Naga Babu
-
నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి : నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు.గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదు. అందుకే ఇక్కడ అన్నింటిని పక్కన పెట్టి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నాను.బీసీ, ఎస్సీ,ఎస్టీలు,అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు. జనసేన బలమైన పార్టీగా ఎదిగేదాకా నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టం. నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదు. నాతో సమానంగా పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఇచ్చే వాళ్లం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు.నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే కేబినెట్ పదవి ఇచ్చే వాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వంగా చూడలేం. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబు కేబినెట్లోకి వస్తారు. వచ్చే ఏడాది మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు’ అని వ్యాఖ్యానించారు. -
కూటమి చక్రం.. బాబు చేయిజారుతోందా?
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీనపడుతున్నారా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోనూ బాబు స్థానాన్ని క్రమేపీ కుమారుడు లోకేష్ ఆక్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బాబును ఇరకాటంలో పెడుతున్నాయి.రాజ్యసభకు పార్టీ ఎంపికలు, పవన్ అన్న నాగబాబుకు మంత్రి పదవి వంటి నిర్ణయాలు ఆ ఇబ్బందికి నిదర్శనమంటున్నారు. టీడీపీకి రాజ్యసభలో అసలు బలం లేని నేపథ్యంలో ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన బాబు ఆ స్థానాలకు ఇతర పార్టీల వారికి కట్టబెట్టడం ఆయన పరిస్థితిని సూచిస్తోంది. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ తాను వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే.. అన్న నాగబాబుకు ముందు టీటీడీ ఛైర్మన్ పదవి ఆ తరువాత రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారని పలు వదంతులు వచ్చాయి. అయితే, లోకేష్ ఒత్తిడితో టీటీడీ ఛైర్మన్ పదవి కాస్తా టీవీ-5 ఛైర్మన్ బీఆర్.నాయుడికి దక్కిందని, రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ లోకేష్ తన మాట నెగ్గించుకున్నారని సమాచారం.ఇక, నాగబాబుకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి రహస్యమేమీ కాదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి ఆయన తన ఆసక్తిని పలు రూపాల్లో వ్యక్తం చేశారు కూడా. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత కూడా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రచారంలోనే ఉన్నారు ఆయన. సినిమాల్లో బాగా నష్టపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నను ఆదుకున్నట్లు చెబుతారు. కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు నాగబాబు ‘‘తాము పిలిచినా రాకపోతే ఏం చేయాలి’’ అని పవన్ను ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించినా.. తరువాతి కాలంలో ఆయనతోనే రాజకీయ పయనం సాగించడం గమనార్హం. ఇందులో భాగంగా 2019లో నరసాపురం నుంచి లోక్సభకు జనసేన తరఫున పోటీ చేసినా వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు ఆయన. తరువాతి కాలంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో నాగబాబు కూడా ఆయన వెంట నడిచారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేస్తారని టాక్ వచ్చినా.. పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని బీజేపికి వదులుకోవాల్సి వచ్చింది.ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంతోనే టీటీడీ ఛైర్మన్ ఆయనకు ఇప్పించేందుకు పవన్ ప్రయత్నించినా లోకేష్ ప్రాభవం ముందు నిలవలేకపోయారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ తన కుటుంబ సభ్యులకు పదవి అడగలేదని పవన్ చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ తరువాత రాజ్యసభ సీటైనా నాగబాబుకు ఇప్పించాలని పవన్ నానా ప్రయత్నాలూ చేశారు. బీజేపీ ఈ స్థానాన్ని ఆశించకపోతే అన్నకు దక్కుతుందన్న అంచనాతో ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మంతనాల వెనుక బాబు ఉండి ఉండవచ్చు. అయితే, బీజేపీ అనూహ్యంగా ఏపీ నుంచి ఒక సీటు ఆశించడంతో నాగబాబుకు మళ్లీ ఆశాభంగమైంది. మూడు రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీ ఒకటే తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంచనాతో నాగబాబును సీటు వదులుకోమని చంద్రబాబే నచ్చజెప్పి ఉండాలి. అదే సమయంలో పవన్ అసంతృప్తికి గురి కాకుండా మంత్రి పదవి ఆఫర్ చేసి ఉండవచ్చు.అయితే, దీనిపై టీడీపీ, జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఏర్పడింది. జనసేన కోసం పనిచేస్తున్న పలువురు నేతలను కాదని, సోదరుడి పదవి కోసం పవన్ పట్టు పట్టారన్న విషయం విమర్శలకు దారి తీసింది. జనసేన కూడా కుటుంబ పార్టీయేనని తేలిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ జనసేన నుంచి నలుగురు మంత్రులు ఉంటే ముగ్గురు కాపు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పదవులు వద్దంటూనే పవన్, నాగబాబులు వాటి కోసం పాకులాడారని భావిస్తున్నారు. పవన్కు ఆర్థికంగా అండదండలు అందించిన లింగమనేని రమేష్కు రాజ్యసభ స్థానం దక్కుతుందని కథనాలు వచ్చినా, పవన్, చంద్రబాబులిద్దరూ ఇప్పటికైతే మొగ్గు చూపలేదు.మరోవైపు.. టీడీపీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ తదితరులు రాజ్యసభ స్థానం ఆశించి భంగపడ్డారు. మంత్రిపదవి కూడా దక్కని నేపథ్యంలో యనమల చిరకాల వాంఛ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెను ఎక్కడంలో యనమలది కీలక భూమిక అన్నది తెలిసిందే. గతంలో స్పీకర్గా ఉండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం సులువైన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కంభంపాటి రామ్మోహన్ రావు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేస్తూ చంద్రబాబుకు ఉపయోగపడుతుంటారు. గతంలో ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండేవారు. మళ్లీ అదే పదవి అయినా ఇస్తారో, లేదో చూడాలి.2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఇచ్చినట్లే ఇచ్చి, చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకు కేటాయించారు. ఈసారి రామయ్య పేరును పరిశీలనకు తీసుకోలేదు. గల్లా జయదేవ్ కూడా ఆశించినా అవకాశం ఇవ్వలేదు. మరో నేత అశోక్ గజపతిరాజు ప్రస్తావన వచ్చినా, ఈ పోటీలో ఆయన వెనుకబడిపోయారు. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, లోకేష్కు సన్నిహితుడైన సానా సతీష్కు చెరో సీటు లభించింది. సానా సతీష్ కాకినాడ నుంచి జనసేన తరఫున లేదంటే టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ పదవి పొందారు. ఈయన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరపడంలో పేరు గాంచడంతోపాటు ఆర్థికంగా బలవంతుడు అవడం, అన్నిటికి మించి లోకేష్ అండదండలతో పదవి పొందారని అనుకోవాలి. బీదా మస్తాన్ రావు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే. నెల్లూరు జిల్లాలో రొయ్యల సీడ్ ప్లాంట్లు తదితర వ్యాపారాలు ఉన్నాయి.2019 ఎన్నికలలో టీడీపీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత వైఎస్సార్సీపీలో రాజ్యసభ సీటు సంపాదించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ అదే స్థానాన్ని టీడీపీ నుంచి పొందడం విశేషం. ఈయన సోదరుడు రవిచంద్ర కూడా లోకేష్ కు సన్నిహితుడుగా చెబుతారు. టీడీపీలో కాకలు తీరిన నేతలను కాదని, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఈయనకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తికి తావిచ్చారని చెప్పాలి. మరో సీటును బీజేపీకి కేటాయించారు. ఈ సీటు కూడా మొన్నటి వరకు వైఎస్సార్సీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారు. బీజేపీకి వేరే నేతలు ఎవరూ లేనట్లు తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు మళ్లీ ఇదే సీటు ఇవ్వడంపై ఆ పార్టీలోనే అసమ్మతి ఉంది.గతంలో ప్రధాని మోడీని అసలు బీసీ నాయకుడే కాదని, పలు విమర్శలు చేసిన కృష్ణయ్యకు ఈ పదవి ఇవ్వడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణయ్య తనకు సీటు ఇచ్చిన రోజునే బీజేపీలో చేరడం కొసమెరుపుగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలని ఇలా చేసి ఉండవచ్చని అంటున్నా, టీబీజేపీ నేతలు ఈయనపట్ల పెద్దగా ఆసక్తిగా లేరు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈయనకు విశేష ప్రాధాన్యం ఇచ్చి పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇస్తే ఇప్పుడు ఇలా చేశారు. రాజ్యసభ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులను టీడీపీ ఆకర్షించింది. వారిలో ఇద్దరు మళ్లీ టికెట్లు పొందితే, మరో నేత మోపిదేవి వెంకట రమణకు దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో చూడాలి. ఈ ఎంపికలకు సంబంధించి మరో విశేషం చెప్పుకోవాలి.చంద్రబాబుకు తానే ప్రధాన సలహాదారుడనని, టీడీపీ ప్రభుత్వం తనవల్లే నడుస్తోందని భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీవీ-5 యజమాని బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడాన్ని రాధాకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారట. అయినా లోకేష్ పట్టుబట్టి ఈ పదవి ఇప్పించడం ద్వారా రాధాకృష్ణకు ఝలక్ ఇచ్చారన్న విశ్లేషణలు వచ్చాయి. ఆ వార్తకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక తీరు కూడా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో అక్టోబర్లోనే సానా సతీష్కు వ్యతిరేకంగా రాధాకృష్ణ పెద్ద కథనం రాయించారు. అందులో సతీష్పై పలు ఆరోపణలు చేశారు. కాకపోతే సానా అన్న పదం బదులు చానా అని రాసి పరోక్షంగా రాసి హెడ్డింగ్ కూడా చానా ముదురు అని ఇస్తూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. లోకేష్ పేరుతో దందాలు చేస్తున్నారని, ఉత్తరాంధ్రలో మైనింగ్ తదితర రంగాలలో అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని, సీబీఐలో సైతం చిచ్చు పెట్టిన వ్యక్తి, అనేక స్కామ్లతో సంబంధం ఉన్నవాడని ఆంధ్రజ్యోతి రాసింది. అయినా లోకేష్ దానిని లెక్క చేయలేదు. తండ్రిపై ఒత్తిడి తెచ్చి సతీష్కే రాజ్యసభ పదవి ఇప్పించారు. రాధాకృష్ణను లోకేష్ నమ్ముతుండకపోవచ్చు. లేదా తన తండ్రి మాదిరి రాధాకృష్ణ బ్లాక్ మెయిలింగ్కు తాను లొంగనన్న సంకేతం ఇచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.అంతేకాక, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీని మోయడం తప్ప గత్యంతరం లేదని, అందువల్ల ఆయన మాటకు అంత విలువ ఇవ్వనవసరం లేదని భావించి ఉండవచ్చని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రతిసారీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో డబ్బు, సిఫారసులు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినా, నాటకీయత కోసమైనా టీడీపీ కోసం పని చేసేవారు ఒకరిద్దరికైనా ఈ పదవులు దక్కుతుండేవి. కానీ, ఈసారి అసలు పార్టీతో సంబంధం లేని ముగ్గురు ఈ పదవులు దక్కించుకున్నారు. తద్వారా టీడీపీపై కార్యకర్తలలో అపనమ్మకం ఏర్పడడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు చేతిలో నిర్ణయాధికారం పెద్దగా లేదన్న భావన కూడా ఏర్పడుతోంది.ఈ ఎంపికలపై వ్యతిరేకత ఉన్నా ఎల్లో మీడియా కూడా నోరు మూసుకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్లు కూటమి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంగా మారింది. తండ్రి, కొడుకులు చంద్రబాబు, లోకేష్, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులు మంత్రివర్గంలో ప్రముఖంగా ఉన్నారు. రెండు కుటుంబాల వారు ఇలా మంత్రివర్గంలో ఉండటం ఇదే ప్రథమం కావచ్చు. అటు కొడుకును కాదనలేక, ఇటు పవన్ కళ్యాణ్ను వదలుకోలేక, వారిద్దరి మధ్య అంతర్గత పెనుగులాటలో చంద్రబాబు బలహీనపడుతున్నారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సాయంత్రం అయితే కోటార్ వేసేవాడు టీటీడీ మెంబెర్...? శ్రావణ్ కుమార్
-
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్
ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు అంటే దాదాపు థ్రిల్లర్ కథలే ఉంటాయి. ఇప్పుడు అదే జానర్లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ 'పరువు'. రీసెంట్గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది కదా! అది ఈ సిరీస్ కోసమే. ఇప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?)హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'పరువు'. నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్గా చేసింది. సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!) -
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇక్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్) -
మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
మెగా బ్రదర్ నాగబాబుకు తొందర ఎక్కువ. ఏ చిన్న విషయానికైనా ఆవేశంతో ఊగిపోతుంటాడు. కోపం వస్తే ముందు వెనుక ఆలోచించకుండా మాటలు విసిరేస్తూ.. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం ఆయనకు అలవాటు అని సన్నిహితంగా చూసిన వారంతా చెబుతుంటారు. అయితే దేనికైన ఓ హద్దు ఉంటుంది. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు పొగడ్తలుతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. ఈ విషయం చిరంజీవికి బాగా తెలుసు. అందుకే అతనిపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోడు. అలా పట్టించుకునేవాడు అయితే ఆయన ఈ స్థాయికి ఎదిగేవాడే కాదు. కానీ నాగబాబు మాత్రం చిన్న చిన్న విమర్శలను సైతం తీసుకోలేడు. తొందరపడి ఘాటు వ్యాఖ్యలు చేసి..కాంట్రవర్సీని క్రియేట్ చేస్తాడు. ఇప్పటికే అనేకసార్లు ఆవేశంతో ఆయన చేసిన ట్వీట్లు..వివాదానికి దారి తీశాయి. ఇక తాజాగా ఆయన చేసిన పని మెగా కాంపౌండ్లో కలకలం రేపింది.మెగా ఫ్యామిలీలో విభేధాలు ఉన్నాయని తానే స్వయంగా బయటపెట్టాడు.పరాయివాడు వాడంటూ బన్నీపై ట్వీట్..అంతలోనే!ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు ఓ ట్వీట్ చేశాడు.‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ట్వీటే వివాదానికి దారి తీసింది. ఏపీ ఎన్నికల్లో తన మిత్రుడైన వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లిన నేపథ్యంలోనే నాగబాబు ఇలా ట్వీట్ వేయడంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై విపరీతంగా విరుచుకుపడ్డారు. దీంతో తన ఎక్స్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. రెండు రోజుల పాటు ఆయన సోషల్ మీడియాలో కనిపించలేదు. మళ్లీ ఈ రోజు ఎక్స్లోకి వచ్చి ‘ఆ ట్వీట్ డిలీట్ చేశాను’అని మరో ట్వీట్ వేశాడు.(చదవండి: బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు నాగబాబు పరార్.. మళ్లీ ఇప్పుడు ఇలా)దీంతో తను తప్పు చేశానని స్వయంగా నాగబాబే ఒప్పుకున్నట్లు అయింది. గతంలో నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పడు ఆదుకున్నది బన్నీనే. అంతేకాదు జనసేన పార్టీకి రూ. 2 కోట్ల విరాళం కూడా ఇచ్చాడు. అవన్నీ మరిచిపోయి స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బన్నీని పరాయివాడు అంటూ విమర్శించడంతోనే నాగబాబు మనస్తత్వం ఎలాంటితో అర్థమవుతుంది. ఆయనకు తొందరపాటు, దుడుకుతనం లాంటి అవలక్షణాలు ఉన్నాయని చాలా మంది అంటారు. మళ్లీ అది ఇప్పుడు రుజువు అయింది.కాంట్రవర్సీకి కేరాఫ్..వివాదాలను కోరి తెచ్చుకోవడం నాగబాబుకు కొత్తేమి కాదు. గతంలోనూ అనేకసార్లు ఆవేశంతో మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. రెండేళ్ల క్రితం బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన ‘అలయ్ బలయ్’ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే. ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ గరికపాటి సీరియస్ అయ్యారు. అయితే గరికపాటి వ్యాఖ్యలను మెగాస్టార్ లైట్ తీసుకున్నారు. ‘ఆయన పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’అంటూ ఆ వివాదానికి ఫుల్స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ నాగబాబు మాత్రం ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’అంటూ ట్వీట్ చేసి ట్రోలింగ్కి గురయ్యాడు. అలాగే ప్రముఖ రచయిన యండమూరి విషయంలోనూ నాగబాబు అతిగా మాట్లాడాడు.యండమూరి వీరేంద్రనాథ్-చిరంజీవిల మధ్య కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. అయితే యండమూరి చేసిన కామెంట్స్పై చిరంజీవి ఏనాడు స్పందించలేదు. కానీ నాగబాబు మాత్రం పబ్లిక్గానే యండమూరిని విమర్శించారు. కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి తన బయోపిక్ని రాసే అవకాశం యండమూరికే ఇచ్చాడు. ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్పై నాగబాబు ఫైర్ అయ్యారు. చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్కి హాజరైన పవన్ ఫ్యాన్స్ అక్కడ పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. ఎన్నిసార్లు ఈవెంట్లకి పిలిచినా అతడు ఎక్కడికీ రావడం లేదు. దానికి మేమేం చేస్తాం. ఇక్కడికొచ్చి పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడం కాదు.. మీకు దమ్ముంటే ఆయన ఆఫీసుకెళ్లి అక్కడ అరవండి.దేనికయినా ఓపికనేది ఒకటుంటుందని.. దానిని పరీక్షించొద్దు. ప్రతీసారి రావడం పవర్ స్టార్.. పవర్ స్టార్ అరవడం మీకో అలవాటయింది’అని అభిమానులపై నాగబాబు మండిపడ్డాడు. నాగబాబుకి దుడుకుతనం, తొందరపాటు ఉంటుందని చాలా మంది అంటుంటారు. అదినిజమని ఆయన ప్రవర్తతోనే నిరూపించుకుంటున్నాడు. -
మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు
నాగబాబు మళ్లీ ఎక్స్ (ట్విట్టర్)లో ప్రత్యక్షమయ్యాడు. ఈ మధ్య ఈయన పెట్టిన ఓ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈయన ట్వీట్పై కస్సుమన్నారు. ట్రోల్స్, విమర్శలతో రెచ్చిపోయారు. దీంతో ఏం చేయాలో తెలీక తన ట్విట్టర్ ఖాతాని నాగబాబు డీ యాక్టివేట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివేట్ చేయడంతో పాటు గతంలో పెట్టిన పోస్ట్ని డిలీట్ చేశాడు.(ఇదీ చదవండి: నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయనకు అల్లు అర్జున్ స్నేహితుడు. ఈ క్రమంలోనే ప్రచారం కోసం బన్నీ.. నంద్యాల వెళ్లాడు. అయితే తనకు పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. కానీ నాగబాబు మాత్రం.. 'మా పక్కనే ఉంటూ మమ్మల్ని బలహీనపరిచేవాడు మాకు శత్రువే. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే' అని ట్వీట్ చేశాడు.అయితే ఇది అల్లు అర్జున్ని ఉద్దేశించిందేనని బన్నీ ఫ్యాన్స్కి కోపమొచ్చింది. ముందు వెనకా ఆలోచించకుండా మాట్లాడిన నాగబాబుకి సోషల్ మీడియాలో ఇచ్చిపడేశారు. దీంతో ఏం చేయాలో తెలీక ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకున్నాడు. మరి ఏమైందో ఏమో గానీ ఇప్పుడు యాక్టివ్ చేసుకున్నాడు. కాకపోతే పాత ట్వీట్ డిలీట్ చేశానని చెప్పి, మరో ట్వీట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?) -
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన. -
ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా..? మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్లు ఇద్దరూ బన్నీపై గుర్రుగా ఉన్నారా..? అంటే సోషల్ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్ అవుతున్నారని నెట్టింట వైరల్ అయింది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చాయి అనేది చూద్దాం. స్నేహితుడి కోసం నిలబడిన అల్లు అర్జున్ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్లి తన మద్ధతును ప్రకటించారు. ఆ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్ శిల్పా రవి ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. 2019లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక ట్వీట్ వేశాడు. అది అల్లు అర్జున్ గురించే అంటూ నెట్టింట వైరల్ అయింది.నాగబాబు ట్వీట్తో రగడఅల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్ బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై, పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తమ అభిమాన హీరో గురించే అంటున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని వారు తప్పుపట్టారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేయాల్సిందని నాగబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్లు పెట్టారు. గతంలో జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా అంటూ వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు 'నా పేరు సూర్య' సినిమాకు ప్రెజెంటర్గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా..? అంటూ చెప్పుకొస్తున్నారు. చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్ధతుగా నిలబడాలని వీడియోలు చేయలేదా అని నెట్టింట బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.బన్నీ ఫ్యాన్స్, చిరంజీవి వల్లే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా..?వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. తనకంటూ ఒక సపరేట్ అభిమానగనాన్ని ఆయన సంపాదించుకున్నారు. వారందరూ సోషల్ మీడియా వేదికగా నాగబాబును ఏకిపారేశారు. మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవైపు బన్నీ అభిమానుల కామెంట్ల దాడి.. మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ఎక్స్ పేజీని నాగబాబు క్లోజ్ చేశారని తెలుస్తోంది.కష్టాన్నే నమ్ముకున్న అల్లు అర్జున్అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్ కుమారుడిగా.. మెగాస్టార్ మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్నే నమ్ముకున్నారు. ఒకరకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్గా తనను తాను మలుచుకున్నాడు. పుష్ప సినిమా సమయానికి సుకుమార్, బన్నీ ఇద్దరూ టాలీవుడ్కే పరిమితం. కానీ, అల్లు అర్జున్ తన నటనతో పాన్ ఇండియాను మెప్పించాడు. అలా బన్నీ వల్ల సుకుమార్ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్ టాప్లో ఉంటారు. -
నాగబాబు నీతులు..!
-
విష సర్పాలకన్నా భయానకంగా విపక్షాల వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై తెలుగుదేశం, జనసేన పార్టీల వ్యాఖ్యలు చూస్తుంటే, వారి కూతలు వింటుంటే వాళ్లలో రాక్షసత్వం ఎంతగా పేరుకుపోయిందో అర్ధం అవుతోంది. వాళ్లసలు మనుషులే కారన్న కఠోర వాస్తవం బోధ పడుతుంది. వాళ్లు కూడా మిగతా మనుషులతో కలిసి సమాజంలో తిరుగుతోంటే భయమేస్తుంది. ఏ మాత్రం బాధ్యత లేని వారి తెంపరి తనాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ కీచకులకు వంతపాడే పండుముదుసలి రామోజీ పత్రిక పైత్యం చూసి ఒళ్లు మండుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను తుదముట్టించడమే లక్ష్యంగా కిరాయి హంతకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన వెను వెంటనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచం. ఘోరాతి ఘోరం. ఈ దాడిని జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని అచ్చెన్న కూస్తే.. లోకేష్ వాగుడు మరీ బాధ్యతారాహిత్యం. ఆ రాళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయట. లోకేష్ ఇలా కూయడానికి కారణాలు ఉన్నాయి. తన తాత అని లోకేష్ పదే పదే చెప్పుకునే నందమూరి తారకరామారావుపై తన తండ్రి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటట్పై నుంచి చెప్పులు వేయించిన ఘటన లోకేష్ గుండెల్లో పదిలంగా ఉన్నట్లుంది. అందరూ తన నాన్నలాగే కౄరంగానే ఆలోచన చేస్తారని లోకేష్ అనుకుంటూ ఉండచ్చు. లేకపోతే ఇటువంటి పిచ్చి కూతలు రావడం సాధ్యం కాదు. ఇక జనసేన నాయకుడు సినీ నటుడు కొణిదెల నాగబాబు మరో అడుగు ముందుకేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్..ఎక్కడా స్క్రిప్టెడ్ అనిపంచనే లేదు అంటూ వెకిలి కామెంట్ ను ట్వీట్ చేశారు నాగబాబు. నటుల వంశం కాబట్టి వెండితెరపై అంతగా నటించలేకపోయినా.. రాజకీయ తెరపై నటనలో ఇరగదీసేస్తున్నారు నాగబాబు. తాను పెట్టిన ట్వీట్ను చూసిన తన సర్కిల్లోని వారే తిట్టారో.. మరీ అసహ్యంగా ఉందన్నారో తెలీదు కానీ తాను మొదట పెట్టిన ట్వీట్ను తీసేసి కొత్తగా మరో ట్వీట్ పెట్టారు. ఈ సారి తెచ్చిపెట్టుకున్న సంస్కారాన్ని నటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు మంచివి కావంటూ సింగిల్ టేక్లో డైలాగ్ కట్ చేశారు.నాగబాబు మొదట పెట్టిన ట్వీట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కారం ఉన్న వారంతా ఛీఛీ అన్నారు. సినీ రంగంలోని ప్రముఖులు అయితే మరీ ఇంత చీప్గా అనడం ఏంటని ఆశ్చర్యపోయారు. నిజానికి నాగబాబు కమెడియన్కు ఎక్కువ. తమ్ముడు పవన్కు తక్కువ అని సినీ జనాలు అంటూ ఉంటారు. ఆయ నెంచి సంస్కారాన్ని ఆశించవద్దని వారంటారు. అయినా వాలంటీర్లు మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని ఒళ్లు కొవ్వెక్కి దారుణపు కూత కూసిన పవన్ కల్యాణ్కు అన్న నాగబాబు.. కాబట్టి ఆయనుంచి సంస్కారాన్ని ఆశించలేం అంటున్నారు పాలక పక్ష నేతలు. చదవండి: ‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’ సీఎం జగన్పై హత్యాయత్నం చేసిందెవరో తేలాలి. వారి వెనుక ఉన్న శక్తులేంటో తెలియాలి. కచ్చితంగా ఇది హత్యాయత్నమే అనడంలో సందేహం లేదు. హత్యాయత్నం జరిగితే దాడి చేసిన వారు విలన్లు .చేయించిన వారు సూత్రధారులు అవుతారు. కానీ రామోజీ పత్రిక మాత్రం దాడి చేసిన వారిని వదిలేసి భద్రతా వైఫల్యాలు ఉన్నాయంటూ వెర్రి కథనం ఒకటి వండి వార్చింది. మనుషులకు చెట్ల మాదిరిగానే ఏళ్ల వయసు వచ్చి పడుతుంది కానీ..వయసు పెరిగినంత మాత్రాన సంస్కారం, మానవత్వం పెరగవని చాటి చెప్పడానికి రామోజీ, చంద్రబాబులను మించిన సాక్ష్యాలు అవసరం లేదంటారు మేథావులు. హత్యాయత్నానికి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ను రాళ్లతో కొట్టాలని ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా పిలుపు నిచ్చారు. విన్నారుగా. చంద్రబాబు ఎందుకిలా అన్నారో తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. తాను చేపట్టిన ప్రజాగళం సభకు జనం రారు. సీఎం సభకు ప్రజలకు ఇళ్లల్లో పనేమీ లేనట్లు సునామీలా తరలి వస్తారు.ఆ తేడా చూస్తూ బాధ వేయదాండీ? దాడి చంద్రబాబు నాయుడో టీడీపీ వారో చేయించారని ముందుగానే ఎవరూ అనడం లేదు. కాకపోతే దాడి జరిగిన వెంటనే టీడీపీజనసేన ఎల్లో మీడియాల ఓవర్ యాక్షన్ చూస్తే మాత్రం కచ్చితంగా ఇది వారి పనే అని ఎవ్వరికైనా అనిపించక మానదు. సరే హత్యాయత్నానికి ఎవరు ప్లాన్ చేశారు. ఎవరు కిరాయి హంతకులను పంపారు అన్నవి దర్యాప్తులో తేలతాయి. అవి పక్కన పెడదాం. పాలక పక్ష నాయకుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగినపుడు ప్రతిపక్ష నాయకులు ఖండించాలనుకుంటే ఖండించవచ్చు. లేదంటే మౌనంగా ఉండచ్చు. కానీ టడీపీ, జనసేనలు ఎంతగా దిగజారిపోయాయంటే ఈ దాడి జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని సిగ్గుమాలిన దిక్కుమాలిన కూతలు కూశాయి. దశాబ్ధాల క్రితం ఎల్లో మీడియా కానీ టీడీపీ కానీ ఇంత బరితెగింపు వ్యాఖ్యలు చేయలేదు. హత్యలు చేయిస్తే చేయించి ఉండచ్చు కానీ వాటిపై జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడేవారు. అదే వంగవీటి రంగా దారుణ హత్య ఇపుడు జరిగి ఉంటే ఇదే టీడీపీనేతలు రంగాయే తనపై దాడి చేయించుకుని ఫేమస్ అయిపోదామనుకున్నారని అని ఉండేవారు. మీడియాలో పైకి ఎదిగిపోవాలన్న దుర్బుద్ధితోనే పింగళి దశరథరామ్ తానే మనుషులను పురమాయించుకుని తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని.. అది వికటించి ఆయన మరణించారని అని ఉండేవారు. రామోజీ పత్రిక అయితే రంగా, దశరథరామ్ హత్యల విషయంలో భద్రతా లోపాలు ఎక్కడున్నాయో భూతద్దం పెట్టి వెతికేది. ఇవన్నీ చూస్తోంటే ఓ అనుమానం కూడా వేయక మనదు. 2003లో చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన దాడి బహుశా చంద్రబాబే ప్లాన్ చేయించుకుని ఉంటారు. అందుకే ఆ దాడి జరిగిన వెంటనే ముందస్తు ఎన్నికలకు వాజ్ పేయ్ఒను ప్పించి డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను మే నెలకి తీసుకు వచ్చారు. అని రాజకీయ పరిశీలకులు ఇపుడు అనుమానిస్తున్నారు.పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. పచ్చపార్టీ నేతలకూ అంతే. తాము చేసే ప్రతీ వెధవపనినీ తమ ప్రత్యర్ధులు కూడా చేస్తారని పసుపు పార్టీ నేతల ఎరుపు ఐడియా. సీఎం జగన్ను హత్యాయత్నాలతోనూ దాడులతోనూ ఎవరూ బెదిరించలేరు. ఆ విషయం 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నానికి తెగబడిన ఘటనే నిరూపించింది. అపుడు కూడా ఆయన దాడి జరిగింది కదా అని ,నెత్తురు కారింది కదా అని భయపడలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారు. ఈసారి కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈసారి టీడీపీకి ఆ 23 స్థానాలు కూడా రానే రావంటున్నారు రాజకీయ పండితులు. సీఎన్ఎస్. యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
అబ్బో.. ఇంతకీ ఇద్దరిలో త్యాగాల త్యాగరాజు ఎవరో?
కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ ఆసక్తికరమైన సంగతి చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీట్లను తగ్గించుకుని త్యాగం చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ ఆయనతో చెప్పి బాధపడ్డారట. అయినా పొత్తు ధర్మం కోసం, రాష్ట్రం కోసం తమ సీట్లను తగ్గించుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. నిజంగా పవన్ ఈ మాట చెప్పి ఉంటే రాజకీయాలలో ఇంతకన్నా బానిసత్వం ఇంకొకటి ఉండదు. ఒకవైపు జనసేన కార్యకర్తలు తమకు కనీసం నలభై అసెంబ్లీ సీట్లు అయినా పొత్తులోభాగంగా కేటాయించలేదని బాధ పడుతుంటే, పుండుమీద కారం చల్లినట్లు పవన్ కల్యాణ్ తమకు ఇచ్చినవే ఎక్కువని బాధపడ్డారా?. ఈ విషయం విన్న జనసైనికులకు ఏమనిపిస్తుంది! పేరుకు జనసేన తప్ప, తమది టీడీపీ భజన సేన అని అనుకోరా! తొలుత జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. బీజేపీకి ఇవ్వడం కోసం మరో మూడు తగ్గించుకున్నారు. పోనీ ఆ ఇరవై ఒక్కటి అన్నా జనసేన వారికి ఇచ్చారా అంటే అలా చేయలేదు. టీడీపీ, వైఎస్సార్సీపీ వంటి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి కొన్ని సీట్లు ఇచ్చేశారు. మూడు ఎంపీ సీట్లు ఇస్తారని అనుకున్నారు. దానిని పవన్ కల్యాణ్ మూడుకు తగ్గించుకున్నారు. పైగా ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిని అని ఆయన నిస్సిగ్గుగా చెప్పి జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన సంగతులు ఏమిటంటే ఏళ్ల తరబడి జనసేన ముఖ్య నేతలనే పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. అందులో స్వయంగా ఆయన సోదరుడు నాగబాబు కూడా ఉండడం విశేషం. నాగబాబుకు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇస్తారని భావించారు. ఏమైందో తెలియదు కాని అనకాపల్లిని బీజేపీకి త్యాగం చేశారు. అందులో కూడా ఎవరు పోటీచేశారో తెలుసు కదా! సీఎం రమేష్ కు. ఆయన ఎవరో కూడా తెలుసు కదా! టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేత. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. బీజేపీలో చేరినా కాంగ్రెస్ కు ముప్పై కోట్ల విరాళం ఇచ్చిన ప్రముఖుడు.ఈ మధ్యనే 400 కోట్ల ఫోర్జరీ కేసు కూడా ఆయనపై నమోదు అయింది. ఇతరత్రా ఉన్న ఆరోపణలు చెబితే చాంతాడు అంత అవుతాయి .సీఎం రమేష్ కోసం తన సోదరుడినే బలి చేశారంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉండాలన్నది పలువురి అబిప్రాయంగా ఉంది. పవన్ ఈ రకంగా అనకాపల్లి సీటును అమ్మేశారని జనసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మరో సీటును వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి ఇచ్చారు. ఆయనకు వైఎస్సార్సీపీ టిక్కెట్ రాలేదు. దాంతో పవన్ కల్యాణ్ ఆ సీటును ఆయనకు అమ్మి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేనకు నేతలే లేరా? అంటే ఉన్నారు. 2019లో జనసేన పక్షాన పోటీచేసి ఓడిపోయిన పార్లమెంటు అభ్యర్ది ఉన్నారు. అలాగే అసెంబ్లీకి పోటీచేసిన అబ్యర్దులు ఉన్నారు. కాని వారెవ్వరిని కాదని బాలశౌరికి ఇవ్వడంలో ఉన్న మతలబు ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అసెంబ్లీ టిక్కెట్ల విషయానికి వస్తే భీమవరంలో టీడీపీ నేతగా ఉన్న పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అక్కడ జనసేన కోసం పనిచేసిన కొందరు ప్రముఖులు ఉన్నారు. వారినెవ్వరిని కాదని ఈయనకు ఎందుకు ఇచ్చారు! లోగుట్టు పెరుమాళ్ల కెరుక. విజయవాడ పశ్చిమలో పార్టీకోసం పోతిన మహేష్ అనే నేత విశేషంగా కృషి చేశారు. ఆయన కు టిక్కెట్ వస్తుందని అంతా భావించారు. కాని ఆశ్చర్యంగా అక్కడ బలం లేని బీజేపీకి టిక్కెట్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. అది త్యాగమా?లేక మంచి బేరమో తెలియదు కాని బీజేపీ పక్షాన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీకిగాను జనసేన నేతను బలి చేయడానికి పవన్ కల్యాణ్ వెనుకాడలేదు. సుజనా చౌదరి అత్యంత ధనికులలో ఒకరు. బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగవేశారన్న కేసులు ఎదుర్కుంటున్న నేత. తాను నిజాయితీపరుడనని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆచరణలో ఇలా చేసేసరికి ఆయనలో నిజాయితీ అన్నది నేతిబీరకాయలో నెయ్యి వంటిదని జనసైనికులు భావించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేస్తే నమ్మించి గొంతు కోశారని ఆయన బాధపడ్డారు. జనసేన ప్లెక్సీలు, జండాలను ఆయన అనుచరులు దగ్దం చేశారు. మహేష్ మీడియా సమావేశం పెట్టి పవన్ ను ఏకీపారేశారు.ఇది ప్రజారాజ్యం -2 అని , మరో ఏడాది తర్వాత ఈ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత డెబ్బై రెండేళ్ల ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరపున కమ్మ సామాజికవర్గం నేత ఎవరూ పోటీ చేయలేదు. అక్కడ నివసించేవారిలో అత్యధికులు ముస్లింలు, నగరాలు,వైశ్యులు తదితర వర్గాల వారు ఉన్నారు. కాని ఈసారి సుజనా చౌదరి పోటీచేస్తున్నారు. బీజేపీ కూడా ఒరిజినల్ పార్టీ నేతలకు కాకుండా సుజనా వంటివారికే ఎక్కువ సీట్లు కట్టబెట్టడం కూడా విమర్శలకు దారి తీసింది.అవినీతిపై బోలెడు సోది కబుర్లు చెప్పే పవన్ కల్యాణ్ ఈ విధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారి కోసం తన పార్టీవారిని బలి చేశారంటేనే ఆయన తత్వం అందరికి తెలిసిపోయింది. ఈ విషయాలన్నిటిని పోతిన మహేష్ ప్రస్తావించి అనేక ప్రశ్నలు సందించారు.పలు కొత్త విషయాలు వెల్లడించారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ కనీసం పాతిక సీట్లు కూడా పోటీ చేయలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం తెలుసుకోవాలని, ఆయన మేడిపండు వంటివారు అని మహేష్ తీవ్రంగా ద్వజమెత్తారు. కన్నతల్లిని దూషించిన బినామీ చానల్ కు యజమాని అయిన వ్యక్తికి బీజేపీ టిక్కెట్ ఇస్తే పవన్ ఎలా మద్దతు ఇచ్చారని అని అడిగారు. మొత్తం 21 జనసేన సీట్లలో ఏడుగురే పార్టీ వారని, మిగిలినవారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని ఆయన తేల్చి చెప్పారు. కమ్మవారికోసం బిసిలను బలి చేస్తారా అని మహేష్ ప్రశ్నించారు.ఆయన అడిగినవాటికి పవన్ కల్యాణ్ వద్ద జవాబులు లేవనే చెప్పాలి. చివరికి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తీసుకున్న ఇంటి గృహ ప్రవేశానికి భార్య అన్నాలెజెవోను తీసుకు రావాలని మహేష్ అనడం సంచలనంగా ఉంది. అందరూ ఆ సక్తిగా ఈ విషయాన్ని గమనిచంచారు. ఏమైందో తెలియదు కాని, పవన్ కల్యాణ్ తన భార్య లేకుండానే గృహ ప్రవేశం చేశారు. దీంతో రకరకాల ఊహాగానాలకు పవన్ కల్యాణ్ అవకాశం ఇచ్చారు. ఏది ఏమైనా జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టి పూర్తిగా అప్రతిష్టపాలయ్యారని చెప్పాలి. నిజంగానే మహేష్ అన్నట్లు టీడీపీకి బి బ్యాచ్ గా తయారై వారికోసం పనిచేయడానికి జనసేనను పెట్టడం ప్రజలను మోసం చేయడానికే అన్న భావన వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు కూడా చెప్పాలి. అవనిగడ్డ నుంచి టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్ ను పార్టీలో చేర్చుకుని జనసేన టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ నియోజకవర్గంలో కూడా అదే ప్రకారం నిమ్మక జయకృష్ణను టీడీపీ నుంచి తీసుకుని టిక్కెట్ ఇచ్చారు. తణుకు లో తమ పార్టీ నేత ఒకరికి టిక్కెట్ ప్రకటించి, తదుపరి ఆ సీటును టీడీపీకి వదలివేశారు. అంటే చంద్రబాబు ఏమి చెబితే అది చేశారని అర్ధం అవుతుంది.తణుకు లో కూటమి సభ పెట్టినప్పుడు తణుకు నేత రామచంద్రరావు వర్గీయులు నిరసన కూడా తెలిపారు. ఇంత జరిగినా చంద్రబాబు దృష్టిలో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించినట్లేనట.ఆ మాటను పవన్ కల్యాణ్ అన్నారని చెబుతున్నారు. ఇంతకన్నా పరువు తక్కువ ఏమన్నా ఉందా! పిఠాపురంలో తన గెలుపుకోసం టీడీపీ నేత వర్మ కాళ్లా,వేళ్లా పడడం చూసి జనసేన కార్యకర్తలను సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం రాజకీయం అంతా చంద్రబాబు కోసం చేస్తున్నారని తేలిపోతుంది. పోనీ తనను ఎంతో కొంత ఆదరించిన కాపు సామాజికవర్గానికి అయినా న్యాయం చేశారా అంటే అదీ లేదు. కేవలం వారి ఓట్లు పొంది చంద్రబాబుకు మేలు చేయడానికే ఈ పొత్తు పెట్టుకున్నారని స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమ్మ నాగబాబు.. ఇంత కడుపు మంట?
అధికారమే పరమావధిగా ఏర్పడిన టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు అప్పుడే స్టార్టయ్యాయి. జనసేన పార్టీకి సీట్ల కేటాయింపుల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నుసన్నుల్లోనే జరుగుతుండడం జనసైన్యానికి మింగుడు పట్టడం లేదు. కొంతమంది బహిరంగంగా బాబు తీరును విమర్శిస్తుంటే.. మరికొంతమంది అంతర్గతంగా మాట్లాడుకొని తగిని బుద్ది చెప్పాలని డిసైడ్ అవుతున్నారు. (చదవండి: ట్వీటు రాజా? పోటీ లేదా?) పొత్తు పట్ల పవన్ వైఖరి అతని సోదరుడు నాగబాబుకు కూడా నచ్చడం లేదు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ.. బాబు కుట్రతో ఆయన పోటీకి దూరమయ్యాడు. అంతేకాదు పలు చోట్ల జనసేన అభ్యర్థులను ఓడించడానికి బాబు కుట్ర పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నాగబాబు వరకు చేరినట్లు ఉంది. అయితే సోదరుడు పవన్ కల్యాణ్ బాబుని గుడ్డిగా నమ్ముతుండడంతో నేరుగా అతనితో చెప్పలేకపోతున్నాడట. అందుకే ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. తాజాగా కన్ఫ్యూషియస్ కొటేషన్ని ఎక్స్లో షేర్ చేస్తూ పరోక్షంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్కు చురకలు అంటించాడు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లువుతారు’ అనే కన్ఫ్యూషియస్ కొటేషన్ని నాగబాబు ఎక్స్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వయసులో బాగా పెద్దవారైనా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడటం చాలా తప్పు, పైగా మీ పార్టీ టీడీపీతో పొత్తుతో ఉందన్న సంగతి మర్చిపోవద్దు, పొత్తు ధర్మాన్ని పాటించండి’ ‘ఇది అయితే చంద్రబాబు నే అంటున్నావ్ అని క్లియర్ గా తెలుస్తుంది....లేదంటే మోడీ గారిని’, ‘అయ్యో మీరు ఇలా డైరెక్ట్ గా చంద్రబాబు గారిని అనడం చాలా తప్పు’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ( గమనిక: ఏమి మాట్లాడిన మా గురించే ఏమో అని ఆపాదించుకుంటున్నారు,ఇది ఎన్నికల సమర సమయం నా ఉద్దేశాలు చెప్తున్న తప్ప ఎవరిని ఉద్దిషించి కాదు పైన చెప్పింది జీవిత సత్యం) pic.twitter.com/HhOfVu4igE — Naga Babu Konidela (@NagaBabuOffl) March 21, 2024 -
నాగబాబు గాయబ్.. ఫోన్ స్విచ్ ఆఫ్!
సినిమాల్లో అంతే.. కొన్ని సీన్లను, కొంతమంది నటులను షూటింగులో షూట్ చేస్తారు. ఆ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయని, రష్ చూసి సంబరపడతారు. ఆ సీన్లు తనకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని, తననుంచి నటనను పిండుకోవడంలో డైరెక్టర్ చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదని, అయితే అంతా తాను ప్రెస్మీట్లో చెప్పలేనని మిగతాది వెండితెరమీద చూస్తేనే అర్థం అవుతుందని నటీనటులు చెప్పుకుంటారు. తీరా చూస్తే సినిమా రిలీజయ్యాక ఆ సీన్లు ఉండవు.. ఏంది వయ్యా అంటే సినిమా నిడివి ఎక్కువైనందున ఎడిటింగులో ఆ సీన్లు తీసేశామని, చల్లగా చెబుతారు. సరే.. సినిమా లెంగ్త్ ఎక్కువైంది.. కొంత కట్ చేయాలి.. దానికి నేను నటించిన సీన్లనే తీసెయ్యాలా.. ఇంకేమీ లేవా అనే ప్రశ్నకు ప్రొడక్షన్ హౌస్ నుంచి సమాధానం ఉండదు.. ఇప్పుడు జనసేన అనే పొలిటికల్ సినిమాలో నాగబాబు పాత్ర కూడా అలాగే లేచిపోయింది. మొన్నటివరకు అంతా తానే అంటూ హడావుడి చేయడం.. సీనియర్ నాయకులూ.. మంత్రులు.. ఎంపీలను సైతం అచ్చం జబర్దస్త్ కామెడీ గాళ్ళను ఎటకారం చేసినట్లు చేయడం.. ట్విట్టర్లో పోస్టింగులు పెట్టడం.. దీంతో బాగా ఓవర్ యాక్షన్ చేసిన నాగబాబు ఇప్పుడు సరైన టైం వచ్చేసరికి గాయబ్ అయ్యారు. వాస్తవానికి నాగబాబును అనకాపల్లి ఎంపీగా ముందు ఫోకస్ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన అచ్యుతాపురం వద్ద ఇల్లు కూడా రెంటుకు తీసుకుని కొన్నాళ్ళు కార్లు.. నౌకర్లు.. జెండాలతో హడావుడి చేసారు. దీంతో అక్కడ ఆయన కొన్నాళ్ళు ఉండడమే కాకుండా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేయడంతోబాటు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ పెట్టారు. వారితో అదీ ఇదీ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. ఏమంటే నిధులు.. విరాళాల గురించి మాట్లాడారు. వంద రూపాయల నుంచి ఎంత వరకైనా విరాళం ఇవ్వవచ్చని చెబుతూ నేరుగా క్యూ ఆర్ కోడ్ను సైతం చూపించారు. అంటే ఆయనకు పార్టీ ఇచ్చిన అసలు బాధ్యత విరాళాలు సేకరించడం అని కేడర్కు అర్థమైంది. దాంతోబాటు ఆయనకు క్యాడర్ మీద అధికారము చెలాయించడం తప్ప బాధ్యత కూడా లేదని వాళ్లకు మెల్లగా తెలిసొచ్చింది. ఇదిలా ఉండగానే అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు లేదని.. వేరే ఎవరికో కేటాయిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో నాగబాబు చిన్నగా ఇల్లు ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్లిపోయారు. సినిమా భాషలో చెప్పాలంటే ప్యాకప్ చెప్పేసారు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్లకు సైతం దొరకడం లేదని అంటున్నారు. ఫోన్లు ఏకంగా స్విచ్చాఫ్ చేసేశారని.. ఎక్కడున్నారోకూడా తెలియడం లేదని అంటున్నారు. ఆయనమీద నమ్మకంతో కొంతమంది భారీగా విరాళాలు సైతం ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మరికొంతమందికి టిక్కెట్ హామీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లకు సమాధానం చెప్పలేక నాగబాబు పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి పరారైనట్లు చెబుతున్నారు. తనతో కేవలం హడావుడి మాత్రమే చేయించారని.. టిక్కెట్ విషయానికి వస్తే తనకు ఏమీ లేకుండా చేసారని ఆయన అవమానంగా ఫీలవుతున్నట్లు తెలిసింది. ఇక జనసేనకు రెండంటే రెండే ఎంపీ స్థానాలు దక్కడంతో అందులో ఒకటి మచిలీపట్నం కాగా అక్కడి నుంచి వల్లభనేని బాలసౌరి పోటీ చేస్తున్నారు. ఇంకోటి కాకినాడ కాగా అక్కడ పవన్ బరిలో ఉంటారని అంటున్నారు. దీంతో నాగబాబుకు ఎంపీ సీట్ ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే దానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. చేస్తే ఎంపీగానే అనేది ఆయన ఆలోచన. గతంలో 2019 లో కూడా ఆయన నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా టిక్కెట్ కూడా లేకపోవడంతో తాను కేడర్కు మొహం చూపించలేక మొత్తం గాయిబ్ అయినట్లు చెబుతున్నారు. రెండు వారాలుగా ఆయన ఎక్కడా సభలు.. సమావేశాల్లో కానరావడం లేదు. ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి విరాళాలు దండుకుని పారిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్'
మెగా హీరో సాయి దుర్గ తేజ్ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్ హౌస్కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తాజాగా తను పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్కు కూడా తన అమ్మగారి పేరుతోనే 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అని ఫిక్స్ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు. 'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్కల్యాణ్ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు. A New beginning ☺️ Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳 Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama & my guru garu @PawanKalyan mama My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024 -
లగేజీ ప్యాక్ చేసుకున్న మెగా బ్రదర్స్.. పరుగులు పెడుతున్న పవన్
ఏపీలో కీలకంగా ఉన్న నేతలు ఎక్కడ పోటీ చేయనున్నారో అందరికీ ఒక క్లారిటీ ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారో రాజకీయలపై ఏ మాత్రం అవగాహన లేని వారు కూడా ఇట్టే చెప్పేస్తారు.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా తమ స్థానాలను ప్రకటించుకున్నారు. కానీ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అయిన పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండూ చోట్ల ఓడిపోయాడు. దీనికి ప్రధాన కారణం ఆయన అహం అని చెప్పవచ్చు. పవన్ను ఇప్పటి వరకు విలువైన రాజకీయ నేతగా ఏపీ ప్రజలు గుర్తించనే లేదు.. అయినా కూడా పవన్లో మార్పు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం ప్రకారమే కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీలను కలుపుకుని వెళ్లిన పవన్ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు... ఈ ఎన్నికల్లో కూడా బాబు సలహా మేరకే ఆయనతో మళ్లీ జత కట్టాడు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.. అయితే స్టేజీ ఎక్కుతే చాలు ఊగిపోతాడు.. మొదట గాజువాక నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ అక్కడ ఓడిపాతారని తను చేపించుకున్న సర్వే ఫలితాలు చెప్పడంతో పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత కాకినాడ అనుకున్నాడు అక్కడికి స్వయంగా పవనే వెళ్లి సమీక్షలు కూడా చేశాడు.. అక్కడ కూడా ఎదురు గాలి వీయడం ఖాయం అని రిపోర్టు అందడంతో కాకినాడకు గుడ్బై చెప్పాడు. అక్కడి నుంచి పవన్ గాలి భీమవరం వైపు మళ్లింది. అక్కడ కూడా ఆయన సర్వే చేపించుకున్నాడు.. భీమవరంలోని బీసీ,క్షత్రియ,మైనారిటీ వర్గాలన్నీ కూడా జగన్ గారి వైపే ఉన్నాయని తేలడంతో మళ్లీ పవన్ గేరు మార్చి పిఠాపురం బయల్దేరాడు.. అక్కడ కూడా ఆయన సమీక్షలు చేపించుకున్నాడు. అక్కడ వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. అక్కడ కూడా ఆయనకు ఓటమి తప్పదనే సందేహాలు వస్తున్నాయి.. ఇప్పుడు మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే పనిలో పవన్ ఉన్నాడని సమాచారం. పవన్ ఎక్కడ నుంచి బరిలోకి దిగితే అక్కడ కచ్చితంగా బలమైన అభ్యర్ధిని వైసీపీ బరిలోకి దింపుతుంది. ఈ విషయం తెలిసే పవన్ తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది చెప్పకుండా గుట్టుగా వుంచుతున్నాడనేది నగ్నసత్యం. మరి ఇంతలా భయపడే పవన్ ఊగిపోతు మాట్లాడటం ఏంటి అంటూ నెట్టంట సెటైర్లు వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాదిరి నాగబాబు, పవన్ కల్యాణ్ చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఎంతో కోరికతో ఉన్నారు.. కానీ అది ఈసారి కూడా జరిగేలా లేదు. టీడీపీ-జనసేన కూటమి నుంచి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని నాగబాబు భావించారు. ఈ క్రమంలో ఆయన ఒక ఇల్లు కూడా అక్కడ అద్దెకు తీసుకుని కార్యకలాపాలు కూడా సాగించారు. అక్కడ నుంచే పోటీ చేయాలని భావించే కొణతాల రామకృష్ణను కూడా అన్నాతమ్ముళ్లు కలిశారు. అంతా ఫిక్స్ త్వరలో నాగబాబు పేరు ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి.. ఈ క్రమంలో వారు అనకాపల్లి నియోజకవర్గంలో సర్వే చేపించుకున్నారు కూడా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన ఆధరణ ఉండటం చూసి కాస్త నాగబాబు వెనకడుగు వేశారట.. ఓడిపోయే దానికి మళ్లీ పోటీ చేయడం ఎందుకని అద్దెకు తీసుకున్న ఇంటిని కూడా కాళీ చేశారట. ప్రస్తుతం మెగా బ్రదర్స్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పడ్డారు. పార్టీ అధినేతే ఎక్కడ పోటీ చేసిదే క్లారిటీ లేకుంటే ఎలా అంటూ పవన్పై జోకులు కూడా వేసుకుంటున్నారు. -
ఆవేశంతో ఊగిపోవడం ఆపై 'సారీ' చెప్పడం 'మెగా బ్రదర్స్'కు అలవాటే..
మెగా బ్రదర్ నాగబాబు తన మిగిలిన ఇద్దరు సోదరులతో పోల్చుకుంటే సినిమాల్లో రాణించలేకపోయాడు. ఏదో అడపాదడపా ఆయన సినిమాల్లో కనిపించీ కనిపించకుండా ఉంటాడు. తమ్ముడు పవన్ పుణ్యమా అని పార్ట్ టైమ్ పొలిటీషయన్గా ఎన్నికల సమయంలో మాత్రమే జనాల్లో కనిపిస్తాడు. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. తాజాగా తన కుమారుడు వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లాడు. అక్కడ పోలీస్ పాత్రల గురించి ఆయన కామెంట్ చేశాడు. సినిమాలలో ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండే వారు పోలీస్ ఆఫీసర్ పాత్రలు వేస్తే అంతగా నమ్మేలా ఉండవని సెటైర్లు వేశాడు నాగబాబు. పోలీస్ క్యారెక్టర్ తన కొడుకు లాంటి వారు మాత్రమే చేయాలి తప్పా మిగత వారు అందుకు పనికి రారు అన్నట్లుగా మాట్లాడారు. అయితే అవి కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ హీరో అయిన జూ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని నెట్టింట్ట వైరల్ అయింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇవ్వడం ఆపై నాగబాబుపై విమర్శలు చేయడంతో ఫైనల్గా సారీ చెప్పాడు. 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది.. 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను, ఆ మాటలు నేను వెనక్కు తీసుకుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే నన్ను క్షమించండి. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ ఒక పోస్ట్ చేశాడు. గతంలో కూడా బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం తర్వాత వాటికి గుడ్ బై చెప్పి కాంప్రమైజ్కావడం వంటివి జరడం మనం చూసిందే.. తాజాగా తారక్ను ఉద్దేశించే నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎన్నికల సమయంలో ఈ తలనొప్పి ఎందుకులే అనుకున్నాడేమో సింపుల్గా ఇలా సారీ చెప్పేశాడు. గతంలో కూడా నాగబాబు ఏబీఎన్ అధినేత రాధాక్రిష్ణపై ఫైర్ అవుతూ ఒక వీడియో విడుదల చేశాడు. చంద్రబాబుపై మీరు చేసిన 'భట్రాజ్' పొగడ్తల్ని నేను ఒక వీడియో ద్వారా చూపించానంటూ రాధాక్రిష్ణపై కామెంట్లు చేశాడు. అయితే అందులో 'భట్రాజ్ పొగడ్తలు' అనే పదం వల్ల ఆయనకు చిక్కులు వచ్చాయి. ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఫైర్ కావడంతో నాగబాబు క్షమాపణలు చెప్పాడు. ఇలా ఆవేశంలో నోటికి వచ్చింది మాట్లాడటం తర్వాత సారీ చెప్పడం పవన్- నాగబాబుకు సర్వసాధారణం అయింది. మరో వైపు పవన్ కల్యాణ్ కూడా అంతే.. ఆవేశంలో ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. కేవలం సినిమా డైలాగుల మాదిరి రాజకీయం చేయాలనుకుంటే అయ్యే పని కాదని ఇప్పటికీ ఆయనకు అర్దం అయినట్లు లేదు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సుమారు 10 ఏళ్లకు పైగానే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఈ పదేళ్లలో పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదగకపోగా అదఃపాతాళానాకి చేరుకున్నాడు. అందుకే ఆయన నోటి నుంచి ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం తణుకు సభలో విడివాడ రామచంద్రరావుకు తణుకు టిక్కెట్ అంటూ ఆవేశంగా ప్రకటించాడు. గత ఎన్నికల్లో మీలాంటి వ్యక్తి వెనుక నేను నిలబడలేనందుకు మనస్పూర్తిగా చింతిస్తున్నాను. 2019లో టిక్కెట్ ఇవ్వలేకపోయినందుకు ఇలా పబ్లిక్గా క్షమాపణలు చెప్పుకుంటున్నానంటూ పవన్ అన్నారు. ఆ సమయంలో రామచంద్రరావుకు క్షమాపణలతోనే సభను ప్రారంభించాడు పవన్. కానీ ఈసారి కూడా పవన్ మాట నిలబెట్టుకోలేకపోయాడు. తణుకు అభ్యర్థిగా రాధాకృష్ణకు టిక్కెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో రామచంద్రరావుకు మళ్లీ సింపుల్గా సారీతో గుడ్బై చెప్తాడని తెలుస్తోంది. చంద్రబాబు కోసం పవన్ రాజకీయం చేస్తున్నాడు అనేది నిజం.. ఆయన ఇచ్చిన 24 సీట్లతో సంబరపడిపోతూ ప్రస్తుత రాజకీయ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నాడు. కానీ తన పార్టీకి కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయిన జనసేన అధినేత తన జెండా అదఃపాతాళానాకి చేరుకోవాడానికి కారణం ఎవరు..? దీనికి మరెవరినో నిందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవంటారు. ఇందుకు పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయమే నిలువెత్తు నిదర్శనం. పవన్ కల్యాణ్ పైకి ఎన్ని సినిమా డైలాగ్స్ పేల్చినా ఉపయోగం లేదు. జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోడానికి మాత్రమే జనసేన ఆవిర్భవించిందని ఆయన పట్టరాని ఆక్రోశంతో మాట్లాడుతున్నాడు. కానీ టీడీపీ కోసమే జనసేన పుట్టింది అని పవన్ పరోక్షంగా చెప్పినట్లు అయింది. దీంతో తన ఫ్యాన్స్తో పాటు తన వర్గం వారు కూడా పవన్ను ప్రశ్నిస్తున్నారు.. పలు సలహాలు ఇస్తున్నారు... కానీ ఆయన ఐ డోంట్ కేర్ అంటూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకే జై కొడుతున్నాడు. పవన్కు ఎంత ప్యాకెజీ ఇస్తే అంతలా స్టేజీ డైలాగ్స్తో ప్రస్తుతం రెచ్చిపోతున్నాడు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి నాలగు లాజిక్ లేని మాటలను తన ఫ్యాన్స్కు చెప్పాడు.. 2019లో మళ్లీ అలాంటి కాకమ్మ కథలే చెప్పి చంద్రబాబు కోసం సొంతంగా బరిలోకి దిగాడు. 2024 వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలంటూ టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టేశాడు. ఇలాంటి కొత్త కథలు విని తట్టుకోలేక పవన్ ప్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. పవన్ను తిడుదామంటే అభిమానం అడ్డొస్తుంది.. దీంతో వారందరూ చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. ఎన్ని చేసినా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కష్టం అని జనసేన అభిమానులో వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోయాక 2029 ఎన్నికల్లో చంద్రబాబుతో తూచ్ అని ... జనసైనికులకు ఒక సారీ చెప్పి సింగిల్గా పోటీకి దిగుతానని ఏదో ఒక సినిమా కథ చెప్పడం ఖాయం. -
జనసేనకు ‘కొత్త’ తలనొప్పి
అలగడమే అలంకారంగా భావించే సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ.. జనసేనలో చేరీ చేరడంతోనే తన సహజనైజాన్ని బయటపెట్టుకున్నారు. అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేది తానేనని ఫిక్స్ అయిపోయాకనే అయన జనసేనలో చేరారు. వాస్తవానికి అయన ఆలోచనలకూ విరుద్ధంగా జరిగితే వెంటనే అయన అలకపాన్పు ఎక్కుతారు.. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే. కాంగ్రెసులోను, వైఎస్సార్ కాంగ్రెస్ లోను ఇలా ఎక్కడైనా ఆయనది అదే తీరు. ఇక చాన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న కొణతాల రామకృష్ణ మొన్నీమధ్యనే జనసేనలో చేరారు. చేరుతూనే.. తాను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అని తనకుతానే ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉండగానే.. అనకాపల్లి నుంచి తాను పోటీ చేస్తాను అంటూ పవన్ అన్నయ్య నాగబాబు సైతం అనకాపల్లి మీద కన్నేశారు.. తరచూ అక్కడే పర్యటిస్తున్నారు. యలమంచిలి దగ్గర అయన ఉండేందుకు ఒక ఇతనికి, స్టాఫ్ కోసం ఇంకో రెండు ఇళ్లను సైతం తీసుకున్నారు. అనకాపల్లి నుంచి పోటీకి అయన ఏర్పాట్లు చేసుకున్నారు... దీంతో తన అంశాలమీద నీళ్లు పడ్డాయని గుర్తించిన కొణతాల మొన్న నిన్న అనకాపల్లిలో జరిగిన పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ' తనకు టిక్కెట్ ఇవ్వనప్పుడు ఇంకా పార్టీ సమావేశాలకు వెళ్లడం ఎందుకన్నది ఆయన భావన. ఇదిలా ఉండగా అనకాపల్లిలో ప్రధాన సామాజిక వర్గం అయిన గవర కమ్యూనిటీకి చెందిన కొణతాల అలిగితే ఇక తన గెలుపు సంగతి అటుంచి డిపాజిట్లు కూడా రావని భయపడిన నాగబాబు ఒకవైపు.. పవన్ మరోవైపు కొణతాల ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఇదిలా ఉండగా తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేనకు అనకాపల్లి,కాకినాడ,మచిలీపట్నం లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో నాగబాబు సైతం అనకాపల్లిలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక.. కొణతాల సైతం అక్కడే కన్నేయడంతో ఇరువురిమధ్య పీఠముడి పడింది. దీంతో ఆ విభేదాలను పరిష్కరించేందుకు పవన్, నాగబాబు సైతం కొణతాల ఇంటికి వెళ్లి వచ్చారు. ఒకవేళ అయన మెత్తబడినా ఆయనకు ఇంకోచోట ఎక్కడ సీట్ ఇస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికే విశాఖలో పెందుర్తి, భీమిలి ఇలా మూడు నాలుగు సీట్లలో జనసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది.. ఇప్పుడు అవికాకుండా అనకాపల్లి ఎమ్మెల్యే కూడా తీసుకోవడం కష్టమే.! మరి అలాంటప్పుడు కొణతాలను ఎక్కడ ? ఎలా ఎకామిడేట్ చేస్తారో చూడాలి. ఇక్కడ.. వైవీ చక్రవర్తి అనే అయన సైతం తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా టిక్కెట్ కోసం చూస్తున్నారు.. ఇదిలా ఉండగా మరో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్ సైతం టీడీపీ కోసం గట్టిగా ఆశతో ఉన్నారు. దీంతో వీళ్ళు ఎవరికీ టిక్కెట్ లేకుండా నాగబాబుకు ఇచ్చేలా చంద్రబాబును పవన్ ఒప్పిస్తున్నారు అని అంటున్నారు.. దీంతో అనకాపల్లి కాస్తా హాట్ టాపిక్ అయ్యింది. ✍️సిమ్మాదిరప్పన్న -
గాజువాకలో జనసేన ‘ఫ్యామిలీ’ డ్రామా!
సాక్షి, విశాఖపట్నం : ఇప్పటికే టీడీపీతో పొత్తుపై కత్తులు నూరుతున్న జనసేన శ్రేణులు ఇప్పుడు ఆ పార్టీలో అగ్ర నాయకుల వ్యవహార శైలిపై తీవ్ర అసహనంతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న తమను కాదని నిన్నగాక మొన్న చేరిన జంప్ జిలానీలకు పెద్దపీట వేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కేవలం డబ్బుకే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప పార్టీలో సేవలకు గుర్తింపు లేదంటూ ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్నాళ్ల క్రితం వరకు కొన్ని చోట్ల ఒకింత ఉత్సాహంగా కనిపించిన జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రస్తుత పరిణామాలతో నిర్లిప్తత, నైరాశ్యంతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో పాటు ఆయన సోదరుడు నాగబాబుల వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పవన్ సామాజికవర్గానికి చెందిన యలమంచిలి నియోజకవర్గానికి చెందిన సుందరపు విజయకుమార్ గతం నుంచే జనసేనలో ఉన్నారు. అప్పటికే జనసేన సానుభూతిపరుడిగా ఉన్న ఆయన సోదరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పోర్టు కాంట్రాక్టరు సతీష్ పార్టీలో చేరుతున్నారంటూ ఆకస్మికంగా (డిసెంబర్ 7న) పవన్ కల్యాణ్తో విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇది జనసేన నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత నుంచి అదే సామాజికవర్గానికి చెందిన ‘సుందరపు’ కుటుంబానికి పవన్, నాగబాబులు అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ పార్టీలో చర్చ మొదలైంది. సతీష్ తాను నాగబాబుకు అత్యంత సన్నిహితునిగా చెప్పుకోవడం, అందుకు తగ్గట్టే నాగబాబు వ్యవహార శైలి ఉండడం పార్టీలో ఇతర నాయకులకు మింగుడు పడడం లేదు. టీడీపీతో పొత్తులో భాగంగా గాజువాక సీటు తమకు ఖరారైందని, ఆ స్థానం నుంచి సతీష్ పోటీ చేయబోతున్నారంటూ కొద్ది రోజుల నుంచి విస్తృత ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి నాగబాబు బరిలో ఉంటారన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు. క్యాడరును పట్టించుకోని పవన్ అధినేత పవన్ విశాఖ వచ్చినప్పుడు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ జనసేన క్యాడరు అసంతృప్తితో ఉంది. ఎవరో ఒకరిద్దరికే కలిసే అవకాశం ఇవ్వడం, హోటల్ గదికే పరిమితమవ్వడం తప్ప మిగతా వారిని దరికి చేరనీయడం లేదని మధన పడుతున్నారు. ప్రజారాజ్యంలోనూ నాగబాబు ఇదే తీరును ప్రదర్శించారని, ఇప్పుడూ అదే జరుగుతోందని వీరు గుర్తు చేస్తున్నారు. జీర్ణించుకోలేకపోతున్న సీనియర్లు.. మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేస్తున్న వారిని పక్కనబెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ జనసేన సీనియర్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే సుందరపు కుటుంబానికిస్తున్న ప్రాధాన్యతపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ నాయకులు తాజా పరిణామాలతో మరింతగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణలు జనసేనలో చేరారు. వీరిలో పంచకర్లకు పెందుర్తి సీటు ఖాయమన్న ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆ సీటును ఆశిస్తున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్కు మింగుడు పడడం లేదు. అలాగే మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య కూడా విశాఖలో సీటు ఆశిస్తున్నారు. టీడీపీతో పొత్తులో ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేకపోవడంతో కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం అక్కడ చాలా ఏళ్లుగా ఇన్చార్జిగా ఉన్న పరచూరి భాస్కరరావుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. టీడీపీతో పొత్తు వల్ల తమకు పోటీ చేసే అవకాశమే లేకుండా పోతోందన్న ఆవేదన ఒకవైపు, తాము కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారన్న బాధ మరో వైపు జనసేన నాయకులను వేధిస్తోంది. నాగబాబు కుమార్తె సినిమాకు సతీష్ పెట్టుబడి నాగబాబు కుమార్తె తీస్తున్న ఓ సినిమాకు సతీష్ భారీగా పెట్టుబడి పెట్టారని, అందుకే సతీష్ సోదరులిద్దరికీ పార్టీలో ప్రాధాన్యతనిస్తున్నారని, సతీష్కు గాజువాక సీటు దక్కేలా చూస్తున్నారని జనసేన నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పోర్టు కాంట్రాక్టరు కూడా అయిన సతీష్ గాజువాక సీటు నుంచి గెలిస్తే గంగవరం పోర్టుపై పట్టు సాధించవచ్చన్నది వారి వ్యూహంగా ఉందని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే గాజవాక సీటుపై కోటి ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. -
జనసేన నేతల నిలదీత.. తలదించుకున్న నాగబాబు!
సాక్షి, అనకాపల్లి: టీడీపీ జెండా ఇంకా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్ను భరించడం మావల్లకాదు.. అంటూ జనసేన నేతలు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి షాక్ ఇచ్చారు. ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని.. ఇవ్వకుంటే ఎన్నికల ప్రచారంలో సహాయ నిరాకరణ చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. పాయకరావుపేటలో మరోసారి జనసేన టీడీపీ సీటు వివాదం రాజుకుంది. బుధవారం ఆ నియోజకవర్గంలో జనసేన నాయకులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఆ సందర్భంలో.. టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నేతలు కోరారు. ‘‘గతంలో జనసేన మద్దతుతో నెగ్గిన అనిత.. అనేక కేసులతో మమ్మల్ని వేధించారు. జనసేనకు సీటు ఇవ్వకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎంతమాత్రం సహకరించేది లేదు’’ అని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు మౌనంగా ఫోన్ చూస్తూ ఉండిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచారని... ఇబ్బంది పెట్టారని.. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని మొదటి నుంచి జనసేన నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకే ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మాత్రం తాము పని చేయమని ఖరాకండిగా చెబుతూ వస్తున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఇంకా పొత్తు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీలో సీట్ల లొల్లి నడుస్తోంది. మరోవైపు చర్చల పేరిట టైం పాస్ చేస్తూ వస్తున్న జనసేనాని.. టీడీపీ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ? అనే అంశంపై స్పష్టమైన హామీ పొందలేక పోవడంపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తీవ్రంగా అవమానించిన టీడీపీతో కలిసి నడవడం ఇబ్బందిగా అనిపిస్తోందంటూ పలువురు నేతలు పవన్ దగ్గర ఏకరువు పెడుతున్నా.. ఆయన మాత్రం కలిసి నడవాల్సిందేనని.. టీడీపీ జెండా మోయాల్సిందేనని చెబుతుండడం గమనార్హం. -
జనసేన నాగబాబు, పవన్ కళ్యాణ్ పై కొమ్మినేని సెటైర్లు
-
బెంగుళూరు ఫామ్హౌస్లో మెగా ఫ్యామిలీ గ్రాండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఏపీలో దొంగఓట్ల చేరికలో జనసేన భారీ కుట్ర
-
ఒక్కడే.. కానీ రెండు ఓట్లు!
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక్కచోటే ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన. ఇలా లేకపోతే ‘అక్కడ- ఇక్కడ’ పేరుతో ఎన్నో దొంగ ఓట్లు నమోదై గందరగోళ పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు ఏరివేతకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటున్నా సాధారణ పౌరులు నుంచి సెలబ్రెటీల వరకూ ఒక్క చోట కంటే ఎక్కువ చోట్లే ఓటును ఏదొక రకంగా నమోదు చేసుకుంటూనే ఉంటున్నారు. ఇదంతా ఎందుకంటే ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఏపీలో ఓట్లు నమోదు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు ‘రెండో ఓటు’ను నమోదు చేసుకోవడానికి అది కూడా ఏపీలో నమోదుకు దరఖాస్తు చేయడంపై ఒకవైపు విస్మయం.. మరొకవైపు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు, అతని భార్య, కుమారుడు ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-168లో కొణిదల నాగబాబు(సీరియల్ నెంబర్-323), కొణిదల పద్మజ(సీరియల్నెంబర్- 324), సాయి వరుణ్ తేజ్(సీరియల్ నెంబర్-325) ఓటు వేశారు. వీరు తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగేంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా, ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాధారణ జనం.. అమ్మ నాగబాబు అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి సంబరాలు జరగనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్గా మారింది. (ఇది చదవండి: ఉంగరాలు మార్చుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి) వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మెగాస్టార్ తన ట్విటర్ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ దంపతులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులైన వరుణ్-లావణ్యతో ఫోటోలు దిగారు. ఫ్యామిలీ మొత్తం ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. జూన్ 9న ఎంగేజ్మెంట్ మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 9న జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హాజరయ్యారు. చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా పాల్గొన్నారు. కాగా.. 2017లో విడుదలైన ‘మిస్టర్’ కోసం వరుణ్ - లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్లో అంతరిక్షం మూవీ వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చూస్తే ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో వరుణ్తేజ్ సరసన అందాల భామ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) About Last evening .. Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD — Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023 View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?
మెగా బ్రదర్ నాగబాబు.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వీళ్లంతా ఆఫ్రికాలో ఉన్నారు. అయితే ఇది నార్మల్ టూర్ లా అనిపిస్తున్నప్పటికీ.. వరుణ్ తేజ్, నిహారిక కోసమే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి విషయం? నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. ఈ ఏడాది జూన్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ఛం చేసుకున్నాడు. దీంతో వీళ్ల పెళ్లి గురించి అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఆగస్టులో ఉండొచ్చని అన్నారు. కానీ అలా జరగలేదు. మొన్నీ మధ్య మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. నవంబరులో డెస్టినేషన్ మ్యారేజ్ ఉంటుందని, తేదీ అమ్మ డిసైడ్ చేస్తుందని అన్నాడు. (ఇదీ చదవండి: నా లైఫ్లో రష్మీదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్) మరోవైపు 2020లో పెళ్లి చేసుకున్న నిహారిక.. చైతన్య నుంచి అధికారికంగా ఈ ఏడాది విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె లైఫ్ ఇప్పుడిప్పుడే మళ్లీ సర్దుకుంటోంది. మళ్ళీ నార్మల్ కావడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తోంది. నాగబాబు ఫ్యామిలీ ఫారెన్ వెళ్లడానికి ఇది ఓ కారణమని తెలుస్తోంది. అలానే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఈ వేడుక ఇటలీలో జరగనున్నట్లు చాలారోజుల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు ఇలా నాగబాబు ఫ్యామిలీ విదేశాలకు వెళ్లడానికి పెళ్లి పనులు కూడా ఓ కారణమని అనిపిస్తుంది. ఇవన్నీ నిజమైతే త్వరలో వరుణ్తేజ్ పెళ్లి వివరాలు.. స్వయంగా నాగబాబు వెల్లడించే అవకాశముంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే)' View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
చిరంజీవి గొప్ప మనసు.. ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు, ప్రజల కోసం ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్–స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం(జూలై 9) నగరంలో ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గతంలో చిరంజీవి ప్రకటించగా మొదటి శిబిరం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి.ఎన్. ఆదిత్య పాల్గొన్నారు. చికిత్సలో కూడా రాయితీ అందేలా కృషి: నాగబాబు సినీనటుడు నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రక్తదానం, నేత్రదానం మీద అవగాహన పెంచామని, ఇప్పుడు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ముందుగానే కేన్సర్ను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన డాక్టర్ గోపీచంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కేన్సర్ చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని నాగబాబు హామీనిచ్చారు. స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 ప్రాంతాలలో ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, దానికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు. చదవండి: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే! జవాన్ ప్రివ్యూ.. గూస్బంప్స్ పక్కా -
లావణ్య త్రిపాఠితో వరుణ్తేజ్ ఎంగేజ్మెంట్?
మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. హీరో వరుణ్ తేజ్ త్వరలోనే బ్యాచ్లర్ లైఫ్కి గుడ్బై చెప్పనున్నాడట. హీరోయిన్ లావణ్య త్రిపాఠి-వరుణ్తేజ్ మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. వచ్చే నెల జూన్లోనే వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీతో పాటు అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందట. ఆ తర్వాత లావణ్య-వరుణ్లు తమ రిలేషన్షిప్ను అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించినట్లు సమాచారం. కాగా వరుణ్, లావణ్య ఇద్దరూ 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్లో లావణ్య త్రిపాఠి సందడి చేయడం ఈ రూమర్స్కి మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఇక రీసెంట్గానే నాగబాబు సైతం వరుణ్తేజ్కు త్వరలోనే పెళ్లి చేయనున్నామని, దీనిపై స్వయంగా వరుణ్ అనౌన్స్మెంట్ చేస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్ పై భరద్వాజ కామెంట్లపై నాగబాబు, రాఘవేంద్ర రావు విమర్శలు
-
మా ఇంట్లోనే హీరోలు.. కానీ ఎవరూ నాకు ఛాన్సివ్వలేదు: నాగబాబు
మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు. కానీ ఎవరూ ఏనాడూ పిలిచి క్యారెక్టర్ ఇవ్వలేదు అన్నాడు నటుడు నాగబాబు. సుస్మిత కొణిదెల మాత్రం తనకు రెండోసారి అవకాశం ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. శ్రీదేవి శోభన్బాబు ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. సంతోష్ శోభన్, గౌరి.జి.కిషన్ జంటగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్బాబు. నూతన దర్శకుడు ప్రశాంత్కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని విష్ణుప్రసాద్తో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించారు. ఈ నెల 18న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో హైదరాబాద్లో బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. 'మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు కానీ నాకెవరూ ఛాన్సివ్వలేదు. మా హనీ(సుస్మిత) మాత్రం నాకు రెండోసారి అవకాశమిచ్చింది. హనీ గురించి ఓ మాట చెప్పాలి. తను తల్చుకుంటే తనకు సపోర్ట్గా ఏ హీరో అయినా ముందుకు వచ్చేస్తాడు. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ నిర్మాతగా అన్ని కష్టాలు పడుతూ మీ ముందుకు ఈ సినిమా తీసుకొచ్చింది. తను త్వరలోనే మెగా ప్రొడ్యూసర్ అవుతుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ట్రైలర్ చూస్తుంటే ప్రశాంత్ ఏం చెప్పాడో అదే తీశాడనిపించింది. డైరెక్టర్గా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. సినీ ఇండస్ట్రీలో మెన్ డామినేషన్ ఉంటే టీవీ ఇండస్ట్రీలో వుమెన్ డామినేషన్ ఉంది. ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి పంపించకూడదు అన్న భ్రమలు ఇంకా ఉన్నాయి. అవకాశం వస్తే ఆడపిల్లలు మగవాళ్ల కన్నా బెస్ట్గా నటిస్తారు, బెస్ట్గా డైరెక్ట్ చేస్తారు, నిర్మిస్తారు' అని చెప్పుకొచ్చాడు నాగబాబు. చదవండి: అత్యంత చవక రేటుకు పఠాన్ టికెట్స్ -
సినీ విమర్శకులపై నాగబాబు షాకింగ్ ట్వీట్స్.. రిప్లై ఇచ్చిన ఆర్జీవీ
సినీ విమర్శకులపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు అనేది ఒక వ్యాపారం మాత్రమేనని.. జనాన్ని బాగు చేయడం కోసమే.. లేదా చెడగొట్డడం కోసమో సినిమాలు చేయరంటూ వరుస ట్వీట్స్ చేశారు. ‘సినిమాల్లో చూపించే హింస వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే, మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక ఫిల్మ్ మేకర్గా నేను చెప్పేది ఏంటంటే.. ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమాలు తీస్తారు. అంతేకాని జనాన్ని బాగు చేయ్యటం కోసమో.. చెడగొట్టడం కోసమో తీసేంత గొప్ప వాళ్లు లేరిక్కడ. సినిమా అనేది ఒక వ్యాపారం మాత్రమే . సినిమా వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇదే నా ఆన్సర్. సినిమాల్లో ఏదన్నా ఓవర్గా ఉంటే సెన్సార్ ఉంది. కుహనా మేధావులు ఏడకవండి’ అని నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. నాగబాబు ట్వీట్స్పై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది అతనికి మద్దతుగా కామెంట్ చేస్తే.. మరికొంత మంది నెగెటివ్టా కామెంట్ చేస్తున్నారు. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నాగబాబు ట్వీట్స్పై స్పందించారు. ఇది నిజమే అంటూ నాగబాబు ట్వీట్స్ని షేర్ చేశాడు. Perfectly correct 🙏🙏🙏 https://t.co/2WpwuXGl54 — Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2023 -
గంగోత్రికి ముందు బన్నీని అడగలేదు.. చరణ్ను అడిగారు: నాగబాబు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లు-మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బన్నీ తనదైన నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీల్లో సైతం విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు. యలయాళంలో బన్నీని మల్లు అర్జున్గా ఫ్యాన్స్ పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. అలా ఇతర భాషల్లో సైతం స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. చదవండి: శ్రీరామ చంద్ర అసహనం.. ఫ్లైట్ మిస్ అయ్యిందంటూ కేసీఆర్కు ఫిర్యాదు తొలి చిత్రంతోనే హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇందులో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అంతగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు బన్నీ మొదటి చాయిస్ కాదంటూ అసక్తికర విషయం చెప్పాడు మెగా బ్రదర్ నాగబాబు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆయన ఈ సందర్భంగా మెగా హీరోల గురించి ప్రస్తావించారు. తమ ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు వస్తారనుకోలేదన్నారు. ‘అన్నయ్య(మెగాస్టార్ చిరంజీవి)ను స్ఫూర్తిగా తీసుకునే మేం ఇండస్ట్రీకి వచ్చాం. ఆయన హీరో అయ్యారు. నన్ను నిర్మాతగా మార్చారు. అలా అన్నయ్య హీరోగా ఎదిగే క్రమంలో ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలను చూసి పిల్లలంతా ఇన్స్పైయిర్ అయ్యారు. చదవండి: త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి.. భార్యతో కలిసి వేరు కాపురం! ఇండస్ట్రీలో అయితే ఎలా అన్నయ్య స్పూర్తితో బయటి వాళ్లు హీరోలు అయ్యారో. అలాగే ఇంట్లో పిల్లలు కూడా ఆయన ఇన్స్పిరేషన్తో హీరోలు అయ్యారు. అలా అయిన వాళ్లలో బన్నీ కూడా ఒకడు. బన్నీ ఫస్ట్ గంగోత్రి ఆఫర్ వచ్చింది. కానీ నిజానికి గంగోత్రి ఆఫర్ ఫస్ట్ చరణ్ బాబు(రామ్ చరణ్)కు వచ్చింది. చరణ్ బాబుని అడిగినప్పుడు అన్నయ్య వద్దు అన్నాడు. చరణ్కి ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. అలా బన్నీ గంగోత్రి ఆఫర్ వచ్చింది. అలానే అనుకోకుండానే అందరికి ఆఫర్లు వచ్చాయి, హీరోలు అయ్యారు’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. -
త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి!
టాలీవుడ్లో ఈ మధ్య చాలా మంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో నితిన్, రానా, నిఖిల్ లాంటి యంగ్ హీరోలంతా ఓ ఇంటివాళ్లయ్యారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్లో ఉన్న శర్వానంద్ కూడా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవల శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి మెగా హీరోలు సాయితేజ్, వరుణ్ తేజ్లపై పడింది. ముఖ్యంగా వరుణ్ పెళ్లి కోసం అయితే మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శుభవార్తను చెప్పాడు మెగా బ్రదర్ నాగబాబు. త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని, ఈ విషయాన్ని వరుణ్ అధికారికంగా ప్రకటిస్తాడని ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పుకొచ్చాడు. అయితే అమ్మాయి ఎవరనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. పెళ్లి కూతురుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని, ఆ విషయాలన్ని వరుణ్ తేజ్ వెల్లడిస్తాడని నాగబాబు అన్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత వరుణ్ తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటాడని, తాను తన భార్యతో కలిసి మరో ఇంట్లో ఉంటామని చెప్పారు. ఓ యంగ్ హీరోయిన్తో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్య పుకార్లు వచ్చాయి. అలాగే ఓ వ్యాపారవేత్త కూతురిని వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ పుకార్లపై నాగబాబు స్పందించలేదు. వరుణ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నాగబాబు సమర్పణలో ఎస్వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ని ఖరారు చేశారు. -
మెగాస్టార్ బర్త్డే.. చిరంజీవి తమ్ముడు నాగబాబు పోస్టర్ రిలీజ్
సూపర్స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సాక్షి. ఈ సినిమాలో హీరో లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. సాక్షి టైటిల్ లోగోను, అలాగే విలన్గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్, దాము సంయుక్తంగా విడుదల చేశారు. అనంతరం నిర్మాత మునగాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మా సాక్షి సినిమాలో విలన్గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు గారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి, దాము గారికి చాలా థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో హీరోయిన్ జాహ్నవి కపూర్. అజయ్, ఇంద్రజ, ఆమని కీలకపాత్రల్లో నటించారు. భీమ్స్ గారి సంగీతం బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అన్నారు. చదవండి: సాలెపురుగును చూసి హడలెత్తిన హీరో, ఇల్లు అమ్మేస్తానంటూ కామెంట్ Chiranjeevi- Surekha: చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి -
అప్పుడు నాకు ఆ సెన్స్, జ్ఞానం లేదు: నాగబాబు
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఆయన్ను తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. 'నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బతికి ఉన్నప్పుడు చెప్పాలన్న సెన్స్ గానీ, జ్ఞానం కానీ నాకు లేవు. అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు . దయచేసి చెప్తున్నా.. మీ ఆత్మీయులు బతికి ఉన్నప్పుడే వారితో మీ ఎమోషన్స్ పంచుకోండి' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ మేరకు తన తండ్రి ఫొటోను షేర్ చేశాడు. మెగా ఫాదర్ కొణిదెల వెంకట్రావు విషయానికి వస్తే.. శోభన్ బాబు హీరోగా నటించిన ‘జగత్ కిలాడీలు’ అనే ఓ సినిమాలో నటించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో చిరంజీవితో పాటు కలిసి నటించారు. నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు, నువ్వు బ్రతికి వున్నప్పుడు చెప్పాలన్న సెన్స్ గాని జ్ఞానం కానీ నాకు లేవు... అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు. To everyone out there... Please share your emotions & love while your dear ones are alive. Once again Happy Birthday Dad. pic.twitter.com/wMUkGgHLJ9 — Naga Babu Konidela (@NagaBabuOffl) June 25, 2022 చదవండి: రెమ్యునరేషన్ భారీగా పెంచిన ప్రభాస్, ఒక్కో సినిమాకు ఎంతంటే? నా మొదటి భార్యను కలవాలి, ఆమె ఆలియా మాత్రం కాదు -
'సదా నన్ను నడిపే' సినిమా రివ్యూ
'వానవిల్లు ' చిత్రం తర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటించిన మూవీ 'సదా నన్ను నడిపే'. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి హీరో ప్రతీక్ దర్శకత్వం, స్క్రీన్ప్లే, సంగీతం అందించాడు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.. కథ: ఎమ్.జే అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్)తో ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా ఎమ్జే ప్రేమని అంగీకరించడు. అయితే హీరో మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఎట్టకేలకు సహా ప్రేమను అంగీకరించి అతడిని పెళ్లాడుతుంది సాహా. కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచే అతడిని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా... ఎమ్జేను ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరికి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...!!! విశ్లేషణ: హీరో చెప్పినట్టు ఇంతకు ముందు స్వచ్చమైన ప్రేమకథలతో గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ను కళకళలాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్... ఎంతో ఎమోషనల్గా సిల్వర్ స్క్రీన్పై ఆ విష్కరించాడు. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్షణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగాన్ని అయినా చెయ్యొచ్చనినే విషయాన్ని ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించాడు. కర్నాటకలో జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకుని సినిమాటిక్గా మార్చిన తీరు బాగుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది. ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. హీరోగా నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ వున్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. విజయవాడ, హైదరాబాద్, కొడైకెనాల్, కులుమనాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. చదవండి: రణ్బీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్ ‘సమ్మతమే’ మూవీ రివ్యూ -
నా కూతురేంటో నాకు తెలుసు, అలాంటివి పట్టించుకోను: నిహారిక తల్లి
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పబ్ ఇన్సిడెంట్ తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన నిహారిక ఇటీవలె ఇన్స్టాగ్రామ్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా మారిన నిహారిక తాజాగా తల్లి పద్మజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఇటీవలి కాలంలో నిహారికపై వచ్చిన వార్తలపై నాగబాబు భార్య, నిహారిక తల్లి పద్మజ స్పందించింది. 'మొదట్లో ఇలాంటి వార్తలు రావడం ఇబ్బందిగా అనిపించేది కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిహారిక ఎక్కడికైనా వెళ్లినా నాకేం అనిపించదు. నా కూతురేంటో నాకు తెలుసు. నాకు మా బావగారున్నారు.ఆయన ఉన్నంతవరకు మాకేం పర్వాలేదు' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. -
మదర్స్డే: అమ్మతో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్
మదర్స్ డే (మే 8) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రపంచంలోని తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్లో ఓ పాత వీడియోని షేర్ చేశాడు. అందులో తన తల్లి అంజనాదేవితో పాటు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆ వీడియో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ అప్పటిది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ కూడా అక్కడే జరుతుంది. (చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్బాబు ఎమోషనల్) దీంతో నాగబాబు, అంజనాదేవిలు షూటింగ్ లోకేషన్కు వచ్చారు. అందరు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత తల్లిని దగ్గర ఉండి కారు ఎక్కించారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘అమ్మలందరికీ అభివందనములు’ అని చిరంజీవి కామెంట్ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పెళ్లిపై వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం(ఏప్రిల్8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సంపాదించుకుంటోంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాలేజీ రోజుల్లో లవ్స్టోరీ ఉండేది కానీ ఇప్పుడు సీక్రెట్ లవ్స్టోరీ ఏం లేదని తెలిపాడు. పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు.. చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయని, దీంతో ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని పేర్కొన్నాడు. ఇక ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అన్న దానిపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నాడు. కాగా వరుణ్ నటించిన ఎఫ్ 3 సినిమా సైతం రిలీజ్కు రెడీ అవుతోంది.చదవండి: వరుణ్తేజ్ కోసం లావణ్య ట్వీట్.. మరోసారి డేటింగ్ రూమర్స్ తెరపైకి! -
నిహారికకు, నాకు ఇంటికి త్వరగా వచ్చేయాలని చెప్పేవారు
మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రేపు(ఏప్రిల్ 8న) విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్తేజ్ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నాగబాబు నిర్వహించే ఆస్క్ మీ ఎనీథింగ్పై కూడా స్పందించాడు. 'ఇంతకుముందు నాన్న అంటే భయం ఉండేది. నాలుగైదు సినిమాలు చేశాక కూడా భయముండేది. కానీ ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఆస్క్ నాగబాబు అంటూ అడిగే అన్ని ప్రశ్నలను నేను ఎప్పుడో అడిగేశాను. ఇకపోతే దయచేసి మమ్మల్ని తొందరగా రమ్మని అడగకండని నేనూ, నిహారిక రిక్వెస్ట్ చేసేవాళ్లం. కానీ ఇప్పటికీ ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నావు, త్వరగా రా అనేవారు. షూటింగ్లో ఉన్నాను నాన్న అని చెప్పినా సరే త్వరగా వచ్చేయాలనేవారు. మధ్యలో ఎలా వచ్చేస్తాను, షూటింగ్ అయ్యాక వస్తాను అని చెప్పేవాడిని. ఒక తండ్రిగా అలా అడగడం ఆయన అలవాటు' అని చెప్పుకొచ్చాడు. కాగా వరుణ్ నటించిన ఎఫ్ 3 సినిమా సైతం రిలీజ్కు రెడీ అవుతోంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ కూడా కమిటయ్యాడీ హీరో. చదవండి: యాక్షన్ ఫిల్మ్స్ చేద్దామని వచ్చా.. కానీ రొమాంటిక్ సినిమాలే ‘డేంజరస్’ మూవీ విడుదల వాయిదా.. కారణమిదే అంటూ వర్మ ట్వీట్ -
నిహారిక అకౌంట్ను నేనే డియాక్టివేట్ చేశాను : నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయంపై అయినా తనదైన స్టైల్లో సమాధానమిస్తుంటాయరన. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో చిట్చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఓ యూజర్ నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఎందుకు డిలీట్ చేసింది?ఆ రూమర్స్పై రెస్పాండ్ అవ్వండి అని అడిగారు. దీనికి రిప్లై ఇచ్చిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టా అకౌంట్ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ఆ రూమర్స్కి చెక్ పెట్టారు. -
వరుణ్ తేజ్ పెళ్లిపై స్పందించిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటాడీ నటుడు. తాజాగా ఆయన ఫ్యాన్స్తో చిట్చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నాగబాబుకు 'వరుణ్తేజ్ పెళ్లెప్పుడు?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ప్రశ్న విని, దానికి సమాధానాలు చెప్పి విసుగెత్తిపోయిన ఈయన ఈ క్వశ్చన్కు వరుణ్తేజే ఆన్సరిస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు. కాగా గతంలోనూ వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా మంచి సంబంధాలు ఉంటే చూడమని బదులిచ్చాడు నాగబాబు. మరొకసారైతే వరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని పరోక్షంగా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే వరుణ్ ఓ హీరోయిన్ను పెళ్లాడబోతుందంటూ ప్రచారం జరగ్గా అది వట్టి పుకారుగానే తేలిపోయింది. హైదరాబాద్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతురితో ఏడడుగులు వేయబోతున్నాడంటూ కూడా కథనాలు రాగా అది కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన ఎఫ్3 మే 27న విడుదలవుతుండగా గని ఏప్రిల్ 8న రిలీజ్ అవుతోంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్బాస్ ఫణికి తీవ్ర గాయాలు, 'బతుకు మీద ఆశ లేకపోవడం కూడా చావే' -
నువ్వు లేకపోయుంటే ఎంతో కష్టమయ్యేది డియర్: నాగబాబు
Naga Babu Wife Padmaja Birthday: మెగా బ్రదర్ నాగబాబు.. సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా రాణిస్తూ, పాపులర్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నాడు. అటు బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకూ చేరువయ్యాడు. కుటుంబమే తన మొదటి ప్రపంచంగా భావిస్తాడు నాగబాబు. నేడు ఆయన సతీమణి పద్మజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు నాగబాబు. 'ఈ ప్రపంచం ఎంతో కఠినమైన ప్రదేశం. నువ్వు లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యుండేది. ఎల్లప్పుడూ నాతో ఉంటూ నీ ప్రేమతో, నీ ముందుచూపుతో అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసినందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్డే డియర్ పద్మ' అని శుభాకాంక్షలు తెలిపాడు. వరుణ్ తేజ్, నిహారిక సైతం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
‘మిషన్ 2020’ మూవీ రివ్యూ
టైటిల్: మిషన్ 2020 నటీనటులు: నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి, తదితరులు నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు దర్శకుడు: కరణం బాబ్జి సంగీత దర్శకుడు: ర్యాప్ రాక్ షకీల్ నవీన్చంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. కరణం బాబ్జి దర్శకుడు. కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె.వి.ఎస్.ఎస్.ఎల్.రమేష్రాజు నిర్మాతలు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. విశాఖపట్నానికి చెందిన ప్రకాశ్ ఓ తెలివైన ఇంజనీరింగ్ స్టూడెంట్. కాలేజీలో అతనే టాపర్. ముగ్గురు స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుంటారు. ఆ నలుగురికి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. అయితే వారిలో ఒకరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనడంతో.. అశ్లీల వీడియోల మత్తులో పడిపోతారు. చదువును పక్కన పెట్టి పోర్న్ వీడియోలు చూస్తుంటారు. . ఆ అశ్లీలతను చూసిన ఉద్రేకంలో అనుకోకుండా తమ స్నేహితురాలు స్వాతి పై వారు అత్యాచారానికి పాల్పడతారు. క్షణికావేశంలో చేసిన ఆ తప్పుతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. ఈ అత్యాచార కేసును ఏసీపీ జయంత్ (నవీన్ చంద్ర)ఎలా ఛేదించాడు. చివరకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది ?అనేదే మిగతా కథ ఎలా చేశారంటే.. ఓ సిన్సియర్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ జయంత్గా నవీన్ చంద్ర అదరగొట్టేశాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు. ఎలా ఉందంటే.. మంచి మార్గంలో స్వేచ్ఛగా చైతన్యవంతులుగా ఎదగాల్సిన యువత... అశ్లీల వీడియోల మత్తులో పడి తమ బతుకును ఎలా దుర్భరం చేసుకుంటున్నారనే కోణంలో సందేశాత్మకంగా తెరకెక్కిన సినిమానే మిషన్ 2020. అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా తెలిసీ తెలియని వయసులో కొందరు ఎలా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారో లాంటి అంశాలను కూడా చాలా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కరణం బాబ్జీ. తాను ఎంచుకున్న పాయింట్ని తెరపై చూపించడంలో మాత్రం కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. తన సినిమాతో యువతకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలన్న దర్శకుడి ఆలోచనను మనం ప్రశంసించాల్సిందే. ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు. సెకండాఫ్లో కథ కాస్త ఫాస్ట్గా, సీరియస్గా నడుస్తుంది. క్లైమాక్స్లో అత్యాచార బాధితురాలు మీడియాతో మాట్లాడే సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి.. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ వర్క్ వర్కౌట్ కాలేదు. చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao Comments On Mega Brother Nagababu: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య పలువురు నటీనటులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ యుట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్ అనసూయ డ్రెస్పింగ్పై కోట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకుముందు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట అదే సమయంలో ప్రకాశ్ రాజ్పై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును ఆయన టార్గెట్ చేశారు. గతంలో తనపై చేసిన కామెంట్స్పై స్పందిస్తూ ఈ ఇంటర్య్వూలో మెగా బ్రదర్కు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఒక పక్క, పవన్ కల్యాణ్ మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్ రాజ్ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్ రాజ్ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు. అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు. అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్పా అంటూ కోట సంచలన కామెంట్స్ చేశారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! కాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రకాశ్ రాజ్ కలిసి 15 సినిమాలకు పైగా నటించానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్కు సమయానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోట వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబుశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్రాజ్పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు -
చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు
Manchu Vishnu Talks In Press Meet Over MAA Bylaws: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలని అనుకుంటున్నట్లు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్లు ‘మా’ సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్లో విష్ణు తన ప్యానల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా విషయాల్లో అసోసియేషన్లోని బైలాస్ను మార్చాలనుకుంటున్నానన్నారు. చదవండి: ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్ బైలాస్ మార్చడమంటే అంత ఈజీ కాదని, దీనిపై సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదనేదని తాను భావిస్తున్నానని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి లేట్ అవ్వడంతో మరునాడు కౌంటింగ్ కొనసాగించారని తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని విష్ణు చెప్పారు. ప్రకాశ్రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారని, అయితే వారి రాజీనామాను ఆమోదించలేదన్నారు. త్వరలోనే దీనిపై ప్రకాశ్ రాజ్కు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తానని మంచు విష్ణు తెలిపారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మరో వివాదం.. పోలీసుల ఎంట్రీ -
చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్పై మంచు విష్ణు విజయం సాధించారు. అయిన ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాజీనామాలు, ఆరోపణలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేశ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్ నాగబాబు, నరేశ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని తన అన్నయ్య(చిరంజీవి) ఎప్పుడు అనుకోలేదన్నాడు. పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే ఆయన వారికి చేతనైనంత సాయం చేశారని పేర్కొన్నాడు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడు ఆయన అనలేదని, అన్నయ్యకు అంత అహంకారం లేదని నాగబాబు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం తన రాజీనామాపై మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్న. కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్లో ఉండాలనిపించలేదు. మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్తో నాకు సంబంధం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Nagababu Resignation: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్పై విజయం సాధించారు. మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాశ్ రాజ్కు మద్దుతు ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: MAA Elections 2021 Results: మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా అలాగే 48 గంటల్లో తన రాజీనామా లేఖను ‘మా’ కార్యాలయానికి పంపిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అన్నట్లుగానే సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా’ అసోసియేషన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తను రాజీనామాకు గల కారణాలకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నిష్పక్షపాతం, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును నేను ఎప్పుడు అభిమానించేవాడిని. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచేది. ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయి. ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అన్నారు. చదవండి: నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది: ప్రకాశ్రాజ్ అలాగే ‘ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్ రాజ్. అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను. ఎప్పటికి నా మద్దతు ప్రకాశ్ రాజ్కే. గత పరిణామాల పట్ల నేను బాధపడటం లేదు. అసోసియేషన్ భవిష్యత్పైనే ఆందోళన చెందుతున్నా’ అంటూ నాగబాబు తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. Membership Resignation from MAA Association. pic.twitter.com/l4WlNaZlvx — Naga Babu Konidela (@NagaBabuOffl) October 11, 2021 -
MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం
MAA Elections 2021 Results: మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్లో "నా" ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు' అంటూ ట్వీట్ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కాగా మా ఎన్నికల్లో నాగబాబు మొదటి నుంచీ ప్రకాశ్రాజ్ ప్యానల్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయనను విజయతీరాలకు చేర్చేందుకు మెగా బ్రదర్ ఎంతగానో కష్టపడ్డారు. కానీ అంతిమంగా ఈ పోరులో మంచు విష్ణు విజయాన్ని ముద్దాడారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్లో "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు. - నాగబాబు, pic.twitter.com/wLqwOKsNtq — Naga Babu Konidela (@NagaBabuOffl) October 10, 2021 -
‘మా’ ఎన్నికల అధికారిపై అనుమానాలు ఉన్నాయి: నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు గుప్పించుకుంటూ, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలనను తలపిస్తున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు విష్ణు ప్యానల్, మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాగాబాబు మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, అతడి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహణపై తనకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన మోహన్ బాబుకు దూరపు బంధువు అవుతారనే సమాచారం తమకు వచ్చిందని, అందుకే అతడు విష్ణుకు ఫేవర్గా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తమకు కొత్త ఎన్నికల అధికారి కావాలని పేర్కొన్నారు. అంతేగాక మాలో పొస్టల్ బ్యాలెట్ లేదని, మొదట పోస్టల్ బ్యాలెట్ పెట్టాలని విష్ణు ప్యానల్ ప్రతిపాదనను చేసినప్పుడు తమకు కూడా సహెతుకంగా అనిపించి ఒకే అన్నామన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ను స్కాంలా ఉపయోగించి దాని ద్వారా సభ్యులను ప్రభావితం చేస్తారని ప్రకాశ్ రాజ్ పసిగట్టి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే మొదటి నుంచి ప్రకాశ్ ప్యానల్కు మద్దతు ఇస్తున్న నాగబాబు విష్ణు, విష్ణు ప్యానల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంకా ఏయే విషయాలు వెల్లడించారో తెలియాలండే ఆయన సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్య్వూ కోసం ఇక్కడ ఓ లుక్కేయండి. -
తీన్మార్కు స్టెప్పులేసిన ఫరియా, డాక్టర్ను సంప్రదించిన మెగా బ్రదర్
♦ నా మనసు దొచేశావు, తిరిగేచ్చేయ్ అంటున్నా బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి ♦ వారణాసిలో గంగమ్మ, శివుడిని దర్శించుకున్న బుట్టబోమ్మ పూజా హెగ్డే ♦ తీన్మార్కు దరువేస్తూ, డ్యాన్స్ చేస్తున్న చిట్టి ఫరియా అబ్దుల్లా ♦ నా ఫవరేట్ మార్నింగ్ రిచ్చ్యూవల్ అంటూ యోగా ఫొటో షేర్ చేసిన అల్లు స్నేహా రెడ్డి ♦ డాక్టర్ను స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
అలా చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా : నాగబాబు
మెగాబ్రాదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారంటూ పలువురు ప్రశ్నించగా..తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే మీ ముందుకు వస్తాడంటూ పేర్కొన్నారు. చదవండి : డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నటుడు ఇక మరో యూజర్.. బిగ్బాస్ లేదా ఐపీఎల్...ఈ రెండింట్లో ఏది ఫాలో అవుతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా..'బిగ్బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్కి సపోర్ట్ చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా' అంటూ క్రేజీగా బదులిచ్చారు నాగబాబు. దీనికి స్పందించిన ప్రియాంక సింగ్ టీం నాగబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 'మీరు ఎప్పుడు ఎవరిని ఊరికే సపోర్ట్ చేయరు ... జెన్యూన్ పర్సన్స్ ని తప్ప, ఆ జెన్యూన్ నేచర్ మన పింకీని ఇంత వరకూ తీస్కోచ్చింది ...మీకు లాగే అందరూ సపోర్ట్ చేసేలా చేస్తోంది' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే నాగబాబు బిగ్బాస్-5లో తనకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, అయినప్పటికీ ప్రియాంక సింగ్కే తన మద్దతు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నడ నటి సంజన గల్రానీ సైతం ప్రియాంక సింగ్ను విన్నర్గా చూడాలనుందని పేర్కొంది. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్కు జిరాక్స్ కాపీలా ఉందే.. -
వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్గా రాఖీ సెలబ్రేషన్స్
Rakhi Celebrations At Chiranjeevi House : మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న(ఆగస్టు22)న చిరు పుట్టినరోజు కూడా కావడంతో మెగా కుటుంబంలో అట్టహాసంగా సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్చరణ్, సాయితేజ్ ఇలా మెగా కుటుంబం అంతా ఒకచోట చేరి సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్లు ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : Chiru154 : పూనకాలు లోడింగ్.. అదిరిపోయిన పోస్టర్ ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్ -
చిరు న్యూలుక్ వైరల్.. ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్ .. కారణం అదేనా?
ఫ్యాన్స్ తమ హీరోల విషయంలో చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారన్న సంగతి తెలిసిందే. అంతెందుకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభిమానులు రెచ్చిపోయిన ఘటనలు బోలెడు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ఏ చిన్న విషయమైనా.. ఆయన అభిమానులు ఓ రేంజ్లో స్పందిస్తారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అది పవన్ ఫ్యాన్స్ను ఫీలయ్యేలా చేస్తోందట. ఇటీవల సోషల్మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి అందులో పోస్ట్ చేసే వాటిలో ఏ చిన్న పొరపాటు కూడా వెంటనే వైరల్గా మారి అందరికీ చేరుతోంది. ఇక అందులో కంటెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్న రచ్చ రచ్చ అవుతోంది. అయితే తాజాగా చిరు యంగ్గా కనపడుతున్న ఫోటోను మెగా బ్రదర్ నాగబాబు షేర్ చేయగా అది నెట్టింట వైరల్గా మారి తెగ హల్చల్ చేస్తోంది. అసలు చిక్కు ఈ ఫోటోతోనే వచ్చింది. ఆ ఫోటోలో.. చిరంజీవిని మధ్యలో ఉంచి చుట్టూ మెగా హీరోలని ఉంచాడు. ఆ పిక్కి కామెంట్ పెట్టిన నాగబాబు.. ఈ పిక్లో ఉన్న మెగా హీరోలు అందరిలో కెల్లా మీరే యంగ్గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా’’ అంటూ చిరు పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే నాగబాబు షేర్ చేసిన ఈ ఫొటోలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడు . దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. కాగా పవన్ అభిమానులు ఈ అంశంపై సోషల్మీడియాలో నాగబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. మరికొందరు మాత్రం నాగబాబు మనసులో తన తమ్ముడు కూడా ఇంకా యంగ్గా ఉన్నాడని భావిస్తున్నట్టున్నాడు అందుకే ఫొటో మిస్ చేశాడేమో అని కామెంట్స్ పెడుతున్నారు. -
MAA Elections 2021: బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్ డేట్ రాకముందే ఫిల్మ్ సర్కిల్ ప్రచారాలు ఊపందుకున్నాయి. మరోవైపు సినీ ప్రముఖులు తమకు నచ్చి అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక మా ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత కాక పెంచాయి. ‘టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు, వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో 'మా'కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా*అని బాలయ్య ప్రశ్నించారు. ఇప్పటివరకు 'మా'కు శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదు? అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఓ తెలుగు న్యూస్ చానల్కి ఇచ్చిన ఇంటర్వూలో మా బిల్డింగ్ వ్యవహారం గురించి ప్రస్తావించిన నాగబాబు ‘గతంలో మురళీ మోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ నుంచి మా బిల్డింగ్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఎవరూ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అందుకే చాంబర్లోని చిన్న ఆఫీస్ రూమ్లో మా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి గతంలో పని చేసిన ప్రెసిడెంట్లు అందరూ బాధ్యులే' అని చెప్పుకొచ్చారు. అలాగే పోటీ నుంచి తప్పుకుంటానని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ‘మంచు విష్ణు ఎన్నికల నుంచి తప్పుకుంటానడం సరైన నిర్ణయం కాదు. ఆయన పోటీలో ఉండాలి. జనాలను బెదిరించినప్పుడే ఏకగ్రీవాలు అవుతుంటాయి. మంచు విష్ణు ఎందుకు తప్పుకోవాలి? అతడిని నేను స్వాగతిస్తున్నా. ‘మా’కోసం విష్ణు బిల్డింగ్ కడతాను అన్నారు.. ఆ స్థలం ఎక్కడ ఉందో.. ఎక్కడి నుంచి తెస్తారో చెబితే బాగుండేది’అని నాగబాబు అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్కి ఎందుకు మద్దతు ఇస్తున్నారో కూడా ఆయన వివరించారు. ‘చాలా రోజుల క్రితమే ఆయన నన్ను కలిసి ఈ విషయం చెప్పారు. బిజీ ఆర్టిస్టుగా మీరు ‘మా'కు సమయం కేటాయించగలరా అని అడిగాను. దానికి ఆయన తప్పకుండా ఇస్తాను అని చెప్పారు. ఆయనకు సౌత్ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వాలతో పరిచయాలు ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలో మూడు గ్రామాలను దత్తత తీసుకొని సాయం అందిస్తున్నారు. మా బిల్డింగ్ కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అందుకే ఆయన విజయానికి నా వంతు కృషి చేస్తా' అని నాగబాబు అన్నారు. -
‘నాన్నకు ఆ ఒక్క విషయం తెలియదు!’ నిహారిక వీడియో వైరల్
మెగా బ్రదర్ నాగాబాబు, మెగా డాటర్ నిహారికలు తాజాగా ఓ ప్రకటనలో నటించారు. ఆన్లైన్ బ్యాంకింగ్పై అవగాన కల్పిస్తూ ప్రమోట్ చేసిన ఈ ప్రకటన వీడియోను తాజాగా నిహారిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో తండ్రికూతుళ్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చెబుతూ ఈ ప్రకటనను ప్రమోట్ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇందులో నిహారిక తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోతో ఈ వీడియో ప్రారంభం మొదలవుతుంది. ఆ తర్వాత నిహారిక తండ్రి నాగబాబు గురించి చెప్పుకొస్తుంది. ఆమె చిరు నవ్వులు చిందిస్తూ ‘చిన్నప్పటి నుంచి నాన్న నాకు రక్షణ కవచంలా ఉన్నారు. నటుడిగా, రైటర్గా, నిర్మాతగా ఆయన నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. జీవితంలో అన్ని పాత్రలను ఆయన విజయవంతంగా పోషించారు. ఒక్క ఆన్లైన్ ట్రాన్స్యాక్షన్ తప్పా’ అంటూ ఈ ప్రకటన సాగుతుంది. ఇక నాగబాబు ఇందులో ట్రాన్స్యాక్షన్ ఎలా చేయాలో తెలియక నిహారికను అడుగుతాడు. దీంతో ఆమె నవ్వుతూ.. ఇంకా ఈ అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదని, మీ దగ్గర వాళ్ల ఫోన్ నంబర్స్ ఉన్నాయా? అది చాలు అంటూ ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ గురించి ఇద్దరూ ప్రమోట్ చేశారు. కాగా నిహారిక గతేడాది డిసెంబర్ 9న చైతన్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే వృత్తిపరంగానూ ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత ఓ వెబ్సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక..ఇటీవలె ఓ సినిమాకి కూడా సైన్ చేసిందని సమాచారం. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
బ్రదర్స్ డే : అరుదైన ఫోటోను షేర్ చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలసిందే. సోమవారం బ్రదర్స్ డే సందర్భంగా చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్తో దిగిన ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తోడబుట్టిన బ్రదర్స్కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్కి హ్యాపీ బ్రదర్స్ డే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో పవన్ కల్యాణ్ను చిరంజీవి ఎత్తుకోగా, పక్కనే నాగబాబు ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చిరు పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ ఫోటోకు వేలల్లో లైకులు కురిపిస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి, Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P — Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021 చదవండి : మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా? -
నాగబాబు అరుదైన ఫోటో.. ఆర్జీవీ ఫన్నీ వీడియో
మథర్స్డే సందర్భంగా అమ్మ, నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఫోటో చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఓ ఫన్నీ వీడియోని షేర్ చేస్తూ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మథర్స్డే సందర్భంగా తల్లితో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్. నల్ల చీర అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
బ్లడ్ బ్రదర్ మృతి: చిరంజీవి, నాగబాబు ఎమోషనల్
తమను ఆరాధించే అభిమానులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు మెగా హీరోలు. వారికి ఎలాంటి కష్టమొచ్చినా సాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. గతంలో పలుమార్లు ఫ్యాన్స్ను ఆదుకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా వుంటే తాజాగా చిరంజీవిని ఎంతగానో ఇష్టపడే వీరాభిమాని ప్రసాద్రెడ్డి తుది శ్వాస విడిచాడు. చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలను నడిపించిన ఆయన ఇక లేడన్న విషయం తెలిసిన మెగా హీరోలు సోషల్ మీడియా ద్వారా అతడికి సంతాపం ప్రకటించారు. 'నా బ్లడ్ బ్రదర్స్ ప్రసాద్ రెడ్డి, వెంకటరమణ కరోనా బారిన మరణించారన్న వార్త నా హృదయాన్ని కలిచివేసింది' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఎంతో కాలంగా అభిమానులు, అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్ కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డి గారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి,ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/m2GxwqSjQA — Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021 ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఇన్స్టాగ్రామ్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఊహ తెలిసినప్పటి చిరంజీవి అన్నయ్య అభిమానిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదాలు లేకుండా వ్యవహరించేవాడని అతడి గొప్పతనాన్ని వివరించాడు. మన కులం - అభిమాన కులం... మన మతం - సేవామతం.. అని నిస్వార్థంగా పని చేశాడని చెప్పుకొచ్చాడు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తమ్ముడు ప్రసాద్రెడ్డి మరణం కలచి వేసిందని ఉద్విగ్నతకు లోనయ్యాడు. వ్యక్తిగతంగా కూడా ప్రసాద్ ప్రతి చిన్న విషయాన్ని తనతో పంచుకునేవాడని గత జ్ఞాపకాల స్మృతులను తడుముకున్నాడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ... అతని భార్య, పిల్లలకు తాము, తమ అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) మరోవైపు సాయిధరమ్తేజ్ సైతం ప్రసాద్ రెడ్డి ఆకస్మిక మరణంపై స్పందించాడు. మెగా ఫ్యాన్స్కు ఓ మూలస్థంభం లాంటి వ్యక్తిని కోల్పోయాం. అతడి ఆత్మకు శాంతి కలగాలి. ఈ కష్ట సమయంలో ఆ దేవుడు వారి కుటుంబానికి మనోబలాన్ని అందించాలి.. అని ట్వీట్ చేశాడు. We have lost another strong pillar in our #MegaFans .May his soul rest in peace. Strength to the family during this tough times. RIP Prasada Reddy garu. pic.twitter.com/sE0e0DSf4c — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 20, 2021 Really saddening to hear about the loss of our very own Prasad Reddy garu. Thank you for all the unconditional love you have showered upon us!🙏🏽 May God give him eternal rest and strength to the family. Rest in peace. pic.twitter.com/pq2Vr9ArgN — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) April 21, 2021 చదవండి: రెమిడెసివిర్ అడిగిన దర్శకుడు: ఊహించని స్పందన ‘షాక్’ ఇచ్చిన దర్శకుడితో రవితేజ సినిమా! -
వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట
లాక్డౌన్ సమయంలో రానా, నితిన్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలంతా ఓ ఇంటి వాళ్లయ్యారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్లు నిలిచిపోవడంతో ఖాళీగా దొరికిన సమయాన్ని జీవిత భాగస్వామికి కేటాయించారు. కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటే.. మరికొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఈ యంగ్ హీరోలతో పాటు.. కాజల్, నిహారిక లాంటి హీరోయిన్లు సైతం లాక్డౌన్ సమయంలోనే వివాహం చేసుకున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి అయిన మరుక్షణం నుంచి అందరి దృష్టి మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్లపై పడింది. ముఖ్యంగా వరుణ్ పెళ్లి కోసం అయితే మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఓ యంగ్ హీరోయిన్తో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే వరుణ్ తేజ్ మాత్రం పెళ్లిపై ఇంతవరకు స్పందించలేదు. కానీ వరుణ్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కానీ, ఇప్పుడే వద్దంటున్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పాడు. దీంతో వరుణ్ పెళ్లి ఇప్పుడే కాదని అంతా అనుకున్నారు. కానీ తాజాగా వరుణ్ పెళ్లి త్వరలోనే ఉంటుందని పరోక్షంగా ఫ్యాన్స్కు తెలియజేశాడు నాగబాబు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ మెగా బ్రదర్.. తాజాగా ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్తో చిట్చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో జవాబు ఇచ్చాడు. 'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'మంచి సంబంధాలు ఉంటే చూడండి' అని నాగబాబు కామెంట్ చేశారు. 'వరుణ్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్ తోనే లైఫ్ అనుకొని ఆ అమ్మాయినే చేసుకుంటా.. అదే ఫిక్స్ అంటే మీరు ఏం చేస్తారు?' అని మరో నెటిజన్ అడగ్గా.. 'మీకు ఓకే అయితే నేనేమంటా..!' అంటూ వరుణ్ ప్రేమ వివాహం చేసుకున్న అభ్యంతరం లేదని హింట్ ఇచ్చాడు. నాగబాబు సమాధానంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. చదవండి: ఆయన లేకపోతే జాతిరత్నాలు లేదు అప్పులు చేశా.. నాపై నాకే కోపం వచ్చింది : మంచు విష్ణు -
సీఎం జగన్కు ధన్యవాదాలు: నాగబాబు
హైదరాబాద్: కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమపై వరాలు కురిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నటుడు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. సీఎం తన నిర్ణయంతో లాక్డౌన్ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చొరవతో మూవీ ఇండస్ట్రీకి జవసత్వాలు చేకూరుతాయన్నారు. ఈ మేరకు నాగబాబు ట్వీట్ చేశారు. కాగా థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని తెలిపింది. దీంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: సినీ పరిశ్రమకు ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం) బిగ్ థాంక్యూ: మహేష్ బాబు ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం హర్షణీయం! విపత్కర సమయంలో ఇలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి బిగ్ థాంక్యూ. తెలుగు సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవంతో వెలిగిపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి. సినిమా మళ్లీ ట్రాక్లో పడుతోంది’’ అని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల సూపర్స్టార్ మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు: పూరి జగన్నాథ్ ‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా లబ్ది చేకూరుతుంది. ఇలాంటి గొప్ప నిర్ణయం వల్ల కోవిడ్ మహమ్మారితో చితికిపోయిన పరిశ్రమ తిరిగి నిలదొక్కుకుంటుంది’’ అని టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు. ఇక మంచు మనోజ్.. సరైన సమయంలో స్పందించి వరాల జల్లు కురిపించిన జగనన్న చొరవ, నాయకత్వం అమోఘం అని పేర్కొన్నారు. #CinemaRestartPackage... A commendable move by our hon'ble CM @ysjagan! A big thank you to the Government of AP for bringing in these relief measures during these challenging times which will help restructure and restart our Telugu film industry! Cinema is back on track! 👍👍👍 — Mahesh Babu (@urstrulyMahesh) December 19, 2020 We sincerely thank Honourable CM of #AndhraPradesh Shri @YSJagan for the Restart Package which will lead to help many families depending on our Film Industry. Most affected industry by the #covid pandemic is going to bounce back with this great support. 🙏🙏🏽🙏🏽 — PURIJAGAN (@purijagan) December 19, 2020 There is no need to look beyond @YSjagan anna for compassionate leadership and timely intervention during this pandemic. Timely #cinemasrestartpackage goes long way for the exhibitors and at the right time when theatres just about to open. pic.twitter.com/xN5VjwsQfy — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 19, 2020 -
నాగబాబుకు కరోనా పాజిటివ్
మెగా బ్రదర్, నటుడు, నిర్మాత నాగబాబుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "ఓ వ్యాధి వచ్చిందని ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మలుచుకోవచ్చు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. త్వరలోనే దీన్ని జయించి ప్లాస్మాదాతగా మారుతాను" అని చెప్పుకొచ్చారు. (చదవండి: వైభవంగా నిహారిక నిశ్చితార్థం) ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు నాగబాబు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. దర్శకుడు మారుతి సైతం ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు "మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చారు. కాగా టాలీవుడ్లో దర్శకుడు రాజమౌళి కుటుంబం, డైరెక్టర్ తేజ, సింగర్లు సునీత, మాళవిక, స్మిత, నటులు రవికృష్ణ, నవ్య స్వామి, పార్వతి సహా పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో చాలామంది ప్లాస్మా దానం కూడా చేశారు. (చదవండి: కరోనా : సీనియర్ జర్నలిస్టు, నటుడు మృతి) ."An Infection doesnt always has to be a Suffering, You can always transform it into an opportunity to help the fellow Beings". Tested Covid-19 +ve. Will Scuffle & Strife through this and Will be a Plasma Donor.#covidwarrior #plasmadonor pic.twitter.com/2EeZItJ4ub — Naga Babu Konidela (@NagaBabuOffl) September 15, 2020 -
నాగబాబు కుమార్తె నిహారిక ఎంగేజ్మెంట్ కొత్త ఫోటోలు
-
నిహారిక ఎంగేజ్మెంట్: వైరల్ వీడియో
నటి, నాగబాబు ముద్దుల తనయ నిహారిక- బిజినెస్మేన్ చైతన్యల ఎంగేజ్మెంట్తో కొణిదెల వారింట సందడి నెలకొంది. మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నిహారిక నిశ్చితార్థ వేడుకలోని కొన్ని అన్సీన్ మూమెంట్స్ని పంచుకున్నారు. కాబోయే వధూవరులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల మీడియాలో వైరల్ అవుతోంది.(డియర్ చై.. నీ ప్రేమను తనపై కురిపించు: నాగబాబు) ఈ క్రమంలో నిహారిక- చైతన్యల జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నిహారిక నిశ్చితార్థం గుంటూరుకి చెందిన పోలీస్ ఆఫీసర్ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఫంక్షన్కు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర తారాగణం సతీమేతంగా హాజరయ్యారు. వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా మెగా కుటుంబ ఆడపడుచులు, మరికొందరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు
సాక్షి, అమరావతి : వరుస వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న నటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకూల పత్రికలను టార్గెట్గా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ జెండాను, అజెండాను మోస్తున్న కొన్ని తెలుగు వార్తా ఛానల్స్ చూస్తుంటే ముచ్చటేస్తోందని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారికి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని, అవసరం తీరాక బోడి మల్లయ్య అనే ఇలాంటి వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డినే కరెక్టని అభిప్రాయపడ్డారు. ఆయన ఎవరిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారో స్పష్టంగా చెప్పనప్పటికీ చంద్రబాబు నాయుడుని పల్లకిలో మోస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ని టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. (సీఎం జగన్కు ధన్యవాదాలు: రాజమౌళి) ‘టీడీపీ జెండాని, అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు ఛానల్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, ఆ పార్టీ పట్ల వాళ్లకున్న అనురాగం, చంద్రబాబు నాయుడు మనోడే అన్న అభిమానం, చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం. వారికి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా మీడియా చూపిస్తున్న తెగువ, బాబుగారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు.. వావ్ ఇదీ అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే..శభాష్. ఒక్కోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది.’ అని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
బాలయ్య నోరు అదుపులో పెట్టుకో: నాగబాబు
సాక్షి, హైదరాబాద్ : వివాదాదస్పద ట్వీట్లతో ఇటీవల తరచుగా విమర్శలను ఎదుర్కొంటున్న సినీనటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎవరూ ఊహించని విధంగా ఈసారి నందమూరి బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. బాలయ్య నోటిని అదుపులో పెట్టుకోవాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖుల వరుస భేటీలపై తనకు సమాచారం లేదంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. ‘భూములు పంచుకుంటున్నారంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఇండస్ట్రీ బాగు కోసమే మంత్రితో సమావేశం అయ్యారు. భూములు పంచుకోవడానికి కాదు. సీనియర్ నటుడైన బాలకృష్ణ ఇలా అర్థంలేని విధంగా మాట్లాడం సరికాదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయనేది ఏపీకి వెళ్తే తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా బాలయ్య అవమానించారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి ’అని ఘాటు వ్యాఖ్యలతో విరుకుపడ్డారు. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక విషయానికొస్తే తెలంగాణలో సినిమా షూటింగ్స్కు అనుమతులు కల్పించాలంటూ టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తోనూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్కు బాలకృష్ణ వచ్చారు. ఈ సందర్భగా సినిమా షూటింగ్స్పై విలేఖరులు ప్రశ్నించగా.. సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదన్నారు. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశానికి తనను ఎవరూ పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా?.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఇదివరకే నిర్మాత సి. కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. తాజాగా నాగబాబు సైతం బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. నాగబాబు వ్యాఖ్యలతో టాలీవుడ్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇది ఎంత దూరం వెళ్తుందనేది వేచి చూడాలి. (బాలయ్య వ్యాఖ్యలపై సి. కళ్యాణ్ వివరణ) -
‘జబర్దస్త్లోకి రావడానికి అతనే కారణం’
బుల్లితెరపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న షో ‘జబర్ధస్త్’. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ షో నుంచి నాగబాబు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. బిజినెస్కు సంబంధించిన ఐడియాలాజికల్ విభేదాల వల్ల బయటకు వచ్చినట్టు తన యూట్యూబ్ చానల్ ద్వారా నాగబాబు ఇదివరకే వెల్లడించారు. తాజాగా జబర్దస్త్లో తన జర్నీకి సంబంధించిన మరో వీడియోను ఆయన సోమవారం విడుదల చేశారు. అలాగే మరిన్ని వీడియోలను విడుదల చేయనున్నట్టు చెప్పారు. అసలు జబర్దస్త్ ఇన్ని రోజులు చేయాల్సింది కాదని తెలిపిన నాగబాబు.. ఆ షోకు సంబంధించిన పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు. ‘తొలుత నేను అదుర్స్ ప్రోగామ్ చేశాను. అక్కడ మేనేజర్ ఏడుకొండలుతో మంచి ర్యాపో ఏర్పడింది. నేను మల్లెమాలలోకి రావడానికి అతనే ముఖ్య కారణం. ఆ తర్వాతే నేను శ్యాంప్రసాద్రెడ్డికి ఫోన్ చేశాను. అదుర్స్ తరువాత నన్ను జబర్దస్త్ షోకు జడ్డీగా అడిగారు. తొలుత 25 ఎపిసోడ్స్ అని మాత్రమే చెప్పారు. అయితే ఆ జర్నీ ఇంతకాలం కొనసాగుతోందని ఎవరు అనుకోలేదు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఇది క్రియేటివ్ ఫీల్డ్ కావడంతో.. నేను, రోజా మంచి అండర్స్టాండింగ్తో కలిసి పనిచేశాం. తొలుత నేను 25 ఎపిసోడ్లు అనుకుని వచ్చాను. అయితే అదుర్స్తో పోలిస్తే.. రెండు వారాల్లోనే జబర్దస్త్కు అద్భుతమైన టీఆర్పీలు వచ్చాయి. శ్యాంప్రసాద్రెడ్డి కుమార్తె దీప్తికి ఈ షో భారీ విజయం సాధిస్తుందని చెప్పాను. అప్పటి నుంచి ఈ షో అలా కొనసాగుతూనే ఉంది. నేను ఆపేసిన అది కొనసాగుతుంది. జబర్దస్త్లో తొలుత చేసిన టీమ్ లీడర్లు అందరు నాతో చాలా స్నేహంగా ఉండేవారు. వాళ్ల ట్యాలెంట్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లు షో నుంచి వెళ్లిపోయారు. అయితే వాళ్ల టీమ్ల్లో చేసిన వాళ్ల నుంచే.. కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు. అలా టీమ్ల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ షో ముందుకు సాగింది. జబర్దస్త్ ట్యాలెంట్ అనేది సంవత్సరాల పాటు చేసిన కృషి. ఇందులో చాలా మందికి భాగముంది. తొలుత ఈ కాన్సెప్ట్ చెప్పింది సంజీవ్. ఆయన చెప్పింది కూడా 25 ఎపిసోడ్లు మాత్రమేనని. సంజీవ్ క్రియేటివ్ మైండ్.. అతని దగ్గర నితిన్, భరత్ పనిచేసేవాళ్లు. వాళ్లు ఒక్కోసారి సంజీవ్ లేకపోయినా.. షోని వాళ్ల భుజాలపైన వేసుకోని నడిపించారు. అలా నితిన్, భరత్ వచ్చారు. తర్వాత సంతోష్ అనే అతను కూడా వచ్చాడు. అలాగే యాంకర్గా అనసూయ కొన్ని కారణాల వల్ల దూరం కావడంతో.. రష్మి జబర్దస్త్లో వచ్చింద’ని నాగబాబు తెలిపారు. జబర్దస్త్లో తన అనుభవాలకు సంబంధించిన ఇంకో వీడియోను రేపు పోస్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రచ్చ రవికి జరిగిన యాక్సిడెంట్ను ప్రస్తావించనున్నారు. -
పవన్ కల్యాణ్ ఐటీ డిగ్రీ హోల్డర్ : నాగబాబు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామాలపై నాగబాబు ఆవేదన చెందుతూ.. తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎందుకూ పనికి రాని వారిగా క్రియేట్ చేస్తున్నారని.. తల్లిదండ్రులను, కమర్షియల్గా మారిన ఎడ్యుకేషనల్ సిస్టమ్పై ఫైర్ అయ్యారు. అయితే ఈ వీడియోలో నాగబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారని, ఇద్దరు సిస్టర్స్లో ఒకరు ఎంబీబీఎస్, మరోకరు డిగ్రీ పూర్తి చేశారని, పవన్ కల్యాణ్ ఇంటర్ తరువాత ఐటీలో డిగ్రీ హోల్డర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఏనాడు తమ తల్లిదండ్రులు చదువు విషయంలో ఒత్తిడి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోలో పవన్ ఐటీ డిగ్రీ హోల్డర్ అని చెప్పిన విషయంపైనే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒక్కో ప్రచార సభలో ఒక్కో విధంగా తన విద్యాభ్యాసం గురించి చెప్పిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు. అయితే గతంలో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమెండేషన్తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో.. వేరే గత్యంతరం లేక ఎమ్ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పారు. ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్కు వెళ్లానని వివరించాడు. తాజాగా నాగబాబు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘ ఐ క్లియర్డ్ మై ఎల్ఎల్బీ.. మద్రాసు బార్ కౌన్సిల్లో రిజిష్టర్ చేయించాను. చిరంజీవి గారు డిగ్రీ పాస్ అయ్యారు. ఇద్దరు చెల్లెల్లో ఒక చెల్లి ఎంబీబీఎస్, మరో చెల్లి డిగ్రీ చదివింది. కల్యాణ్ బాబేమో అదర్ దెన్ హిజ్ ఇంటర్మీడియట్.. తను కొన్ని ఐటీ సబ్జెక్ట్స్ పూర్తి చేసి.. ఐటీ డిగ్రీ హోల్డర్ అతను’ అంటూ వీడియోలో తెలిపారు. అయితే పవన్ కల్యాణ్ ఐటీ డిగ్రీ హోల్డర్ అని నాగబాబు అనడంతో మళ్లీ చర్చ మొదలైంది. చదవండి : ఇంతకీ పవన్ ఏం చదివాడబ్బా!? -
నాగబాబుకు షాక్ ఇచ్చిన బన్ని..!
నరసాపురం ఎంపీగా జనసేన నుంచి బరిలోకి దిగిన నాగబాబుకు షాక్ తగిలింది. నాగబాబు తరుపున ఆయన కుటుంబం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. వరుణ్తేజ్, నిహారిక, భార్య పద్మజ నాగబాబు తరుపున ప్రచారంలో పాల్గొంటూ ఉండగా.. మిగతా మెగా హీరోలు కూడా వస్తారని అనుకున్నారు. దీనిలో భాగంగానే.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నాగబాబును సపోర్ట్ చేస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వినిపించాయి. నాగబాబు భార్య పద్మజ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బన్నీ ప్రచారానికి వస్తారని తెలిపారు. దీంతో బన్నీ ప్రచారంలో వస్తున్నాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ అంతలోనే బన్ని ఒకే ఒక్క ప్రకటనతో అందరికీ షాక్ ఇచ్చారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా.. తన మద్దతు నాగబాబుకు ఉంటుందని ఓ ప్రకటనను విడుదల చేశారు. తాను ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా.. మోరల్గా ఎప్పుడూ తన వెంట ఉంటామని.. మా సపోర్ట్ తనకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసుకుంటామని ఆశించిన బన్నీ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే మరో వైపు.. బన్నీ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణముందని, అందుకే ఒకే ఒక ప్రకటనతో చేతులు దులుపుకున్నారని టాక్ వినిపిస్తోంది. BEST WISHES pic.twitter.com/65HonIrB3c — Allu Arjun (@alluarjun) 6 April 2019 -
‘లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ ఏపాటిది’
సాక్షి, పశ్చిమ గోదావరి : లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ కామెడీ ఏ మాత్రం సరిపోదని జనసేన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు ఎద్దేవా చేశారు. గురువారం తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ అవినీతి పరులను నడిరోడ్డులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మానసిక స్థితి సరిగాలేదని ఆరోపించారు. ఆయన పరిస్థితే బాగా లేదంటే ఆయన కొడుకు లోకేష్ సినిమాల్లో రేలంగిలా తయారయ్యాడంటూ ఎగతాళి చేశారు తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఈలి నాని నవ్వుతూ ఉంటాడే తప్ప ఏ పనీ చేయ్యడని ఆరోపించారు. టీడీపీ నేతలు మట్టి తినేస్తున్నారంటే కొన్ని రోజుల్లో మనుషుల్ని కూడా తినేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు అవకాశం వస్తే ఒక ఎంపీ ఏమేమీ చేయగలడో అవన్ని చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. -
సొంతూరును పట్టించుకోని ‘చిరు’ బ్రదర్స్
సాక్షి, నరసాపురం : ‘పేరుకే పెద్ద మనుషులు కాని వారివి చాలా చిన్న మనసులు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరుకు ఏదో చేయాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది కాని ఈ మెగా ఫ్యామిలీ మాత్రం సొంతూరును పట్టించుకోలేదు. మీ గుర్తుగా ఊరిలో గ్రంథాలయం కాని, ప్రభుత్వ ఆసుపత్రి కాని నిర్మించుకునేందుకు సొంతింటిని ఇవ్వాలని గ్రామస్తులు కోరినా పెడచెవిన పెట్టి డబ్బు కోసం ఇంటిని అమ్ముకున్న చరిత్ర వీరి సొంతం..’ మెగా ఫ్యామిలీ మొత్తానికి నరసాపురంతో పాటుగా జిల్లా మొత్తం అనుబంధం ఉంది. కానీ జిల్లాపై వారు ప్రేమ చూపిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. దేశంలో ఎంతో మంది ప్రముఖులు తమతమ జీవితాల్లో ఉన్నత శిఖరాలు చేరిన తరువాత జన్మభూమిపై మమకారాన్ని చూపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో కనీసంగా పట్టించుకోకపోవడం గమనార్హం. చిరంజీవి తండ్రి వెంకట్రావుది పెనుగొండ. కానీ అత్తగారి ఊరు మొగల్తూరులో స్థిరపడ్డారు. మొగల్తూరులో ఉండగా చిరంజీవి నరసాపురం మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. నాగేంద్రబాబు కూడా ఇక్కడే పుట్టారు. చిరంజీవి తండ్రి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేయడంతో అనేక ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో ముగ్గురు బ్రదర్స్ మొగల్తూరులో అమ్మమ్మగారి ఇంటి వద్దే ఉండేవారు. చిరంజీవి, నాగేంద్రబాబులకు అయితే ఎక్కువ అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ మొగల్తూరు హైస్కూల్లోనే చదవుకున్నారు. చిరంజీవి డిగ్రీ నరసాపురం వైఎన్ కళాశాలలో పూర్తి చేశారు. తన మొట్టమొదటి నాటకాన్ని వైఎన్ కళాశాలలోని అరబిందో ఆడిటోరియంలో చిరంజీవి ప్రదర్శించారు. కేవలం పుట్టిన ఊరుగానే కాదు మెగా బ్రదర్స్ ఎదుగుదలకు పునాదిపడ్డ ప్రాంతం నరసాపురం. కానీ వారి గుర్తుగా ఇక్కడ ఏమీ ఉండదు. వారు చిత్ర పరిశ్రమలో ఎదిగిన తరువాత ఈ ప్రాంతం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. తీరప్రాంతం కావడం తరచూ అనేక ప్రకృతి విపత్తులు ఈ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. అలాంటి సమాయాల్లో కూడా ఈ ప్రాంతం వారికి గుర్తుకే రాలేదు. మళ్లీ చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తరువాతే ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు. పురిటిగడ్డకు ఏమీ చేయలేదనే విమర్శలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. చిరంజీవి సాయం నిరాకరించిన మొగల్తూరులోని కళాశాల ఇక్కడ కనిపిస్తున్న కళాశాల మొగల్తూరులోనిది. మొగల్తూరు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టి పెరిగిన గ్రామం. నరసాపురం లోక్సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగేంద్రబాబు బాల్యం మొత్తం గడిచింది ఈ గ్రామంలోనే. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చిన్ననాడు తిరుగాడిన నేల ఇది. సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ మెగా బ్రదర్స్కు.. 1988లో స్థాపించిన ఈ కళాశాలకు ఎంతో సంబంధం ఉంది. మూరుమూల తీరప్రాంతం కావడంతో ఇక్కడ కళాశాల స్థాపించాలని నిర్ణయించిన గ్రామ పెద్దలకు ఆర్థికంగా చిక్కులు వచ్చాయి. ఇక్కడ పుట్టి పెరిగి సినీ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి వారికి గుర్తుకు వచ్చారు. కళాశాల స్థాపనకు సహకరించాలని గ్రామపెద్ద అందే భుజంగరావు తదితరులు అనేకమార్లు చిరంజీవిని కలిశారు. నాగేంద్రబాబుకు కూడా విషయం చెప్పి, అన్నను ఒప్పించాలని కోరారు. కానీ కనీసంగా కూడా వారి నుంచి సహకారం రాలేదన్నది అందే భుజంగరావు లాంటి పెద్దల ఆవేదన. దీంతో గ్రామంలోని అందేవారి కుటుంబమే అందే బాపన్న పేరుతో జూనియర్ కళాశాలను స్థాపించారు. తరువాత ఇందులోనే కోట్ల వెంకట రంగారావు డిగ్రీ కళాశాలను కూడా 1994లో ఏర్పాటు చేశారు. అభిమానులు చిరంజీవి పేరుతో గ్రంథాలయం కట్టారు మొగల్తూరు గ్రామంలోకి ప్రవేశించగానే పైన చిరంజీవి బొమ్మతో ఉన్న గ్రంథాలయం కనిపిస్తుంది. అయితే ఈ భవనంలో కూడా చిరు ఫ్యామిలీ సాయం రూపాయి కూడా లేదు. చిరంజీవి అభిమానులు చందాలు వసూలు చేసి ప్రభుత్వ గ్రంథాలయానికి భవనం కట్టించారు. చిరంజీవి బొమ్మ పెట్టుకున్నారు. సొంతూరులో గ్రంథాలయం తమ పేరుపై కడుతున్నారని తెలిస్తే, ఓ మాదిరి వ్యక్తి సైతం తనకు తోచిన సహాయం చేస్తారు. కానీ ఈ విషయంలోనూ తమ దారి అదికాదని నిరూపించారు మెగా బ్రదర్స్. వైఎన్ కళాశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిగ్రీ మూడేళ్లు చిరంజీవి ఇక్కడ చదివారు. నాగేంద్రబాబు సైతం ఇంటర్ ఇక్కడే చదివారు. కానీ కళాశాల అభివృద్ధికి ఎలాంటి సాయం చేసి ఎరుగరు. ఈ కళాశాలలో చదువుకున్న సినీ నటుడు కృష్ణంరాజు, దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి వారు తమతమ పేర్లపై ఒక్కో భవనాన్ని కట్టించి ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా చిరు బ్రదర్స్ కళాశాల అభివృద్ధికి సాయం చేసిన పాపాన పోలేదు. అలాగే ఊరిలో స్నేహితులకు తోడ్పాటు ఇచ్చే విషయంలో కూడా శ్రద్ధ చూపలేదు. సొంత ఊరికి పైసా పెట్టలేదని విమర్శలు రావడంతో చిరంజీవి రాజ్యసభ సభ్యుడైన తరువాత ఎంపీ ల్యాండ్స్ రూ. 5 కోట్లు విడుదల చేయించి మొగల్తూరు మండలం పేరుపాలెంలో రోడ్లు, డ్రెయిన్స్ కట్టించి చేతులు దులుపుకున్నారు. అదే ఎంపీ ల్యాండ్స్ నుంచి వైఎన్ కళాశాలకు రూ. 15 లక్షలు ఇప్పించి విమర్శలను కడిగేసే చిరు ప్రయత్నం చేశారు గానీ జేబులో సొంత రూపాయి మాత్రం తీయనేలేదు. ఇక్కడ కనిపిస్తున్న పెంకుటింటికి మరో చరిత్ర ఉంది. సినీ ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని, దానితో పాటే కోట్లు గడించిన మెగా ఫ్యామిలీకి చెందిన ఇల్లు ఇది. సాక్షాత్తు చిరంజీవి అమమ్మగారి ఇల్లు. ఈ ఇంట్లో ఉండే చిరంజీవి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివారు. ఈ ఇంటిలోనే అద్దం ముందు నిల్చుని డాన్స్లు ప్రాక్టీస్ చేశారు. ఈ ఇంటిలో నుంచే సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. తరువాత మెగాస్టార్గా ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నారు. చిరంజీవి మేనమామకు చెందిన ఇల్లయినా కూడా, ఈ ఇల్లు చిరంజీవి అధీనంలోనే ఉండేది. అయితే చిరంజీవి జ్ఞాపకంగా ఈ ఇంటిని గ్రామంలో ఓ మోడల్గా తీర్చిదిద్దాలని గ్రామస్తులు, అభిమానులు కలలు కన్నారు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వాలని చిరు అండ్ బ్రదర్స్ను అడిగారు. ఈ ఇంటిలో గ్రంథాలయం గానీ, ప్రభుత్వ ఆసుపత్రిగానీ ఏర్పాటు చేస్తామని మీ జ్ఞాపకంగా ఉంటుందని అడిగించారు. కానీ 1999లో కేవలం 1.25 లక్షల రూపాయలకు ఇంటిని వేరే వారికి అమ్మేసుకుని, పురిటి గడ్డలో చిన్నపాటి జ్ఞాపకాన్ని కూడా మిగల్చకుండా కక్కుర్తి చూపింది ఈ మెగా ఫ్యామిలీ. మేనమామ ఇల్లయినా కూడా ఆ సొమ్మేదో చిరు ఫ్యామిలీ చెల్లించి, ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వడానికి ఈ మెగా బ్రదర్స్కు రూ 1.25 లక్షలు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ సొంతూరిపై కూడా పిసరంతైనా మమకారం లేదని నిరూపిస్తోంది ఈ ఘటన. సాయంచేసే మనసు లేదు చిరంజీవికి గాని, వారి సోదరులకు గానీ ఇతరులకు సాయం చేసే మనసు లేదు. నేను దగ్గరి నుంచి గమనించారు. మొగల్తూరులో కళాశాల పెట్టాలని అనుకున్నప్పుడు అనేకసార్లు చిరంజీవిని కలిశాము. అతనితో ఊళ్లో చదువుకున్న వాళ్లని కూడా తీసుకెళ్లేవాడిని. ఒకసారి కృష్ణంరాజుతో కూడా చెప్పించాము. చిన్నవాడు నాగేంద్రబాబుకు కూడా విషయం తెలుసు. సినిమాల్లో అంత ఎత్తుకు ఎదిగారు, ఎవ్వరికీ పైసా సాయం చేయలేదు. సొంత ఊరు, సొంత మనుషులకే ఏమీ చేయని వారు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవ చేస్తారంటే ఎలా నమ్మాలి. – అందే భుజంగరావు, పేరుపాలెం, మొగల్తూరు మండలం ఊరిపై వారికి పెద్దగా ప్రేమ ఉండదు చిరంజీవి, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాము. నేను ఒక సంవత్సరం సీనియర్ని. చిరంజీవి కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ఈ ఊరిని అసలు పట్టించుకోలేదు. పెద్ద స్టార్ అయ్యాడు గానీ, ఈ ఊరిని అభివృద్ధి చేద్దాము, ఇక్కడి వారిని డెవలప్ చేద్దామని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఊరిలో సొంత ఇంటిని కూడా అమ్మేసుకున్నారు. పవన్ కల్యాణ్ పెద్దగా తెలియదు కానీ, నాగేంద్రబాబు కూడా ఇక్కడే తిరిగేవారు. – పువ్వాడ శేషగిరి, మొగల్తూరు మనం గొప్పలు చెప్పుకోవడమే చిరంజీవి నా వద్దే చదువుకున్నాడు. 9, 10 తరగతులప్పుడు నావద్దే చదువుకున్నాడు. వాళ్ల నాన్నకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ రావడంతో వేరే చోటుకు వెళ్లారు. కానీ అమ్మమ్మ ఊరు కావడంతో సెలవులకు ఇక్కడ (మొగల్తూరు)కే వచ్చే వారు. నాగేంద్రబాబు కూడా ట్యూషన్కు వచ్చేవాడు. పెద్ద వాళ్లు అయ్యారు. చిరంజీవిది మొగల్తూరు అని మనం గొప్పలు చెప్పుకోవడమే తప్పిస్తే వారు సొంతూరుకు చేసింది ఏమీలేదు. – పులగండం వెంకటేశ్వరరావు, చిరంజీవికి చదువు చెప్పిన టీచర్ -
‘ఎన్ఆర్ఐ’ని క్లాప్ కొట్టి ప్రారంభించిన అమల
అవసరాల శ్రీనివాస్.. నటుడిగా, దర్శకుడిగా, హీరోగానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న నాయనా రారా ఇంటికి (ఎన్ఆర్ఐ) చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని అమల క్లాప్ కొట్టి మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, మహతి కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ ఈవెంట్కు నాని, అక్కినేని అఖిల్, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అవసరాల హీరోగా.. ‘ఎన్నారై’
దర్శకుడిగానే కాకుండా.. మంచి నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు అవసరాల శ్రీనివాస్. తాజాగా అవసరాల శ్రీనివాస్.. హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ను ప్రకటించారు. నాగబాబు, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 'నాయనా ..! రారా ఇంటికి'( ఎన్ ఆర్ ఐ) అనే టైటిల్తో రాబోతోన్న ఈ చిత్రం.. బుధవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకి, హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. -
బాలయ్యకు అసలు కౌంటర్ రేపే : నాగబాబు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలకృష్ణకు అసలు సిసలు కౌంటర్ రేపు(గురువారం) ఇవ్వబోతున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. గత కొన్ని రోజులుగా బాలయ్యపై ఫేస్బుక్ వేదికగా నాగబాబు చేసిన సెటైరిక్ పోస్ట్లు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తాజాగా బాలయ్యపై తాను ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణాలు చెబుతూ నాగబాబు ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను ఎప్పుడూ బాలకృష్ణను వ్యక్తిగతంగా విమర్శించలేదని, తన ఫేస్బుక్ పోస్టుల్లో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించలేదన్నారు. తమపై గతంలో బాలయ్య చేసిన కామెంట్లపై కూడా ఎప్పుడూ రియాక్ట్ కాలేదన్నారు. పవన్ కల్యాణ్పై బాలయ్య వ్యక్తిగతంగా విమర్శలు చేసినా అన్నయ్యగా తాను ఒక్క మాట అనవద్దా? అని ప్రశ్నించారు. బాలయ్య తెలవదు.. పెద్ద బాలయ్య తెలుసని ఒక్క మాటంటే ఇంత వివాదం చేస్తారా? వ్యక్తిగతంగా విమర్శలు చేయాలంటే 100 చేస్తామని, కానీ అలా చేయడం పద్దతి కాదన్నారు. తన పోస్ట్ల్లో ఎక్కడా బాలయ్య పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. గుమ్మడికాయల దొంగ ఎవరు? మీరేందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. బాలయ్య మెగాబ్రదర్స్పై ఐదు సార్లు నోరు జారి వ్యక్తిగతంగా విమర్శించిన తాము ఏమనలేదన్నారు. 2011లో చిరంజీవీపై బాలయ్య చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. అప్పుడే ఇవ్వాలనుకున్నానని, కానీ తమ అన్నయ్య ఆపారన్నారు. తనకేం పబ్లిసిటీ పిచ్చిలేదని, వివాదాలతో పాపులారిటీ కావాలనుకోవడం లేదన్నారు. ఓ ఆర్టిస్ట్గా తనకు ఉండాల్సిన గుర్తింపు ఉందని, అంతకు మించి అవసరం లేదన్నారు. -
నందమూరి హీరోలు ఆకాశం నుంచి వచ్చారా?
సాక్షి, హైదరాబాద్ : కొణిదెల, నందమూరి వార్ ముదురుతోంది. సోషల్ మీడియాలో బాలయ్యపై నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీ వాళ్లే సూపర్ స్టార్లా ? ఇండస్ట్రీలో మరే స్టార్లు లేరా? అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీని గెలిపించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరో బాలయ్యకు తెలియదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా టీడీపీ వాడుకుని ఇప్పుడు పవన్ ఎవరో తెలియదు అనడం మమ్మల్ని ఎంతగానో బాధించింది అని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ''ఒక సినీ హీరోగా పవన్ కళ్యాణ్ మీకు తెలియకపోతే మాకేమీ ఇబ్బంది లేదు. కానీ అవసరానికి రాజకీయంగా వాడుకుని ఇప్పడు తెలియదు అంటే వాళ్లను ఏమనాలి. బాలయ్య ఎవరో నాకు తెలియదు అంటే రాద్ధాంతం చేస్తున్న నందమూరి అభిమానులు గతంలో బాలయ్య కామెంట్లకు ఏం సమాధానం చెబుతారు. బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు మా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ను స్వాగతించి రాజకీయంగా వాడుకున్నారు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ గెలవాల్సిన సమయంలో సీనియారిటీ ఉన్న నాయకుడని చంద్రబాబును నమ్మి టీడీపీకి పవన్ మద్దతు తెలిపారు. కనీసం ఒక్క సీటు కూడా జనసేన పోటీ చేయకపోయినా టీడీపీ గెలుపుకోసం పవన్ చాలా కష్టపడ్డారు. ఎన్నికల్లో గెలిచాక పవన్ కళ్యాణ్ ఎవరోతెలీదు అనడం ఎంత వరకు సబబు. మీరు అనొచ్చు కానీ, మేము తెలియదంటే కోపమొస్తుందా ? చిరంజీవి ఏమయ్యాడు అంటూ హేళనగా మాట్లాడిన బాలయ్య మాటలను నందమూరి అభిమానులు ఎందుకు ఖండించలేదు. మా బ్లడ్ వేరు మా బ్రీడు వేరూ అంటూ బాలయ్య అంటూ ఉంటారు. నందమూరి హీరోలు ఆకాశం నుంచి వచ్చారా? మీరు మాలాగే మనుషులు తల్లీదండ్రులకు పుట్టినవారే. ఆస్ట్రియాలో బ్లూబ్లడ్ అనే కల్చర్ ఉండేది, వాళ్లే గొప్పవాళ్లు అనే అహంతో ఆ రాజవంశీకులు వ్యవహరిస్తే వాళ్లను ప్రజలు దించేశారు. పేరున్న ప్రతివారు స్టార్లే.. జనాలు మెచ్చుకుంటేనే స్టార్లవుతారు. మా అన్నతమ్ముళ్ల మీద బాలయ్య 6 సార్లు కామెంట్లు చేస్తే, తిరిగి సీరియస్గా కాకుండా ఫన్నీగా కౌంటర్ ఇచ్చా. మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు? నందమూరి వంశీయులు సూర్యవంశీకులా. అమితాబ్ బచ్చన్ను కించపరిచేలా కూడా బాలయ్య మాట్లాడారు'' అంటూ నాగబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మధ్యే బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్పై నాగబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కట్టుకథలు మూటకట్టి ప్రేక్షకుల మొహాన కొట్టొదయ్యా అంటూ వేమన శతకం తరహాలో ఓ కవితనే అందుకున్నారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే నాగబాబు.. పవన్ తనకు తెలియదని బాలకృష్ణ కామెంట్ చేసిన దగ్గర నుంచే ఈ వివాదం మొదలైంది. బాలకృష్ణ గురించి అడిగితే ఆయనెవరో తెలియదని నాగబాబు అనడం, తర్వాత బాలకృష్ణ ఎవరో తెలుసని, ఆయన పాత సినిమాల్లో కమెడియన్ అంటూ ఓ వీడియో పెట్టడంతో, బాలయ్య అభిమానులు సోషల్మీడియా వేదికగా నాగబాబుపై విరుచుకుపడ్డారు. వీటన్నిటికి కౌంటర్గా నాగబాబు ఆదివారం నుంచి కొన్ని వీడియోలు పెడుతూ, తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. -
నాగబాబు పోస్ట్.. బాలయ్య బుల్బుల్కు కౌంటరేనా?
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన మెగాబ్రదర్ నాగబాబు.. తాజాగా ఆయనే లక్ష్యంగా ఫేస్బుక్లో మరో పోస్ట్ చేశారు. ఓ బాలుడు చక్కగా.. ఏ మాత్రం తడబడకుండా దేశభక్తి గీతం ‘సారే జహాసే.. అచ్చా’ ఆలపించిన వీడియోను తన ఫేస్బుక్ పేజీలో పంచుకున్నారు. నాగబాబు ఏ ఉద్దేశంతో పోస్ట్ చేసినప్పటికీ.. మెగా అభిమానులు మాత్రం బాలయ్యకు కౌంటర్గానే అని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య ‘సారే జహాసె అచ్చా’ గీతాన్ని తడబడుతూ పాడి నవ్వులపాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేసింది. బుల్బుల్ బాలయ్య అంటూ ఈ నందమూరి హీరోపై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. దీనికి కౌంటర్గానే నాగబాబు ఈ చిన్నపిల్లోడు పాడిన వీడియో పోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలయ్య ఎవరో తెలియదు, అతనో కమెడియన్ అంటూ చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతుండగా.. తాజా వీడియో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. సోషల్ మీడియా వేదికగా మెగా, నందమూరి అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. -
ఎన్టీఆర్లో ఎస్వీఆర్గా..!
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ఇప్పటికీ కొనసాగుతోంది. లెజెండరీ నటుల పాత్రలో కనిపించే నటీనటుల కోసం చిత్రయూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగేశ్వర రావు పాత్రకు సుమంత్ను తీసుకున్న యూనిట్, తాజాగా ఎస్వీ రంగారావు పాత్రను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు మహానటిలో ఎస్వీఆర్గా నటించిన మోహన్బాబును తీసుకోవాలని భావించారు. కానీ తాజాగా ఆ పాత్రకు మెగా బ్రదర్ నాగబాబును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్లో నాగబాబు నటించడంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. -
అందుకు బాధపడుతున్నా..!
‘‘సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్న టైమ్లో అరవింద్గారు ‘నువ్వు నిర్మాతగా మళ్లీ సినిమా చేయాలి’ అన్నారు. నాకు అవసరమా అనిపించింది. బన్నీ కూడా ‘మీరు సినిమా చేయాలి’ అని అడగ్గానే ఆలోచించా. లగడపాటి శ్రీధర్గారితో ఇదివరకే వర్క్ చేశాను. అప్పటికే బన్నీ సినిమాకు కావల్సినవన్నీ రెడీ చేసుకున్నారు. సో.. నా పని తేలికైపోయింది. మళ్లీ సినిమాలు చేయాలనే ధైర్యం ఇచ్చింది మాత్రం అరవింద్గారే’’ అన్నారు నాగబాబు. అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’వాసు సహనిర్మాత. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నాగబాబు చెప్పిన విశేషాలు. ∙‘ఆరెంజ్’ సినిమాతో నిర్మాతగా వచ్చిన నష్టం కంటే చరణ్కు హిట్ ఇవ్వలేకపోయానని ఎక్కువగా బాధపడ్డాను. ‘మగధీర’ వంటి సూపర్ హిట్ తర్వాత హిట్ ఇవ్వలేదని ఫిల్మ్ మేకర్గా అన్ఫిట్ అని ఫీల్ అయ్యాను. అందుకే నిర్మాణానికి దూరంగా ఉండి సీరియల్స్, షోస్ చేస్తున్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది. ‘ఆరెంజ్’ ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే హిట్ అయ్యేదేమో అని. ∙‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’లో బన్నీ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఫుల్ సీరియస్గా, నిబద్ధతతో ఉండే పాత్ర. తన సీరియస్నెస్ వల్ల కుడా కొంచెం కామెడీ క్రియేట్ అవుతుంది. దాసరిగారి దగ్గర దర్శకుడు వంశీ పనిచేసినప్పటినుంచి తెలుసు. మంచి ఎమోషన్స్తో ప్రేక్షకులకు సినిమాని కనెక్ట్ చేయించగలడు. తన తదుపరి సినిమా కూడా మా కాంపౌండ్లోనే ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు ప్లాన్ ప్రకారం జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే నేను సెట్స్కి వెళ్లాను. అంతా ‘బన్నీ’వాసు చూసుకున్నాడు. సినిమా రిలీజ్ కాకముందే నెగటివ్ టాక్ ప్రచారం చేయడం బాధగా అనిపించింది. అరవింద్గారు, నేను బాగా హర్ట్ అయ్యాం. ∙నా కెరీర్లో ఇది బెస్ట్ ఫేజ్ అనొచ్చు. మా అబ్బాయి వరుణ్ సక్సెస్లో ఉన్నాడు. నిహారిక మంచి రోల్స్తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది. నేను ‘జబర్దస్త్’ షో జడ్జిగా బిజీగా ఉన్నా. ఈ ఫేజ్ ఇలానే ఉండాలనుకుంటున్నా. వరుణ్తో సినిమా ప్లాన్ చేయలేదు. ఫ్యూచర్లో వాడితో సిని మా చేయొచ్చేమో. వరుణ్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకోవడం లేదు. వరుణ్ బయట ప్రొడ్యూసర్స్కి అందుబాటులో ఉండాలి. వరుణ్తో కలిసి యాక్ట్ చేయడం గురించి నిర్ణయించుకోలేదు. ∙రిలీజ్ అయిన మూడు వారాలకే సినిమా డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్లో రావడం వల్ల సినిమాకు ఇబ్బంది ఉండదు. మూడు వారాలకు ఆడియన్స్ అందరూ సినిమా చూసేస్తారు. ప్రస్తుతం సినిమాలకు త్రీ వీక్స్ మించి లైఫ్ ఉండటంలేదు కూడా. ∙ఇండస్ట్రీ న్యూస్ చానెల్స్ని బంద్ చేస్తోంది అని వినపడుతోంది. ఆ ఆలోచన మాకు లేదు. ఇండస్ట్రీకు ఎలాంటి మంచి పనులు చేయాలని డిస్కస్ చేసుకున్నాం. మా ఫ్యాన్స్ను అనవసరమైన విషయాల మీద రియాక్ట్ అవ్వొద్దని చెబుతున్నాం. ప్రతి ఒక్కరు పబ్లిసిటీ కోసం వాగి, ఆ తర్వాత మీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకొమ్మని సలహా ఇస్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో వాళ్లకే తెలియాలి. ∙ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాల్లో ఓ కీ రోల్ చేస్తున్నా. విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ తీస్తున్న సినిమాలో కుడా యాక్ట్ చేస్తున్నాను. -
ఫిల్మ్ ఛాంబర్లో పవన్, నాగబాబు
సాక్షి, హైదరాబాద్ : తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఖండిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలపై పవన్.. తన న్యాయవాదులతో ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ వెంటనే సోదరుడు నాగబాబు రాగా.. మా ప్రెసిడెంట్ శివాజీరాజా, రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, పరుచూరి వెంకటేశ్వరరావు, మెహర్ రమేష్, నరేష్, హేమ తదితరులు ఫిల్మ్ ఛాంబర్కు వచ్చారు. కాసేపట్లో పవన్ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ట్వీటర్ వేదికగా పవన్ గత రాత్రి నుంచి సంచలన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ అభిమానులు భారీగా ఫిల్మ్ ఛాంబర్కు చేరుకుంటుండగా.. మా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరెడ్డి వివాదం.. మొత్తం కుట్రకు సూత్రధారి చంద్రబాబే : పవన్