Narcotics Control Bureau
-
ఇదీ మన సంస్కృతి
డ్రగ్స్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి టీనేజర్స్ని బయటపడేసే ప్రయత్నానికి పయనీర్గా నిలిచింది హైదరాబాద్కి చెందిన పద్నాలుగేళ్ల అమ్మాయి.. డిజిటల్ సేఫ్టీ వెల్నెస్, డ్రగ్స్ ఫ్రీ– వెల్నెస్ ఆన్లైన్ కోర్స్లను డిజైన్ చేసి! వాటికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సర్టిఫికెట్స్నీ అందిస్తోంది! ఆమె పేరు సంస్కృతి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది.డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్ అడిక్షన్.. అందరినీ కలవరపరుస్తున్నా వాటికి వల్నరబుల్గా ఉంటోంది మాత్రం టీనేజర్సే అని గ్రహించింది సంస్కృతి.. తన వాలంటీరింగ్ అనుభవాల ద్వారా, తోటి పిల్లల ద్వారా. వాటి బారిన వాళ్లెందుకు, ఎలా పడుతున్నారు? ఆ ప్రభావానికిలోనై ఎలా ప్రవర్తిస్తున్నారు? అసలా ఊబిలో పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? అని ఆలోచించి, ఓ ప్రశ్నావళిని తయారుచేసి మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు, సామాజిక వేత్తల ముందుంచింది. వాళ్ల చర్చల సారాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో ‘డిజిటల్ సేఫ్టీ వెల్నెస్’, ‘డ్రగ్స్ ఫ్రీ వెల్నెస్’ అనే రెండు ఆన్లైన్ కోర్స్లను డిజైన్ చేసింది. ఫీడ్బ్యాక్ కోసం వంద మంది టీనేజ్ స్టూడెంట్స్కి ఆ కోర్స్ మాడ్యూల్స్ని చూపించింది. కంటెంట్ బాగుంది, కానీ చెప్పే విధానం ఆసక్తికరంగా లేదన్న అభిప్రాయాలు వచ్చాయి. సమీక్షించుకుంటే తనకూ అదొక కౌన్సెలింగ్లా అనిపించింది. టీనేజర్స్కెప్పుడూ ఎదుటివాళ్లు జడ్జ్ చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఆ జంకుతో మనసువిప్పి మాట్లాడరు. అంతేకాదు వద్దన్నదే చేయాలన్న కుతూహలమూ జాస్తే! ఈ కోణంలోనూ ఆలోచించి, మొత్తం కోర్స్ మాడ్యూల్స్ని నిజ జీవిత సంఘటనలకు అన్వయించి చాట్ ఫార్మాట్లో రీడిజైన్ చేసింది. వాటికి ఆన్లైన్ ΄్లాట్ఫామ్ కావాలి కాబట్టి అక్క ప్రకృతి సహాయంతో ‘క్రియేట్ ఎడ్యుటెక్’ అనే వెబ్సైట్ను స్టార్ట్చేసింది. ఈ మొత్తం ప్రక్రియకు ఎనిమిది నెలలు పట్టింది. ఆఫ్లైన్ లోనూ సేవలందించడానికి ‘ఎడిస్టిస్ ఫౌండేషన్ ’ అనే స్వచ్ఛంద సంస్థతో పనిచేస్తోంది సంస్కృతి. యాప్స్ అవసరం లేని ఈ కోర్సులకు మొబైల్ డేటా ఉంటే చాలు. వీటిని పూర్తి చేసినవారికి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు స్కూల్స్, కాలేజీల్లో ఈ కోర్సులు లాంచ్ అయ్యాయి. ఇప్పటివరకు పదివేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కోర్స్లను సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిచాలనేది సంస్కృతి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్స్కి మాత్రం నామమాత్రపు రుసుముంటుందని చెబుతోంది. టీనేజర్స్కి ‘రెసిస్టెన్స్.. రెజిలియెన్స్’ కల్పించడమే ఈ కోర్సుల ముఖ్య లక్ష్యం. డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్స్ అడిక్షన్.. దేన్నయినా అవగాహనతో తిరస్కరించడం మొదటిదైతే, ఆ అడిక్షన్ నుంచి విజయవంతంగా బయటకు వచ్చి, ఆరోగ్యకర జీవితాన్ని గడపడం రెండవది. ఆ వలలో పడకుండా ఉండటమే కాదు, అలాంటి వాతావరణాన్ని వ్యాపించకుండా చూసే బాధ్యతనూ ఎలా తీసుకోవాలో కూడా చేతన కల్పిస్తాయీ కోర్సులు అని చెబుతుంది సంస్కృతి.నేపథ్యం.. అంత చిన్న వయసులో ఆమె చేసిన ఇంత పెద్ద ప్రయత్నానికి ఆమె నేపథ్యం చాలా తోడ్పడింది. అందులో తల్లిదండ్రులు సుమతి(ఐజీ, ఇంటెలిజెన్స్, తెలంగాణ), శ్రీనాథ్ (బిజినెస్మన్), తాతయ్య తిరుపతి రెడ్డి, అక్క ప్రకృతిల పాత్ర ఎంతో ఉంది. ఎలాగంటే.. సుమతి సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నప్పుడు సైబర్ వరల్డ్లో జరుగుతున్న వాటి గురించి ఇంట్లో చర్చించేవారు. వాటికి చెవొగ్గేది సంస్కృతి. అవి అర్థమయ్యీ.. కాక ఆ చిన్నబుర్రలో కలవరం రేపేవి. సైబర్ సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కాస్తున్న పహారా, దానిమీద పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల గురించి అమ్మ ద్వారా తెలుసుకుంది. ఆ ఎన్జీవోల్లో వాలంటీరింగ్ మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎంతోమందిని కలిసింది, మాట్లాడింది. పెద్దవాళ్లు సమస్యల్ని ఎలా చూస్తున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారో పరిశీలించింది. అలా కూతురికి సామాజిక స్పృహను కలిగించి, సామాజిక బాధ్యతనూ తెలియజేసింది సుమతి.నాన్న.. శ్రీనాథ్.. ఐఐఎమ్ అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్. బిజినెస్లో వినూత్న ఆలోచనలను ఆయన ప్రోత్సహస్తున్న తీరు, అందిస్తున్న సపోర్ట్ను గమనించేది సంస్కృతి. కొత్త విషయాలు, సరికొత్త స్కిల్స్ గురించి ఆయన ఆన్ లైన్ లో టీచ్ చేస్తుంటే, కరెంట్ అఫైర్స్ను ‘వాట్–వై–హౌ’ పద్ధతిలో వివరిస్తుంటే శ్రద్ధగా వినేది. వాటన్నిటినీ తన వాలంటీరింగ్లో అమలుచేసేది. అలా తండ్రి ఆంట్రప్రెన్యూర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా ఒంటబట్టించుకుంది సంస్కృతి. తాతయ్య.. ఆంజనేయుడిని పరిచయం చేసి!తిరుపతిరెడ్డి ప్రతిరోజూ మననవరాలికి పురాణేతిహాసాల్లోని ఒక్కో పాత్రను పరిచయం చేసేవారు. ప్రతి పాత్రకు సహానుభూతి, సహాయం చేసే గుణం, జడ్జ్ చేయని తత్వాలను అద్దుతూ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని వర్ణించేవారు. అవన్నీ ఆ అమ్మాయి మనసులో ముద్రపడిపోయాయి. ఆ లక్షణాలతో పాటు, తెగువ, అచీవ్మెంట్, డెడికేషన్ కూడా ఉన్న ఆంజనేయుడు ఆమెకు ఫేవరిట్ అయ్యాడు. ఆ పాత్రలో తనను చూసుకోవడం మొదలుపెట్టింది. చదువుతో పాటు ఆర్ట్, మ్యూజిక్ వంటి కళల్లోనూ సంస్కృతి ప్రతిభ మెచ్చుకోదగ్గది. పోటీల్లో మనవరాలు ప్రైజ్ తెచ్చుకున్న ప్రతిసారి చాకోబార్తో ఆమెనుప్రోత్సహిస్తునే ‘గెలుపు కన్నా కూడా మన పనితో ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నామనే దాని మీద దృష్టి పెట్టాల’ని చెప్పేవారు. ఆ విలువనే తన ఫిలాసఫీగా మలచుకుంది సంస్కృతి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అక్క ప్రకృతి, సైకాలజీ స్టూడెంట్. చెల్లికి మంచి ఫ్రెండ్, గైడ్! సంస్కృతి ఈ కోర్స్లను డిజైన్ చేయడంలో ఆమె సహాయం ఎంతో ఉంది. టెన్త్ బర్త్డేకి అమ్మ, నాన్న ఇచ్చిన గిఫ్ట్నూ సంస్కృతి ఓ టర్నింగ్ పాయింట్గా చెబుతుంది. అదేంటంటే..ఒక నోట్ బుక్లో అమ్మ, నాన్న ‘నీ జీవితం ఈ ఎమ్టీ–బుక్ లాంటిది. నీ గురించి ఎవరూ ఏదీ రాయరు. నువ్వేం నేర్చుకుంటున్నావ్, నీకోసమే కాకుండా, ఇతరుల కోసమూ నువ్వేం చేయగలుగుతున్నావ్ అన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికినప్పుడల్లా ఒక్కో పేజీ ఫిల్ చేయాలి. అలా ఈ పుస్తకం నీ విశిష్ట వ్యక్తిత్వంతో నిండిపోవాలని ఆశిస్తూ అమ్మ.. నాన్న!’ అని రాసిన నోట్. ఈ ఆన్లైన్ కోర్స్ల డిజైన్ ఆ పుస్తకంలోని మొదటి పుటకు శుభారంభమని చెప్పపచ్చు. ఇలాంటి ఇంకెన్నో ప్రయత్నాలతో ముందుకు సాగాలనుకుంటున్న ఆ చిరంజీవికి ఆల్ ద వెరీ బెస్ట్! వై, వై నాట్, వాట్, హూ, వేర్, వెన్ లాంటి ఇంగ్లిష్ డబ్ల్యూసే నా బెస్ట్ ఫ్రెండ్స్. వాటితోనే నా లెర్నింగ్, గ్రోత్, అచీవ్మెంట్! ఏబీసీడీఈ.. అంటే అంబీషస్, బోల్డ్, క్రియేటివ్ అండ్ క్యూరియస్, డిటర్మైండ్, ఎంపథిటిక్గా నన్ను నేను డిస్క్రైబ్ చేసుకుంటాను. శరీర నిర్మాణంలో తేడాలుండొచ్చు కానీ, చేసే పనికి, ప్రయత్నానికి బాయ్స్, గర్ల్స్ అనే తేడా ఉండదని, పదిమందికి మేలు చేయగలగడమే నిజమైన అచీవ్మెంట్ అని చె΄్తారు మా పెద్దవాళ్లు. ఆ స్ఫూర్తితోనే నేనీ కోర్స్లను డిజైన్ చేశాను!’– సరస్వతి రమ, ఫొటోలు @ నోముల రాజేష్రెడ్డి -
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరించండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ముఠా లపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో గురువారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధి కారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ చార్జి సందీప్ శాండిల్యతోపాటు పలువురు పోలీ సు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ....రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాల ను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫ రా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశా లు జారీ చేశారు.రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూ రో పకడ్బందీగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నుంచి సిబ్బందిని అదనంగా బ్యూరోకి కేటాయిస్తామని తెలిపారు. విదేశీయులెవరైనా డ్రగ్ వ్యవహారాల్లో తల దూర్చితే వారిని తిరిగి వారి దేశాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ...నిందితులను పట్టుకోవడంతోపాటు వారికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించాలని సూచించారు. అదనపు సిబ్బందిని కేటాయించడం పట్ల సందీప్ శాండిల్య సంతోషం వ్యక్తం చేశారు.నూతన నేర చట్టాలను పకడ్బందీగాఅమలు చేసేందుకు చర్యలు తీసు కో వాలని డీజీపీ జితేందర్ సూచించారు. క్షేత్రస్థాయి లో నూతన నేర చట్టాల అమలుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డీజీపీ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖాగోయెల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్భగవత్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్సర్లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్సర్లో రూ.10 కోట్ల విలువైన కొకైన్ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
డ్రగ్స్ క్వీన్ బ్లెస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నైజీరియన్ డ్రగ్స్ సిండికేట్లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కింగ్పిన్ డివైన్ ఎబుకా సుజీ దేశంలోని అన్ని మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని దందా నిర్వహించేవాడు. నగరానికి ఒకరిని చొప్పున అంకితమైన డ్రగ్ పెడ్లర్ను నియమించుకునేవాడని, ఈక్రమంలో హైదరాబాద్కు అనోహా బ్లెస్సింగ్ కొరియర్గా వ్యవహరించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇటీవల తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్), సైబరాబాద్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడెషోలాతో సహా ఐదుగుర్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.నకిలీ పాస్పోర్టుతో..2018లో ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చిన బ్లెస్సింగ్.. కొంతకాలానికి బెంగళూరుకు మకాం మార్చింది. హెయిర్ స్టయిలిస్ట్గా పనిచేస్తూ స్థానిక డ్రగ్ పెడ్లర్తో పరిచయం పెంచుకుంది. తొలుత చిన్న మొత్తాల్లో డ్రగ్స్ సరఫరా ప్రారంభించిన ఈమె క్రమంగా సుజీ ఆదేశాల మేరకు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది.పోలీసులకు చిక్కినా తన అసలు గుర్తింపులు బహిర్గతం కాకుండా చూసుకునేది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జోనా గోమ్స్ పేరుతో పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిస్సా దేశం పాస్పోర్టును తీసుకుంది. కేవలం అంతర్జాతీయ సిమ్ కార్డులు, వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరుపుతుండేది. 2019 సెప్టెంబర్ 27న ఒకసారి ధూల్పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.డ్రగ్స్తో 20సార్లు హైదరాబాద్కు..సుజీ సూచనల మేరకు ఆమె నివసించే బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుంది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేదా అప్పటికే నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన డ్రగ్ పార్సిల్ను తీసుకొని హైదరాబాద్కు సరఫరా చేసేదని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20సార్లు నగరానికి డ్రగ్స్ సరఫరా చేయగా.. ఇందులో ఏడు సందర్భాల్లో విమానంలో ప్రయాణించిందని, 13 సందర్భాల్లో రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకుందని ఓ అధికారి తెలిపారు. బ్లెస్సింగ్ తన బ్యాగేజ్లో కొకైన్ దాచి పెట్టి, దాన్ని విమానం ఎక్కేక్రమంలో చెకిన్ లగేజ్లో ఇచ్చేదని, విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల ఉనికి గుర్తించడంలో భద్రతా సిబ్బంది డొల్లతనానికి ఇదొక ఉదాహరణనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చాక ఈ డ్రగ్ పార్సిల్ను లంగర్హౌస్లోని సన్సిటీలో ఉంటున్న ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషి లేదా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అజీజ్ నోహీమ్ అడెషోలాకు అందజేస్తుంది. ఈమె డ్రగ్స్ను నేరుగా వినియోగదారులకు లేదా ఇతర పెడ్లర్లకు విక్రయించేదని, డ్రగ్స్ హైదరాబాద్కు చేర్చిన ప్రతీసారి సుజీ... బ్లెస్సింగ్కు రూ.20 వేలు చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. బ్లెసింగ్కు ఈ డ్రగ్ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే సుజీ పోలీసులకు చిక్కితేనే ఈ కేసు మూలాలు బయటపడతాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. -
డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా, వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్లో కొందరు స్థానికులూ ఉన్నారని, పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విదేశాల నుంచి తెప్పించి... నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్కు వచ్చారు. కొన్నాళ్లు నగరంలోని పారామౌంట్కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది పెడ్లర్స్కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పని చేస్తున్న అనోహ బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్గా ఉంది. ఈమె హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఉన్న పెడ్లర్స్, సెల్లర్స్కు మాదకద్రవ్యాలు సరఫరా చేసింది. ఏడాదిన్నర కాలంలో 20 సార్లు నగరానికి మాదకద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్ను హ్యాండ్బ్యాగ్లో పెట్టుకుని, విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తుంటుంది. ఈ డ్రగ్స్ను నిజాం కాలేజీ విద్యార్ధిగా ఉన్న నైజీరియన్ అజీజ్ నోహీమ్ అడెషోలా, బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న విశాఖ వాసి అల్లం సత్య వెంకట గౌతమ్, అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్లకు పంపిణీ చేస్తోంది. వీళ్లు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాముకు రూ.500 కమీషన్ 2018 నుంచి ఈ దందాలో ఉన్న అనోహ ఆఫ్రికా నుంచి జోయినా గోమెస్ పేరుతో నకిలీ పాస్పోర్టు తీసుకుని వినియోగిస్తోంది. తరచూ బెంగళూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమ్... అనోహ ద్వారా అందుకున్న డ్రగ్స్ను పెడ్లర్స్కు సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాముకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు నైజీరియన్లు ఇతడి బ్యాంకు ఖాతాలోకి రూ.13.24 లక్షల కమీషన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇతడు ఐదు నెలల క్రితమే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె బ్యాంకు ఖాతాలోకీ రూ.2.5 లక్షల కమీషన్ డిపాజిట్ చేయించాడు. ఇతడు గత ఏడు నెలల్లో 2.6 కేజీల కొకైన్ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వరుణ్ కుమార్కు తన వినియోగదారుడైన మధు ద్వారా గౌతమ్తో పరిచయం ఏర్పడింది. అలా ఈ దందాలోకి వచ్చిన ఇతడు నైజీరియన్ల నుంచి గ్రాము రూ.8 వేలకు ఖరీదు చేసి, రూ.12 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా ఆరు నెలల కాలంలో రూ.7 లక్షల వరకు ఆర్జించాడు. నగరంలో 13 మంది... వీరి దందాపై టీజీఏఎన్బీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం హైదర్షాకోట్లోని ఓ అపార్ట్మెంట్పై దాడి చేశారు. అక్కడ ఎబుక, ఫ్రాంక్లిన్ మినహా మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి 199 గ్రాముల కొకైన్, వాహనాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ పెడ్లర్స్ విచారణలో 13 మంది నగరవాసులు తమ నుంచి తరచూ డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు బయటపెట్టారు. వీరిలో బంజారాహిల్స్కు చెందిన బిల్డర్ అనికేత్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వ్యాపారి ప్రసాద్, సినీ నటుడు అమన్ప్రీత్ సింగ్, మాదాపూర్ వాసి మధుసూదన్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా... కొకైన్ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్పై సమాచారం తెలిస్తే 8712671111కు తెలపాలని కోరారు. ఎబుక, ఫ్రాంక్లిన్ సమాచారం అందిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా, సూత్రధారులిద్దరూ నైజీరియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
డ్రగ్స్ వాడటం వన్ వే
డ్రగ్స్ వాడటం అనేది వన్వే లాంటిది. ఒక్కసారి ఆ దారిలోకి వెళ్లి వాటికి బానిసలుగా మారితే తిరిగి వెనక్కి రావడం అనేది చాలా కష్టం’ అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పడే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను నిరోధించడానికే ‘ఎవిడెన్స్ ఈజ్ క్లియర్.. ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్’ (డ్రగ్స్ వాడటంపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. నిరోధంపై దృష్టి పెట్టండి) అనే థీమ్తో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సచిన్ గోర్పడే గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి, హైదరాబాద్ఇతర దేశాల ఏజెన్సీలతోనూ సమన్వయంఎన్సీబీ కేవలం డ్రగ్స్ నిరోధం కోసమే కాకుండా వీటి విని యోగానికి వ్యతిరేకంగా అవ గాహన కల్పించడానికి కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 26 ఎన్సీబీ జోనల్ కార్యాల యాలు ఉన్నా యి. మాదక ద్రవ్యాలు అనేవి మన దగ్గర వరకు వచ్చేశాయి. అనేక మంది విద్యా ర్థులు, కుటుంబాలు, ప్రము ఖులు సైతం వీటి ప్రభావంలో ఉన్నారు. ఈ నేప థ్యంలోనే డ్రగ్ నెట్ వర్క్స్పై నిఘా ఉంచు తున్నాం. దీనికోసం ఇతర దేశాలకు చెందిన ఏజెన్సీల తోనూ సమన్వ యం చేసుకొని పని చేస్తున్నాం. ఆయాదేశాల నుంచి వచ్చే డ్రగ్స్కు సంబంధించిన వివ రాలు తెలుసుకొని కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అమెరికా టు అమెరికా వయా హైదరాబాద్ ⇒ ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేసిన అక్కడ ఏజెన్సీలు రెండు రకాలైన డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఇలా జరిగినట్టు తేల్చాయి. ఆ మాదకద్రవ్యా లను సరఫరా చేసింది హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించి సమాచారం ఇచ్చాయి. వెంటనే అప్రమత్తమై దాడి చేసి అతడిని పట్టుకున్నాం. భారీమొత్తం నగదుతో పాటు డ్రగ్స్ సీజ్ చేశాం. ఇతడికి అవి న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు తేలడంతో అక్కడి ఏజెన్సీలకు తెలిపాం. వారు కొన్ని అరెస్టులు చేయగా...అసలు మూలం అమెరికాలోని న్యూయార్క్ అని తేలింది. దీంతో అమెరికా ఏజెన్సీలు కీలక సూత్రధారిని పట్టుకున్నాయి. డ్రగ్స్ నెట్వర్క్స్ కార్యకలాపాలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.సాంకేతిక పరిజ్ఞానమే పెనుసవాల్⇒ డ్రగ్స్ మాఫియాలు ఇంటర్నెట్, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ వంటివి వినియోగిస్తుండటం పెద్ద సవాల్గా మారింది. అయినా హైదరాబాద్ యూనిట్ సమర్థంగా పనిచేస్తూ గడిచిన రెండేళ్లల్లో 24 భారీ డ్రగ్ నెట్వర్క్స్ను ఛేదించింది. ఈ కేసుల్లో కనీసం 15 నుంచి 20 ఏళ్లు శిక్ష పడుతుంది. ఎన్సీబీకి చిక్కితే బయట పడటం కష్టమనే భావన వినియోగదారులు, విక్రేతలు, సరఫరా దారులకు ఉంది. బయట నుంచి వచ్చే భారీ డ్రగ్ కన్సైన్మెంట్స్తో పాటు ఇక్కడ తయారయ్యే వాటిపై ఎక్కువ దృష్టి పెడతాం. ఫార్మా హబ్గా ఉన్న హైదరాబాద్ దానికి అనుబంధమైన కెమికల్ హబ్గానూ మారింది. ఇవే కొన్నిసార్లు పక్కదారి పట్టి ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్, ఎంఫిథిటమీన్ వంటి డ్రగ్స్ తయారవుతున్నాయి. ఇలా తయారు చేసే రెండు ల్యాబ్స్పై ఇటీవల దాడులు చేశాం.మార్పులు కనిపిస్తే జాగ్రత్త..ప్రధానంగా 12 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే డ్రగ్స్కు అలవాటుపడుతున్నారు. అలాంటి వారితో మాన్పించడం కూడా పెద్ద సవాలే. వీరి ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఎక్కువసేపు ఒంటరిగా గడపటం, బాగా చదివేవారు ఒక్కసారిగా డల్ అయిపోవడం, ముభావంగా ఉండటం, ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడటం చేస్తుంటే అనుమానించి అప్రమత్తం కావాలి. డ్రగ్స్ వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతారనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలి. హైదరాబాద్లో డ్రగ్స్ క్రయవిక్రయాలకు సంబంధించి భారీ గ్యాంగ్స్ లేవు. అన్నిరంగాల్లో ఉన్నట్టే అతి తక్కువ శాతమే సినీరంగంలో డ్రగ్స్ ఉన్నాయి. అయితే దీనిపై అందరూ దృష్టి పెట్టడంతోనే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతోంది.డమ్మీవి పంపి పెడ్లర్స్ను పట్టుకున్నాం⇒ డ్రగ్ పెడ్లర్స్ను పట్టుకోవడానికి ఎన్సీబీ అనేక రకరకాల ఆపరేషన్లు చేస్తుంది. ఇటీవల ఓ కొరియర్ పార్శిల్పై మాకు సమాచారం అందింది. దానిని అడ్డుకొని విప్పి చూడగా అందులో 110 ఎల్ఎస్డీ బోల్ట్స్ దొరికాయి. వీటిని ఎవరు ఆర్డర్ ఇచ్చారో వారిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దీంతో ఆ పార్శిల్లో డమ్మీ బోల్ట్స్ ఉంచి చేరాల్సిన చిరుమానాకు పంపి నిఘా ఉంచాం. దాన్ని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు పెడ్లర్స్ని గతవారం అరెస్టు చేశాం. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు వేరుగా ఉండవచ్చు. అయితే డ్రగ్స్కు మాత్రం అన్ని పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ ‘సే ఎస్ టు లైఫ్... సే నో టు డ్రగ్స్’ అనేది గుర్తుంచుకోవాలి. దీనిపై పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో భారీ ప్రచారం చేస్తున్నాం. -
Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్.. డీఎంకే మాజీ నేత అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారిగా, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ (36)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఎన్సీబీ సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను బ్యూరో ఛేదించడం తెలిసిందే. సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. అతనిపై త్వరలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మూడు దేశాలకు స్మగ్లింగ్ భారత్ నుంచి కొబ్బరి పొడి, మిక్స్ ఫుడ్ పౌడర్లో కలిపిన సూడోఎఫెడ్రిన్ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2023 డిసెంబర్లో ఎన్సీబీకి ఉప్పందించాయి. ఢిల్లీలో సాదిక్కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియాకు తరలిస్తున్న రాకెట్లో సాదిక్ కీలక సూత్రధారిగా తేలాడు. పైరేటెడ్ సీడీల నుంచి మొదలైన దందా సాదిక్ దందా పైరేటెడ్ సీడీలతో మొదలైంది. కెటమైన్ డ్రగ్ను అంతర్జాతీయ మార్కెట్కు స్మగ్లింగ్ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ను అంతర్జాతీయ మార్కెట్లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్కు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది! -
అరేబియన్ సముద్ర జలాల్లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్ర జలాల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను భారత నౌకాదళం స్వా«దీనం చేసుకుంది. సముద్రజలాలపై ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్లోని ఛబహర్ నౌకాశ్రయం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్రజలాల సరిహద్దు(ఐఎంబీఎల్)కు 60 నాటికల్ మైళ్ల దూరంలో భారత్ వైపు వస్తున్న ఒక అనుమానిత చేపల పడవను భారత నావికాదళ నిఘా విమానం కనిపెట్టి వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరవేసింది. అక్కడి నుంచి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి సమాచారం అందింది. వెంటనే నేవీ, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. పీ8ఐ నేవీ విమానం, యుద్ధనౌక, హెలికాప్టర్లు ఆ పడవను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. నౌకను ఎన్సీబీ అధికారులు తనికీచేయగా దాదాపు 3,300 కేజీల మాదకద్రవ్యాలున్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ప్యాకెట్లలో 3,110 కేజీల ఛరస్/హషి‹Ù, 158.3 కేజీల స్ఫటికరూప మెథామ్ఫెటమైన్, 24.6 కేజీల హెరాయిన్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి మొత్తం విలువ గరిష్టంగా రూ.2,000 ఉండొచ్చని ఢిల్లీలో ఎన్సీబీఐ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ అంచనావేశారు. ఆ ప్యాకెట్ల మీద ‘రాస్ అవద్ గూడ్స్ కంపెనీ, పాకిస్తాన్ తయారీ’ అని రాసి ఉంది. మత్తుపదార్థాల ప్యాకెట్లతోపాటు పడవలో ఉన్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్చేశారు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. వీరిని పాక్ లేదా ఇరాన్ దేశస్తులుగా భావిస్తున్నారు. వీరి నుంచి ఒక శాటిటైల్ ఫోన్, నాలుగు స్మార్ట్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. ‘భారత నావికాదళం, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సాధించిన ఈ విజయం మత్తుపదార్థాల రహిత భారత్ కోసం కేంద్రం చేస్తున్న కృషికి నిదర్శనం’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సముద్ర జలాల్లో ఇన్ని కేజీల డ్రగ్స్ పట్టివేత ఇదే తొలిసారి. అంతకుముందు 2023 మేలో కేరళ తీరంలో 2,500 కేజీల మత్తుపదార్థాలను ఎన్సీబీ, నేవీ పట్టుకున్నాయి. -
Narcotics Control Bureau: తమిళ నిర్మాత సూత్రధారిగా డ్రగ్స్ రాకెట్
న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్పై విచారణ చేపట్టినట్లు ఎన్సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్దారాపూర్లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది. -
మత్తు వదిలించేలా..
సాక్షి, హైదరాబాద్ : మత్తు మహమ్మారిని తుద ముట్టించేందుకు ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర యువతపై పంజా విసురుతున్న గంజాయి, డ్రగ్స్ పీడ వదిలించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మత్తుపదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో ఈ ఏడాది నుంచే మత్తు కట్టడిపై ప్రభుత్వం యుద్ధభేరి మోగించినట్టు అయ్యింది. టీఎస్ న్యాబ్ (తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో) డైరెక్టర్గా సందీప్ శాండిల్య బాధ్యతలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే మూడు దశాబ్దాలుగా ఆల్ఫాజోలం మత్తుదందా చేస్తున్న నిందితులను వెలుగులోకి తేవడమే కాదు రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫాజోలం స్వాదీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్శాఖ పక్కా ప్రణాళికలు ఫలించాయి. నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన టీఎస్పీఎస్సీ వరుస పేపర్ లీకేజీలపై కేసుల నమోదు సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరగడంతో దాదాపు సగం సమయం ఎన్నికల కసరత్తు, ఎన్నికల విధుల్లోనే పోలీసులు గడిపారు. ఈ ఏడాదిలో నమోదైన కొన్ని ప్రధాన నేర ఘటనలు ♦ ఫిబ్రవరి 23న వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ ఫస్టియర్ విద్యార్థిని ధరావత్ ప్రీతి సీనియర్ సైఫ్ వేధింపులతో ఆత్మహత్యకు యతి్నంచగా, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27న చనిపోయింది. ♦ ఫిబ్రవరి 17న అబ్దుల్లాపూర్మెట్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి నవీన్ను తోటి విద్యార్థి హరిహరకృష్ణ హత్య చేసి తల, గుండె, చేతివేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేసి, వాటిని తగులబెట్టాడు. ♦ఈ ఏడాదిలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అత్యంత కీలకమైంది. తొలుత టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షపత్రం లీకేజీపై మార్చి 10న టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ ఫిర్యాదుతో తొలుత కేసు నమోదైంది. ఆ తర్వాత వరుసగా అనేక పరీక్షల లీకేజీ బయటపడడంతో ప్రభుత్వం మార్చి 14న హైదరాబాద్ సిటీ అడిషనల్ సీపీ క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సిట్ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ♦ మార్చి 16 సాయంత్రం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 14 మందిని అగి్నమాపకశాఖ సిబ్బంది కాపాడింది. ♦ మార్చి 11న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు తొలిసారిగా నోటీసులు జారీ చేశారు. ♦ దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న 12 మంది సభ్యుల ముఠాను ఈ ఏడాది మార్చి 23న సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ♦ ఒక నైజీరియాతో సహా నలుగురు సభ్యుల ముఠాను మే 7న అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు వారి నుంచి రూ.1.30 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ♦ మే నెలలో కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదేళ్ల కుమారుడు సహా దంపతులు సజీవ దహనం అయ్యారు. ♦ అప్పు తిరిగి చెల్లించే విషయంలో వచి్చన వివాదంతో మలక్పేటలో మాజీ హెడ్నర్స్ అనురాధారెడ్డిని చంద్రమోహన్ మే 15వ తేదీ రాత్రి హత్య చేసి, శరీరభాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్లో 13 రోజులు దాచి, ఆ తర్వాత వాటిని మూసీనదిలో వేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ♦ దేశవ్యాప్తంగా వందలమందిని ముంచిన ఈ–స్టోర్ ఇండియా సంస్థ రూ.1,000 కోట్ల మోసాన్ని మే 30న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ♦ మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మే 31న దండకారణ్యం గెరిల్లా జోన్లో గుండెపోటుతో మరణించారు. ♦ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్పరను పూజారి సాయికృష్ణ రాయితో మోది దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సరూర్నగర్ మండల ఆఫీస్ వెనుక ఉన్న పాత సెఫ్టిక్ ట్యాంక్లో వేసి ఉప్పు, ఎర్రమట్టి నింపిన ఘటన సంచలనం సృష్టించింది. ♦ ఓ మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం నేపథ్యంలో మహబూబ్నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికర్ అహ్మద్పై ఆ కానిస్టేబుల్ దంపతులు జగదీశ్, శకుంతల, మరో వ్యక్తి కృష్ణలు దాడి చేసి అతడి మర్మాంగాలు కోశారు. తీవ్రంగా గాయపడిన సీఐ చికిత్స పొందుతూ మరణించాడు. ♦ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) డిసెంబర్ 6న మచ్చ బొల్లారంలో జరిపిన సోదాల్లో రూ 4.3 కోట్ల విలువైన యాంటీ కేన్సర్ నకిలీ మందులను గుర్తించారు. ♦ డిసెంబర్ 8న సంగారెడ్డి జిల్లాలో టీఎస్ న్యాబ్ సోదాల్లో డ్రగ్ తయారీ కేంద్రాన్ని గుర్తించడంతోపాటు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ♦ఏడాది డిసెంబర్ 14న ఖమ్మం పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.1.22 కోట్ల విలువైన 484 కిలోల గంజాయిని టీఎస్ న్యాబ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ♦ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల ఊబిలో చిక్కిన సిద్దిపేట కలెక్టర్ గన్మన్ నరేశ్ డిసెంబర్ 15న చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో తన సర్వీస్ రివాల్వర్తో కుమారుడు రేవంత్, కుమార్తె రిషిత, భార్య చైతన్యలను కాల్చి, తను ఆత్మహత్య చేసుకున్నాడు. నేర నియంత్రణలో కీలక అడుగులు ♦ఓవైపు పెరుగుతున్న సైబర్ నేరాలు, మరోవైపు రాష్ట్ర యువత భవిష్యత్కు ముప్పుగా మారిన మత్తు మహమ్మారి కట్టడికి ఈ ఏడాదిలోనే కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ), తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు మే 31న ప్రారంభమయ్యాయి. ♦ బస్లో భరోసా పేరిట రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆర్టీసీ బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఈ ఏడాది ఆగస్టు 15న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోణంలో ఇదో నూతన ఆవిష్కరణ. ♦ మొబైల్ ఫోన్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా..తిరిగి గుర్తించేందుకు తెలంగాణ పోలీసుల టెలికమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ (సీఈఐఆర్) యాప్ వాడడం ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించారు. ఈనెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,024 మొబైల్ఫోన్లు గుర్తించి దేశంలోనే నంబర్వన్గా నిలిచారు. ♦ పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఈ ఏడాది మే 20న ‘సాహస్’వెబ్సైట్ను ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ కొరడా.. అనూహ్య బదిలీలు ♦ఎన్నికల విధుల్లో ఉండే పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కొంచెం గట్టిగానే కొరడా ఝుళిపించింది. అక్టోబర్ 9న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన మూడు రోజుల తర్వాత ఏకంగా 20 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఆరోపణలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ♦ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిసిన అప్పటి డీజీపీ అంజనీకుమార్పై ఎన్నికల సంఘం అనూహ్యంగా సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం..పోలీస్శాఖలోని కీలక బదిలీలు వరుసగా జరిగాయి. -
నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డ్రగ్స్ కేసులో భాగంగా తెలుగు నటుడు నవదీప్ని నార్కోటికి అధికారులు విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా పూర్తయిన తర్వాత బయటకొచ్చిన నవదీప్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాల్ని బయపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? నవదీప్ ఏం చెప్పాడు? ఏం జరిగింది? ఈ సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. తాజాగా అతడిని విచారించారు. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. ఇది పూర్తయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నవదీప్ కామెంట్స్ 'డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకు నేను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ అది పదేళ్ల క్రితం విషయం. నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్ని నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరముంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు. అలానే ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులని కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పనిచేస్తోంది' అని నవదీప్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సీరియల్ బ్యాచ్ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!) -
నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు
-
డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నవదీప్ ఇంటికి నార్కోటిక్ పోలీసులు!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అసలేం జరిగిందంటే... మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. చివరిసారిగా గత శనివారం వీరిద్దరు వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. నవదీప్ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు డ్రగ్స్ కేసులో నవదీప్ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అమిత్ షా చేతుల మీదుగా డ్రగ్స్ ధ్వంసం
ఢిల్లీ: దేశంలో ఇవాళ ఓ భారీ పరిణామం చోటు చేసుకుంది. భారీ మొత్తంలో డ్రగ్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ధ్వంసం చేసింది. కేంద్ర హోం మంత్రి వర్చువల్గా బటన్ నొక్కి ఈ కార్యక్రమం ప్రారంభించి.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ధ్వంసాన్ని వీక్షించారు. ఢిల్లీలో ఇవాళ కేంద్రం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ భేటీ నుంచే ఆయన లక్షా 44 వేల కేజీల డ్రగ్స్ను నాశనం చేయడాన్ని ప్రారంభించి.. వీక్షించారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ సుమారు రూ. 2,416 కోట్లు ఉంటుందని తేలింది. ఎన్సీబీ.. యాంటీ నార్కోటిక్స టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ఈ ఆపరేషన్ను చేపట్టింది. అందులో ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ నుంచి 6,590 కేజీలు, ఇండోర్ యూనిట్ 822 కేజీలు, జమ్ము యూనిట్ 356 కేజీలు సీజ్ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే.. అసోం నుంచి 1,468 కేజీలు, ఛండీగఢ్ నుంచి 229 కేజీలు, గోవా నుంచి 25 కేజీలు, గుజరాత్ నుంచి 4,277 కేజీలు, జమ్ము కశ్మీర్ నుంచి 4,069 కేజీలు, మధ్యప్రదేశ్ నుంచి 1,03,884 కేజీలు, మహారాష్ట్ర నుంచి 159 కేజీలు, త్రిపుర నుంచి 1,803 కేజీలు, ఉత్తర ప్రదేశ్ నుంచి 4,049 కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని నాశనం చేఏసినట్లు వెల్లడించింది. #WATCH | #Delhi | Union Home Minister #AmitShah chairs Regional Conference on ‘Drugs Trafficking and National Security’ in New Delhi; over 1,44,000 kilograms of drugs being destroyed in various parts of the country by #NCB, in coordination with ANTFs of all states. (ANI) pic.twitter.com/hE8kblYX6E — Argus News (@ArgusNews_in) July 17, 2023 డ్రగ్స్ రహిత దేశంగా భారత్ను మలిచే క్రమంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ ఆపరేషన్ చేపట్టింది. జూన్ 1,2022 నుంచి జులై 15వ తేదీల మధ్య ఎన్సీపీ అన్ని యూనిట్లు, అన్ని రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ల సమన్వయంతో రూ.9,580 కోట్ల విలువ చేసే 8,76,554 కేజీల డ్రగ్స్ను నాశనం చేశారు. ఇది నిర్దేశించుకున్న టార్గెట్ కంటే 11 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
నేడు అమిత్ షా సమక్షంలో.. 1.44 లక్షల కిలోల డ్రగ్స్ ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విధ్వంసానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సోమవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్షా నేతృత్వంలో నిర్వహించనున్న ‘డ్రగ్స్ స్మగ్లింగ్, జాతీయ భద్రత’ సదస్సులో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎన్సీబీ పరిధిలో పట్టుకున్న 6,590 కిలోలు సహా 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను (రూ.2,416 కోట్లు) ధ్వంసం చేయనున్నారు. దీంతో కలిపి జూన్ 1, 2022 నుంచి జులై 15, 2023 వరకూ రాష్ట్రాల్లోని ఎన్సీబీ, యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ల ప్రాంతీయ యూనిట్లు సమష్టిగా సుమారు రూ.9,580 కోట్ల విలువైన 8.76 లక్షల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశాయి. సోమవారం నాటితో ఏడాదిలో ధ్వంసమయ్యే డ్రగ్స్ మొత్తం 10 లక్షల కిలోలు దాటనుంది. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని సృష్టించడానికి ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం అవలంభిస్తోందని హోంశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఎవేర్ నెస్ ఈవెంట్
-
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో తరలిస్తుండగా..
కొచ్చిన్: భారత సముద్ర జలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.12 వేల కోట్ల విలువైన సుమారు 2,500 కిలోల మెథాంఫెటమైన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్(ఎన్సీబీ) స్వాధీనం చేసుకుంది. కేరళ తీరంలోని భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి ఈ మత్తు పదార్థం ఉన్న 134 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్(ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు. అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా తరలించే డ్రగ్స్ను పట్టుకునేందుకు ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో నేవీ, ఎన్సీబీ కలిసి చేపట్టిన ఆపరేషన్లో ఒక పాకిస్తానీని అదుపులోకి తీసుకున్నామన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి డ్రగ్స్తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్ తీరం వెంబడి పాక్, ఇరాన్ల మీదుగా డ్రగ్స్ను చిన్న పడవల్లోకి పంపిణీ చేసుకుంటూ వస్తోందని చెప్పారు. మట్టన్చెర్రీ వద్ద ఈ ఓడను అడ్డగించినట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్ను చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 3,200 కిలోల మెథాంపెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషిష్ను పట్టుకున్నట్లు తెలిపారు. చదవండి: గగన్యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం -
అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు
న్యూఢిల్లీ: పంజాబ్లోని లూథియానా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సోమవారం పేర్కొంది. ఇద్దరు అఫ్గాన్లు సహా 16 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 60 కిలోల డ్రగ్స్, 31 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ‘‘ఈ ముఠాకు గతేడాది ఢిల్లీలోని షహీన్బాగ్, యూపీలోని ముజఫర్నగర్ల్లో పట్టుబడిన డ్రగ్స్తో సంబంధముంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది’’ అని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు. -
ఆర్యన్ ఖాన్ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
అమిత్ షా సమక్షంలో 40,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా గువాహటి నుంచి వర్చువల్గా డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్లో 1600 కిలోలు, మణిపుర్లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. డ్రగ్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్సీబీ జూన్ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్ను ధ్వంసం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్గఢ్లో పర్యటించిన అమిత్ షా.. 31 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్గా పర్యవేక్షించారు. #WATCH | Union Home Minister Amit Shah conducts a meeting on Drug Trafficking and National Security in Guwahati in the presence of Assam CM Himanta Biswa Saram and Union Minister G Kishan Reddy. pic.twitter.com/yAvXXDvTsn — ANI (@ANI) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
రూ.120 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్లోని జామ్నగర్లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్ను పట్టుకున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్నగర్కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. -
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నాడు ఎన్సీబీ నేడు హెచ్-న్యూ!.. ‘డార్క్ వెబ్–డ్రగ్స్ దందా’ గుట్టు రట్టు
సాక్షి, సిటీబ్యూరో: డార్క్ వెబ్ ద్వారా జరిగే డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి, నిందితులను అరెస్టు చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. సాంకేతిక అంశాలతో ముడిపడిన ఉన్న ఇలాంటి ఆపరేషన్లను దేశంలో ఇప్పటి వరకు కేంద్రం ఆదీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాత్రమే చేసింది. ఇతర ఏ రాష్ట్ర పోలీసులతో సహా ప్రత్యేక విభాగాలు చేపట్టలేకపోయాయి. ఎన్సీబీ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్లు ఎనిమిది ఉండగా... దాని తర్వాత ఆ కేటగిరీలోకి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) చేరింది. ‘డార్క్ వెబ్... క్రిప్టో కరెన్సీ... డెడ్ డ్రాప్’ పంథాలో నెట్వర్క్ నడిపిస్తున్న ఇద్దరు సరఫరాదారులు, ఆరుగురు పెడ్లర్లను గురువారం పట్టుకున్న విషయం విదితమే. 25 మందితో 285కి చెక్... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్–న్యూకు రూపమిచ్చారు. డీసీపీ చక్రవర్తి గుమ్మి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పి.రాజే‹Ù, పి.రమేష్రెడ్డిలతో సహా మొత్తం 25 మందితో ఈ వింగ్ పని చేస్తోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో వివిధ మాదకద్రవ్యాలకు సంబంధించిన 58 కేసులు నమోదు చేసింది. వీటిలో నిందితులుగా ఉన్న స్థానికులు, ఇతర రాష్ట్రాల/దేశాల వారితో కలిపి మొత్తం 285 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాలను హైదరాబాద్కు సరఫరా చేమంటూ పెద్దపెద్ద పెడ్లర్లే చేతులెత్తేసే స్థాయికి చేరింది. దీంతో అనేక మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్రగ్స్ ఖరీదు చేసుకుని రావడం మొదలెట్టారు. ఐదో అంచెలోకి అడుగు.. ఈ విషయం గుర్తించిన హెచ్–న్యూ తన పంథా మార్చింది. స్థానికులు, ఇతర జిల్లాల వారిని పట్టుకుంటే సరిపోదని, డ్రగ్స్ దందాకు పూర్తిగా చెక్ చెప్పాలంటూ పరిధిని మరింత విస్తరించుకోవాలని భావించింది. దీంతో ఇతర రాష్ట్రాల్లోనూ దాడులు చేసి పెడ్లర్స్ను పట్టుకోవడం మొదలెట్టింది. దీనికి తోడు ఈ దందాలో ఉన్న విదేశీయులను డిపోర్టేషన్ ద్వారా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. ఇలా ఇప్పటి వరకు ఐదుగురిని బలవంతంగా తిప్పి పంపింది. ఐదో అంచెలోకి అడుగు పెట్టిన హెచ్–న్యూ అత్యంత క్లిష్టమైన డార్క్ వెబ్పై పట్టు సాధిస్తోంది. దీని ఆధారంగా సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే గురువారం నాటి అరెస్టులు చోటు చేసుకున్నాయి. కొరియర్ సంస్థలతో సమావేశం.. నగరంలో డెలివరీ అవుతున్న మాదకద్రవ్యాల్లో ఎక్కువ శాతం కొరియర్ రూపంలోనే వస్తున్నాయి. ఈ విషయం గుర్తించిన సిటీ పోలీసులు వాటి నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో తమ దృష్టికి వచ్చిన కేసులను వివరించడంతో పాటు స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించనున్నారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉన్న సంస్థలపై చర్యలు తీసుకుంటారు. మరోపక్క ఈ డ్రగ్స్ ప్రధానంగా సౌతాఫ్రికా, డర్బన్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. వీటిని అడ్డుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు, ఇతర విభాగాలతో కలిసి పని చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ సమావేశం జరిగింది. త్వరలో మరో సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఇతర విభాగాలకు అందులో శిక్షణ.. కేవలం డ్రగ్స్ దందాకు మాత్రమే కాదు అక్రమ ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా సహా అనేక అసాంఘిక కార్యకలాపాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇతర విభాగాలకు దీనిపై పట్టు ఉండేలా చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. దీనికోసం హెచ్–న్యూ సిబ్బందికి అదనపు శిక్షణ ఇప్పించడంతో పాటు వీళ్లు అటు టాస్క్ఫోర్స్, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు తర్ఫీదు ఇచ్చేలా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్కు బానిసలుగా మారిన వారికి రీహ్యాబ్ సంస్థల ద్వారా ఐదు దశల్లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 488 మందికి వివిధ దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు -
సమీర్ వాంఖడే కులంపై అనుమానాలు.. క్లీన్చిట్ ఇచ్చిన కాస్ట్ ప్యానెల్
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మాజీ ముంబై జోనల్ డైరెక్టర్, ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంఖడే జన్మతః ఎస్సీ వర్గానికి చెందిన మహర్ కులస్తుడని మహారాష్ట్ర సామాజిక న్యాయ విభాగం శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం అయిన సమీర్ వాంఖడే నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఈ మేరకు క్లీన్చిట్ ఇచ్చింది. సమీర్ వాంఖడే కులంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందిన ఫిర్యాదులపై ముంబై జిల్లా కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ విచారణ జరిపింది. సమీర్, ఆయన తండ్రి ధ్యాన్దేవ్ వాంఖడేలు హిందూ మతం వీడి ఇస్లాం స్వీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. 2021 అక్టోబర్లో ముంబై క్రూయిజ్ షిప్పై వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం సోదాలు జరపడం, డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ సహా పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిన విషయమే. -
షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?
2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ తాజాగా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. చదవండి: అతియా, రాహుల్ పెళ్లి డేట్పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు ఆమె ఎవరెవరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్సీబీ నిందితులు పేర్కొంది. ఇక కోర్టులో ఎన్సీబీ చార్జిషీట్లో చేసిన అభియోగాలు రుజువైతే మాదక ద్రవ్వాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్సీబీ తమ చార్జీషీట్లో.. రియా, ఆమె సోదరుడుతో పాటు ఇతర నిందితలంత మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్య బాలీవుడ్లో డ్రగ్స్ పంపిణీ చేయడానికి, విక్రయించేందుకు ఒక గ్రూప్గా ఏర్పడి డ్రగ్స్ సప్లై చేశారు. చదవండి: డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ! నిందితులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రావాణకు ఆర్థికంగా సహాయం చేశారని, గంజాయి, చరస్, కొకైన్తో పాటు ఇతర మాదకద్రవ్యాలు సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించారని ఎన్సీబీ పేర్కొంది. రియా సోదరుడు సోవిక్ చక్రవర్తి మాదక ద్రవ్యాలు సరఫర చేసే ముఠా తరచూ సంప్రదింపులు చేశాడని తెలిపింది గంజాయి, చరస్ ఆర్డర్ చేసిన అనంతరం ఇతర నిందితుల నుంచి దాన్ని పొందేవాడని, ఎన్డిపీఎస్ చట్టానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి విజి రఘువంశీ ఈ కేసు విచారణను జూలై 27కువ వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబర్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు ఆమె బెయిలుపై బయటకు వచ్చింది. -
అప్పుడు డ్రగ్ తీసుకున్నట్లు ఆర్యన్ అంగీకరించాడు: ఎన్సీబీ
మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్ లభించిన సంగతి తెలిసిందే. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీట్ సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో ఆర్యన్కు ఖాన్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను ఎన్సీబీ పొందుపరిచింది. చదవండి: ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే! అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు ఆర్యన్ ఖాన్ తమ విచారణలో తెలిపాడని ఎన్సీబీ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టు చేసిన 20 మంది 14 మందిపై ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విధితమే. 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్ ఎన్సీబీకి ముందు అంగీకరించినట్లు అభియోగపత్రం వెల్లడిస్తోంది. చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో ఈ చార్జిషీట్లో ఏం చెబుతుంటే.. ‘ఆ సమయంలో తాను నిద్ర సమస్యలతో బాధపడ్డానని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని ఇంటర్నెట్లో పలు కథనాలు చదివినట్లు వాంగ్ములమిచ్చాడు. సరదా కోసం మారిజునానూ కూడా తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. తన ఫోన్లో దొరికిన గంజాయి వాట్సప్ డ్రగ్ చాట్ తానే చేశానని, దోఖా అనే కోడ్వర్డ్తో గంజాయి కొనుగోలు కోసం ఆచిత్తో(ఈ కేసులో మరో నిందితుడు) చాట్ చేశానని ఆర్యన్ ఒప్పుకున్నాడు. అయితే తన ఫోన్ను అధికారికంగా స్వాధినం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్ వివరాలేవి ప్రస్తుత కేసుతో అతనికి సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్సీబీ తమ అభియోగపత్రంలో వెల్లడించింది. -
Drug Case: షారూక్ కొడుక్కు క్లీన్చిట్
ముంబై/న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్ లభించింది. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీటు సమర్పించింది. ఆర్యన్, మరో ఐదుగురి పేర్లను అందులో ప్రస్తావించలేదు. సంజయ్కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపి 14 మందిపై ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. ‘‘ఆర్యన్కు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలేవీ దొరకలేదు. దాంతో అతన్ని, మరో ఐదుగురిని చార్జిషీటు నుంచి మినహాయించాం’’ అని ఎన్సీబీ చీఫ్ ఎస్.ఎన్.ప్రధాన్ చెప్పారు. ఆర్యన్, మొహక్ల దగ్గర డ్రగ్స్ లభించలేదన్నారు. సత్యమే గెలిచిందని ఆర్యన్ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. ఎన్సీబీ తన తప్పిదాన్ని అంగీకరించిందని చెప్పారు. ఆర్యన్కు క్లీన్చిట్పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) హర్షం వ్యక్తం చేసింది. ఆర్యన్ అనుభవించిన మనస్తాపానికి ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్గా కేసులో ప్రాథమిక విచారణ చేసిన సమీర్ వాంఖెడే బాధ్యత వహించాలంది. తప్పుల తడకగా విచారణ జరిపినందుకు వాంఖెడేపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఏం జరిగింది..? ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓడలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో 2021 అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు చేసిన దాడుల్లో ఆర్యన్ఖాన్ దొరికిపోయాడు. ఆర్యన్తో పాటు మొత్తం 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో లింకులున్నాయని ఎన్సీబీ వాదించడంతో ఆర్యన్, అర్బాజ్, దమేచాలను కోర్టు రిమాండ్కు అప్పగించింది. ఆర్యన్ను జైల్లో పెట్టారు. 22 రోజుల తర్వాత వారికి బెయిల్ దొరికింది. కేసు వీగింది ఇందుకే... ► ముంబై క్రూయిజ్లో ఆర్యన్ను అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి మాదకద్రవ్యాలూ దొరకలేదు. పడవలో అరెస్టు చేసిన ఇతర నిందితుల వద్ద లభించిన డ్రగ్స్నే అరెస్టు చేసిన వారందరి దగ్గర నుంచి గంపగుత్తగా లభించినట్టు చూపారు. ఇది ఎన్డీపీఎస్ నిబంధనలకు విరుద్ధం. ► ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించడానికి వైద్య పరీక్షలేవీ చేయలేదు. ► పడవలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడి చేశామంటున్న ఎన్సీబీ వీడియో ఫుటేజ్ సమర్పించలేదు. ► ఆర్యన్ ఫోన్ చాటింగ్స్ ఈ కేసుకు సంబంధించినవి కావు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో అతనికి లింకులున్నట్టు వాటిలో ఆధారాలేవీ లేవు. ► ఎన్సీబీ సాక్షులు విచారణలో ఎదురు తిరిగారు. అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఒకరు, ఆ సమయంలో తాము ఆ పరిసరాల్లోనే లేమని మరో ఇద్దరు చెప్పారు. -
Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు ఎన్సీబీ క్లీన్ చిట్..
Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. చదవండి:👇 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ 12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ -
ఆన్లైన్లో అమెరికాకే ‘మత్తు’
సాక్షి, హైదరాబాద్: ఏవో మందులు, ఔషధాలు అమ్ముతామంటారు.. అవసరమైతే సైకోథెరపిక్ డ్రగ్స్నూ సరఫరా చేస్తామని గాలం వేస్తారు.. ఆన్లైన్లో ఆర్డర్లు, పేమెంట్లు తీసుకుంటారు.. ఫార్మా ఔషధాల ముసుగులో ఏకంగా అమెరికాకే డ్రగ్స్ను పార్శిల్ చేసి పంపిస్తారు.. ఇది ఎక్కడో కాదు.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారం. ఇంటర్నెట్ అడ్డాగా కొనసాగుతున్న నిషేధిత డ్రగ్స్ రవాణా దందాను తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. హైదరాబాద్లోని దోమల్గూడ ప్రాంతానికి చెందిన కీలక సూత్రధారి ఆశిష్జైన్ను ఎన్సీబీ ఢిల్లీ బృందం తాజాగా అరెస్టు చేసింది. ఆశిష్జైన్ జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమెరికాలోని కస్టమర్లకు సైకోథెరపిక్ డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్టుగా తేల్చింది. మూడు రోజుల పాటు ఆశిష్ కార్యాలయం, నివాసంలో సోదాలు చేసి.. కంప్యూటర్లు, ఇతర సామగ్రి, రూ.3.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్సింగ్ తెలిపారు. హైదరాబాద్ టు అమెరికా.. ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా కోసం కొందరు ఉద్యోగులను నియమించుకున్నాడని.. వారితో అమెరికాలోని వినియోగదారులకు మెయిల్స్, మెసేజీలు, ఫోన్లు చేయించి ఫార్మా డ్రగ్తోపాటు సైకోథెరపిక్ డ్రగ్స్ ఆఫర్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కావాలన్న వారి వివరాలు తీసుకుని.. బిట్కాయిన్, క్రెడిట్కార్డు, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా డబ్బు చెల్లించాలని కోరేవాడని వివరించారు. డబ్బు చెల్లించిన కస్టమర్లకు హైదరాబాద్తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి డ్రగ్స్ పార్సిల్ చేసి పంపించాడని తెలిపారు. వెయ్యికి పైగా షిప్మెంట్స్.. ఆశిష్జైన్ ఇప్పటివరకు వెయ్యికిపైగా డ్రగ్ పార్సిళ్లను అమెరికాలోని పలుచోట్లకు పంపినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా ముఠాకు ఆశిష్ జైన్ సూత్రధారి అని గుర్తించినట్టు వెల్లడించారు. అతను ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, అల్ఫ్రాజోలం, డైజోఫాం, లోరాజిపామ్, క్లోనాజిపామ్, జోల్పిడెమ్, ట్రెమడాల్ తదితర సైకోథెరపిక్ డ్రగ్స్ను సరఫరా చేసినట్టు తెలిపారు. ఆశిష్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను ఇంకా దర్యాప్తుచేయాల్సి ఉందని ఎన్సీబీ (ఆపరేషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్సింగ్ చెప్పారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చాడు, దేశంలో ఎక్కడెక్కడ నెట్వర్క్ ఏర్పాటుచేశాడు, ఎక్కడెక్కడి నుంచి రవాణా చేశాడన్న వివరాలను గుర్తించాల్సి ఉందన్నారు. -
యాప్స్తోనే లక్ష్మీపతి నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పుత్రుడై ఉండి.. గంజాయి, హష్ ఆయిల్ దందాతో ‘హష్ నగేశ్’ నెట్వర్క్లో కీలకంగా మారిన వీరవల్లి లక్ష్మీపతి దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. 2020లో మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తర్వాత ‘వర్కింగ్ స్టైల్’ పూర్తిగా మార్చేశాడని.. పకడ్బందీగా హష్ ఆయిల్ దందా నడిపాడని ‘హెచ్–న్యూ’ అధికారులు చెప్తున్నారు. పేరు కూడా తెలియకుండా..: లక్ష్మీపతి మొదట్లో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి సరఫరా చేసేవాడు. మల్కాజ్గిరి పోలీసులకు ఇతడి అనుచరులు చిక్కినప్పుడు వారి వాట్సాప్ డేటా ఆధారంగానే లక్ష్మీపతిని అరెస్టు చేశారు. దాంతో లక్ష్మీపతి తన పంథా మార్చేశాడు. మకాంను కూడా మణికొండ నుంచి హఫీజ్ పేటకు షిఫ్ట్ చేశాడు. ఈసారి ఫేస్బుక్ మెసెంజర్తోపాటు స్నాప్ చాట్, టెలిగ్రాం యాప్స్ వాడటం మొదలెట్టాడు. వాటిలోనూ వివరాలన్నీ హైడ్ చేసి.. కేవలం ‘ఎల్పీ’ అనే పేరు మాత్రమే కనిపించేలా చేసేవాడు. ఎక్కడా ఫొటోలేవీ బయటపడనీయలేదు. కస్టమర్లతోనే బుక్ చేయించి... హైదరాబాద్లో అనేక యాప్స్ వివిధ వస్తువుల పికప్–డెలివరీ సేవలు అందిస్తుండటంతో.. లక్ష్మీపతి వాటిని తన దందా కోసం వాడుకున్నాడు. సోషల్ మీడి యా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకుని, డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. ‘సరుకు’ తీసుకునే వారితోనే పికప్–డెలివరీ సర్వీసు బుక్ చేయించేవాడు. హఫీజ్పేటలోని ఓ ల్యాండ్మార్క్ను పికప్గా.. వారుండే లొకేషన్ను డెలివరీ ప్రాంతంగా బుక్ చేయించి.. సరుకును పంపిస్తాడు. ఇంత జా గ్రత్తగా ఉండటంతో అతడిని గుర్తించి, పట్టుకోవడానికి హెచ్–న్యూ అధికారులు శ్రమించాల్సి వచ్చింది. (చదవండి: లగేజ్ బ్యాగేజ్లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
భోపాల్ స్టడీ... మత్తుకు రెడీ
సాక్షి హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో విద్యాభ్యాసానికి, గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు. ఇటీవల తాము అరెస్టు చేసిన, కౌన్సెలింగ్ చేసిన వారిలో అనేక మందికి భోపాల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో పాటు లోతుగా ఆరా తీస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. బీటెక్లోనే గంజాయికి అలవాటు పడి.. హష్ ఆయిల్ దందాకు సంబంధించిన వారం రోజుల వ్యవధిలో హెచ్–న్యూ అధికారులు.. దంపతులుగా చెప్పుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బోయిన్పల్లి కేసుకు సంబంధించి మదన్ మానేకర్, కొండపనేని మాన్సీలను కటకటాల్లోకి పంపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన మాన్సీ కుటుంబం కొన్నేళ్ల క్రితం వ్యవసాయం కోసం మహారాష్ట్రలోని నాగ్పూర్ శివార్లకు వలసవెళ్లింది. మాన్సీ విద్యాభ్యాసం కొంత మధ్యప్రదేశ్లో సాగింది. భోపాల్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ చదివింది. అప్పట్లోనే గంజాయికి అలవాటు పడింది. నగరంలోని మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో సిటీకి వచ్చి గంజాయితో పాటు హష్ ఆయిల్ సేవించడం, దందా చేయడం మొదలెట్టింది. తన సహోద్యోగులతో పాటు స్నేహితులు, పరిచయస్తులకు గంజాయి, హష్ ఆయిల్ నింపిన సిగరెట్లు అలవాటు చేసింది. విక్రేతగా మారి.. నల్లగొండలో పని చేస్తున్న రిజర్వ్ సబ్–ఇన్స్పెక్టర్ కుమారుడు వి.లక్ష్మీపతి కొన్నాళ్లు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ కోర్సులో చేర్పించినా... మొదటి సంవత్సరం పూర్తికాకుండానే మానేశాడు. దీంతో అతడి తండ్రి భోపాల్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేర్చారు. అక్కడ ఉండగానే గంజాయికి అలవాటుపడిన ఇతగాడు ఆపై విక్రేతగా మారి హష్ ఆయిల్ దందాలోకి దిగి ఈ స్థాయికి ‘ఎదిగాడు’. వీరిద్దరు మాత్రమే కాదు భోపాల్ లింకులతో మరికొన్ని ఉదంతాలు ఇటీవల హెచ్–న్యూ దృష్టికి వచ్చాయి. ఈ విభాగం అధికారులు మాదక ద్రవ్యాల విక్రేతలతో పాటు వినియోగదారులను పట్టుకుంటున్నారు. పదేపదే వినియోగిస్తున్న, మరికొందరికి అలవాటు చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. ఒకటిరెండుసార్లు మాత్రమే వారికి మారే అవకాశం ఇస్తూ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. బయటపడుతున్న లింకులు.. గడిచిన నెల రోజులుగా ఇలా కౌన్సెలింగ్ చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో అనేకమందికి భోపాల్ విద్యాభ్యాసం లింకులు బయటకు వచ్చాయి. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఈ మత్తుపదార్థాలకు అలవాటుపడ్డామంటూ వాళ్లు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై హెచ్–న్యూ ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ మార్గాల్లో భోపాల్లోని విద్యాసంస్థలు, వాటిలోని విద్యార్థుల స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో నగర అధికారులకు కొన్ని కీలకాంశాలు తెలిశాయి. భోపాల్లో విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడి వైద్యుల వద్దకు వస్తున్న మత్తు బానిసల్లో 15 నుంచి 17 సంవత్సరాల వాళ్లూ ఉంటున్నట్లు తెలుసుకున్నారు. క్షుణ్నంగా అధ్యయనం చేయడం కోసం త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్ పంపాలని యోచిస్తున్నారు. ఆ తర్వాతే ఈ అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. మాన్సీ ఫ్యామిలీ మహారాష్ట్రకు వలస వెళ్లగా.. ఆ రాష్ట్రంలోని తుల్జాపూర్ పరిసర ప్రాంతానికి చెందిన మదన్ మానేకర్ కుటుంబం బతుకుతెరువు కోసం నాచారానికి వచ్చింది. ఇతడి స్నేహితుడైన టాటూ దుకాణం నిర్వాహకుడు సోని ద్వారా మాన్సీతో పరిచయమైంది. కొ న్నాళ్లు సోనితో కలిసి ఉన్న మాన్సీ మియాపూర్లో నమోదైన డ్రగ్స్ కేసులో అతడు అరెస్టు కావడంతో మదన్తో కలిసి జీవిస్తోందని, ఇటీవల అతడిని వివాహం చేసుకున్నట్లు చెబుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. (చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి) -
నా ఇంటిపై రెక్కీ: మాలిక్
ముంబై: ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), సంస్థ ఉన్నతాధికారి సమీర్ వాంఖెడేలపై కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈసారి కొత్త ఆరోపణలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు. ‘ గత వారం నేను దుబాయ్లో ఉన్నపుడు ముంబైలో నా ఇంటి వద్ద ఇద్దరు రెక్కీ నిర్వహించారు. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఇల్లు, ఆఫీస్, మనవళ్ల పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు తీశారు. మా సమాచారం సేకరించారు. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేసిన వాట్సాప్ చాట్స్ నా వద్ద ఉన్నాయి. నాపై కేసులు పెడితే ఊరుకోను. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలేలకు ఫిర్యాదుచేస్తా’ అని నవాబ్ మాలిక్ హెచ్చరించారు. -
దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్
Drug Based Cough Syrup Smuggling: ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో "లీన్" "సిజర్ప్" అనే మారుపేరుతో కూడా పిలిచే కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ (సీబీఎస్) ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వైద్యుడితో సహా సుమారు ఆరుగురిని అరెస్టు చేశామని కోల్కతా జోన్లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తెలిపింది. అయితే ఎన్సీబీ కోల్కతా జోన్ బారక్పూర్లో నిర్వహించి దాడులలో ఈ ఘటన వెలుగు చేసింది. (చదవండి: ఏడాదిగా షాప్కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి! అంతేకాదు ఆ నిందుతులు కోడైన్ సిరప్ను స్మగ్లింగ్ చేస్తున్న సిండికేట్లో భాగమని, పైగా మాదకద్రవ్యాల బానిసలు త్వరితగతిన అధిక ధర వెచ్చించి కొనేవాళ్లకే ఇవి ఎక్కువగా విక్రయిస్తుంటారని ఎన్సీబీ అధికారులు తెలిపారు. పైగా ఇరుదేశాల మధ్య సరిహద్దుగా ఉండే ముళ్ల కంచె వద్ద అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ ఉంచిన దాదాపు 2,245 డయలెక్స్ డీసీ బాటిళ్లను కూడా ఎన్సీబీ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ మేరకు ఆ నిందితులు వాహనాల్లో బరాక్పూర్ నుంచి నదియాకు సీబీఎస్ను రవాణా చేస్తున్నారని చెప్పారు. ఈ కమంలో ఎన్సీబీ బృందం మాట్లాడుతూ..."మొదట, మేము ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నాము, ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్కి సంబంధించిన మెడికల్ ప్రాక్టీషనర్ రిప్రజెంటేటివ్ని పట్టుకున్నాం. అయితే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఈ సీబీఎస్ డ్రగ్ని నిల్వ చేయడానికి తన మెడికల్ గోడౌన్ను ఇచ్చాడు. పైగా ఆ గోడౌన్కి లైసెన్స్ లేదు. అంతేకాదు బరాక్పూర్లోని రామ్ మెడికల్ హాల్ నుంచి నగరంలోని మహిస్బథన్ (ధాపా) ప్రాంతంలో గుర్తింపు లేని కొన్ని సంస్థలకు నిషిద్ధ వస్తువులు సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది." అని అన్నారు. ఈ క్రమంలో మయన్మార్కి సంబంధించిన యాబా ట్యాబ్లెట్లు భారత్లో తయారు చేయబడిన కోడైన్ ఆధారిత సిరప్లకు వంటి అక్రమ రవాణాలను తనిఖీ చేయడంలో ఢాకా ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్ సహాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. భారత్ కొన్ని మెడిల్ మందులపై నిషేధం విధించినట్లుగా బంగ్లదేశ్ బోర్డర్ గార్డ్స్ కూడా నిషేధం విధించాలని కోరింది కానీ అవి దేశంలో ప్రసిద్ధ వైద్య నివారిణలు కావడంతో సాధ్యం కాలేదు. (చదవండి: అవయవ దానంలో భారత్కు మూడో స్థానం) -
ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు. ఆర్యన్ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ డ్రగ్స్తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్ నుంచి ఢిల్లీలోని ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుల్ని విచారించడానికి ఎన్సీబీ సీనియర్ అధికారి సంజయ్ సింగ్ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్, నటుడు అర్మాన్ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని అందులో వాంఖెడే వాటా రూ.8 కోట్లు అంటూ ఈ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై వాంఖెడేపై శాఖాపరమైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక మంత్రి నవాబ్ మాలిక్ అడుగడుగునా వాంఖెడేపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్సీబీ మాత్రం డ్రగ్స్ కేసులో జాతీయ, అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని, దీనిపై లోతుగా విచారించడం కోసమే సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. వాంఖెడే ముంబై జోనల్ డీజీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయించుకున్నాడు. బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ ఇస్తూ ప్రతీ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. బెయిల్ వచ్చి న తర్వాత తొలిసారి శుక్రవారం మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి ఆర్యన్ వచ్చాడు. -
రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ.. సమీర్పై మాటల దాడి
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ దాడిని మరింత తీవ్రతరం చేశారు. వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎన్సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్ ఆరోపించారు. మాఫియాతో తనకి సంబం« దాలు ఉన్నాయని మాజీ సీఎం ఫడ్న వీస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. (చదవండి: చైన్ స్నాచింగ్తోనే రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నా!) -
దళితుడినే: సమీర్ వాంఖెడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్(ఎన్సీఎస్సీ) చైర్పర్సన్ విజయ్ సాంప్లాను కలిశారు. తన కులాన్ని(దళిత) ధ్రువీకరించే పత్రాలను అందజేశారు. తాను ముమ్మాటికీ దళితుడినేనని పేర్కొన్నారు. ఎన్సీఎస్సీ కోరిన అన్ని పత్రాలను, సాక్ష్యాధారాలను అందజేశానని వాంఖెడే చెప్పారు. ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన డ్రగ్స్ కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలో నెగ్గి, ఎస్సీ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి వాంఖెడే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశాడని, ఆయన దళితుడు కాదని, జన్మతా.. ముస్లిం అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్ కొడుకు ఆర్యన్ నుంచి రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారంటూ సమీర్ వాంఖెడే సహా ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎన్సీబీ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మరో రోజు జైల్లోనే
-
ఆర్యన్ ఖాన్కు బాంబే హైకోర్టు షరతులు
ముంబై: ఎట్టకేలకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు అయ్యింది. గురువారం ఆర్యన్ బెయిల్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజురూ చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. దేశం వదిలి వెళ్లకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్కు గురువారం బెయిల్ రావడంతో షారుక్ కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Aryan Khan Drugs Case : విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని అరెస్ట్.. -
ఆర్యన్ఖాన్కు బెయిల్
ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్లో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆర్యన్ఖాన్ అరెస్టయిన 25 రోజులు తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే గురువారం తీర్పు చెప్పారు. ఆర్యన్ సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ‘‘వారి ముగ్గురి బెయిల్ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను. శుక్రవారం సాయంత్రానికి వివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాను’’ జస్టిస్ సాంబ్రే చెప్పారు. ఇంకా పూర్తి ఉత్తర్వులు రాకపోవడంతో శుక్రవారం లేదంటే శనివారంనాడు ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. వాదనలు సాగిందిలా.. ఆర్యన్ బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు సాగాయి. ఇప్పటికే రెండుసార్లు ఆర్యన్కు కింది కోర్టుల్లో చుక్కెదురు కావడంతో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని లాయర్గా నియమించారు. క్రూయిజ్పై ఎన్సీబీ అధికారులు దాడి చేసినప్పుడు ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. ఈ విషయాన్నే ఆయన తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ పదే పదే ప్రస్తావించారు. వైద్య పరీక్షల్లో కూడా ఆర్యన్ డ్రగ్స్ సేవించాడనేది రుజువు కాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అలాంటప్పుడు ఆర్యన్ను అదుపులోనికి తీసుకోవడం అర్థరహితమని వాదించారు. రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణలను ఆధారం చేసుకొని ఆర్యన్ చుట్టూ ఉచ్చు బిగించాలని చూశారని, కానీ ఆ సంభాషణల్లో కూడా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అర్బాజ్ ధరించిన షూలో డ్రగ్స్ లభిస్తే ఆర్యన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని రోహత్గీ తన వాదనల్లో గట్టిగా ప్రశ్నించారు. మరోవైపు ఎన్సీబీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాలను తరచుగా సేవిస్తారని చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్యన్ అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారని తన వాదనల్లో పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతలతో ఆర్యన్కి సంబంధాలున్నాయని అనిల్ సింగ్ ఆరోపించారు. డ్రగ్స్తో వ్యాపారం చేసే స్థాయిలో పెద్ద మొత్తంలో ఆర్యన్ కొనుగోలు చేస్తున్నాడని అతని వాట్సాప్ సంభాషణల ద్వారా తేటతెల్లమవుతోందని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందని అందుకే అతనికి బెయిల్ ఇవ్వొద్దని అనిల్ సింగ్ వాదించారు. క్రూయిజ్పై దాడి జరిగిన సమయంలో ఎక్కువమంది దగ్గర వివిధ రకాల మాదకద్రవ్యాలు లభించాయని వీటన్నింటినీ చూస్తుంటే ఆర్యన్ డ్రగ్స్ విషయం గురించి పూర్తిగా తెలుసునని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అన్నీ తెలిసి కూడా అక్కడ ఉండడం నేరపూరితమైన చర్యేనని వాదించారు. దీనికి రోహత్గీ గట్టిగా కౌంటర్ ఇస్తూ క్రూయిజ్లో 1,300 మంది ఉన్నారని గుర్తు చేశారు. తాజ్ హోటల్లో 500 గదులుంటే, రెండు గదుల్లో ఉన్న వారు డ్రగ్స్ సేవిస్తే మొత్తం హోటల్లో ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్యన్ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడలేదని, ఒక నవ యువకుడ్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పకడ్బందీగా వాదనలు వినిపించారు. లాయర్ రోహత్గీ వాదనలు విన్న న్యాయమూర్తి ముగ్గురికీ బెయిల్ ఇస్తానని ప్రకటించి, తీర్పు పూర్తి పాఠాన్ని శుక్రవారం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్యన్కు బెయిల్పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ‘‘సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా’’..అంటూ స్పందించగా, ‘‘నాకిది చాలా సాధారణమైన కేసు. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. కానీ ఆర్యన్కు బెయిల్ రావడం సంతోషంగా ఉందని సీనియర్ లాయర్ ముకుల్ రొహత్గీ అన్నారు. న్యాయం జరగాల్సిన సమయం వస్తే, సాక్ష్యాలతో పని ఉండదు అని నటుడు సోనూసూద్ పేర్కొనగా ‘‘అంతా దేవుడి దయ. ఒక తండ్రిగా ఊపిరిపీల్చుకుంటున్నాను. ఇక వాళ్లకి అంతా మంచే జరగాలి’’అని మరో నటుడు ఆర్.మాధవన్ ఆకాంక్షించారు. 2018 నాటి చీటింగ్ కేసులో గోసవి అరెస్ట్ పుణె: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సాక్షిగా ప్రవేశపెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసవిని గురువారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతడిపై నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కొన్నాళ్లుగా పరారీలో ఉన్న గోసవి పోలీసులకు లొంగిపోకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తలదాచుకుంటూ వస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఆ తరవాత అతనిని పుణె కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన బాలీవుడ్ సూపర్స్టార్ షారూక్ఖాన్ కుమారుడే ఆర్యన్తో కలిసి గోసవి దిగిన సెల్ఫీలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. 2018లో గోసవిపై నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు పుణె పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు. కత్రజ్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సచిన్ పాటిల్ పేరుతో అతడు ఆ హోటల్లో ఉంటున్నాడు. నోటీసులివ్వకుండా వాంఖెడేని అరెస్ట్ చేయం ఆర్యన్ ఖాన్ విడుదలకు ముడుపులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి మూడు రోజుల ముందుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయమని ముంబై పోలీసులు హైకోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు తనని అరెస్ట్ చేస్తారన్న భయం వెంటాడుతోందంటూ వాంఖెడే కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వాంఖెడే దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ ఎస్వి కొత్వాల్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, ముంబై పోలీసులు ఈ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందని వాంఖెడే ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ ముందస్తు నోటీసు లేకుండా వాంఖెడేని అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. మరోవైపు తమ కుటుంబంపైనా, వ్యక్తిగత జీవితంపైనా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ వాంఖెడే భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తమకు న్యాయం చెయ్యాలంటూ ఆమె ఆ లేఖలో కోరారు. -
ఆర్యన్కు బెయిల్: ‘సినిమా అప్పుడే అయిపోలేదు’
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ ఖాన్కి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 20 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. మూడు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు.. నేడు ఆర్యన్కి ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్కు బెయిల్ వచ్చిన సందర్భంగా నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్) ఆర్యన్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అది కూడా షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై మేరా దోస్త్’(సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా) అంటూ ట్వీట్ చేశారు. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఇలా ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. (చదవండి: ఆర్యన్ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు) पिक्चर अभी बाकी है मेरे दोस्त — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021 సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్వీ సంబ్రే.. ఆర్యన్తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంబ్రే ‘‘మూడు అభ్యర్ధనలు అనుమతించాను. రేపు సాయంత్రంలోగా నేను వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తాను’’ అని తెలిపారు. చదవండి: ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ -
ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
Kiran Gosavi, NCB Witness In Aryan Khan Case, Arrest: ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. ఆర్యన్ అరెస్ట్ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కారణ్ గోసవి ఇటీవలె ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన కిరణ్ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్ని సాక్షులుగా చేర్చి విచారించింది. చదవండి: ఆర్యన్కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. ఆర్యన్ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాతో తెగ వైరల్ అయ్యింది. అయితే తర్వాత గోసవి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా ఇటీవలె మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ఖాన్ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. చదవండి: Aryan Khan: ఆర్యన్ను వదిలేయడానికి రూ.25 కోట్లు? వాంఖెడే X నవాబ్ మాలిక్ -
వాంఖెడే X నవాబ్ మాలిక్
ముంబై: ముంబై తీరంలోని నౌకలో మాదకద్రవ్యాలు లభించిన కేసులో ఇప్పుడు అందరి దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపైనే ఉంది. వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి బుధవారం ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో వాంఖెడేపై రోజుకొక కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి దందా, ఫోన్ ట్యాపింగ్, సాక్షుల్ని ముందే కూడగట్టారు, జన్మతః ముస్లిం వంటి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ వాంఖెడేపై మధ్య పోరాటంగా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న విజిలెన్స్ దర్యాప్తు బృందం బుధవారం ఉదయం ముంబైకి చేరుకొని వాంఖెడేపై విచారణ మొదలు పెట్టింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) జ్ఞానేశ్వర్ సింగ్ అవినీతి అరోపణలపై సమీర్ వాంఖెడే స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టుగా మీడియాకి వెల్లడించారు. వాంఖెడే స్టేట్మెంట్ రికార్డు చేయడానికి నాలుగున్నర గంటలకు పైగా పట్టింది. ఎన్సీబీ కార్యాలయం నుంచి ఈ కేసుకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. అయితే వాంఖెడే తనపై వచ్చిన ఆరోపణలపై ఏమంటున్నారో ఆయన వెల్లడించలేదు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఇప్పుడే వివరాలను బయటపెట్టలేమన్నారు. అవసరమైతే వాంఖెడే నుంచి మళ్లీ సమాచారం సేకరిస్తామని జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఆర్యన్ఖాన్ని విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించిన సాక్షి ప్రభాకర్ సాయిల్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు రికార్డు చేశారు. సాయిల్ రికార్డు పూర్తి చేయడానికి వారికి ఎనిమిది గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం మొదలైన ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మరోవైపు సాయిల్కి ఎవరూ హాని తలపెట్టకుండా మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఆర్యన్ బెయిల్పై కొనసాగుతున్న వాదనలు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ బెయిల్ పిటిషన్పై వరసగా రెండోరోజు బుధవారం బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్యన్ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు కుట్ర చేశారని ఆరోపిస్తున్న ఎన్సీబీ ఈ అంశంలో అధికారికంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ఎన్డబ్ల్యూ సాంబ్రే దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అరెస్ట్ మెమోలో సరైన సాక్ష్యాధారాలేవీ లేవని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ చెప్పారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు తమ క్లయింట్లకు ఎందుకు ఇవ్వడం లేదని మరో న్యాయవాది అమిత్ దేశాయ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. షారుఖ్కు గతంలో జరిమానా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు సమీర్ వాంఖెడేతో పరిచయం కొత్తదేమీ కాదు. 2011లో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కాలంలోనే సమీర్... షారుఖ్కు చుక్కలు చూపించారు. అప్పట్లో హాలెండ్, లండన్లలో సెలవులు గడిపి ముంబైకి తిరిగివచ్చిన షారుఖ్ దగ్గర పరిమితికి మించిన అధిక బ్యాగేజీ ఉందని సమీర్ వాంఖెడే ఆయన్ను విచారించారు. రూ.1.5 లక్షల జరిమానా విధించి వదిలిపెట్టారు. -
‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు
న్యూఢిల్లీ: ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారంటూ ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సమర్పించిన అఫిడవిట్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వేగంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేతోపాటు మరికొందరు అధికారులపై ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ దర్యాప్తు కోసం ఎన్సీబీ ఉత్తర రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో త్రిసభ్య బృందం ఏర్పాటయ్యింది. జ్ఞానేశ్వర్ సింగ్ ఎన్సీబీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ)గానూ పనిచేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్ట్టడానికి రూ.25 కోట్లు ఇవ్వాలంటూ ఎన్సీబీ కీలక అధికారులతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారని ప్రభాకర్ సాయిల్ ఆదివారం బాంబు పేల్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులకు అఫిడవిట్ అందజేశాడు. డ్రగ్స్ కేసులో మరో సాక్షి అయిన కె.పి.గోసవికి ప్రభాకర్ సాయిల్ బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రభాకర్ సాయిల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని డ్రగ్స్ కేసులో మరో సాక్షి కిరణ్ గోసవి పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్పై ఎన్సీబీ దాడులు జరిగిన అక్టోబర్ 2 నుంచి పరారీలో ఉన్న అతడు సోమవారం గుర్తుతెలియని ప్రాంతం నుంచి టీవీ చానళ్లతో మాట్లాడాడు. తాను అతి త్వరలో లక్నో పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడు. పారదర్శకంగా దర్యాప్తు ప్రభాకర్ సాయిల్ సమర్పించిన అఫిడవిట్, కేసు రిపోర్టు ముంబైలోని తమ అధికారుల నుంచి అందిందని జ్ఞానేశ్వర్ సింగ్ సోమవారం ఢిల్లీలో చెప్పారు. ఈ రిపోర్టును ఎన్సీబీ డైరెక్టర్ జనరల్పరిగణనలోకి తీసుకున్నారని, విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు. సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పారదర్శకంగా, నిజాయతీగా దర్యాప్తు జరుపుతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖెడేను డ్రగ్స్కేసు విచారణ నుంచి తప్పించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాలను బట్టి చర్యలుంటాయన్నారు. విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా వాంఖెడేను, ఇతర అధికారులను, సాయిల్ను నిశితంగా ప్రశ్నించనున్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సమీర్ వాంఖెడే సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్సీబీ ఉన్నతాధికారులెవరూ తనను పిలిపించలేదని, వేరే పని కోసం ఇక్కడికి వచ్చానన్నారు. సాయిల్కు పోలీసు భద్రత ముంబై డ్రగ్స్ కేసులో సాక్షి అయిన ప్రభాకర్ సాయిల్కు పోలీసు భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్వాల్సే పాటిల్ ప్రకటించారు. సాయిల్ సోమవారం ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. జాయింట్ కమిషనర్(క్రైమ్) మిలింద్ను కలిసి మాట్లాడాడు. అనంతరం ముంబై శివారులోని సహర్ పోలీసులను కలిశాడు. తనకు భద్రత కల్పించాలని కోరాడు. విచారణకు అనన్య పాండే డుమ్మా డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే సోమవారం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఇంతకుముందే రెండు రోజులపాటు ఎన్సీబీ ఆమెను ప్రశ్నించింది. సోమవారం మళ్లీ రావాలని సూచించినప్పటికీ రాలేదు. వాంఖెడే ఫోర్జరీ సర్టిఫికెట్లు: నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డెరెక్టర్ సమీర్ వాంఖెడే పుట్టినతేదీ సహా సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి, ఉద్యోగంలో చేరారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరో పించారు. సోమవారం సదరు సర్టిఫికెట్లను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఆరోపణలను వాంఖెడే కొట్టిపారేశారు. ఈ కేసులో నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ను వాంఖెడే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాంఖెడేకు ఉపశమనం సాధ్యం కాదు: ప్రత్యేక కోర్టు ముంబై: డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ అఫిడవిట్ ఆధారంగా న్యాయస్థానాలు తనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖెడేకు నిరాశే ఎదురయ్యింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్సీబీ, సమీర్ వాంఖెడే సోమవారం ప్రత్యేక కోర్టులో రెండు వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభాకర్ సాయిల్ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్సీబీ, వాంఖెడే తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై పెద్ద కుట్ర జరుగుతోందని వాంఖెడే చెప్పారు. తమను నైతికంగా దెబ్బతీసే యత్నం జరుగుతోందన్నారు. అందుకే తమపై న్యాయస్థానాలు చట్టపరమైన చర్యలు ప్రారంభించకుండా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే, ఈ కేసులో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి వి.వి.పాటిల్ స్పష్టం చేశారు. -
మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..
ముంబై: తన మతంపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే స్పందించారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేశారు. సమీర్.. ముస్లిం మతానికి చెందినవారని పేర్కొంటూ ఒక డాక్యుమెంట్ను ట్విటర్లో షేర్ చేశారు. ‘ఫోర్జరీ ఇక్కడ నుంచి ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ తగిలించారు. అంతేకాదు సమీర్, ఆయన మాజీ భార్య షబానా ఖురేషీ పెళ్లి నాటి ఫొటో కూడా ట్విటర్లో పెట్టారు. దీనిపై సమీర్ దీటుగా స్పందించారు. నవాబ్ మాలిక్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోలు అనవసర విషయాల్లో తనను ఇరికిస్తున్నారని, తనకు సంబంధించిన ఏ వివరాలైనా పరిశీలించుకోవచ్చని సమీర్ వాంఖెడే స్పష్టం చేశారు. ‘నా తండ్రి పేరు ద్యాన్ దేవ్ కచ్రుజీ వాంఖెడే. 2007 జూన్ 30న స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆయన పదవీ విరమణ చేశారు. నా తండ్రి హిందువు. నా తల్లి దివంగత శ్రీమతి జహీదా ముస్లిం. బహుళ మత, లౌకిక కుటుంబానికి చెందినవాడిగా.. నా వారసత్వం గురించి నేను గర్విస్తున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. 2017లో, నేను షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ను వివాహం చేసుకున్నాను’ అని సమీర్ వాంఖెడే ఒక ప్రకటనలో తెలిపారు. చాలా బాధపడ్డాను నవాబ్ మాలిక్ ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాయని సమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా వ్యక్తిగత పత్రాలను ప్రచురించడం పరువు నష్టం కలిగించేది మాత్రమే కాదు నా కుటుంబ గోప్యతపై అనవసరమైన దాడి కూడా. ఇది నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని, చనిపోయిన నా తల్లిని కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా చేసింది. గత కొన్ని రోజులుగా గౌరవ మంత్రి చర్యలు నన్ను, నా కుటుంబాన్ని విపరీతమైన మానసిక, మానసిక ఒత్తిడికి గురి చేశాయి. వ్యక్తిగత, పరువు నష్టం కలిగించే దాడులతో నేను బాధపడ్డాను’ అని సమీర్ వాంఖెడే ట్విటర్లో పేర్కొన్నారు. Me n my Husband Sameer r born Hindus.We hv never converted to any other religion.V respect all religions.Sameer’s father too is hindu married to my Muslim Mom in law who is no more.Sameer’s ex-marriage ws under special marriage act,divorced in 2016.Ours in hindu marriage act 2017 pic.twitter.com/BDQsyuvuI7 — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 25, 2021 మతం మారలేదు: సమీర్ భార్య తన భర్తపై మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలపై సమీర్ వాంఖెడే భార్య షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ ట్విటర్లో స్పందించారు. తాను, తన భర్త జన్మతః హిందువులమని, మరో మతంలోకి మారలేదని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొంటూ తమ పెళ్లినాటి ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా, తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టబద్ద రక్షణ కల్పించాలంటూ సమీర్ వాంఖెడే ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి ఆయన లేఖ రాశారు. అయితే డ్రగ్స్ కేసులతో మహారాష్ట్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని శివసేన, ఎన్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. (చదవండి: ముంబై డ్రగ్స్ కేసు.. ఆర్యన్ను వదిలేయడానికి రూ.25 కోట్లు?) -
ఆర్యన్ను వదిలేయడానికి రూ.25 కోట్లు?
ముంబై: ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకి చెప్పారు. ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి వ్యక్తిగత అంగరక్షకుడినని చెప్పుకుంటున్న ప్రభాకర్ అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్ని సాక్షులుగా చేర్చి విచారించింది. ఈ అరెస్ట్ల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షారూక్ఖాన్ మేనేజర్ పూజా దడ్లానితో కారులోనే ఈ డీల్ గురించి 15 నిముషాల సేపు చర్చించారంటూ ప్రభాకర్ తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనని తొమ్మిది నుంచి 10 ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. మరోవైపు కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఈ కేసు ఇంకా అనూహ్య మలుపులు తిరగడం ఖాయంగా అనిపిస్తోంది. అక్టోబరు 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని అర్థర్ రోడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అతని బెయిల్ పిటిషన్ మంగళవారం బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. గట్టి జవాబు ఇస్తాం: సమీర్ ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తోసిపుచ్చినట్టుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాంఖెడే హెచ్చరించారు. సాక్షి అడ్డం తిరిగాడని, ఎన్సీబీ ప్రతిష్టను మంట కలిపేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నాడని, కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అలాంటి మీటింగ్లేవీ జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభాకర్ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఎన్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రభాకర్ ఈ కేసులో సాక్షి మాత్రమే. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఆయన చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చెప్పుకునే బదులు న్యాయమూర్తి సమక్షంలోనే తన గోడు చెప్పుకోవాల్సింది. అతని అఫిడవిట్ను ఎన్సీబీ డైరెక్టర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. మహారాష్ట్ర పరువు తీస్తారా?: శివసేన ఫైర్ ఆర్యన్ఖాన్ విడుదలకు ఎన్సీబీ ముడుపులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలు షాకింగ్గా ఉన్నాయని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర పరువు తీయడానికే ఈ కేసులు పెట్టారని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్తో పాటుగా సంజయ్ రౌత్ ఒక వీడియో క్లిప్పింగ్ షేర్ చేశారు. ఆ వీడియోలో ఎన్సీబీ కార్యాలయంలో గోసవి ఫోన్ చేతిలో పట్టుకొని (స్పీకర్ ఆన్ చేసి) ఉండగా... ఆర్యన్ ఖాన్ ఎవరితోనో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. ఈ ముడుపుల వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలని రౌత్ డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడేపై సిట్తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్సీబీపై తరచుగా విమర్శలు చేస్తోంది. నాపై కుట్ర జరుగుతోంది: పోలీసుల్ని ఆశ్రయించిన వాంఖెడే తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్సీబీ ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చట్టపరమైన చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలంటూ నగర పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి లేఖ రాశారు. ‘‘ముడుపుల ఆరోపణలకు సంబంధించి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ ఈ అంశాన్ని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ పరిశీలనకు పంపారు. దురద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలి’’ అని కోరారు. -
కీలక డేటా తొలగించిన అనన్య!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు మిత్రురాలైన నటి అనన్య పాండేను విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఎన్సీబీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఇందులోని వాట్సాప్ చాటింగ్లు, ఫొటోలు, వాయిస్ నోట్లను ఆనన్య పాండే చాలావరకు తొలగించినట్లు ఎన్సీబీ గుర్తించింది. డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్యన్ ఖాన్తో ఆమె సాగించిన వాట్సాప్ చాటింగ్లలో కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీలు, ఆర్యన్ ఖాన్తో చాటింగ్లపై ఆనన్య పాండేను ఎన్సీబీ నిశితంగా ప్రశ్నించింది. అయితే, ఆమె అన్నింటికీ ఒకటే సమాధానం చెబుతోంది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, డ్రగ్స్ కొనడానికి ఆర్యన్కు ఎలాంటి సాయం చేయలేదని, అతడితో ఆర్థిక లావాదేవీలు లేవని పేర్కొంటోంది. అయితే, ఆర్యన్ ఖాన్కు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులెవరో అనన్యకు తెలుసని ఎన్సీబీ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా ఆర్యన్ ఖాన్ సహా నిందితులందరి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఆర్యన్కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థిస్తామన్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఇప్పటిదాకా 20 మందిని అరెస్టు చేసింది. వారి ఆదాయ వనరులను పరిశీలిస్తోంది. -
లెహెంగాల ఫాల్స్లో డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ను తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పెడ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కొరియర్ ద్వారా ఆస్ట్రేలియాకు రవాణా చేసేందుకు లెహెంగాల్లోని ఫాల్స్లో కోట్లు విలువ చేసే డ్రగ్స్ పెట్టి కుట్టేశారు. ఈ లెహెంగాలను కార్గోలో పంపేందుకు యత్నించి బెంగళూరు నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కింది ఓ ముఠా. మూడు లెహెంగాల్లోని ఫాల్స్లో 3 కేజీల మిథిలీన్ డైఆక్సీ మిథాంఫిటమిన్ (ఎండీఎంఏ) డ్రగ్ పెట్టి చెన్నైకి చెందిన పెడ్లర్ హైదరాబాద్లోని ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ ద్వారా కన్సైన్మెంట్ బుక్ చేశాడు. ఎన్సీబీకి సమాచారం అందడంతో ఆ పార్శిల్ను ట్రాక్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్టులో గురువారం స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ను తెరిచి చూడగా మూడు లెహెంగాల్లో్ల ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. ఏపీలోని నర్సాపురంలో ఓ తప్పుడు చిరునామా ఉపయోగించి చెన్నైకి చెందిన ఓ పెడ్లర్ దీన్ని బుక్ చేసినట్లు గుర్తించారు. అనంతరం చెన్నైలోని నిందితుడి అసలు అడ్రస్ గుర్తించి, ఎన్సీబీ అధికారులు శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్శిల్ను పంపేందుకు ఈ పెడ్లర్ నకిలీ డాక్యుమెంట్లు వినియోగించినట్లు విచారణలో తేలినట్లు అధికారులు చెప్పారు. మరో కేసులో నలుగురు అరెస్టు మరో కేసులో భాగంగా బెంగళూర్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఎన్సీబీ చేధించింది. శనివారం బెంగళూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారును ఎన్సీబీ దేవనహల్లి చెక్పోస్టు వద్ద ఆపి తనిఖీ చేయగా, హై గ్రేడ్ గంజాయితో పాటు ఎండీఎంఏ పిల్స్, మిథాంఫిటమిన్, మెథక్వలోన్ లభ్యమైనట్లు ఎన్సీబీ బెంగళూర్ జోనల్ డైరెక్టర్ అమిత్ గౌవాటే తెలిపారు. కారులో ఉన్న నలుగురి అరెస్టు చేసి విచారించగా, వారిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా, మిగిలిన ముగ్గురు హైదరాబాద్లో నివసిస్తున్న బిహార్కు చెందిన వారని గుర్తించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ను వీకెండ్ పార్టీలకు సరఫరా చేసేందుకు వెళ్తున్నారని, హైదరాబాద్లోని పలు పబ్బుల్లోకి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా బెంగళూరులో కొంత గంజాయితో పాటు ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. హాట్ స్పాట్లుగా.. విదేశాలకు డ్రగ్స్ రవాణా చేయడంలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూర్ నగరాలు హాట్ స్పాట్లుగా మారుతున్నట్లు ఎన్సీబీ పేర్కొంటోంది. ఎవరెవరో వ్యక్తులు హైదరాబాద్, ముంబై ద్వారా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆందోళన కల్గిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో విదేశాలకు చెందిన మాఫియా లోకల్ గ్యాంగ్లతో పెట్టుబడి పెట్టిస్తోందని, ఆ డ్రగ్స్ను ఇలా కొరియర్ల రూపంలో మళ్లీ అక్కడికే తెప్పించుకుంటోందని తేలింది. అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న పెడ్లర్లపై దృష్టి పెడితే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆర్యన్ ఖాన్కు సాయం చేయలేదు: అనన్య పాండే
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలను తాను ఎప్పుడూ తీసుకోలేదని బాలీవుడ్ నటి అనన్య పాండే ఎన్సీబీ అధికారులకు చెప్పారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు డ్రగ్స్ కొనుగోలు కోసం తాను ఎప్పుడూ సహాయం చేయలేదని పేర్కొన్నారు. ముంబై క్రూయిజ్లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో వరుసగా రెండోరోజు శుక్రవారం అనన్య పాండే ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్తో రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణల ఆధారంగా అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. 2018–19లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు ఇవ్వడంలో అనన్య సహకరించినట్టుగా వారి వాట్సాప్ సంభాషణల ద్వారా తెలుస్తోందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. స్టార్ హీరోల పిల్లల గెట్ టుగెదర్ పార్టీలలో ఆర్యన్ ఖాన్కి అనన్య డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా వారి సంభాషణల ద్వారా అవగతమవుతోందని ఎన్సీబీ వెల్ల డించింది. అనన్య సమాధానాలు సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. -
డ్రగ్స్ కేసు: ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్లో అనన్య పేరు.. ఎవరీ భామ?
బాలీవుడ్లో డ్రగ్స్ కేసుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య టైమ్లో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అప్పటినుండి ఎన్సీబీఐ చూపు మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీల పైనే ఉంది. తాజాగా క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టై జైల్లో ఖైదీగా ఉన్న విషయం తెలిసింది. (చదవండి: షారుక్ నాకు తండ్రిలాంటి వాడు.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ) ఈ కేసుకు సంబంధించి తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంటిలో ఎన్సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.అక్కడ ఆమె ఫోన్ను స్వాదీనం చేసుకున్న అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. అంతేకాదు ఆమె ఫోన్, ల్యాబ్టాప్నీ సీజ్ చేశారు కూడా. . రేవ్ పార్టీ జరుగుతన్న సమయంలో ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కోసం ఒక నటికి వాట్సప్ మెసేజ్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ సమయంలో ఆర్యన్ చాట్ చేసింది అనన్య పాండేతోనే అని తేలింది. అలా అనన్య కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఎవరీ అనన్య పాండే? ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న అనన్య పాండే.. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనే విషయం తెలిసిందే. 2019లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వాహ్’తో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ఒక హిందీ మూవీతో పాటు.. తెలుగులో 'లైగర్' లో నటిస్తోంది. హీరోయిన్గా ఇప్పటివరకు పెద్ద హిట్ కొట్టకపోయినా.. పార్టీ, పబ్బుల్లో మాత్రం ఈ భామ జోరు ఓ రేంజ్లో ఉంటుంది. షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్, అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందా, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. అనన్యకు మంచి స్నేహితులు. వీళ్లంతా కలిసే పబ్లకి వెళ్తుంటారు. అర్యన్ ఖాన్తో సహా మరికొంతమంది కూడా ఈ గ్యాంగ్తో కలిసి పార్టీలకు వెళ్తుంటారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడడంతో వీరి బాగోతం అంతా బయటపడుతోంది. -
రెగ్యులర్గా డ్రగ్స్ వాడుతాడేమో
ముంబై: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తరచుగా మత్తు పదార్థాలను వినియోగిస్తాడనే భావన కలుగుతోందని ముంబైలోని స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలోని క్రూయిజ్ నౌకలో మత్తు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టయిన ఆర్యన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, ఫ్యాషన్ మోడల్ మున్మున్ ధమేచల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్యన్ వాట్సాప్ చాట్స్ను పరిశీలిస్తే డ్రగ్స్ విక్రేతలను తరచూ కలుస్తాడనే విషయం స్పష్టమవుతోందని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టాల సంబంధ కేసులను విచారించే కోర్టు స్పెషల్ జడ్జి వీవీ పాటిల్ వ్యాఖ్యానించారు. ‘కేసులో ఆధారాలుగా కోర్టుకు ఎన్సీబీ సమర్పించిన ఆర్యన్ వాట్సాప్ చాట్స్ను గమనిస్తే ఇతనికి రెగ్యులర్గా డ్రగ్స్ వాడే అలవాటుందని తెలుస్తోంది. ఆర్యన్కు బెయిల్ ఇస్తే బయటికొచ్చాక మళ్లీ ఈ తప్పు చేయబోడని మేం ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాం. అందుకే బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం’ అని కోర్టు ఉత్తర్వులో జడ్జి వ్యాఖ్యానించారు. ‘నౌకలో సోదాల సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ లేవు. కానీ స్నేహితులు అర్బాజ్, మున్మున్ల వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విషయం ఆర్యన్కు తెలుసు. సరదా కోసం, వినియోగం కోసం డ్రగ్స్ వెంట తెచ్చుకుంటామని అరెస్ట్ అయ్యాక ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆర్యన్, అర్బాజ్ ఒప్పుకున్నారు. డ్రగ్స్ను సరఫరా చేసే, విక్రయించే వ్యక్తులతో ఆర్యన్కు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆర్యన్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నిషేధిత డ్రగ్స్తో సంబంధమున్న ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు కుదరదు’ అని జడ్జి తేల్చిచెప్పారు. దీంతో ఆర్యన్ తరఫు లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ముందు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. గత 18 రోజులుగా ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే గడుపుతున్నారు. -
ఆర్యన్ ఖాన్కు మళ్లీ నిరాశే
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దసరా పండుగ సమయానికి ఇంటికి చేరుకుంటాడన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్పై తీర్పు ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈ బెయిల్ పిటిషన్పై బుధ, గురువారాల్లో ఇరుపక్షాల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. ఆర్యన్ గత కొద్దికాలంగా డ్రగ్స్కి బానిసగా మారాడని, అతని వాట్సాప్ చాటింగ్లు చూస్తే ఈ విషయం తెలుస్తుందని, అందుకే అతడికి బెయిల్ మంజూరు చేయవద్దని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) తరపు న్యాయవాది అనిల్ సింగ్ కోరారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ ఏమీ లభించలేదు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వాలని వాదించడం సరికాదన్నారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నిందితుడి వద్ద డ్రగ్స్ లభించడం కీలకమైన అంశం కాదని చెప్పారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే తమ విచారణ ముందుకు సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా వయసులో చిన్న వాళ్లని, వారికి బెయిల్ ఇవ్వాలంటూ ఆర్యన్ తరఫు లాయర్ అమిత్ దేశాయ్ చేసిన వాదనలను అనిల్ సింగ్ వ్యతిరేకించారు. వీరంతా భావి భారత పౌరులని, మాదకద్రవ్యాలు సేవించడం చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా ఆ పని చేశారని ఆక్షేపించారు. మరోవైపు విదేశాల్లో ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు సేవించాడన్న అనిల్ సింగ్ వాదనల్ని అమిత్ వ్యతిరేకించారు. ఆర్యన్ ఇటీవల వెళ్లిన దేశాల్లో డ్రగ్స్ సేవించడం చట్టబద్ధమైన చర్యేనని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆర్యన్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. సోషల్ మీడియాలో, కోర్టు వెలుపల షారుక్ ఖాన్ అభిమానులు ఆర్యన్కు మద్దతుగా నిలిచారు. అతనికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టు బయట నినాదాలు చేశారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఇన్నాళ్లూ క్వారంటైన్ బ్యారెక్లో ఉన్న ఆర్యన్ ఖాన్ను ఇతర ఖైదీలు ఉండే సెల్కి అధికారులు తరలించారు. కోవిడ్–19 పరీక్షల్లో ఆర్యన్ సహా ఇతర నిందితులందరికీ నెగెటివ్ రావడంతో వారిని సాధారణ సెల్లో ఉంచినట్టు జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్ చెప్పారు. బిస్కెట్లు తింటూ.. ఆర్థర్ రోడ్డు జైలులో ఆర్యన్ ఖాన్ కేవలం బిస్కెట్లు తిని రోజులు గడుపుతున్నాడని తెలుస్తోంది. ముంబైలో స్థానిక మీడియా రాస్తున్న కథనాల ప్రకారం జైలులో ఇచ్చే భోజనం తినడానికి ఆర్యన్ నిరాకరించాడు. జైలు క్యాంటిన్ నుంచి కొనుక్కుంటున్న బిస్కెట్లు తింటూ కాలం గడిపేస్తున్నాడు. తనతో పాటు తీసుకువెళ్లిన 12 మంచినీళ్ల బాటిల్స్ నీళ్లతోనే కాలం నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా అయిపోతున్నాయని, తమ కుమారుడి దుస్థితిని తలచుకొని షారుక్ ఖాన్, గౌరి దంపతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ముంబై మీడియా కథనాలు రాస్తోంది. -
డ్రగ్స్ ముఠాతో ఆర్యన్కు లింకు?
ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్లో మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ బెయిల్పై ముంబైలోని స్పెషల్ కోర్టులో వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ వి.వి. పాటిల్ సమక్షంలో ఇరుపక్షాలు బుధవారం రోజంతా తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో విచారణను గురువారానికి జడ్జి వాయిదా వేశారు. ఆర్యన్ గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, పంపిణీ సైతం చేస్తాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కోర్టుకి వెల్లడించింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాతో ఆర్యన్కి సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని, ఇక ఆర్యన్ విదేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించనున్నట్టు ఎన్సీబీ వెల్లడించింది. ఆర్థిక అంశాలపై విచారణకు మరి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఎన్సీబీ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఒక్క నిందితుడిని విడుదల చేసినా విచారణపై ప్రభావం చూపిస్తుందని వాదించారు. ఆర్యన్, సహనిందితుడు అర్బాజ్ వాట్సాప్ చాట్స్ని పరిశీలిస్తే విదేశస్తులకు భారీగా మాదక ద్రవ్యాలను పంపిణీ చేసిన విషయం వెల్లడవుతోందని వాదించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు మత్తుకు బానిసలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్ తరఫున హాజరైన అమిత్ దేశాయ్ ఎన్సీబీ చేసిన వాదనలు అర్థరహితమని కొట్టిపారేశారు. నిందితులు డ్రగ్స్ విక్రేతలు కాదని వాదించారు. -
డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ ఖాన్ దగ్గర డబ్బులు లేవు
ముంబై: నిషేధిత మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్కు బుధవారం కూడా బెయిల్ దొరకలేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రత్యేక కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది. తాజాగా ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ అమిత్ దేశాయ్, ఆర్యన్కు వ్యతిరేకంగా అదనపు సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్ పోటాపోటీగా వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అమిత్ దేశాయ్ గంటన్నర పాటు కోర్టులో వాదించారు. ‘డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ దగ్గర డబ్బులు లేవు. విక్రయించడానికి కానీ సేవించడానికి కానీ అతడి దగ్గర డ్రగ్స్ లేవు. అలాంటప్పుడు అతడిని ఎందుకు ఇందులో ఇరికించారు? బెయిల్ పిటిషన్కు ఎన్సీబీ ఇచ్చిన సమాధానంలో కొత్తదనం ఏమీ లేదు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే నా క్లయింట్స్ మాదకద్రవ్యాల విక్రేతలు కాదు. ఇప్పటికే వారు తగినంత బాధ అనుభవించార’ని అమిత్ దేశాయ్ పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ను వ్యతిరేకిస్తూ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. దేశం మొత్తం నిషేధిత మాదకద్రవ్యాల వాడకం గురించి ఆందోళన చెందుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తి సంబంధించిన విషయం కాదు. డ్రగ్స్ దందాను నడిపిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఎన్సీబీ పనిచేస్తోంది. ఈ కేసులో నిందితులను విడుదల చేస్తే దర్యాప్తు కుంటుపడే అవకాశముంది. విదేశీయుడొకరితో వాణిజ్య పరిమాణంలో హార్డ్ డ్రగ్స్ గురించి ఆర్యన్ ఖాన్ చాట్ చేసినట్టు ఎన్సీబీ గుర్తించింది. ఈ సంభాషణలు ముంబై క్రూయిజ్ కేసుకు సంబంధించినవి కాదా అనేది గుర్తించాల్సి ఉంద’ని అనిల్ సింగ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. బెయిల్ రాకపోవడంతో ఆర్యన్ ఖాన్ ఈరోజు కూడా జైలులో గడపాల్సి ఉంటుంది. కాగా, ఈనెల 2న అతడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే శిక్ష ఎన్నేళ్లంటే..?) -
ఆర్యన్ కేసులో బీజేపీ హస్తం!
ముంబై: బాలీవుడ్ స్టార్కిడ్ ఆర్యన్ ఖాన్ అరెస్టు కేసు విషయం పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమని, సోదాల్లో ఎన్సీబీ అధికారులతో పాటు బీజేపీ నేత ఒకరు పాల్గొన్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్టకి చెందిన మహారాష్ట్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మరోవైపు ఎన్సీబీ, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్తో సహా 17మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. జాతీయ నార్కొటిక్ బ్యూరో జరిపిన ఈ సోదాలన్నీ డ్రామాలని, నకిలీవని నవాబ్ మాలిక్ విమర్శించారు. అసలా నౌకలో డ్రగ్సే దొరకలేదన్నారు. ఈ సందర్భంగా రైడ్ జరుగుతున్నప్పటి కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. ఇందులోని ఒక వీడియోలో ఆర్యన్ను ఎస్కార్ట్ చేస్తూ గోస్వామి అనే వ్యక్తి కనిపించారు. అయితే అతను ఎన్సీబీ అధికారి కాదని, గోస్వామి సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం అతను ఒక ప్రైవేట్ డిటెక్టివని నవాబ్ ఆరోపించారు. మరో వీడియోలో ఇదే కేసులో అరెస్టయిన అర్బాజ్ మర్చెంట్ను ఇద్దరు ఎస్కార్ట్ చేస్తూ కనిపించారు. వీరిలో ఒక వ్యక్తి బీజేపీ సభ్యుడని నవాబ్ చెప్పారు. వీరంతా ఎన్సీబీ అధికారులు కానప్పుడు రైడ్లో ఎందుకున్నారని ప్రశ్నించారు. మర్చంట్తో పాటు ఉన్న వ్యక్తి గుజరాత్లో సెపె్టంబర్ 21–22 తారీకుల్లో కనిపించాడని, అందువల్ల అతనికి ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్తో సంబంధం ఉండి ఉండొచ్చని ఆరోపించారు. సదరు వ్యక్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ను, తమ ప్రభుత్వాన్ని మకిలిపట్టించేందుకు ఎన్సీబీని బీజేపీ ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. నవాబ్ అల్లుడు సమీర్ ఖాన్ను ఎన్సీబీ డ్రగ్స్ కేసులో గత జనవరిలో అరెస్టు చేయగా, సెపె్టంబర్లో బెయిల్పై బయటకు వచ్చారు. అవును.. అక్కడే ఉన్నాను: నౌకలో ఎన్సీబీ సోదాలు జరిపినప్పుడు తాను అక్కడే ఉన్నానని మాలిక్ ఆరోపణల్లో కేంద్రబిందువుగా మారిన మనీశ్ భన్సాలీ తెలిపారు. తాను బీజేపీ కార్యకర్తనేనని, కానీ ఏ నాయకుడిని ఇంతవరకు కలవలేదని తెలిపారు. తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కలి్పంచాలని కోరతానన్నారు. ‘‘అక్టోబర్ 1న డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం వచ్చింది. దీన్ని ఎన్సీబీకి చెప్పమని నా స్నేహితుడు సూచించాడు. ఈ పార్టీ విషయమై ఎన్సీబీ వద్ద స్వల్ప సమాచారమే ఉంది. మేము మరికొంత అందించాం. అక్టోబర్ 2న రైడ్ను ప్లాన్ చేశారు. సాక్షిగా నేను సంఘటనా స్థలంలో ఉన్నాను’’ అని మనీశ్ వెల్లడించారు. ఎన్సీబీ అధికారులతో తాను ఉన్నానని, అందుకే వీడియోల్లో ఎస్కార్ట్ చేస్తున్నట్లు కనిపించిందని ఇండియాటుడేకు ఆయన తెలిపారు. నవాబ్ మాలిక్ మలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను దేశం కోసం పనిచేస్తున్నామని, నౌకలో షారూఖ్ కొడుకున్నట్లు తమకు తెలియదని చెప్పారు. వారంతా సాక్షులు తమ ఏజెన్సీపై వస్తున్న ఆరోపణలు నిరాధారాలని, గతంలో తాము చేసిన అరెస్టులకు ప్రతీకారంగా చేస్తున్నవై ఉండొచ్చని ఎన్సీబీ డీఐజీ జ్ఞానేశ్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమ విచారణ చట్టబద్ధంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. రైడ్లో ఎన్సీపీ అధికారులతో పాటు గోస్వామి, భన్సాలీతో పాటు ప్రభాకర్, గోమెజ్, ఉస్మానీ, వైగాంకర్, రానే, ప్రకాశ్, ఫయాజ్, ఇబ్రహీంలు పాల్గొన్నారని, వీరంతా సాక్షులుగా వ్యవహరించారని వివరించారు. ఎన్సీబీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆర్యన్ ఖాన్కు వ్యతిరేకంగా సాక్ష్యాలుండబట్టే కోర్టు అతన్ని కస్టడీకి పంపిందని బీజేపీ ఎంఎల్ఏ అతుల్ అభిప్రాయపడ్డారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే వెంటనే బెయిల్ వచ్చేదన్నారు. అల్లుడి అరెస్టును మనసులో ఉంచుకొని మాలిక్ ఆరోపణలు చేశారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్ ముంబైలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఎన్సీబీ అధికారులు తాజాగా మరొక డ్రగ్ విక్రేతను అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముంబైలోని సబ్–అర్బన్ పోవాయ్లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీఐ ముంబై జోనల్ అధికారులు బుధవారం వెల్లడించారు. దీంతో, బాలీవుడ్ స్టార్ షారుఖ్ఖాన్ కొడుకుసహా మొత్తం 17 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. కాగా, మంగళవారం అరెస్టయిన నలుగురు ఈవెంట్ ఆర్గనైజర్లు సమీర్ సెహగల్, మానవ్ సింఘాల్, భాస్కర్ అరోరా, గోపాల్ ఆనంద్లను 14 తేదీ దాకా ఎస్సీబీ కస్టడీకి పంపుతూ ముంబైలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నెర్లికర్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. మరోవైపు, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు కొందరు బుధవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్ తండ్రి అస్లాం వారిలో ఉన్నారు. తన కుమారుడు అమాయకుడని ఆయన వ్యాఖ్యానించారు. అర్బాజ్కు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు లాయర్ పిటిషన్ దాఖలుచేశారు. అక్టోబర్ రెండో తేదీన ముంబై పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ వద్ద ఉదయం 11.30 నుంచి రాత్రి 8.30 వరకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని తెప్పించి, భద్రపరచాలని విన్నవించు కున్నారు. దీనిపై మీ స్పందన తెలపాలని ఎన్సీబీని కోర్టు ఆదేశించింది. -
ఆర్యన్ ఖాన్తో సెల్ఫీపై విమర్శలు.. ‘బీజేపీ హస్తం ఉంది’
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్కు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరలవ్వడంతో పాటు వివాదాస్పదంగా కూడా మారింది. పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్తో ఓ వ్యక్తి సెల్ఫీ దిగాడు. సదరు వ్యక్తిని ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్గా గుర్తించారు. ఇక ఈ ఫోటోపై మహారాష్ట్ర మినిస్టర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. (చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ) ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలు చేశారు. ఈ సందరన్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం ఆర్యన్ ఖాన్ చేయి పట్టుకుని.. ఎన్సీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చి వ్యక్తి ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి. అలానే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనీశ్ భానుశాలి రెయిడ్ జరిగిన విజువల్స్లో కనిపించారు. ఎన్సీబీ అధికారులతో పాటు ఉన్న వీరిద్దరని చూస్తే.. దీనిలో బీజేపీ హస్తం ఉందని అర్థం అవుతుంది. నకిలీ డ్రగ్స్ రాకెట్ను పట్టుకుని.. మహారాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అన్నారు. నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను ఎన్సీబీ కొట్టిపారేసింది. ఈ ఇద్దరినీ "స్వతంత్ర సాక్షులు" అని పేర్కొంది. ‘‘నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ కేసుకు సంబంధించిన విచారణ చట్టపరంగా, వృత్తిపరంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోంది" అని ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్తో పాటు మరో ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు. (చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?) భానుశాలి పాత్రపై బీజేపీ స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలి. "రాజకీయాలు చేయడానికి అనేక సమస్యలు ఉంటాయి, కానీ మన దేశ భవిష్యత్తు తరాలకు సంబంధించిన డ్రగ్స్ విషయంలో మేము రాజకీయాలు చేయలేం’’ అని బీజేపీ ప్రతినిధి రామ్ కదం స్పష్టం చేశారు క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై గత శనివారం రాత్రి దాడులు చేసిన తరువాత, డ్రగ్స్ నిరోధక అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరాస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 33 1.33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదు. అయితే, అతని వాట్సాప్ చాట్లో నేరపూరితమైన విషయాలు ఉన్నట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. చదవండి: మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..! -
డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్టు
ముంబై/థానే: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరం సమీపంలో సముద్రంపై విహరిస్తున్న ఓ పర్యాటక నౌకలో జరుగుతున్న డ్రగ్స్పార్టీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు భగ్నం చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు గాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్ను ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఒకరోజు ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్పై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27, సెక్షన్ 8సీ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అతడిని ఎన్సీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారిస్తున్నారు. నౌకలో మాదక ద్రవ్యాలతో ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, నూపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్ పట్టుబడ్డారని, వీరిలో ఇద్దరు యువతులు ఉన్నారని వెల్లడించారు. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల మెఫిడ్రోన్(ఎండీ), 1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుస్తులు, పర్సుల్లో డ్రగ్స్ ముంబై నుంచి గోవాకు పయనమైన కార్డెలియా క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడి చేశారు. నౌకలో అనుమానితులను సోదా చేశారు. వారి వద్ద పలు రకాల మాదక ద్రవ్యాలు లభించాయి. వాటిని దుస్తుల లోపల దాచిపెట్టినట్లు గుర్తించారు. యువతులు తమ పర్సుల్లో డ్రగ్స్ దాచుకున్నారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించారు. అయితే, డ్రగ్స్ పార్టీతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని క్రూయిజ్ కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ప్రైవేట్ కార్యక్రమం కోసం ఈ నౌకను అద్దెకు ఇచ్చామని వాటర్వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, అధ్యక్షుడు జుర్గెన్ బైలామ్ తెలియజేశారు. కేవలం కుటుంబాలకు వినోదం కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని, తమ నౌకల్లో అనుచితమైన పనులను ప్రోత్సహించబోమని వివరించారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటు న్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్యన్ ఖాన్ అరెస్టును అధికారులు ప్రకటించడానికంటే కొద్ది సేపటి ముందు షారుఖ్ ఖాన్ తన ఇంటి నుంచి లాయర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తన కుమారుడి అరెస్టుపై ఆయన ఇంకా అధికారికంగా స్పందించలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి: రాందాస్ అథవాలే నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వంటి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో డ్రగ్స్కు స్థానం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కోరుతానని అన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ దందా బహిర్గతమయ్యిందని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో ఇదొక పెద్ద జాడ్యంగా తయారయ్యిందని చెప్పారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. ముంద్ర పోర్టు ఘటన నుంచి దృష్టి మరల్చడానికే: కాంగ్రెస్ గుజరాత్లోని ముంద్ర పోర్టులో ఇటీవల పట్టుకున్న రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముంబైలో డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత షమా మహమ్మద్ ఆరోపించారు. ముంద్ర పోర్టు ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ముంద్ర పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) రూ.21,000 కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. షారుక్ఖాన్ తనయుడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఎన్సీబీని షమా మహమ్మద్ ప్రశ్నించారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన డ్రగ్స్పై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు. ఎవరీ సమీర్ వాంఖెడే పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్కర్ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్తోపాటు మరో ఐదుగురు ఎన్సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. -
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ దందా!
మహారాష్ట్ర:ముంబైలో పట్టుబడుతున్న భారీ డ్రగ్స్ స్థావరాలు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గుర్తించింది. శుక్రవారం ముంబై నార్త్ అంధేరీలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ 4.6కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో తయారు చేసి పరుపులు, మెత్తల్లో పెట్టి సముద్ర మార్గంగా ఆస్ట్రేలియా తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియా డ్రగ్స్ తరలింపు జరుగుతోంది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి మూడు రోజుల క్రితం గోవా డ్రగ్స్ కేసులో హైదరాబాది సిద్ధిక్ అహ్మద్ అరెస్టు అయ్యారు. శనివారం ముంబైలో షిప్లో పట్టుబడ్డ ఎపిడ్రిన్ సైతం హైదరాబాద్ నుండే వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎపిడ్రిన్ డ్రగ్స్కు హైదరాబాద్ కేంద్రంగా మారినట్లు సమాచారం. నైజీరియన్ పెడ్లర్లుగా మార్చుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ బిజినెస్ జరుగుతోంది. ఇటీవల బెంగళూర్లో పట్టుబడ్డ డ్రగ్స్ డాన్ యోగిత, హైదరాబాద్లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. యోగిత, సిద్ధిఖ్ అహ్మద్ల విచారణలో హైదరాబాద్ డ్రగ్స్ లింకులు బయటపడనున్నట్లు తెలుస్తోంది. ముంబై తీరంలో శనివారం క్రూజ్ షిప్లో రేవ్ పార్టీపై అధికారులు దాడి చేయగా.. రేవ్ పార్టీలో షారుఖ్ పెద్ద కొడుకు అర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని ఔటర్ రింగ్రోడ్డు టోల్ప్లాజా వద్ద రూ.21 కోట్లు విలువచేసే 3,400 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకుని జప్తుచేశారు. 141 గన్నీ సంచుల్లో సరుకు నింపి, బయటకు కనిపించకుండా టార్పాలిన్ షీట్లతో కప్పేశారు. అనుమానం రాకుండా దానిపై నర్సరీ మొక్కలను లోడ్చేశారు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ నుంచి అందిన సమాచారంతో ఎన్సీబీ హైదరాబాద్, బెంగళూరు బృందాలు సంయుక్తంగా దాడిచేసి ట్రక్కును పట్టుకున్నాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ట్రక్కులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన డి.షిండే, ఎంఆర్ కాంబ్లే, ఎన్.జోగ్దండ్ను అరెస్టుచేశారు. గతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్లో 3,992 కిలోల గంజాయిని జప్తుచేసుకుని 16 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో లభించిన సమాచారం ఆధారంగా మరో మూడు స్మగ్లర్ల నెట్వర్క్లను ఎన్సీబీ ఛేదించింది. గత ఆపరేషన్ ద్వారా లభించిన సమాచారంతోనే తాజాగా మరోసారి పట్టుకున్నట్టు ఎన్సీబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ఓ కీలక వ్యక్తి తాజాగా పట్టుబడిన ముఠా వెనక ఉన్నట్టు ఎన్సీబీ గుర్తించింది. ముంబై, పూణె, థానెతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్ సిండికేట్ల కోసం అతడు ఈ సరుకును తరలించేందుకు ఏర్పాట్లు చేశాడని తెలిపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సిండికేట్ల ద్వారా కళాశాలల విద్యార్థులు, పార్టీలు, వ్యక్తులకు సరఫరా చేస్తున్నారని పేర్కొంది. -
ఏం ఐడియా రా బాబు.. వంటింటినే ల్యాబ్గా మార్చి..
సాక్షి, సిటీబ్యూరో: బాలానగర్లో ఉన్న నివాస ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సుధాకర్ అనే వ్యక్తి అందులో ఆల్ఫాజోలమ్ మాదకద్రవ్యం తయారు చేస్తున్నాడు. వంటింటినే ల్యాబ్గా మార్చి ఈ నిషేధిత డ్రగ్ ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందాలు శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో ఈ విషయం బహిర్గతమైంది. సుధాకర్ సహా అయిదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు 3.25 కేజీల మాదకద్రవ్యం, రూ.12.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాయి. తడవకు 5 కిలోల చొప్పున.. ► సుధాకర్ స్నేహితుడికి సాధారణ ఔషధాల తయారీకి సంబంధించిన లైసెన్స్ ఉంది. బాలానగర్కు చెందిన సుధాకర్తో కలిసి దీన్ని దుర్వినియోగం చేసిన ఇతగాడు తన కంపెనీ పేరుతో చిన్న పరిమాణంలో ఉన్న ఫ్లాస్క్, రియాక్టర్, డ్రయ్యర్ కొనుగోలు చేశాడు. వీటిని సుధాకర్ వంటింట్లో బిగించారు. ఆల్ఫాజోలమ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు వివిధ మార్గాల్లో సేకరిస్తున్న ఈ ద్వయం వాటిని వినియోగించి ఒక్కో తడవకు 4 నుంచి 5 కేజీల ఆల్ఫాజోలమ్ తయారు చేస్తోంది. దీన్ని స్థానికంగా ఉన్న ముఠాలతో పాటు కర్ణాటకలోని బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విక్రయిస్తున్నారు. ►ఇటీవలే 3.25 కేజీల డ్రగ్ ఉత్పత్తి చేసిన సుధాకర్ దాన్ని బెంగళూరుకు చెందిన నరేష్కు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. సరుకు తీసుకోవడానికి డబ్బు తీసుకుని శనివారం రాత్రి హైదరాబాద్కు రమ్మని సూచించాడు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ జోనల్ యూనిట్కు సమాచారం అందింది. అక్కడ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందంతో పాటు హైదరాబాద్ సబ్–జోనల్ యూనిట్ అధికారులూ హైదరాబాద్–మెదక్ రహదారిలోని గండి మైసమ్మ వద్ద ఉన్న ఉజ్వల గ్రాండ్ హోటల్ సమీపంలో కాపుకాశారు. ► సరుకు తీసుకుని ఓ కారులో వచ్చిన సుధాకర్తో పాటు మరో వ్యక్తిని, మరో కారులో వచ్చిన నరేష్ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే సుధాకర్ ఇంట్లో ఈ డ్రగ్ తయారవుతున్నట్లు వెలుగులోకి రావడంతో అక్కడా దాడి చేసి ఉపకరణాలు సీజ్ చేశారు. ఈ దందాను మరింత పెంచాలనే విస్తరించాలనే ఉద్దేశంతో సుధాకర్ ఇటీవలే తన పక్క ఇంటినీ అద్దెకు తీసుకున్నాడని, అందులో కొత్తగా రియాక్టర్, డ్రయ్యర్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంటినీ సీజ్ చేసిన ఎన్సీబీ టీమ్ ఔషధాల తయారీ లైసెన్స్ కలిగిన సుధాకర్ స్నేహితుడినీ అరెస్టు చేసింది. బాలానగర్లోని ఇంటి కేంద్రంగా దాదాపు అయిదేళ్లుగా ఆల్ఫాజోలమ్ తయారీ చేస్తున్నట్లు తేల్చారు. -
శోభపై నార్కోటిక్స్ కేసు.. ఊహించని మలుపులతో ఊరట
ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్పై ఈ జనవరిలో నార్కోటిక్స్ కేసు నమోదు అయ్యింది. ఆమె షోరూంలో గంజాయి దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరు నెలల విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టారు. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెను పక్కాగా ఈ కేసులో ఇరికించాడు ఓ వ్యక్తి. వివరాళ్లోకి వెళ్తే.. తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్(34).. పదేళ్ల నుంచి చేనేత రంగంలో రాణిస్తోంది. తిరువనంతపురంలో ఆమెకు ఓ చేనేత పరిశ్రమతో పాటు ఓ క్లోతింగ్ స్టోర్ ఉన్నాయి. ఆమె క్లయింట్స్లో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఆరేళ్లుగా భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమె.. కోర్టులో విడాకుల వాదనలకు హాజరవుతూ వస్తోంది. అయితే జనవరి 21న ఆమె జీవితంలో మరిచిపోలేని ఘటన జరిగింది. కొవలంలో కొత్త బ్రాంచ్ పనుల్లో బిజీగా ఉన్న ఆమెకు తిరువనంతపురం పోలీసుల నుంచి ఓ ఫోన్కాల్ వచ్చింది. ఆమె అవుట్లెట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వాళ్లు చెప్పడంతో ఆమె షాక్ తింది. సుమారు 400 గ్రాముల గంజాయి.. దొరకడంతో నార్కోటిక్స్ టీం ఆమెను కేసులో బుక్ చేసి ప్రశ్నించింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయింది. తాను అమాయకురాలినంటూ సీఎంకు, డీజీపీలకు ఆమె లేఖ రాయడం.. హై ప్రొఫైల్ సెలబబ్రిటీ కావడంతో ఈ కేసు తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు అధికారులు. రెండు నెలల ట్రేస్ తర్వాత.. డీఎస్పీ అమ్మినికుట్టన్ ఆధ్వర్యంలోని బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇంట్లో పనిమనిషి.. స్టోర్లోకి వెళ్లడాన్ని గుర్తించింది ఆ టీం. ఆమెను ప్రశ్నించడంతో వివేక్ అనే వ్యక్తి తనకు గంజాయి ప్యాకెట్లు ఇచ్చి.. షాపులో పెట్టమని చెప్పాడని తెలిపింది. వివేక్ ఒకప్పుడు శోభా దగ్గరే పనిచేశాడు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలతో అతన్ని పని నుంచి తొలగించింది. హరీష్ హరిదాస్ అనే వ్యక్తితో కుమ్మక్కై వివేక్, శోభపై కుట్ర పన్నాడని ఆ తర్వాతే తేలింది. పెళ్లి కాదందనే.. హరీష్ హరిదాస్ యూకే పౌరసత్వం ఉన్న వ్యక్తి. లార్డ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హరిదాస్ కొడుకు. పైగా డాక్టర్ కూడా. ఏడాది క్రితం శోభకు హరీష్ పెళ్లి ప్రతిపాదన పంపాడు. ఆమె కాదంది.అది మనసులో పెట్టుకునే ఆమె నార్కోటిక్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమెపై ఉన్న ఆరోపణలు కొట్టేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ నుంచి ఆమె పేరును తొలగించారు. వివేక్ ను అరెస్ట్ చేయగా.. హరిష్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్టు..
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇక్బాల్ కస్కర్ను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ ధృవీకరించిందని వార్తా సంస్థ ఎఎన్ఐ తెలిపింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి ముంబైలో సరఫరా చేస్తుండగా అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదిలాఉండగా.. గతంలో కస్కర్ పై మనీలాండరింగ్ కేసుతో పాటు, ఒక బిల్డర్ నుంచి బెదిరించి డబ్బు దోచుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతనిపై కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీం అనుచరడు చోటా షకీల్, గ్యాంగ్స్టర్లు ఇస్రార్ జమీల్ సయ్యద్, ముంతాజ్ ఎజాజ్ షేక్ పంకజ్ గంగార్లను నిందితులుగా పేర్కొన్నారు. చదవండి:పక్కింటివాళ్లతో గొడవ.. 12వ అంతస్తు నుంచి దూకిన మహిళ -
సుషాంత్ కేసు: సిద్ధార్థ్ కస్టడీకి కోర్టు అనుమతి
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితానిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్దార్థ్ అరెస్ట్పై తాజాగా ఎన్సీబీ ప్రెస్నోట్ను విడుదల చేసింది. '' ఈ నెల 26న సిద్థార్ధ్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశాం. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా .. సిద్థార్ధ్ స్పందించలేదు. దీంతో సిద్ధార్థ్ను అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్పై ముంబైకి తరలించి ముంబై కోర్టులో సిద్థార్ధ్ను హాజరుపరిచాం. కోర్టు జూన్ 1 వరకు సిద్ధార్థ్ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.'' అని తెలిపింది. కాగా అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్ను పలుమార్లు విచారించారు. చదవండి: సుశాంత్ కేసు: నటుడి పీఆర్ మేనేజర్ అరెస్ట్ -
హైదరాబాద్లో సుశాంత్ ఫ్లాట్మేట్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని అరెస్టయ్యాడు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ)అధికారులు శుక్రవారం నాడు హైదరాబాద్లో సిద్ధార్థ్ను అరెస్ట్ చేశారు. అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్ను పలుమార్లు విచారించారు. ఈ క్రమంలో సుశాంత్ మరణించి ఏడాది కావడానికి కొన్ని రోజుల ముందు సిద్ధార్థ్ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా సిద్ధార్థ్ సుశాంత్కు పీఆర్ మేనేజర్గానూ పని చేశాడు. చదవండి: డ్రగ్స్ కేసు చార్జిషీట్: రియా చక్రవర్తి సహా 33 మంది.. సుశాంత్ చేజార్చుకున్న 7 హిట్ సినిమాలివే.. -
‘డ్రగ్స్’ వివరాలు ఎందుకు దాస్తున్నారు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఇతర కళాశాలల్లో విద్యార్థులు విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నా పట్టించుకునే వారే లేరని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ సరఫరాను నియంత్రించాల్సిన నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించింది. 2016లో రాష్ట్రంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులను సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరుతూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. డ్రగ్స్ కేసుల విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి నివేదించారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ను ప్రస్తావించింది. తమకు సమాచారం ఇవ్వడం లేదని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందన లేదని, ఈ నేపథ్యంలో ఈ వివరాలు సమర్పించేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరారు. ‘డ్రగ్స్ సరఫరా చేసే, వినియోగించే వారి వివరాలను ఎందుకు దాస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోరిన సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదు’అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను జూన్కు వాయిదా వేసింది. చదవండి: ప్రాణాలకన్నా ఎన్నికలు ముఖ్యమా? -
రూ.3,000 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం
కొచ్చి: అరేబియా సముద్రంలో భారత నేవీ రూ.3వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నట్లు రక్షణశాఖ సోమవారం వెల్లడించింది. చేపలు పట్టే ఓ పడవలో మత్తుపదార్థాలను గుర్తించినట్లు పేర్కొంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత నేవీకి చెందిన సువర్ణ షిప్ పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వారికొక చేపలు పట్టే పడవ కనిపించింది. అందులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో నేవీ అధికారులు అందులోకి దిగి సోదాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారికి 300 కేజీల మత్తు పదార్థాలు కనిపించాయి. దీంతో బోటులోని వ్యక్తు లను కొచ్చి తీరానికి తరలించి విచారణ జరుపు తున్నారు. బోటులోని అయిదుగురు శ్రీలంకు చెందినవారు. ఆ బోటు శ్రీలంకకు చెందినదని, పాకిస్తాన్ నుంచి బయలుదేరి భారత్, శ్రీలంక వైపుగా పయనిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న మత్తు పదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 3 వేల కోట్లు ఉంటుందని వెల్లడించారు. తదుపరి విచారణను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి అప్పగించనున్నారు. -
రియాకు బెయిల్!: సుప్రీంకోర్టుకు ఎన్సీబీ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మత్తు పదార్థాల నియంత్రణా సంస్థ (ఎన్సీబీ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో సీజేఐ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ కేసును మార్చి 18న విచారించనుంది. రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు గతేడాది అక్టోబర్ 7న బెయిల్ ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్పోర్టు అధికారులకు సమర్పించాలని, ముంబై దాటి వెళ్లాల్సి వస్తే ఎన్సీబీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందిగా పలు నిబంధనలు పెట్టింది. రానున్న ఆరు నెలల పాటు ప్రతినెల 1న పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు మీదే ఎన్సీబీ సుప్రీంకోర్టును చేరింది. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ దొరకలేదు. చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు: రియా చక్రవర్తి -
డ్రగ్స్ కేసు: 12 వేల పేజీల చార్జిషీట్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. డ్రగ్స్కు, బాలీవుడ్కు ఏమైనా లింకులున్నాయా? అన్న కోణంలో ఎన్సీబీ ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. కొన్ని నెలలుగా విచారణ ముమ్మరం చేసిన ఎన్సీబీ శుక్రవారంనాడు ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చార్జిషీటులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్తో పాటు 33 మంది నిందితుల పేర్లను ప్రస్తావించింది. 200 మంది సాక్ష్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని జత చేస్తూ 12 వేల పేజీలకు పైగా ఉన్న చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. కాగా గతేడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడగా సెప్టెంబర్ 8న ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ను అరెస్ట్ చేశారు. తర్వాతి నెలలోనే వీళ్లిద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ తర్వాత ఈ డ్రగ్స్ కేసుకు బీటౌన్లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు దీపిక పదుకునే, శ్రద్దా కపూర్, ఫిరోజ్ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. చదవండి: సుశాంత్ వదిలేసుకున్న బ్లాక్బస్టర్ సినిమాలు! భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్ -
సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురు డ్రగ్ డీలర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎన్సీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా.. ముంబైలోని అంధేరీ వెస్ట్లో సోదాలు నిర్వహించింది. సుమారు రెండున్నర కోట్ల విలువ గల 5 కిలోల హషిష్, ఆఫీం, ఎండీఎమ్ఏ(మాలి) తదితర డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. వీటిని సరఫరా చేస్తున్న రీగల్ మహాకల్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. కాగా మహాకల్తో పలువురు బీ-టౌన్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు ఎన్సీబీ భావిస్తోంది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడం ద్వారా కేసులో పురోగతి సాధించగలమని అధికారులు వెల్లడించారు.(చదవండి: షోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు) ఇక ఈ విషయం గురించి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేం రీగల్ మహాకల్ను అరెస్టు చేశాం. రియా చక్రవర్తి, షోవిక్తో అతడికి సంబంధాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేం’’ అని పేర్కొన్నారు. కాగా రీగల్, అనూజ్ కేశ్వానికి డ్రగ్స్ సరఫరా చేయగా, అతడి నుంచి రియా వాటిని కొనుగోలు చేసి సుశాంత్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగత జీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తనతో సహజీవనం చేసిన రియా చక్రవర్తి కారణంగానే అతడు మరణించాడని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుశాంత్, రియా, వారి ఫ్లాట్లో నివసించే మరికొంత మందిని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అనేక పరిణామాల అనంతరం అరెస్టైన రియా చక్రవర్తి తొలుత బెయిలుపై బయటకు రాగా, షోవిక్ కూడా ఇటీవలే జైలు నుంచి విముక్తి పొందాడు. (చదవండి: డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా) -
కమెడియన్ భార్తీ సింగ్ అరెస్ట్
ముంబై: కమెడియన్ భార్తీ సింగ్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబైలో అరెస్టు చేసింది. శనివారం ఉదయం భార్తీ సింగ్ నివాసం లోఖండావాలా కాంప్లెక్స్తోపాటు కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో స్వల్ప మొత్తంలో 86.5 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెతోపాటు, భర్త హర్ష లింబాచియాను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి, ప్రశ్నించారు. విచారణ అనంతరం భార్తీ సింగ్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నటుడు సుశాంత్ సింగ్ మృతికి, డ్రగ్స్కు సంబంధంపై విచారణ జరుపుతున్న ఎన్సీబీ ఇటీవల పలువురు సినీ రంగ ప్రముఖులు, సరఫరా దారులను ప్రశ్నించడంతోపాటు కొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాదారు ఒకరు తెలిపిన సమాచారం ఆధారంగా భార్తీ సింగ్ ఇంటితోపాటు ముంబైలోని మరో రెండు ప్రాంతాల్లో సోదాలు జరిపామని ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. గంజాయిని వాడినట్లు భార్తీ సింగ్ దంపతులు అంగీకరించారని కూడా ఆయన వెల్లడించారు. భార్తీని నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామనీ, లింబాచియా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. చట్ట ప్రకారం..వెయ్యి గ్రాముల వరకు గంజాయి దొరికితే చిన్న మొత్తంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి 6 నెలల జైలు శిక్ష లేదా 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, భార్తీ సింగ్ టీవీల్లో పలు కామెడీ, రియాల్టీ షోల్లో పాల్గొన్నారు. -
ప్రముఖ కమెడియన్ అరెస్ట్
ముంబై : ప్రముఖ కమెడియన్ భారతి సింగ్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం భారతీ సింగ్ ఇంటిపై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఆమె ఇంట్లో కొద్ది మొత్తంలో గంజాయి దొరికినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల అనంతరం భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాను అదుపులోకి తీసుకొని ప్రశ్నలు వర్షం కురిపించారు. అనంతరం భారతీ సింగ్తో పాటు ఆమె భర్త హర్ష్ లింబాచియాను అరెస్ట్ చేసి ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి తరలించారు. భారతీ సింగ్ ఇంట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు. కాగా, శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అర్జున్ను ఆరు గంటలు విచారించిన ఎన్సీబీ
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్కు సంబంధం ఉందనే ఆరోపణలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆయనకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నిన్న(శుక్రవారం) ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హజరయ్యారు. గత సోమవారం అర్జున్ నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో పాటు పలు అనుమానిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆయనను నిన్న దాదాపు ఆరు గంటలపాటు ఎన్సీబీ విచారించింది. అనంతరం అర్జున్ మీడియాతో మాట్లాడుతూ... తాను పూర్తిగా ఎన్సీబీకి సహకరిస్తున్నానని చెప్పారు. అయితే డ్రగ్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ఇంట్లో దొరికిన ప్రిస్క్రిప్షన్ ద్వారా కొన్న మందులని స్పష్టం చేశారు. ఆ ప్రిస్క్రిప్షన్ను అధికారులను అందించానని కూడా అర్జున్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు నిబద్ధతతో ఉన్నారని, వారి పని వారు చేసుకుంటున్నారని అధికారులను ప్రశంసించారు. ముఖ్యంగా అధికారుల్లో ఒకరైన సమీర్ వాఖేండే బాగా పని చేస్తున్నారన్నారు. అయితే ఆయన గర్ల్ఫ్రెండ్ గాబ్రియేలా సోదరుడు అజియాలోస్ దిమిత్రియేడ్స్ను డ్రగ్స్ పెడ్లర్తో సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాబ్రియేలాకు కూడా సమన్లు జారీ చేసిన ఎన్సిబీ విచారించింది. కాగా ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిని విచారణకు పలిచిన ఎన్సీబీ ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఎటువంటి సంబంధాలు లేవని క్లీన్చిట్ ఇచ్చింది. -
అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
ముంబై: మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోదాలు నిర్వహించింది. నవంబర్ 11న విచారణకు హాజరుకావ్సాలిందిగా ఎన్సీబీ రాంపాల్కి సమన్లు జారీచేసింది. సబర్బన్ బాంద్రాలోని ఆయన ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఆయన డ్రైవర్ను విచారించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వాడకంపై ఎన్సీబీ విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూహూ ప్రాంతంలోని బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారంటూ ఆయన భార్యని ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్సీబీ ఎదుట హాజరైన నదియాద్వాలా తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదివరకే అరెస్టు అయిన వహీద్ అబ్దుల్ ఖాదిర్ షేక్ అలియాస్ సుల్తాన్ ఇచ్చిన సమాచారంతో ఎన్సీబీ అధికారులు నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, పది గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదకద్రవ్యాల కేసులో ఎన్సీబీ, తాజాగా మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు 727.1 గ్రాము గంజా, 74.1 గ్రాముల ఇతర మాదకద్రవ్యాలను, రూ.3.58 లక్షల నగదును వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. -
అర్జున్ రాంపాల్కు ఎన్సీబీ నోటీసులు
ముంబై : బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎస్సీబీ) అధికారులు నోటీసులు అందజేశారు. బాలీవుడ్కి డ్రగ్స్కి లింక్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని రాంపాల్కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అంతకు ముందు ఎన్సీబీ అధికారులు అర్జున్ రాంపాల్ నివాసంపై దాడులు నిర్వహించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా డ్రగ్స్కు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు. కాగా, ఆదివారం ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా భార్యను అరెస్టు చేసి.. ఆ ఇంటినుంచి 10 గ్రాముల మార్జువానాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తమముందు ఈ నెల 8 న హాజరు కావాల్సిందిగా కోరుతూ ఫిరోజ్ కు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ కి చెందిన మరికొందరి ఇళ్లలో తాము సోదాలు చేయనున్నామని ఎన్సీబీ అధికారులు తెలిపారు. -
దీపికా మేనేజర్కు మరోసారి ఎన్సీబీ సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ కేసు దర్యాప్తు భాగంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్(ఎన్సీబీ) మరోసారి సమన్లులు జారీ చేసింది. గత నెలలో ఎన్సీబీ ఆమెకు సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కరిష్మా ప్రకాష్ విచారణకు గైర్హాజరు కావడంతో కరిష్మా పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఇవాళ (సోమవారం) ఎన్సీబీ ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి, ఆ నోటీసులు ఆమె తల్లి మితాక్షర పురోహిత్కు అందచేశారు ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే దీపికా పదుకొనెతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ను ప్రశ్నించాం. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశాం’ అని తెలిపారు. (చదవండి: పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్) అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నటి రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో పలువురు బాలీవుడ్ నటీనటులు పేర్లను వెల్లడించింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లు ఉన్నాయి. అంతేగాక దీపికా, ఆమె మేనేజర్ కరిష్మాల పాత వాట్సప్ డ్రగ్స్ చాట్ కూడా వెలుగులోకి రావడంతో వీరిద్దరిని ఎన్సీబీ విచారణకు పిలిచింది. అలాగే వీరితోపాటు శ్రద్దా కపూర్, సారా, రకుల్లకు కూడా ఎన్బీసీ అధికారులు సమన్లు ఇచ్చారు. వీరిపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో వారిని ఎన్సీబీ తిరిగి పంపించిన విషయం తెలిసిందే. చదవండి: మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!) -
పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్
సాక్షి, ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, దీపికా పదుకొనేలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్కి ఎన్సీబీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. బాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తు కేసులో అరెస్టయిన డ్రగ్ పెడ్లర్ను విచారించినప్పుడు కరిష్మా ప్రకాష్ పేరు వెలుగులోకి వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. వెర్సోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో 1.7 గ్రాముల హషీష్, సీబీడీ ఆయిల్ మూడు బాటిళ్లనిస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి) కరిష్మా ప్రకాష్కు డ్రగ్ పెడ్లర్తో సంబంధాలుండటం, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ, ఎన్సీబీకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేశాక విచారణకు హాజరుకాకపోవడం వంటి పనులు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని.. ఎన్సీబీ ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ అధికారులు కరిష్మా ప్రకాష్, దీపికా పదుకొనే మధ్య జరిగిన అనుమానాస్పద మెసేజ్లను గుర్తించారు. దీని ఆధారంగా ఈ ఇద్దరినీ గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాష్ మాత్రమే కాక, ఆమె సహోద్యోగి జయ సాహా, నటులు రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లను కూడా గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేసింది. అతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఒక నెల జైలు శిక్ష తరువాత ఆమె బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. -
గిఫ్ట్గా హనీమూన్ ట్రిప్.. జైలులోనే ప్రసవం
ముంబై: పెళ్లై సంతోషంగా గడుపుతున్న జంటకు హనీమూన్ ట్రిప్ పేరిట ఎర వేసిందో సమీప బంధువు. తన సొంతలాభం కోసం, వారి ప్రయాణ ఖర్చులు భరించి, జైలుపాలు చేసింది. దీంతో ఏడాదికి పైగా ఎడారి దేశంలోని జైళ్లలో మగ్గుతున్న ఆ జంటను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారికి బాసటగా నిలిచారు. అక్రమ కేసు నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వివరాలు.. ముంబైకి చెందిన ఒనిబా, షరీఖ్లు దంపతులు. సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితాల్లోకి సమీప బంధువైన తబుస్సుమ్ రియాజ్ ఖురేషీ అనే మహిళ ప్రవేశించింది. పెళ్లైన తర్వాత హనీమూన్కు వెళ్లలేదు గనుక ఖతార్ ట్రిప్ను బహుమతిగా ఇస్తానని, అక్కడికి వెళ్లి సంతోషంగా గడపాలంటూ చెప్పింది. దీంతో తొలుత ఈ గిఫ్ట్ను నిరాకరించిన సదరు దంపతులు, ఆ మహిళ ఒత్తిడి పెంచడంతో సరేనన్నారు. బ్యాగులు ప్యాక్చేసుకుని ఖతార్కు పయనమయ్యారు. అయితే, దురుద్దేశంతోనే ఒనిబా, షరీఖ్లకు ఈ బహుమతి ఇచ్చిన తబస్సుమ్, వారికి తెలియకుండా, లగేజీలో 4 కిలోల హషిష్(డ్రగ్స్) ప్యాకెట్ను పెట్టింది. దోహాలో ఉన్న తమ స్నేహితుల కోసం ఈ ప్యాక్ పంపిస్తున్నానని నమ్మబలికింది. తెలిసిన వ్యక్తే గనుక వారు కూడా ఆమెను నమ్మి ప్యాకెట్ తెరచిచూడలేదు. (చదవండి: పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఆపై) ఈ క్రమంలో జూలై 6, 2019న హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టగానే, ఖతార్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు ఈ జంటకు 10 ఏళ్ల శిక్ష విధించడంతో పాటు, కోటి రూపాయల జరిమానా విధించింది. దీంతో ఈ ఏడాది కాలంగా ఒనిబా, షరీఖ్లు అక్కడి జైళ్లో జీవితం గడుపుతున్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన ఎన్సీబీ, ఈ డ్రగ్స్ కేసుతో ఒనిబా దంపతులకు సంబంధం లేదనే నిర్ధారణకు వచ్చింది. చండీగఢ్లో డ్రగ్స్తో పట్టుబడిన, తబస్సుమ్ అనుచరుడు నిజాం కరాను అక్టోబరు 14న అరెస్టు చేసిన ఎన్సీబీ, విచారణలో భాగంగా ఒనిబా, షరీఖ్ల కేసును ఛేదించింది. (ఆన్లైన్ క్లాసులు: కూతురిని పెన్సిల్తో పొడిచి) పథకం ప్రకారమే తబస్సుమ్ వారిద్దరిని ఖతార్ ట్రిప్పునకు పంపిందన్న నిజాం వాంగ్మూలంతో ఆమెపై కేసు నమోదు చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తబస్సుమ్ ప్రస్తుతం పరారీలో ఉంది. ఇదిలా ఉండగా.. ఒనిబా తండ్రి షకీల్ అహ్మద్ గతేడాది సెప్టెంబరులో ఎన్సీబీకి లేఖ రాశారు. తన కూతురు, అల్లుడిని విడిపించాల్సిందిగా కోరారు. ఇక ప్రస్తుతం ఈ కేసులో నిజానిజాలు బయటపడినందున వారి అభ్యర్థనను మన్నించిన ఎన్సీబీ, ఖతార్ అధికారులను సంప్రదించి ఈ కేసు విషయమై చర్చించి, ఒనిబా దంపతులను విడిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. కాగా ఖతార్లో అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చిన ఒనిబా, ఈ ఏడాది మార్చిలో జైళ్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. -
సుశాంత్ కేసు: రూ. 10 లక్షలు ఇప్పించండి!
ముంబై: బాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నిందితుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంటి సహాయకుడు దీపేశ్ సావంత్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. తనను అక్రమంగా నిర్బందించారని, ఇందుకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేసిన 36 గంటల వరకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించాడు. సెప్టెంబరు 5 రాత్రి ఎనిమిది గంటల సమయంలో తనను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారని, నిజానికి తనను అంతకుముందు రోజు రాత్రి పదింటికి అరెస్టు చేసినట్లు పేర్కొన్నాడు.(చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) సెప్టెంబరు 6న తనను మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారని, తద్వారా సుప్రీంకోర్టు నిబంధనల(నిందితుడిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టాలి)ను తుంగలో తొక్కారంటూ దీపక్ సావంత్ ఆరోపణలు చేశాడు. కాగా ఈనెల 5వ తేదీన దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణను నవంబరు 6కు వాయిదా వేశారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్ణిక్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది. ఇక సుశాంత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తితో పాటు దీపక్ సావంత్ సహా పలువురిని ఎన్సీబీ అరెస్టు చేసింది. దీపక్ సావంత్కు ఇటీవల బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే. -
రియాకు ఊరట.. షోవిక్కు షాక్!
ముంబై: బాలీవుడ్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం బుధవారం ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పదిరోజుల పాటు పోలీష్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా గ్రేటర్ ముంబై నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని రియాకు షరతు విధించింది. అయితే ఇదే కేసులో అరెస్టైన రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్, శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్లను హైకోర్టు బెయిలు నిరాకరించింది.(చదవండి: సుశాంత్ మృతి: ‘వాళ్లంతా ఉరేసుకోవాలి’) కాగా బాలీవుడ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులో వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అతడి ప్రేయస రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె, సుశాంత్ కోసం డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో సెప్టెంబరు 9న అదుపులోకి తీసుకుని, బైకుల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిలు కోరుతూ రియా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్టోబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా.. అనేక వాయిదాల అనంతరం హైకోర్టులో బుధవారం ఆమెకు ఊరట లభించింది. సుమారు నెల రోజుల తర్వాత ఆమెకు జైలు నుంచి విముక్తి లభించింది.(చదవండి: రియా రిమాండ్ను పొడిగించిన ముంబై కోర్టు) -
3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?
బాలీవుడ్లో డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎనోఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి రంగంలోకి దిగుతున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేసిన దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా రియా చక్రవర్తిని, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. క్వాన్, రియా అకౌంట్ల మధ్య జరిగిన భారీ నగదు లావాదేవీలు షాక్ గురిచేస్తున్నాయి. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా రెండు భారీ మొత్తాలు క్వాన్, రియా చక్రవర్తి అకౌంట్ల మధ్య ట్రాన్స్ఫర్ జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలపై ఈడీ ఆరా తీయాలనుకొంటున్నది. కంపెనీ నుంచి రియా అకౌంట్లోకి భారీగా కమీషన్లు జమ అయ్యాయి. ఒకానొక సమయంలో కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్న రియా అకౌంట్లోకి ఒక్కసారిగా లక్షలు బదిలీ కావడం పలు అనుమానాలను రేకిత్తిస్తోంది. రియా-ఆమె తల్లి సంధ్య పేరిట ఉన్న జాయింట్ అకౌంట్లోకి ఈ మొత్తం చేరినట్లు సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) ఈ క్రమంలో ఈడీ రియా, ఆమె తల్లి సంధ్య జాయింట్ అకౌంట్లో జరిగిన లావాదేవీలను పరిశీలించనుంది. ఇక రియా అకౌంట్లోకి వచ్చిన డబ్బు డ్రగ్ డీలర్లు ఇచ్చిన కమిషన్లే అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సుశాంత్ చనిపోయిన నెల తర్వాత రియా అకౌంట్లో కొన్ని కమీషన్లు జమ అయినట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఇక డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్షిండే దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు విచారించింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఇతరులకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రియా తరపు లాయర్ సుశాంత్ మొదటి నుంచీ మెంటల్ కేసే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రియాతో పరిచయానికి ముందు నుంచి అతనికి డ్రగ్స్ అలవాటు ఉందని తెలిపాడు. ఇక సుశాంత్ కోసం రియా డ్రగ్స్ కొనలేదని.. అతనికి డబ్బుకు కొదవలేదని తెలిపాడు. (చదవండి: ‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?) డ్రగ్స్ అలవాటు లేని రియా వాటిని ఎందుకు కొనుగోలు చేసిందని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. రియా, ఆమె సోదరుడు డ్రగ్ సిండికేట్ మెంబర్స్ అని తెలిపారు. ఇక బాలీవుడ్ నటుల ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేస్తున్న అధికారులు కొందరు నటులు డ్రగ్స్ కొనుగోలుకు క్రెడిట్ కార్డులు వాడినట్లు గుర్తించారు. -
‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్ను బాంబే హైకోర్టు నేడు విచారించనుంది. వీరిరువురితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టనుంది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రియాకు బెయిలు మంజూరు చేయవద్దంటూ ఎన్సీబీ సోమవారం తన నివేదికలో పేర్కొంది. రియా, ఆమె సోదరుడు స్వయంగా మాదక ద్రవ్యాలు సేవించడమే గాకుండా ఇతరులకు సరఫరా చేశారని, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొంది. (చదవండి: డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!) అదే విధంగా.. రియాకు డ్రగ్స్ సిండికేట్తో సంబంధాలు ఉన్నాయని, ఆమె మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారని నిరూపించేందుకు తగిన ఆధారాలు లభించాయని వెల్లడించింది. ఇక గతంలో రియా అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను విచారించారు.(నలుగురిదీ ఒక్కటే మాట..) -
నలుగురిదీ ఒక్కటే మాట..
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో జరుపుతున్న విచారణలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేతికి కీలక విషయాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్లు ఎన్సీబీకి చెప్పిన విషయాలు దాదాపు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. ‘హ్యాష్’ మత్తు పదార్థం కాదనే విషయాన్నే వీరు నలుగురూ చెప్పినట్లు సమాచారం. అయితే, ఇదే విషయం వీరిని మరిన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. దీంతోపాటు, వీరు కీలక సమాచారాన్ని ఎన్సీబీ అధికారుల ఎదుట బయటపెట్టినట్లుగా సమాచారం. దీని ఆధారంగా ఈ హీరోయిన్లను మరోసారి ప్రశ్నించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, సమీర్ వాంఖడే, అశోక్ జైన్ రూపొందించిన సమగ్ర నివేదికపై ఆదివారం రాత్రి ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగింది. ముంబైలో విస్తరించిన డ్రగ్ మాఫియా మూలాలను వెలికితీసి, చార్జిషీటు వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా ఆస్తానా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 20 మంది బడా డ్రగ్ సరఫరాదారులపై ఎన్సీబీ కన్నువేసినట్లు సమాచారం. కోర్టులో కరణ్ పేరు సుశాంత్ సింగ్ మృతి, బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాల కేసుల్లో దర్శకుడు కరణ్ జోహార్ పేరును ప్రస్తావించారు రియా చక్రవర్తి– క్షితిజ్ రవి ప్రసాద్ తరఫు లాయర్ సతీశ్ మనేషిండే. ఈ కేసులో కరణ్ పేరును ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా క్షితిజ్ను అధికారులు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ముంబైలోని కోర్టు క్షితిజ్కు ఆదివారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో మనేషిండే..విచారణ సమయంలో అధికారులు క్షితిజ్పై థర్డ్డిగ్రీ ప్రయోగించారనీ, కరణ్ జోహార్ పేరు కూడా వాంగ్మూలంలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారని అన్నారు. ఆ పేరు చెబితే వదిలిపెడతామంటూ ఆశ చూపారన్నారు. క్షితిజ్ ఇంట్లో సోదాల సమయంలో సిగరెట్ పీక మాత్రమే అధికారులకు దొరికినా అది గంజాయి అంటూ ఆరోపించారని తెలిపారు. 2019లో కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై ముంబైకి వస్తున్న కరణ్ను గోవా ఎయిర్పోర్టులో మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడలేదు. తనకు డ్రగ్స్ అలవాలు లేదనీ ఆయన గతంలోనే వ్యాఖ్యానించడం తెల్సిందే. -
కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు
బాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుకు, నిర్మాత కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన పార్టీకి సంబంధాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో స్టార్ నటులు దీపికా పదుకొణె, షాహిదోద్ కపూర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు పాల్గొనగా.. వీరు డ్రగ్స్ స్వీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వాళ్లు ఏదో మైకంలో ఉన్న వీడియో కూడా ఇటీవల తెగ వైరల్ అయింది. (చదవండి: డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!) ఈ క్రమంలో సుశాంత్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంపై విచారణ చేపడుతోన్న ఎన్సీబీ తాజాగా ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అది అవాస్తవమని ఎన్సీబీ ఖండించింది. ప్రస్తుత కేసుకు, కరణ్ నివాసంలో జరిగిన పార్టీ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్త అశోక్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో గురించి ఎలాంటి వివరాలు సేకరించడం లేదని తెలిపారు. కాగా కరణ్ సైతం తన పార్టీలో డ్రగ్స్ వాడకం జరగలేదని పేర్కొన్న విషయం తెలిసిందే.. (చదవండి: నాకు డ్రగ్స్ అలవాటు లేదు) -
అతడి ఇంటికి 12 సార్లు గంజాయి సప్లై
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ను ఆదివారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు ఎన్సీబీ అధికారులు. ఈ సందర్భంగా మరో తొమ్మిది రోజులు.. అక్టోబర్ 5వ తేదీ వరకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. షోవిక్, రియా చక్రవర్తికి గంజాయి సప్లయ్ చేసిన వారితో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో శనివారం ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శుక్రవారం ప్రసాద్ ఇంట్లో జరిపిన సోదాలలో వాడిపడేసిన గంజాయి లభించినట్లు వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. ( డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, శ్రద్ధా ఫోన్లు సీజ్ ) కాగా, డ్రగ్ డీలర్ సంకేత్ పాటెల్ విచారణలో ప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ ఇంటికి గంజాయి సప్లయి చేసినట్లు విచారణ సందర్భంగా పాటెల్ తెలిపాడు. మే నుంచి జులై వరకు దాదాపు 12 సార్లు ప్రసాద్ ఇంటికి గంజాయి పంపినట్లు, గంజాయి పంపిన ప్రతిసారి 3,500 రూపాయల డబ్బు ముట్టజెప్పినట్లు వెల్లడించాడు. -
డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, శ్రద్ధా ఫోన్లు సీజ్
సాక్షి, ముంబై : బాలీవుడ్ యంగ్హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతరం వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్సీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్సింగ్, దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్దాకపూర్లను విచారించిన అధికారులు మరో కీలక ముందడగు వేశారు. శుక్ర,శనివారాల్లో వీరి విచారణ ముగిసిన అనంతరం నలుగురు నటీమణులు ఫోన్లను సీజ్చేశారు. నలుగురు హీరోయిన్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్, జయ షాల ఫోన్ల్ను సీజ్ చేసినట్లు ఎన్సీబీ ఆదివారం ఉదయం వెల్లడించింది. శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు రకుల్పై ప్రశ్నల వర్షం కురిపింది. ఇక ఇదే కేసులో శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ను అరెస్టు చేసింది. (ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ) మరోవైపు కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్లో ‘డి’అనే అక్షరం ఆధారం చాటింగ్ చేసినట్లు 7 గంటల సుదీర్ఘ విచారణలో వెల్లడైంది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేదానిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని ఆధారాల కోసం వారి మొబైల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ముగిసిన విచారణలో రకుల్పై ఎన్సీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆమె నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. రియాకు రకుల్కు మధ్య డ్రగ్స్ గురించి వాట్సప్లో చాటింగ్ జరిగినట్లు, తన నివాసంలో లభ్యమైన డ్రగ్స్ కూడా రియాకు చెందినట్లు రకుల్ వెల్లడించింది. తాజాగా వీరి మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడంతో విచారణ ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. -
ఇంతకి డ్రగ్స్ ఎందుకు వాడతారు..?
హాలీవుడ్ సంగతి సరే, మన దేశంలో చూసుకుంటే తొలుత డ్రగ్స్ కలకలం బాలీవుడ్లో మొదలైంది. క్రమంగా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్లకూ విస్తరించింది. ఏ ‘వుడ్’ అయితేనేం, ఇప్పుడన్నీ ‘నార్కోవుడ్’గానే మారుతున్నాయనే విమర్శలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు పట్టుబడిన సందర్భాల్లో మీడియాలో వార్తల హోరు జోరుగా ఉంటోంది గాని, సినీరంగంతో నిమిత్తంలేని వారిలో సైతం చాలామంది డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య సంఘటన తర్వాత భారతీయ సినీరంగంలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. డ్రగ్స్కు సంబంధించి సెలబ్రిటీల పేర్లు వార్తలకెక్కుతున్నాయి. అలాగని దేశంలో సినీ సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారనుకుంటే పొరబాటే! హైస్కూలు కుర్రాళ్లు కూడా డ్రగ్స్ బారినపడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఇంతకీ ఈ డ్రగ్స్ ఏమిటి, ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, వీటిని వాడితే వాటిల్లే నష్టాలేమిటి? డ్రగ్స్పై ఎందుకు ఇంతలా గగ్గోలు చెలరేగుతోంది? ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు డ్రగ్స్ను అరికట్టగలుగుతున్నాయా? ఇంతకీ ఈ డ్రగ్స్ సంగతేమిటి? వీటి గురించి తెలుసుకోవలసిన విషయాలేంటి? వీటిని వాడితే కలిగే నష్టాలేమిటి? వీటి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి?... డ్రగ్స్ ఎందుకు వాడతారనేది చాలా సిల్లీ ప్రశ్న. మత్తు కోసం వీటిని వాడతారనేది అందరికీ తెలిసిన సంగతే. మత్తు కోసం రకరకాల పదార్థాలను వాడటం చరిత్రలో చాలాకాలం నుంచి ఉన్నదే. వేల ఏళ్ల కిందటి నుంచే మద్యం, గంజాయి, పొగాకు, నల్లమందు, మత్తునిచ్చే పుట్టగొడుగులు (మేజిక్ మష్రూమ్స్) వంటి పదార్థాలు వాడుకలో ఉన్నాయనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిసిద్ధంగా దొరికే మత్తు పదార్థాలు. వీటిని తలదన్నే సింథటిక్ మత్తు పదార్థాలను తయారు చేయడం గత శతాబ్దిలో మొదలైంది. గడచిన ఆరేడు దశాబ్దాల్లో వీటి వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. వీటి తయారీ, సరఫరా, అమ్మకాల వెనుక మాఫియా ముఠాలు పనిచేస్తూ, సమాంతర ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలకెక్కుతున్నవి ఈ సింథటిక్ డ్రగ్స్కు సంబంధించిన కేసులే. వీటి మత్తు మొదట్లో గమ్మత్తుగా అనిపిస్తుంది. గమ్మత్తయిన మత్తు క్రమంగా అలవాటుగా మారుతుంది. చివరకు వదులుకోవాలనుకున్నా వదులుకోలేని వ్యసనంగా మారుతుంది. మత్తులో నిరంతరం మునిగితేలే పరిస్థితిలో చిక్కుకుంటే, చివరకు ఆరోగ్యం చిత్తవుతుంది. శరీరం శిథిలమవుతుంది. అర్ధంతరంగా మృత్యువు కబళించేస్తుంది. గంజాయి, నల్లమందు వంటి మత్తుపదార్థాలపై తొలినాళ్లలో పెద్దగా ఆంక్షలు ఉండేవి కావు. మతపరమైన వేడుకల్లో వీటి వాడకం ప్రాచుర్యంలో ఉండటంతో ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించేవి కావు. ప్రభుత్వాలు పట్టించుకోని కాలంలో జనాలు వీటిని బహిరంగంగానే ఉపయోగించేవారు. తొలిసారిగా 1925లో అమెరికాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఓపియమ్ కన్వెన్షన్’లో మార్ఫిన్, హెరాయిన్లపై నిషేధం అమలులోకి వచ్చింది. అంతకుముందు ఈ రెండు మాదకద్రవ్యాలనూ వైద్యులు తమ రోగులకు ఇష్టానుసారం సిఫారసు చేస్తూ వచ్చేవారు. పత్రికల్లో ‘హెరాయిన్’ ప్రకటనలు కూడా కనిపించేవి. మార్ఫిన్, హెరాయిన్లు తొలితరం సింథటిక్ డ్రగ్స్. వీటి వాడుకను కట్టడి చేసిన కొన్ని దశాబ్దాలకు– 1960, 70 దశకాల నాటికి మరికొన్ని సింథటిక్ డ్రగ్స్ వ్యాప్తిలోకి వచ్చాయి. డీఓఎం (డైమీథాక్సి4 మీథైలాంఫెటామిన్, ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైథాలమైడ్), ఏఎల్డీ–52 (1–ఎసెటైల్ ఎల్ఎస్డీ), పీసీపీ (ఫెన్సైక్లిడిన్) వంటి వాటి అక్రమ విక్రయాలు అమెరికా సహా పలు దేశాల్లో విచ్చలవిడిగా సాగేవి. వీటి తర్వాత 1980, 90 దశకాల్లో ఎండీఎంఏ (మీథైలెనడయాక్సిమీథాంఫెటామైన్) (దీనినే ‘ఎక్స్టసీ’గా పిలుచుకుంటారు), ఏఎంటీ (మీథైల్ట్రిప్టామైన్), బీజెడ్పీ (బెంజైల్పైపరాజిన్), టీఎఫ్ఎంపీపీ (ట్రైఫ్లోరోమీథైల్ఫెనైల్పైపరాజిన్), మీథాంఫెటామిన్, మెథ్కాథినోన్ వంటి సింథటిక్ డ్రగ్స్ విరివిగా వాడుకలోకి వచ్చాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ, ప్రభుత్వాలేవీ వీటిని అరికట్టలేకపోతున్నాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు మరింతగా ఊపందుకున్నాయి. ‘ఆన్లైన్’ లావాదేవీలతోనే ఇవి సునాయాసంగా దేశాంతరాలను, ఖండాంతరాలను దాటుతున్నాయి. కఠోర వాస్తవాలు మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ (యూఎన్ఓడీసీ) గత ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ డ్రగ్ రిపోర్ట్–2019’ నివేదికలో కొన్ని కఠోర వాస్తవాలను బయటపెట్టింది. ఈ నివేదికను 2017 నాటి లెక్కలను క్రోడీకరించి రూపొందించారు. దీని ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దాదాపు 3.50 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరిలో ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు అవసరమైన వైద్య సహాయాన్ని పొందగలుగుతున్నారు. మిగిలిన వారు డ్రగ్స్ ఊబిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నివేదిక ప్రకారం... నల్లమందు నుంచి ఉత్పత్తి చేసే మాదకదవ్య్రాలను 5.30 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారు 1.10 కోట్లకు పైగానే ఉన్నారు. వీరిలో 14 లక్షల మంది హెచ్ఐవీ రోగులు కాగా, మరో 56 లక్షల మంది హెపటైటిస్–సి రోగులు. డ్రగ్స్ దుర్వినియోగం కారణంగా 2017లో 5.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నివేదిక ప్రకారం గడచిన ఏడాది వ్యవధిలో డ్రగ్స్ వాడిన వారి సంఖ్య 27.1 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో 5.5 శాతం. వీరంతా 15–64 ఏళ్ల వయసు వారు. ప్రపంచవ్యాప్తంగా కొకైన్ ఉత్పత్తి 2017లో రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ ఏడాది 1976 టన్నుల కొకైన్ ఉత్పత్తి జరిగింది. అదే ఏడాది అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన కొకైన్ కూడా రికార్డు స్థాయిలోనే ఉంది. వివిధ దేశాల్లోని అధికారులు అక్రమంగా తరలిస్తున్న 1275 టన్నుల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ డ్రగ్స్ ఎన్ని మార్కెట్లోకి వస్తున్నా, డ్రగ్స్ వినియోగంలో ఇప్పటికీ గంజాయిదే అగ్రస్థానం. వరల్డ్ డ్రగ్ రిపోర్ట్–2019 ప్రకారం 2017లో గంజాయి వినియోగదారుల సంఖ్య 18.8 కోట్లు. గంజాయిపై నిషేధం ఉన్నా, మన దేశంలో కొన్నిచోట్ల దేవాలయాల్లో గంజాయిని ప్రసాదంగా పంచిపెట్టే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక గంజాయి అక్రమసాగు, రవాణా సంఘటనలు తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. మన దేశంలో పరిస్థితి మన దేశంలో గంజాయి, నల్లమందు వాడకం చిరకాలంగా ఉన్నదే. పాశ్చాత్య దేశాల్లో సింథటిక్ డ్రగ్స్ వాడకం 1930 దశకం నుంచే ప్రారంభమైనా, మన దేశంలోకి కొంత ఆలస్యంగా అడుగుపెట్టాయి. దేశంలో వీటి ప్రభావం మొదలైన తొలినాళ్లలోనే– అంటే 1970 దశకం నాటికి డ్రగ్స్ ఇతివృత్తంగా సినిమాలు రూపుదిద్దుకున్నాయి. బాంబే (ఇప్పటి ముంబై) కేంద్రంగా రాజ్యమేలుతున్న మాఫియా ముఠాలు ఆర్థికంగా బలపడటానికి ఇక్కడకు డ్రగ్స్ తీసుకురావడం, సంపన్నులైన యువతను వాటికి అలవాటు చేయడం ప్రారంభించాయి. మాఫియాతో రాసుకు పూసుకు తిరిగే బాలీవుడ్ సెలబ్రిటీల్లో సైతం కొందరు డ్రగ్స్ ఊబిలో చిక్కుకున్నారు. క్రమంగా సింథటిక్ డ్రగ్స్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, చివరకు ఒక మోస్తరు పట్టణాలకు సైతం పాకాయి. దేశంలో నానాటికీ డ్రగ్స్ బెడద పెరుగుతుండటంతో వీటిని అరికట్టడం రోజువారీ శాంతిభద్రతలను కాపాడే పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం 1986లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) ఏర్పాటు చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంగా ఏర్పడిన ఎన్సీబీ వివిధ రాష్ట్రాల్లోని పోలీసు దళాలు, కేంద్రం అధీనంలోని కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, సీబీఐ, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ), ఇంటెలిజెన్స్ బ్యూరో సహా వివిధ పోలీసు, గూఢచర్య దళాల సహకారంతో పనిచేస్తోంది. డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ప్రభుత్వం ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా, దేశంలో డ్రగ్స్ వినియోగం నానాటికీ పెరుగుతూనే ఉంది. దాదాపు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నా, ఈ వ్యవహారాల్లో సెలబ్రిటీల ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే వార్తలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆర్థిక తాహతు, కుటుంబ మద్దతు ఉన్న కొందరు రీహాబిలిటేషన్ చికిత్స తీసుకుని, ఈ ఊబి నుంచి బయటపడుతున్నా, చాలామంది వెనక్కు రాలేక ఇందులోనే చిక్కుకుని అర్ధంతరంగా మరణిస్తున్నారు. సింథటిక్ డ్రగ్స్... కొన్ని నిజాలు సింథటిక్ డ్రగ్స్ ఎక్కువగా అక్రమ లాబొరేటరీల్లో తయారవుతుంటాయి. వీటిలో వాడే పదార్థాలు ఏమిటో, వాటి పరిమాణం ఎంత ఉందో, అవి కలిగించే ప్రభావం ఏమిటో తెలుసుకోవడం దుస్సాధ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండువందలకు పైగా సింథటిక్ డ్రగ్స్ వాడుకలో ఉన్నాయి. వీటిలో దాదాపు 90 శాతం డ్రగ్స్ గంజాయి నుంచి వేరు చేసిన రసాయనాలతో చేసినవి కాగా, మిగిలినవి నల్లమందు, ఇతర పదార్థాల నుంచి వేరు చేసిన రసాయనాలతో తయారు చేస్తారు. వీటిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న వాటిలో ఒకటైన ‘ఫెంటామైన్’ను కేన్సర్ రోగులకు నొప్పి నివారణ కోసం కట్టుదిట్టమైన వైద్య పర్యవేక్షణలో ఉపయోగిస్తారు. ఇది మార్ఫిన్ కంటే దాదాపు ఎనభై నుంచి వంద రెట్లు శక్తిమంతమైనది. అక్రమ మార్కెట్లో దీనిని హెరాయిన్కు జోడించి అమ్ముతున్నారు. గంజాయి నుంచి వేరుచేసిన రసాయనాలతో రూపొందించిన కృత్రిమ గంజాయి (సింథటిక్ మార్జువానా) వాడకం కూడా ఇటీవల బాగా పెరిగింది. ‘స్పైస్’, ‘కే2’ అనే పేర్లతో దీనిని రేవ్ పార్టీల్లో వాడుతున్నట్లు చాలా దేశాల్లో బయటపడింది. ఇదే కాకుండా, ‘స్మైల్’, ‘ఎన్–బాంబ్’ పేర్లతో పిలుచుకునే సింథటిక్ ఎల్ఎస్డీ, మీథాక్సమైన్ (ఎంఎక్స్ఎం), ఫెన్క్లిడిన్ (పీసీపీ) వంటివి కూడా రేవ్ పార్టీల్లో వాడుతున్నట్లుగా తెలుస్తోంది. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలోని వివరాలు మన దేశంలో డ్రగ్స్ వ్యాప్తి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. హెరాయిన్, మార్ఫిన్ సహా నల్లమందు ఆధారిత డ్రగ్స్కు (ఓపియాయిడ్స్) బానిసలైన వారి సంఖ్య 2.60 కోట్లు. వీరిలో దాదాపు 60 లక్షల మంది ఈ డ్రగ్స్ వాడకం వల్ల తలెత్తిన తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలో సగానికి పైగా పరిమాణంలోని ఓపియాయిడ్స్ వినియోగం జరుగుతున్నది తొమ్మిది రాష్ట్రాల్లోనే. అవి: ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. మన దేశంలో ముక్కుతో పీల్చే మాదకద్రవ్యాలు, నిద్రమాత్రలు వాడుతున్న వారి సంఖ్య 1.18 కోట్లకు పైగా ఉంది. ముక్కుతో పీల్చే మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో 4.6 లక్షల మంది పిల్లలు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకునేవారు మన దేశంలో కాస్త తక్కువగానే ఉన్నారు. వీరి సంఖ్య 8.5 లక్షలు. మన దేశంలో ఇంజెక్షన్ల రూపంలో తీసుకునే డ్రగ్స్లో ఎక్కువగా హెరాయిన్ (48 శాతం), బ్యూప్రెనార్ఫైన్ (46 శాతం) వినియోగంలో ఉన్నాయి. ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ వాడుక ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (1,00,000), పంజాబ్ (88,000), ఢిల్లీ (86,000) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో డ్రగ్స్ను ఇంజెక్షన్లుగా తీసుకునే వారిలో దాదాపు 27 శాతం మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఒకే సూదిని ఒక బృందం మొత్తం పంచుకోవడం వంటి ప్రమాదకరమైన అలవాటు కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. -
నాకు డ్రగ్స్ అలవాటు లేదు
ముంబై: ముంబైలోని తన నివాసంలో గత ఏడాది జరిగిన పార్టీలో బాలీవుడ్ ప్రముఖ యువనటులు డ్రగ్స్ వాడారంటూ వస్తున్న వార్తలపై దర్శక–నిర్మాత కరణ్ జోహార్ గట్టిగా స్పందించారు. అవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదనీ, వాటిని వాడాలంటూ ఎవరినీ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. తను, తన కుటుంబం, సన్నిహితులు, తన బ్యానర్ ధర్మా ప్రొడక్షన్పై జరుగుతున్న ప్రచారం విద్వేషపూరితం, అసంబద్ధం అని తెలిపారు. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్, అనుభవ్ చోప్రాలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపైనా కరణ్ జోహార్ స్పందించారు. వీరిద్దరిలో ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. ‘ఈ వ్యవహారంలో మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నా’అని పేర్కొన్నారు. -
ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించింది. ఇదే కేసులో శుక్రవారం విచారించిన ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ను అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్సీబీ గెస్ట్హౌస్కు శనివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చేరుకున్న దీపికా పదుకొణె మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. దీపికను, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ను కలిపి విచారించినట్లు సమాచారం. కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్లో ‘డి’అనే అక్షరం ఎవరిని ఉద్దేశించిందనే కోణంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరిష్మాను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం వీరిరువురూ పది నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. వీరి విచారణ సమయంలో ఎన్సీబీ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బంది గుమికూడారు. దక్షిణ ముంబైలో..బల్లార్డ్ ఎస్టేట్లో ఉన్న ఎన్సీబీ జోనల్ కార్యాలయంలో శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్లను శనివారం సాయంత్రం ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఎన్సీబీ కార్యాలయానికి మధ్యాహ్నం 12గంటలకు శ్రద్ధాకపూర్ చేరుకోగా ఒక గంట తర్వాత సారా అలీఖాన్ వచ్చారు. వీరిద్దరినీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సారా, 6 గంటల ప్రాంతంలో శ్రద్ధాకపూర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో శుక్రవారం ప్రశ్నించిన నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్ను శనివారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వెర్సోవాలో ఉన్న ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి, రోజంతా ప్రశ్నించినట్లు సమాచారం. తాజా అరెస్టుతో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. మీడియాకు పోలీసుల వార్నింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే సినీ ప్రముఖుల వాహనాలను వెంబడించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్సింగ్ మీడియా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వెళ్లే వారిని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత డ్రైవర్పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె ఎలాగోలా మీడియా కంటబడకుండా తప్పించుకోగా, మీడియా సిబ్బంది సారా అలీఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎన్సీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో దీపిక పదుకొణె ప్రయాణిస్తున్న వాహనాన్ని మీడియా వెంబడించింది. అనంతరం పోలీసుల హెచ్చరికల ఫలితంగా శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ‘ఛేజింగ్’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శాండల్వుడ్ కేసులో టీవీ యాంకర్.. మంగళూరు: శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు. స్నేహితుడు తరుణ్ రాజ్తోపాటు అనుశ్రీ పార్టీలకు హాజరైందంటూ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్యాన్సర్–కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి వెల్లడించడంతో పోలీసులు అనుశ్రీకి సమన్లు జారీ చేశారు. తరుణ్ డ్రగ్స్ వాడకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. విచారణలో వీరేమన్నారు ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా దీపిక.. 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, డ్రగ్స్ తీసుకున్నదా లేదా అనేది వెల్లడికాలేదని సమాచారం. ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్న సారా, శ్రద్ధా తమకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. వీరి ఫోన్లను అధికారులు సీజ్చేశారు. -
ఫాంహౌజ్లో పార్టీ చేసుకున్నాం: శ్రద్ధ
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ నేడు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెస్ట్హౌజ్లో దీపికను, కార్యాలయంలో శ్రద్ధ, సారాలను విచారిస్తున్న అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఫాంహౌజ్లో జరిగే పార్టీల గురించి శ్రద్ధా కపూర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.(చదవండి: కీలక విషయాలు వెల్లడించిన దీపిక మేనేజర్!) ఇందుకు సమాధానంగా.. ‘‘చిచోరే’’ సినిమా సమయంలో సుశాంత్ పవనా ఫాంహౌజ్కు వెళ్లానని శ్రద్ధ చెప్పినట్లు సమాచారం. ‘‘ఆరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేం అక్కడికి చేరుకున్నాం. భోజనం చేసిన తర్వాత బోటులో పార్టీ చేసుకున్నాం. అర్ధరాత్రి దాటేంత వరకు అందరూ పార్టీలోనే ఉన్నారు. పాటలు వింటూ ఎంజాయ్ చేశాం. అయితే నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు’’అని శ్రద్ధ బదులిచ్చినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. అదే విధంగా సుశాంత్ గురించి ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు పేర్కొంది. షూటింగ్ సమయంలో అతడు తన వానిటీ వాన్లో మత్తు పదార్థాలు సేవించడం చూశానని చెప్పినట్లు తెలిపింది.(చదవండి: ఎన్సీబీ రకుల్ విచారణలో ఏం చెప్పింది?) కాగా సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో జరిపిన వాట్సాప్ చాట్ గురించి ప్రశ్నించగా, శ్రద్ధ సమాధానం దాట వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎన్సీబీ ఎదుట హాజరైన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. రియా చక్రవర్తితో తాను చాట్ చేసిన మాట వాస్తవేమనని, అయితే తానెన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయి. -
దీపికకు నో క్లీన్చిట్.. మరోసారి విచారణకు!
ముంబై : సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కోణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నటుడు సుశాంత్ సింగ్ మరణంతో వెలుగులోకి వచ్చిన ఈ కేసు ప్రస్తుతం బాలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసుపై విచారణ జరుపుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల ఎదుట శనివారం నటి దీపికా పదుకొనె హాజరయ్యారు. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్లో సాగిన ఆమె విచారణ ముగిసింది. మొత్తం నాలుగు రౌండ్లలో దాదాపు ఐదున్నర గంటలపాటు ఎన్సీబీ దీపికను ప్రశ్నించింది. ఈ క్రమంలో డ్రగ్స్ కొనుగోలు, సరాఫరా, వినియోగం, పార్టీ వంటి విషయాల్లో దీపిక నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. (డ్రగ్స్ కేసు: ఎన్సీబీ ఎదుట హాజరైన దీపికా) అయితే దీపిక ఇచ్చిన సమాధానాలతో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. కరిష్మా, జయ, తదితరులతో వాట్సాప్ చాట్ నిజమేనని చెప్పిన దీపిక కొన్ని ప్రశ్నలను దాటవేస్తూ తప్పించుకునేలా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. చాలా సమయంపాటు దీపికను ఎన్సీబీ విచారించినప్పటికీ ఇంకా ఆమెకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో దీపికను ఈ కేసులో మరోసారి విచారించే అవకాశాలు ఉన్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. (ఎన్సీబీ రకుల్ విచారణలో ఏం చెప్పింది?) కాగా డ్రగ్ కేసులో దీపికతోపాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ హాజరవ్వగా శుక్రవారం విచారణకు హాజరైన దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ రెండో రోజు కూడా విచారణకు వచ్చారు. శ్రద్ధాను ఎన్సీబీకి చెందిన మరో బృందం విచారిస్తోంది. సుశాంత్ ఇచ్చిన ఫార్మ్ హౌజ్ పార్టీకి వచ్చానని అంగీకరించిన శ్రద్ధా కానీ తను డ్రగ్స్ తీసుకోలేదని విచారణలో వెల్లడించారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరో వైపు ఇదే కేసులో ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిప్రసాద్ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.. (దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..) -
రకుల్పై ప్రశ్నల వర్షం : ఏం చెప్పింది?
సాక్షి, ముంబై : సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తిని కస్టడీలో తీసుకుని విచారిస్తుండగా.. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్ విచారణ శుక్రవారం ముగిసింది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్లు విచారణకు హాజరయ్యేకుందుకు శనివారం ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే శుక్రవారం నాటి విచారణలో భాగంగా రకుల్పై ఎన్సీబీ అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. రియాతో పరిచయం ఎప్పటి నుంచి, ఎలా, సుశాంత్తో పార్టీ, వాట్సప్ చాటింగ్ వంటి అంశాలపై లోతైన ప్రశ్నలు సంధించారు. అయితే విచారణలో రకుల్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. (సుశాంత్ కోసం సోదరుడితో డ్రగ్స్ తెప్పించిన రియా) వాట్సప్ గ్రూప్తో తాను చాటింగ్ చేసింది నిజమేనని, కానీ తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేనది చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో భాగంగానే అనుమానితుల ఇళ్లలో ఎన్సీబీ నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్ బయటపడ్డ విషయం తెలిసిందే. రకుల్ నివాసంలో మాదక ద్రవ్యాలు వెలుగుచూడగా.. వీటపై ఎన్సీబీ ప్రశ్నించింది. తాను రియాతో డ్రగ్స్ గురించి చర్చించింది వాస్తమేనని, తన ఇంట్లో ఉన్న డ్రగ్స్ కూడా రియాకు చెందినవే అని వెల్లడించినట్లు ముంబై వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా డ్రగ్స్తో సంబంధమున్న మరో నలుగురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా రకుల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. వారెవరు అనేది తెలియాల్సి ఉంది. మరోవైవు దీపిక పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్ సైతం శుక్రవారం ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి వచ్చారు. కరిష్మా ప్రకాశ్, ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవిని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక శనివారం విచారణకు హాజరైన దీపిక, శ్రద్దా, సారాను అధికారులు విచారిస్తున్నారు. సుశాత్ సింగ్ మరణం తదనంతరం వెలుగుచూసిన డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై వీరిని ప్రశ్నిస్తున్నారు. వీరందరిని స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్న అధికారులు వాటిలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక కేసు విచారణ నిమిత్తం కరుణ్ జోహార్కు ఎన్సీబీ నోటీసులు పంపే అవకాశం ఉంది. -
డ్రగ్స్ కేసు: ఎన్సీబీ ఎదుట హాజరైన దీపికా
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరోయిన్ దీపికా పదుకొనే ఎన్సీబీ ఎదుట శనివారం విచారణకు హాజరైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ప్రీత్ సింగ్లకు తదితరులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా శుక్రవారం రకుల్ ప్రీత్సింగ్ ఎన్సీబీ ఎదుట హాజరవ్వగా.. శనివారం దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీ ఖాన్లను విచారించనున్నారు. ముంబై కొలాబాలోని అపోలో బండర్లో ఎవెలిన్ గెస్ట్ హౌస్కు ఈ ఉదయం దీపికా పదుకొనే వచ్చారు. అక్కడే ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అయితే సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను బల్లార్డ్ ఎస్టేట్లోని ఎన్సీబీ కార్యాలయంలో విచారించనున్నారు. కాగా.. శుక్రవారం విచారణకు హాజరైన దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ను ఈ రోజు మరోసారి పిలిచే అవకాశం ఉంది. కరిష్మా ప్రకాష్ను శుక్రవారం సుమారు నాలుగు గంటలపాటు ఎన్సీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో ఆమె కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. (మీడియాపై ఆగ్రహం.. కరణ్కు మద్దతు) తాజాగా కరణ్ జోహార్ సహాయకులు క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రాల వద్ద భారీ మొత్తంలో ఎన్సీబీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధంలేదని శనివారం కరణ్ స్పష్టం చేశారు. ఆ మేరకు కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్న వార్తలను ఖండించారు. అనుభవ్ చోప్రా 2011-2013 మధ్య తమ సంస్థతో రెండు ప్రాజెక్టులలో పనిచేసినప్పటికీ ధర్మ ప్రొడక్షన్లో ఉద్యోగి మాత్రం కాదని కరణ్ తెలిపారు. మరో వ్యక్తి క్షితిజ్ రవి ప్రసాద్ ధర్మ ప్రొడక్షన్తో అనుసంధానించబడిన ఒక సంస్థలో 2019 నవంబర్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరారు. అయితే ప్రజలు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులకు మా ప్రొడక్షన్ బాధ్యత వహించలేదు. ఈ వ్యక్తులు కూడా నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఈ ఆరోపనలకు ధర్మ ప్రొడక్షన్స్కు సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. నేను డ్రగ్స్ తీసుకోను.. వాటి వినియోగాన్ని కూడా నేను ప్రోత్సహించను అని మరోసారి చెప్పాలనుకుంటున్నాను' అని ఆయన అన్నారు. -
డ్రగ్స్ కేసులో రకుల్ విచారణ
ముంబై: మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్డో(ఎన్సీబీ) ముందు హాజరయ్యారు. నటుడు సుశాంత్సింగ్ మృతి, తదనంతరం వెలుగు చూసిన తారల డ్రగ్స్ వినియోగం, సరఫరా కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి రకుల్ శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఆమెను ఎన్సీబీ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. నటి దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్, ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవిని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాశ్ను అధికారులు శనివారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. దీపిక పదుకోన్ను శనివారం విచారించనున్నట్లు సమాచారం. క్షితిజ్ రవిని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. రవి ఇంట్లో ఎన్సీబీ జరిపిన సోదాల్లో డ్రగ్స్ లభించినట్లు సమాచారం. సుశాంత్ గర్ల్ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా రకుల్తో పాటు పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. సుశాంత్సింగ్ కోసం రియా తన సోదరుడు షోవిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ తెప్పించేదని ఎన్సీబీ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. అది నిజమేనని విచారణలో షోవిక్ కూడా అంగీకరించాడు. పారిహార్, కైజెన్ ఇబ్రహీంల నుంచి డ్రగ్స్ను సేకరించిరియాకు ఇచ్చేవాడినని తెలిపాడు. వాటితో రాజ్పుత్ మేనేజర్ సామ్యూల్ మిరండా, కుక్ దీపేశ్సావంత్ సిగరెట్లు తయారు చేసేవారని షోవిక్ చెప్పాడు. ఎన్సీబీ అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. రియా కుటుంబం పాల్పడిన నగదు అక్రమ రవాణా కేసు విచారణ సందర్భంగా ఈ డ్రగ్స్ కోణం ఈడీ దృష్టికి వచ్చింది. దాంతో, ఈడీ ఈ విషయాన్ని ఎన్సీబీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్సీబీ విచారణలో డ్రగ్స్ సరఫరాలో కీలకమైన జాయిద్ పాత్ర బయటపడింది. లాక్డౌన్ కారణంగా తన హోటెల్ బిజినెస్ దెబ్బతిన్నదని, అందువల్ల ఈ డ్రగ్స్ దందాలో దిగానని జాయిద్ ఎన్సీబీ విచారణలో వెల్లడించాడు. బాసిత్ పారిహర్ పేరు కూడా జాయిదే వెల్లడించాడు. అలాగే, కైజెన్ ఇబ్రహీంను విచారిస్తున్న సమయంలో డ్రగ్స్ సప్లైయర్ అనుజ్ కేశ్వానీ పేరు తెరపైకి వచ్చింది. బాంద్రాలోని ఆయన ఇంటిపై జరిపిన దాడిలో భారీగా చరస్, గంజాయి, టీహెచ్సీ, ఎల్సీడీ మాదకద్రవ్యాలు లభించాయి. రియా, షోవిక్ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. కరణ్ జోహార్ను కూడా? పలువురు బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు కనిపించిన ఒక వీడియోను అప్లోడ్ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోçహార్ను కూడా ఎన్సీబీ విచారించనుందని శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. చాలా కాలం క్రితం నాటి ఆ వీడియోను సాక్ష్యంగా చూపుతూ మంజిందర్ సింగ్ తాజాగా ఎన్సీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎన్సీబీ ఆ వీడియో నిజానిజాలను నిర్ధారించేందుకు టెస్టింగ్కు పంపించింది. -
డ్రగ్స్ కేసు: ఆ గ్రూపునకు దీపికానే అడ్మిన్!?
ముంబై: డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరైన టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ జయ సాహా, తాను, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నామని, సదరు గ్రూప్ ద్వారానే మాదక ద్రవ్యాల గురించి చర్చించేవాళ్లమని కరిష్మ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ గ్రూప్నకు దీపికానే అడ్మిన్గా ఉండేవారని, తరచుగా హష్(డ్రగ్) గురించి అడిగేవారని ఎన్సీబీ ఎదుట వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. (చదవండి: సుశాంత్ది హత్యేనని ఆ ఫొటోలు చెబుతున్నాయి!) ఈ మేరకు 2017లో తాము ముగ్గురం చేసిన చాట్స్కు సంబంధించి వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి కరిష్మాను హాజరు కావాల్సిందిగా ఆదేశించిన ఎన్సీబీ, దీపికాను, ఆమెను ఎదురెదురుగా ఉంచి విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా కరిష్మా ప్రకాశ్ దీపికా వద్ద మేనేజర్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరైన హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్, డ్రగ్స్ గురించి తాను రియా చక్రవర్తితో చాట్ చేశానని అంగీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో రియాతో తమ ఇంట్లో ఉన్న ఓ మొక్క(గంజాయి వంటిది) చర్చించినట్లు సదరు మీడియా పేర్కొంది. అయితే తాను ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ ఎన్సీబీ అధికారులకు స్పష్టం చేసినట్లు పేర్కొంది. కాగా సుశాంత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తిని అరెస్టు చేసిన అధికారులు, లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జయ సాహా వెల్లడించిన వివరాల మేరకు పలువురు నటీమణులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ కేసు: విచారణకు హాజరైన రకుల్
ముంబై : బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను శుక్రవారంకు హాజరైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఎన్సీబీ పిలుపుమేరకు గురువారమే గోవా నుంచి ముంబై చేరుకుని శుక్రవారం ఉదయం ఎన్సీబీ ముందు హాజరైంది. డ్రగ్స్ వాడకంపై రకుల్ను ఎన్సీబీ ప్రశ్నించనుంది. బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ప్రీత్ సింగ్లకు తదితరులకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. నేడు రకుల్ విచారణ అనంతరం శనివారం దీపికను ప్రశ్నించనున్నారు. అయితే శుక్రవారం విచారణలో భాగంగా దీపిక మేనేజర్ కూడా ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన ఎన్సీబీ..బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు మరికొంతమందిని కస్టడీలో తీసుకుని విచారిస్తోంది. (రేపు దీపికా, సారా, శ్రద్ధా వంతు..) -
నేడు ఎన్సీబీ ఎదుటకు రకుల్
ముంబై: బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను శుక్రవారం ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన ఎన్సీబీ..బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై దర్యాప్తుచేస్తుండటం తెల్సిందే. ఎన్సీబీ పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. వీరిలో బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ప్రీత్ సింగ్లకు తదితరులకు సమన్లు పంపింది. అయితే, ఆ సమన్లు హైదరాబాద్లోగానీ, ముంబైలోగానీ తనకు అందలేదంటూ గురువారం ఉదయం రకుల్ ప్రకటించారు. దీంతో, ఫోన్తోపాటు వివిధ మార్గాల్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సమన్లు అందుకున్నట్లు ఆమె ధ్రువీకరించారని అనంతరం ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. శుక్రవారం రకుల్ విచారణలో పాల్గొంటారని కూడా ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా, శనివారం జరిగే ఎన్సీబీ విచారణలో పాల్గొనేందుకు దీపిక గురువారం రాత్రి గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ఆమె ఇంటివద్ద ముందు జాగ్రత్తగా ముంబై పోలీసులు బందోబస్తు పెంచారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ శుక్రవారం విచారణలో పాల్గొననున్నారు. (ఎన్సీబీ నోటీసులు అందాయి: రకుల్) ఎన్సీబీ నోటీసులందుకున్న మరో నటి సారా అలీఖాన్ గురువారం సాయంత్రం గోవా నుంచి ముంబై జుహులోని తన సొంతింటికి చేరుకున్నారు. దీపిక, శ్రద్ధా కపూర్తోపాటు ఈమె కూడా శనివారం ఎన్సీబీ ఎదుట హాజరుకానున్నారు. సుశాంత్ సింగ్ స్నేహితురాలు రియా చక్రవర్తి విచారణలో వెల్లడించిన సమాచారంలో రకుల్, సారాల ప్రస్తావన కూడా ఉందని అంతకుముందు ఎన్సీబీ పేర్కొంది. గురువారం ఉదయం ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాతోపాటు సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్లో విచారణకు హాజరయ్యారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నట్లు ఎన్సీబీ వెల్లడించింది. (డ్రగ్ కేసు; రకుల్ ప్రీత్ సింగ్కు ఎన్సీబీ సమన్లు) కంగన పిటిషన్పై సమాధానం ఇవ్వండి ముంబైలోని తన బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని శివసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ను బాంబే హైకోర్టు ఆదేశించింది. అలాగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వార్డు అధికారి, కంగనాకు కూల్చివేత నోటీసు జారీ చేసిన భాగ్యవంత్కు ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. కంగనా పిటిషన్పై బాంబే హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కంగనాకు సంజయ్ రౌత్ చేసిన హెచ్చరికలకు సంబంధించిన సీడీని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. ఈ కేసులో సంజయ్ రౌత్, భాగ్యవంత్ను ప్రతివాదులుగా చేర్చాలన్న కంగనా విజ్ఞప్తి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. డ్రగ్స్ కేసును సీబీఐకి బదిలీ చేయండి: రియా ముంబై: సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణంతో సంబంధం ఉందని భావిస్తున్నమాదక ద్రవ్యాల కేసులో విచారణను ప్రారంభించే అధికారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి లేదని ఇదే కేసులో నిందితులైన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ స్పష్టం చేశారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు గురువారం విచారణ జరిపింది. సుశాంత్సింగ్ మరణంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని, మాదక ద్రవ్యాల కేసును సైతం అదే సంస్థకు అప్పగించాలని రియా చక్రవర్తి, షోవిక్ తరపు న్యాయమూర్తి సతీశ్ మనేషిండే బాంబే హైకోర్టునుకోరారు. -
డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!
కోల్కతా: బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తి స్పందించారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు మాత్రమే మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల కోసం పరితపించిపోతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డ్రగ్స్ కేసులో ఇంతవరకు కేవలం నటీమణులకు మాత్రమే సమన్లు జారీ అయిన నేపథ్యంలో తనదైన శైలిలో ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు.. ‘‘అవును.. పితృస్వామ్యమా.. బాలీవుడ్లో ఉన్న మహిళలు హష్, డ్రగ్స్ సహా ఇంకేం కావాలనుకున్నా దాన్ని దక్కించుకుంటారు. అయితే అక్కడున్న పురుషులు మాత్రం వంటపని, ఇంటిపనిలో నిమగ్నమై, తమ భార్యలు బాగుండాలంటూ ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు కళ్ల నిండా నీళ్లు నింపుకొని.. ‘‘దేవుడా తనను కాపాడు’’ అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంటారు’’అని మిమి చక్రవర్తి చురకలు అంటించారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో బయటపడ్డ మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే అతడి ప్రేయసి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతవరకు ఒక్క నటుడి పేరు కూడా ఇంతవరకు బయటకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మిమి చక్రవర్తి ఈ మేరకు స్పందించారు. ఇక తనను వేధించిన ఓ క్యాబ్ డ్రైవర్పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కాగా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మిమి టీఎంసీలో చేరి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జాదవ్పూర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: మిమి చక్రవర్తితో ట్యాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన) Yes patriarchy Women in bollywood go for Hash nd drugs or whatever nd men in bollywood cook nd clean nd pray for their better half wit joined hands nd tears in eye “Bhagwan unki raksha karna” — Mimssi (@mimichakraborty) September 24, 2020 -
దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..
సాక్షి, ముంబై : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మొదలైన వివాదం చిత్రపరిశ్రమలో పెను దుమారాన్ని రేపుతోంది. మొదట నెపోటిజం చుట్టూతిరిగిన కథఅంతా.. డ్రగ్స్వైపు మళ్లింది. ప్రస్తుతం విచారణ అంతా సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి వాంగ్మూలం చుట్టు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె వెల్లడించిన పేర్ల ప్రకారం.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్లకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనెకు కూడా నోటీసులు పంపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీపికపై కక్షసారింపు చర్యగా ఈ కేసులో ఇరికించారనీ, సుశాంత్ ఆత్మహత్య కేసులో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు డ్రగ్స్ కేసు తెరపైకి తీసుకువచ్చారనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. (రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు) అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 25న దేశ వ్యాప్త బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే దీపికతో పాటు ఇతర నటీమనుల పేర్లును డ్రగ్స్ కేసు జాబితాలో చేర్చారని సోషల్ మీడియా వేదికగా పలువురు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు దేశంలో ఆగ్రహావేశాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్ రణరంగాన్నే తలపించింది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణాకం ఏకంగా సభ్యుల సస్పెన్సన్కు దారితీసింది. అంతేకాకుండా బిల్లులను ఉపసంహించుకోవాలని కోరుతు విపక్ష పార్టీలు సమావేశాలను సైతం బహిష్కరించాయి. (డ్రగ్ కేసు: దీపికాకు కంగనా చురకలు) ఈ క్రమంలోనే ఈనెల 25(శుక్రవారం) దేశ వ్యాప్తంగా బంద్కు అఖిల భారత రైతు కూలీసంఘం పిలుపునివ్వగా దీనికి దేశంలోని రైతు సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని బంద్పై పడనీయకుండా కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగా రెండు రోజుల ముందు నోటీసులు జారీచేశారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా దృష్టిని సైతం మళ్లించే విధంగా బీజేపీ పెద్దలు రచించిన వ్యూహంలో దీపికను పావుగా ఉపయోగించుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 25న జరిగే బంద్ను ఏమాత్రం కవర్ చేయకుండా మీడియా మొత్తం దీపిక చుట్టే తిరుగుతుందని పోస్టులు పెడుతున్నారు. దీపికపై ఎందుకింత కుట్రఅని నిలదీస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ దీపిక వర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతుదారులు చేసిన దాడికి నిరసనగా అక్కడి విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ పరిణామం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కొందరు దీపిక చర్యలను సమర్థించగా.. బీజేపీ పెద్దలు మాత్రం విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో ఆమెకు జారీచేసిన నోటీసులు జేఎన్యూ సందర్శనకు కక్షసారింపేనని విశ్లేషిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులు ఇంకా పలువురు నటీమనులు ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) దీనిపై సీనియర్ నటీ నగ్మా తాజాగా ట్విటర్ వేదికగా స్పందించింది. డ్రగ్స్ కేసులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయని, కంగనా రనౌత్కు ఎందుకు నోటీసులు పంపడంలేదని ప్రశ్నించారు. తాను డ్రగ్స్కు బానిసగా మారాను అంటూ ఓ టీవీషోలో తానే స్వయంగా ప్రకటించిందని అలాంటప్పుడు కంగనాను ఎందుకు అరెస్ట్ చేయరని నగ్మా నిలదీసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులను కేసుల్లో ఇరికించి ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. అదే అనుకూలంగా మాట్లాడినప్పుడు తప్పు చేసినా సరే, వారికి ఎలాంటి శిక్ష ఉండబోదని ప్రభుత్వమే స్వయంగా చెప్తున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శనాస్గ్రాలు సందించింది. ఇక తాజా వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సైతం స్పందించారు. ‘ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఓవైపు భారత్ బంద్కు రైతులు పిలుపునివ్వగా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని కేంద్రం భావిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. So @deepikapadukone summoned on September 25 by @narcoticsbureau . Farmers all India protest on Sept 25. Samajh mein aaya?🙏 — Rajdeep Sardesai (@sardesairajdeep) September 23, 2020 -
డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఎవరి పేర్లను వెల్లడించలేదని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మానేషిండే అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మినహా ఇతర నటుల గురించి ఆమె మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన సతీశ్.. ‘‘ఎన్సీబీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో రియా ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవం. సుశాంత్తో ఉన్నన్ని రోజులు అతడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని మాత్రమే రియా చక్రవర్తి ఎన్సీబీకి తెలిపారు. అంతేతప్ప ఇతరుల గురించి ఆమె మాట్లాడలేదు’’అని పేర్కొన్నారు. (చదవండి: టీవీ నటులను తాకిన డ్రగ్స్ సెగ) అదే విధంగా రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. ‘‘సుశాంత్ ఇంటి మనిషిగా ఉన్నందున తన గురించి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అయితే జయా సాహా ఇతర డ్రగ్ డీలర్లతో రియా వాట్సాప్ చాట్స్ గురించి సతీశ్ను ప్రశ్నించగా.. ‘‘రియా, సుశాంత్లతో జయా ఏం మాట్లాడారన్న దానిపై స్పష్టతనివ్వాలనుకుంటున్నా. గంజాయి ఆకుల నుంచి తీసిన సీబీడీ ఆయిల్ ఇవ్వాలని మాత్రమే వాళ్లు ఆమెను అడిగారు. నిజానికి అది మత్తు పదార్థం కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ ఆయిల్ బాటిల్ను చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవని దానిపై రాసి ఉంటుంది’’అని పేర్కొన్నారు. (చదవండి: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టు కాగా, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సహా రకుల్ ప్రీత్సింగ్కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీపికా సెప్టెంబరు 25న, సారా, శ్రద్ధ సెప్టెంబరు 26న ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. రకుల్, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ, సిమోన్ ఖంబట్టా నేడు విచారణ ఎదర్కొంటున్నారు. అయితే రియా చెప్పడంతోనే వీరందరి పేర్లు బయటపడ్డాయనే ప్రచారం నేపథ్యంలో లాయర్ సతీశ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఎన్సీబీ నోటీసులు అందాయి: రకుల్
బాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దీపికా పదుకోనె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్తో పాటు రకుల్ ప్రీత్ సింగ్లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు ఎలాంటి నోటిసులు అందలేదంటుంది రకుల్ ప్రీత్. హైదరాబాద్లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్సీబీ పంపిన సమన్లు అందలేని తెలిపింది. ఈ మేరకు రకుల్ ప్రీత్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు ఇంకా సమన్లు అందలేదని తెలిపారు. ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కోసం హైదరాబాద్ వచ్చిన రకుల్ బుధవారం రాత్రి ముంబై వెళ్లారు. అయితే ఆమె వ్యాఖ్యలను ఎన్సీబీ ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘ఆమెకు సమన్లు జారీ చేశాం.. తను ఫోన్లో అందుబాటులోకి రాలేదు. వివిధ ప్లాట్ఫారమ్ల ద్వారా ఆమెను సంప్రదించాము. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. పైగా ఇది కేవలం ఒక సాకు.. ఆమె ఈ రోజు దర్యాప్తుకు హాజరు కాలేదు’ అని తెలిపారు. అంతేకాక ‘రకుల్ ప్రీత్ మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆమె హైదరాబాద్లో ఉందా లేక ముంబైలో ఉన్నారా అనే విషయం మాకు తెలియదు. ఒకవేళ ఆమె ముంబైలో ఉంటే.. హెచ్ అండ్ ఎం లేదా గార్డెన్ అపార్ట్మెంట్లో ఉన్నారా అనే విషయం తెలియదు. ఎందుకంటే మూడు నెలల క్రితం ఆమె హెచ్ అండ్ ఎం అపార్ట్మెంట్కు మారింది. మేము ఆమెకు వాట్సాప్లో కూడా సమన్లు పంపించాము. ఒకవేళ రేపు కూడా ఆమె విచారణకు హాజరుకాకపోయినా.. ఏవైనా సాకులు చెప్పినా రకుల్కి నాన్ బెయిలబుల్ సమన్లు జారీ చేస్తాం’ అని ఎన్సీబీ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో సమన్లు అందలేదంటూ ప్రకటన విడుదల చేసిన రకుల్ తాజా హెచ్చరికల నేపథ్యంలో సమన్లు అందినట్లు ప్రకటించడం గమనార్హం. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్తో పాటు, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకోనెలను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచింది. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించడానికి పిలిచింది. రోజు (సెప్టెంబర్ 24) శ్రుతి మదీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్లు ఎన్సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న.. సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. (చదవండి: నా పరువు తీస్తున్నారు!) -
అమెజాన్లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ (కానబిడియోల్ ఆయిల్) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశానని.. ఇది అమెజాన్లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్ని భారత్లో నిషేధించినప్పుడు అది ఆన్లైన్లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్కు ఇచ్చే డ్రగ్ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్ పిటిషన్లో సుశాంత్కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్ సిండికేట్లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్ పిటిషన్ని విచారించనుంది. -
రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్లో డ్రగ్స్ కోణంపై సాగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్లకు ఎన్సీబీ సమన్లు పంపింది. బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై మరింత దృష్టి సారించిన ఎన్సీబీ ‘‘ఏ’’లిస్ట్లో ఉన్న ప్రముఖుల్ని తొలుత విచారించడానికి నిర్ణయించినట్టుగా ఎన్సీబీ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ట్యాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సైమన్ ఖంబటాలను ఎన్సీబీ కార్యాలయానికి గురువారమే రావాల్సిందిగా చెప్పినట్టుగా ఆ అధికారి వెల్లడించారు. హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్లను 26వ తేదీ శనివారం ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్లను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. గోవా షూటింగ్లో దీపిక ప్రస్తుతం గోవా షూటింగ్లో ఉన్న దీపిక పదుకొనె 12 మంది సభ్యులున్న తన న్యాయ బృందంతో చర్చలు జరిపారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో దీపిక భర్త రణవీర్ సింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సమాచారం. నోటీసుల నేపథ్యంలో రాత్రికి దీపిక గోవా నుంచి ముంబై వచ్చారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ వాట్సాప్ గ్రూప్ చాట్లలో హీరోయిన్ పేరులో ఇంగ్లిష్ అక్షరాలతో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అందులో డి అంటే దీపిక, ఎస్ అంటే శ్రద్ధ అని భావించిన విషయం తెలిసిందే. ఇక కరిష్మా ప్రకాశ్కు కూడా ఇప్పటికే సమన్లు పంపినప్పటికీ ఆమె అనారోగ్య కారణాలతో ఎన్సీబీ ఎదుట హాజరు కాలేదు. దీంతో శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపునిచ్చారు. దీపికతో పాటు కరిష్మా కూడా ఎన్సీబీ విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంలో హీరోల పాత్రపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కన్నేశారు. రియా చక్రవర్తి, జయ సాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా అగ్ర హీరోలపై కూడా ఓ కన్నేసి ఉంచినట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కీలక సమాచారమిచ్చిన జయ! గత మూడు రోజులుగా జయ సాహాను ప్రశ్నిస్తున్న అధికారులు పలు విషయాలను రాబట్టారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని జయ సాహా బయటపెట్టినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సుశాంత్తో పాటు నటి శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, మధు, తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎన్సీబీ విచారణలో అంగీకరించినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీబీడీ ఆయిల్ అనే నిషేధిత డ్రగ్స్ని వారు సేవించినట్టుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల చీకటి కోణంపై 2016లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అయిన మధు మాంతెనాను బుధవారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. జయ సాహా తన విచారణలో మధు పేరుని బయట పెట్టడంతో ఆయనను డగ్స్ర్ వినియోగంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. -
డ్రగ్ కేసు; రకుల్ ప్రీత్ సింగ్కు ఎన్సీబీ సమన్లు
ముంబై : బాలీవుడ్లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్వుడ్కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్ను సైతం వెంటాడుతోంది. ముంబై డ్రగ్స్ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సారా అలీఖాన్, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ వంటి బీటౌన్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్లోనూ ప్రముఖ నటీమణుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేరు బయట పడటంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతా చాట్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వచ్చింది. (డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్స్ దిపికా, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్తో పాటు రకుల్ ప్రీత్ సింగ్లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నోటీసులు జారీ చేసింది, మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..) -
డ్రగ్స్: ప్రముఖ టీవీ నటి ఇంట్లో సోదాలు
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్సీబీ ఎదుట హాజరుకాగా, తాజాగా డ్రగ్స్ సెగ టీవీ నటులను కూడా తాకింది. ప్రముఖ బుల్లితెర నటి అబిగేల్ పాండే, ఆమె ప్రియుడు, కొరియోగ్రాఫర్ సనం జోహార్ నివాసాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ జంట ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈ క్రమంలో డ్రగ్ డీలర్లు, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్న తీరు గురించి అధికారులు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా అబిగేల్ పాండే, సనం జోహార్ నచ్ బలియే వంటి పలు ప్రముఖ షోల్లో పాల్గొని ప్రాచుర్యం పొందారు. ఇక బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోని ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ పేర్లతో పాటు రకుల్ ప్రీత్సింగ్, నమ్రతా శిరోద్కర్, దియా మీర్జా పేర్లు తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ దగ్గర పనిచేసిన టాలెంట్ మేనేజర్ జయ సాహాతో మత్తు పదార్థాల గురించి చాట్ చేసినట్లుగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం తెలిసిందే. -
డ్రగ్స్ కేసులో తెరపైకి నమ్రత పేరు
-
ముంబై డ్రగ్స్ కేసు: తెరపైకి నమ్రత పేరు
సాక్షి, హైదరాబాద్: ముంబై డ్రగ్స్ కేసులో స్టార్ హీరో మహేశ్బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసులో నమ్రత పేరును జాతీయ మీడియా ప్రస్తావించింది. టాలెంట్ మేనేజర్ జయ సాహాతో డ్రగ్స్ విషయమై నమ్రత చాట్ చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ‘బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం’అని నమ్రత చాటింగ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ నటులు, డ్రగ్స్ పెడ్లర్లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారిస్తోంది. తాజాగా జయ సాహాని ఎన్సీబీ విచారిస్తుండగా నమ్రత పేరు బయటికొచ్చినట్టు సమాచారం. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సాహా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. జయసాహా సుశాంత్కు గతంలో టాలెంట్ మేనేజర్గా పని చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇదిలాఉండగా.. ముంబై డ్రగ్స్ కేసులో నటి దియా మీర్జా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు దియాను, ఆమె మేనేజర్ను విచారణకు పిలిచే అవకాశముంది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించిన డ్రగ్ డీలర్స్ ఎన్సీబీ అధికారుల విచారణలో వెల్లడించారు. (చదవండి: అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే) -
అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలో నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తికి సుశాంత్ మాజీ ప్రియురాలు కావడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది. ఈక్రమంలోనే బాలీవుడ్కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను రియా విచారణలో వెల్లడించినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. -
డ్రగ్ కేసు: దీపికాకు కంగనా చురకలు
ముంబై: బాలీవుడ్లో డ్రగ్ కేసు కలకలం రేపుతోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన ఈ డ్రగ్ కేసులో రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రోజు రోజుకు పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రిత్ సింగ్లకు ఎన్సీబీ ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పేరు బయటకు వచ్చింది. కె అనే వ్యక్తితో దీపికా మాల్ ఉందా అంటూ చేసిన చాట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అది తెలిసి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీపికాపై విమర్శలు గుప్పించారు. గతంలో దీపికా డిప్రెషన్కు లోననై విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధా కపూర్ పేర్లు) Repeat after me, depression is a consequence of drug abuse. So called high society rich star children who claim to be classy and have a good upbringing ask their manager ,” MAAL HAI KYA?” #boycottBollywoodDruggies #DeepikaPadukone https://t.co/o9OZ7dUsfG — Kangana Ranaut (@KanganaTeam) September 21, 2020 దానిని ఉద్దేశిస్తూ కంగనా ‘డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్గా కనిపించే కొందరూ స్టార్ల పిల్లలు వారి మేనేజర్లతో మాల్ గురించి అడుగుతుంటారు’ అని చురకలంటించారు. బాలీవుడ్ డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికాను బాయ్కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్ ట్యాగ్ జత చేశారు. కె అనే వ్యక్తి దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్గా అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో నేరారోపణ రుజువు కావడంతో సుశాంత్ ప్రియురాలు రియ చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురి ఎన్సీబీ అరెస్టు చేసి జైలు తరలిచింది. విచారణలో రియా బాలీవుడ్కు చెందిన 25 మంది ప్రముఖుల పేర్లను, డ్రగ్స్ వాడే పార్టీ ల జాబితాను ఎన్సీబీకి వెల్లడిచింది. ఈ క్రమంలో సారా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, దీపికాలకు కూడా సంబంధం ఉన్నట్లు ఎన్సీబీ గుర్తించింది. (చదవండి: ఆ ఎనిమిదినీ అంతం చేయాలి) -
డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధా కపూర్ పేర్లు
ముంబై: సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై కొనసాగుతున్న దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో బాలీవుడ్కు చెందిన ఐదుగురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో టాప్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ కూడా ఉన్నట్లు వినికిడి. త్వరలోనే వీరిద్దరికీ సమన్లు పంపే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్సీబీకి లభ్యమైన డ్రగ్స్ సరఫరాదారుల ఫోన్లలోని వాట్సాప్ కోడ్ చాట్లను బట్టి..డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖుల్లో ప్రధానంగా కె, డి, ఎస్, ఎన్, జెల పేర్లు ఉన్నాయి. ఇందులో ‘డి’ని వైరల్గా మారిన కరణ్ జోహార్ పార్టీ వీడియోలో కనిపించిన దీపికా పదుకొణెగాను, ‘కె’ను దీపికా పదుకొణె మేనేజర్, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉద్యోగి అయిన కరీష్మాగా భావిస్తున్నారు. ‘ఎస్’అంటే శ్రద్ధా కపూర్ అనీ, ‘ఎన్’ను 90లలో బాలీవుడ్ ప్రముఖ నటి, ‘జె’ను జయ సాహాగా భావిస్తున్నారు. సుశాంత్తో కలిసి సారా అలీఖాన్ ‘కేదార్నాథ్’లోనూ శ్రద్ధాకపూర్ ‘చిభోర్’ సినిమాలోనూ నటించారు. వీరిద్దరూ కూడా సుశాంత్తో కలిసి పుణే సమీపంలోని ఓ దీవిలో జరిగిన పలు పార్టీల్లో పాల్గొన్నట్లు తాజా విచారణలో వెల్లడైందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఎన్సీబీ అధికారులు సోమవారం సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాను, మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీని ప్రశ్నించారు. ఈ విచారణలో జయా సాహా.. మరికొందరు సినీ ప్రముఖల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్సీబీ ఈ వారంలోనే సారా అలీఖాన్తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం కరీష్మాను ఎన్సీబీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా, నటి రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సిమోన్ ఖంబట్టాలను కూడా వచ్చే వారంలో విచారించే అవకాశం ఉంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తి సహా పలువురిని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
డ్రగ్స్ కేసు: ఆ ఫోన్లో కీలక వివరాలు!
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ సహా ఇద్దరు డ్రగ్ డీలర్లను ఎన్సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా వాట్సాప్ చాట్స్, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా సోమవారం ఎన్సీబీ ఎదుట హాజరైనట్లు సమాచారం. ఆమె ఫోన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సీబీడీ ఆయిల్(గంజాయి ఆకుల నుంచి తీసిన ద్రవం), డ్రగ్స్ను సరఫరా చేయాల్సిందిగా తనను కోరినట్లు వెల్లడైంది. వీళ్లందరి కోసం జయ సాహా ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసినట్లు సమాచారం. (చదవండి: సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్కు సమన్లు..?) ఇక రియాతో పాటు జయ కూడా మాదక ద్రవ్యాల సరఫరాలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తేలడంతో అధికారులు ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. జయకు సీబీడీ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఆమె ఫోన్లో లభించిన ఎస్ఎల్బీ, అమిత్ తదితర పేర్లతో ఉన్న కాంటాక్టు నంబర్ల గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా తదితరులకు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నో స్మోకింగ్, మూడో కన్ను.. సుశాంత్ నోట్!) -
కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన డ్రగ్ పార్టీపై విచారణ జరపాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఫిర్యాదు చేశారు. దీంతో కరన్తో పాటు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్ పార్టీ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామని, ఆ వీడియో నిజమని తేలితే, విచారణ చేపట్టనున్నట్లు ఎన్సీబీ తెలిపింది. 2019, ఆగస్టు 1న ఈ డ్రగ్ పార్టీపై ఫిర్యాదు చేశానని, అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ముంబై పోలీసులు ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకొని ఉంటే, సుశాంత్ సింగ్ రాజ్పుత్ని రక్షించుకోగలిగేవారమని శిరోమణి అకాలీదళ్ నాయకులు సిర్సా తెలిపారు. ఆ రోజు జరిగిన డ్రగ్స్ పార్టీలో దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్బీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ చలన చిత్ర పరిశ్రమలో కరణ్ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడతారని, ఆయనపై అనేక మార్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు చేశారు. -
సుశాంత్ కేసు : ఎన్సీబీ అధికారికి పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విచారణకు కరోనా సెగ తాకింది. ఎన్సీబీ దర్యాప్తు బృందంలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో విచారణను అర్దాంతరంగా నిలిపివేశారు అధికారులు. నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం ఇతర సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి చర్యల అనంతరం మళ్లీ దర్యాప్తు మొదలుకానుందని ఎన్సీబీ సీనియర్ అధికారి తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) బృంద సభ్యుల్లో ఒకరికి బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీని ప్రశ్నించడం అకస్మాత్తుగా ఆగిపోయింది. శ్రుతి మోడీని దర్యాప్తును ప్రస్తుతానికి నిలిపివేశామని, ఆమెను తిరిగి పంపించామని ఎన్సిబి డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోడీతోపాటు, టాలెంట్ మేనేజర్ జయ సాహా పేర్లు బహిర్గతమైన తరువాత ఎన్సీబీ వీరిపై దృష్టి పెట్టింది. వీరిని ప్రశ్నించేందుకు బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రుతి దక్షిణ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్హౌస్కు చేరుకున్నారు. కానీ తాజా పరిణామంతో ఈమెతోపాటు, సాహా విచారణ కూడా ప్రస్తుతానికి వాయిదా పడింది. (డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్) కాగా జూన్14న సుశాంత్ అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుకు సంబంధించి అనేక కీలక పరిణామాల మధ్య డ్రగ్స్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు రియాపై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా సహా పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
డ్రగ్ కేసు: త్వరలో సారా, రకుల్కు సమన్లు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్సీబీ త్వరలో సారా, రకుల్, సిమోన్లకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సుశాంత్ గెస్ట్ హౌజ్, పావనా డ్యామ్ ద్వీపంలోని పార్టీలపై ఎన్సీబీ దృష్టి చారించింది. ఈ సందర్భంగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇంకా వారికి సమన్లు జారీ చేయలేదని, త్వరలో పంపించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెప్పారు. (చదవండి: రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...) ఈ కేసులో నిందితులైన రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు సుశాంత్ ఫాంహౌస్, పవనా డ్యామ్ హోమ్లో జరిగే పార్టీలపై ఎన్సీబీ బృందం దృష్టి సారించింది. రియా, సుశాంత్తో కలిసి ఇక్కడి పార్టీలకు చాలాసార్లు వచ్చారని, అంతేగాక సారా సుశాంత్తో కాలిసి 4 నుంచి 5 సార్లు, శ్రద్దా కపూర్ కూడా సుశాంత్ కలిసి ఈ పార్టీలకు హాజరైనట్లు విచారణలో వెల్లడైనట్లు ఎన్సీబీ తెలిపింది. కాగా డ్రగ్స్ కేసులో రియాను మూడు దశలుగా విచారించిన ఎన్సీబీకి చివరి విచారణలో ఆమె బాలీవుడ్కు 25 మంది ప్రముఖుల పేర్లను, డ్రగ్స్ వాడే పార్టీల వివరాలను వెల్లడించింది. అనంతరం రియాను ముంబైలోని బైకూల్లా మహిళా జైలుకు తరలించగా.. ఆమె సోదరుడు షోవిక్తో పాటు సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో మరో ముగ్గురిని కూడా పురుషుల జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఎన్సీబీ సారా, రకుల్, సిమోన్లను విచారించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. అంతేగాక ద్వీపంలోని పార్టీలకు వచ్చిన వారిపై కూడా ఎన్సీబీ నిఘా పెట్టింది. (చదవండి: సుశాంత్కు స్లో పాయిజన్ ఇచ్చారు: నటి) -
రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...
ముంబై/న్యూఢిల్లీ: సుశాంత్సింగ్ మృతి కేసులో డ్రగ్స్ సంబంధాలున్న మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారుల విచారణలో హీరోయిన్లు సారా అలీఖాన్, రకుల్ ప్రీత్సింగ్తోపాటు, ఫ్యాషన్ డిజైనర్, ఓ అగ్రహీరో స్నేహితురాలు కూడా అయిన సిమోన్ ఖంబట్టా పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్తోపాటు వీరు ముగ్గురూ తనతోపాటు డ్రగ్స్ తీసుకునే వారని అధికారుల ఎదుట అంగీకరించినట్లు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తెలిపింది. వీరిలో ఒక హీరోయిన్ సుశాంత్ స్నేహితురాలు కాగా, మరొకరు తన ఫ్రెండని రియా చెప్పింది. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేయడంతోపాటు చెల్లింపులు కూడా చేసినట్లు అంగీకరించింది. డ్రగ్స్ కొనుగోలు విషయంలో తన సూచనల మేరకే శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్, సోదరుడు షోవిక్ వ్యవహరించేవారని రియా తెలిపినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖుల్లో 80 శాతం మందికి డ్రగ్స్ అలవాటుందని కూడా ఆమె వెల్లడించిందని తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా 25 మంది అగ్రశ్రేణి బాలీవుడ్ స్టార్స్కు సమన్లు ఇచ్చేందుకు ఎన్సీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘డ్రగ్స్ను సుశాంత్ సింగ్ సిబ్బంది తీసుకువెళ్లేవారు, వీటి కొనుగోలు, డెలివరీ వంటి విషయాలన్నిటినీ రియానే చూసుకునేది’అంటూ రియా సోదరుడు షోవిక్ ఇప్పటికే ఎన్సీబీకి తెలిపాడని ఐఏఎన్ఎస్ పేర్కొంది. ఈ నెల 8వ తేదీన అరెస్టయిన రియాకు న్యాయస్థానం 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు రియా సహా ఆరుగురి బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో వీరంతా వచ్చే వారం బోంబే హైకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించే అవకాశాలున్నాయి. నాకు బెయిల్ ఇవ్వండి.. సుశాంత్ మృతి కేసులో మాదక ద్రవ్యాల సరఫరాదారుగా అనుమానాలున్న జయిద్ విలాత్రా(20) బెయిల్ కోసం శనివారం బోంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈనెల 9వ తేదీన సెషన్స్ కోర్టు ఇతని బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. తాను అమాయకుడిననీ, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా ఇరికించారని ఆ పిటిషన్లో బోంబే హైకోర్టుకు తెలిపాడు. ఆగస్టులో అరెస్టయిన బాంద్రా వాసి అబ్బాస్ అలీ లఖానీ, మరో డ్రగ్స్ సరఫరాదారు కరన్ అరోరా వెల్లడించిన సమాచారం మేరకు ఎన్సీబీ ఈనెల 4న విలాత్రాను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా విలాత్రా నుంచి రూ.9.55 లక్షల నగదుతోపాటు 2 వేల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకుంది. ఇదంతా డ్రగ్స్ ద్వారా సంపాదించిందేనని ఎన్సీబీ ఆరోపిస్తోంది. అయితే, తన వద్ద చాలా తక్కువ పరిమాణంలో డ్రగ్స్ దొరకడంతోపాటు, తనది బెయిల్ ఇచ్చేందుకు అవకాశమున్న అరెస్టని విలాత్రా అంటున్నాడు. రుజువైతే ఆ సర్వీసుపై నిషేధం: డీజీసీఏ ఈనెల 9వ తేదీన నటి కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానం లోపల ఎవరైనా ఫొటోలు తీసినట్లు తేలితే ఆ విమాన సర్వీస్పై రెండు వారాల నిషేధం విధించనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై ఆ విమానయాన సంస్థ చర్యలు తీసుకున్న తర్వాతే ఆ విమాన సర్వీసుకు తిరిగి అనుమతినిచ్చే విషయం పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని దేశీయ విమానయాన సంస్థలకు ఉత్తర్వులు పంపింది. కంగనా ప్రయాణిస్తున్న విమానం చండీగఢ్ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో కొందరు మీడియా సిబ్బంది ఫొటోలు తీయడంతోపాటు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగా వచ్చిన వీడియోలపై శుక్రవారం డీజీసీఏ ఇండిగోకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఫొటోలు తీసి, నిబంధనలు ఉల్లంఘించిన వారి పేర్లను నో–ఫ్లై జాబితాలో పెట్టాలని కోరింది. ఏడుగురు డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్ ఎన్సీబీ శనివారం ముంబైతోపాటు గోవాలోని పలుప్రాంతాల్లో సోదాలు జరిపి ఏడుగురిని అరెస్టు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన వారిలో కరంజీత్ అలియాస్ కేజే ముఖ్యమైన వ్యక్తి. సుశాంత్ సింగ్, రియా చక్రవర్తికి కూడా ఇతడు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. శామ్యూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తి వెల్లడించిన వివరాల్లో కేజే పేరు కూడా ఉండటం గమనార్హం. -
బలవంతంగా ఒప్పించారు: రియా
ముంబై: ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాచక్రవర్తి తనకు జైల్లో ప్రాణభయం ఉన్నదనీ, తనపై మోపినవి బెయిలబుల్ నేరాలు కనుక తక్షణమే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. తాను అమాయకురాలిననీ, తనని తప్పుడు కేసులో ఇరికించారనీ రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. మంగళవారం మెజిస్ట్రేటు కోర్టు రియా బెయిల్ పిటిషన్ని తిరస్కరించడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్లు నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. రియాని ప్రశ్నించింది పురుష అ«ధికారులేనని ఆమె న్యాయవాది సతీష్ మనే షిండే అన్నారు, ఆ సమయంలో కనీసం మహిళా పోలీసు అధికారి కానీ, కానిస్టేబుల్ కానీ లేకపోవడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. నేరం అంగీకరించేలా రియాపై ఒత్తిడిచేశారని ఆమె లాయర్ ఆరోపించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ల బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు రానుందని షిండే తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మంగళవారం స్థానిక కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే రియా, ఆమె సోదరుడు షోవిక్ పదిసంవత్సరాలకు తగ్గకుండా కారాగార శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
8 గంటలు ప్రశ్నల వర్షం
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో వరుసగా రెండో రోజు సోమవారం కూడా నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట హాజరయ్యారు. ఆమెను ఎనిమిది గంటలపాటు ఎన్సీబీ విచారించింది. బాలార్డ్ ఎస్టేట్లోని ఎన్సీబీ కార్యాలయానికి ఉదయం 9:30 నిముషాలకు పోలీసు ఎస్కార్టుతో వచ్చిన రియా, ఆరు గంటలకు తిరిగి వెళ్ళారు. విచారణ సందర్భంగా రియాచక్రవర్తి, డ్రగ్స్ తీసుకొంటోన్న బాలీవుడ్కు చెందిన కొందరి పేర్లను కూడా వెల్లడించడం సంచలనానికి దారితీసింది. 18 నుంచి 19 మంది పేర్లు రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో సుశాంత్ కోసం డ్రగ్స్ తెప్పించానని, తాను మాత్రం ఎప్పుడూ సేవించలేదని రియా తెలిపారు. అయితే సిగరెట్లు తాగే అలవాటుందని రియా చెప్పారు. తన సోదరుడు షోవిక్ ద్వారా డ్రగ్స్ సరఫరాదారు బాసిత్ పరిహార్ని ఐదుసార్లు కలిసినట్టు, అతడు తన నివాసానికి సైతం వచ్చేవాడని రియా వెల్లడించారు. రియాని, శామ్యూల్ మిరాండాతో కూర్చోబెట్టి విచారించగా.. రియా తనకు డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదని, కానీ సుశాంత్, అతని స్నేహితులు డ్రగ్స్ తీసుకునేవారని వెల్లడించినట్లు తెలిసింది. సుశాంత్ 2016 నుంచి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టినట్టు రియా వెల్లడించింది. మిరాండా ద్వారా డ్రగ్స్ తెప్పించి రియా సుశాంత్కి ఇచ్చేదని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రియాను విచారించిన విషయం తెలిసిందే. రియాతో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్లను కలిపి, విడివిడిగా ప్రశ్నించనున్నారు. దీనికోసం రియాని మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు ఎన్సీబీ డిప్యూటీ డీజీ ముత్తా అశోక్ జైన్ వివరించారు. ఆమె విచారణకు సహకరిస్తోందన్నారు. కాగా ఈ కేసులో అనూజ్ కేశ్వానీ అనే వ్యక్తిని సోమవారం ఎన్సీబీ అరెస్టు చేసింది. రియా అరెస్టు తప్పకపోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. సుశాంత్ సోదరిపై రియా ఫిర్యాదు సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంకతోపాటు ఢిల్లీకి చెందిన డాక్టర్ తరుణ్పై రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ మానసిక సమస్యల చికిత్స కోసమంటూ వీరు తయారు చేసి ఇచ్చిన తప్పుడు, ఫోర్జరీ ప్రిస్క్రిప్షన్ వల్లే అతడు చనిపోయాడని ఆరోపించారు. ఈ మేరకు బాంద్రా పోలీసులకు ఫిర్యాదు పంపారు. -
డ్రగ్స్ దందాకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్కు లింక్!
సాక్షి బెంగళూరు: కన్నడనాట డ్రగ్స్ మాఫియా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్ దందాకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్కి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) లోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. బెంగుళూరు మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడు డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు కె టి రమీస్తో మధ్య జరిగిన సంభాషణలే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య నిత్యం సంప్రదింపులు జరిగాయని అధికారి పేర్కొన్నారు. మొదటినుంచి ఈ రెండు కేసులకి మధ్య సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా నిందితుల మధ్య జరిగిన సంభాషణలు అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇప్పటికే ఎన్సిబి అధికారులు మహ్మద్ అనూప్ సహా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (‘దోషిగా తేలితే నా కొడుక్కి ఉరిశిక్ష వేయండి’) తాజాగా కేరళ సీపీఎం కార్యదర్శి కుమారుడు, నటుడు బినీష్ కొడియేరి పేరు సాండల్వుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా బయటపడింది. డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్ను ఎన్సీబీ అధికారులు విచారించగా బినీష్ పేరు బయటికొచ్చింది. అంతేకాకుండా కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్ను బెంగుళూరులో అరెస్టు చేసిన రోజే డ్రగ్స్ పెడ్లర్ మహ్మద్ అనూప్ని బినీష్ బెంగుళూరులో కలుసుకున్నాడు. దాంతో రెండు కేసులకు సంబంధముందా అనే కోణంలో ఎన్సీబీ విచారణను వేగవంతం చేసింది. కాగా తన వ్యాపార కార్యకలాపాలకు సహాయం చేశాడని అనూప్ చేసిన వ్యాఖ్యలను బినీష్ కొట్టిపరేశాడు. తనకు ఒక స్నేహితుడిగా మాత్రమే మహ్మద్ అనూప్ తెలుసునని, డ్రగ్ వ్యవహారం గురించి తానకేం తెలియదని, ఇదంతా రాజకీయ కుట్రేనని ఆరోపించాడు. ఇప్పటికే కన్నడనాట డ్రగ్స్ మాఫియా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్టుతో శాండల్వుడ్లోని మరికొంతమంది నటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. (శాండల్వుడ్లో డ్రగ్స్ కలకలం) -
డ్రగ్స్ కేసు: రియా చక్రవర్తి అరెస్టు!
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎన్సీబీ నటి రియా చక్రవర్తికి ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబైలోని ఆమె ఇంటికి చేరుకున్న అధికారులు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించారు. తదుపరి విచారణకై ఎన్సీబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పడంతో.. ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా అక్కడకు బయల్దేరారు. మరికాసేపట్లో ఆమె అక్కడికి చేరుకోనున్నారు. ఏ క్షణమైనా రియా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.(చదవండి: కంగ్రాట్స్ ఇండియా: రియా చక్రవర్తి తండ్రి) ఈ సందర్భంగా.. రియా చక్రవర్తి న్యాయవాది సతీశ్ మనేషిండే మాట్లాడుతూ.. ‘‘ఈ పరిస్థితుల్లో రియా ఏ క్షణమైనా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నారు’’అని తెలిపారు. ఆమె పేరిట మరో ప్రకటన కూడా విడుదల చేశారు. ‘‘ఒకరిని ప్రేమించడం నేరం కానేకాదు. ఆ ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వీటన్నింటితో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ బిహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్సీబీ నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించలేదు’’ అని ఉద్వేగానికి గురయ్యారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మన్నట్లుగా అతడు చెప్పడంతో పాటుగా మరిన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంది. ప్రస్తుతం ఎన్సీబీ అధికారులు సమీర్ వాంఖడే, కేపీఎస్ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది. -
రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
నెక్ట్స్ నా కూతురే: రియా చక్రవర్తి తండ్రి
ముంబై: డ్రగ్స్ కేసులో తన కుమారుడిని అరెస్టు చేయడంపై నటి రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి స్పందించారు. తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్గా పని చేసిన ఆయన ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కంగ్రాట్స్ ఇండియా, నువ్వు నా కొడుకును అరెస్టు చేశావు, ఆ తర్వాత వరుసలో నా కుమార్తె కూడా ఉందని నాకు తెలుసు. ఆ తదుపరి ఇంకెవరో తెలియదు. ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్థవంతంగా పడగొట్టేశారు. అయితే న్యాయం జరగాలంటే వీటన్నింటినీ మనం సమర్థించాల్సి ఉంటుంది. జై హింద్’’అంటూ విమర్శనాత్మక లేఖ విడుదల చేశారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్, సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.(చదవండి: ‘రియా, సుశాంత్ కలిసి గంజాయి తాగేవారు’) ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో రియా, షోవిక్(24)ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ మేరకు శుక్రవారం వారి నివాసంలో సోదాలు జరిపిన ఎన్సీబీ అధికారులు షోవిక్ను అరెస్టు చేశారు. ఈనెల 9 వరకు తమ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా రియా చక్రవర్తి చెబితేనే తాను మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్కే కాకుండా మరికొందరు బాలీవుడ్ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని అతడు విచారణలో అంగీకరించాడని పేర్కొన్నారు. (చదవండి: రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు) దీంతో రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్ డేటా ఆధారంగా ఎన్సీబీ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం రియాను విచారించి, ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తాజా సమచారాం ప్రకారం ఎన్సీబీ అధికారులు ఇప్పటికే రియా ఇంటికి చేరుకున్నారు. కాగా షోవిక్తో పాటు ఇప్పటికే అరెస్టయిన సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండా, డ్రగ్ డీలర్లు కైజాన్ ఇబ్రహీం, జైద్ విల్తారా, అబ్దుల్ బాసిత్ పరిహార్ తదితరులను... రియా ముందు కూర్చోబెట్టి ముఖాముఖి విచారిస్తే ఒక్కొక్కరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. -
రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ముంబై: సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. బాలీవుడ్తో పెనవేసుకుపోయిన డ్రగ్స్ మాఫియా చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా యి. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ని ఎన్సీబీ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేయడంతో బాలీవుడ్లో డ్రగ్స్ నెట్వర్క్ తీగలాగితే డొంక కదలినట్టుగా బయటకొస్తోంది. ఈ మాదక ద్రవ్యాల రవాణాలో పెద్దచేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోన్న క్రమంలో అనూహ్యమైన విషయాలెన్నో బయటపడుతున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సౌత్ వెస్ట్ రీజియన్ ముత్తా అశోక్ జైన్ మీడియాకి వెల్లడించారు. విచారణలో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సంచలన విషయాలను బయటపెట్టారని, రియా చక్రవర్తి చెపితేనే మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్కే కాకుండా మరికొందరు బాలీవుడ్ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని షోవిక్ విచారణలో ఒప్పుకున్నాడని వారు వెల్లడించారు. రియా చక్రవర్తి ఎప్పటి నుంచో మాదక ద్రవ్యాలు కొనడం, అమ్మడం చేస్తోందని ఆమె కాల్ డేటా ఆధారంగా ఎన్సీబీ నిర్ధారణకు వచ్చింది. ఆదివారం రియాను విచారణకు పిలిచి, ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. షోవిక్తో పాటు ఇప్పటికే అరెస్టయిన వారిని... రియా ముందు కూర్చోబెట్టి ముఖాముఖి విచారిస్తే ఒక్కొక్కరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారి అశోక్ జైన్ తెలిపారు. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్ని శనివారం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. డ్రగ్ సిండికేట్లో షోవిక్ను భాగస్వామిగా గుర్తించిన ఎన్సీబీ అతను ఇంత భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు ఎలా సేకరించాడనే విషయాన్ని ఆరా తీస్తోంది. సుశాంత్ నివాసానికి సీబీఐ బృందం బాంద్రాలోని మోంట్బ్లాంక్ అపార్ట్మెంట్స్లోని సుశాంత్ సింగ్ ఫ్లాట్ని, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి, సీబీఐ బృందం శనివారం పరిశీలించింది. రాజ్పుత్ వంట మనుషులు నీరజ్, కేశవ్, సుశాంత్తో కలిసి అదే ఫ్లాట్లో నివసించిన సిద్ధార్థ్ పితానిలను సైతం సీబీఐ బృందం తమ వెంట తీసుకెళ్ళింది. ఇదే ఫ్లాట్లో జూన్ 14న సుశాంత్ ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఎన్సీబీ కస్టడీకి షోవిక్, మిరాండా షోవిక్ చక్రవర్తి అనేక మందికి మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని, ఇతనికి మరో నిందితుడు అబ్దుల్ బాసిత్ పరిహార్తో సంబంధాలున్నాయని ఎన్సీబీ స్థానిక కోర్టుకి వెల్లడించింది. షోవిక్ను, సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి కోర్టు అప్పగించింది. నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనేకమార్లు సుశాంత్ ఆత్మహత్యాయత్నాలు చేయడం లాంటి విషయాలపై వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్, ప్రధాన ముద్దాయి రియా చక్రవర్తితో కలిపి షోవిక్ను, ముఖాముఖి విచారించాల్సి ఉందని కోర్టుకి ఎన్సీబీ తెలిపింది. మాదక ద్రవ్యాల సరఫరా కేసులో ఇదివరకే అరెస్టయిన బాసిత్ పరిహార్తో, షోవిక్, మిరాండాలు సంబంధాలు కలిగి ఉన్నట్టు ఎన్సీబీ తెలిపింది. ఈ విచారణలో షోవిక్ మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన అనేక మంది పేర్లను బయటపెట్టినట్లు కూడా ఎన్సీబీ వెల్లడించింది. కాల్ డేటా విశ్లేషణ, వాట్సాప్ చాట్స్, ప్రాథమిక విచారణలో బయటకొచ్చిన కొందరి పేర్లను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన మరో ముద్దాయి కైజన్ ఇబ్రహీంని కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. -
‘దోషిగా తేలితే నా కొడుక్కి ఉరిశిక్ష వేయండి’
సాక్షి, తిరువనంతపురం: కన్నడనాట డ్రగ్స్ మాఫియా వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువులు సినీ ప్రముఖులకు నార్కొటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీ చేయగా.. మరికొంత మంది పేర్లు బయటికి వచ్చే అవకాశముంది. అయితే, కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు, బెంగుళూరులో డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ సీపీఎం కార్యదర్శి కుమారుడు, నటుడు బినీష్ కొడియేరి పేరు సాండల్వుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా బయటపడింది. డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్ను ఎన్సీబీ అధికారులు శుక్రవారం విచారించగా బినీష్ పేరు బయటికొచ్చింది. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలక్రిష్ణన్.. తన కొడుకు దోషిగా తేలితే శిక్షించండని అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే సరిపోదని, రుజువులు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. ఒకవేళ తన కొడుకు ఉరిశిక్ష పడేంత నేరం చేస్తే, ఆ శిక్ష విధించాలని మీడియాతో అన్నారు. కాగా, సెప్టెంబర్ 2న యూత్ లీడర్ పీకే ఫిరోజ్ కుడా బినీష్పై ఆరోపణలు చేశాడు. అతనికి డ్రగ్స్ డీలర్లతో సంబంధాలున్నాయని చెప్పాడు. ఇదిలాఉండగా.. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితురాలుస్వప్న సురేశ్ బెంగుళూరులో జూన్ 10 న అరెస్టు చేశారు. డ్రగ్స్ పెడ్లర్ మహ్మద్ అనూప్ని బినీష్ అదేరోజు బెంగుళూరులో కలుసుకున్నాడు. దాంతో రెండు కేసులకు సంబంధముందా అనే కోణంలో ఎన్సీబీ విచారిస్తోంది. (చదవండి: యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం) -
థాంక్యూ గాడ్: సుశాంత్ సోదరి
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్సీబీ గొప్పగా ముందుకు సాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు.. ‘‘మేమంతా సత్యం వైపు పయనించేలా మార్గదర్శనం చేస్తున్నందుకు ధన్యవాదాలు దేవుడా’’ అంటూ #GreatStartNCB #Warriors4SRR #Flag4SSR అనే హ్యాష్ట్యాగ్లను జత చేశారు. సుశాంత్ న్యాయం జరగాలని పోరాడుతున్న వారికి ఇదొక ఉపశమనమని పేర్కొన్నారు. (చదవండి: 5 కిలోల డ్రగ్స్కు డబ్బు చెల్లించు: షోవిక్) కాగా జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రేమ పేరిట సహజీవనం చేస్తూ, డబ్బు తీసుకుని.. మోసం చేసి, సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతడి కుటుంబం రియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 15 కోట్ల మేర తన అకౌంట్కు డబ్బు బదిలీ చేయించుకుందని ఫిర్యాదు చేయడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రియాను విచారించింది. (చదవండి: సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్) ఇక సుశాంత్కు ఆమే డ్రగ్స్ అలవాటు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో సన్నిహితులతో రియా జరిపిన వాట్సాప్ చాట్స్ బయటకు రావడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రియా, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండా నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మందని అతడు చెప్పడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. రియా, షోవిక్, శామ్యూల్ తదితరులతో కలిసి సుశాంత్ తన ఇంటి టెర్రస్పైన గంజాయి తాగేవాడని అతడి మేనేజర్ శృతి మోదీ కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. -
శాండల్వుడ్లో డ్రగ్స్ కలకలం
సాక్షి బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో శాండల్వుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) శుక్రవారం ఒక అడుగు ముందుకు వేసింది. యలహంకలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసింది. రెండు రోజుల క్రితమే నటి రాగిణి సన్నిహితుడు రవిశంకర్ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. రవి శంకర్ ఇచ్చిన సమాచారంతో రాగిణిని గురువారం విచారణకు రావాలని నోటీసులిచ్చారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, సోమవారం విచారణకు వస్తానని లాయర్ ద్వారా రాగిణి సమాధానం పంపారు. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా సెర్చ్వారంట్తో పోలీసులు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఆమె ఇంటిపై దాడి చేసి, సోదాలు జరిపారు. అనంతరం రాగిణిని విచారణ నిమిత్తం సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా, శుక్రవారం సాయంత్రం రాగిణిని అరెస్టు చేసినట్లు సీసీబీ ప్రకటించింది. రాగిణి పెట్టుకున్న ముందస్తు బెయిల్పై విచారణను 7వ తేదీకి ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఇటీవల ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. వీరు వెల్లడించిన సమాచారంతో దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ను సీసీబీ పోలీసులు విచారించగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సుమారు 15 మంది సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్
సాక్షి, ముంబై : సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. రియానే డ్రగ్స్ తీసుకురమ్మందని ఆమె సోదరుడు షోవిక్ అధికారులకు తెలిపాడు. ఇక ఈ కేసులో వచ్చిన మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ల పర్వం ప్రారంభమయ్యింది. శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేశారు. అతడితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ పరిహార్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్సీబీ అధికారులు షోవిక్తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గంజాయి అమ్మకంలో భాగస్వాములని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎన్సీబీ అధికారులు షోవిక్తో పాటు శ్యాముల్ మిరాండాల ఇళ్లలో ఏక కాలంలో దాడులు చేశారు. (చదవండి: ‘సుశాంత్కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’) ఇక ఇప్పటికే డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్ పరిహార్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి పంపారు. జైద్ విలాత్రా విచారణ ఆధారంగా బాసిత్ పరిహార్ను దర్యాప్తులో చేర్చిన సంగతి తెలిసిందే. బాసిత్, జైద్ ఇద్దరూ డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో పాల్గొన్నట్లు చెప్పారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించాడని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్ను అదుపులోకి తీసుకున్నారు. -
5 కిలోల డ్రగ్స్కు డబ్బు చెల్లించు: షోవిక్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన ఎన్సీబీ.. శుక్రవారం ఉదయం ముంబైలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. అదే విధంగా మరో బృందం సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరండా ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఎన్డీపీఎస్ చట్టం, విధివిధానాలను అనుసరించి ఈ మేరకు రియా, మిరండా నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. కాగా డ్రగ్ డీలర్తో రియా చక్రవర్తి సంభాషణ జరిపినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్ బహిర్గతమైన సంగతి తెలిసిందే. తద్వారా ఆమె నిషేధిత డ్రగ్స్ గురించి తన సన్నిహితులతో చర్చించినట్లు వెల్లడైంది. (చదవండి: ‘రియా, సుశాంత్ కలిసి గంజాయి తాగేవారు’) ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్సీబీ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండాలకు డ్రగ్స్ అందించినట్లుగా అనుమానిస్తున్న అబ్దుల్ బాసిత్, జైద్ విల్తారా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి మార్చి 17న జైద్ ఫోన్ నంబరును సుశాంత్ మేనేజర్ మిరాండాకు షేర్ చేసినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 10 వేల రూపాయల విలువ గల 5 కిలోల డ్రగ్స్ను కొనుగోలు చేసినందుకు జైద్కు డబ్బు చెల్లించాల్సిందిగా షోవిక్ కోరాడు. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా) ఈ క్రమంలో మిరండా జైద్కు మూడు సార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. భాసిత్ ద్వారా జైద్ నంబర్ వీరికి తెలిసినట్లు సమాచారం. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ ఎదుట హాజరైన అతడి మేనేజర్ శృతి మోదీ సుశాంత్, రియా కలిసి గంజాయి తాగేవారని వెల్లడించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు షోవిక్, మిరండా టెర్రస్ మీద గంజాయి పీల్చేవారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి తాము మీడియాకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని సీబీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. House search being conducted at Showik Chakraborty's and Samuel Miranda's residences as provided under NDPS Act: Narcotics Control Bureau (NCB) https://t.co/EpKDxZEkqK — ANI (@ANI) September 4, 2020 -
డ్రగ్స్ వాడకం.. నటులు, మ్యూజిషియన్స్పై దృష్టి
బెంగళూరు: వారం రోజుల క్రితం కర్ణాటకలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు దర్యాప్తులో భాగంగా కొందరు ‘ప్రముఖ సంగీతకారులు, నటులు’ ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వివరాలు.. ఆగస్టు 21న ఎన్సీబీ బృందం.. బెంగళూరు కల్యాణ్ నగర్లోని రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్మెంట్ నుంచి 145 ఎండీఎంఏ మాత్రలు, 2.20 లక్షల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఆ తరువాతి చర్యల్లో భాగంగా ఈ బృందం బెంగళూరులోని నికూ అపార్ట్మెంట్లో మరో 96 మాత్రలు, 180 ఎల్ఎస్డీ బ్లాట్లను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) కె పి ఎస్ మల్హోత్రా ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక ‘ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఒక లేడీ డ్రగ్ సప్లయర్ని అదుపులోకి తీసుకోవడమే కాక బెంగళూరు దోడగుబ్బీలోని ఆమె ఇంటి నుంచి 270 ఎండీఎంఏ మాత్రలు స్వాధీనం చేసుకున్నాము’ అని మల్హోత్ర తెలిపారు. (చదవండి: రూ. 100 కోట్ల డ్రగ్స్ పట్టివేత!) ఈ దాడుల సమయంలో ఎం అనూప్, ఆర్ రవీంద్రన్, అనిఖా డి అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు మల్హోత్ర తెలిపారు. ప్రముఖ సంగీతకారులు, నటులతో పాటు కళాశాల విద్యార్థులు, యువకులకు సహా సమాజంలోని సంపన్న వర్గాలకు చెందిన వారికి.. నిందితులు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు మల్హోత్ర. ఈ కేసులో ఎన్సీబీ బెంగళూరు యూనిట్ త్వరలోనే మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ, ఈ నెల ప్రారంభంలో మాదకద్రవ్యాల వ్యవహారంలో రెహమాన్.కె అనే వ్యక్తిని అరెస్టు చేసింది. అతడు కళాశాల విద్యార్థులు, యువకులకు ఎండీఎంఏతో పాటు ఇతర డ్రగ్స్ని విక్రయిస్తున్నాడని ఎన్సీబీ తెలిపింది. వినియోగదారులు బిట్ కాయిన్స్ ద్యారా ఆన్లైన్లో ఈ మాత్రలను కొనుగోలు చేసినట్లు గుర్తించామని.. కొద్ది రోజుల కిందట ఇదే తరహా మాత్రలను కొనుగోలు చేసిన జంటను ముంబాయిలో పట్టుకున్నామని మల్హోత్ర తెలిపారు. -
రియా చక్రవర్తిపై నార్కోటిక్ కేసు
న్యూఢిల్లీ/ముంబై: నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కేసు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన సమాచారం మేరకు ఎన్డీపీఎస్(నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్) చట్టంలోని పలు సెక్షన్ల కింద రియాతోపాటు ఇతరులపైనా కేసులు పెట్టినట్లు ఎన్సీబీ బుధవారం వెల్లడించింది. నటుడు సుశాంత్సింగ్కు మాదక ద్రవ్యాలతో సంబంధమున్నదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని ఎన్సీబీ డీజీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. సుశాంత్ మృతి కేసును మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ.. రియా సెల్ఫోన్లోని వాట్సాప్ మెసేజీల్లో కొన్నిటిని తొలగించినట్లు గుర్తించింది. వీటిని తిరిగి సంగ్రహించి పరిశీలించగా అవి నిషేధిత గంజాయి తదితర మాదక ద్రవ్యాలతో సంబంధమున్నవిగా తేలింది. ఈ సమాచారాన్ని ఈడీ.. ఎన్సీబీకి అందించింది. తాజా పరిణామంతో సుశాంత్సింగ్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ సంస్థల జాబితాలో ఈడీ, సీబీఐ తర్వాత ఎన్సీబీ కూడా చేరినట్లయింది. పితానీని ఆరో రోజూ ప్రశ్నించిన సీబీఐ సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్ధ్ పితానీని సీబీఐ వరుసగా ఆరో రోజు బుధవారం కూడా ప్రశ్నించింది. డీఆర్డీవో అతిథి గృహానికి బాంద్రా పోలీసు బృందం కూడా వచ్చి, గంట తర్వాత తిరిగి వెళ్లిందని అధికారులు తెలి పారు. సుశాంత్ మరణించిన జూన్ 14వ తేదీన అతని ఫ్లాట్లో సిద్ధార్థ్తోపాటు పనిమనిషులు ఇద్దరు కూడా ఉన్నారు. -
బాలీవుడ్ పెద్దలు జైలుకెళ్లడం ఖాయం!
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎంట్రీపై ఫైర్బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. డ్రగ్ ముఠాలతో బాలీవుడ్ సంబంధాలపై ఎన్సీబీ దర్యాప్తు చేపడితే పలువురు ప్రముఖులు జైలుకు వెళతారని కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్లో ప్రవేశిస్తే..పలువురు ప్రముఖులు (ఏ లిస్టర్స్) జైలు ఊచలు లెక్కబెడతారు..బాలీవుడ్ జనాలకు రక్త పరీక్షలు నిర్వహిస్తే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూస్తాయ’ని కంగనా ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రధానమంత్రి కార్యాలయం బాలీవుడ్ అనే బురదను ప్రక్షాళన చేస్తుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇక రియా చక్రవర్తి వాట్సాప్ చాట్స్లో 2017 నుంచి 2019 మధ్య హార్డ్ డ్రగ్స్, ఎండీఎంఏపై చర్చ జరిగినట్టు గుర్తించిన ఈడీ ఈ విషయాన్ని సీబీఐ, ఎన్సీబీలకు నివేదించిన నేపథ్యంలో కంగనా ట్వీట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు. సుశాంత్ మృతి కేసు విచారణలోకి ఎంటరైన ఎన్సీబీ ఇప్పటికే పలు పత్రాలను పరిశీలించిందని ఎన్సీబీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా వెల్లడించారు. రియా, సుశాంత్లకు డ్రగ్ సరఫరా జరిగినట్టు తాము చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ నుంచి తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. దీనిపై ఎన్సీబీ బృందం దర్యాప్తు చేపట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తుందని చెప్పారు. మరోవైపు సుశాంత్ మృతికి సంబంధించి ముంబై పోలీసుల దర్యాప్తులో సీబీఐ కొన్ని విధానపరమైన లోపాలను గుర్తించింది. చదవండి : బాయ్కాట్ కంగనా! -
పక్కా స్కెచ్.. 10 కోట్ల డ్రగ్స్ కొట్టేశారు..!
సాక్షి, తిరుపతి : రేణిగుంటలోని ఓ డ్రగ్స్ ఫ్యాక్టరీలో గత నెలలో చోరీకి గురైన రూ.10 కోట్ల విలువైన అల్ఫాజోన్ దోపిడీ కేసులో నిందితులు పట్టుబడ్డారు. ప్యాక్టరీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులతో కలిసి ఓ మాజీ ఉద్యోగి ఈ చోరీలో నిందితులుగా ఉన్నారని తెలిసింది. వివరాలు.. రేణిగుంటలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేసి సస్పెండైన దక్షిణా మూర్తి అనే మాజీ ఉద్యోగి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిట్టిబాబు అనే వక్తితో కలిసి డ్రగ్స్ కొట్టేయడానికి పథకం పన్నారు. ఆల్ఫాజోన్ అనే అతి ఖరీదైన మత్తుమందును కాజేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఫ్యాక్టరీలోని స్టోర్లో పనిచేస్తున్న నాగరాజు, శ్రీనివాసులు అనే వ్యక్తులకు రూ.10 లక్షలు ఆశ చూపి వారి ద్వారా గత నెలలో 30 కేజీల ఆల్ఫాజోన్ కాజేశారు. తర్వాత బెంగుళూరులో ఓ వ్యక్తికి 15 కేజీలను అమ్మేసి మిగిలిన దానిని దక్షిణామూర్తి తన ఇంట్లో దాచిపెట్టాడు. అదేక్రమంలో బెంగుళూరులోని నార్కోటిక్ అధికారులు ఒక డ్రగ్స్ కేసులో ముద్దాయిని అరెస్టు చేయగా అతని వద్ద భారీగా మత్తుమందు దొరికింది. విచారణలో రేణిగుంటలోని మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారి వద్ద దానిని కొనుగోలు చేసానని చెప్పాడు. పేర్లు వెల్లడించారు. నార్కోటిక్ అధికారులు బుధవారం సాయంత్రం ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని చిట్టిబాబు, నాగరాజు, శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పేసుకున్నారు. అనంతరం దక్షిణామూర్తిని పట్టుకుని అతని ఇంట్లో దాచిపెట్టిన 15 కేజీల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. నిందితుల వివరాలు... చిట్టిబాబు - అడుసుపాళ్యం, శ్రీనివాసులు - గాజులమండ్యం, నాగరాజు - కే ఎల్ ఏం హాస్పిటల్, దక్షిణా మూర్తి - కే ఎల్ ఏం హాస్పిటల్. -
లేడీ కాదు ఇంటర్నేషనల్ కేడీ
న్యూఢిల్లీ : హీరో సూర్య ‘వీడొక్కడే’ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సీన్.. కొకైన్ క్యాప్సుల్స్ను కడుపులో ఉంచుకుని స్మగ్లింగ్ చేయడం. మరి దర్శకుడు కేవీ ఆనంద్ నిజ జీవితంలో జరిగిన సన్నివేశాన్ని అలా తీశారో ఏమో తెలియదు కాని. అచ్చం అలాంటి సీనే ఢిల్లీలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగు చూసింది. బ్రెజిల్ కు చెందిన ఓ మహిళ తన కడుపులో 106 క్యాప్సుల్స్ను స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల14న బ్రెజిల్కు చెందిన 25 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ నైజీరియన్ వ్యక్తికి సరుకు అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. కొకైన్ అందితే ఐదువేల డాలర్లు ఆమెకు ఇచ్చేలా బేరం కుదిరింది. ఢిల్లీలోని ఓ హోటల్లో ఉన్న ఆ నైజీరియన్కు దీన్ని చేరవేయడానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ఆమెను స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానించారు. యువతిని హాస్పిటల్కు తరలించి ఎక్స్రే తీసి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో 930 గ్రాముల సౌత్ అమెరికన్ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసలు తెలిపారు. నేరాన్ని అంగీకరించిన ఆమె తన రెండవ భర్త కారణంగానే స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఆదివారం ఆమెను సిటీ కోర్టు ఎదుట హాజరుపర్చిన పోలీసులు నేరం నిరూపణ కావటంతో తీహార్ జైలుకు తరలించారు. -
ఢిల్లీలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
న్యూఢిల్లీ: ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రట్టు చేసింది. ఢిల్లీ వర్సిటీ విద్యార్థులు ఇద్దరు, జవహర్లాల్ నెహ్రూ వర్సిటీకి చెందిన ఒకరు, అమిటీ వర్సిటీకి చెందిన ఒక విద్యార్థి అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి 1.14 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఏడాది సందర్భంగా వర్సిటీలక్యాంపస్ పార్టీలో వీటిని వాడాలని నిందితులు ప్లాన్వేశారు. -
డ్రగ్స్ రాకెట్లో నలుగురు విద్యార్థుల అరెస్ట్
న్యూ ఢిల్లీ : న్యూ ఇయర్ వేడుకలకు ముందు దేశ రాజధానిలో డ్రగ్స్ రాకెట్ ముఠాతో సంబంధం ఉన్న నలుగురు విద్యార్థులను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 1.14 కిలోల గంజాయితో పాటు ఎల్ఎస్డీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. ఎన్సీబి డిప్యూటీ జనరల్ డైరక్టర్ ఎస్కె జా మాట్లాడుతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం ఇటీవల ఎక్కువ అయిందని తెలిపారు. హిమచల్ ప్రదేశ్ నుంచి వీరికి డ్రగ్స్ సరఫర అవుతున్నాయన్నారు. హిందు కాలేజీకి చెందిన గౌరవ్ ఈ రాకెట్ని కింగ్పిన్ అనే కోడ్తో రన్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతని నుంచి మిగిలిన ముగ్గురికి(అనిరుధ్ మాథుర్, టెన్జిన్ ఫుంచోగ్, సామ్ మల్లిక్) డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, వారు చెప్పిన వివరాల ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
రూ.40 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. టాంజానియ, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.40 కోట్ల విలువైన కొకైన్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియా, నైజీరియాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 4 కిలోల కొకైన్ లభించింది. మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. టాంజానియా, నైజిరియాకు చెందిన వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
భారీ మొత్తం పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం గండిచెరువులో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ ట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందటంతో అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. -
రూ.40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు రూ.40 కోట్ల విలువైన ఎనిమిది కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఈ మాదకద్రవ్యాన్ని శుక్రవారం స్థానిక ఐదు నక్షత్రాల హోటల్లో స్వాధీనం చేసుకొని అమోబీ చిజిఓకే ఒబినికా అనే నైజీరియన్ను అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలో ఓ ఖరీదైన లాడ్జికి అమోబీ దీనిని తీసుకెళ్తుండగా అరెస్టు చేశామని ఎన్సీబీ తెలిపింది. వారి కథనం ప్రకారం.. ఈ ఏడాది ఇంత భారీగా కొకైన్ పట్టుబడడం ఇదే తొలిసారి. ఇది చాలా ప్రమాదకరమైన మాదకద్రవ్యం కావడంతో మత్తుమందుల వ్యవసపరులు దీనిని తీసుకోవడానికి చాలా ఇష్టపడుతారని ఎన్సీబీ డెరైక్టర్ జనరల్ ఆర్పీ సింగ్ తెలిపారు. అయితే ఈ నెల 26న ఢిల్లీకి వచ్చిన నిందితుడు కొకైన్ను తన వెంట తీసుకురాకుండా వేరే విమానంలో పార్సిల్ బుక్ చేశాడు. మరునాడు అది ఇతని హోటల్ గదికి కొరియర్లో రావాల్సి రావాల్సి ఉంది. ఇతని కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు నిఘా వేశారు. హోటల్ లాబీలో ఇతడు కొరియర్ కోసం ఎదురుచూస్తుండగానే అరెస్టు చేశారు. అమోబీపై మాదకద్రవ్యాల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశామని, అయితే ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సింగ్ చెప్పారు. విద్యార్థులకు భారీగా డ్రగ్స అందుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. అన్మోల్ సర్నా అనే ఎన్ఐఆర్ విద్యార్థి ఇటీవల మాదకద్రవ్యాలు వికటించడంతో హింసాత్మకంగా మారి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించడం తెలిసిందే. ూజీజ్ఛటజ్చీ