సాధారణంగా కాళ్లూచేతులు కదిలించడం అన్న పనులు మన ప్రమేయంతో మనమే చేసేవి. చాలా సందర్భాల్లో జీబీ సిండ్రోమ్లో మన ప్రమేయం లేకుండా జరిVó కీలక కార్యకలాపాలు చాలా అరుదుగా ప్రభావితమవుతాయి. ఒకవేళ అలా జరిగినçప్పుడు కొందరిలో గుండె స్పందనల వేగం తగ్గడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖంలోంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపిసించడం, తీవ్రంగా చెమటలు పట్టడం జరగవచ్చు. కాస్తంత అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోవడయూ జరగవచ్చు. ఒకసారి వ్యాధి కనిపించడం మొదలయ్యాక అది ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో క్రమంగా పెరుగుతూ, తీవ్రమవుతూ పోవచ్చు. బాధితులు కొంతకాలం అచేతనంగా ఉండి... ఆ తర్వాత మళ్లీ కోలుకోవడం మొదలుకావచ్చు. అయితే కొంతమందిలో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్ అందకపోవడం జరిగితే... అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీవయచ్చు. చికిత్స : గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన రోగులు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నా, బీపీలో హెచ్చుతగ్గులు, గుండె స్పందనల్లో లయ తప్పుతున్నా (అటనామిక్ న్యూరోపతి ఉన్నా) వాళ్లకు జీబీ సిండ్రోమ్కు ఇవ్వాల్సిన ప్రత్యేక చికిత్స అవసరం పడుతుంది. ప్రస్తుతం బాధితులకు రెండు రకాల ప్రధాన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవి... ►ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స: బాధితుడి బరువు ఆధారంగా నిర్ణయించిన మోతాదు ప్రకారం...అతడికి ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ. ఇవి మన దేహంలోని యాంటీబాడీస్ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కబరుస్తాయి. తద్వారా నరాల పైన ఉండే మైలీన్ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి. ►ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స: ఈ చికిత్సలో శరీరంలో జబ్బుకు కారణమైన యాంటీబాడీస్ను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా బాధితుడి శరీరం బరువును పరిగణనలోకి తీసుకుని... ప్రతి కిలోగ్రాముకూ 250 ఎమ్ఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా.... అంటే దాదాపు నాలుగు నుంచి ఆరు విడతలుగా ఈ చికిత్స చేస్తారు. రోజు విడిచి రోజు చేసే ఈ చికిత్సలో తొలగించిన ప్లాస్మాను సెలైన్, ఆల్బుమిన్లతో భర్తీ చేస్తారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స... దాదాపు సగం ఖర్చులోనే పూర్తవుతుంది. ఈ రెండూ ఇంచుమించూ సమానమైన ఫలితాలనే ఇస్తాయి. రోగి కోలుకునే అవకాశాలు : ►జీబీ సిండ్రోమ్ వచ్చిన రోగుల్లో చాలామంది పూర్తిగా కోలుకునే అవకాశాలే ఎక్కువ. అయితే 3 శాతం నుంచి 5 శాతం రోగుల్లో మాత్రం మంచి చికిత్స ఇప్పించినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక పది శాతం మందిలో చెప్పుకోదగ్గ పురోగతి ఉండదు. ఈ గణాంకాలు మినహాయించి మిగతా అందరిలోనూ కోలుకునే అవకాశాలు ఎక్కువే ఉండటం ఓ సానుకూల అంశం. ►వయసు పైబడిన రోగులతో పోలిస్తే వయసులో ఉన్నవారు, యుక్తవయస్కులు చాలా త్వరగా కోలుకుంటారు. ►చచ్చుబడ్డ అవయవాలు పూర్తిగా పనిచేయడం ప్రారంభించి మళ్లీ నార్మల్ కావడం అన్న అంశం రోగి నుంచి రోగికి మారుతుంది. ►ఐదు శాతం మందిలో మాత్రం జీబీ సిండ్రోమ్ వచ్చినవారికే మళ్లీ వచ్చే అవకాశాలుంటాయి. -
రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్కి అధికం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తూ కల్లోలం రేకెత్తిస్తోంది. దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన గణాంకాల లభ్యత ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉంది. కానీ తాజాగా లభించిన క్లీనికల్, పరిశోధన వివరాలను పరిశీలించిన సైంటిస్టులు, మానవ శరీరంలో ఇమ్యూనిటీ(రోగనిరోధకత)ను తప్పించుకుపోయే శక్తి సామరాŠధ్య్లు ఒమిక్రాన్కు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం దీని వల్ల కలిగే అనారోగ్య తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపారు. అంతర్జాతీయ డేటా ఆధారంగా ఇన్సకాగ్(ఐఎన్ఎస్ఏసీఓజీ– ఇండియన్ సార్స్ కోవిడ్2 జీనోమిక్స్ కన్సార్షియా) ఈ అంచనాలను తన తాజా బులిటెన్లో ప్రకటించింది. భారత్లో ఒమిక్రాన్ వ్యాప్తి, తీవ్రత పర్యవేక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఇప్పటికీ ప్రపంచంలో డెల్టానే ఆధిపత్య వీఓసీ (వేరియంట్ ఆఫ్ కన్సెర్న్)అని, కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమించిందని వెల్లడించింది. యూకే తదితర ప్రాంతాల్లో ఆధిపత్య వీఓసీ దిశగా ఒమిక్రాన్ దూసుకుపోతున్నట్లు తెలిపింది. టీకా సామర్థ్యాన్ని తగ్గిస్తోంది అంతర్జాతీయంగా లభిస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోందని ఇన్సకాగ్ నివేదిక తెలిపింది. కేవలం టీకాల సామరŠాధ్యన్నే కాకుండా గతంలో ఇన్ఫెక్షన్ ఒకమారు సోకడం వల్ల కలిగే రోగనిరోధకత కూడా ఒమిక్రాన్ సోకకుండా కాపాడలేకపోతోందని అభిప్రాయపడింది. డెల్టాతో పోలిస్తే అధిక మ్యుటేషన్లు పొందిన కారణంగా దీనికి ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునే శక్తి పెరిగినట్లు వివరించింది. లక్షణాల్లో తీవ్రత కనిపించకున్నా, ప్రస్తుతానికి దీని వల్ల కలిగే ప్రమాదం అధికమనే భావించాలని సూచించింది. దేశవ్యాప్తంగా జీనోమ్ సీక్వెన్స్ శాంపిళ్లను, జిల్లాలవారీ గణాంకాలను ఇన్సకాగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని విశ్లేషిస్తోంది. 900 దాటిన ఒమిక్రాన్ కేసులు భారత్లో ఒమిక్రాన్ కేసులు 900 దాటిపోయాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు రాగా... ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు కూడా ఒమిక్రాన్ కేసులు అధికంగా వచ్చాయి. పంజాబ్లో తొలి ఒమిక్రాన్ కేసు వచ్చింది. దేశంలో 9,125 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మణిపూర్లో నైట్ కర్ఫ్యూ విధించారు. -
Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్నట్స్ ఎక్కువగా తినిపిస్తున్నారా..
Immunity Booster Foods For Kids: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే... గుడ్డు కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి. ఆకుకూరలు ఆకుకూరలు, మునగకాడలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి. పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు. పసుపు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు. డ్రైఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్వీట్స్ వద్దు పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్జ్యూస్లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సరిపడా నిద్ర ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి పూనమ్ కేత్రపాల్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒక సమూహంలో టీకాలు, గత ఇన్ఫెక్షన్ల ఆధారంగా వృద్ధి చెందే ఇమ్యూనిటీ స్థాయిలను(హెర్డ్ ఇమ్యూనిటీ లేదా సమూహ రోగనిరోధకత) బట్టి దీర్ఘకాలంలో కరోనా ఎండమిక్(ఒకప్రాంతానికి పరిమితం అయ్యేవ్యాధి)గా మారే అవకాశాలుంటాయన్నారు. వైరస్ అదుపులో మనిషి ఉండకుండా, మనిషి అదుపులో వైరస్ ఉండే పరిస్థితిన సాధించాలని సంస్థ దక్షిణాసియా డైరెక్టర్గా పనిచేస్తున్న సింగ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన ప్రాంతాల ప్రజలపై కరోనా ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేశారు. కోవాక్సిన్కు ఈయూఏ(అత్యవసర అనుమతులు) ఇవ్వడంపై మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ బయోటెక్ సమర్పించిన గణాంకాల మదింపు జరుగుతోందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని తెలిపారు. చదవండి: (పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?) దేశాలన్నింటిలో కరోనా మరణాలకు అధికశాతం కారణం టీకా తీసుకోకపోవడమేనని, ఈ సమయంలో బూస్టర్డోసులిస్తే అసలు టీకా తీసుకోనివారికి సరఫరా కష్టమవుతుందని వివరించారు. అందుకే బూస్టర్ డోసులపై సంస్థ ఈ ఏడాది చివరివరకు నిషేధం విధించిందని చెప్పారు. అన్ని దేశాల్లో కనీసం 40 శాతం ప్రజానీకానికి టీకా అందేలా చూడాల్సిఉందన్నారు. అందరూ సురక్షితమయ్యేవరకు ఏ ఒక్కరూ సురక్షితం కాదని గుర్తు చేశారు. సమయాన్ని బట్టి కరోనా టీకా ప్రభావం తగ్గుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి స్థిరమైన ఆధారాల్లేవని చెప్పారు. బూస్టర్ డోసులకు తాము వ్యతిరేకం కాదని, శాస్త్రీయ నిరూపణలను బట్టి బూస్టర్పై సిఫార్సులుంటాయని ఆమె చెప్పారు. పూర్తి నిర్మూలన అసాధ్యం కరోనాను ప్రపంచం నుంచి పూర్తిగా తరిమివేయడం సాధ్యం కాకపోవచ్చని పూనమ్ అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమేణా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని, తద్వారా మరణాలను, ఆస్పత్రిపాలవడాన్ని, ఇతర నష్టాలను కనిష్టాలకు తీసుకురావచ్చని చెప్పారు. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి రక్షణ బలహీనంగానే ఉందని, చాలామంది ప్రజలకు వైరస్ సోకే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందుకే టీకా తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, గాలాడని ప్రాంతాల్లో గుమికూడడాన్ని తగ్గించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం తదితర చర్యలు కొనసాగించాలని గట్టిగా సూచించారు. థర్డ్ వేవ్ రాకడ, దాని బలం.. మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా సరైన చర్యలు పాటిస్తే మరో వేవ్ రాకుండా చూసుకోవచ్చన్నారు. అనేక దేశాల్లో టీకా లభించని ఈ తరుణంలో తిరిగి కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేయాలన్న భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. కరోనా కారణంగా దేశాలు తమ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిచే అవకాశం లభించిందని ఆమె చెప్పారు. ఆరోగ్య వ్యవస్థపై ఇలాగే పెట్టుబడులు పెరగాలని అభిలషించారు. బలమైన ఆరోగ్య వ్యవస్థలుంటే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోగలమని ప్రపంచ దేశాలు గుర్తించాలని సింగ్ చెప్పారు. (చదవండి: Pakistan: ఫ్యూన్ పోస్ట్ కోసం ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు) -
కరోనా కొత్త రూపాంతరాలు.. ‘బూస్టర్’ డోసు తప్పనిసరా?
రిచ్మండ్ (అమెరికా): కరోనా వైరస్ కొత్త వేరియంట్లు (రూపాంతరితాలు) పుట్టుకొస్తున్న కొద్దీ... కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఏమేరకు రక్షణ ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త వేరియంట్లు టీకా కల్పించే రక్షణ కవచాన్ని ఛేదిస్తాయా? టీకా కారణంగా ఎంతకాలం కోవిడ్–19 నుంచి రక్షణ లభిస్తుంది? రెండు డోసులు తీసుకున్నాక కూడా మరో బూస్టర్ డోసు అవసరమా? ఇలా పలు సందేహాలు ప్రజలను వేధిస్తున్నాయి. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టు, అంటువ్యాధుల నిపుణులు విలియం పెట్రి వీటికి సమాధానాలు ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బూస్టర్ డోస్ అంటే ఏమిటి? వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధుల నుంచి రక్షణకు మనం వ్యాక్సిన్లు తీసుకుంటాం. సదరు వైరస్కు వ్యతిరేకంగా మన శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెంది... దానితో పోరాడి నిర్వీర్యం చేస్తాయి లేదా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. అయితే వ్యాక్సిన్ల ద్వారా లభించే రోగనిరోధకత సమయం గడిచినకొద్దీ బలహీనపడం సహజమే. ఉదాహరణకు ‘ఫ్లూ’ నిరోధానికి ఏడాదికోసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. డిప్తీరియా, ధనుర్వాతానికి ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి. వైరస్కు వ్యతిరేకంగా రోగనిరోధకత స్థాయిని కొనసాగించేందుకు వీలుగా కొన్నాళ్ల తర్వాత ఇచ్చే అదనపు డోసునే ‘బూస్టర్ డోసు’ అని పిలుస్తారు. అప్పుడే అవసరమా? అమెరికాలో ఆరోగ్య సంస్థలు ఇప్పటివరకు బూస్టర్ డోసుపై అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. అయితే ఇజ్రాయెల్లో 60 ఏళ్లు పైబడిన వారు మూడోడోసు తీసుకోవాలని పోత్రహిస్తున్నారు. కరోనా బారినపడే ముప్పు అధికంగా ఉన్నవారికి (వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు) బూస్టర్ డోసు ఇవ్వాలనే దానిపై ఫ్రాన్స్లో సమాలోచనలు జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువుంటే ‘బూస్టర్’ అవసరమా? స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగనిరోధక శక్తి తగ్గినవారు, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్ డోస్ అవసరం. కిడ్నీ మార్పిడి జరిగిన 40 రోగుల్లో 39 మందిలో, డయాలసిస్ చేయించుకున్న వారిలో మూడోవంతు మందిలో (పరీక్షించిన శాంపిల్లో) వ్యాక్సినేషన్ తర్వాత యాండీబాడీల ఆచూకీ లేదని అధ్యయనంలో తేలింది. కిడ్నీ మార్పిడి చేసుకున్న రోగుల్లో బూస్టర్ తర్వాత యాంటీబాడీలు కనిపించాయి. ఎందుకు సిఫారసు చేయడం లేదు? టీకా మూలంగా లభించే రక్షణ శాశ్వతం కానప్పటికీ... ఎంతకాలం ఉంటుందనేది ఇప్పటికైతే స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆమోదం పొందిన వ్యాక్సిన్లు అన్నీ మంచి రక్షణ కల్పిస్తున్నాయి. రోగకారక వైరస్ తాలూకు నిర్మాణాన్ని ‘బి లింఫోసైట్స్’ జ్ఞాపకం పెట్టుకుంటాయి. వైరస్ సోకితే... దాన్ని ఎదుర్కొనడానికి వెంటనే తగినంత స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. వ్యాక్సినేషన్ పూర్తయిన 11 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు కనపడటం ... బూస్టర్ డోస్ అప్పుడే అవసరం లేదనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. బూస్టర్ డోస్ అవసరమని మనకెలా తెలుస్తుంది? కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఏమేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా వైద్యులు ఐజీజీ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని ఫలితాన్ని బట్టి బూస్టర్ డోస్ అవసరమా? కాదా? అనేది తెలుస్తుంది. అయితే టీకా తీసుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్న కేసులు అధికం అవుతుండటంతో వైద్య పరిశోధకులు వ్యాక్సిన్స్ ద్వారా లభించే రోగనిరోధకత ఏస్థాయిలో ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? అనేది కచ్చితంగా తేల్చే పనిలో ఉన్నారు. -
తల్లి పాలే తొలి టీకా!
తల్లిపాలలో ఎన్నెన్నో అమూల్యమైన పోషకాలు ఉంటాయి. వాటిని అధ్యయనం చేయాలనుకుని సంకల్పిస్తే ఇంతవరకు మన పరిశీలనకు అందినవి కేవలం 400 రకాల పోషకాలే. కానీ నిజానికి అంతకంటే ఎక్కువ పోషకాలే అందులో లభ్యమవుతాయి. అందునా వాటిని కృత్రిమంగా తయారుచేద్దామన్నా సాధ్యం కానంతటి అద్భుత పోషకాలవి. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అనేక రకాల ఫార్మూలా ఫీడ్స్ అందుబాటులో ఉన్నా... అవేవీ తల్లిపాలకు సాటిరావు. బిడ్డ పుట్టగానే ఊరే ముర్రు పాలు! బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరూ, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరూ అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. వీటిలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. దాంతో ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుతాయి. ముర్రుపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ముర్రుపాల తర్వాత... ముర్రుపాల తర్వాత పసిపిల్లలకు ఆర్నెల్ల వయసు వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంట్లో వండిన అనువైన అదనపు ఆహారం ప్రారంభించి, రెండేళ్ల వయసు వరకు లేదా వీలైనంత ఎక్కువకాలం తల్లిపాలూ పడుతూ ఉండాలి. ఇది బిడ్డ పూర్తి సంపూర్ణ వికాసానికి తోడ్పడుతుందని డబ్ల్యూహెచ్ఓ వారి సూచన. పాలిచ్చే తల్లులకుS కొన్ని సూచనలు ►కరోనా సోకిన తల్లి సైతం తన బిడ్డకు తల్లిపాలు పట్టడం చాలా ఉత్తమం. మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ►తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా తరచూ మారుతూ, కొత్త రుచి వస్తుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆ రుచిని ఆస్వాదిస్తుంది. ఇక్కడ పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే, పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. ►పాలిచ్చే తల్లి దాహం తీరేంతగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువగా తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ తక్కువ నీళ్లు తాగేలా ఆంక్షలు పెడుతుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. ►తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ తగినంతగా సమకూరడానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. ►తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ►క్యాల్షియమ్ అందేలా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ పుష్కలంగా తీసుకోవాలి. ►విటమిన్ బి12తో పాటు విటమిన్ డి సమృద్ధిగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ►ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా ఆదా అవుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి పాలు పట్టడం చాలా అవసరమని ప్రతిఒక్కరూ గుర్తించాలి. తల్లిపాలలో ఉండే కొన్ని ప్రధానమైన అంశాలేలివే... ♦నీరు : పాలలో ఎక్కువ భాగం (87 – 88 శాతం) నీరు ఉంటుంది. ♦ప్రోటీన్లు : బిడ్డకు సరిపడినన్ని (0.9 – 1 %) ప్రోటీన్లు ఉంటాయి. ♦కొవ్వు పదార్థాలు : శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో సమృద్ధిగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి హెల్దీ కొవ్వు పదార్థాలు కావాల్సిందే. పాలు తాగే పసిపాప కూడా అరిగించుకోగల కొవ్వును అందించడం కోసమే ప్రకృతి అమ్మ పాలను తయారు చేసింది. ఇందులో డీహెచ్ఏ అనే కొవ్వుపదార్థం ఉంటుంది. డీహెచ్ఏ అంటే డొకోసా హెగ్జానోయిక్ యాసిడ్ అనే దానికి సంక్షిప్తరూపం. ఇదొక పాలీ అన్శాచ్యురేటెడ్ ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వు కణాలే. అందులోని ఒమెగా–3 ప్యాటీ ఆసిడ్స్లో 97 శాతం ఈ డీహెచ్ఏలే. అంతేకాదు... కేవలం మెదడు మాత్రమే గాక పిల్లల కంటిలోని రెటీనా కూడా ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వు పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. ఈ రెటీనా నిర్మితమయ్యే కొవ్వులలో... 93 శాతం ఈ డీహెచ్ఏ కొవ్వులే. ఇక తల్లిపాలలో మరో రకం కొవ్వు పదార్థాలూ ఉంటాయి. అవి ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్కు చెందినవి. వీటిని ఏఆర్ఏ అంటారు. ఆరాకిడోనిక్ యాసిడ్ అనే మాటకు ఏఆర్ఏ సంక్షిప్త రూపం. మెదడులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్లోని 48 శాతాన్ని ఈ ఏఆర్ఏ సమకూర్చుతాయి. ఈ కొవ్వు పదార్థాలన్నింటినీ అమ్మ నుంచి బిడ్డకు అందేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. సాధారణంగా పిండం ఎదుగుదలకు అవసరమైన కొవ్వు పదార్థాలన్నీ ప్లాసెంటా నుంచి అందుతుంటాయి. పిండం ఎదుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలూ ఈ కొవ్వు పదార్థాలు మరింత ఎక్కువగా అందాలి. అందుకే హెచ్డీఏ పోషకాలు బిడ్డకు అందేలా తల్లి తగినంత కొవ్వు పదార్థాలను రిజర్వ్లో ఉంచుకోవాలి. అప్పుడే బిడ్డ మెదడులో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు తల్లి పాలతో అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో అంటువ్యాధులు రాకుండానూ, అలాగే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక దీర్ఘకాలిక జబ్బుల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. అవి... ►తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. ►పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ►తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. ►తల్లిపాలపై పెరిగే పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తద్వారా పెద్దయ్యాక డయాబెటిస్, అధిక రక్తపోటు, తదితర దీర్ఘకాలిక జబ్బులు రావడం చాలా తక్కువ. ►తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (చైల్డ్హుడ్) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ►నవజాత శిశువులలో నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. ఏయే మోతాదుల్లో తల్లిపాలు పిల్లలు తల్లిపాలు తీసుకునే పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. వారి వయసు (రోజులు, వారాలు, నెలలు)ను బట్టి ఆ తేడాలుంటాయి. ఉదాహరణకు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు ఆ చిన్నారి కడుపు ఒక చెర్రీ పండంత ఉంటుంది. అప్పుడా చిన్నారికి ప్రతి రెండు గంటలకోమారు 30 మి.లీ. పాలు అవసరమవుతాయి. ఇలా 24 గంటల వ్యవధిలో 12 సార్లు పాలు పట్టడం అవసరం. అలాగే వారం రోజుల వయసు గడిచిన బేబీ కడుపు చిన్న ‘ఏప్రికాట్’ పండంత సైజు ఉంటుంది. తనకు ప్రతి రెండు గంటలకు ఓసారి 45 నుంచి 60 మి.లీ. తల్లిపాలు అవసరం. అలాగే ఒక నెల వయసు ఉన్న పాప కడుపు పరిమాణం పెద్ద కోడిగుడ్డంత ఉంటుంది. ఆ వయసు పిల్లలకు ప్రతి రెండు గంటలకు ఓసారి 60 మి.లీ నుంచి 150 మి.లీ వరకు అవసరం. ఇక ఇలా పాలు తాగుతున్న చంటిపిల్లలు రోజులో ఆరు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేస్తూ... అలాగే నిర్దేశించిన విధంగా బరువు పెరుగుతూ ఉంటే... ఆ పిల్లలకు తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం. కొన్ని గణాంకాలు నవజాత శిశువులు మొదలుకొని పాలు తాగే చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి, శారీరక, మానసిక వికాసాలకు తల్లిపాలు అవసరంపై అవగాహన ఉన్నప్పటికీ... గణాంకాలు పెద్దగా ప్రోత్సాహకరంగా లేవు. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2019–20 (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం... దాదాపు 88% తల్లులు ఆసుపత్రుల్లో బిడ్డకు జన్మనిస్తున్నారు. అందులో కేవలం 51% మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలో తల్లిపాలు పట్టడం ప్రారంభిస్తున్నారు. 61.9% మంది తల్లులు మొదటి ఆరునెలలు కేవలం తల్లిపాలే పడుతున్నారు. కేవలం 56% మంది పిల్లలు మాత్రమే 6–8 నెలల్లో ఆ వయసుకు తగినట్లుగా అదనపు ఆహారం పొందగలుగుతున్నారు. ఫలితంగా మన దేశంలో 26.9% మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుంటున్నారు. 31.9% మంది పిల్లలు తమ వయసుకు ఉండాల్సిన ఎత్తు పెరగడం లేదు. 18.1% పిల్లలు బలహీనంగా ఉంటున్నారు. 5.5% పిల్లులు ఊబకాయంతో ఉన్నారు. దేశంలోని దాదాపు సగం మంది పిల్లలకు అత్యంత శ్రేష్ఠమైన, ఎన్నెన్నో పోషకాలతో కూడిన, మంచి వ్యాధినిరోధక శక్తిని ఇచ్చే ముర్రుపాలు అందడం లేదు. ఇంకా చెప్పాలంటే గత ఎన్ఎఫ్హెచ్ఎస్–4తో (2015–16) పోల్చినప్పుడు తాజా ఎన్ఎఫ్హెచ్ఎస్–5లో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టే శాతం 2.5% తక్కువగా ఉంది. దీన్నిబట్టి పుట్టగానే తల్లిపాలు పట్టించే సంస్కృతిని పెంపొందించుకోవడం అవసరమనీ, అపోహలేమీ లేకుండా ముర్రుపాలను ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందనీ... ఈ మేరకు దేశంలోని దాదాపు సగంమంది తల్లులకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తేలుతోంది.డబ్ల్యూహెచ్ఓ 1981లో తీసుకొచ్చిన తల్లిపాల ప్రత్యామ్నాయాల నియంత్రణ చట్టాన్ని అనుసరించి... భారత ప్రభుత్వం 1992లో తల్లిపాల ప్రత్యామ్నాయాలు పాలసీసాలు, శిశు ఆహారాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. కొన్ని చట్ట సవరణలతో ఇది మళ్లీ 2003లో సమగ్ర చట్టంగా రూపొంది, అమల్లో ఉంది. దీని ప్రకారం పరిశ్రమల ఉత్పత్తుల వాణిజ్యప్రకటనలు, ప్రోత్సాహకాలను నియంత్రించి... పేరెంట్స్ వాటివైపు ఆకర్షితులు కాకుండా చూడాలి. ఈ చట్ట నిబంధనలూ, వాటి ఉల్లంఘనల పర్యవసానాలపై అవగాహన కల్పించడమే ఈ ఏడాది తల్లిపాల వారోత్సవాల ప్రధానోద్దేశం. -
పెరుగుతో ఇమ్యూనిటీ ఎందుకు పెరుగుతుందంటే?
పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ వేసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు... పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందట. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సైంటిఫిక్ సెషన్స్లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక మహిళలకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నీ అని చెప్పలేం. పెరుగులోని ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ముఖ్యంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చూడటం మాత్రమే కాదు... కడుపులో మంటనూ తగ్గిస్తుంది. అందువల్ల తాజా పెరుగుతో చిలికిన మజ్జిగ తాగగానే కడుపు మంట తగ్గడం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. -
కోవిషీల్డ్ టీకా.. వ్యవధి పెరిగితే మేలే!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 టీకా (భారత్లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో రెండో డోసు తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల, అలాగే, ఆ తరువాత మూడో డోసును కూడా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి బాగా పెరుగుతోందని తేలింది. మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 45 వారాల వ్యవధి వల్ల కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఇది తోసిపుచ్చింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. ‘తగినన్ని టీకాలు అందుబాటులో లేని దేశాలకు ఇది శుభవార్త. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ’అని ఆ స్టడీలో పాల్గొన్న ఆండ్య్రూ పోలర్డ్ వ్యాఖ్యానించారు. మొదటి డోసు వేసుకున్న 10 నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి అద్భుతంగా ఇమ్యూనిటీ పెరిగిందన్నారు. మూడో డోసును ఆలస్యంగా వేయడం వల్ల కూడా సానుకూల ఫలితాలు వెలువడ్డాయన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్తో అతికొద్ది మందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొన్ని దేశాలు ఈ టీకాను నిషేధించగా, కొన్ని దేశాలు యువతకు ఈ టీకా ఇవ్వరాదని నిర్ణయించాయి. -
పసి ముఖానికి ముసుగు తొడగాలా?.. వద్దా? తెలుసుకోండి
విరిసీ విరియని పువ్వుల్లారా.. ఐదారేడుల పిల్లల్లారా... అన్నాడు మహాకవి. పువ్వులు సహజసిద్ధంగా వికసించినట్లే పిల్లల్లో ఇమ్యూనిటీ సహజసిద్ధంగా పెరగాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం కరోనా కట్టడిలో భాగంగా చిన్నారులకు మాస్కులు తొడగాల్సిన పనిలేదంటున్నాయి నూతన అధ్యయనాలు. మాస్కు లేకపోయినా పిల్లలు కరోనా వ్యాప్తి కారకాలు కారంటున్నాయి. ఆ కథేంటో చూద్దాం.. కరోనా కట్టడిలో మాస్కులు, సామాజిక దూరం పాటించడం కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ తాజా అధ్యయనాలు ఈ రెండు అంశాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. ఇంగ్లండ్కు చెందిన నిపుణుల ప్రకారం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్, మాస్కులు ధరించడం తదితర కారణాలతో ప్రతిఏటా పిల్లలకు సోకే పలు సాధారణ వైరల్ వ్యాధులు దూరంగా ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది పిల్లల్లో ప్రతిఏటా ఒక సీజన్లో ఫ్లూ రావడం సాధారణం. కానీ మాస్క్ తదితర ఆంక్షల కారణంగా ఎక్కువమంది పిల్లల్లో గతేడాదిన్నరగా సీజనల్ జలుబు రాలేదు. దీనివల్ల శరీరంలో సాధారణంగా జరిగే ఇమ్యూనిటీ బిల్డింగ్ దూరమైందని నిపుణులు భావిస్తున్నారు. జలుబులాంటివి చేసినప్పుడు పిల్లల శరీరంలోని రక్షణ వ్యవస్థ సదరు వైరస్ను మెమరైజ్ చేసుకొని భవిష్యత్లో అడ్డుకుంటుంది. కానీ అసలు జలుబే సోకకపోవడంతో చిన్నారుల్లో కరోనా అనంతర దినాల్లో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు సోకే ఆర్ఎస్వీ(రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్)పై వైరాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్కు టీకా లేదు. కరోనా ముందు రోజుల్లో పలువురు చిన్నారులు వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరడం అనంతరం క్రమంగా ఈ వైరస్కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం జరిగేది. కానీ కరోనా కట్టడికి అవలంబించిన విధానాలతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. అసలైన సమస్య కరోనా అనంతర దినాల్లో కనిపించవచ్చని, అప్పటికి ఈ ఆర్ఎస్వీ డేంజర్గా మారవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కరోనా పూర్తిగా కట్టడయ్యాక మాస్కుల్లాంటి విధానాలకు ప్రజలు స్వస్తి పలుకుతారని, ఆ సమయానికి పిల్లలు పలు వైరస్లకు ఇమ్యూనిటీ పెంచుకోకపోవడంతో వీటి విజృంభణ అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లపాటు పిల్లలు అతి రక్షణ వలయాల్లో ఉండి హఠాత్తుగా మామూలు వాతావరణంలోకి వస్తే వారిలో మెమరైజ్డ్ ఇమ్యూనిటీ లోపం వల్ల చిన్నపాటి జలుబు కూడా తీవ్ర ఇబ్బంది కల్గించే చాన్సుంది. అందుకే సడలించారా? పిల్లల్లో మాస్కుల వాడకం వల్ల జరిగే మేలు కన్నా జరగబోయే కీడు ఎక్కువని భావించే కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా నివారణార్థ్ధం మాస్కు వాడకం అవసరం లేదని ఇటీవలే డీజీహెచ్ఎస్ సూచించింది. అదేవిధంగా 6–11 ఏళ్లలోపు పిల్లలు మాస్కు ధరించవచ్చు కానీ డాక్టర్ కన్సల్టేషన్ అనంతరమే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అదేవిధంగా పిల్లల్లో కరోనా వస్తే రెమ్డెసివిర్ వాడవద్దని, సిటీస్కాన్ను కూడా పరిమితంగా వాడాలని తెలిపింది. చిన్నారుల్లో కరోనా ముప్పు చాలా తక్కువని, అందువల్ల వీరికి మాస్కు వాడకం అలవాటు చేయకపోవడం తప్పేమీ కాదని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల్లో మాస్కు వాడకం కారణంగా వారు సహజసిద్ధంగా పెంచుకోవాల్సిన ఇమ్యూనిటీ పెరగకుండా పోతుందని నిపుణులు భావిస్తున్నారు. స్కూలుకు పోవచ్చా? చిన్నపిల్లలు స్కూలుకు పోవడం ద్వారా కరోనా ముప్పు అధికం కావచ్చని, వీరివల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాల్లేవని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ అధ్యయనం చెబుతోంది. అయితే టీనేజీ పిల్లలు మాత్రం తప్పక రక్షణ నియమాలు పాటించాలని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్లో జరిపిన రిసెర్చ్ ప్రకారం 9ఏళ్లలోపు పిల్లల వల్ల స్కూళ్లలో కరోనా వ్యాప్తి జరుగుతుందనేందుకు ఆధారాలు లేవు. అయితే 10–19 సంవత్సరాల పిల్లల్లో మాత్రం రిస్కు పెరుగుతూ వస్తుంది. అలాగే బడులు తెరవడమనేది కరోనా వ్యాప్తి రేటుపై చూపిన ప్రభావం కూడా తక్కువేనని తేలింది. మూడు అడుగుల దూరం! టీనేజీలోకి రాని పిల్లల్లో మాస్కు వాడకం వల్ల ప్రయోజనం కన్నా భవిష్యత్లో ఇబ్బందులకే ఎక్కువ చాన్సులున్నాయన్నది నిపుణుల ఉమ్మడి మాట. చిన్నారుల్లో మాస్కు వాడకం కన్నా ఇతరులతో 3 అడుగుల సామాజిక దూరం పాటించేలా చూస్తే చాలంటున్నారు. అలాగే పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చాక వాటిని అందివ్వడం మంచిదంటున్నారు. చిన్నపిల్లలు బడికి ఎక్కువకాలం దూరం కావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపవచ్చని అందువల్ల టీచర్లు, ఇతర స్టాఫ్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను స్కూలుకు హాజరయ్యేలా చూడడం మంచిదని సూచిస్తున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం రెండేళ్ల పైబడిన పిల్లలకు మాస్కు వాడడమే మంచిదని, భవిష్యత్లో ఇమ్యూనిటీ గురించి ఆందోళన పడడం కన్నా ప్రస్తుతం కరోనా బారినుంచి తప్పించుకోవడం కీలకమని వాదిస్తున్నారు. కానీ ఎక్కువమంది మాత్రం పిల్లల్లో మాస్కు వాడకం వారి ఇమ్యూనిటీపై ప్రభావం చూపే అవకాశాలున్నందున వీలయినంత వరకు వాడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
చికెన్+తోటకూర, మటన్+గోంగూర: పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచండిలా!
సాక్షి, హైదరాబాద్: ఇమ్యూనిటీకి ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పటికే చాలామందికి అర్థమయ్యింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగనిరోధకత పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా థర్డ్వేవ్, పిల్లలపై దాని ప్రభావం వార్తల నేపథ్యంలో.. ఒకవేళ అది వస్తే ఎదుర్కొనేందుకు పిల్లలను సంసిద్ధుల్ని చేయాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రులు ఇప్పటినుంచే జాగ్రత్త పడితే వారికి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారు తీసుకునే అహారంలో తగిన మార్పులు, చేర్పులు చేయాలని, రోగ నిరోధకత పెంచే ఆహారం ఎక్కువగా ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో తినే ఆహారం, ఆటపాటలు, నిద్రించే సమయం కీలకపాత్ర పోషిస్తాయి. పిల్లలు అన్నీ ఇష్టంగా తినరు. అందువల్ల వారు ఇష్టపడే ఆహారంలో అవసరమైనవి కలిపి తినిపించాలి. మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వండి పెట్టాలి. ఈ వంటకాలు ప్రయత్నించండి ► చికెన్ + తోటకూర/మెంతికూర ► మటన్ + గోంగూర/ ములక్కాయ/తోటకూర ► ఎగ్ ప్యాండర్+ గ్రీన్పీస్ మసాలా ► రాజ్మా రైస్+ సోయా చంక్స్ మసాలా ► మింట్ రైస్+ మిక్స్డ్ వెజ్ కర్రీ ► బగారా రైస్+ పాలక్ పనీర్ ► జీరా రైస్+ దాల్ ఫ్రై, కర్డ్ రైతా ► మిల్లెట్ బిసిబిల్లా బాత్ ► మిక్స్డ్ వెజ్ సాంబార్+బీన్స్ ఫ్రై, ► టొమాటో కార్న్, మిక్స్డ్ వెజ్/మష్రూమ్/చికెన్ సూప్ అవగాహన కల్పించాలి కరోనా వైరస్ వ్యాప్తి పట్ల పిల్లల్లో కూడా అవగాహన పెరగాలి. ఏడేళ్లలోపు పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను అనుసరించడం చూస్తుంటాం. కాస్త వయసు పెరిగిన పిల్లలైతే పెద్దలు చెప్పే విషయాలను అర్థం చేసుకుంటూ ఇతరులను కూడా అనుసరిస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి పట్ల పిల్లల్లో కూడా అవగాహన పెంచాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే పద్ధతిగా మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తిరిగి ఇంటికి చేరుకున్న వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం, బయట ఉపరితలాలు తగలకుండా జాగ్రత్తపడడం వంటివి అలవాటు చేయాలి. వైద్య సహాయం కోసం, జనరల్ వ్యాక్సినేషన్ కోసం పిల్లలు ఆస్పత్రులకు వెళ్తుండడం సహజం. అలాంటప్పుడు పూర్తి రక్షణతోనే వెళ్లాలి. చదవండి: ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు -
Coronavirus: ఏడాది దాకా ఇమ్యూనిటీ!
సాక్షి సెంట్రల్ డెస్క్: కరోనా సోకి తగ్గాక మనలో ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. ఈ ఇమ్యూనిటీ రెండు, మూడు నెలలు ఉండొచ్చని కొందరు.. ఆరు నెలల వరకూ ఉంటుందని మరికొందరు అంచనా వేస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో తాజా పరిశోధనలు శుభవార్త చెప్తున్నాయి. కరోనా సోకి తగ్గినవారిలో ఏడాది వరకు ఇమ్యూనిటీ ఉంటుందని, వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకొంత ప్రయోజనమని స్పష్టం చేస్తున్నాయి. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. ఇమ్యూనిటీ ఎంత కాలం..? కరోనా వైరస్ సోకి కోలుకున్న వారిపై ఇటీవల రాక్ఫెల్లర్ యూనివర్సిటీ, మరికొందరు శాస్త్రవేత్తలు వేర్వేరుగా పలు పరిశోధనలు నిర్వహించారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ మనుషుల్లోని బోన్ మ్యారో (ఎముక మజ్జ) ప్లాస్మాను ప్రేరేపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో కరోనా సోకి తగ్గినవారిలో ఇమ్యూనిటీ ఏడాదికిపైగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే మరిం త ఎక్కువ కాలం ఇమ్యూనిటీ కొనసాగుతుందని తెలిపారు. కణాలు ‘జ్ఞాపకం’ ఉంచుకుంటాయి ఒక పరిశోధన ప్రకారం.. శరీరంలో కరోనా అంతమైపోయాక కూడా బోన్ మ్యారోలోని కణాలు కరోనాకు సంబంధించిన అంశాలను గుర్తుపెట్టుకుంటాయి. మళ్లీ అవసరమైనప్పుడు వెంటనే కరోనా యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి, రక్తంలోకి వదులుతాయి. ∙‘మెమరీ బీ’ కణాలు నిరంతరం తమ దగ్గరి డేటాను అప్డేట్ చేసుకుంటూనే, మరింత సమర్థవంతంగా మారుతుంటాయని మరో పరిశోధనలో గుర్తించారు. ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి కనీసం 12 నెలల వరకు ఇది కొనసాగుతుందని.. ఆలోగా వైరస్ మళ్లీ సోకితే వెంటనే గుర్తించి, అడ్డుకునేలా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయని తేల్చారు. యాంటీబాడీలు తగ్గినా.. ఇమ్యూనిటీకి సంబంధించి.. కరోనా వైరస్ సోకిన 77 మందిపై పరిశోధనలు చేశారు. వారి రోగ నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులు, కరోనా యాంటీబాడీలు, మెమరీ బీ కణాలను.. 3 నెలలకోసారి చొప్పున 5 సార్లు పరిశీలించారు. ఈ 77 మందిలో కరోనా వచ్చాక నాలుగు నెలలు యాంటీబాడీలు బాగానే ఉన్నాయని, తర్వాత వేగంగా తగ్గాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆపైనా తగ్గిపోతూ వచ్చాయని తేల్చారు. బోన్ మ్యారోలోని మెమరీ బీ కణాలు మాత్రం యథాతథంగా ఉన్నట్టు గుర్తించారు. 75 శాతం మందిలో ఓకే.. మెమరీ బీ కణాలకు సంబంధించి శాస్త్రవేత్తలు మరో పరిశోధన చేశారు. కరోనా వచ్చి తగ్గిన 19 మంది బోన్మ్యారో నుంచి కణజాలాన్ని పరిశీలించారు. వారికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిననాటి నుంచి ఏడు నెలల తర్వాత కూడా.. 15 మంది బోన్మ్యారోలో మెమరీ బీ కణాలను గుర్తించారు. మిగతా నలుగురిలో ఆ కణాలు లేవు. ∙కరోనా సోకి తగ్గిన సుమారు 75 శాతం మందిలో మెమరీ బీ కణాలు మరికొంత కాలం ఉంటున్నాయని.. మరికొందరిలో చాలా తక్కువగాగానీ, మొత్తంగా లేకపోవడం గానీ ఉంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త వేరియంట్లు వచ్చినా.. మెమరీ బీ కణాలు, యాంటీబాడీలు కొత్త వేరియంట్లను ఎదుర్కొంటాయా అన్న దానిపై శాస్త్రవేత్తలు విడిగా పరిశోధన చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న 63 మంది నుంచి నెలకోసారి రక్తం శాంపిల్స్ తీసుకున్నారు. వారిలో యాంటీబాడీలు, మెమరీ బీ కణాలు ఏ విధంగా మారుతున్నాయని పరీక్షించారు. కోవిడ్ తగ్గిన తర్వాత 6–12 నెలల మధ్య యాంటీబాడీల్లో ఏ మార్పు జరగలేదని గుర్తించారు. ఇదే సమయంలో మెమరీ బీ కణాల్లో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వచ్చాయని, పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాయని తేల్చారు. మెమరీ బీ కణాలు అప్డేట్ అయ్యాక అవి ఉత్పత్తి చేసిన యాంటీబాడీలు సమర్థవంతంగా ఉంటున్నాయని, చాలా రకాల కరోనా వేరియంట్లను ఎదుర్కోగలుగుతున్నాయని గుర్తించారు. కరోనా వచ్చాక వ్యాక్సిన్.. పూర్తి ఇమ్యూనిటీ! కరోనా ఇన్ఫెక్షన్ సోకిన ఏడాది తర్వాత పరిశీలిస్తే.. వ్యాక్సిన్ వేసుకున్న పరిస్థితులను బట్టి ఇమ్యూనిటీ వేర్వేరుగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు వ్యాక్సిన్ వేసుకోని వారిలో.. ఇన్ఫెక్షన్ సోకిన ఏడాది తర్వాత కూడా స్వల్పంగా ఇమ్యూనిటీ ఉంటోంది. కొత్త వేరియంట్లు సోకితే ఎదుర్కొనే సామర్థ్యం మరికాస్త తక్కువగా కనిపిస్తోంది. కోవిడ్ సోకి తగ్గిపోయిన తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటోంది. వారికి కొత్త వేరియంట్లు సోకినా కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగే శక్తి సమకూరుతోంది. వీరికి బూస్టర్ డోసుల అవసరం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక్కసారికూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకనివారిలో.. కరోనాను ఎదుర్కొనే మెమరీ బీ కణాలు, యాంటీబాడీలు ఉండవని, వారికి వ్యాక్సిన్ వేసుకున్నా పూర్తి ఇమ్యూనిటీ సమకూరే అవకాశం తక్కు వని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరికి వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరం పడొచ్చని చెప్తున్నారు. చాలా కాలం సంరక్షణ ‘‘కరోనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఉత్పత్తి అయిన మెమరీ బీ కణాలు.. వ్యాక్సిన్ తీసుకున్నాక మరింత సమర్థవంతంగా మారుతున్నాయి. కొత్త వేరియంట్లు సోకినా కూడా గుర్తించి స్పందిస్తున్నాయి. ఇమ్యూనిటీ చాలాకాలం ఉంటోంది. ఇలాంటి వారిలో వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకోకున్నా ఇమ్యూనిటీ కొనసాగుతోంది..’’ – మైఖేల్ నుసేంజ్వేగ్, రాక్ఫెల్లర్ యూనివర్సిటీ ఇమ్యూనాలజిస్ట్ చదవండి: Black Fungus: 6 తప్పుడు కేసులను గుర్తించిన వైద్యులు -
వైరస్నూ ఓడించొచ్చు: చైనీయులు ఏం చేశారో తెలుసా?
► కోవిడ్ వైరస్ చైనాలోనే పుట్టినా.. మనకంటే జనాభాలో పెద్దదైనా.. ఎందుకు ఆ దేశం మనంతగా ఇబ్బంది పడటం లేదు..? అక్కడి విషయాలు బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసే పరిస్థితి లేనప్పటికీ, ఆ దేశం కోవిడ్తో మనంతగా ఇబ్బంది పడటం లేదన్నది మాత్రం వాస్తవం. కారణమేంటి.. అని ప్రశ్నిస్తే.. ఆ దేశ ప్రజల ఆహారపు అలవాట్ల వల్లనే అంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్టు, మైక్రో బయోలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ చైనాకు కొత్తేమీ కాదు. చాలా కాలంగా దానితో ప్రజలు సహజీవనం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు చాలా వైరస్లకు చైనానే పుట్టినిల్లు. ఇది అక్కడి ప్రజల ఆహార విషయాల్లో ఎంతో మార్పు తెచ్చింది. వైరస్ల దుష్ప్రభావాలను ఎదుర్కొనేలా వారి శరీరాన్ని మలుచుకునేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవటం చైనీయులకు అలవాటు. అందుకే వైరస్, బ్యాక్టీరియా పుట్టగా పేర్కొనే గబ్బిలాన్ని సైతం చైనీయులు ఆహారంలో లాగించేస్తారు. కానీ దానితోపాటు కొన్ని ఔషధ గుణాలున్న దినుసులు, ఆకులను జోడిస్తారు. గబ్బిలంతో వచ్చే సమస్యలను ఈ ఔషధ గుణాలున్న దినుసులు రక్షిస్తున్నాయి. ఇప్పుడు మన దేశం కోవిడ్తో అల్లాడుతుంటే, చైనా నిబ్బరంగా ఉండేందుకు ఇదే ప్రధాన కారణంగా మారిందని డాక్టర్ సునీల్ వాస వివరిస్తున్నారు. మన దేశంలో కూడా ఆ రకమైన మార్పు చాలా అవసరమని సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. స్థానిక వైద్యానికీ చైనా పెద్దపీట మనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అల్లోపతి మందు వాడటం అలవాటు. అల్లోపతిలో ఎన్నో విప్లవాత్మక పరిశోధనలు చేస్తున్న చైనా, అదే సమయంలో స్థానిక వైద్య విధానాన్నీ అనుసరిస్తోంది. 80 శాతం మంది చైనా ప్రజలు స్థానిక వైద్యాన్ని అనుసరిస్తారు. మనకంటూ వైద్య విధానాలున్నా.. వాటిని అనుసరించేవారు మన దేశంలో చాలా తక్కువ. కానీ చైనీయులు దీనికి పూర్తి విరుద్ధం. అక్కడి స్థానిక వైద్యం వారి ఇంటిలో భాగం. దానికి సంబంధించిన మందుల్లో శరీర రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ మొక్కల గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్రమంగా బ్యాక్టీరియాలు, వైరస్లను తట్టుకునేలా వారి శరీరాలను మార్చేం తగా అక్కడి వైద్యవిధానం ఉపయోగపడుతోంది. చైనా కొన్ని రకాల మసాలా దినుసులను బాగా పండిస్తోంది. వాటిని జనం విపరీతంగా వాడతారు. అప్పటి మన వంటకాలు ఇప్పుడేవీ.. మన పూర్వీకులు ఎన్నో సంప్రదాయ ఔషధ గుణాలున్న పదార్థాలను వంటల్లో భాగం చేసుకున్నా, క్రమంగా మనం వాటికి దూరమవుతూ వచ్చాం. గతంలో వంటల్లో కారం కోసం మిరియాలను వాడేవారు. అద్భుత ఔషధ గుణాలు దాని సొంతం. కానీ ఇప్పుడు మిరియాల వాడకం నామమాత్రం. ఇలా ఎన్నింటినో దూరం చేసుకున్నాం. అలా మన శరీరాలు రోగనిరోధక శక్తిని కోల్పోతూ వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ విపరీతంగా ప్రభావం చూపటానికి అది కారణమవుతోంది. మన నిత్యం చూసే కొన్ని మసాలా దినుసులు, కూరగాయలు, పళ్లు క్రమం తప్పకుండా వాడితే కోవిడ్ను కూడా తట్టుకునేలా మన శరీరం సిద్ధమవుతుంది. ‘టూడీజీ’లోని ఓ గుణం పసుపు సొంతం కోవిడ్ను కట్టడి చేసే మందుగా ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు టూడీజీ. ఈ మందులోని ఓ గుణం పసుపు సొంతం. పసుపులో బెర్బెరీన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే షుగర్ను చెడు బ్యాక్టీరియా, వైరస్లకు అందకుండా కట్టడి చేయగలదు. షుగర్ అందకుంటే అవి బలహీనపడతాయి. గతంలో పసుపును బాగా వాడేవారు. కానీ పాశ్చాత్య ఆహారపు అలవాట్లలో పసుపు వినియోగం చాలా తక్కువ. అలా ఇప్పుడు చాలా ఆహారపదార్థాల్లో పసుపు మాయమైంది. పసుపులో దీంతోపాటు మరిన్ని కెమికల్స్ ఉన్నాయి. అవి శరీరానికి బాగా పట్టాలంటే మిరియాలు తోడు కావాలి. అంటే పసుపుతోపాటు మిరియాల వాడకం చాలా అవసరం. కానీ మనం మిరియాల వాడకాన్ని దాదాపు మరిచిపోయాం. కరివేపాకు, కొత్తిమీర ఎంతో మేలు కరివేపాకులో ఉండే ట్రిప్తాంత్రిన్ అనే రసాయనం కోవిడ్ వైరస్ ఉధృతిని తగ్గిస్తుంది. ఇది పరిశోధనలో కూడా తేలింది. కానీ మనం కూరల్లో దాన్ని విరివిగా వాడతాం, అయితే తినేప్పుడు తీసి పడేస్తాం. అందరికీ దాన్ని విరివిగా తినే అలవాటు ఉండి ఉంటే వైరస్పై అది దానిపని అది చేసుకుపోయేది. కరివేపాకుతో కలిపి వాడే కొత్తిమీరలో లీట్యోలిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. తులసిలో కూడా ఈ రసాయనం ఉంటుంది. పాలకూరలో క్వురిసిటిన్, క్యాంఫెరాల్, మిర్సిటిన్లాంటి ఫ్లేవనాల్స్ ఉంటాయి. ఇవి క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బ్ర కోలిలో కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, యాంటీ వైరస్తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తి ఉంటేనే వైరస్కు కట్టడి ఉంటుంది. ఆ విషయంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. లీట్యోలిన్ అధికంగా ఉండే బెండకాయ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చిక్కుడు జాతి కూరలు కూడా వైరస్పై ప్రభావం చూపగలవు. శరీరంలో ఉండే మాస్ట్ సెల్స్ ఉత్తేజం చెందితే వైరస్ సులభంగా విస్తరిస్తుంది. అవి ఉత్తేజం చెందకుండా లిట్యోలిన్ ఉపయోగపడుతుంది. ఈ పండ్లతో స్పైక్ ప్రొటీన్కు చెక్ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ను దెబ్బతీసే హెస్ప్రిడిన్ ఉండే నారింజ, బత్తాయి, సంత్రా, దబ్బకాయ, నిమ్మలాంటి వాటిని అధికంగా తీసుకోవాలి. ఆ రసాయనం పండు కంటే పొట్టులో ఎక్కువగా ఉంటుంది. ఆ పొట్టును కూడా మనం వినియోగించుకోగలగాలి. పొట్టుతో తయారు చేసిన పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వాడాలి. నల్ల ద్రాక్ష యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయి. బెర్రీస్లో యాంథోసియానీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మనం కూడా మారాలి ఇవన్నీ మన చుట్టూనే ఉంటాయి. కానీ మన జీవన శైలి మారిపోయి, పాశ్చాత్య పోకడలు పెరిగిన తర్వాత వీటి వినియోగం తగ్గిపోయింది. మళ్లీ వీటిని బాగా వినియోగించుకోవటంతో పాటు వైరస్పై సమర్ధవంతంగా పోరాడే గుణాలున్న మసాలా దినుసులను వంటల్లో భాగం చేసుకుంటే సమీప భవిష్యత్తులో వైరస్లను తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి మన వశమవుతుంది. కోవిడ్ ఇప్పటికిప్పుడు మాయమయ్యేది కాదు. మరికొన్నేళ్లపాటు దాని ప్రభావం ఉంటుంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్లాంటివి ఉత్తేజం చెందుతున్నాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే మనం కూడా కచ్చితంగా మారాలి. చదవండి: e- pass: కావాలా.. ఇలా అప్లై చేసుకోండి -
బీపీ ఉందా.. ఈ జాగ్రత్తలు పాటించండి
సాక్షి, హైదరాబాద్: రక్తపోటును (బీపీ) ‘సైలెంట్ కిల్లర్’గా వైద్యులు అభివర్ణిస్తుంటారు. బీపీ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, కంటిచూపు కోల్పోవడం, డిమెన్షియా వంటివి సంభవిస్తాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బీపీ, షుగర్ వంటివి నియంత్రణలో లేక రోగ నిరోధకశక్తి తగ్గి సులభంగా కరోనా బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగినట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేప థ్యంలో ‘మీ రక్తపోటు ఎంతుందో కచ్చితంగా తెలుసుకోండి. దాన్ని నియంత్రణలో ఉంచండి. దీర్ఘ కాలం జీవించండి’ అనే నినాదంతో ‘వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్’ముందుకు సాగుతోంది. నేడు వరల్డ్ హైపర్టెన్షన్ డే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్తపోటుతో ముడిపడిన అంశాలు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కన్సల్టెంట్ ఫిజీషియన్ డా.ప్రభుకుమార్ చల్లగాలి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సమస్య గుర్తించగానే చికిత్స చేయాలి.. రక్తపోటులో వస్తున్న మార్పులను గుర్తిస్తే.. వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. దాదాపు 50 శాతం మందికి వారిలో బీపీ సమస్య ఉన్నట్లు అవగాహన కూడా ఉండట్లేదు. బీపీ పెరగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొవ్వులు చేరడంతో లోపలి పొర చిట్లిపోయే ప్రమాదం ఉంది. వరల్డ్ హైపర్టెన్షన్ లీగ్ (డబ్ల్యూహెచ్ఎల్) సూచనల ప్రకారం బీపీ ఉందో లేదో తెలుసుకునేందుకు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం డాక్టర్ల వద్ద ఉండే స్ఫిగ్మో మానోమీటర్లు అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన బీపీ డిజిటల్ మీటర్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ 140 నుంచి 80 లోపు రక్తపోటు ఉండేలా చూసుకోవాలి. ముందుగా దీన్ని గుర్తించి మందులు వాడితే ఎక్కువ కాలం జీవించి ఉండేందుకు అవకాశం ఉంటుంది. వారం నుంచి 10 రోజుల పాటు బీపీ చెక్ చేసి, సరాసరి పాయింట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీపీ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. 140 నుంచి 90 లోపు బీపీ లేకపోతే వెంటనే మందులు వాడాలి. అనియంత్రిత రక్తపోటు ఎక్కువ కాలం ఉంటే కిడ్నీలు పాడవుతాయి. కంటి వెనుక భాగంలో రక్తనాళాలు చిట్లి బ్లడ్ స్పాట్స్ కనిపించడంతో పాటు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. గుండెలో, మెదడులో రక్తనాళాలు చిట్లే అవకాశాలుంటాయి. మెదడులో రక్తం గడ్డ కట్టే ప్రమాదమూ లేకపోలేదు. బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. ► క్రమంతప్పకుండా బీపీ మందులు వాడాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్లగా ఎక్సర్సైజులు పెంచాలి. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. ► కిడ్నీ సమస్యలున్న వారు, రక్తంలో సమస్యలున్న వారికి ప్రోటీన్ ఫుడ్తో సమస్యలు వస్తాయి. చేపలు, కోడిగుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. ► కోవిడ్ బాధితులు ఆందోళనతో బీపీ పెంచుకుంటున్నారు. అలా ఆందోళన చెందొద్దు. ► కరోనా బాధితుల్లో బీపీ, షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. అందుకు తగిన మందులు వాడాలి. ► బీపీ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 7 రెట్లు పెరుగుతాయి. బీపీతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల సులభంగా కోవిడ్ బారిన పడే అవకాశాలుంటాయి. ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.. కోవిడ్ రాక ముందే జాగ్రత్త చర్యల్లో భాగంగా రక్తపోటు నియంత్రణలో ఉండాలి. బీపీ కంట్రోల్లో లేకపోతే రక్త ప్రసరణ బాగా పెరిగి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్కు దారితీస్తాయి. అందువల్ల ముందుగానే మందులు వాడి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. అందువల్లే కరోనా చికిత్స సమయంలో రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతారు. లో డెన్సిటీ లిపో ప్రోటీన్లు రక్తంలో, రక్తనాళాల్లో పెరిగితే గుండెపోటు వస్తుంది. -
ఇమ్యూనిటి బూస్టింగ్ డ్రింక్ తయారు చేసుకోండిలా!
తాజాగా ఉన్న మునగాకులను అరకప్పు తీసుకుని దానిలో విత్తనం తీసేసిన పచ్చి ఉసిరికాయను ముక్కలుగా కోసి వేయాలి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో అరగ్లాసు నీళ్లు పోసి జ్యూస్లా చేసుకోవాలి. తరువాత జ్యూస్ను వడగట్టి రోజూ పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మునగ ఆకులు అందుబాటులో లేనివారు, వీటికి బదులు కొత్తిమీర, పుదీనాను వాడ వచ్చు. ఉసిరి కాయ లేకపోతే మునగ ఆకుల పేస్టులో నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఇమ్యూనిటీ పేస్ట్! నాలుగు కరివేప ఆకులు, తులసి ఆకులు నాలుగు తీసుకుని మెత్తని పేస్టులాగా నూరుకోవాలి. ఈ పేస్టుని ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోని తినాలి. రోజూ ఏదోక సమయంలో ఈ పేస్టు తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది. బ్యూటిప్స్ బ్లాక్ హెడ్స్, మృతకణాలు తొలగిపోతే ముఖవర్ఛస్సు పెరుగుతుంది. ఈ రెండింటిని తొలగించుకోవడానికి.. ఒక అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దీనిలో బరకగా పొడిచేసుకున్న ఒక స్పూన్ ఓట్స్, స్పూను తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఎనిమిదో నంబర్ ఆకారంలో గుడ్రంగా, పైనుంచి కిందకు, కింద నుంచి పైకి మర్దనా చేసుకుని పది నిమిషాలపాటు అలా వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్హెడ్స్ పోయి ముఖం మెరుస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. -
కరోనా: గుడ్లు, చికెన్, చేపలు .. శాకాహారులైతే
నాన్వెజ్ తినేవారికి కరోనా రోగికి దాని తీవ్రతను బట్టి కిలోకు 1 గ్రాము నుంచి 1.5 గ్రాము దాకా ప్రొటీన్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ ప్రొటీన్స్ను ఆహారం ద్వారా అందుకోవాలంటే గుడ్లు, చికెన్, చేపలు తదితర నాన్వెజ్తో లభిస్తాయి. శాకాహారులైతే పప్పు దినుసులు, పప్పులు.. శాకాహారులైతే పప్పు దినుసులు, కందిపప్పు, పెసర, మినప్పప్పు తదితరాల్లో 24 శాతం వరకు ప్రొటీన్ ఉంటుంది. అలాగే బొబ్బర్లు, రాజ్మా, శనగలు వంటి వాటిలో ప్రొటీన్తో పాటు బి విటమిన్, పీచు పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పాల సంబంధ ఉత్పత్తులు చీజ్, పన్నీర్తో పాటు సీడ్స్, నట్స్ నుంచి కూడా ప్రొటీన్స్ అందుతాయి. ముఖ్యంగా సీడ్స్, నట్స్లో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మేలు చేస్తాయి. సప్లిమెంట్స్ అవసరమే కానీ.. విటమిన్లు సప్లిమెంట్స్ రూపంలో కూడా లభిస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరమే. ఇవి కూడా మనిషి, మనిషికీ మారుతుంటాయి. ఉదాహరణకు ఎప్పుడూ ఏసీలో ఉండే వారికి విటమిన్ డి తప్పనిసరి. అయితే వీలైనంతగా సహజ పద్ధతుల్లో, ఆహారం ద్వారా లభించేలా చూసుకోవాలి. ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటే పౌష్టికాహార సమతుల్యత దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి? పోషకాలు అధికంగా కలిగిన ఆహారం శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. బాదం పప్పులో పోషకాలు అధికం. విటమిన్–ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడంతో పాటుగా శ్వాస సంబంధిత రోగ నిరోధక వ్యవస్ధకూ తోడ్పడుతుంది. ఇందులో జింక్, ఐరన్ సైతం ఉంటాయి. అలాగేప్రొ బయాటిక్ అధికంగా కలిగిన పెరుగు ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. వ్యాధికారకాల (పాతోజెన్స్)కు వ్యతిరేకంగా రక్షణను మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది. దీనిలో కాల్షియం, మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. పచ్చి మామిడిలో విటమిన్ ఏ తో పాటు సీ కూడా అధికంగా ఉంటుంది. – రితికా సమద్దార్, డైటెటిక్స్, మ్యాక్స్ హెల్త్కేర్ -
రోగ నిరోధక శక్తి పెరగాలంటే చిరుధాన్యాలే సరి..!: ఖాదర్ వలి
వాషింగ్టన్: చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి లభిస్తుందని మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా నిర్వహించిన వెబినార్లో స్పష్టం చేశారు. తరతరాల నుంచి వాడిన చిరు ధాన్యాలను మనం విస్మరించడం వల్ల నేడు అనేక రోగాలు, వైరస్లు మానవ శరీరంపై సులువుగా దాడి చేస్తున్నాయని ఆయన అన్నారు. నాట్స్, ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా నిర్వహించిన వెబినార్లో ఖాదర్ వలి మాట్లాడారు. కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు ఈ ఐదింటిలో అద్బుతమైన ఔషద గుణాలు ఉన్నాయని ఆయన వివరించారు. మనలోని రోగ నిరోధక శక్తిని ఈ ఐదు చిరు ధాన్యాల వాడకంతో పెంచుకోవచ్చని తెలిపారు. మన ఆరోగ్యాన్ని మన పూర్వీకులు ఎలా కాపాడుకున్నారు..? వాళ్లు ఎందుకు అంత బలంగా ఉన్నారనే విషయాన్ని ఖాదర్ వలి వివరించారు. ఈ వెబినార్ లో పాల్గొన్న అనేక మంది అడిగిన ఆరోగ్య ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. చిరు ధాన్యాలపై ఉన్న సందేహాలను తీర్చారు. చిరు ధాన్యాల వాడకాన్ని మన జీవన విధానంలో భాగం చేసుకుంటే సగం జబ్బులను నియంత్రించవచ్చని తెలిపారు.కాగా ఈ వెబినార్కు దాదాపు 200 మందికి పైగా ఔత్సాహికులు ఆన్లైన్ ద్వారా అనుసంధానమయ్యారు. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ వెబినార్కు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్లలకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలియజేసింది. చదవండి: అన్నమయ్య సంకీర్తనలు- సామాజిక దృక్పథంపై కార్యక్రమం -
హే! హెర్డ్ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 60 శాతం మందికి కోవిడ్ సోకితే ఇక హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే. ఇక వైరస్ వ్యాప్తి తగ్గి క్రమంగా అంతర్థానం అవుతుంది’.. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారంలో ఉన్న మాట ఇది.‘ఇప్పటికే హైదరాబాద్లో 54 శాతం మంది కోవిడ్ బారినపడ్డారు’.. కోవిడ్ తొలిదశ ముగిసిన సమయంలో సీసీఎంబీ చేసిన ప్రకటన ఇది. ఈ లెక్కన ఇప్పటికే హైదరాబాద్లో 60 శాతాన్ని మించి జనం ఇన్ఫెక్ట్ అయినట్టే. అంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి, కరోనా వ్యాప్తి తగ్గిపోవాలి. కానీ వేలకొద్దీ కేసులు నమోదవుతున్నాయి. మరేమిటి విషయం అంటే.. ప్రచారంలో ఉన్నట్టుగా 60% మందికి సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్నది ఉత్తమాటేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకుంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు. వందేళ్ల కిం ద ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్ ఫ్లూ నాటి పరిస్థితిని, ఇటీవల స్వీడన్ హెర్డ్ ఇమ్యూనిటీని ప్రయత్నించి దెబ్బతినడాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు జరిగిందేమిటి? పారిశ్రామిక విప్లవం వచ్చి ఆధునిక సమాజం మొదలైన తర్వాత వచ్చిన మహమ్మారి స్పానిష్ ఫ్లూ. మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తూనే దాని దాడి మొదలైంది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని స్వదేశాలకు వెళ్లిన సైనికులు ఈ వైరస్ను మోసుకెళ్లారు. తొలుత అమెరికాలో ఈ వైరస్ వెలుగు చూసినా.. ఆ దేశ సైని కులు యూరప్కు వెళ్లినప్పుడు ఒక్కసారిగా ప్రబ లింది. దాని అసలు ప్రభావం స్పెయిన్ నుంచి మొదలైంది. దాంతో ఆ వైరస్కు స్పానిష్ ఇన్çఫ్లూ యెంజా పేరు పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారినపడి దాదాపు మూడున్నర కోట్ల మంది చనిపోతే.. అందులో ఒక్క మన దేశంలోనే కోటిన్నర మంది చనిపోయినట్టు అంచనా. అంటే వైరస్ సోకినవారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. అప్పటి జనాభా ప్రకారం చాలా మందికి వచ్చినట్టే. ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితిని నిపుణులు ప్రస్తావనకు తెస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్మి దెబ్బతిన్న స్వీడన్.. కోవిడ్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోగా ఒక్క స్వీడన్ మాత్రం దానికి వ్యతిరేకంగా అడుగేసింది. ఆ దేశ ఎపిడమాలజిస్ట్ అండర్స్ టాగ్నెల్ ప్రభుత్వానికి హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకోవాలని సూచించిన ఫలి తం అది. స్వీడన్లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం టాగ్నెల్ను కరోనా కంట్రోల్ యూనిట్ చీఫ్గా నియమించింది. లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, హెర్డ్ ఇమ్యూనిటీ విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. దాంతో దుకాణాలు, బార్లు, మాల్స్, ప్రీస్కూల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు అన్నీ తెరిచే ఉంచారు. అక్కడే తేడా కొట్టింది. నిజానికి స్వీడన్ చిన్న ధనిక దేశం.. జనాభా కోటిన్నర మాత్రమే. పార్టీలు, వేడుకలు నిత్యకృత్యం. అయితే ఆ దేశ సగటు ఆయుర్ధాయం 86 ఏళ్లు. దాంతో వృద్ధుల సంఖ్య ఎక్కువ. 65 ఏళ్లపై వయసున్నవారు ఆ దేశ జనాభాలో దాదాపు 24 శాతం ఉన్నారు. ఇలాంటి క్రమంలో హెర్డ్ ఇమ్యూనిటీ విధానం గట్టి దెబ్బకొట్టింది. కేసులు విపరీతంగా పెరిగిపోయి, ఆస్పత్రులు నిండిపోయాయి. అక్కడ తొలి నాలుగు నెలల్లో 3,460 మంది కరోనాతో చనిపోతే.. అందులో 70 ఏళ్లు, ఆపై వయసున్న వారు 2,975 మంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో హెర్డ్ ఇమ్యూనిటీ యోచనకు మంగళం పలికి.. లాక్డౌన్ పెట్టారు. జాగ్రత్తలు తెలియక.. ప్రస్తుతం కోవిడ్కు అడ్డుకట్ట వేయాలంటే మాస్కు లు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి నిబంధనలు అమలవుతున్నాయి. కానీ స్పానిష్ ఫ్లూ నాటి పరిస్థితి దీనికి కాస్త భిన్నం. మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తెలియవు. వైరస్ సోకి ఎవరైనా జ్వరం బారిన పడితే.. వారిని పరామర్శించేందుకు చుట్టుపక్కల జనాలు వచ్చేవారు. ఎవరైనా వైరస్తో చనిపోతే అంతిమ సంస్కారాలకు పెద్ద సంఖ్యలో గుమిగూడేవారు. దీంతో చూస్తూండగానే స్పానిష్ ఫ్లూ దేశం మొత్తం వ్యాపించింది. సరైన వైద్య వసతుల్లేక జనం విలవిల్లాడారు. కొన్ని ఊళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా వైరస్ దేశంలోని ప్రతి గడపనూ తట్టిందని.. ఓ అంచనా ప్రకారం దాదాపు 85 శాతం మంది ప్రజలకు ఫ్లూ సోకిందని నిపుణులు చెప్తున్నారు. మిగతావారిలో రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉండటంతో దానిబారిన పడలేదు. అంటే 60 శాతం మందికి వైరస్ సోకితే హెర్డ్ (మూకుమ్మడి) ఇమ్యూనిటీ వచ్చి వైరస్ మాయమవుతుందన్న మాట సరికాదని అంటున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీకి ఆధారం లేదు.. ‘‘కోవిడ్ను కట్టడి చేసే క్రమంలో వందేళ్లనాటి స్పానిష్ ఫ్లూను అధ్యయనం చేయడం చాలా అవసరం. దానికి దీనికి చాలా పోలికలున్నాయి. ఆ వ్యాధితో ప్రపంచంలో బాగా దెబ్బతిన్న దేశం మనదే. ఇక్కడ దాదాపు కోటిన్నర మందిని స్పానిష్ ఫ్లూ పొట్టనపెట్టుకుంది. ప్రతి ఇంట్లో వైరస్ జాడ కనిపించింది. అప్పట్లో వైరస్ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన లేక, ఆధునిక వైద్యం లేక భారీగా మరణాలు సంభవించాయి. 60% మందికి సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్న మాటకు నాటి ఉదంతంలో ఎక్కడా ఆధారాలు లేవు. అందువల్ల ఆ దిశగా యోచించకుండా వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయడం, జనం నిబంధనలు పాటించేలా చేయడంపై దృష్టి పెట్టాలి. మ్యుటేషన్స్ వల్ల వ్యాక్సిన్ల పనితనం ఎంతనే విషయంలోనూ పరిశోధనలు సాగాలి.’’ - డాక్టర్ రాజారెడ్డి, ప్రముఖ న్యూరో సర్జన్ -
కరోనా వేగం తగ్గాలంటే టీకా వేగం పెరగాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కరోనాపై యుద్ధం ఊపందుకుంటోంది. పలు రాష్ట్రాలు, నగరాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మరోవైపు రోజుకు సగటున 30 లక్షల మందికి టీకాలిస్తున్నారు. అయితే రెండు వ్యాక్సిన్లతో మూక నిరోధకతకు ఎంత సమయం పడుతుంది? అందరికీ రెండు డోసుల టీకాలిచ్చేందుకు సరిపడా ఉత్పత్తి చేస్తున్నామా? కరోనా మహమ్మారి గురించి పలువురి మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. ఏప్రిల్ 16 నాటికి దేశం మొత్తమ్మీద వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 11.72 కోట్లకు చేరుకుంది. సుమారు 130 కోట్ల జనాభాలో ఇది దాదాపు 10 శాతం. వీరిలో 10 కోట్ల మంది మొదటి డోస్ తీసుకోగా, మిగిలిన 1.72 కోట్ల మంది మాత్రమే సెకండ్ డోస్ తీసుకున్నారు. అంటే దాదాపు ఒక్క శాతం మంది జనాభాకు మాత్రమే కరోనా నుంచి రక్షణ ఉందన్నమాట. ప్రతి ఐదుగురి లో ముగ్గురు టీకా ద్వారా రక్షణ పొందగలిగితేనే మూక నిరోధకత సాధ్యమన్న నిపుణుల మాటను పరిగణనలోకి తీసుకుంటే.. టీకా వేగం గణనీయంగా పెరగాల్సిన అవసరముంది. ఇది జరగాలంటే వ్యాక్సిన్ ఉత్పత్తి రేటు ఎక్కువ కావాలి. భార త్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ల ఉమ్మడి ఉత్ప త్తి సామర్థ్యం నెలకు గరిష్టంగా 11.3 కోట్లు మాత్ర మే. అంటే రోజుకు 38 లక్షల టీకాలన్న మాట. 60 శాతం టీకాలకు ఏడాది? కరోనా నుంచి రక్షణ కల్పించే మూక నిరోధకత సాధించేందుకు దేశీయంగా టీకా కార్యక్రమం వచ్చే ఏడాది మే నెల వరకూ జరగాల్సి ఉంటుంది. రోజూ కొంచెం అటు ఇటుగా 35 లక్షల మందికి టీకాలిస్తారని అనుకుంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 40 శాతం జనాభాకు టీకాలివ్వొచ్చు. (130 కోట్ల జనాభాలో 40 శాతం 52 కోట్లు కాగా.. ఒకొక్కరికి రెండు డోసుల చొప్పున 104 కోట్ల డోసులు అవసరం. రోజుకు 35 లక్షల చొప్పున టీకాలిస్తే 52 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేందుకు దాదాపు 261 రోజుల సమయం పడుతుంది) ఈ సంఖ్య 60 శాతానికి చేరాలంటే మరో 5 నెలల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేశారు. ఆ సమయానికి సుమారు 145 కోట్ల టీకాల అవసరం ఉంటుంది. సీరమ్, భారత్ బయోటెక్లు రెండూ ఏడాదికి దాదాపు 100 నుంచి 130 కోట్ల టీకాలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. ఏప్రిల్ 16 నాటికి దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయాయి. మరణాలు కూడా వెయ్యికి చేరుకున్నాయి. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలంటే రోజుకు కనీసం కోటి మందికి టీకాలివ్వాలని ఇండియా స్పెండ్ వెబ్సైట్కు చెందిన వ్యాధి నిపుణులు ఆర్.గిరిధర్ బాబు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడిస్తున్న వేగంతోనే కార్యక్రమం కొనసాగితే డిసెంబర్ నాటికి 23% జనాభాకు మాత్రమే టీకాలివ్వొచ్చని, మూక నిరోధకతకు ఇది సరిపోదని చెబుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, సీషెల్స్, ఇజ్రాయెల్లో 40% జనాభాకు టీకాలిచ్చిన తర్వాత కేసుల సంఖ్య 40% వరకు తగ్గిపోయిందని వివరించారు. కొత్త టీకాలు వస్తాయా? పెరుగుతున్న కోరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ టీకాకు కేంద్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి విదేశీ టీకాలకూ అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే స్పుత్నిక్–వీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే దేశీయంగా మరో 1.25 కోట్ల మం దికి సరిపడా టీకాలు అందుబాటులోకి వస్తాయి. స్పుత్నిక్–వీ టీకా తయారీ, పంపిణీ హక్కులు సంపాదించుకున్న డాక్టర్ రెడ్డీస్, హెటెరో, గ్లాండ్ విర్చో బయోటెక్ కంపెనీలతో కలసి టీకా ఉత్పత్తి చేపట్టనున్నాయి. దీనికి అదనంగా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) కూడా దేశీయంగా మూడు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టనుంది. ఈ కంపెనీలన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టి వచ్చే నెల చివరికల్లా కొన్ని కోట్ల టీకాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. చదవండి: ఒకసారి ఈ మందు వాడితే కరోనా నుంచి నెలరోజుల రక్షణ! -
కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ వద్దు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రారంభమైన 24 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైరాలాజిస్టులు, హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఎందుకంటే సహజంగా తయారయిన యాంటీబాడీలు.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అభివృద్ధి అయిన యాంటీబాడీల కంటే ఎక్కువ రోజులు.. ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా కేవలం 44 కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీని బట్టి సహజంగా తయారయిన యాంటీబాడీలు ఎక్కువ కాలం కొనసాగుతాయని తెలుస్తోంది. ఇక ఇన్ఫ్లుయేంజా వైరస్ను తీసుకుంటే ఇది ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుంది. దీని విషయంలో వ్యాక్సిన్ కన్నా శరీరంలో సహజంగా తయారయిన యాంటీబాడీలు ఇన్ఫ్లుయేంజా వైరస్ను ఎదుర్కొవడంలో ఎంతో మెరుగైన రోగనిరోధక శక్తిని కనబరుస్తాయి’’ అన్నారు. అంతేకాక ప్రస్తుతం దేశం హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువలో ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకూడదని జయప్రకాశ్ హితవు పలికారు. చదవండి: ‘2019, డిసెంబర్కు ముందు అక్కడ కరోనా లేదు’ -
ఆనియన్ టీతో రోగనిరోధక శక్తి
సాధారణంగా సీజనల్ వ్యాధులను నివారించుకోవడానికి మన ఇళ్లలోనే ఎన్నో చిట్కాలు ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సాధారణ వ్యాధులకు ఇంట్లోని పెద్దవాళ్లు వంటింటి వస్తువులతోనే చిటికెలో ఉపశమనం కలిగించే ఔషధాన్ని తయారు చేసి ఇస్తుంటారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు తరచూ చెబుతుంటారు. కానీ వాటిపై ఈ తరం వారు అంతగా నమ్మకం ఉంచరు. అయితే పెద్దలు చెప్పినట్లుగానే వంటింటి పదార్థాలలో తక్షణ ఉపశమనం పొందే ఎన్నో గుణాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అందులో ఒకటి ఉల్లిపాయ టీ కూడా. ఉల్లిపాయలు వంటల్లో రుచిని ఇవ్వడమే కాక, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో లక్షణాలను ప్రేరేపిస్తుందట. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి కూడా ఉంది. అయితే ప్రస్తుతం చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆనియన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట. అంతేగాక ఉల్లిపాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు కూడా అమూల్యమైన వనరుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కప్పు టీని మీ రోజువారి ఆహారపు అలవాట్లలో చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ టీని ఉల్లిపాయతో లేదా వాటి తొక్కలతో కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ టీ: ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి. ఉల్లిపాయ పీల్ టీ: టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులు వేసి నీటిని మరగించాలి, ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి. వేడి వేడి నీటిలో సుమారు 10 నిమిషాలు పాటు ఈ ఉల్లిపాయ తొక్కలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. -
భారత్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా?
సాక్షి, హైదరాబాద్: భారత్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహించిన సెరో సర్వేల ద్వారా చాలామందిలో కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు స్పష్టమైంది. కొన్ని ప్రాంతాల్లో 60–70 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్, పుణేల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్–19 కారక వైరస్ను అడ్డుకునే యాంటీబాడీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇటీవలే కరోనా బారిన పడ్డవారు. కానీ హెర్డ్ ఇమ్యూనిటీకి అవసరమైన దాని కంటే ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలు కలిగి ఉన్నారు. (ప్రపంచానికి పెను సవాలు.. కరోనా) దీంతో తరచూ కరోనా వైరస్ల బారిన పడుతుండటం(కరోనా వైరస్ కుటుంబంలో దాదాపు 32 రకాలు ఉన్నాయి. జలుబుకు కారణమైన వైరస్ కూడా ఇదే కుటుంబానికి చెందినది. కోవిడ్–19 వ్యాధిని కలుగజేసే కరోనా వైరస్ మనుషుల్లోకి ప్రవేశించడం వల్లే సమస్య తీవ్రంగా ఉంది) వల్ల వాటి కోసం ఉత్పత్తి అయిన యాంటీబాడీలతో వైరస్ నుంచి రక్షణ లభిస్తుండవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్ లాంటి పెద్ద దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం.. ఇతర ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా ఉండటం సహజమేనని, అయితే దేశం మొత్తమ్మీద ఏం జరుగుతోందన్నదే ముఖ్యమని వారు అంటున్నారు. -
పిల్లల చిరుతిండి.. డిమాండ్ దండి!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి రాక ముందు పిల్లలు ఏ స్నాక్స్ అడిగినా పెద్దలు అడ్డుచెప్పేవారు కాదు. అయితే, వైరస్ వచ్చాక పిల్లల డిమాండ్లను తోసిపుచ్చుతున్నారు. కారణం.. వైరస్ భయంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆ స్నాక్స్ ఉపయోగపడవనే ఆలోచనే. దీంతో పిల్లల చిరుతిండి తయారుచేసే కంపెనీల ప్రణాళికల్లో మార్పులు తప్పనిసరి అయ్యాయి. పదేళ్లలోపు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదపడేలా స్నాక్స్ రూపం లో వివిధ తినుబండారాలు అందించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గతంలో చిన్న పిల్లల చిరుతిండి, స్నాక్స్ సెగ్మెంట్ను కంపెనీలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా నూతన ఆవిష్కరణల వైపు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ స్టార్టప్లు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పిల్లల చిరుతిండి కోసం ప్రత్యేకంగా ఒక సెగ్మెంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు కార్యాచరణ చేపట్టగా మంచి ఫలితాలే నమోదయ్యాయి. ప్రీ బయోటెక్ చాక్లెట్లు, హోల్ గ్రెయిన్ స్నాక్స్, పల్లీ, డ్రై ఫ్రూట్స్, ఇతర నట్స్తో తయారు చేసిన చాక్లెట్ బార్లు, ఇలా భిన్నమైన ఉత్పత్తుల ద్వారా చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయ త్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే బెల్లం తో తయారుచేసిన తినుబండారాలు, ప్రొటీన్లతో కూడిన పానీయాలు, డెయిరీ ప్రొడక్ట్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ పెరుగుతోంది. ప్రస్తుతం మనదేశంలో చిన్నపిల్లల స్నాక్స్ మార్కెట్ సెగ్మెంట్ నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్న ట్లు అంచనా. ఇది 2023 కల్లా దశలవారీ మూడు రెట్లు పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. -
జంతువులపై కోవాగ్జిన్ సత్ఫలితాలు
న్యూఢిల్లీ/లండన్: కరోనా వైరస్కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోతులపై జరిపిన ప్రయోగాల్లో వాటి శరీరాల్లో బలమైన వ్యాధినిరోధకత కనిపించినట్లు తెలిపింది. దీనివల్ల ప్రైమేట్ జీవుల్లో వ్యాధి నిరోధకత పెంచే విషయంలో అంచనాలు మరింత మెరుగయ్యాయని తెలిపింది. ప్రయోగాల కోసం 20 రీసస్ కోతులను నాలుగు గ్రూపులుగా విభజించామని, వీటిలో ఒక గ్రూప్ కోతులకు ప్లాసిబో(ఎటువంటి ఔషధం లేని డోసు)ను ఇచ్చామని, మిగిలిన గ్రూపుల్లో కోతులకు మూడు రకాల వ్యాక్సిన్స్ను ఇచ్చామని వివరించింది. 14 రోజుల అనంతరం అన్ని కోతులను వైరస్కు గురిచేశామని, అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో ఐజీ–జి యాంటీబాడీలు పెరిగి, గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను తగ్గించినట్లు తెలిసిందని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో న్యుమోనియా లక్షణాలు కనిపించలేదంది. టీకా ఇచ్చిన కోతుల్లో భారీ సైడ్ఎఫెక్ట్లు కానరాలేదని తెలిపింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మళ్లీ షురూ ఇటీవల కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను ఆపేసిన అతిపెద్ద ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్లో మళ్లీ ట్రయల్స్ను మొదలుపెట్టాయి. ఈ ట్రయల్స్ సురక్షితమని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్ఆర్ఏ) నిర్థారించడంతో ప్రయోగాలను పునఃప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెప్పాయి. భారత్లో ఆస్ట్రాజెనెకా క్లీనికల్ ట్రయల్స్ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందాక పునఃప్రారంభిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ శనివారం తెలిపింది. ట్రయల్స్ పూర్తిగా ముగిసేవరకు ఒక నిర్ధారణకు రాకూడదని కంపెనీ సీఈఓ పూనావాలా చెప్పారు. -
ఇమ్యూనిటీ ఏమో గాని.. ఇబ్బందులే సుమా!
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో తయారు చేసుకున్న కషాయాలతో ఇమ్యూనిటీ పెరగడం సంగతేమో గాని ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అనేక మంది వివిధ రకాల ఇమ్యూనిటీ బూస్టర్లను వాడుతున్నారు. కొంతమంది మార్కెట్లో రెడీమేడ్గా తయారు చేసిన పౌడర్లు వాడుతుండగా.. మరికొందరు ఇంట్లోని వంటగదిలో లభించే లవంగాలు, మిరియాలు, దాల్చిని, శొంఠి, తిప్పతీగతో కషాయాలు చేçసుకుంటున్నారు. వేడినీటిని కూడా ఎక్కువగా తాగేస్తున్నారు. నిజానికి ఈ కషాయాలు, వేడినీళ్లు ఆరోగ్యానికి మంచివే. ఓ పరిమితి వరకు ఎలాంటి నష్టాలు ఉండవు. కానీ.. వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలనే ఆలోచనతో కొంత మంది మోతాదుకు మించి వీటిని వాడుతున్నారు. వైరస్ నుంచి బయటపడటమేమో గాని.. తీవ్రమైన గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి జీర్ణకోశ సంబంధ సమస్యల బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోలిస్తే ఈ తరహా సమస్యలు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నట్లు ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ అభిప్రాయపడ్డారు. వైద్యులను సంప్రదించకుండానే.. దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇరుగుపొరుగుకు తెలిస్తే వారితో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి చాలా మంది వైద్యులను సంప్రదించకుండానే మందులు వాడేస్తున్నారు. నిజానికి కోవిడ్ లక్షణాలు టైఫాయిడ్, మలేరియా, డెంగీ, స్వైన్ఫ్లూ జ్వరాల్లోనూ ఉంటున్నాయి. ప్రస్తుతం కోవిడ్ టెస్టులు మినహా ఇతర జ్వరాలకు సంబంధించిన టెస్టులు పెద్దగా చేయడం లేదు. ఏది ఏ జ్వరమో? నిర్ధారణ వైద్యులకే కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టులు చేయించకుండా కనీసం వైద్యులను కూడా సంప్రదించకుండా ఆన్లైన్, యూట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్లు చూసి నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వయసు, బరువు, బీపీ, షుగర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన మందులను నేరుగా వాడుతుండటంతో పల్స్ రేట్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. శ్వాస నాళాలపై వైరస్ లోడు పెరిగి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి అప్పటికప్పుడు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి పలువురు మృతి చెందుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ స్పష్టత లేదు.. కరోనా పేషెంట్లు ఏ మందులు వాడాలో మొదట్లో వైద్యులకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే ఒక అవగాహనకు వస్తున్నారు. మొదట్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, విటమిన్ సి, పారాసిటమాల్ వంటివి బాగా పని చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది వైరస్ రాకముందే వీటిని విరివిగా వాడేశారు. ఆ తర్వాత డెక్సామిథసోన్, ఫావిపిరవిర్, ప్లాబీఫ్లూ వంటి మందులు బాగా పని చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వీటిని కూడా చాలా మంది వాడుతున్నా రు. విటమిన్ టాబ్లెట్స్తో పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికీ.. డెక్సామిథసోన్ వంటి కార్డికో స్టెరాయిడ్ వాడితే హృద్రోగ సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్వీ కుమార్ అభిప్రాయపడ్డారు. -
మరో వింత.. ఈ చీరతో కరోనాకు చెక్?!
భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం వెరైటీగా రోగనిరోధకత పెంచే చీరలు వచ్చాయి. మీరు చదివింది వాస్తవమే.. రోగనిరోధక శక్తి పెంచే చీరలను ‘ఆయుర్వస్త్రా’ పేరుతో మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. రకరకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేశామని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని కార్పొరేషన్ అధికారులు తెలుపుతున్నారు. చీరలు మాత్రమే కాక ఇతర దుస్తులను కూడా తయారు చేశామన్నారు. వీటిని ధరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని. ఫలితంగా కరోనా వైరస్ మన దరిచేరదంటున్నారు కార్పొరేషన్ అధికారులు. (ఇమ్యూనిటీ బూస్టర్: వాస్తవమెంత?) యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలతో రోగ నిరోధక శక్తిని పెంచే చీరల తయారిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్కి అప్పగించింది. ఈ చీరలు తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాక ఎంతో నైపుణ్యం అవసరమన్నారు మాలేవర్. లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, రాయల్ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారికి వాడినట్లు వెల్లడించారు. వీటన్నింటిని పొడి చేసి 48 గంటల పాటు నీటిలో నానబెడతారు. తరువాత దీన్ని మరగబెట్టి.. దాని నుంచి వచ్చిన ఆవిరిని చీర, మాస్క్ లేదా ఇతర దుస్తులు తయారు చేసే వస్త్రానికి పట్టిస్తారు. ఇది కొన్ని గంటలపాటు జరుగుతుంది. తర్వాత ఆవిరి పట్టించిన వస్త్రంతో చీర, మాస్క్, ఇతర దుస్తులు తయారు చేస్తారు. ఈ పద్దతిలో ఒక చీర తయారు చేయడానికి 5-6రోజులు పడుతుందని తెలిపారు. (కరోనా పేరిట కొత్త వ్యాపారాలు) రెండు నెలలు శ్రమించి ఈ పద్దతి కనుగొన్నాం.. ఈ సందర్భంగా వినోద్ మాలేవర్ మాట్లాడుతూ.. ‘ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్దతి. ఈ బట్టల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది. ఈ దుస్తులను ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రకం దుస్తులను తయారు చేయడానికి దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ పద్దతిని కనుగొన్నాము. ఈ దుస్తులలో రోగనిరోధక శక్తి పెంచే ప్రభావం నాలుగైదు ఉతుకుల వరకు ఉంటుంది’ అని తెలిపారు మాలేవర్. మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ..‘ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచే పురాతన వస్త్రాల తయారీ విధానాన్ని పునరుద్ధరించడానికి మాకు అవకాశం లభించింది. కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో మేం జనాలకు మేలు చేసే హెర్బల్ దుస్తులను మార్కెట్లోకి తెచ్చాం. ప్రస్తుతం రోగనిరోధకత పెంచే ఈ చీర ధర 3 వేల రూపాయలు’ అన్నారు. (వామ్మో.. చై'నో'..) అంతేకాక ‘ప్రస్తుతం మేము ఈ చీరలను భోపాల్, ఇండోర్లలో విక్రయిస్తున్నాము. రాబోయే రోజుల్లో, ఈ చీరలను దేశవ్యాప్తంగా ఉన్న మా 36 షోరూమ్లలో విక్రయిస్తాము’ అని తెలిపారు రాజీవ్ శర్మ. అయితే ఈ చీరలు, మాస్క్లు ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిరూపించడానికి ఎలాంటి వైద్య ఆధారాలు లేవు. ముఖ్యంగా ఈ దుస్తులు కరోనా వైరస్ సంక్రమించకుండా కాపాడతాయని చెప్పడానికి ఎలాంటి ఆధాలు లేకపోవడం గమనార్హం. -
‘భారత్లో హెర్డ్ ఇమ్మూనిటీ సాధ్యం కాదు’
న్యూఢిల్లీ: భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలో సాధారణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఓ వ్యాధి నుంచి కాపాడే పరోక్ష రక్షణ పద్దతి. ఈ విధానం జనాలను జబ్బుల నుంచి కాపాడుతుంది. అది ఎప్పుడంటే గతంలో ఆ జనాభా అదే వ్యాధి నుంచి కోలుకున్నప్పుడు.. లేదా దానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భారతదేశానికి హెర్డ్ ఇమ్యూనిటీ అనే ఆప్షన్ ఇప్పుడు పనికిరాదు. వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం చాలా ఖర్చుతో కుడుకున్న ప్రక్రియ. ఇప్పుడే దీన్ని అమల్లోకి తేస్తే.. కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇది ఆరోగ్య మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేస్తుంది. ఎందరినో బలి తీసుకుంటుంది. భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాతనే హెర్డ్ ఇమ్యూనిటీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనాను ఎదుర్కొవాలి’ అన్నారు రాజేష్ భూషణ్. (వాక్సిన్: భారతీయ కంపెనీలపై ప్రశంసలు) హ్యూమన్ ట్రయల్స్ దశలో 2 వ్యాక్సిన్లు ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేస్తోన్న రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లు మొదటి, రెండో దశ హ్యూమన్ ట్రయల్స్లో ఉన్నాయన్నారు రాజేష్ భూషణ్. హెల్త్ కేర్ ప్రొవైడర్ల కోసం ప్రవేశపెట్టిన 50 లక్షల రూపాయల కోవిడ్-19 బీమా పథకం కింద ఇప్పటికే ప్రభుత్వానికి 131 క్లెయిమ్లు వచ్చాయని తెలిపారు. వీటిల్లో 20 కేసుల్లో చెల్లింపులు పూర్తికాగా.. 64 కేసులు ప్రాసెసింగ్లో ఉన్నాయని.. మరో 47 కేసులు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయన్నారు. మెరుగైన పరీక్షా మౌలిక సదుపాయాల కారణంగా.. జూలై 26 నుంచి 30 వరకు ప్రతిరోజూ సగటున 4,68,263 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాజేష్ భూషణ్ తెలిపారు. కోవిడ్-19 రోగులలో రికవరీ రేటు కూడా ఏప్రిల్లో 7.85 శాతం నుంచి గురువారం(నేడు) నాటికి 64.44 శాతానికి పెరిగిందన్నారు. ఇది ఎంతో ఊరట కలిగించే విషయం అన్నారు రాజేష్ భూషణ్. (హాట్స్పాట్గా మారనున్న బెంగళూరు?!) అంతేకాక 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉండగా, నాలుగింటిలో ఐదు శాతం కన్నా తక్కువ అని భూషణ్ తెలిపారు. రాజస్తాన్లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు 3.5 శాతం, పంజాబ్లో 3.9 శాతం, మధ్యప్రదేశ్లో 4 శాతం, జమ్మూకశ్మీర్లో 4.7 శాతం ఉందని రాజేష్ భూషణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు భారత్లోనే తక్కువన్నారు. కరోనా మరణాల్లో ప్రపంచ సగటు 4 శాతం ఉండగా.. భారత్లో 2.21శాతంగా ఉన్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు. -
ఇమ్యూనిటీ బూస్టర్: వాస్తవమెంత?
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బతో అన్ని దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ)పెంచుకోవడమే ఏకైక మార్గమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్యునాలజీ నిపుణులు రోగనిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజలు రోగనిరోధకశక్తిను పెంచుకునేందుకు మార్కెట్లలో రకరకాల పండ్ల జ్యూస్లు, విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. నిజంగా ఆహారపు అలవాట్లు, విటమిన్ ట్యాబ్లెట్లతో కరోనాను నివారించవచ్చా తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది సంక్లిష్టమైన అంశమని, ప్రజలకు ఇంకా పూర్తిగా ఈ అంశంపై అవగాహన రాలేదని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) మాజీ డైరెక్టర్, ఇమ్యునాలజీ నిపుణులు రామ్ విశ్వకర్మ తెలిపారు. ఆయన స్పందిస్తు.. ముఖ్యంగా మనిషి తీవ్రంగా రోగగ్రస్తులను చేసే యాంటిజన్స్(వ్యాధి కారకం)ను ఎదుర్కొనేందుకు సహజసిద్దంగా శరీరంలో యాంటిబాడీస్(యాంటీజన్స్ను ఎదుర్కొనేవి) ఉంటాయి. మరోవైపు సహజ రోగనిరోధక శక్తి (ఇన్నేట్ ఇమ్యున్ రెస్పాన్స్) మానవుని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. సహజ రోగనిరోధక శక్తిలో తెల్లరక్తకణాల, న్యూట్రోఫిల్స్, టీసెల్స్(కణాలు), బీసెల్స్(కణాలు), యాంటిబాడీస్లతో కూడిన రక్షణాత్మక వ్యవస్థ కాపాడుతూ ఉంటుంది. కాగా ఈ కణాలను సైటోకైన్స్ ఉత్పత్తి చేస్తాయి. సైటోకైన్స్ అనేది ప్రొటీన్ ఇమ్యూన్ కణాలకు సిగ్నలింగ్ వ్యవస్థ లాంటిది. ఆహారపు అలవాట్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేమని అన్నారు. సాధారణంగా కొందరు తమకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని చెబుతుంటారు. వారికి ఎక్కువగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చనే అపోహలు ఉన్నాయి. మరోవైపు ఈ ట్యాబ్లెట్ల ద్వారా కిడ్నీ, లివర్ తదితర వ్యాధులతో చాలా మంది సతమతమవుతున్నారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మేలైన మార్గమని రామ్ విశ్వకర్మ పేర్కొన్నారు. 1962లో నోబెల్ బహుమతి పొందిన పాలింగ్ కూడా విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లు ఏ మాత్రం ప్రభావం చూపవని తెలిపారు. కానీ ఆహారం ద్వారానే రోగనిరోధక శక్తి లభిస్తుందని ప్రకృతి, ఆయుర్వేద నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కానీ అందరు ఏకీభవించేది మాత్రం వ్యాయామం. జీవనశైలి మార్పులతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని అందరు ఏకీభవీస్తున్నారు. మానవ శరీరంలో రక్షణాత్మక వ్యవస్థను బలంగా ఉంచే సైటోకైన్స్, న్యూట్రోఫిల్స్, టీకణాలు, బీకణాలు వ్యాయామంతో బలోపేతమవుతాయని అల్లోపతి, ఆయుర్వేద, అన్ని రంగాల నిపుణులు ఏకీభవిస్తున్నారు. రోజుకు ఒక గంట వ్యాయామంతో రక్షణాత్మక వ్యవస్థను బలోపేతం చేసే అన్ని కణాలు ఉత్తేజితమవుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
అన్ని బాక్టీరియాలూ చెడ్డవి కావు
సాక్షి, అమరావతి: మన శరీరంలోనూ, శరీరం బయటా లక్షల బాక్టీరియాలు ఉంటాయి. బాక్టీరియా అనగానే చాలామందికి చెడు చేస్తాయనే అభిప్రాయం ఉంటుంది. కానీ మంచి చేసే బాక్టీరియాలు చెడు బాక్టీరియాల కంటే ఎక్కువగా ఉన్నాయని.. ఇలాంటి బాక్టీరియా కోవిడ్ను నియంత్రించేందుకు ఇమ్యూనిటీని పెంచుతాయని చెబుతున్నారు ఔషధ నియంత్రణ శాఖకు చెందిన మైక్రో బయాలజిస్ట్ డా. ప్రవీణ్కుమార్. ► పాలు పెరుగుగా మారే ప్రక్రియ వల్ల లాక్టొబాసిల్లస్ అనే బాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బాక్టీరియా ఇమ్యూనిటీకి దోహదపడే లాక్టిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ► వెన్న తయారయ్యే ప్రక్రియలో లాక్టోబాసిల్లస్, లాక్టోకోకస్, ప్రాపియాన్ బాక్టీరియం, బ్రేవి బాక్టీరియం వంటివి ఉత్పత్తి అవుతాయి. హానికారక వైరస్లను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. ఇడ్లీ, దోశ వంటివి పులియడం ద్వారాజీర్ణ ప్రక్రియకు ఉపయోగçపడే బాక్టీరీయా ఉత్పత్తి అవుతుంది. ► మనిషి పేగుల్లో బాక్టీరియాడిస్, ఎంటర్కోకస్, క్లెబ్సిల్లా, బైఫిడో బాక్టీరియం వంటివి ఉంటాయి. వీటివల్ల వైరస్ను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ► పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఉత్పత్తి అయ్యే బాక్టీరియా హానికర బాక్టీరియాను, వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటాయి.మనిషి శరీరంలో 2వేలకు పైగా మేలు చేసే బాక్టీరియా జాతులుంటాయని ‘నేచర్ జర్నల్’ ప్రచురించింది. -
ఆ వ్యాక్సిన్పై సంతృప్తికర ఫలితాలు
వాషింగ్టన్ : కరోనా వ్యాక్సిన్పై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. అమెరికన్ బయోటెక్ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్పై జరిపిన పరీక్షలోసానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ను పరీక్షించగా కరోనా వైరస్ను పోరాడే వ్యాధి నిరోధక శక్తి వారిలో పెంపొందిందని వెల్లడైంది. అయితే చాలా మందిలో ఇది స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ కలిగించినట్టు గుర్తించారు. మానవ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ పనితీరుపై తాజా అథ్యయనం ఈ వివరాలు తెలిపింది. వ్యాక్సిన్ పరీక్షలో ప్రాథమికంగా వెల్లడైన అంశాలను ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించారు. అమెరికాలోని సీటెల్, ఎమరీ యూనివర్సిటీలో జరిగిన వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్న తొలి 45 మంది వాలంటీర్ల స్పందనపై ఈ అథ్యయనం చేపట్టారు. ఈ అథ్యయనం ప్రకారం మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్లో పాల్గొన్న వారందరిలో కరోనా వైరస్ను ఎదుర్కొనే ఇమ్యూనిటీని కలిగించిందని వెల్లడైంది. భద్రతా పరమైన అంశాలు కూడా ఏవీ తలెత్తలేదని అథ్యయనం గుర్తించింది. మానవ శరీరంలోకి ప్రవేశించే కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ లక్ష్యంగా యాంటీబాడీలను తటస్ధీకరించేలా మొడెర్నా వ్యాక్సిన్ను డిజైన్ చేశారని వాషింగ్టన్ హెల్త్ రీసెర్చి ఇనిస్టిట్యూట్కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పలువురిలో స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని, వ్యాక్సినేషన్ తర్వాత ఇది సహజమని పరిశోధకులు తెలిపారు. 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో వెల్లడైన ఫలితాలనే ఈ అథ్యయనంలో ప్రస్తావించారు. ఇక ఈనెలలోనే మూడో దశ పరీక్షలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ)తో కలిసి మోడెర్నా అభివృద్ధి చేస్తోంది. చదవండి : జైడస్ క్యాడిలా క్లినికల్ పరీక్షలు షురూ -
ఒకే నేషన్ ఒకే రేషన్, ఒకే జీవన్ ఒకే వైరస్
కరోనా వచ్చినా ఎవరైనా బతికి ఉన్నారంటే అది సర్కారు వారి కరుణ కాదు. రోగ నిరోధక శక్తి వారిలో ఉందని, అది పెరిగి రోగకారకశక్తులను తరిమికొట్టిందని అర్థం. కరోనా సోకి ఎవరైనా చనిపోయారంటే దానికి కారణం వారికి రోగ నిరోధక శక్తి కన్నా బలమైన రోగం ఉందని అర్థం. కరోనా చంపిందా లేక తగిన ఆరోగ్యం లేక మరణించారా అని పాలకులు ఆలోచించడం లేదు. మందులమ్ముకునే వ్యాపారుల ఆలోచనలకు, ప్రభుత్వాలకు మధ్య కొంతైనా తేడా ఉంటే బాగుండేది. కరోనా సోకకపోయినా, రోగ నిరోధక శక్తి తగ్గకపోయినా చనిపోయేవారు కూడా ఉన్నారు, వారే భయపడి చచ్చేవారు. వరంగల్లులో ఒక డాక్టర్ ఉండేవారు. చాలా మంచి డాక్టర్. కాని తను చికిత్స చేయలేడనుకుంటే ‘‘ఇదిగో నీకు పెద్ద రోగం వచ్చింది. పెద్దాస్పత్రికి పో. లేకపోతే చచ్చిపోతవు. నేను కుదిర్చే జబ్బుకన్నా నీ జబ్బు పెద్దది. పో’’ అని మహాత్మాగాంధీ స్మారక హాస్పిటల్కు తరిమేవాడు. మనం ఇప్పుడు హైదరాబాద్లో అందరినీ గాంధీ హాస్పటల్కు తరుముతున్నాం. మందుల కోసం, చికిత్సలకోసం ఎదురు చూస్తున్నాం. ఇది వాడితే పది నిమిషాల్లో కరోనా మాయం అనే వీడియోలు విరివిగా చూస్తున్నారు. ఇది వాడకపోతే చస్తావు అంటే అవి కొనుక్కుంటున్నాం. ఏ ఇంట్లో చూసినా కుప్పలు తెప్పలుగా మందులు. ఆయుర్వేదం, యునానీ, హోమియో, అలోపతి. అంతా అంతే. కానీ రోగం రాకుండా ఏంచేయాలి? కరోనా తగిలితే దాన్ని తిప్పికొట్టే నిరోధక శక్తి ఏ విధంగా పెంచాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఔషధ వ్యాపారులకు ఎట్లాగూ ఉండదు. ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి ఇటువంటి ఆలోచన వస్తే బాగుండేది. రోగ నిర్ధారక పరీక్షలు చేయాలని రిట్ వేస్తే హైకోర్టు రిట్ ఇస్తే గిస్తే సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోకపోతే ప్రభుత్వం పరీక్షలు చేస్తుంది లేకపోతే లేదు. కరోనా వైరస్ మహమ్మారిగా వ్యాపించడం మన లద్దాఖ్ సరిహద్దులో చైనా దురాక్రమణ అంతటి భయానక విషయం. మనకు చైనా దాడిలో 20 మంది మరణించడం అర్థమయిందో లేదో గాని కరోనా యుద్ధంలో మన సైనికులు మరణిస్తున్న సంగతి, చాలామంది మరణించడానికి సిద్ధంగా ఉన్న సంగతి గుర్తు రావడం లేదు. వేల కోట్ల రూపాయలు పోసి ఆయుధాలు, యుద్ధ విమానాలు, తదితర సామగ్రి కొంటున్నాం గాని, కరోనా తదితర వ్యాధినిరోధక పోషక బలాన్ని పెంచుకోవడానికి, జనాన్ని రక్షించడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారో లేదో కనిపించడం లేదు. పోషకాల స్థాయి పెంచడం, జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత, ఆ విషయాన్ని రాజ్యం గుర్తించి తీరాలని ఆర్టికల్ 47లో రాజ్యాంగం మార్గదర్శకాన్ని రాసింది. తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. వెంటనే ఇవి కేవలం సూచనలే.. పాటించే పని లేదని వాదించడానికి లాయర్లు తయారుగా ఉంటారు. డబ్బులిచ్చిన వాళ్లకోసం లా ను ఏవిధంగానైనా ఎటైనా వంచగల ప్రతిభను మన ఆంగ్లేయుల నుంచి వారసత్వంగా ఒంటబట్టించుకున్నాం. ఇది మన డీఎన్ఏలో జీర్ణించుకుపోయిన అసలు వైరస్. హక్కుల్లో రాయడం సాధ్యం కానివి ఇక్కడ మార్గదర్శకాల్లో రాస్తున్నాం నాయనా, ‘అమలు చేయడానికి వీల్లేదు. కోర్టులు అడగొద్దు అనే చెత్త వాదనలు చేయకండి. బుద్ధి జ్ఞానం ఉన్న ప్రభుత్వాలు కనుక ఉంటే వారు ఈ డ్యూటీ పాటించాలని’ రాజ్యాంగం పార్ట్ 4 ఘంటాపథంగా చెబుతున్నది. మనం వింటే కదా. మన ప్రధాని మోదీకి మనదేశంలో చాలామందికి ఆకలి ఉందని, పేదరికం ఉందని, తిండి లేదని, అర్థమైనట్టుంది. నవంబర్ దాకా మన నేషన్లో రేషన్ ఉచితంగా ఇస్తానని మరో ప్రాస ప్రామిస్ చేశారు. శుభం. అసలు తిండే లేని వాడికి పోషక పదార్థాలు ఎక్కడినుంచి వస్తాయి అనేది ఒక పాయింట్. తిండి సరే.. పోషక పదార్థాల సంగతేమిటి? ఇది రెండో పాయింట్. ఉచితంగా కాకపోయినా కొనదగిన ధరలకు పోషక పదార్థాలు సామాన్యుడికి అందుబాటులో తేవాలంటే కాస్త ప్లానింగ్ ఉండాలి. రేషన్ ఫ్రీగా ఇవ్వడానికి డబ్బు కేటాయిస్తే చాలు. విడుదల చేయవలసి వచ్చేనాటికి లెక్కలు చూసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ను ప్రింట్ చేసిమ్మంటే ఇస్తుంది. ఒక చిన్న పాప చాక్లెట్లడిగింది. రోజూ చాక్లెట్కు డబ్బెక్కడినుంచి వస్తుందో అని వాళ్లమ్మ మందలించింది. ‘ఎక్కడినుంచి అంటే ఎటిఎం నుంచి. నువ్వు ఎన్ని సార్లు తేలేదు. నెంబర్లు నొక్కితే నోట్లు రావా’ అని తెలివైన పాప జవాబు. మనకు రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం వంటిదే కదా? కాగితాలే కదా ప్రింట్ చేస్తే సరిపోదా? ఈ మాత్రం చాలా మంది ఆర్థిక మంత్రులకు తెలియదేమో. కోట్లాది వలస కార్మికులకు రేషన్ కార్డు లేదని మళ్లీ ప్రధానికి ఎవరూ గుర్తు చేయలేదు. రేషన్ కార్డుంటే ఒక నేషన్ ఒక రేషన్ ఇస్తారు. మరి ఒక రేషన్ కార్డు కూడా లేనివాడు సొంత నేషన్లో ఉన్నట్టా లేనట్టా? రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ఈ నేషన్లో రేషన్ కార్డు లేని వాడికే బతికే హక్కు లేనట్టా? వాడిది కూడా ఒకే నేషన్ ఒకే రేషన్ ఒకే జీవన్ కదా? ఆధార్ కార్డు, రేషన్ కార్డూ, స్మార్ట్ ఫోన్లో సేతు యాప్ లేని వాడికి చావడమే బాధ్యతా? ఔషధాలమ్ముకుందామా లేక రోగాన్ని ఎదుర్కొనే పోషకాహార బలం మన జన సైనికులకు ఇచ్చి చైనాను, వైరస్ను బార్డర్లోనే నిలువరిద్దామా? మన జాతిని బలోపేతం చేసే రాజనీతి మనకు రానే రాదా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈమెయిల్: madabhushi.sridhar@gmail.com -
కరోనా పేరిట కొత్త వ్యాపారాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభనతో దేశంలో పలు వ్యాపారాలు దెబ్బతిని, ఎలా కోలుకోవాలో తెలియక వ్యాపారస్థులు లబోదిబోమంటుంటే కొందరు వ్యాపారులు మాత్రం కరోనాను అడ్డుపెట్టుకొని వ్యాపారం చేసుకునేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నాయి. వాటిల్లో పసుపుతో కూడిన పాల నుంచి కాలును కదిలిస్తే చేతిలో పడే శానిటైజర్లు, చేతులు ఉపయోగించకుండానే చేతికి పానీ పూరి అందించే మిషన్లూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఉన్న బ్రాండ్లకు లేబుళ్లు మార్చగా, మరికొన్ని కొంత బ్రాండ్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వస్తున్నాయి. నోయిడా కేంద్రంగా పని చేస్తోన్న ఓ పాల ఉత్పత్తుల కంపెనీ ‘మదర్ డైరీ’ జూన్ 8వ తేదీన పసుపు మిలితమైన పాల డ్రింక్ను ఆవిష్కరించింది. కరోనా వైరస్ ఎదుర్కొనే రోగ నిరోధక శక్తీ పెరగాలంటే పసుపుతో కూడిన తమ పాల డ్రింక్ను పసందుగా సేవించండంటూ ప్రచారమూ మొదలు పెట్టింది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం మానవ రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుందంటూ ప్రచారం అందుకుంది. పసుపుతో కూడిన పాల డ్రింక్ అమెరికాలో కొన్నేళ్ల క్రితం ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే వారు దాన్ని అక్కడ ‘టర్మరిక్ లట్టీ’ అని వ్యవహరిస్తున్నారు. భారత్లో కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నాలుగువేల సంవత్సరాల క్రితం నాటి ఆయుర్వేద మందులను, సేంద్రీయ పదార్థాలను భారతీయులు ఆశ్రయించడం, వాటిని విశ్వసించడం మనకు కనిపిస్తుంది. దేశంలో పలు రకాలు వ్యాపారాలు కలిగిన దాల్మియా గ్రూపయితే ‘కరోనా వైరస్ నిరోధక క్యాప్సుల్’ అంటూ గత మార్చ్ నెలలోనే ఓ మందును మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ క్యాప్సుల్లో 15 రకాలో వన మూలికలు ఉన్నాయని, అవి కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరంలో పెంచుతాయని, ముఖ్యంగా ఊపిరి తిత్తులో మంటను మటుమాయం చేస్తుందని ప్రచారం కూడా చేస్తోంది. ఆరోగ్యానికి అన్ని విధాల ఉపయుక్తమైనదంటూ, కొత్త శక్తికి, కొత్త కోరికకు, కొత్త తపనకు సరైన సమాధానమే తమ ఉత్పత్తులంటూ ఛాయోస్, స్టార్బక్స్, కేఫ్ కాఫీ డే లాంటి బ్రాండ్లు కూడా ప్రచారాన్ని ఊదరగొడుతున్నాయి. వీటిలో కొన్ని కొత్త బ్రాండులను విడుదల చేయగా, మరికొన్ని పాత బ్రాండ్లకే కొత్త వాణజ్య ప్రకటనలతో కొత్త లేబుళ్లు తొడుగుతున్నారు. హరీష్ బిజూర్ కన్సల్ట్స్, మింటల్ గ్రూప్ లాంటి సంస్థలు సలహాలు, సంప్రతింపుల్లో ఈ కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి. తమిళనాడులోని ‘కలశలింగం అకాడమీ ఆఫ్ రిసర్చ్’ సంస్థ చేతులతో తాకనవసరం లేకుండా కాలుతో ఆపరేట్ చేసే శానిటైజర్ యంత్రాన్ని తయారు చేసి గత ఫిబ్రవరి నెలలోనే మార్కెట్లోకి విడుదల చేసింది. నేడు దానికి అనేక నమూనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి మార్కెట్లో 1300 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కరోనా పేరుతో సొమ్ము చేసుకునేందుకు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఉత్పత్తులకు ప్రజల నుంచి ఆశించిన ఆదరణ మాత్రం అంతంత మాత్రమే. (కుటుంబాలలో కరోనా వ్యాప్తి ఎక్కువ) రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పసుపుతో కూడిన పాలను తాగాల్సి వస్తే తానే స్వయంగా తయారు చేసుకుంటానుగానీ కంపెనీ ఉత్పత్తులపై ఆధార పడనని పుణేకు చెందిన ఓ విద్యావంతురాలు తెలిపారు. శరీరంలో దీర్ఘకాలనుగ్రహంగా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగతూ రావాలనిగానీ ఇప్పటికిప్పుడు పెంచుకుందామనే ఉద్దేశంతో కొత్త ఉత్పత్తులను ఆశ్రయిస్తే రోగ నిరోధక శక్తి పెరగడం ఏమోగానీ ‘ఆటో ఇమ్యూన్ డిసీస్’ వచ్చే ప్రమాదం ఉందని ‘యూనివర్శిటీ ఆఫ్ కెంటకీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తోన్న డాక్టర్ ట్రావిస్ థామస్ హెచ్చరించారు. -
లక్షణాలనుబట్టి చికిత్స
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందిస్తున్న విధానాలకు సంబంధించి కేంద్రం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్గా నిర్ధారించిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇకపై పాజిటివ్గా నిర్ధారించిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే వ్యాధి తీవ్రతను బట్టి ఇంటి వద్దే చికిత్స అందించేలా కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘క్లినికల్ గైడెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ కరోనా’పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని పాటిస్తూ కరోనా పేషంట్లకు చికిత్స అందించాలని సూచించింది. మూడు కేటగిరీలుగా విభజన.. కరోనా రోగులను మూడు రకాలుగా విభజిస్తారు. రోగి లక్షణాలు, తీవ్రతను బట్టి మైల్డ్ (స్వల్ప లక్షణాలు), మోడరేట్ (వ్యాధి తీవ్రత మధ్యస్తంగా ఉంటే జ్వరం, దగ్గు తదితర లక్షణాలు కలిగి ఉండటం), సివియర్ (లక్షణాలు తీవ్రంగా ఉండటం) కేటగిరీలుగా గుర్తిస్తారు. స్వల్ప లక్షణాలతో ఉన్న వారికి ఇంట్లోనే క్వారంటైన్ చేసి చికిత్స అందించొచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు ఇంటి వద్ద చికిత్స అందించే స్థాయి వాళ్లను మాత్రమే ఈ కేటగిరీగా గుర్తిస్తారు. మోడరేట్, సివియర్ కేటగిరీల్లోని రోగులను తప్పకుండా ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందించాలి. తాజా మార్గదర్శకాల ప్రకారం.. మోడరేట్ కేటగిరీ రోగులపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. వీరికి లక్షణాలు ఉండటం వల్ల చికిత్సలో నిర్లక్ష్యం జరిగితే సివియర్గా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారి ప్రాణాలు కాపాడేందుకు మోడరేట్ స్థాయిలోనే చికిత్స అందించి కోలుకునేలా చేయాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం. మోడరేట్గా గుర్తించిన వారిని జిల్లా ఆస్పత్రి లేదా కరోనా కోసం గుర్తించిన ఆరోగ్య కేంద్రంలోకి తరలించి చికిత్స చేయాలి. కరోనా వైరస్ రోగి ఊపిరితిత్తులపైనే కాకుండా రక్తనాళాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో రక్తం గడ్డకట్టకుండా నిర్దేశించిన మందులను ముందే ఇస్తే మంచి ఫలితం ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రోగి నుంచి వైరస్ సోకుతుందిలా.. కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే విధానంపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. రోగికి వ్యాధి లక్షణాలు ప్రారంభమయ్యే రెండ్రోజుల ముందు నుంచి.. లక్షణాలు మొదలైన 8 రోజుల వరకు ఇతరులకు సోకే వీలుంటుంది. మొత్తంగా 10 రోజుల పాటు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కరోనా వైరస్ సోకి, లక్షణాలు లేని వాళ్లు ఎంతమందికి ఈ వైరస్ను అంటిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. 48 శాతం మందిలో జ్వరం, దగ్గు కరోనా వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన పరిశోధనలో తేలింది. కరోనా సోకిన వారి దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. 15,366 మంది దరఖాస్తులను పరిశీలించి విశ్లేషించగా.. అందులో జ్వరం 27%, దగ్గు 21%, గొంతులో గరగర 10%, దమ్ము 8%, బలహీనత 7%, ముక్కు నుంచి నీరు కారడం 3%, ఇతర లక్షణాలున్న వారు 24% మంది ఉన్నట్లు గుర్తించారు. వాసన, రుచి తెలియట్లేదా? కరోనా లక్షణాల్లో తాజాగా వాసన, రుచి గుర్తించలేకపోవడాన్ని కేంద్రం తాజాగా జతచేసింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, దగ్గు, త్వరగా అలసిపోవడం, దమ్ము రావడం, కీళ్లు, కండరాల నొప్పులు, గొంతులో గరగర, ముక్కు నుంచి నీరు కారడం, విరోచనాలు తదితర లక్షణాలుంటాయి. తాజాగా కేంద్రం కరోనా లక్షణాల్లో వాసన, రుచి గుర్తించకపోవడాన్ని జోడించింది. కరోనా వైరస్ సోకిన పిల్లల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపించవు. వారికి త్వరగా నయమయ్యే అవకాశం ఉన్నా.. ఎక్కువ వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. మరోవైపు వయసు పైబడ్డ వారిలో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ లక్షణాలకు బదులుగా చికాకుగా ఉండటం, ఒక్కసారిగా మంచం పైనుంచి లేవలేని పరిస్థితికి వెళ్లడం, సోయి లేకుండా పోవడం, విరోచనాలు ఉంటాయి. కృత్రిమ శ్వాస చివరి ప్రయత్నం కరోనా వైరస్ సోకిన రోగికి కృత్రిమ శ్వాస అందించడం చివరి ప్రయత్నంగా ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాతే ఈ పద్ధతి ఎంచుకోవాలి. అయితే ఈ ప్రయత్నాన్ని అమలు చేసే ముందు రోగి మూత్రపిండా లు, కాలేయం పని తీరు సంతృప్తికరంగా ఉంటేనే చేయాలి. కృత్రిమ శ్వాసలో భాగంగా ఎక్కువ ఆక్సిజన్ను అందిస్తారు. ఎన్–95 మాస్కులు ఐసీయూలో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే వాడాలి. మిగతా రోగులకు మాత్రం ట్రిపుల్ లేయర్ మాస్కులు ఇస్తే సరిపోతుంది. కరోనా రోగుల్లో అరవై ఏళ్లు పైబడిన వాళ్లు, షుగర్, బీపీ, ఊపిరితిత్తులకు సం బంధించిన జబ్బులు, అవయవాలు మార్పిడి చేసుకున్న వాళ్లతో పాటు ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి తగ్గించే మందులు వాడే వాళ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. – కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి,నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల -
‘హెర్డ్ ఇమ్యూనిటీ’ ఆలోచన సరికాదు
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఏ దేశమైనా ‘సామూహిక రోగ నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ)’పై ఆధారపడడం ప్రమాదకరమని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ శేఖర్ మందే అభిప్రాయపడ్డారు. ‘జనాభాలో దాదాపు70% మంది ఆ వ్యాధిన పడి కోలుకుంటే ఇది సాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితి ఏ దేశానికైనా ప్రమాదమని నా ఉద్దేశం. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడమే సరైంది’ అన్నారు. ‘కోవిడ్దశలు, దశలుగా వ్యాప్తి చెందే అవకాశముంది. ప్రజలు అందుకు సిద్ధంకావాలి’ అన్నారు. -
హెర్డ్ ఇమ్యునిటీతో రిస్క్: సీఎస్ఐఆర్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు టీకాను కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే టీకా కనిపెట్టడానికి ఇంకా సంవత్సర కాలం పడుతుందని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే పదానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో కరోనా వైరస్ నియంత్రణకు హర్డ్ ఇమ్యునిటీ ఉపయోగపడుతుందని దేశాలు భావించడం పెద్ద రిస్క్ అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ శేఖర్ మండే తెలిపారు. కరోనా నియంత్రణకు ఐదు సూత్రాల ఫార్ములాను సీఎస్ఐర్ ప్రతిపాధించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ జనాభాలో 60 నుంచి 70 శాతం ప్రజలు వ్యాధితో బాధపడుతన్నప్పుడే హర్డ్ ఇమ్యునిటీ పని చేసే అవకాశం ఉందని మండే తెలిపారు. ఏదయినా అంటువ్యాధితో అధిక జనాభా బాధపడుతున్నప్పుడు కొంత కాలం తరువాత వారి శరీరంలో వ్యాధిని ఎదుర్కొవడానికి రోగనిరోధకశక్తి లభిస్తుంది. ఇటీవల కరోనాకు టీకా అవసరం లేదని.. ప్రజలకు సహజంగా లభించే రోగనిరోధకశక్తి ద్వారా వైరస్ అంతమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ -
హెల్థీ ఫుడ్ విక్రయాలు రెట్టింపు
లాక్డౌన్ కాలంలో రోగ నిరోధకతను పెంచే ఆహార ఉత్పత్తుల విక్రయాలు 20-40 శాతం పెరిగాయని గూగుల్ ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్-19నుంచి తమను తాము రక్షించుకునేందుకు రోగనిరోధకత పెంచే ఆహార పదార్థాలు ఏమేం ఉన్నాయో తెలుసుకునే ఆన్లైన్ యూజర్ల సంఖ్య 6 రెట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఆయుర్వేద వంటింటి మూలికలు, తిప్పతీగ, విటమిన్ C లభించే ఆహార పదార్థాల గురించి అధికంగా అన్వేశించారని గూగుల్ తెలిపింది.ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, వాట్సాప్ వంటి వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన సమాచారాన్ని సేకరించి వాటి ద్వారా గూగుల్లో ఆయా పదార్థాలు వెతుకుతున్నారు. చవన్ప్రాశ్, హెల్త్బార్స్, ప్రముఖ బ్రాండెడ్ హెల్త్ సాల్ట్ల కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయని స్పెన్సర్స్ రిటైల్ అండ్ నేచుర్స్ బాస్కెట్ చీఫ్ ఎక్సిక్యూటివ్ దేవేంద్ర చావ్లా వెల్లడించారు.రాబోయే రోజుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారంతోపాటు, రోగ నిరోధక శక్తిని పెంచే విభాగంలో మరిన్ని కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.ఇప్పటికే ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కొత్తగా వస్తున్న ఉత్పత్తులను సైతం వినియోగదారులు ఆదరిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్-19 తర్వాత.. కోవిడ్ తర్వాత ఆరోగ్యసంరక్షణ, ముఖ్యంగా ఆయుర్వేదం ప్రాముఖ్యతతోపాటు, వ్యక్తిగత పరిశుభ్రతపై వినియోగదారుల్లో మంచి అవగాహన పెరుగుతోందని డాబర్ ఇండియా చీఫ్ ఎక్సిక్యూటివ్ మొహిత్ మల్హోత్రా అన్నారు. వినియోగదారులు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మరింత ఆరోగ్య సంరక్షణ అందించే ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండడంతో హల్త్కేర్ ఇండస్ట్రీ లాభాల్లో నడుస్తుందన్నారు. ఇక వ్యక్తిగత శుభ్రతలో ప్రముఖ పాత్ర వహించే ఉత్పత్తులైన హ్యాండ్ శానిటైజర్లు నేటి జీవన శైలిలో నిత్యవసరాలయ్యాయి.నెలవారి గ్రాసరీ బాస్కెట్లో ఇప్పుడు ఇది చేరపోయింది. దీంతో శానిటైజర్ల విభాగంలో వృద్ధి భారీగా నమోదైందని మల్హోత్రా అన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న విప్రో కూడా ఇప్పటికే శానిటైజర్కు బదులుగా సూక్ష్మ జీవుల నుంచి రక్షణ కల్పించే యార్డ్లే ఫ్రాగ్రెన్స్ అనే పాకెట్ ఫెర్ఫ్యూమ్ను అందుబాటులోకి తెచ్చినట్లు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వీపీ వ్యాపార ముఖ్య అధికారి మనిష్ వ్యాస్ వెల్లడిచారు. ఈ స్ప్రేను ఒక్కసారి కొట్టుకుంటే గంట పాటు కంటికి కనిపించని క్రిముల నుంచి రక్షణ పొందవచ్చని మనిష్ తెలిపారు. వెజ్జీక్లీన్.. పారాచూట్ ఆయిల్ తయారీ కంపెనీ మారికో కూడా కూరగాయలు, పండ్లను శుభ్రం చేసే వెజ్జీ క్లిన్ ఆయల్ను అదుబాటులోకి తెచ్చింది.ఐటీసీ రూ.50 పైసలకే ఒకసారి వాడి పడేసే శానిటైజర్ సాచెట్స్ను మార్కెట్లోకి తీసుకురాగా, రూ.1కి లభించే శానిటైజర్ను కెవిన్కేర్ అందిస్తోంది. కాగా ఏప్రిల్ నెలలో 56 శాతం మంది వినియోగదారులు తమఖర్చులలో ఎక్కువ భాగం ఆరోగ్యం, ఆర్గానిక్ ఫుడ్, మెడికల్ అవసరాలు, ఫిట్నెస్, మెడికల్ ఇన్సురెన్స్ వంటివాటికి వెచ్చిస్తున్నట్లు చెప్పారని మార్కెట్ పరిశోధనా సంస్థ నెల్సన్ ఓ నివేదికలో తెలిపింది. హ్యాండ్ శానిటైజర్స్,ఫ్లోర్క్లీనర్స్, హ్యాండ్ వా ష్లకు భారీగా డిమాండ్ పెరిగిందని, ఈ నేపథ్యంలో 152 కోత్త కంపెనీలు మార్కెట్లోకి అడుగుపెట్టడంతో హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తి నాలుగురెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. మరోపక్క రోగనిరోధకతను పెంచే బిస్కెట్లు, స్నాక్స్, సాల్ట్ వాటర్, ఖాక్రా వంటి అన్ని ఉత్పత్తుల తయారీ తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్్స అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా జరగాలని చెబుతోంది. అంతేగాకుండా ఈ నిబంధనలకు తమ వెబ్సైట్లో కోవిడ్ పేజిని ప్రత్యేకంగా నడుపుతున్నామని దీనిలో అన్ని నిబంధనలు సవివరంగా ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ-ఇన్స్పెక్షన్స్ అనే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్పత్తులకు అప్రూవల్స్ ఇస్తున్నట్లు తెలిపారు. -
అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్!
నాకు జ్వరం లేదు.. దగ్గు లేనే లేదు.. తుమ్ములు రావడమే లేదు.. కరోనా వైరస్ లక్షణాలు ఏవీ లేవు.. కానీ.. నేను కరోనా పాజిటివ్!! ప్రస్తుతం కరోనాపై మనం సాగిస్తున్న పోరులో ఇదో పెద్ద సవాలు.. వైరస్ శరీరంలో ప్రవేశించినా.. ఎటువంటి లక్షణాలు లేని వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారు. తెలియకుండానే చాలామందికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆదివారం చైనాలో 17 కొత్త కేసులు నమోదైతే.. అందులో 12 కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు! ‘వాళ్లలో లక్షణాలు కనిపించవు.. అనుమానించే పరిస్థితి ఉండవు.. మిగిలిన వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే.,. లక్షణాలు కనిపిస్తాయి. దీని వల్ల వెంటనే దాన్ని గుర్తించి.. ఇన్ఫెక్షన్ మిగిలినవారికి సోకకుండా నివారించవచ్చు.. కరోనా వైరస్ ఇలా కాదు.. ఇప్పుడీ లక్షణాలు కనబరచని రోగులతోనే పెద్ద సమస్య. వీరిలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండడం కూడా ఈ లక్షణాలు బయడపడకపోవడానికి ఒక కారణం అయిఉండొచ్చు. వీరి నుంచి ఇన్ఫెక్షన్ చెయిన్ను తెంచాలంటే.. ఎంత ఎక్కువ మందికి అయితే.. అంత మందికి పరీక్షలు చేయడం అత్యుత్తమ మార్గం’ అని జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ(అమెరికా)కు చెందిన సీనియర్ పరిశోధకుడు, ఇమ్యునాలజిస్ట్ గిగి గ్రాన్వాల్ తెలిపారు. అన్ని వసతులు లేకుంటే.. లక్షణాలతో సంబంధం లేకుండా.. మాస్క్లు, భౌతిక దూరం పాటించడం మేలని.. అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. మన దేశంలోనూ ఇలాంటి ‘లక్షణాలు లేని’ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు లక్షణాలు లేని వీరి ద్వారా కరోనా వ్యాప్తి ఎలా అన్నది ఓసారి చూద్దామా.. ఇలా ఎంత మంది.. ప్రతి నలుగురిలో ఒకరికి ఎలాంటి కరోనా లక్షణాలు కనపడకపోవచ్చు.. ఆధారం: అమెరికాలో జరిగిన అధ్యయనాలు.. ఇదెందుకంత సమస్య.. అసింప్టొమాటిక్ క్యారియర్లలో లక్షణాలు కనపడవు.. కానీ ఇన్ఫెక్షన్ ఉంటుంది.. సైలెంటుగా వీరి ద్వారా చాలామందికి కరోనా వ్యాపిస్తుంది. లక్షణాలు లేకపోవడం వల్ల పరీక్షల ద్వారానే వీరిని గుర్తించగలం. అయితే, ఇందుకోసం భారీ స్థాయిలో టెస్టింగ్ కిట్ల అవసరం ఉంటుంది. -
ఇమ్యూనిటీ.. ఈజీగా
ఆ జబ్బు కరోనా వైరస్ వల్ల వచ్చే కోవిడ్ వ్యాధా కాదా?... మనకెందుకు... వదిలేయండి. అది ఇంకేదైనా ఇతర వైరస్తో వచ్చే జలుబూ, ఇన్ఫ్లుయెంజానా?... ఆ అంశాన్నే ఆలోచించకండి. ఒకవేళ అది బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల వచ్చే మరేదైనా ఇతర వ్యాధా?... మనకది అనవసరం. అది ఏ వ్యాధి అయినప్పటికీ... మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు స్వాభావిక కవచం ఒక్క వ్యాధి నిరోధకశక్తి మాత్రమే. అంటే... ఇంగ్లిష్లో చెప్పాలంటే ఇమ్యూనిటీ మాత్రమే. ఇమ్యూనిటీ మనకు ఎందుకు అవసరం, అత్యంత తేలిగ్గా దాన్ని సంపాదించడం ఎలా అన్నది తెలుసుకుంటే అది కరోనా అయినా... మరింకే వ్యాధి అయినా... మనం నిశ్చింతగా ఉండవచ్చు. మీరు మాల్స్లోకి ప్రవేశిస్తున్నప్పుడూ... లేదా ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడూ లేదా ఇంకేదైనా ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మనిషిని అంటుకోకుండా... దూరం నుంచే టెంపరేచర్ చూస్తున్నారు. మనిషి సాధారణ ఉష్ణోగ్రత మామూలుగానే ఉంటే మీరు వెళ్లాల్సిన చోటికి అనుమతిస్తున్నారు. ఎందుకలా ఉష్ణోగ్రత చెక్ చేస్తున్నారు? దాంతో తెలిసేదేమిటి? బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉంటే వ్యాధి లేనట్టేనా?... ఈ అనుమానాలు వచ్చే ఉంటాయి. అదెందుకో కింద ఉన్న బాక్స్లో చదవండి. మరి దేహ ఉష్ణోగ్రత పెంచడం ద్వారా వైరస్ వ్యాధుల్ని నివారించవచ్చా? జ్వరం రాకుండానే దేహ ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా వైరస్లతో వచ్చే వ్యాధుల్ని నివారించడం సాధ్యమా? దీనికి జవాబు కొంతవరకు అవుననే చెప్పవచ్చు. చాలావరకు అలా నివారించవచ్చు. అదెలాగో చూద్దాం. మనలో చాలామందిలో... బాగా చల్లగా ఉన్న ఐస్క్రీమ్ / కూల్డ్రింక్ / చల్లటి ఫ్రిజ్ వాటర్ తాగాక గొంతులో కాస్త దురదపెట్టినట్టుగా (ఇరిటేటింగ్గా) అనిపించి, క్రమంగా అది జలుబులోకి దిగడం చూసే ఉంటారు. మామూలు సమయాల్లో అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా... ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఇలా జలుబు చేయడం చాలా ఇబ్బందినీ, సామాజికంగా వివక్షకు గురయ్యే అవకాశాలనూ పెంచుతుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో గొంతులో కాస్తంత దురద (ఇరిటేటింగ్) గా ఉండి జలుబు/ఫ్లూ కు లోనయ్యే పరిస్థితి ఉంటే చిన్న జాగ్రత్తతోనే దాన్ని నివారించుకోవచ్చు. ఈ సువిశాల ప్రపంచంలోని అన్ని ప్రదేశాలతో పాటు మన గొంతులోనూ ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అలాగే అక్కడ నిద్రాణమైన స్థితిలో (డార్మంట్గా) వైరస్ కూడా ఉండనే ఉంటుంది. మనం చల్లటి నీరు తాగగానే ఆ వైరస్ తన నిద్రాణమైన స్థితిని వదిలి ప్రాణం పోసుకుంటుంది. అంతే... అలా ప్రాణం పోసుకున్నది కాస్తా... వెంట వెంటనే కణాలన్నింటిలోకీ ప్రవేశిస్తూ, ఆక్రమిస్తూ, తన సూచనలకు అనుగుణంగా అవి పనిచేసేలా ఆదేశిస్తూ... తనను తాను అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. యాంటీబాడీస్ తయారయ్యేవరకు అదలా తన ప్రభావం చూపుతూనే ఉంటుంది. మనకు జలుబు వైరస్ గానీ ఇతర వైరస్లు దేహంలోకి వచ్చాక జరిగే ప్రక్రియంతా దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఇమ్యూనిటీ ఉంటే లాభాలేమిటి... దేహానికి చాలా మంచి వ్యాధినిరోధక శక్తి అంటే... వైద్యపరమైన భాషలో చెప్పాలంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు కొందరిలో వ్యాధికి సంక్రమింపజేసే వైరస్ ప్రవేశించినప్పటికీ... అది దాని ఉనికిని చాటుకోకుండానే, ఎలాంటి చేటూ చేయలేకుండానే అలా నిద్రాణంగానే ఉండిపోయే అవకాశమూ ఉంది. కారణం మనలోని ఇన్నేట్ ఇమ్యూనిటీ వల్ల పుట్టే యాంటీబాడీస్. ఇవి తగినంతగా లేనందువల్లనే కదా... అందరికీ వైరస్ సోకినప్పటికీ... గుండెజబ్బులున్నవారూ, డయాబెటిస్ లేదా హైబీపీ వంటి ఇతర సమస్యలతో వ్యాధి నిరోధకత తగినంతగా లేనివారు ఆ వైరస్ బారినపడుతున్నారు. ఒకవేళ వాళ్లందరిలోనూ మంచి వ్యాధి నిరోధకత ఉండి ఉంటే...? వారు అసలు వైరస్ బారిన పడనే పడరు కదా. ఇమ్యూనిటీనీ ఈజీగా తెచ్చుకోవడం ఎలా? మనకు స్వాభావికమైన సాధారణ ఇమ్యూనిటీకి తోడ్పడే అంశాల్లో అత్యంత ప్రధానమైనవి ఎంజైములు, ప్రోటీన్, విటమిన్–సి, విటమిన్–డి, జింక్. అత్యంత ప్రధానమైన ఈ ఐదూ సమకూరడానికి సమతులాహారం కావాలి. అన్ని రకాల ఆకుకూరలు, రకరకాల రంగుల్లో ఉండే కాయగూరలతో ఎంజైములు లభిస్తాయి. కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారం లేదా పప్పు వల్ల ప్రోటీన్లు లభ్యమవుతాయి. తాజా నిమ్మజాతి పండ్లు, కమలాలు, జామ వంటి వాటితో విటమిన్–సి దొరుకుతుంది. లే లేత సూర్మకిరణాల ద్వారానూ విటమిన్–డి లభిస్తుంది. తాజా చేపలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, నట్స్, కోడిగుడ్లు, పొట్టుతీయని ముడి ధాన్యాలతో జింక్ లభ్యమవుతుంది. ఇవన్నీ సరిగ్గా ఒంటికి పడుతూ చురుగ్గా ఉండటానికి వ్యాయామం చేయాలి. ఇలా వేణ్ణీళ్లూ, ఇమ్యూనిటీ కోసం ఐదు పదార్థాలూ, కంటినిండా చక్కటి నిద్ర, తేలికపాటి వ్యాయామం, మానసిక ఉల్లాసంతో ఒక్క కరోనానే కాదు... మరెన్నో వ్యాధుల్నీ కట్టడి చేయవచ్చూ... రాకుండానే నివారించవచ్చూ... వచ్చినా అత్యంత తేలిగ్గా బయటపడవచ్చు. ఇకపై మనం మిగతా అన్ని వైరస్లలాగే కరోనాతో కలిసి ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకొని అందరూ చెబుతున్న విషయమే కాబట్టి... మనమంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ...పరిశుభ్రతతో మెలగుతూ... మన మంచి ఆరోగ్యానికి చక్కటి జీవనశైలిని అవలంబిద్దాం. ఇమ్యూనిటీతో నిశ్చింతగా ఉందాం. వేణ్ణీళ్లతోనే వైరస్నూ / ఇతర వ్యాధుల్నీ నివారించడమెలా? మన దేహ ఉష్ణోగ్రత పెరగడం వల్ల వైరస్ చనిపోతుందని తెలుసుకున్నాం కదా. అదే సూత్రం ఆధారంగానే వేణ్ణీళ్లతోనే వైరస్ను నివారించడం ఎలాగో చూద్దాం. మనం తాగ గలిగేంత వేడి (టాలరబుల్ టెంపరేచర్) ఉండేంతగా నీటిని వెచ్చబెట్టుకుని, దాన్ని తాగుతూ ఉంటే... దేహ ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రతను తగ్గించడం కోసమే మనకు చెమటలు పడతాయి. ఆ చెమటలు ఆవిరయ్యేలా మనం ఫ్యానుగాలికి ఉన్నామనుకోండి. అప్పుడు దేహంలోని ఉష్ణోగ్రతను (లేటెంట్ హీట్) తీసుకుని, ఆ చెమట నీరు ఆవిరవుతూ దేహాన్ని చల్లబరుస్తుంది. ఇలా మనం వేడి నీటిని తరచూ తాగుతూ (సిప్ చేస్తూ) ఉన్నామనుకోండి. జ్వరం రాకుండానే దేహం వేడెక్కుతూ ఉంటుంది. మళ్లీ ఆ వేడిని చల్లబరచడానికి చెమటలు పట్టడం, దేహం చల్లబడటం జరుగుతూ ఉంటుంది. ఇలా వేణ్ణీళ్లతోనే దేహం వేడిగా ఉండేలా చేస్తూ ఉంటే... దాదాపు 48 గంటల వ్యవధిలో మన దేహంలోకి ప్రవేశించిన వైరస్ చనిపోయి, స్వాభావికంగానే కట్టడి అయిపోయే అవకాశం ఉంది. అంటే... ఇలా వేణ్ణీళ్లు తాగుతుండడం ద్వారానే మనం చాలావరకు వైరస్ను నివారించగలమన్నమాట. అందుకే ఈ సీజన్లో చాలా చల్లగా ఉన్న కూల్డ్రింక్స్కూ, చిల్డ్ వాటర్కూ దూరంగా ఉంటూ... తరచూ వేణ్ణిళ్లు సిప్ చేస్తూ ఉండండి. టెంపరేచర్ చెక్ ఎందుకంటే...? మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారన్హీట్ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే కదా. మన శరీరంలో కొనసాగే అన్ని రకాల పనులు (బాడీ మెటబాలిజమ్) సరిగ్గా సాగాలంటే ఆ ఉష్ణోగ్రత అలా కొనసాగుతూ ఉండాలి. కానీ మన దేహంలోకి ఏదైనా వైరస్గానీ వ్యాధి కారక క్రిమిగానీ ప్రవేశిస్తే తనను తాను రక్షించుకోడానికి శరీరం ఓ పని చేస్తుంది. మన దేహంలో నార్మల్ టెంపరేచర్ దగ్గర వ్యాధి కలిగించే ఆ క్రిమి హాయిగా మనుగడ సాగిస్తుంది. కానీ దేహ ఉష్ణోగ్రత ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉంటే అది బతకలేదు. అందుకోసమే మెదడులోని టెంపరేచర్ సెంటర్ మన దేహ ఉష్ణోగ్రత పెరిగేలా ఆదేశిస్తుంది. అలా రోగాన్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా మన దేహ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటి? మన శరీర ఉష్ణోగ్రత పెరిగిందంటే దేహంలో ఏదో శత్రుజీవి ఉందని అర్థం. అందుకే నలుగురు గుమిగూడే ప్రదేశాల్లోకి అనుమతించడానికి అలా థర్మల్ స్క్రీనింగ్ (అంటే వేడిని తెలుసుకునే ఉపకరణంతో పరీక్షించి... వడపోత) నిర్వహిస్తున్నారని తెలుసుకోవచ్చు. -డాక్టర్. రానవేయిన రమేశ్, ఈఎన్టీ సర్జన్, ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్, కోఠీ, హైదరాబాద్ -
కావాలని కరోనా అంటించుకుని..
బెర్లిన్ : ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ పేరు చెబితేనే భయంతో వణకిపోతున్నాయి. ఇలాంటి సమయంలో జర్మనీ బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫెన్ వాన్ డాసెల్ మాత్రం కావాలనే కరోనా వైరస్ను తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. అయితే తాను ఇలా చేయడం వెనక ఒక బలమైన కారణం ఉందని స్టీఫెన్ చెబుతున్నాడు. తన పార్ట్నర్ నుంచి కరోనా వైరస్ సోకేలా చేసుకున్నానని స్టీఫెన్ తెలిపారు. కరోనాను తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని భావించానని.. అందుకోసమే ఇలా చేశానని వెల్లడించాడు. అయితే కరోనా వైరస్ తాను ఊహించని దానికంటే దారుణంగా ఉందని స్టీఫెన్ పేర్కొన్నాడు. తను అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం అనారోగ్యానికి గురైనట్టు వెల్లడించారు. దీనిని ఎవరికి సోకకుండా చూస్తానని అన్నారు. అయితే స్టీఫెన్ చేసిన పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడితే.. మిగతావారికి కూడా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది వైద్యుల సూచనలకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. అయితే స్టీఫెన్ మాత్రం తను ప్రపంచం కోసమే ఈ పని చేశానని అంటున్నాడు. తన పార్ట్నర్కు కరోనా సోకడంతో.. నేను కూడా క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా ఒకరి నుంచి మరోకరికి సోకుండా నిలువరించలేమని అన్నారు. కరోనా కట్టడి కోసం కృషి చేస్తాననని చెప్పారు. బాధ్యత గత వ్యక్తిగా కరోనా నుంచి కోలుకునే వరకు క్వారంటైన్లోనే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి : కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం చేతులెత్తి నమస్కరిస్తున్నా: బాలకృష్ణ -
ఈ ఫుడ్తో క్యాన్సర్కు చెక్..
లండన్ : ఉల్లిగడ్డలు, అరటి, వెల్లుల్లి వంటి ప్రిబయాటిక్స్తో క్యాన్సర్ పెరుగుదలను నిరోధించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ప్రిబయాటిక్స్ వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ శరీరంలోని మరిన్ని కణాలకు విస్తరించిన క్రమంలో వ్యాధి పురోగతిని ఇవి నియంత్రించినట్టు కనుగొన్నారు. మానవులపై ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రిబయాటిక్స్ అత్యున్నత క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కణితి నిరోధక ఇమ్యూనిటీని పెంచడం ద్వారా ప్రిబయాటిక్స్ క్యాన్సర్ వృద్ధిని అడ్డుకుంటాయని తొలిసారిగా తమ అథ్యయనంలో తేలిందని సెల్ రిపోర్ట్స్లో ప్రచురితమైన అథ్యయన రచయిత డాకట్ర్ జీవ్ రొనాయ్ పేర్కొన్నారు. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి క్యాన్సర్పై దాడి చేసే సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు. ఇక ప్రీబయాటిక్స్ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరీయాకు దోహదకారిగా ఉంటాయని ఎముకలు బలం పుంజుకునేందుకు అవసరమైన కాల్షియమ్ను శరీరం సంగ్రహించేందుకు అనుకూలంగానూ పనిచేస్తాయని వెల్లడైంది. ఒత్తిడికి గురయ్యే వారి అలసటను నిరోధించి మంచి నిద్రను ఆస్వాదించేందుకూ ఇవి ఉపకరిస్తాయని మరో అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. చదవండి : అన్ని రకాల కేన్సర్లకు ఒక్క మందు? -
జంక్ ఫుడ్ తింటున్నారా.. బీ కేర్ఫుల్
సాక్షి, న్యూఢిల్లీ : బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ఫుడ్స్’ను ఆశ్రయిస్తుంటాం, జంక్ ఫుడ్ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి అంతరించడంతోపాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తాయని, సంతాన సాఫల్య లోపం ఏర్పడుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ‘సైలెంట్ స్ప్రింగ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన శాస్త్రవేత్తలు మనం బయట తినే జంక్ ఫుడ్లపై అధ్యయనం చేశారు. బయట దొరికే ఫుడ్లో కల్తీ నూనెలు ఉంటాయని, శుచీ శుభ్రం ఉండదని, అందుకని అవి ప్రమాదకరమని ఇంతకుముందు ఎంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే మానవ తయారీ రసాయనాలు ఈ ఫాస్ట్ ఫుడ్లలో ఉన్నట్లు తేలింది. ప్యాకేజీల ద్వారా ఆహార పదార్థాల్లోకి ఇవి వస్తున్నాయని, అలాగే ఒవెన్లో తయారు చేసే పాప్ కార్న్లో కూడా ఈ రసాయనాలు దండిగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాలైన ప్యాకేజీ మెటీరియల్స్ను ఈ రసాయనాలను ఉపయోగించి తయారు చేయడమే వల్ల రసాయనాలు ఆహారపదార్థాల్లోకి రావడమే కాకుండా కలుషిత నీటి ద్వారా, పరిసరాల కలుషిత వాతావరణం ద్వారా ఈ రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరుతున్నాయట. జంక్ ఆహార పదార్థాలు, వాటి ప్యాకింగ్లపై అధ్యయనం జరపడంతోపాటు ఇంటి వంటకాలు, బయటి వంటకాలు తింటున్న దాదాపు పదివేల మంది అమెరికన్ల వైద్య రికార్డులు పరిశీలించి రసాయనాల గురించి నిర్ధారణకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగా ఇంటి వంటకాలే అన్ని విధాల శ్రేయస్కరమని పరిశోధకులు మరోసారి తేల్చారు. ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఇంటిలోని ‘నాన్ స్టిక్’ వంట పాత్రల్లో, వాటర్ ప్రూఫ్ ఫాబ్రిక్ కోటింగ్స్లో కూడా ఉంటాయని, వంటకాల కోసం వాటిని ఉపయోగించకూడదని కూడా పరిశోధకలు తెలిపారు. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే ఈ రసాయనాలను 1930 దశకంలో పలు రకాల వస్తువుల తయారీ కోసం శాస్త్రవేత్తలు సృష్టించారు. -
రాగిజావ... ఆరోగ్యానికి దోవ
వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిలో రాగిజావ చాలా ఆరోగ్యకరం. రాగిజావను రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం... ∙రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ∙వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు దీన్ని తరచూ తీసుకోవడం మంచిది. ∙రాగి పిండిలో విటమిన్–సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోబాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, రాగిజావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. ∙బరువు తగ్గాలనుకునేవారు రాగులను జావ రూపంలోనే కాదు, సంగటిగానూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ∙రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. ∙దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు. -
ఈస్ట్రోజెన్ తగ్గకుండా ఉండాలంటే?
నాకు ఈమధ్య బాగా చెమటలు పడుతున్నాయి. చికాకుగా ఉంటోంది. మెనోపాజ్ అని అనుమానంగా ఉంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోకుండా శరీరానికి అవసరమైన ఆహారం తీసుకోవచ్చు అని విన్నాను. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. – కె.నీరజ, సింగరాయకొండ మీ వయసు ఎంత అని రాయలేదు. పీరియడ్స్ అవుతున్నాయా లేదా రాయలేదు. చెమటలు పట్టడం, చిరాకు వంటి లక్షణాలు మెనోపాజ్ సమయంలోనే కాకుండా, వేరే హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, విటమిన్ లోపాలు, కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలు ఎన్నో కారణాల వల్ల ఉండవచ్చు.కొందరిలో పీరియడ్స్ ఆగిపోయే 4–5 సంవత్సరాల ముందు నుంచి కూడా అండాశయాలు తగ్గి వాటి నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం మెల్లగా తగ్గిపోతూ వచ్చి చాలావరకు ఆగిపోతుంది.ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఉన్నట్టుండీ శరీరం వేడిగా అనిపించడం, అలాగే చెమటలు పట్టడం (hotflushes), చికాకు, కోపం, డిప్రెషన్ వంటి అనేక మార్పులు జరుగుతుంటాయి. వీటినే మెనోపాజల్ లక్షణాలుగా పరిగణించటం జరుగుతుంది. సహజంగా వచ్చే ఈ మార్పులను మనం నివారించలేము. కాకపోతే, తప్పిపోయిన ఈస్ట్రోజన్కు బదులుగా, ఈస్ట్రోజన్లాగా పనిచేసే ఫైటోఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావోన్స్ అనే పదార్థాలను వాడవచ్చు. ఇవి సాధారణంగా సోయాబీన్స్, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, పిస్తా, బఠాణీలు, పప్పులు, లవంగాలు, ఎండు ఖర్జూరాలు, నారింజలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్స్, వాటి ఉత్పత్తులయిన సోయా పాలు, చీజ్, సోయాపిండి, తోçఫు... వంటివాటిలో ఎక్కువగా ఐసోఫ్లావోన్స్ అనే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో ఇడ్లీలలో మినపప్పు బదులు, ఉడికించిన సోయాగింజలు, చపాతీల్లో సోయా పిండి అలా రకరకాలుగా తీసుకోవచ్చు. అలాగే ఎక్కువగా నీళ్ళు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు తీసుకోవడం మంచిది. (ఈ సమయంలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకలు అరగటం, గుండె పనితీరులో మార్పులు కూడా జరుగుతాయి) వాకింగ్, వ్యాయామాలు, ధ్యానం చెయ్యటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, శరీరం దృఢంగా ఉంటుంది. కాఫీ, టీ, కారం, మసాలాలు బాగా తగ్గించడం మంచిది. ఈ ఫైటోఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావోన్స్ ఆహారంలోనే కాకుండా, టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతాయి. ఇవి డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పాపాయికి ఏ సమయాల్లో పాలు పట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... వివరంగా తెలియజేయగలరు. – బి.సుమ, సామర్లకోట బాలింతలలో కాన్పుకి ముందు కంటే ఎక్కువగా ఆహారంలో మంచి పోషక పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే తొమ్మిది నెలల పాటు కడుపులో బిడ్డ పెరగటానికి, తల్లిలో మార్పులకు, కలిగిన అలసటకు, కాన్పు తర్వాత ఆ నీరసం తగ్గటానికి, బిడ్డకు పాలు ఇవ్వటానికి తగిన శక్తి కావలసి ఉంటుంది. బిడ్డకు కావలసిన పోషకాలు అన్నీ తల్లి పాల ద్వారానే అందుతాయి. కాబట్టి కాన్పు తర్వాత ఆహారంలో అన్నం, చపాతీలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రైప్రూట్స్, పాలు, పెరుగు, మాంసాహారులు అయితే చేపలు, మాంసం అన్నీ కొద్దికొద్దిగా రోజూ తీసుకోవచ్చు. వీటివల్ల తల్లికి చీముపట్టడం, బిడ్డకు జలుబు చెయ్యడం వంటి సమస్యలు ఏమీ ఉండవు. తల్లి ఆహారంలో పప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొటీన్స్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి పాలు బాగా పడతాయి. కుట్లు తొందరగా మానుతాయి. ఎక్కువగా మంచినీళ్లు తీసుకోవాలి. దాని వల్ల పాలు బాగా వస్తాయి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, మలబద్ధకం లేకుండా ఉంటాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. నీళ్లు త్రాగడం వల్ల పొట్ట పెద్దగా రావడం ఉండదు. పాపకి పాలు 3 గంటలకొకసారి తాగించాలి. పాలు తాగించేటప్పుడు బిడ్డను సరిగా పట్టుకొని, రొమ్ములను సరిగా పట్టించి తాగించాలి. పాలు సరిగా రావటానికి పౌష్టికాహారంతో పాటు, తల్లి మానసికంగా సంతోషంగా ఉండటం కూడా ముఖ్యం.కాన్పు తర్వాత తల్లి కనీసం మూడునెలల పాటు ఐరన్, కాల్షియం మాత్రలు తీసుకోవాలి. కాన్పు తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా, కొద్దిగా మెల్లగా నడవడం వంటి చిన్న పనులు చేసుకుంటూ ఉండటం, రెండు నెలల తర్వాత వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. నా వయను 29 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. నాకు డయాబెటిస్ ఉంది. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను బరువు ఎక్కువగా ఉన్నాను. ఈ టైమ్లో బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చా? ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేయగలరు. – యస్.పల్లవి, సిద్దిపేట మీకు డయాబెటిస్ ప్రెగ్నెన్సీలో వచ్చిందా, లేక గర్భం రాక ముందు నుంచే ఉందా అనేది సరిగా రాయలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీలో మార్పుల వల్ల షుగర్ లెవల్స్ అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. దాన్ని నియంత్రించడానికి మందులు (ఇన్సులిన్) ఎక్కువ డోసులో వాడవలసి ఉంటుంది. ఇప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఈ సమయంలో ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. దీనికోసం ఆహారంలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆహారంలో అన్నం తక్కువ (కార్బోహైడ్రేట్స్) తీసుకోవాలి. స్వీట్లు, షుగర్ ఎక్కువ ఉన్న అరటిపండ్లు, సపోటా వంటివి తీసుకోకపోవడం మంచింది. పాలలో షుగర్ లేకుండా తీసుకోవాలి. ఆహారం కొద్దికొద్దిగా 4,5 సార్లుగా విభజించుకుని తీసుకోవడం మంచిది. ఒకసారి డైటీషియన్, నిపుణులను సంప్రదిస్తే వారు మీ బరువుకి తగ్గ ఆహార నియమాలను ప్లాన్ చేసి ఇస్తారు. అలాగే ఫిజీషియన్ దగ్గర సక్రమంగా చెకప్లకు వెళ్ళడం, షుగర్ లెవెల్స్ అవసరాన్ని బట్టి 15 రోజులకు లేదా నెలకోకసారి పరీక్ష ద్వారా తెలుసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో షుగర్ మందులు, ఇన్సులిన్ డోస్ను సరిచేసుకుంటూ వాడుకోవాలి. ఈ సమయంలో గైనకాలజిస్ట్ సలహా మేరకు, రోజూ అరగంట వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు, యోగ, ప్రాణాయామం వంటివి చెయ్యడం తప్పనిసరి. - డా‘‘ వేనాటి శోభ, బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
సిప్రిడోఫోబియా నుంచి బయటపడేదెలా?
నాకు పెళ్లి నిశ్చయమైంది. కానీ మనసులో ఏవో భయాలు. నాకు కాబోయే భర్త చెడుతిరుగుళ్లు తిరిగి ఉంటే నా పరిస్థితి ఏమిటి? అతనికేమైనా సుఖవ్యాధులు ఉన్నాయేమో... ఇలా రకరకాల భయాలు మొదలయ్యాయి. ‘సిప్రిడోఫోబియా’ నుంచి ఎలా భయటపడాలో దయచేసి తెలియజేయగలరు. – కెఆర్, కాజీపేట సిప్రిడోఫోబియా అంటే కలయిక గురించిన భయం. దాని వల్ల లైంగిక వ్యాధులు, సుఖవ్యాధులు వస్తాయోమోనన్న భయం, అపోహలతో చాలామంది పెళ్లి అంటేనే భయపడిపొతుంటారు. పెళ్లయినా, భర్తని దూరం పెట్టడం, వాళ్లకి వాళ్ళే ఏదో అయిపోతుందని ఊహించేసుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. దీని లక్షణాలలో భాగంగా కంగారు, భయం, గుండెదడ, లేనిపోని అనుమానాల వంటివి ఎన్నో ఉండవచ్చు. దీనికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, ఆందోళన తగ్గడానికి కొన్ని మందులు వంటివి ఉంటాయి. అలాగే పాజిటివ్ థింకింగ్, యోగా, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీలో భాగంగా ఈ సమస్య ఉన్నవాళ్లకి రకరకాల ఉదాహరణలు ఇవ్వడం, సుఖవ్యాధుల గురించి అవగాహన, కొన్ని వీడియోలు చూపడం వంటివి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించి భయపడడం మానేసి ఒకసారి సైకాలజిస్ట్ను లేదా సైకియాట్రిస్ట్ను సంప్రదించి కౌన్సెలింగ్ చేయించుకోవడం మంచిది. నాకు తరచుగా వైట్ డిశ్చార్జి అవుతుంది. నెలసరికి సంబంధం లేకుండా రక్తస్త్రావం అవుతోంది. దీనికి కారణాలు, నివారణ గురించి తెలియజేయగలరు.– యస్బి, రాజంపేట వైట్ డిశ్చార్జ్, రక్తస్రావం తరచుగా అవుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్ను సంప్రదించడం మంచిది. తరచుగా వైట్ డిశ్చార్జ్ అవుతుందన్నారు, అందులో దురద, చెడువాసన ఏమైనా ఉన్నాయా అని రాయలేదు. ఇవన్నీ కలిపి ఉంటే యోనిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా భావించవలసి ఉంటుంది.కొంతమందిలో పిరియడ్ మధ్యలో, పిరియడ్ వచ్చే ముందు కొద్దిగా జిగటగా వైట్డిశ్చార్జ్ అవుతుంది. అది మాములే.కొందరిలో రక్తహీనత, నులిపురుగులు, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వైట్డిశ్చార్జ్ అవుతుంది. నెలసరి అప్పుడు కాకుండా మిగతా సమయంలో కూడా రక్తస్రావం అవుతుంటే మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల మార్పులు, థైరాయిడ్ సమస్య, ఎండోమెట్రియల్ పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, గర్భాశయంలో పుండ్లు, ఇన్ఫెక్షన్లు, అండాశయంలో సిస్ట్ల వంటి అనేక కారణాల వల్ల రావచ్చు.ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, పెల్విక్ స్కానింగ్, బీపీ, థైరాయిడ్ వంటి కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం వల్ల మీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గ, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నాకు మంటగా ఉంటోంది. ఇది క్లమిడియా లక్షణమని మా కొలీగ్ చెబుతున్నారు. ఇది నిజమేనా? ఈ బ్యాక్టీరియా ఎందుకు సోకుతుంది? నివారణ చర్యలు ఏమిటి? – విఎన్, నరసరావుపేట మూత్రవిసర్జన చేసేటప్పుడు మంటగా ఉండడం అనేది కేవలం క్లమిడియా బ్యాక్టీరియా వల్లే కాదు ఇంకా అనేక రకాల బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు. క్లమిడియా బ్యాక్టీరియా జాతికి చెందిన క్రిములు. ఇవి మగవారిలో వీర్యంలో, ఆడవారిలో యోనిస్రావాలలో ఉంటాయి. ఇవి కలయిక ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో మంట, పచ్చని యోని ద్రవాలు వస్తాయి. దురద, మంట, కలయికలో నొప్పి, నెలసరి మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఇన్ఫెక్షన్ని నిర్లక్ష్యం చేస్తే క్లమిడియా బ్యాక్టిరియా యోని నుంచి గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ తద్వారా పొత్తి కడుపులోకి పాకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్(పీఐడి)ని కలుగజేస్తుంది. ఇందులో ట్యూబ్స్ పాడై అవి మూసుకోవడం, వాటి పనితీరు తగ్గడం... తద్వారా గర్భం దాల్చడానికి ఇబ్బంది అవ్వవచ్చు. ఇందులో జ్వరం, ఒళ్లునొప్పులు, వాసన, దురదతో కూడిన తెల్లబట్ట, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గర్భం దాల్చితే అవి బిడ్డకు కూడా సోకి ఇబ్బందులు కలిగించవచ్చు. దీనికి లక్షణాలను బట్టి వెజైనల్ స్వాబ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. లక్షణాల తీవ్రతను బట్టి దీనికి అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్వంటి యాంటిబయాటిక్స్తో చికిత్స వారం నుంచి రెండు వారాల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కలయికకు దూరంగా ఉండడం మంచిది. అదే సమయంలో మగవారు కూడా మందులు వాడితే మంచిది.మంచి ఆహార నియమాలు, వ్యాయామాలతో రోగనిరోధకశక్తిని పెం చుకోవడం, శారీరక,వ్యక్తిగత శుభ్రతను పాటించడం, కలయిక సమయంలో కండోమ్స్ వాడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను చాలావరకు అరికట్టవచ్చు.క్లమిడియా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిపోయినా, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారి రోగనిరోధకశక్తిని బట్టి కలయిక ద్వారా మళ్లీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
రక్షక ఫలం
ఆపిల్ అనే మాటలోనే ‘పిల్’ ఉంది. నిజమే. ఎన్నో ఆరోగ్యాలనిచ్చే సూపర్ పిల్ అది. దానితో సమకూరే కొన్ని ప్రయోజనాలివి. ∙ఆపిల్లోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. అయితే మిగతా పండ్లతో పోలిస్తే ఆపిల్కు ప్యాంక్రియాస్ క్యాన్సర్ ముప్పునుంచి రక్షణ కల్పించే గుణం 23 శాతం ఎక్కువ అని అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధనల్లో స్పష్టమైంది. ∙దీనిలో ట్రైటెర్పినాయిడ్స్ అనే పోషకాలు కాలేయ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లను నివారిస్తాయని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనలో తేలింది. ∙ఆపిల్ మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగానే అది మనకు అలై్జమర్స్ వ్యాధిని నివారించి మెదడుకు రక్షణనిస్తుంది. అంతేకాదు... పార్కిన్సన్స్ వ్యాధినీ ఆపిల్ నివారిస్తుంది. ∙ఆపిల్లో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. ఈ పీచుపదార్థాల కారణంగా మలవిసర్జన సాఫీగా అయి, మలబద్దకం నివారితమవుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), పైల్స్ వంటి వ్యాధులను సైతం తేలిగ్గా నివారిస్తుంది. ∙ఆపిల్లో పీచుపదార్థాల కారణంగా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ∙ఇందులోని పీచు కారణంగా ఆరోగ్యకరంగా బరువును నియంత్రించుకోడానికి ఆపిల్ ఎంతగానో తోడ్పడుతుంది. ∙ఆపిల్ మంచి డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్ కూడా. ఇది కాలేయంలోని విషాలను సమర్థంగా తొలగిస్తుంది. ∙ఆపిల్లోని విటమిన్–సి వల్ల ఇది శరీరంలోని స్వాభావికమైన రోగనిరోధకశక్తిని మరింత పెంచుతుంది. తద్వారా ఎన్నో వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తుంది. ∙ఆపిల్లో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. ఫలితంగా రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. -
పుల్లన జిల్లున
ఉసిరిని సంస్కృతంలో ‘ధాత్రి’ అని అంటారు. ధాత్రి అంటే సంపదకు నిలయం. నిజంగానే ఉసిరి ఆరోగ్య సిరికి నిలయం. విటమిన్ ‘సి’ ఇందులో పుష్కలం. రోగనిరోధక శక్తికి ఇది సాధనం. ఈ సీజన్లో ఉసిరికి చింతకాయను, నిమ్మకాయను జతచేయండి. తుమ్ముకు, దగ్గుకు జల్ల కొట్టి కారం కారంగా జిల్లుమనిపించండి. ఉసిరి ఊరగాయ కావలసినవి: ఉసిరి కాయలు – అర కేజీ; మిరప కారం – పావు కప్పు; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; మెంతులు – అర టీ స్పూను; సోంపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఆ పైన రంధ్రాలున్న ప్లేట్ ఉంచి వాటి మీద ఉసిరికాయలను ఉంచి మూత పెట్టి, పది నిమిషాలు స్టౌ మీదే ఉంచి దింపేయాలి ∙ఉసిరికాయలలోని గింజలను వేరుచేయాలి ∙ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఆవాలు, మెంతులు, సోంపు వేసి దోరగా వేయించి దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి ∙ఉసిరి ముక్కలను జత చేసి వేయించాలి ∙మిరప కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పొడి చేసుకున్న ఆవాల పొడి మిశ్రమం జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. టొమాటో, పండు మిర్చి పచ్చడి కావలసినవి: టొమాటోలు – అర కేజీ; ఉప్పు – 1 + అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; పండు మిర్చి – అర కేజీ; చింతపండు – 50 గ్రా.; తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, గాలికి ఆరబెట్టాలి ∙ పూర్తిగా తడి పోయిన తరవాత పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి రెండు రోజులు అలాగే వదిలేయాలి ∙పండుమిర్చి తొడిమలు తీసి, నీళ్లలో శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, తడిపోయే వరకు గాలికి ఆరబెట్టాలి ∙మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి, కొద్దిగా మెత్తపడేవరకు మిక్సీ పట్టాలి ∙ సీసాలో ఉన్న టొమాటో ముక్కలను బయటకు తీయాలి ∙రసాన్ని వేరు చేయాలి ∙వేరు చేసిన రసంలో చింతపండు వేసి, ముక్కలను, రసాన్ని విడివిడిగా రెండు రోజుల పాటు ఎండబెట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో చింతపండు నానబెట్టిన టొమాటో రసం, ఎండ బెట్టిన టొమాటో ముక్కలు, పండు మిర్చి తొక్కు వేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి బయటకు తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నువ్వుల నూనె కాగిన తరవాత ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించి దింపి చల్లారనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ∙ఈ పచ్చడి సుమారు పదిహేను రోజులు నిల్వ ఉంటుంది. చింతకాయ పచ్చడి కావలసినవి: పండు చింతకాయలు – 10; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పచ్చి మిర్చి – తగినన్ని; ఎండు మిర్చి – 1 తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి గాలి చొరని సీసాలో ఉంచి మూత పెట్టి మూడు రోజుల తరవాత బయటకు తీసి, గింజలను వేరు చేయాలి ∙చింతకాయ తొక్కును మరోమారు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙వేయించిన పోపు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙కమ్మటి నేతితో అన్నంలో తింటే రుచిగా ఉంటుంది పచ్చి మిర్చి– నిమ్మరసం పచ్చడి కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – ఒక టీ స్పూను; ఆవాల పొడి – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – తగినంత; నిమ్మ రసం – అర కప్పు; ఇంగువ – కొద్దిగా తయారీ: ∙ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాక, రెండేసి ముక్కలుగా కట్ చేయాలి ∙జాడీలో పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, ఆవాల పొడి, మెంతులు వేసి బాగా కలిపి మూత పెట్టి, రెండు రోజులు వదిలేయాలి ∙మూడో రోజు, స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి కలిపి దింపేయాలి ∙çపచ్చి మిర్చి ఉంచిన జాడీ మూత తీసి, కాచిన నూనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి ∙ఇది చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. చింతకాయ పులుసు కావలసినవి: చింతకాయలు – 200 గ్రా.; వంకాయలు – 4 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటోలు – 2 (ముక్కలు చేయాలి); సొరకాయ ముక్కలు – 4; ములక్కాడ–1; క్యారెట్–1; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను. పేస్ట్ కోసం: బియ్యం – ఒక టేబుల్ స్పూను (గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి); ఆవాలు – అర టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; (ఈ పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి). పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. (స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఈ పదార్థాలన్నీ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకు జత చేసి వేయించి దింపేయాలి). తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, చింతకాయలు వేసి స్టౌ మీద ఉంచి చింతకాయలు మెత్తపడే వరకు ఉడికించి, దించి చల్లార్చాలి ∙బాగా చల్లారాక చింతకాయలను గట్టిగా పిండి, చెత్తను తీసేయాలి ∙మరొక పాత్రలో నీళ్లు, తరిగి ఉంచుకున్న కూర ముక్కలు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙ చింతకాయ రసం జత చేసి కలపాలి ∙ఉప్పు, పసుపు జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించాలి ∙ముద్ద చేసి ఉంచుకున్న బియ్యం మిశ్రమం, పోపు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ∙ పులుసు బాగా మరుగుతుండగా ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి ఉసిరి తొక్కు పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 20; నీళ్లు – తగినన్ని; నువ్వుల నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – 5 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద ఒక పాత్ర ఉంచి, అందులో నీళ్లు పోసి కాగాక, ఉసిరి కాయలు వేసి పావు గంట సేపు ఉడికించి తీసేయాలి ∙గింజలను వేరు చేసి, ఉసిరి కాయ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ముక్కలు బాగా చల్లారిన తరవాత మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి, మెత్తగా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, మెంతులు, ఆవాలు వేసి వేయించాలి ∙ మిరప కారం వేసి బాగా వేయించాలి ∙చివరగా మెత్తగా చేసి ఉసిరి ముద్ద వేసి బాగా దగ్గర పడే వరకు వేయించాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙బెల్లం పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. పండు మిర్చి నిమ్మకాయ నిల్వ పచ్చడి కావలసినవి: పండు మిర్చి – అర కేజీ; నిమ్మకాయలు – డజను (చిన్న సైజువి); ఉప్పు – తగినంత; ఆవాలు–ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; నూనె – 100 గ్రా.; ఇంగువ – అర టీ స్పూను; ఆవ పొడి–ఒక టేబుల్ స్పూను; మెంతి పొడి–పావు టేబుల్ స్పూను; మిరప కారం–రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా పండు మిర్చిని నీళ్లలో శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు ఆరబెట్టాలి మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాక, బయటకు తీసి, ఒక పాత్రలో రెండు రోజుల పాటు మూత పెట్టి ఉంచాలి నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, ఆరబెట్టాలి ∙తడి పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరిగి, తగినంత ఉప్పు జత చేసి బాగా కలిపి, జాడీలో రెండు రోజుల పాటు ఉంచాలి ∙మూడో రోజు పండు మిర్చి మిశ్రమం, నిమ్మకాయ ముక్కలను బయటకు తీసి, ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ∙మెంతి పొడి, ఆవ పొడి, మిరప కారం జత చేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ∙చల్లారాక పండుమిర్చి నిమ్మకాయ పచ్చడిలో వేసి కలపాలి ∙ ఈ పచ్చడి సుమారు పది రోజులు నిల్వ ఉంటుంది. (ఉప్పు సరిపడేలా చూసుకోవాలి). -
వరుసగా గర్భస్రావాలు...సంతానభాగ్యం ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్ను సంప్రదిస్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? – శైలజ, సికింద్రాబాద్ గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కూర్చుంటే లేవలేకపోతున్నాను... నా వయసు 29 ఏళ్లు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. రెండేళ్ల నుంచి చాలాసేపు కూర్చున్న తర్వాత లేవలేక, నడవలేకపోతున్నాను. వెన్నుపూసలో పట్టివేసినట్లు ఉంటోంది. హెచ్ఎల్ఏ బి27 పాజిటివ్ వచ్చింది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? – కె. అరుణ్కుమార్, విశాఖపట్నం మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తే మీరు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్తో బాదపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే తమ వ్యాధి నిరోధక శక్తే తమకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక భాగాలలో సమస్యను కలిగిస్తుంది. యుక్తవయస్కులు అంటే... సాధారణంగా 18–30 ఏళ్ల వారిలో కీళ్లు, మెడ బిగుసుకొని, నొప్పి ఎక్కువగా ఉంటుంది. వ్యాధి పురుషుల్లో చాలా సాధారణం. అంతేకాదు... మరీ ఎక్కువ తీవ్రతతో కూడా వస్తుంది. హెచ్ఎల్ఏ బి27 అనే ప్రోటీన్ గల జన్యువు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్య వెన్నుపూసల మధ్య వాపును కలగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్లు వెన్నెముకను పైకి పైకి జరుపుతాయి. ఫలితంగా ఇది పెల్విస్ భాగంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. కారణాలు: ∙వాతావరణ/పర్యావరణ సంబంధిత అంశాలు ∙బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో వంశపారం పర్యం/జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు: ∙కంటి సమస్యలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబారతాయి. ∙కీళ్లు, మెడ బిగుసుకుపోతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగాఉంటుంది ∙నడుమునొప్పి, శరీరంలో చాలాచోట్ల స్టిఫ్నెస్ వస్తుంది. ∙శరీరకంగా కదలికలు తగ్గుతాయి. చికిత్స: యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ను హోమియో మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన బయలాజికల్ మందులు వ్యాధి పెరగడాన్ని నిరోధిస్తాయి. హోమియోలో దీనికి కాల్కేరియా ఫాస్, ఫాస్ఫరస్, ఫాస్ఫారిక్ యాసిడ్, లైకోపోడియమ్, పల్సటిల్లా, నక్స్వామికా, ఆరమ్, సైలీషియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ చర్మంపై పొలుసుల్లాగా రాలుతున్నాయి... పరిష్కారం చెప్పండి నా వయసు 36 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? – ఎల్. విజయ్, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. లక్షణాలు: ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
కలయికతో షుగర్ వస్తుందా?
నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఈ మధ్య షుగర్ ఉన్నట్లు డాక్టర్ పరీక్షల్లో తేలింది. నేను, మావారు పిల్లలు కావాలనుకుంటున్నాము. మేము కలవడం వల్ల, మావారికి షుగర్ అటాక్ అవుతుందా? ఇదే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? – పి.ఆర్, ఇ–మెయిల్ షుగర్ వ్యాధి (మధుమేహం లేదా డయాబెటిస్) అనేది శరీరతత్వాన్ని బట్టి, జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు వంటి అనేక రకాల అంశాలనుబట్టి సంక్రమిస్తుంది. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే అంటు వ్యాధి కాదు కాబట్టి మీ నుంచి మీ వారికి వచ్చే అవకాశాలు అసలు లేవు. ఇప్పుడు మీకు 35 ఏళ్లు, షుగర్ ఉంది, పిల్లలు కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదిస్తే వారు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, బరువు ఎంత ఉన్నారు, మందులు అవే వాడాలా లేక మార్చాలా, డోస్ మార్చాలా, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దాన్నిబట్టే మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. షుగర్ ఉన్నవాళ్లు గర్భానికి ప్రయత్నించే ముందు షుగర్ శాతం అదుపులోకి తెచ్చుకోవాలి. హెచ్బీఏ1సి అనేది ఆరు కంటే తక్కువ ఉండాలి. బరువు తగ్గాలి. దీని కోసం ఆహారంలో, జీవనశైలిలో మార్పులు వంటివి చేసుకోవాలి. షుగర్ నియంత్రణలో లేకుండా గర్భం దాల్చడం వల్ల అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, నెలలు నిండకుండా కాన్పులు, బిడ్డ బరువు, కాన్పు సమయంలో ఇబ్బందులు, ఆపరేషన్ అవసరం రావడం, కడుపులో బిడ్డ చనిపోవడం వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వయసు 35 ఏళ్లు కాబట్టి అండాశయాల నుంచి విడుదలయ్యే అండాల సంఖ్య, నాణ్యత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తొందరగా షుగర్ను అదుపులోకి తెచ్చుకొని ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతూ గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. మూడు నుంచి ఆరు నెలల్లో గర్భం రాకపోతే గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి పర్యవేక్షణలో సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని చికిత్స తీసుకోవడం మంచిది. లేకపోతే 35 ఏళ్లు దాటే కొద్దీ గర్భం దాల్చడానికి ఇబ్బంది, దాల్చిన తర్వాత అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, బీపీ పెరగడం వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ∙గతంలో నాకు చక్కగా నిద్రపట్టేది. అయితే ఇప్పుడు సరిగా నిద్ర పట్టడం లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది సాధారణమేనని ఒక్కరిద్దరు అన్నారు. ఇది నిజమేనా? బాగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? నేను ఎత్తు మడమల చెప్పులు వాడతాను. ఇవి వాడొద్దు అంటున్నారు. వీటి గురించి తెలియజేయగలరు. – బి.సరోజ, తెనాలి ప్రెగ్నెన్సీ సమయంలో శారీరకంగా, మానసికంగా, హార్మోన్లలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. మొదటి మూడు నెలల్లో వికారం, వాంతులు, నీరసం వంటి లక్షణాల వల్ల చికాకు వంటివి ఏర్పడి నిద్ర పట్టకపోవచ్చు. తర్వాత బిడ్డ పెరిగి పొట్ట పెరిగే కొద్దీ బరువు నడుము మీద పడటం, అటూఇటూ తిరగడానికి ఇబ్బందిగా ఉండటం, ఊపిరితిత్తులు అదుముకున్నట్లుగా ఉండి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లు ఉండటం, అసిడిటీ వంటి లక్షణాల వల్ల నిద్ర సరిగా పట్టదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. రాత్రిపూట పడుకునే రెండు గంటలకు ముందే ఆహారం తీసుకోవాలి. తర్వాత కొంచెంసేపు అటూఇటూ నడవాలి. అలాగే పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగి, తల కింద దిండును ఎత్తుగా పెట్టుకుంటే నిద్ర పడుతుంది. కాళ్ల కింద లేదా కాళ్ల మధ్యలో, పొట్ట పక్కకి దిండు పెట్టుకుంటే కూడా కొద్దిగా నిద్ర పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో అయిదు నెలల తర్వాత నుంచి ఎక్కువసేపు ఎడమవైపుకి తిరిగి పడుకుంటే తల్లికి, బిడ్డకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో పొట్ట పెరిగేకొద్దీ బరువు నడుము మీద, అలాగే కాళ్ల మీద పడుతుంది. ఈ సమయంలో ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం వల్ల బరువుని బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. దానివల్ల బ్యాలెన్స్ తప్పి కాళ్లు మెలికపడటం, జారి కింద పడటం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనవసరంగా సమస్యలు తెచ్చుకోకుండా ఈ సమయంలో నడవడానికి సులువుగా, మెత్తగా ఉంటే ఫ్లాట్ చెప్పులు వేసుకోవడం మంచిది. ∙నాకు తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ఎక్కువగా తుమ్ముతుంటాను. చాలా నీరసంగా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. ఈ సమయంలో ఎక్కువగా తుమ్మడం వల్ల ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచించగలరు. – రవళి, ప్రొద్దుటూరు మీకు తరచూ జలుబు చేస్తోంది అంటున్నారు. పేస్ట్ అలర్జీ వల్ల లేదా ఇంకా ఏదైనా అలర్జీ వల్ల, ఇస్నోఫిలియా వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు తరచూ జలుబు చేయడం, తుమ్ములు రావడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తుమ్ములు రావడం వల్ల పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు. కాకపోతే గర్భం పెరిగి పొట్ట పెరిగే కొద్దీ ఎక్కువగా తుమ్మడం వల్ల పొట్టమీద బరువు పడినట్లు ఉండటం, కొంతమందిలో మూత్రం కొద్దిగా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జలుబు రావడానికి అలర్జీతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. జలుబు అసలు రాకుండా ఉండేందుకు మనం ఏమీ చేయలేం. కాకపోతే అలర్జీ వల్ల వచ్చే జలుబు రాకుండా ఉండేందుకు, మీరు దుమ్ము ధూళికి దూరంగా ఉండటం, చల్లని, పడని ఆహార పదార్థాలను వాడకుండా ఉండటం, అవసరమైతే ఎప్పుడైనా అప్పుడప్పుడు సెట్రిజన్ మాత్ర వేసుకోవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
జులుబుకు ఏ సూప్ మంచిదంటే!
వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో బాధిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జులుబు, జ్వరం, దగ్గు సమస్యల ఉపశమనానికి... చికెన్ సూప్: ఉల్లికాడలు, ఉల్లిపాయలు, మిరియాల పొడి కలిపి తయారుచేసుకున్న చికెన్ సూప్ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇస్తుంది. మష్రూమ్/పాల కూర సూప్: శాకాహారులు పుట్టగొడుగులు, పాలకూరలతో సూప్లను తయారుచేసుకోవచ్చు. దీంట్లోనూ ఉల్లికాడలు, మిరియాలు, వెల్లుల్లి, జిలకర్ర కలిపి తయారుచేసుకొని సేవించాలి.సూప్లు ఏ సమయంలోనైనా వేడి వేడిగా తీసుకుంటే రుచిగానూ ఉంటాయి. అనారోగ్యసమస్యల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ‘సి’ విటమిన్, యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.ఈ సీజన్లో నీటి కాలుష్యం ఎక్కువ. వడకట్టడం, మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పెరుగు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. వారానికి ఒకరోజు లేదా 15 రోజులకొకసారి ఉపవాసం ఉండాలి. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా కాదు. ఆ రోజు మొత్తం కూరగాయలు, పండ్లు, పళ్ల రసాలు, నీళ్ల మీదే ఉండాలి. వేరే ఇతర ఆహార పదార్థాలేవీ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో మలినాలు తొలగి, జీర్ణవ్యవస్థ పనితీరు చురుకు అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా శాతం పెరిగి అనారోగ్యసమస్యలు దరిచేరవు. ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్లు ఈ కాలం చాలా మంచివి. ఈ కాలం మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. అలాగే – ఊపిరితిత్తులు, ముక్కుకు సంబంధించినవి, మలబద్దకం సమస్యలకు అవకాశాలు ఎక్కువ. రోజులో 2–3 లీటర్లు శుభ్రమైన నీళ్లు సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది. కాయగూరల్లో బీట్రూట్, క్యారెట్ వంటి సూప్లను ఎర్రకందిపప్పును ఉపయోగించి తయారుచేసుకోవాలి. ఇది సలాడ్లా తయారుచేసుకొని భోజనంలా కూడా తినవచ్చు. ∙టొమాటో రసం, టొమాటో పప్పు.. టొమాటోతో కూడిన వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యకరం.జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడుతూ ఉంటాయి. అందుకని జీర్ణకోశాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ కాలం అంత ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని విస్మరించకూడదు. – డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్ -
సూపర్ స్పెషలిస్ట్
చిన్న పిల్లల్లో బాగా జ్వరం వచ్చి తగ్గాక తినిపించే పండ్లలో ముఖ్యమైన పండు ఏమిటో తెలుసా? ఆలుబుఖారా! అందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మంచి రోగ నిరోధక శక్తి సమకూరుతుంది. కేవలం చిన్నారుల్లోనే కాదు.. ఇది అందరిలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చూస్తే అందంగా ఉండి... తింటే ఆరోగ్యంగా ఉంచే ఈ పండుతో ఒనగూరే లాభాలెన్నో. వాటిలో ఇవి కొన్ని. ♦ ఆలు–బుఖారా పండు కండరాలు పట్టేయకుండా చూస్తుంది. తరచూ కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్), పిక్కలు పట్టేయడం వంటి సమస్యతో బాధపడేవారు ఆలు–బుఖారా పండ్లు తప్పక తినాలి. ♦ ఆలు–బుఖారా పండ్లలో పోటాషియమ్ ఎక్కువ. అందువల్ల ఇది మన రక్తపోటును క్రమబద్దీకరించి, నియంత్రణలో ఉంచుతుంది. ♦ ఇది రక్తనాళాల్లో కొవ్వులు పేరుకొనే అథెరోస్కి›్లరోసిస్ కండిషన్ను నివారిస్తుంది. ♦ ఈ పండులోని కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. ♦ పొటాషియమ్ ద్వారా హైబీపీని అదుపులో ఉంచడం, చెడు కొవ్వులు పెరగకుండా చూడటం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చూడటం వంటి అన్ని పనులూ చేస్తుంది. పైగా ఇందులోని విటమిన్ బి6 గుండెకు హానిచేసే హోమోసిస్టిన్ను అరికడుతుంది. ఈ కారణాలవల్ల ఇది గుండెకు చాలా మంచిది. పై అన్నింటి కారణంగా అది గుండెపోటు ముప్పునూ సమర్థంగా నివారిస్తుంది. ♦ ఆల్–బుఖారాలో ఐరన్ ఎక్కువ. ఇందులో విటమిన్–సి కూడా ఉండటం వల్ల ఆ ఐరస్ వెంటనే ఒంటికి పడుతుంది. అందుకే రక్తహీనత ఉన్నవారికి ఆలు–బుఖారా ఇస్తుంటారు. పైగా ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది. ♦ ఇది ఎముక సాంద్రతను పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ను అరికడుతుంది. అందుకే అందరూ దీన్ని తీసుకోవాలి. ఈ కారణంగా.. మరీ ముఖ్యంగా మెనోపాజ్ వచ్చిన మహిళలు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ♦ ఆలు–బుఖారాలో ఉండే సార్బిటాల్, ఐసాటిన్ పోషకాలు మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని పీచు (సాల్యుబుల్ ఫైబర్) కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ♦ ఎండు ఆలు–బుఖారాలో ఫోలిక్యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అందుకే గర్భిణులు దీన్ని తీసుకుంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. ♦ ఆలు–బుఖారా అనేక క్యాన్సర్లను అరికడుతుంది. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక క్యాన్సర్లు, రెస్పిరేటరీ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లు, నోటి ♦ క్యాన్సర్లను నివారిస్తుంది. దీనికి కారణం ఆ పండులో ఉన్న ఫ్రీ–రాడికల్స్ను అరికట్టే గుణమే. ఈ పండును ఎర్రగా, అందంగా కనిపించేలా చేసే ఎరుపు రంగు పిగ్మెంటే ఫ్రీ–రాడికిల్స్ను తుదముట్టిస్తుంటుంది. ♦ ఆల్–బుఖారా సహజ విరేచనకారి కావడం వల్ల మలబద్దకం సమస్యను మందులేమీ లేకుండానే నివారిస్తుంది. ♦ హృద్రోగాలు ఉన్నవారికి, డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది. ♦ అధిక బరువు తగ్గాలనుకునేవారు... బరువును పెరగకుండా చూసుకోవాలనుకునేవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ రెండు పనులనూ ఇది సమర్థంగా చేస్తుంది. ♦ వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపును దెబ్బతీసే ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ను నివారిస్తుంది. ఇందులో విటమిన్–ఏ పాళ్లు కూడా ఎక్కువే. దాంతో కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. ♦ విటమిన్ సి, విటమిన్ ఏ వల్ల ఇది మేని నిగారింపును మెరుగుపరచి, చర్మం మెరిసేలా చేస్తుంది. -
పిల్స్ని దూరంగా ఉంచే పిల్
పైనా‘పిల్’ను తినేవారు వేరుగా ఏ ‘పిల్’ తీసుకోనక్కర్లేదని కొందరు చమత్కరిస్తుంటారు. అందుకే దీన్ని ఆరోగ్యాల ఆవాస కేంద్రంగా పిలుస్తారు. ఇందులో విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే రోగనిరోధక శక్తి సమకూరుతుంది. పైనాపిల్తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. పైనాపిల్లో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. దాంతో ఇది జీర్ణవ్యవస్థకు చేసే మేలు ఇంతా అంతా కాదు. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నీళ్ల విరేచనాల్ని (డయేరియాను) అరికడుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ఇదొక స్వాభావిక చికిత్స. పైనాపిల్లోని ‘బ్రొమిలైన్’ అనే ఎంజైమ్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. అందుకే ఏవైనా గాయాలైనప్పుడు పైనాపిల్ను తినిపిస్తే.. నొప్పి, వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) వెంటనే తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. క్యాల్షియమ్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి పైనాపిల్ బాగా ఉపకరిస్తుంది. ఆర్థరైటిస్ వంటి అనేక జబ్బుల్లో వచ్చే నొప్పి, మంట వంటి లక్షణాలనూ ఇది సమర్థంగా అరికడుతుంది. ఇందులోని విటమిన్–సి ఒక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. దాంతో పాటు విటమిన్–ఏ, ఫ్లేవనాయిడ్స్ వంటివి అన్నీ కలిసి చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో విటమిన్–ఏ కూడా పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తీసుకునేవారిలో కంటి చూపు బాగుంటుంది. అంతేకాదు కంటికి సంబంధించిన అనేక వ్యాధులు కూడా నివారితమవుతాయి. ఇందులోని విటమిన్–సి, బ్రొమిలైన్ల సంయుక్త ప్రభావం వల్ల శ్వాసవ్యవస్థకు సంబంధించిన చాలా జబ్బుల నివారణ జరుగుతుంది. వాయునాళాల్లో మ్యూకస్ అతిగా పెరగడాన్ని అదుపు చేస్తుంది. కళ్లె/కఫాన్ని తగ్గిస్తుంది. ఆస్తమాను అరికడుతుంది. ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణం కూడా ఆస్తమాను అదుపు చేయడానికి తోడ్పడుతుంది. నాపిల్ పండు దీర్ఘకాలం యౌవనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. చర్మం ఏజింగ్ ప్రక్రియకు గురికాకుండా కాపాడుతుంది. ముడుతలను నివారిస్తుంది. చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు అవసరమైన కొలాజెన్ను సమకూర్చి, వయసు పెరిగినా చర్మాన్ని బిగువుగానే ఉండేలా చేస్తుంది. పైనాపిల్లో పొటాషియమ్ పుష్కలంగా ఉండటం వల్ల అధిక రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తనాళాలలో రక్తం సాఫీగా ప్రవహించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా కూడా హైబీపీ అనర్థాలను తగ్గిస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను సహజసిద్ధంగా తొలగిస్తుంది. -
తల్లిపాలకు ఏదీ సాటిరాదని తెలుసా?
పాపాయికి తల్లిపాలతోనే బతుకంతా మనుగడ. తల్లిపాలు పిల్లలకు కేవలం చిన్నప్పటి ఆహారం మాత్రమే కాదు. బతుకంతా వాళ్లలో ఎన్నో వ్యాధులు రాకుండా చేసే వ్యాధినిరోధక శక్తి కూడా అందులో ఉంది. తల్లిపాలలో ఉన్న సుగుణాల గురించి మీకెంత అవగాహన ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 1. తల్లి కాబోతున్న యువతిని పరామర్శించేటప్పుడు ఆమె ఆరోగ్యంతోపాటు పాపాయికి తల్లి పాలు ఎంత అవసరమో చెబుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. పాపాయి పెరుగుదలకు కావల్సిన పోషకాలు తల్లిపాలతోనే సాధ్యమని, పోతపాలతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తెలియచేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 3. బాలింతను కలిసినప్పుడు పాపాయికి సరిపడినన్ని పాల కోసం తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు చెబుతారు. ఎ. అవును బి. కాదు 4. పుట్టిన అరగంట లోపుగానే తల్లిపాలను తాగించాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 5. ఇది పాపాయి ఆకలిని తీర్చడమే కాదు, బిడ్డకు వ్యాధినిరోధక శక్తినిచ్చే గుణాలు తొలిపాలలోనే ఉంటాయి. ఎ. అవును బి. కాదు 6. పుట్టిన తరవాత వీలయినంత త్వరగా తల్లిపాలు పట్టాలి. అది పాపాయికి తల్లితో స్పర్శబంధం పెరగడానికి కూడా దోహదం చేస్తుంది. ఎ. అవును బి. కాదు 7. ఎంత ఖరీదైన బ్రాండెడ్ పాలపొడి అయినా, మరే ఇతర ఆహారమైనా తల్లిపాల స్థానాన్ని భర్తీ చేయలేదని నిపుణుల అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 8. మొదటి ఆరు నెలలు తల్లిపాలు తాగిన పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారనే డాక్టర్ల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు తల్లిపాల గొప్పదనం తెలుసు. మీకు తెలిసిన వాటిని ఇతరులకు చెప్పి వాళ్లు కూడా ఆ ప్రయోజనాన్ని పొందేలా ప్రోత్సహిస్తున్నట్లు అర్థం. ‘బి’లు ఎక్కువైతే అమృతతుల్యమైన తల్లిపాల అవసరాన్ని గుర్తించండి, ఆరోగ్యవంతమైన సమాజం కోసం సాగుతున్న ఈ ఉద్యమంలో మీరూ ఒకరు కావడానికి ప్రయత్నించండి. -
తాంబూలం గొప్పతనం ఏమిటి?
మన సంస్కృతిలో తాంబూలానికి (తమలపాకు)కు ఎంతో ప్రాధాన్యం ఉంది. దేవుళ్లకి తమలపాకులు తప్పకుండా అర్పిస్తాము. వివిధ శుభ కార్యాలు, నోములు, వ్రతాలు, జరిగినప్పుడు తాంబూలం ఇవ్వడం తప్పనిసరి . తమలపాకులను ఇలా ఇవ్వడం వలన శుభం చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తమలపాకు మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తుంది. ఎముకలకు మేలు చేసే ‘‘ఎ’’ , ‘‘సి’’ విటమిన్ లు, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తాంబూలంలో రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది. తమలపాకులో వుండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ∙షడ్రసోపేతమైన భోజనం చేశాక పచ్చ కర్పూరం, లవంగాలు, యాలకులు, సోంపు కలసిన తాంబూలం వేసుకుంటే, తిన్న ఆహారం తొందరగా వంటికి పడుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ∙పాము విషంతో సహా అనేకరకాలయిన విషాలను హరించగల ఔషధ గుణాలు తమలపాకుకి ఉన్నాయట. చిన్న పిల్లలకి జలుబు చేసినపుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి. తమలపాకుతో సున్నం కలిపి వేసుకొంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది. ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది. -
పేగు ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు
నా వయసు 32 ఏళ్లు. నేను కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. నా సమస్య హోమియో మందులతో పూర్తిగా నయం అవుతుందా?– శివకుమార్, నరసరావుపేట దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. పైల్స్: మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి వాపునకు గురై తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. రక్తస్రావం కూడా కనిపిస్తుంది. సమస్యలను పైల్స్ అంటారు. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, మహిళల్లో గర్భధారణ సమయంలో పడే ఒత్తిడి, కాలేయ సంబంధిత వ్యాధులు పైల్స్ను కలగజేసే అవకాశం ఉంది. ఫిషర్స్: మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. ఫిస్టులా: రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య ఒక గొట్టంలా ఏర్పడే నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే సాధారణంగా ఇది మలద్వారానికి ఒక పక్కగా ఏర్పడుతుంది. దీన్ని యానల్ ఫిస్టులా అంటారు. మొదట అక్కడి చర్మంపై చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపు కనిపిస్తాయి. రెండు మూడు రోజులలో అది పగిలి చీము స్రవిస్తుంది. దానివల్ల తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తూ ఇబ్బంది పెడతాయి. దీని తీవ్రతను బట్టి వారంలో లేదా నెలలో 1, 2 సార్లు తిరగబెడుతూ ఉండవచ్చు. కారణాలు : ఊబకాయం, గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేయడం, తీవ్రమైన మలబద్దకంతో బాధపడేవారిలో ఈ సమస్య ఏర్పడే అవకాశాలు ఎక్కువ. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ అలర్జీకి కారణాలనేకం మా పాప వయసు 12 సంవత్సరాలు. వాతావరణంలో మార్పులు కనిపించగానే ఆమెను తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. స్కూలుకు సరిగా వెళ్లలేకపోతోంది. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ప్రమోద్, ఏలూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ పాప అలర్జీ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనకు ఏదైనా వాతావరణంగానీ, ఆహారంగానీ సరిపడకపోతే వచ్చే సమస్యను అలర్జీ అని చెప్పవచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రతిస్పందించడంతో వేధించే సమస్యే అలర్జీ. ఈ సమస్య ఉన్నవారిలో తుమ్ములు, దగ్గు మాత్రమే కాకుండా ఒక్కోసారి శ్వాసతీసుకోవడం కష్టం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో వచ్చే జలుబు, దగ్గు సహజంగా ఒక్కోసారి వైరల్ జ్వరాలకు దారితీయవచ్చు. మన ఆధునిక జీవనం, పారిశ్రామిక ప్రాంతాలతో పాటు వాతావరణ కాలుష్యం కూడా అలర్జీకి కారణాలే. అలర్జీ కారణంగా వచ్చే బాధలు వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా అందరూ అలర్జీల బారిన పడుతున్నారు. అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. అలర్జీలతో బాధపడేవారిలో వారికి సరిపడని పదార్థాల సంపర్కంలోనికి వచ్చినప్పుడు వారి శరీరంలోని యాంటీబాడీస్ వల్ల హిస్టమిన్ అనే పదార్థం విడుదల అవుతుంది. దీనివల్లనే వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. శరీరతత్వం, వాతావరణం, వంశచరిత్ర, గాలి, నీరు, ఆహారం... వీటిలోని మార్పులు వంటి అనేక అంశాల వల్ల రక్తంలో కలిగే మార్పుల వల్ల కొందరిలో అలర్జీ కనిపిస్తుంది. అలర్జీకి కారణాలు: దుమ్ము ∙పుప్పొడి రేణువులు ∙పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకలు ∙ఘాటువాసనలు ∙చల్లటిగాలి ∙శీతలపానియాలు, ఐస్క్రీమ్స్ ∙మస్కిటో రిపల్లెంట్స్ ∙వాతావరణ మార్పులు ∙వంశపారంపర్యంగా రావచ్చు. లక్షణాలు: ∙తుమ్ములు ∙ఉబ్బసం, ఆయాసం శ్వాసలో ఇబ్బందులు ∙వాంతులు ∙ముక్కుకారడం ∙ఒంటిపై ఎర్రని దద్దుర్లు ∙కళ్లలో దురద, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు ఉండటం చికిత్స: హోమియోలో అలర్జీ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు ఉన్నాయి. చికిత్సతో అన్ని రకాల అలర్జిక్ సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెంచి, పూర్తిగా వ్యాధిని నయం చేయడం హోమియో ప్రక్రియలో సాధ్యమవుతుంది. ఈ సమస్యకు ఆర్సినిక్ ఆల్బ్, రస్టాక్స్, బెల్లడోన, అలియమ్ సెపా వంటి మందులు ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే అలర్జీ పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ వెన్ను నొప్పి తగ్గుతుందా? నా వయసు 37 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?– సువర్ణకుమార్, భీమవరం స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు. ∙స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు. ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు సర్వైకల్ స్పాండిలోసిస్ : ∙మెడనొప్పి, తలనొప్పి తల అటు –ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్ నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. హోమియో చికిత్స: హోమియో ప్రక్రియలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారం ఉంది. రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
హ్యాపీ స్లీప్ !
నిద్రలేమితనం అనేది కొంతమందిలో స్వల్పకాల సమస్య అయితే ఎక్కువ మందిలో ఇది దీర్ఘకాల సమస్యగా మారింది. ఇది ఎక్కువగా వయసు పైబడిన వారిలో, అదీ కూడా పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంది. నిద్రపోయే సమయం తగ్గిపోవడం లేదా మంచి నిద్ర పట్టకపోవడం రెండూ నిద్రలేమితనాన్ని సూచిస్తాయి. యాంగై్జటీ, డిప్రెషన్ దీనికి ముఖ్య కారణాలు కాగా దీని వలన ఇతర సమస్యలైన స్థూలకాయం (ఒబెసిటీ), ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి కూడా దారి తీయవచ్చు. క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్య (జిఇఆర్డి), ఆస్తమా, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఉండటం వలన కూడా ఈ సమస్యకు కారణాలు కావచ్చు. స్త్రీలలో పీరియడ్స్ సమయంలో లేదా మెనోపాజ్ దశలో కూడా ఈ సమస్య రావచ్చు. మానసిక ఒత్తిడి, రుగ్మతలు ఉన్నట్లయితే ఇక వేరే చెప్పనవసరం లేదు. స్టెరాయిడ్స్, స్టాటిన్స్, ఆల్ఫా బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ ఎక్కువగా వాడడం వలన కూడా ఈ సమస్య రావచ్చు.దీనిని నివారించడానికి జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం, పగటిపూట నిద్రపోకుండా ఉండడం కూడా అవసరం. యోగాసనాలలో పాదహస్తాసన, బాలాసన, విపరీత కర్ణి (గోడమీదకు కాళ్లు రెండూ ఉంచి), అడ్రినల్ గ్రంథుల మీద పనిచేసే అర్ధమశ్చీంద్రాసన, వక్రాసన, మరీచి ఆసన, భరద్వాజాసన, పారా సింపతిటిక్ నాడీ వ్యవస్థ మీద పనిచేసే చంద్ర భేది ప్రాణాయం, సర్వాంగాసన, శవాసనతో పాటు చక్కటి ధ్యానమార్గాన్ని ఆవలంబిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. 1. పాదహస్తాసన సమస్థితిలో నిలబడి కాళ్ళ మధ్య సుఖపూర్వకమైన దూరం ఉంచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందు నుంచి కాని లేదా పక్కల నుంచి కాని పైకి తీసుకు వెళ్ళి కొంచెం స్ట్రెచ్ చేసి, శ్వాస వదులుతూ నడుమును వెనుకకు నెడుతూ మోకాళ్లు వంచి తల చేతులను కలిపి ముందుకు వంగాలి. చేతులు రెండూ ముందుకు ఫ్రీగా వేలాడేసి మోకాళ్ళను స్ట్రెయిట్గా ఉంచే ప్రయత్నం చేయాలి. మోకాళ్లు ముందుకు వంచడం వలన నడుం నొప్పి ఉన్నవాళ్ళు కూడా చేయవచ్చు. ఎందుకంటే మోకాళ్ళు స్ట్రెయిట్గా ఉంచితే నడుం నొప్పి ఉన్నవాళ్ళకి ఔ1, ఔ5 మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అందువలన మోకాలు వంచితే సయాటికా సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ చేతులు ముందు నుండి పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ చేతులను నడుం పక్కకు తీసుకురావాలి. 2. వక్రాసన సుఖాసనంలో కూర్చుని రెండు కాళ్లు ముందుకు రిలాక్స్ చేసి కుడికాలును ముందుకు స్ట్రెచ్ చేసి ఎడమకాలును పైకి నిలబెట్టి శ్వాస తీసుకుంటూ ఎడమ వైపుకు తిరుగుతూ కుడిచేత్తో ఎడమకాలు బయట వైపు నండి ఎడమపాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఎడమచేయి వెనుక నేలమీద సపోర్ట్గా ఉంచి కుడిచేత్తో ఎడమకాలును లోపలకు నెడుతూ ఎడమ భుజం మీదగా వెనుకకు చూసే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 శ్వాసల తరువాత, శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. ఇవే విధంగా రెండవ వైపు కూడా చేయాలి. గమనిక: నడుము దగ్గర ట్విస్ట్ చేస్తూ వెనుకకు చూడాలి. కుర్చీలో కూర్చుని కూడా ఇదే ఆసనాన్ని చేయవచ్చు. కుర్చీ హ్యాండిల్ సహాయం తీసుకుంటే వెనుకకు పూర్తిగా తిరిగి చూడగల్గుతారు. 3. హలాసన ఆసనంలో వెల్లకిలా పడుకుని మోకాళ్ళు రెండూ పైకి ఉంచి ఫొటోలో చూపిన విధంగా రిలాక్స్ అవుతూ కాళ్ళు రెండూ పైకి తీసుకువెడుతూ వెనుకకు శ్వాస వదులుతూ మళ్ళీ ముందుకు 3 లేదా 5 సార్లు రోల్ అయిన తరువాత అదే ఊపులో కాళ్లు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి 3బి ఫొటోలో చూపిన విధంగా కాళ్ళను వెనుకకు స్ట్రెచ్ చేసి ఉంచాలి. 5 నుండి 10 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ మళ్ళీ ముందుకు రావాలి. 4. సర్వాంగాసన హలాసనం తరువాత అదే వరుస క్రమంలో చేసేది సర్వాంగాసనం. హలాసనంలో నుండి కాళ్లు వెనుకకు తీసుకువస్తూ రెండు కాళ్ళను పైకి నిటారుగా నడుముకి రెండువైపుల చేతుల సపోర్ట్ ఉంచి ఫొటోలో చూపిన విధంగా పైకి తీసుకువెళ్లాలి. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కాళ్లను నెమ్మదిగా హలాసనంలోకి తీసుకువెళ్లవచ్చు. లేదా ముందు నుండి నెమ్మదిగా నేలమీదకు తీసుకురావచ్చు. ఒక్కసారిగా కాళ్లు రెండూ కిందకు పడేయరాదు. అలా చేస్తే వెన్నెముక దెబ్బతింటుంది. గమనిక: సర్వైకల్ సమస్య ఉన్నవాళ్ళు గోడమీదకి కాళ్లు ఉంచి తలక్రింద మెత్తటి దిండు వేసుకుని చేయడం మంచిది. 5. విపరీతకర్ణి గోడకు వ్యతిరేకంగా పడుకుని, గోడను ఆధారంగా చేసుకుని కాళ్లు రెండూ పైకి లేపి గోడ మీద ఉంచి, సీటుభాగాన్ని గోడకు దగ్గరగా నెడుతూ రిలాక్స్డ్గా ఎంతసేపైనా ఉండవచ్చు. చక్కగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండటం వల్ల గుండెకి రక్తసరఫరా పెరుగుతుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ – సమన్వయం: ఎస్. సత్యబాబు మోడల్: ఈషా హిందోచా -
ఇనుములాంటి ఒంటి కోసం మినుములు
మినుములు తింటే ఇనుమంత బలం అన్నది మన వాడుక. దీనిలోని పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయి కాబట్టి... వ్యాధి కారకాలకు మన ఒళ్లు ఇనుములాగే తోస్తుంది. దాంతో ఎన్నో రకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. వంద గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు (ఫైబర్) ఉంటుంది. ఒక గ్రాము పొటాషియమ్, రెండు గ్రాముల కొవ్వులతో పాటు విటమిన్ సి, విటమిన్ బి–కాంప్లెక్స్లోని బి1, బి3 వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఎక్కువే. మినుములతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని... ► మినుముల్లో ప్రోటీన్ పాళ్లు ఎక్కువ. ప్రోటీన్లు కండరాల రిపేర్లకు ఉపయోగపడతాయి. పైగా మినుముల్లో వాపు, మంటను తగ్గించే యాంటీ–ఇన్ఫ్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలైన వారికి అవి త్వరగా తగ్గడానికి మినుములు మంచి ఆహారం. ► ఇక మినుముల్లో దాదాపు 72 శాతం పీచు ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేగాక మలబద్దకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను స్వాభావికంగానే తొలగిస్తాయి. అంతేకాదు... జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుముతో చేసిన వంటకాలను వాడవచ్చునని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ► గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణం. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. ► కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలిగించే గుణం కూడా మినుములకు ఉంది. ► స్వాభావికమైన పీచు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస ఉన్నవారికి మినుములు మంచి ఆహారం. -
ఆరోగ్యానికి మోదం... బాదం!
గుడ్ ఫుడ్ గుప్పెడు బాదం పలుకులు రోజూ తినేవారికి రోగనిరోధక శక్తి పెరిగి అంత తేలిగ్గా అనారోగ్యాలు దరిచేరవన్న సంగతి అందరికీ తెలిసిందే. బాదంతో ఒనగూరే మరికొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.బాదం గింజలు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులు నట్స్ అన్నింటిలోనూ బాదంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. బాదంలోని ఎల్–కార్నిటిన్ అనే పోషకం మెదడు పనితీరును చురుగ్గా చేస్తుంది. అందుకే మంచి జ్ఞాపకశక్తి కోసం, భవిష్యత్తులో అలై్జమర్స్ డిసీజ్ నివారణ కోసం బాదం బాగా ఉపయోగపడుతుంది. ∙బాదం తీసుకునే వారు అంత తేలిగ్గా బరువు పెరగరు. అందుకే ఊబకాయం నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయి. నిగారించే చర్మం కోసం, నల్లటి మెరుపుతో కూడిన కురుల కోసం బాదంలోని పోషకాలు తోడ్పడతాయి. బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బాదం పలుకులు తీసుకునే వారి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులకు దోహదపడే ‘సీ–రియాక్టివ్ ప్రోటీన్’ అనే పదార్థాన్ని బాదం తగ్గిస్తుంది. తద్వారా ఇది అనేక గుండెజబ్బులను నివారిస్తుంది. -
ఇమ్యూనిటీని పెంచే చిలగడదుంప
గుడ్ ఫుడ్ ఉడకబెట్టుకొని తింటే అద్భుతంగానూ, నిప్పుల మీద కాల్చుకుని తింటే పరమాద్భుతంగానూ ఉండే చిలగడదుంప అంటే చాలామందికి ఇష్టమే. వేర్వేరు ప్రాంతాల్లో దీనికి గణుసుగడ్డ, మోరంగడ్డ అంటూ రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ దీని విశిష్టతలు ఎక్కువే. ►చిలగడదుంపలో విటమిన్–బి6 పాళ్లు పుష్కలం. విటమిన్–బి6 అనేది హోమోసిస్టిన్ అనే రసాయనం దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెజబ్బులు వచ్చేందుకు ఈ హోమోసిస్టిన్ కారణమవుతుంది. అంటే చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవుతాయని నిర్ద్వంద్వంగా తేలింది. ►చిలగడదుంపలో బీటా–కెరొటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. ►చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుందన్నమాట. చిలగడదుంపలోనూ విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు. ►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం ఉంది. ఒత్తిడి వల్ల ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప తొలగిస్తుంది. ►చిలగడదుంపలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గడంతో పాటు, తగినన్ని ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పాదన జరుగుతుంది. ►ఇందులోని మెగ్నీషియమ్ మన ఒంట్లోని ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. -
ముఖానికి మజ్జిగ పట్టుంచండి!
ఆనందం మజ్జిగ తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మజ్జిగ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. అయితే మజ్జిగ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. మజ్జిగను కురులకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మజ్జిగను చర్మానికి రాసుకుని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గడంతోపాటు చర్మం కూడా మృదువుగా మెరిసిపోతుంది. ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి. -
మజ్జిగ... మన ప్రోబయాటిక్ మందు!
గుడ్ఫుడ్ మన జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో–బయోటిక్’ అని వ్యవహరిస్తుంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే ప్రో–బయాటిక్స్ను తీసుకునే ఆహార అలవాట్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఉదాహరణకు ఇడ్లీ, దోసె పిండిని రాత్రి కలుపుకుంటాం. ఆ మర్నాడు చేసుకుంటాం. వేసవిలో చాలా మంది మజ్జిగ విరివిగా వాడతారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భోజనం తర్వాత పెరుగు/మజ్జిగ వాడే అలవాటు ఎప్పటి నుంచో ఉన్న విషయం మనకు తెలిసిందే. మజ్జిగను తాగినప్పుడు మనకు మేలు చేసే అనేకానేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుంటామన్నమాట. అలా మనకు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని కడుపులోకి చేర్చుకుంటాం. -
క్యారట్... హెల్దీ రూట్!
గుడ్ఫుడ్ కంటి చూపు బాగుండటానికి క్యారట్ ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. దానిలో ఉండే విటమిన్–ఏ వల్ల మనకు ఈ ప్రయోజనం కలుగుతుంది. అలాగే క్యారట్ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించి గుండెజబ్బులను నివారిస్తుంది. మేని రంగులో నిగారింపు తెస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థాల కారణంగా అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. మాక్యులార్ డీజనరేషన్ అనే కంటి వ్యాధిని నివారించగల శక్తి క్యారట్కు ఉంది. క్యారట్ తినడం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరి చిగుర్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. రక్తంలో చక్కెరపాళ్లను సైతం క్యారట్ నియంత్రిస్తుంది. -
నాలో ఏదో భయం...
సందేహం నాకు పెళ్లై నాలుగేళ్లు అవుతుంది. రెండేళ్ల పాప కూడా ఉంది. ఇటీవల సమస్యగా ఉండి డాక్టర్ దగ్గరకు వెళ్లాను. నాకు హెర్పిస్ సింప్లెక్స్-2 వచ్చిందని డాక్టర్ అన్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నాలో ఏదో తెలియని భయం మొదలైంది. భవిష్యత్లో ఇది నా పాపకు కూడా వస్తుందేమోనని కంగారుగా ఉంది. అలా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఓ సోదరి హెర్పిస్ సింప్లెక్స్-2 అనేది హెర్పిస్ అనే వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా కలయిక ద్వారా ఆడవారి నుంచి మగవారికి, మగవారి నుంచి ఆడవారికి సంక్రమిస్తుంది. దీనివల్ల జననేంద్రియాల వద్ద చిన్నచిన్న నీటిపొక్కులు రావటం, నొప్పి, మంట, దురద ఏర్పడతాయి. మీ నుంచి ఇది పాపకు ఏ మాత్రం సంక్రమించడం జరగదు. కాబట్టి మీరు అసలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు, మీ వారు ఇద్దరూ కలిసి హెర్పిస్ వైరస్కు చికిత్స తీసుకోవడం మంచిది. ఒక్కరే చికిత్స తీసుకున్నా, మళ్లీ కలయిక ద్వారా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స సమయంలో ఇద్దరూ దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా, రక్తహీనత ఉన్నా, ఈ ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మా అక్కకు నెల రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పాప పుట్టింది. నార్మల్ డెలివరీ కావాలని మా అమ్మ తనను ఐదో నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వాళ్లు నార్మలే అయ్యేలా చూస్తామని చెప్పారు. కానీ ప్రైవేట్ ఆస్పత్రి వాళ్లేమో సిజేరియనే అవుతుందని చెప్పారు. అయితే తొమ్మిదో నెల పడిన రెండు రోజులకే అక్కకు నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప తిరగలేదు, అందుకే సిజేరియన్ అయిందని చెప్పారు డాక్టర్లు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళితే నార్మల్ అయ్యేదా? అసలు పిల్లలు తిరగకపోవడానికి కారణం ఏంటి? తిరగడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తారా? లేదా? - సుష్మ, వరంగల్ కాన్పు నార్మల్గా అవుతుందా, ఆపరేషన్ ద్వారా అవుతుందా అని ఐదో నెలలోనే చెప్పడం కష్టం. కాన్పు సమయానికి బిడ్డ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. అంటే తల కిందకు దిగడం, బిడ్డ బరువుకు తగ్గట్లు.. బిడ్డ బయటకు వచ్చే దారి సరిపడా ఉండటం, తల్లి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం వంటి అంశాలను బట్టి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పే వారు.. బిడ్డ బయటకు వచ్చే వరకు కచ్చితంగా నూటికి నూరుశాతం నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పలేరు. నొప్పులు తీసే క్రమంలో గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు రావటం, బిడ్డ గర్భంలోనే మోషన్ పోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో నార్మల్ డెలివరీ కోసం ఎక్కువగా వేచి చూడటం వల్ల, బిడ్డ పుట్టగానే ఏడవకపోవడం, తర్వాత కాలంలో ఫిట్స్ రావడం, బిడ్డ చనిపోయి పుట్టడం, ఒకవేళ అప్పుడు బాగానే ఉన్నా తర్వాత ఎదుగుదలలో లోపాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. కాన్పు సమయానికినొప్పులు వచ్చినా, బిడ్డ తిరగకపోతే... ప్రభుత్వ హాస్పిటళ్లలో మాత్రం ఏమి చేయగలరు. నా వయసు 26. ఏడాది క్రితం డెలివరీ టైమ్లో పాప బయటికి రాగానే చనిపోయింది. దానికి కారణం నాకు డెలివరీ టైమ్లో హైబీపీ ఉండటం అన్నారు డాక్టర్లు. తర్వాత రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నాలుగో నెలలో అబార్షన్ అయింది. మళ్లీ కొన్ని నెలలకు మూడోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు రెండో నెలలో అబార్షన్ అయింది. అప్పటి నుంచి నేను, మావారు బాధపడని రోజు లేదు. దయచేసి మరోసారి అలా జరగకుండా, గర్భం నిలవాలంటే మేమేం చేయాలి? - హేమలత, నల్లగొండ వివిధ కారణాల వల్ల పిల్లలు పుట్టి చనిపోవడం, అబార్షన్ అవ్వడం వంటి వాటిని ఆ్చఛీ ౌఛట్ట్ఛ్టటజీఛి జిజీటౌ్టటడ (ఆైఏ) అంటారు. ఇవి ఒక్కొక్కరిలో వేరువేరు కారణాల వల్ల అవవచ్చు. కాన్పు సమయంలో హైబీపీ వల్ల, నొప్పుల ఒత్తిడి వల్ల బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం, ఊపిరి ఆడకపోవడం వంటి అనేక కారణాల వల్ల పుట్టిన వెంటనే చనిపోయి ఉండవచ్చు. తర్వాత ఒక సంవత్సరం వ్యవధిలోనే రెండుసార్లు అబార్షన్లు అయ్యాయి కాబట్టి సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి డాక్టర్ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. అప్పుడు రిపోర్ట్లో వచ్చిన కారణాన్ని బట్టి చికిత్స తీసుకొని కొన్ని నెలలు ఆగి, మళ్లీ గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. థైరాయిడ్ సమస్య, తల్లి రక్తంలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవ్వడం వల్ల అబార్షన్లు, బిడ్డకు రక్త సరఫరా లేకపోవడం, రక్తం సరిగా గూడుకట్టే గుణం లేకపోవడం, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ (అ్క), షుగర్ వ్యాధి, పిండంలో జన్యుపరమైన సమస్యలు వంటి అనేక రకాల సమస్యల వల్ల పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ మాత్రలు వాడటం, హార్మోన్ల సమస్యకు హార్మోన్ల ట్యాబ్లెట్స్ వాడటం, అ్క ఉంటే ఉఛిౌటఞజీటజీ, ఏ్ఛఞ్చటజీ వంటి వాటితో చికిత్స తీసుకుంటూ పండంటి బిడ్డని కనవచ్చు. కాబట్టి మీరు అధైర్య పడకుండా డాక్టర్ను సంప్రదించి ముందు నుంచే రోజుకొకటి చొప్పున ఫోలిక్ యాసిడ్ మాత్ర వేసుకోవడం మంచిది. అలాగే మనసును బాధగా కాకుండా ఆహ్లాదంగా ఉంచుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
కేన్సర్ చికిత్సలో మరో ముందడుగు
కేన్సర్ చికిత్సను మరింత ప్రభావవంతం చేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, మూర్స్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు మరో కీలకమైన ఆవిష్కరణ చేశారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గించే ఓ యంత్రాంగాన్ని కనుగొన్నారు. రోగ నిరోధక వ్యవస్థ ద్వారా కేన్సర్కు చికిత్స అందించే ప్రక్రియలకు ఈ పరిశోధన మరింత ఊతమివ్వనుంది. శరీరంలోకి హానికర సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు తెల్లరక్త కణాలు రంగంలోకి దిగి కొన్ని రకాల ప్రొటీన్లను విడుదల చేస్తాయి. వీటి ద్వారా చైతన్యవంతమైన రోగ నిరోధక కణాలు సూక్ష్మజీవులపై దాడి మొదలుపెడతాయి. ముప్పు తొలగిందనుకున్నప్పుడు తెల్లరక్త కణాలు మరో రకమైన ప్రొటీన్లతో రోగనిరోధక కణాలు నెమ్మదించేలా చేసి కణజాలాన్ని మరమ్మతు చేయడం మొదలుపెడతాయి. అయితే కేన్సర్ వంటి వ్యాధుల్లో ఈ ప్రక్రియ సక్రమంగా నడవదు. తెల్లరక్త కణాలు చాలా ఎక్కువ స్థాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్లను విడుదల చేస్తుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి మందగించేలా చేయడంతో కణజాలాల మరమ్మతు ప్రక్రియ జరగదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ద్వారా తెల్లరక్త కణాలలో ఉండే ఓ ఎంజైమ్.. రోగ నిరోధక శక్తి మందగించేలా చేస్తుందని స్పష్టమైంది. ఎలుకల్లో ఈ ఎంజైములను చైతన్యవంతం చేసినప్పుడు కేన్సర్ కణితుల పెరుగుదలను సమర్థంగా అడ్డుకోగలిగాయని పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎజ్రా కోహెన్ తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
అమ్మపాలు అమృతంతో సమానం
దుబ్బాక: అమ్మ పాలు అమృతంతో సమానమని, బిడ్డలకు అమ్మ పాలే శ్రేష్ఠమని ఎంపీపీ ర్యాకం పద్మ అన్నారు. బుధవారం మండలంలోని చిట్టాపూర్, పోతారం, హబ్షీపూర్, తిమ్మాపూర్, బల్వంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లి పాల విశిష్టతపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లి పాలను పారబోయకుండా బిడ్డకు పట్టించాలని సూచించారు. తల్లి పాలల్లో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుందని, మూఢ నమ్మకాలతో ముర్రుపాలను వృథా చేస్తున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింత మరణాలు తగ్గించడానికి అంగన్వాడీ, ఆశా వర్కర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్లు పోతనక రాజయ్య, ఇప్పలపల్లి నాగమణి, అబ్బుల లావణ్య, కొంగరి కనకవ్వ, చెర్లపల్లి బాలమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హేమలత, యాస్మిన్ భాషా బేగం, అంగన్వాడీలు కవిత, జ్యోతి, జయ, మంజుల, బాల్లక్ష్మి, మంజుల, తార, పుష్పలత, శైలజ, రాజమణి, కవిత ఏఎన్ఎంలు మంజులు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.