Palestine
-
పాలస్తీనా శరణార్థులను అక్కున చేర్చుకోండి
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా మారిన పాలస్తీనా పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. జోర్డాన్, ఈజిప్టుతోపాటు ఇతర అరబ్ దేశాలు వారికి ఆశ్రయ మివ్వాలని సూచించారు. వారి బాగోగులు చూసుకోవాలన్నారు. ఇజ్రాయెల్కు 2 వేల పౌండ్ల బరువైన బాంబుల సరఫరాను నిలిపివేస్తూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశానని వెల్లడించారు. వాటిని శనివారమే ఇజ్రాయెల్కు అందజేశామని చెప్పారు.గాజాను శుభ్రం చేయాలి గాజా పూర్తిగా విధ్వంసానికి గురైన ప్రాంతమని, శిథిలాలను తొలగించి, శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కనుక ఎక్కువ మంది ప్రజలు బయటకు వెళితే కార్యాచరణ తేలికవుతుందన్నారు. గాజా పౌరులకు మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తే, అక్కడ వారు శాంతియుతంగా జీవనం సాగించగలరన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ కార్యాలయం ఇంకా స్పందించలేదు. మరోవైపు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కు అమెరికా బాంబులు సరఫరా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన బందిలందరినీ విడుదల చేయకపోతే హమాస్పై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. అసలు వ్యూహం అదేనా? పాలస్తీనా శరణార్థులు అరబ్ దేశాలు అనుమతించాలనడం, ఇజ్రాయెల్కు అమెరికా బాంబులు సరఫరా చేయడం వెనుక మరో వ్యూహం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బందీల విడుదల పూర్తయిన తర్వాత గాజా నుంచి పాలస్తీనా పౌరులను బయటకు తరలించి, హమాస్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయా లన్నదే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం కావొచ్చని తెలుస్తోంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆ రెండు దేశాలు యోచిస్తున్నాయి. -
ట్రంప్నకు పాలస్తీనా అధ్యక్షుడి ఫోన్.. ‘గాజాలో శాంతి కోసం రెడీ’
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శుక్రవారం యూఎస్కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా గాజాలో న్యాయమైన, సమగ్రమైన శాంతి కోసం పని చేయడానికి సంసిద్ధతను ట్రంప్నకు తెలియజేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానకి అబ్బాస్ అభినందనలు తెలియజేశారు.‘‘అంతర్జాతీయ చట్టాల ఆధారంగా న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు ట్రంప్తో కలిసి పని చేసేందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచంలోని సంబంధిత పార్టీలతో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అబ్బాస్ ట్రంప్నకు తెలిపారు. దీంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు’’ అని పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ట్రంప్ తన ప్రచారం సమయంలో గాజాలో యుద్ధం ముగించడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 43,500 మంది గాజా ప్రజలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేల మంది ప్రజలు గాజా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. -
ఇజ్రాయెల్కు షాక్.. పాలస్తీనా కోసం రంగంలోకి సౌదీ అరేబియా
హమాస్, హోజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్ట్రార్డీనరీ సమ్మిట్కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. -
బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తారా?
అక్టోబరు 23 (బుధవారం)న సాక్షి దిన పత్రిక ఎడిట్ పేజీలో పాలస్తీనా సమస్యపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ రాసిన వ్యాసం వాస్తవాలకు భిన్నంగా ఇజ్రాయెల్కు వత్తాసు పలికేలా ఉంది. వ్యాసం మొత్తంగా చూసినప్పుడు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ కాండకు మద్దతిస్తున్నట్లే ఉంది. రాజ్య నైజాన్ని గురించి కానీ, దానికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరప్ దేశాల పాత్ర గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా బాధితులనే దోషులుగా చిత్రించేందుకు వ్యాసకర్త యత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వ్యవహారమంతా నాగరికతకు సంబంధించిన సమస్య అనడం అంతకన్నా శోచనీయం. ఆ వ్యాసంలో ఒక చోట ఆయన ‘ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ... ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కు అమలు లోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇజ్రాయెల్ ఒక లౌకిక ఘనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్ప దలచుకున్నారా? అలా చెప్పడమంటే వాస్తవాన్ని చూడ నిరాకరించడమే అవుతుంది.ప్రముఖ యూదు చరిత్రకారుడు, యూరోపియన్ సెంటర్ ఫర్ పాలస్తీనా స్టడీస్ డైరెక్టర్ ఇలాన్ పాపే ఇటీ వల బ్రస్సెల్స్లో ‘అనడోలు’ అనే వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో... పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నది ముమ్మాటికీ జాతి నిర్మూలన కార్యక్ర మమేనని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాజకీయాలు సెటి ల్మెంట్ల నిర్మాణం నుంచి యూదు దురహంకారాన్ని రెచ్చగొట్టే దశకు వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ శక్తులే ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ తిష్ట వేసుక్కూర్చున్నాయి. ఈ నాయకత్వం వల్లే ఇజ్రాయెల్ దురాక్రమణదారుగా పాలస్తీనా అంతటా విస్తరిస్తోంది. నీరు, ఆహారం, మందులపై ఆంక్షలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఒక వైపు అమానుష చర్యలకు పాల్పడుతూ, మరోవైపు పాలస్తీనియన్లే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలకూ కారకులుగా, అనైతిక చర్యలకు పాల్పడే వారిగా చిత్రిస్తున్నారు. వీరిని అక్కడ నుంచి వెళ్లగొట్టడమే పరిష్కారమన్న ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అమెరికా, యూరప్లు చాలా కాలంగా ప్రచారంలో పెడుతూ వస్తున్నాయి. 76 ఏళ్ల తరువాత కూడా అదే పాచికను ప్రయోగిస్తే అది చెల్లుబాటు కాదు అని చరిత్ర కారుడు పాపే తేల్చి చెప్పాడు.రెండవ అంశం: ‘అక్టోబరు 7 నాటి మారణ కాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్కు మద్దతునిస్తూ ఈ యుద్ధంలోకి ప్రవేశించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి’ అని ప్రొఫెసర్ గారు సూత్రీకరించారు. అది వాస్తవమా? పాలస్తీనా, అలాగే యావత్ పశ్చిమా సియా ప్రాంతానికి పెనుముప్పుగా తయారైంది ఇజ్రా యెల్. పశ్చిమ దేశాలు తమ ఆధిపత్యానికి కాలం చెల్లుతుండడం, ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో బెంబేలెత్తి వలస వాదాన్ని మళ్ళీ విస్తరించేందుకు పూనుకుంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయిల్ గాజాపై దాడిని... లెబ నాన్కు, అటు నుంచి ఇరాన్కు, తద్వారా యావత్ పశ్చి మాసియాకు విస్తరింపజేయాలనే పన్నాగాన్ని ఈ సంద ర్భంగా గుర్తించాలి.ఇందుకోసం ఇజ్రాయిల్కు అమెరికా వంటి దేశాలు పెద్ద యెత్తున ఆయుధాలు, డబ్బు అందజేస్తున్నాయి. మూడవ అంశం... 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అంగీకరించి సంతకం చేయగా పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించాయనీ... 1948కు ముందున్న చోటికి తిరిగి వెళ్లాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోందని’ ఐలయ్య తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య వర్తిత్వంలో 1993లో ఓస్లో ఒప్పందం (నార్వే ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని ఐజాక్ రాబిన్, పాలస్తీనా విమో చనా సంస్థ నేత యాసర్ అరాఫత్ సంతకాలు చేశారు. ఆ తరువాత ఆ ఒప్పందానికి ఇజ్రాయెలే తూట్లు పొడిచింది. నాల్గవ అంశం... హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్ హుడ్లు ప్రపంచం మొత్తానికి సమస్యలు సృష్టిస్తున్నాయి అని చెప్పడం కన్నా అన్యాయం ఏముంటుంది? అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఈ ప్రాంతంలో సాగిస్తున్న అణచివేత, దురాక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటం లోంచి పుట్టుకొచ్చినవే హమాస్ వంటి సంస్థలు.అయిదవదీ, చివరిదీ నాగరికతకు సంబంధించిన అంశం: ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య అని ప్రొఫెసర్ ఐలయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఏది నాగరికతో ఏది అనాగరికతో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాగతాలను కప్పి పుచ్చి ఆ దేశ నాగరికత, ప్రజాస్వామ్యం గురించి కీర్తించడాన్ని ఏమనాలి? ఇప్పుడు జరగాల్సింది యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహునూ, ఆయనకు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలను బోనులో విలబెట్టడం. – కె. గడ్డెన్న ‘ సీనియర్ పాత్రికేయుడు -
రెండు దేశాలుగా బతకడమే దారి
హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్బ్యాంక్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.2023 అక్టోబర్ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 17న ప్రకటించింది. సిన్వార్ హత్య హమాస్కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.రెండు దేశాల పరిష్కారంసమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.సామాజిక–ఆర్థిక పరిస్థితులు2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.కొత్త ఒప్పందాలు అవసరమా?1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్ డిమాండ్ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పాలస్తీనా మా సొంతం
న్యూయార్క్: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక దాడులను పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మా సొంతం. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఎవరూ అంటే ఆక్రమణదారులు మాత్రమే’ అని ఆయన అన్నారు. గురువారం అబ్బాస్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన స్టేడియం వైపు వెళ్తుండగా కరతాళధ్వనులు, చప్పట్లు హాలంతా మారుమోగాయి. అర్థంకాని కేకలు వినిపించాయి. పోడియం వద్దకు చేరుకున్న అబ్బాస్..మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం..అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.గాజాను, అక్కడి ప్రజలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలంటూ ప్రపంచ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గాజాను నివాసయోగ్యం కాకుండా చేస్తోంది. యుద్ధానంతరం ఏర్పడే గాజాను మేమే పాలిస్తాం. పాలస్తీనా మా మాతృ భూమి. మా తండ్రులు, తాతలది. అది ఎప్పటికీ మాదే. వెళ్లిపోవాల్సింది ఎవరైనా ఉంటే వారు ఆక్రమిత వడ్డీవ్యాపారులు మాత్రమే’అని వ్యాఖ్యానించారు. -
గాజా యుద్ధం కొనసాగిస్తాం
గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్తో పోరాడటానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్ సీనియర్ నేత ఇస్తాంబుల్లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ గాజాలో 11 నెలలకు పైగా యుద్ధం జరగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నష్టపోయినప్పటికీ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటానికి మా వద్ద తగినంత వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి మేము అధిక సామర్థ్యాన్ని కలిగిఉన్నాం. అమరవీరులు ఉన్నారు, వారి త్యాగాలు ఉన్నాయి. ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోంది. ఈ యుద్ధంలో మేము ఊహించిన దానికంటే.. ప్రాణనష్టం, యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగింది’ అని అన్నారు.ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ హమాస్ నేత స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.చదవండి: హమాస్ మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగదు: ఇజ్రాయెల్ -
ప్రాణం... పణం అక్షర సమరం
ప్రమాదపు అంచున పనిచేసిన, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధవార్తలను రిపోర్ట్ చేసిన సాహసికులైన ఎంతోమంది జర్నలిస్ట్ల గురించి తెలుసుకుందిపాలస్తీనా అమ్మాయి ప్లెస్తియ. వారి గురించి విన్నప్పుడల్లా....‘ఎంత కష్టం. ఎంత సాహసం!’ అనుకునేది.ఆ కష్టం, సాహసం తన స్వీయానుభవంలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు.జర్నలిజంలో పట్టా పుచ్చుకున్న తరువాత హమాస్–ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఆమెని ఆహ్వానించింది.హమాస్–ఇజ్రాయెల్ వార్ను రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్గా ప్రపంచానికి పరిచితం అయిన ప్లెస్తియ యుద్ధభూమిలో కత్తి అంచున నడక అంటే ఏమిటో తెలుసుకుంది. యుద్ధ బీభత్సాన్ని దగ్గరి నుంచి చూసింది. తాజాగా...‘అలాకాద్ అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్’లో మీడియా స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లెబనాన్కు వెళ్లింది. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ కాస్తా మళ్లీ విద్యార్థిగా మారింది.‘యుద్ధకాలంలో భావోద్వేగాలకు అవకాశం లేదు. ఏడ్వడానికి కూడా టైమ్ దొరకనంతగా ఉరుకులు పరుగులు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధం ఆగి΄ోతుందని మనసులో చిన్న ఆశ. అంతలోనే మరో పెద్ద విషాదాన్ని రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. పూర్తిగా నష్ట΄ోయాం. ఇంతకంటే ఎక్కువగా నష్ట΄ోయేది ఏమిటి అనిపించేది కొన్నిసార్లు’ గతాన్ని గుర్తు చేసుకుంది ప్లెస్తియ.గాజాలో యుద్ధవార్తలు కవర్ చేస్తున్న రోజుల్లో ప్లెస్తియకు నిద్రపోవడానికి కూడా టైమ్ దొరికేది కాదు. తిండి సరిగా ఉండేది కాదు. పెట్రోల్ కొరత వల్ల మీడియా వాహనం ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు టీమ్తో సంబంధాలు తెగిపోయేవి. కరెంట్ కష్టాలు, ఫోన్ కష్టాలు సరే సరి.‘ఈ రోజు సరే, రేపు బతికి ఉంటానా అని ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని’ అంటూ గత రోజులను గుర్తు చేసుకుంది ప్లెస్తియ. వార్తలను కవర్ చేసేందుకు మొదట్లో మెడలో ఐడీ ట్యాగ్ వేసుకునేది. ప్రెస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించేది. అయితే వీటివల్లే ఎక్కువ ప్రమాదం ఉందని గ్రహించి వాటికి దూరంగా ఉంది.‘ఈ రోజు ఏం కవర్ చేయాలి...అని ఎప్పుడూ ΄్లాన్ చేసుకోలేదు. కొన్నిసార్లు స్టోరీ కోసం వెదికేదాన్ని. మరికొన్ని సార్లు స్టోరీ నన్ను వెదుక్కుంటూ వచ్చేది’ అంటున్న ప్లెస్తియ రిపోర్టింగ్కు వెళుతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చేవి. ఆ గండాల నుంచి అదృష్టశాత్తు బయటపడింది.గాజాలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తనకు ప్రజల నుంచి రకరకాల స్పందనలు ఎదురయ్యేవి. కొందరు ఆ΄్యాయంగా పలకరించి బ్రెడ్, టీ ఇచ్చేవారు. ‘ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు వెరవకుండా మీ జర్నలిస్ట్లు పనిచేస్తున్నారు. మీ వల్లే మా బాధలు ప్రపంచానికి తెలుస్తున్నాయి’ అని ప్రశంసించేవాళ్లు.కొందరు మాత్రం...‘నేను జర్నలిస్ట్’ అని పరిచయం చేసుకోగానే భయపడేవారు. ‘ఇప్పటికే ఎంతోమంది జర్నలిస్ట్లు చని΄ోయారు. మా గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి’ అనేవాళ్లు. ‘నిజానికి నేను వారి దగ్గరికి జర్నలిస్ట్గా కంటే సాటి మనిషిగా వెళ్లాను. వారి బాధలను పంచుకున్నాను. ధైర్యం చె΄్పాను’ అంటున్న ప్లెస్తియ ఆశావాది. యుద్ధం లేని రోజులు, గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్ర΄ోయే రోజులు వస్తాయని, మాయమైపోయిన నవ్వుల పువ్వులు మళ్లీ వికసిస్తాయని, ‘యుద్ధం గతం మాత్రమే. వర్తమానం కాదు’ అని బలంగా నమ్మే రోజులు వస్తాయనే ఆశిస్తోంది ప్లెస్తియ. ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి రిపోర్టింగ్ చేస్తూ మరణించిన జర్నలిస్ట్ షిరీన్ అబూ స్మారక స్కాలర్షిప్ ΄÷ందిన ప్లెస్తియ లెబనాన్లో స్టూడెంట్గా మరో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యువ జర్నలిస్ట్కు ఇన్స్టాగ్రామ్లో 4.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
హమాస్ క్షీణత ఖాయం: ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగున్నాయి. మరోవైపు.. ప్రపంచంలోని పలు దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బంధీ విడుదలకు సంధి ఒప్పందానికి ప్రయత్నిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఓ మిలటరీ వ్యవస్థలా ఎక్కువ కాలం కొనసాగలేదని పేర్కొన్నారు. తొలి దశలో ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్తో ఒప్పందానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో హమాస్తో ఒప్పందం ఓ వ్యూహాత్మక అవకాశంగా నిలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ బందీలను స్వదేశానికి తీసుకురావడమే సరైన నిర్ణయం. ఇజ్రాయెల్ ఆరు వారాల పాటు కాల్పుల విరామం తీసుకుని, బందీలను తిరిగి తీసుకురావడానికి ఒప్పందాన్ని ఆమోదించాలి. 11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా. హమాస్ గెరిల్లా యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్ కూడా హమాస్ మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ పటిష్టమైన మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగుతుందనే నమ్మకం లేదు’’ అని అన్నారు.ఇక.. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తులు ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటిరకదాదాపు 41 వేల మంది పాలస్తీనియలు మృతి చెందారు. -
గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు
దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఓ సొరంగంలో ఆరుగురి బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు వీరిని బంధీలు గాజా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి, ఒరి డానినో మృతదేహాలను ఇజ్రాయెల్కు తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వీరు తాము స్వాధీనం చేసుకునే కొంత సమయం ముందు హమాస్ మిలిటెంట్ల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. దక్షిణ గాజాలోని భూగర్భ సొరంగం నుంచి 52 ఏళ్ల ఇజ్రాయెల్ బంధీ ఖైద్ ఫర్హాన్ అల్కాడిని సైన్యం రక్షించి వారం రోజులు గడవక ముందే ఒకేసారి ఆరుగురి మృతి దేహాలను స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఈ ఆరుగురిలో ఇజ్రాయెలీ-అమెరికన్ హెర్ష్ గోల్డ్బెర్గ్-పోలిన్ అన్నారు. గోల్డ్బెర్గ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రోజు.. గాజా యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపునిచ్చారు. బందీల విడుదల, విధ్వంసమైన గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణ కోసం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్తో కొనసాగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.‘ గాజా ఒప్పందాన్ని ముగించగలమని భావిస్తున్నాం. ఇరువురు సంబంధిత ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు చెప్పారాయన.ఇదిలాఉండగా.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 40,691 మంది మరణించగా.. 94,060 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేసిన 1,200 మందిని మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి పాలస్తీనా ఉగ్రవాదుల మృతి
గాజాలోని వెస్ట్బ్యాంక్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులను కొనసాగిస్తోంది. వెస్ట్బ్యాంక్లో మిలిటెంట్లు.. స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంటోంది. తాజాగా తమ సైన్యం చేతిలో ఐదుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లోని ఓ మసీదులో దాక్కుకొని ఉన్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపినట్లు పేర్కొంది. ఈ ఐదుగురిలో ఒక స్థానిక కమాండర్ మహ్మద్ జాబర్ అలియాస్ అబూ షుజా ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపారు. ఇజ్రాయెల్లో చేసిన పలు దాడుల్లో అబూ షుజా హస్తం ఉన్నట్లు ఆర్మీ పేర్కొంది. జూన్లో జరిపిన భారీ కాల్పులకు అబూ షుజా ప్లాన్ చేసినట్టు తెలిపింది.అబూ షుజా గతంలోనే మృతి చెందినట్లు పలు నివేదికలు వెల్లండించాయి. అయితే పలువురు మిలిటెంట్ల అంత్యక్రియల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలోని ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ మహ్మద్ జాబర్ మృతిపై పాలస్తీనా ఇంకా ధృవీకరించకపోవటం గమనార్హం. బుధవారం నుంచి పాలస్తీనాపై చేస్తున్న ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది ఫైటర్లు మృతి చెందినట్లు హమాస్ మలిటెంట్ సంస్థ పేర్కొంది. -
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు.. వీళ్ల వైరం ఏనాటిది!
పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. అయితే.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు! దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం మొదలైంది.పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది.హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు.గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.మరోవైపు.. హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు.హమాస్ మిలటరీ విభాగం ‘ఖస్సం బ్రిగేడ్స్’ అధి నేత మొహమ్మద్ దీఫ్ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. ఇరాన్లోని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం!గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు.ఇజ్రాయెల్ పౌరుల పాస్పోర్టులను గుర్తించడం మానేసింది. టెహ్రాన్లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ)కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’ గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ షాడో వార్కు లెబనాన్, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్ హైట్స్ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. నాటి నుంచి సిరియా, లెబనాన్పై దాడులు జరిపేందుకు గోలన్ హైట్స్ను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటుంది.1992లో ఇరాన్కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మకపోవడం గమనార్హం. ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానికి కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలిచింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని స్వాగతించింది. మరోవైపు హమాస్కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1న ఇజ్రాయెల్కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. -
పాలస్తీనాను అదీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు. వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది. ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు. -
ఖాన్ యూనిస్ను వెంటనే ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్ యూనిస్లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం. ఈ మేరకు ఖాన్ యూనిస్లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్ యూనిస్లోని యూరోపియన్ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గతవారం ఉత్తర గాజాలోని షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి చెందాడు.హమాస్ను అంతం చేసే దశలో ఇజ్రాయెల్ పురోగతి సాధింస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు దక్షిణ గాజా నగరమైన రఫాకు తరలివెళ్లారు.అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హామాస్ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.చదవండి: ట్రంప్ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్ -
ప్రపంచాన్ని నిలదీస్తున్న యువత
పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ అమెరికాలోని నూటయాభై విశ్వవిద్యాలయలలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఏప్రిల్ 2024లో కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో బోధన–బోధనేతర ఉద్యోగులు కూడా విద్యార్థులతో పాటు భాగస్వాములయ్యారు. ఇందులో హార్వర్డ్, బర్రత్ హాల్, కొలంబియా, ప్రిన్స్టన్, న్యూయార్క్, యేల్ వంటి అన్ని అమెరికన్ యూనివర్సిటీల విద్యార్థులున్నారు. అయితే నిరసనలో చురుకుగా పాల్గొన్న పదమూడు మంది విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీలివ్వకుండా ఆపేసింది. ‘గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలకు విద్యార్థులందరూ హాజరు కావచ్చు, కానీ, డిగ్రీలు రద్దయిన ఆ పదమూడు మందికి పట్టా ఇవ్వబడదు’– అని యూనివర్సిటీ ప్రకటించింది. నిరసన సెగలకు తట్టుకోలేక, కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లు వాయిదా వేసుకున్నాయి. కొన్ని మాత్రం నిర్వహించుకున్నాయి. నిర్వహించుకున్న వాటిలో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. గాజా మీద దాడులు ఆపాల్సిందిగా, పాలస్తీనాను రక్షించాల్సిందిగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం విద్యార్థులు కోరారు. తమ తమ క్లాసురూముల్లో నుండి ఆడిటోరియంలోని వేదిక మీదికి ఒక్కొక్కరుగా వరుస క్రమంలో క్రమశిక్షణతో నడిచి వస్తూ ‘ఫ్రీ గాజా నౌ’ ‘ఫ్రీ పాలస్తీనా నౌ’–గాజాకు స్వేచ్ఛనివ్వండి! పాలస్తీనాకు స్వేచ్ఛనివ్వండి! అని రాసి ఉన్న గుడ్డ, పేపర్ బేనర్లను ప్రదర్శిస్తూ వేదిక మీదకు నడిచివెళ్లారు. డిగ్రీలు తీసుకున్నారు. డిగ్రీ తీసుకున్న విద్యార్థుల నుండి కొందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా మాట్లాడే వారిని విద్యార్థులే ఎన్నుకుంటారు. ఆ అవకాశం దక్కించుకుంది భారతీయ–అమెరికన్ విద్యార్థిని శ్రుతీ కుమార్. ఆమె ప్రసంగంలోని సారాంశం ఇలా ఉంది: ‘‘నేను తీవ్రంగా నిరాశ చెందాను. ఈ కేంపస్లో భావ వ్యక్తీకరణను శిక్షించడం జరిగింది. శాసనోల్లంఘన జరిగిందని శిక్షించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ ఎక్కడున్నాయి? పదిహేను వందలమంది విద్యార్థులు మాట్లాడారు. పిటిషన్లు సమర్పించారు. ఐదు వందల మంది అధ్యాపకులు మాట్లాడారు. మా ఆక్రోశం, మా ఆవేదన హార్వర్డ్– నీకు వినిపిస్తోందా?గాజాలో జరుగుతున్న సంఘటనలతో మనం మన సమాజంలో నిలువుగా బలంగా విడిపొయ్యాం! మనకు తెలియని వారిలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? మనకు భేదాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వారి వేదననూ, నొప్పినీ అర్థం చేసుకోలేమా? గాజాలో జరుగుతున్న మారణకాండను మేమెవ్వరం సమర్థించడం లేదు. భావ ప్రకటన, సంఘీ భావ ప్రకటన ఈ కేంపస్లో శిక్షలకు గురయ్యాయి. ఈ సెమిస్టర్లో ఈసారి నా పదమూడు మంది సహ విద్యార్థులకు డిగ్రీలు అందడం లేదు. వారు మాతో పాటు పట్టభద్రులు కాలేకపోతున్నారు. శాసనోల్లంఘన జరిగిందని– ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మా విద్యార్థి లోకాన్ని ఎంతగానో బాధించింది. ఇంకా చెప్పాలంటే నలుపు, చామనచాయ చర్మం గల నాలాంటి విద్యార్థినీ విద్యార్థులకు ఇక్కడ వ్యక్తిగత భద్రత లేదు. మా పట్ల ఎందుకీ అసహనం? ఎందుకీ అణచివేత? హార్వర్డ్! మా మాటలు నీకు వినిపిస్తున్నాయా?’’అమెరికాలోని నిబ్రాస్కాలో పుట్టి పెరిగిన ఇరవైయేళ్ళ యువతి శ్రుతీ కుమార్, తన పదినిముషాల ప్రసంగంతో ప్రపంచాన్ని కదిలించింది. తన తోటి విద్యార్థులకు పట్టాలు రాకపోవడం పట్ల ఆవేదన తెలియజేస్తూ– గాజాపై జరుగుతున్న దాడుల గూర్చీ, నల్లచర్మం ఆధారంగా సాగుతున్న జాతి వివక్ష గూర్చీ ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటలకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఆడిటోరియం బయట ఉన్న వేలమంది, వేదిక మీద ఉన్న అధ్యాపకులతో సహా– అందరికందరూ లేచి నిలబడి కాంపస్ దద్దరిల్లిపోయేట్లు చప్పట్లు చరిచారు. ‘హార్వర్డ్ నీకు వినిపిస్తోందా?’ అని గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించినపుడల్లా విద్యార్థులు పెద్దఎత్తున చప్పట్లు చరిచి ఆమెకు తమ సంఘీభావం తెలియజేశారు. అయితే ఆ ఆవేదన, ఆ ఆక్రందన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ‘ప్రపంచమా! నీకు మా ఆక్రోశం, ఆవేదన వినిపిస్తోందా?– అని యువతరం ప్రశ్నిస్తున్నట్టు ప్రపంచ శ్రోతలకు అనిపించింది.సంఘసేవ పట్ల ఆసక్తి గల శ్రుతీ కుమార్, డాక్టర్ కోర్సును వదులుకుని, వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర, ఆర్థిక శాస్త్రం చదువుకుని పట్టా సాధించారు. తమిళనాడు నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత సంప్రదాయ కుటుంబం వారిది. మనదేశంలోనూ విద్యార్థి ఆందోళనలు జరుగుతున్నాయి. వెంటనే కులగణన జరిపించాలనీ, అందరికీ సమానంగా ఉద్యోగాల్లో అవకాశాలుండాలనీ హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన సమ్మె, నిరసనలూ తక్కువవి కావు. ప్రపంచంలో యువతరం ప్రశ్నని బలోపేతం చేస్తూ ఉందన్న దానికి అన్ని చోట్లా జరుగుతున్న విద్యార్థి నిరసనలను సంకేతాలుగా చూడాలి!!డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత ‘ మెల్బోర్న్ నుంచి -
న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
అమెరికాలోని న్యూయార్క్లోగల బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు హఠాత్తుగా దాడికి దిగారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.అయితే పోలీసుల రాకకుముందే నిరసనకారులు బ్రూక్లిన్ మ్యూజియం వద్దకు చేరుకుని, ఆ ప్రాంగణంలో టెంట్లు వేసి, భవనంపై ‘ఫ్రీ పాలస్తీనా’ పేరుతో గల బ్యానర్లను ఎగురవేశారు. మ్యూజియం వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో న్యూయార్క్ నగర పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కొంతమంది నిరసనకారులు పోలీసు అధికారులపై ప్లాస్టిక్ బాటిళ్లను విసిరారు.ఘటనా స్థలంలో పోలీసులకు, ఆందోళనకారులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికిముందు పాలస్తీనా మద్దతుదారులు బార్క్లేస్ సెంటర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నవారు డప్పులు కొడుతూ, పలు నినాదాలు చేస్తూ మ్యూజియం వైపు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్ను ఇజ్రాయిల్కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ వైరల్ ఫొటోపై ఇజ్రాయెల్ కౌంటర్
హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం.. రఫాలో పాలస్తీనా పౌరులు తల దాచుకుంటున్న శిబిరాలపై భీకర వైమానిక దాడులకు తెగపడింది. ఈ దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు రెండువేల మంది గాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమైంది.All eyes on #Rafah 🇵🇸 pic.twitter.com/bg3bAtl3dQ— The Palestinian (@InsiderWorld_1) May 27, 2024 ‘ఆల్ ఐస్ ఆన్ రఫా (అందరి దృష్టి రఫా పైన)’అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు షేర్ చేసి పాలస్తీనా పౌరులకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. మరికొంత మంది నెటిజన్లు.. పాలస్తీనా పౌరులపై దాడులు ఆపేయాలని కోరారు.ALL EYES ON RAFAH pic.twitter.com/2dstfq7rWt— The Saviour (@stairwayto3dom) May 30, 2024 అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం,వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ‘‘ మేము అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడులను మాట్లాడటం మానుకోము. అదేవిధంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆపము ’’ అని ‘వేర్ వర్ యువర్ ఐస్’అని చిన్నపిల్లాడి ముందు హమాస్ మిలిటెంట్ తుపాకి పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది.We will NEVER stop talking about October 7th. We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM— Israel ישראל (@Israel) May 29, 2024‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ ఫొటో హాష్ట్యాగ్తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో 45 మిలియన్ల మంది షేర్ చేశారు. భారతీయ సినీ సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రియాంకా చోప్రా జోనస్, అలియా బట్, కరీనా కపూర్ ఖాన్, మధూరి దీక్షిత్, వరుణ్ దావన్, సమంత్ రుత్ ప్రభు తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 36,050 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు 81,026 మంది గాయపడ్డారు. -
పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై ట్రోల్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ట్రెండింగ్లో ఉన్న ఓ పోస్ట్ను షేర్ చేయడమే ఇందుకు కారణం.వివరాల్లోకి వెళితే.. హమాస్ (పాలస్తీనాలో అధికారిక పార్టీ) నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు జరుపుతుంది. ఈ దాడుల్లో 37 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఈ దాడుల అనంతరం రఫా నగరం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. విశ్వవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు రఫా నగరాన్ని హైలైట్ చేస్తూ పాలస్తీనాపై సానుభూతి చూపిస్తున్నారు.Meet Ritika Sajdeh, wife of Rohit Sharma.“Did she ever talk about Kashmiri Pandits?”-No“Did she ever talk about the vιolence happening by a specific community in India?”-No“Did she ever raise her voice for Hindus being persecuted in Pakistan and Bangladesh?”-No“Did she… pic.twitter.com/SFNrMHOtAM— Mikku 🐼 (@effucktivehumor) May 28, 2024టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక కూడా పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే ట్రెండింగ్లో ఉన్న ఓ పోస్ట్ను తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది.BIG NEWS 🚨 Rohit Sharma’s wife Ritika Sajdeh removes ‘All Eyes On Rafah’ Instagram story after facing backlash from Hindus 🔥🔥She had posted "All Eyes on Rafah" on social media in support of Palestine.Many Hindus started questioning her about her silence on the issue of… pic.twitter.com/ayfbgjtYV6— Times Algebra (@TimesAlgebraIND) May 29, 2024రితిక ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. భారత్లో ఎన్ని అరాచకాలు జరిగినా స్పందించని రితిక పరాయి దేశంలోని సమస్యపై స్పందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీ పండిట్లపై దాడులు, మణిపూర్లో హింస, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఈమె ప్రశ్నించలేదే అని నిలదీస్తున్నారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో, భారత్కు ఏమాత్రం సంబంధం లేని అంశంపై రితక స్పందించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇంటి సమస్యలు (భారత్లో జరిగేవి) పట్టవు కాని పరాయి దేశ సమస్యలపై గళం విప్పడం ఫ్యాషన్ అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. రఫా పోస్ట్పై నెట్టింట తీవ్ర వ్యతిరేత ఎదురవడంతో రితిక ఈ పోస్ట్ను వెంటనే డిలీట్ చేసి సైలెంట్ అయిపోయింది.ఇదిలా ఉంటే, రితిక కంటే ముందు చాలామంది భారతీయ సెలబ్రిటీలు పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్ట్ను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ లిస్ట్లో కరీనా కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, త్రిప్తి దిమ్రీ, సమంత రూత్ ప్రభు, ఫాతిమా సనా షేక్, స్వరా భాస్కర్, దియా మీర్జా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. -
ఇజ్రాయెల్పై కొత్త ఒత్తిళ్లు
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ కొత్తగా నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ ప్రకటన చేయడం ఇజ్రాయెల్ మీద ఒత్తిడిని పెంచింది. ప్రస్తుతం రఫా మీద భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటివరకూ సుమారు 36,000 మంది పాలస్తీనియన్ల మరణానికి కారణమైంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఏకంగా గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. నిరుడు అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్ వాదిస్తున్నది. దీన్ని ప్రపంచం నిరాకరిస్తున్నది.పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు మూడు యూరోపియన్ రాజ్యాలు ఈ నెల 22న ప్రకటించటంతో ఇజ్రాయెల్కు కొత్త చిక్కులు మొదలవుతున్నాయి. అమెరికా ఒత్తిళ్లను సైతం తోసిపుచ్చి నార్వే, స్పెయిన్, ఐర్లండ్లు ఈ ప్రకటన చేయటం గమనార్హం. పైగా వీటిలో నార్వే, స్పెయిన్ నాటో సభ్య దేశాలు. పాలస్తీనాను ప్రపంచంలో ఇప్పటికే 143 దేశాలు గుర్తించినందున ఆ జాబితాలో ఈ మూడు కూడా చేరటం వల్ల సాధారణంగానైతే విశేషం ఉండదు. కానీ ఇజ్రాయెల్ సైన్యం గాజాలో గత ఆరు మాసాలుగా సాగిస్తున్న మారణహోమం పట్ల ప్రపంచ వ్యాప్తమైన తీవ్ర నిరసనల మధ్య సైతం అమెరికన్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు అడుగడుగునా మద్దతునిస్తున్న స్థితిలో, ఈ మూడు దేశాల ప్రకటనకు తగిన ప్రాముఖ్యత ఏర్పడుతున్నది. వీరి నిర్ణయంతో ఇజ్రాయెల్పై కలిగిన ఒత్తిడికి రుజువు కొద్ది గంటలలోనే కనిపించింది. నార్వే, ఐర్లండ్, స్పెయిన్ల నుంచి తమ రాయబారులను నెతన్యాహూ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. తమ రాజధాని టెల్ అవీవ్లో గల ఆ మూడు దేశాల రాయబారులను పిలిపించి నిరసనను తెలియజేసింది. వారు పాలస్తీనియన్ల తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నారనీ, తమకు గల ఆత్మ రక్షణ హక్కును గుర్తించటం లేదనీ, సమస్య పరిష్కారానికి ఆటంకాలు సృష్టిస్తున్నారనీ వ్యాఖ్యానించింది. అదే సమయంలో, గాజాపై తమ యుద్ధం యథావిధిగా కొనసాగగలదని స్పష్టం చేసింది. దీనిని బట్టి, మూడు యూరోపియన్ దేశాల ప్రకటన ఇజ్రాయెల్పై ఏవిధంగా ప్రత్యేకమైన ఒత్తిడిని సృష్టించిందో గ్రహించవచ్చు. ఈ విధమైన తీవ్ర ఒత్తిడి ఇది మూడవది కావటం మరొక గమనించదగ్గ పరిణామం. గతవారం ద హేగ్ లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు) ప్రాసిక్యూటర్ కరీం ఖాన్, గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇజ్రాయెల్ అయితే భూమ్యాకాశాలను ఏకం చేయటం మొదలుపెట్టింది. అమెరికన్ బైడెన్ ప్రభుత్వమైతే కోర్టును ఖండించటమే గాక, ఆ న్యాయమూర్తులపై ఆంక్షలు విధించగలమనే స్థాయికి వెళ్ళింది. విశేషమేమిటంటే, స్వయంగా నాటో సభ్య దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం మొదలైనవి కరీం ఖాన్ ప్రతిపాదనలను బలపరిచాయి. ఇందులో మరో విశేషం ఉన్నది. ఈ నాటో రాజ్యాలు ఒకవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా చేస్తున్నాయి. మరొకవైపు ఐక్యరాజ్య సమితిలో, భద్రతా సమితిలో ఇజ్రాయెల్కు అనుకూలంగా అమెరికా ఓటు వేస్తున్నా అవి మాత్రం ఓటు వేయటం లేదు. పైగా ఇప్పుడు కరీం ఖాన్ చర్యను సమర్థిస్తున్నాయి. ఇది ఒక స్థాయిలో పరస్పర విరుద్ధమైన వైఖరి. కానీ వారనేది, ఇజ్రాయెల్ ఆత్మరక్షణ చేసుకోవలసిందే గానీ అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘించకూడదని!మొత్తానికి క్రిమినల్ కోర్టు పరిణామం ఇజ్రాయెల్పై ఇటీవలనే ఏర్పడిన మరొక ఒత్తిడి. ప్రాసిక్యూషన్ వారంట్ల జారీ ముగ్గురు హమాస్ అగ్ర నేతలకు కూడా జరగాలని కరీం ఖాన్ సిఫారసు చేశారు. దానిని హమాస్ కూడా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ స్పందనలు విపరీత స్థాయిలో ఉన్నాయి. అమెరికాతో పాటు ఆ శిబిరానికి చెందిన కొన్ని దేశాలు అందుకు తోడయ్యాయి. ఇంతకూ కరీం ఖాన్ ప్రతిపాదనను చివరికి కోర్టు ఆమోదిస్తుందా, మార్పులు చేస్తుందా, తిరస్కరిస్తుందా తెలియదు. ఒకవేళ ఆమోదిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. హమాస్ నేతలు అజ్ఞాతంలో ఉన్నందున వారి అరెస్టు సాధ్యం కాదు. నెతన్యాహూ ఇజ్రాయెల్లో ఉన్నంతకాలం ఆయన అరెస్టూ వీలుకాదు. ఇందులో మరొక మెలిక ఉంది. కోర్టులో సభ్యత్వం గల దేశాలకు వెళ్లినట్టయితే మాత్రమే వారంట్లు వర్తిస్తాయి. ఆ యా ప్రభుత్వాలు వారిని అరెస్టు చేయక తప్పదు. ప్రస్తుతం ఆ సభ్య దేశాల సంఖ్య 124. వాటిలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా వంటివి లేవు. సభ్య దేశాలలో అమెరికా లేదు గాని యూరోపియన్ యూనియన్లోని మొత్తం 27 దేశాలకూ సభ్యత్వం ఉంది. ఇది నెతన్యాహూకే గాక అమెరికాకు కూడా చాలా చిక్కులు తెచ్చి పెట్టే స్థితి. నెతన్యాహూకు వారంట్లు జారీ కావచ్చుననే చర్చ ఇప్పటికే వారం రోజులుగా సాగుతున్నది. దానితో, ఏమి చేయాలంటూ అమెరికా, యూరోప్ ఇప్పటికే తలలు పట్టుకుంటున్నాయి. కొందరు అటు, కొందరు ఇటుగా చీలిపోయారు. వారికి సంకట పరిస్థితి ఏమంటే, ప్రపంచ వ్యవహారాలన్నీ నియమ నిబంధనల ప్రకారం సాగాలని పట్టుదలగా వాదించేది వారే. అటువంటప్పుడు, తామే ఒప్పందంపై సంతకాలు చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారంట్లను ఎట్లా తిరస్కరించగలరు? ఈ స్థితి నెతన్యాహూను గత పదిరోజులుగా భయపెడుతున్నది. ఆయనపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టించిన మూడవ పరిణామం అంతర్జాతీయ న్యాయస్థానం గత జనవరిలో చెప్పిన వ్యతిరేక తీర్పు. గాజాలో ఇజ్రాయెల్ అమాయక పౌరుల సామూహిక హననానికి, విధ్వంసానికి పాల్పడుతున్నదనీ, వేలాదిమంది స్త్రీ పురుషులు, పిల్లలు, వృద్ధులు, రోగులు ప్రాణాలు కోల్పోయారనీ, ప్రజలకు ఆహార పానీయాలు, మందులు సైతం అందకుండా నిర్బంధాలు విధిస్తున్నారనీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ న్యాయస్థానంలో కేసు వేసింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ నానా హంగామా సృష్టించింది. అయినా కోర్టు ఇజ్రాయెల్కు వ్యతిరేక తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ మారణకాండ ఆగలేదు. దక్షిణాఫ్రికా ఆరోపణలు నిజమైనట్లు అనేక స్వతంత్ర సంస్థల నివేదికలే గాక, సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మానవ హక్కుల సంస్థల నివేదికలు కూడా ధ్రువీకరించాయి. అయినప్పటికీ, నిరుడు అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, ఆ క్రమంలోనే ఇప్పటికి దాదాపు 35,000 పాలస్తీనియన్లు మరణించారనీ, అందులో తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్ వాదిస్తున్నది. ఈ వాదనలను అత్యధిక ప్రపంచం నిరాకరిస్తున్నది.ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిది, ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు. రెండవది, మౌలికంగా పాలస్తీనా సమస్య దశాబ్దాల పాటు పరిష్కారం కాకుండా పెచ్చరిల్లుతుండటం. ఇటీవల ఇంత జరుగుతున్నా అమెరికన్లు ఇజ్రాయెల్కు వేలకు వేల కోట్ల డాలర్ల ఆయుధాలు సరఫరా చేస్తూ, ఆర్థికసాయం కూడా పంపుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు అనుకూలంగా ఓటు వేస్తూ, భద్రతా సమితిలో వీటోను ఉపయోగిస్తున్నారు. పాలస్తీనా రాజ్యం ఏర్పాటును వ్యతిరేకిస్తూ, అటువంటి ఒప్పందం అంటూ జరిగితే అది ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య చర్చల ద్వారా జరగవలసిందే తప్ప బయటి జోక్యంతో కాదని విచిత్రమైన వాదన చేస్తున్నారు. మరొకవైపు ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా ప్రసక్తే లేదనీ, తామే ఆ భూభాగాలను నియంత్రించగలమనీ అంటున్నది. గాజా బయట వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో యూదు సెటిలర్లు క్రమక్రమంగా పెరిగిపోతూ అక్కడి పాలస్తీనియన్లను నిర్మూలిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా ఈ విధమైన వైఖరి తీసుకోవటానికి ఏకైక కారణం వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు. మొదటి నుంచి ఇప్పటి వరకూ అంతే. కనుకనే తాము స్వయంగా నిర్వహించిన క్యాంప్ డేవిడ్, ఓస్లో ఒప్పందాల ప్రకారం గానీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం గానీ పాలస్తీనా దేశాన్ని ఏర్పడనివ్వటం లేదు. వారిని ధిక్కరించి ఇప్పుడు నార్వే, స్పెయిన్, ఐర్లండ్లతో కలిపి (ఇండియా సహా) 146 ప్రపంచ దేశాలు స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
హమాస్ చెరలో ఇజ్రాయెల్ మహిళా సైనికులు! వీడియో విడుదల
హమాస్ మిలిటెంట్లు గతేడాడి అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. హమాస్ మిలిటెంట్లు 250 ఇజ్రాయల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు సరిహద్దులో ఉన్న ఐదుగురు ఇజ్రాయల్ మహిళా సైనికులను బంధీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘బంధీల కుటుంబ ఫోరం’ విడుదల చేసింది.ఆ వీడియోలో నహల్ ఓజ్ బేస్ వద్ద విధలు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ మహిళా సైనికులు.. లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగామ్ బెర్గర్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ తెలుస్తోంది. మహిళా సైనికులు గాయాలతో, వారి చేతులు కట్టేసి ఉండటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అందులో ఒక హమాస్ మిలిటెంట్.. ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉద్దేశిస్తూ మీరంతా అమ్మాయిలు, మహిళలు. మీరు గర్భవతులు అవుతారు’అని అన్నాడు. మరో మిలిటెంట్ ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’అని అన్నాడు."No You're NOT beautiful" Hamas taunts female IDF terrorists. Here's the part of the video Israel miss-translate to claim he said she was "So beautiful" God their desperation is CRINGE. pic.twitter.com/Iv3U1W3Jbi— Syrian Girl 🇸🇾 (@Partisangirl) May 23, 2024 అందులో ఓ సైనికురాలు మాట్లాడుతూ.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’అని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఓ మిలిటెంట్.. ‘ మా సోదరులు ప్రాణాలు కోల్పోడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము కాల్చేస్తాం’అని అన్నాడు. ఈ వీడియోను విడుదల చేసిన ‘బంధీల కుటుంబ ఫోరం’ హమాస్ చెరలో ఉన్న బంధీలను వెంటెనే విడిపించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్ మహిళా సైనికులు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిలో చెరలో ఉన్న బంధీలను స్వదేశానికి రప్పించటంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవండని ప్రభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సెర్ అన్నారు. ఇక.. ఈ వీడియోపై హమాస్ మిలిటెంట్లు స్పందించారు. ‘ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో నిజం కాదు. ఇజ్రాయెల్ కల్పిత కథనాల ప్రచారం. మహిళా సైనికులతో తప్పుగా ప్రవర్తించలేదు’అని వివరణ ఇచ్చారు. -
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
రగులుతున్న క్యాంపస్లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్యూ, జమియా మిలియా, కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
ఇజ్రాయెల్కు షాక్.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు ఆగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్కు గట్టిపట్టున్న రఫాలో వారిని అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు పెట్రో రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
మానవతకు 200 రోజుల మచ్చ
ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.తీవ్రవాద హమాస్ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్ సైతం ఇటీవల ఇజ్రాయెల్తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్ ఆర్డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్ లీగ్ తాజాగా డిమాండ్ చేస్తున్నది అందుకే. ఇజ్రాయెల్ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్ చేసింది.యూరోపియన్ యూనియన్ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది. ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.ఇరాన్ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్ సైతం ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. -
పాలస్తీనాపై అమెరికా ‘ప్రేమ’!
మన కళ్లను మనమే నమ్మలేని అరుదైన అసాధారణమైన ఉదంతాలు చరిత్రలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. సోమవారం భద్రతామండలిలో జరిగిందదే. గాజాలో ఇజ్రాయెల్ దాష్టీకాన్ని నిలిపేయాలని, తక్షణం బేషరతు కాల్పుల విరమణ పాటించాలని కోరే తీర్మానంపై జరిగిన వోటింగ్కు అమెరికా గైర్హాజరైంది. నిరుడు అక్టోబర్లో హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడిచేసి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనలో అనేకమంది గాయాలపాలయ్యారు. ఆ సంస్థ చెరలో ఇంకా 134 మంది వరకూ వున్నారని అంచనా. ఆనాటినుంచీ ఇజ్రాయెల్ పగబట్టి గాజాలోని జనావాస ప్రాంతాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. బాంబుల మోత మోగిస్తోంది. ఎడతెగని ఈ దాడుల్లో ఇంతవరకూ 32,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. లక్షలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆకలితో అలమటిస్తున్న వారు ఆహారం తీసుకొచ్చిన వాహనాలపైకి ఎగబడినప్పుడు వారిని అదుపు చేసే పేరిట అమానుషంగా ప్రవర్తించటంతోపాటు కాల్చిచంపుతున్న ఉదంతాలకు కొదవలేదు. మంచినీరు, ఆహారం,మందుల కొరతతో పాలస్తీనా పౌరులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథం, విధ్వంసం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనివి. ఇజ్రాయెల్ను సమర్థించటానికి అలవాటుపడిన అమెరికా, పాశ్చాత్య దేశాలు దీన్నంతటినీ నిర్వికారంగా చూశాయి. అదేమంత విషయం కాదన్నట్టు మొదట్లో వ్యాఖ్యానించాయి. భద్రతామండలిలో ఇజ్రాయెల్ను అభిశంసిస్తూ ఇంతవరకూ వచ్చిన మూడు తీర్మానాలను వీటో చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘యుద్ధం సాగుతున్నప్పుడు పౌరుల మరణాలు సంభవించటం రివాజే’ అని వ్యాఖ్యానిస్తే ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒకపక్క ఇజ్రాయెల్కు ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి అందజేస్తూ, అంత ర్జాతీయ వేదికలపై దాని దురాగతాలను సమర్థిస్తూ... మరోపక్క పౌర ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ దేశానికి సుద్దులు చెబుతూ అమెరికా కాలక్షేపం చేసింది. హమాస్ అంత మొందేవరకూ ఇజ్రాయెల్ దాడులు ఆగరాదనీ, అలా ఆపితే అది ఆ మిలిటెంటు సంస్థకు బలం చేకూరుస్తుందనీ వాదించింది. అంతర్జాతీయంగానూ, స్వదేశంలోనూ వస్తున్న ఒత్తిళ్ల కారణంగా దాదాపు ఆర్నెల్లయ్యాక ఇన్నాళ్లకు ఇజ్రాయెల్ను వ్యతిరేకించే తీర్మానంపై వోటింగ్లో గైర్హాజరైంది. నిజానికి ఇది కంటి తుడుపు చర్య. ఆ తీర్మానాన్ని సమర్థించి, ప్రతీకారానికి కూడా హద్దులుంటాయని చెప్తే వేరుగా వుండేది. ఇకపై ఇజ్రాయెల్కు అన్ని రకాల సాయం నిలిపేస్తామని ప్రకటించివుంటే హుందాగా వుండేది. వాటన్నిటి బదులూ వోటింగ్కు గైర్హాజరు కావటంవల్ల పెద్దగా ఒరిగేది వుండదు. హమాస్ ఉగ్ర దాడిని ఎవరూ సమర్థించటం లేదు.దాని దుందుడుకు చేష్టలు స్వతంత్ర పాలస్తీనా లక్ష్యానికి విఘాతం కలిగిస్తాయని, రాజ్యాల అమానుష కృత్యాలకు సాధారణ పౌరులపై కక్ష తీర్చుకోవటం పరిష్కారం కాదని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దుయ్యబట్టాయి. అయితే గత ఏడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు తక్కువేమీ కాదు. నిజానికి పాలస్తీనా సమస్య సాకుగా ఇజ్రాయెల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్న మితవాద పక్షాల వైఖరివల్లే పరిష్కారం జటిలంగా మారింది. పాలస్తీనా పౌరుల నిరాశానిస్పృహలే మిలిటెంటు సంస్థ లకు ఊపిరులూదాయి. పాలస్తీనా మనోభావాలను బేఖాతరు చేసి ఇజ్రాయెల్ ఆవిర్భావానికి కారణమై, దాని దురాక్రమణలకు వంతపాడుతూ వచ్చిన అమెరికా, పాశ్చాత్య దేశాల వైఖరి సైతం మిలిటెంట్లకు బలం చేకూర్చింది. భద్రతామండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేయకుండా గైర్హాజరు కావటం సహజంగానే ఇజ్రాయెల్కు మింగుడుపడటం లేదు. ఆ దేశ ప్రధాని నెతన్యాహూ అలకబూనారు. జో బైడెన్తో చర్చల కోసం వాషింగ్టన్ వెళ్లబోతున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనను చివరి నిమిషంలో రద్దుచేశారు. చరిత్ర తిరగేస్తే ప్రతి మలుపులోనూ ఇజ్రాయెల్కు అమెరికా అండగా నిలబడిన సంగతి కనబడుతుంది. దాని అకృత్యాలను తక్కువచేసి చూపడం లేదా మూర్ఖంగా సమర్థించటం కళ్లకు కడుతుంది. అదే సమయంలో ప్రతి సందర్భంలోనూ అమెరికా హితవచనాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేయటం కూడా తేటతెల్లమవుతుంది. ఈ యేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలుండటం, ఇజ్రాయెల్ సేనలు నిరాటంకంగా ఊచకోతను కొనసాగించటం బైడెన్కు ఇబ్బందిగా మారింది. ఒకపక్క ఇజ్రాయెల్కు అన్నివిధాలా సాయపడుతూ కూడా దాన్ని కించిత్తు కూడా ప్రభావితం చేయ లేని బైడెన్ తీరు ఆయన బలహీనతను ప్రస్ఫుటం చేసింది. ఇదంతా చివరకు తన విజయావకా శాలను దెబ్బతీసేలా వున్నదని ఆయన గ్రహించారు. పర్యవసానంగా భద్రతామండలిలో భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఇది తమ విధానానికి అనుగుణంగానే వున్నదని అమెరికా చెబుతున్నా ఇజ్రాయెల్ స్పందననుబట్టే నిజానిజాలేమిటో గ్రహించవచ్చు. ఏదేమైనా భద్రతామండలి తీర్మానం ఆశించిన విధంగా గాజాలో తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. రంజాన్ మాసం పూర్తయ్యే వరకూ ఇది అమల్లోవుండాలని తీర్మానం కాంక్షిస్తున్నా ఈ కాలంలో ఉద్రిక్తతలు ఉపశమిస్తే... బందీల విడుదల జరిగితే అది శాంతికి దోహదపడుతుంది. ఆ పరిణామం సమస్య శాశ్వత పరిష్కారానికి దారితీస్తే అంతకన్నా కావలసిందేముంది? ఇజ్రాయెల్ మంకుపట్టు విడనాడాలి. గాజాలో హంతక దాడులకు స్వస్తి చెప్పాలి. తన సైన్యం చేసిన దురాగతాలపై విచారణకు అంగీకరించాలి. -
యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని
ఇజ్రాయెల్తో యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని నియమితులయ్యారు. మొహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. ముస్తఫా చాలాకాలంగా అధ్యక్షుడు అబ్బాస్ వద్ద సలహాదారునిగా పని చేస్తుండడం గమనార్హం. అయితే.. ఈ ఎంపికపై పాలస్తీనాలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇజ్రాయెల్పై దాడి అనంతరం.. ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అబ్బాసే ప్రధాని పేషీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నమ్మకస్తుడు ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలోనే ఈ నియామకం చేపట్టినట్లు అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. అయితే.. అమెరికా ఒత్తిళ్లతోనే అధ్యక్షుడు ఈ నియామకం చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్తఫా నేపథ్యానికి వస్తే.. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్థికవేత్తగా.. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. 2014లో గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత పునర్నిర్మాణ పనుల్లో ముస్తఫా భాగం కావడం గమనార్హం. అయితే.. కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా, వెస్ట్బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది. గాజాలోని పరిస్థితుల్ని అమెరికా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నది తెలిసిందే. ఇక గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మారణకాండలో 1,200 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 250 మందిని మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ భీకర దాడుల్లో పాలస్తీనా భూభాగంలో 31,000పైగా ప్రజలు మృతి చెందారు. -
సరైన కార్యాచరణ ఎక్కడ?!
నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు. ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు? అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు. ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రా యెల్కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా? గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది. అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ. -
తప్పొకరిది! శిక్ష అందరికా?
అంతకంతకూ తీవ్రమవుతున్న పాలస్తీనా సంక్షోభం వారం రోజుల్లో అనేక మలుపులు తిరిగింది. దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) చేసిన ప్రాథమిక నిర్దేశం ఒకవైపు, పాలస్తీనా శరణార్థులకై ఏర్పాటైన ఐరాస సహాయ సంస్థ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ (అన్రా)కు నిధులు ఆపేస్తున్నట్టు అమెరికా, మరో 8 దేశాలు ప్రకటించడం మరోవైపు, అమెరికా శిబిరాలపై డ్రోన్ దాడులు ఇంకోవైపు... ఇలా అనేక పరిణామాలు సంభవించాయి. గాజా యుద్ధానికి దారి తీసిన అక్టోబర్ 7 నాటి ‘హమాస్’ ఆకస్మిక దాడి, అపహరణలు, హత్యల్లో ‘అన్రా’ సిబ్బంది కొందరు పాలుపంచుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపణ. 190 మంది దాకా ‘అన్రా’ ఉద్యోగులు ఇస్లా మిక్ జిహాదీ తీవ్రవాదులైన ‘హమాస్’ వర్గీయులుగానూ వ్యవహరించారని అది అంటోంది. అయితే కొందరు తప్పు చేశారని గాజాలోని లక్షల మందికి ప్రాణాధారాన్ని ఆపేయరాదని ఐరాస అభ్యర్థన. ఎప్పుడో 1948లో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం సందర్భంగా దాదాపు 7 లక్షల మంది పాలస్తీనీయులు ఇప్పుడు ఇజ్రాయెల్ అంటున్న ప్రాంతంలోని తమ ఇల్లూ వాకిలీ వదిలేసి పోవాల్సొచ్చింది. ఆ శరణార్థుల సాయానికై 1949లో ‘అన్రా’ ఏర్పాటైంది. గాజా, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా, జోర్డాన్లలో విద్య, ఆరోగ్యం, సహాయ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే ఈ సంస్థ ద్వారా సుమారు 59 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు సాయం పొందుతున్నారు. ఇప్పటికే మానవీయ సంక్షోభంలో చిక్కుకున్న గాజాలోని ప్రజానీకానికి తిండి, నీళ్ళు అందిస్తున్నది ప్రధానంగా ఈ సంస్థే. అమెరికా లాంటి పలు దేశాల స్వచ్ఛంద విరాళాలతో నడిచే ఆ సంస్థపై ఆరోపణలు చేసి, నిరూపించకుండానే నిధులు ఆపేస్తే లక్షలాది అమాయకుల పరిస్థితి ఏమిటి? ఐరాస శరణార్థి సహాయ సంస్థకు నిధులిచ్చే దేశాల మాట అటుంచితే, అసలు సామాన్య పౌరులకు కష్టం వాటిల్లకుండా చేయగలిగినదంతా చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) నిర్దేశించింది. అయినా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజా ప్రాంతంపై దాడులు కొనసాగిస్తూ, అమాయకుల ఆయువు తీస్తోంది. ఆ మధ్య కొద్దివారాల పాటు గాజాలోని ప్రధాన నగరం నుంచి వెనక్కి తగ్గినట్టే తగ్గిన ఇజ్రాయెల్ సోమవారం మళ్ళీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అమానవీయ యుద్ధంలో ఇప్పటికే 26.5 వేల మంది పాలస్తీనీయులు మరణించారు. తీరం వెంట ధ్వంసమైన భవనాల శిధిలాల కింద ఇంకెన్ని వేల మృతదేహాలున్నాయో తెలీదు. అంతకంతకూ క్షుద్రమవుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇక, గాజా ప్రకంపనలు ఇతర చోట్లకూ విస్తరించాయి. ఆదివారం సిరియా సరిహద్దు సమీపంలోని జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో డ్రోన్ దాడులు జరిగాయి. అమెరికా సైనికులు ముగ్గురు మరణించారు. ఈ దాడులు ఇరాన్ అండతో సిరియా, ఇరాక్లలో నడుస్తున్న తీవ్రవాద వర్గాల పని అన్నది అమెరికా మాట. ఆ పాపంలో తమకేమీ భాగం లేదన్నది ఇరాన్ ఖండన. నిజానికి, ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమాసియాలో పలు ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక శిబిరాలపై పదులకొద్దీ దాడులు జరిగాయి. అమెరికాకు ప్రాణనష్టం మాత్రం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ భీకర ప్రతీకార యుద్ధాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వస్తున్న అగ్రరాజ్య విస్తృత రక్షణ వ్యవస్థల్ని దాటుకొని మరీ ఈ దెబ్బ తగలడం గమనార్హం. దాంతో, అమెరికా అధినేత సైతం ఇరాన్ మద్దతున్న తీవ్రవాదవర్గాలపై ప్రతీకార దాడులు చేయాలని హూంకరించారు. అలాగని నేరుగా ఇరాన్పై దాడికి దిగలేదు. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని నేతలు కోరినా, అది తేనెతుట్టెపై రాయి వేయడమే. ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా నిలబడి కలబడుతున్న తీవ్రవాద బృందాలే అందుకు సాక్ష్యం. ప్రాంతీయ పోరాటాల్లో తలదూర్చినప్పుడల్లా తలబొప్పి కడుతూనే ఉందని అగ్రరాజ్యం మర్చి పోకూడదు. పశ్చిమాసియాలో ఇప్పటికే దానికి అనేక శత్రువులున్నారు. ఇరాన్పై దుందుడుకుగా ప్రవర్తిస్తే పరిస్థితి చేయి దాటుతుంది. చివరకు ఈ యుద్ధం ప్రపంచ స్థాయిలో పెద్దదవుతుంది. ఇటీవల ఎర్రసముద్రంలోని దాడులతో అస్తుబిస్తు అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి అది మరో అశని పాతం అవుతుంది. అది గ్రహించే అమెరికా అనివార్యంగా సంయమనం చూపాల్సి వచ్చింది. ఇంకోపక్క మరో విడత కాల్పుల విరమణకై అరకొర ప్రయత్నాలు సాగుతున్నా, అవేవీ ఫలించడం లేదు. తాజాగా అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ అధినేత ఆదివారం ప్యారిస్లో ఇజ్రాయెల్, ఈజిప్టు, ఖతార్కు చెందిన ఉన్నతాధికారులను కలిశారు. మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తే, మరొక సారి కాల్పుల విరమణ పాటించేలా చర్చించి, ఒప్పించాలని ప్రయత్నం. కానీ, ఫలితం శూన్యం. ఇజ్రాయెల్ సైనికచర్యను తప్పుబడుతూ దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసు తేలేసరికి ఏళ్ళు పడుతుంది. ఈలోగా ఐసీజే గురువారం ఇచ్చిన ప్రాథమిక నిర్దేశం ఏ పక్షం వైపూ మొగ్గకుండా ఆచరణాత్మక ధోరణిలో సాగింది. గాజాలో అత్యవసర ప్రాథమిక సేవలు, మానవతా సాయం అందించాలని టెల్ అవీవ్ను కోరింది. అదే సమయంలో హమాస్ చేతిలోని బందీల పట్ల ఆందోళన వెలి బుచ్చుతూ, వారి విడుదలకు పిలుపునిచ్చింది. ఇలాంటి సమతూక ధోరణినే ఆశ్రయిస్తూ అమెరికా, ఐరోపా సమాజం సహా పాశ్చాత్యదేశాలన్నీ చర్చలతో పరిష్కారానికి మనసు పెట్టాలి. అంతు లేని యుద్ధానికి ఇజ్రాయెల్ను అనుమతిస్తున్న తమ విధానాలపై పునరాలోచన చేయాలి. ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఇరుపక్షాలనూ అంగీకరింపజేయాలి. కొందరు తప్పు చేశారని, ‘అన్రా’ నిధులను ఆపి అందరినీ శిక్షించడం శాంతిస్థాపనకు దోహదం చేయదని గ్రహించాలి. -
Israel-Hamas war: స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహు నో
టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి
రఫా: గాజా్రస్టిప్పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో అల్–జజీరా సీనియర్ కరస్పాండెంట్ వాయిల్ దాహ్దౌ కుమారుడు హమ్జా దాహ్దౌ కూడా ఉన్నాడు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో వాయిల్ దాహ్దౌ కుటుంబంలో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు ఇప్పటికే చనిపోగా, ఆదివారం మరో కుమారుడు బలయ్యాడు. దాహ్దౌ సైతం గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ తన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాడు. గాజాలో అసలేం జరుగుతోందో ప్రపంచం తెలుసుకోవాలని, అందుకోసం తన ప్రాణాలైనా ధారపోస్తానని వాయిల్ దాహ్దౌ చెప్పాడు. తన కుటుంబం మొత్తం బలైపోయినా తన సంకల్పం సడలిపోదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 22,800 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. -
Israel-Hamas war: తిరుగుబాటు గళానికి స్వేచ్ఛ
రమల్లా: ఆమె పేరు మారా. పాలస్తీనా యువతి. వయసు 24 ఏళ్లు. కానీ ఎదిగే దశలో అత్యంత కీలకమైన 8 ఏళ్లు ఇజ్రాయెల్ చెరలో జైలు గోడల నడుమ గడిపింది! వందేళ్లకు సరిపడా అనుభవాలు చవిచూసింది. టీనేజీలో అత్యంత అవసమైన అమ్మ ఆసరా కోసం ఎంతగానో అంగలార్చింది. అలాగని ధైర్యం మాత్రం కోల్పోలేదు. ఉత్తర ఇజ్రాయెల్లో తనను ఉంచిన డామన్ జైల్లోని పాలస్తీనా మహిళలు, మైనర్ల తరఫున గళమెత్తింది. చూస్తుండగానే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కీలక రాజకీయాంశంగా కూడా మారిపోయింది. దాంతో అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడి అనంతరం ముందు జాగ్రత్త చర్యగా మారాను మరో జైలుకు మార్చి ఇతరులతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా ఉంచింది ఇజ్రాయెల్ ప్రభుత్వం! బందీల పరస్పర విడుదలలో భాగంగా శుక్రవారం ఇజ్రాయెల్ వదిలిపెట్టిన 39 మంది పాలస్తీనియన్లలో ఆమె కూడా ఉంది. లాంఛనాలన్నీ పూర్తై ఎట్టకేలకు శుక్రవారం రాత్రి విడుదలై రమల్లా చేరింది. తల్లి సౌసన్ అప్పటికే అక్కడ ఆమె కోసం క్షణమో యుగంగా ఎదురు చూస్తోంది. కూతురు వాహనం దిగుతూనే పరుగెత్తుకెళ్లి ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. ఎనిమిదేళ్ల ఎడబాటును తలచుకుంటూ వారిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లీకూతుళ్ల కలయికను చూసిన వాళ్లందరిలోనూ హర్షాతిరేకాలు పెల్లుబికాయి. ‘‘నేను చెప్పలేదూ! నా కూతురు పోరాటాలతో రాటుదేలి అంతర్గత సౌందర్యంతో మెరిసిపోతోంది’’ అని పాలస్తీనా మీడియాతో చెబుతూ మురిసిపోయింది సౌసన్. స్కూలుకు వెళ్తుండగా... మారా స్వస్థలం ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న తూర్పు జెరూసలేం. కొద్ది దూరంలోని స్కూలుకు వెళ్లే క్రమంలో తూర్పు, పశి్చమ జెరూసలేం మధ్య ఉన్న ఎక్స్ప్రెస్ వేను దాటాల్సి వచ్చేది. 2015 అక్టోబర్లో 16 ఏళ్ల టీనేజర్గా స్కూలుకు వెళ్తుండగా ఎక్స్ప్రెస్ వే మీద ఇజ్రాయెల్ సైన్యం ఆమెపై కాల్పులకు దిగింది. గాయాలతో పడున్న మారాను అరెస్టు చేసింది. ఇజ్రాయెలీ సైనికాధికారిని పొడిచేందుకు ప్రయతి్నంచిందన్న అభియోగాలపై ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష పడింది. చేతిని తూట్లు పొడిచిన 12 తూటా గాయాలు శాశ్వతంగా అవిటిగా మార్చేశాయి. జైల్లో రోజులు అత్యంత దుర్భరంగా గడిచాయి. ముఖ్యంగా ఓ టీనేజర్గా తల్లి తోడు అత్యంత అవసరమైన తొలి రోజులు!’’ అని తల్లి చేతులను గట్టిగా పట్టుకుంటూ గుర్తు చేసుకుంది మారా. కష్టాన్నైనా తట్టుకునే శక్తిని కూడా ఇచ్చాయని చెప్పుకొచ్చింది. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కలకలం
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతుండగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్లో ఉన్న విరాట్ కోహ్లిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణలో భద్రతా వైఫల్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field (Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB — ANI (@ANI) November 19, 2023 మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనాను ప్రతిబింబించే వేషధారణను కలిగి ఉన్నాడు. ఎర్రని షార్ట్ ధరించాడు. తెల్లని టీ షర్ట్ ముందు భాగంలో పాలస్తీనాపై బాంబు దాడులు నిలిపివేయండి అని పేర్కొని ఉంది. టీషర్ట్ వెనుక భాగంలో ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉంది. పాలస్తీనా జెండాను ప్రతిబింబించేలా మాస్క్ను ధరించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. ఎక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్ వరకు చేరుకుని విరాట్ కోహ్లిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రంగంలోకి దిగిన సిబ్బంది అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లారు. క్రికెట్ వరల్డ్కప్లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లకు 182 పరుగులు సాధించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సాయం -
పాలస్తీనాకు భారత్ రెండోదఫా మానవతా సాయం
ఢిల్లీ: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సహాయాన్ని అందించింది. ఈజిప్టులోని ఎల్-అరిష్ ఎయిర్పోర్ట్కు 32 టన్నుల సాయంతో రెండో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సి17 విమానం బయలుదేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పాలస్తీనాకు కావాల్సిన అన్ని రకాల మానవతా సహయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. భారతదేశం అక్టోబర్ 22న పాలస్తీనాకు వైద్య, విపత్తు సహాయాన్ని మొదటిసారి పంపించింది. గాజా స్ట్రిప్కు చేరుకోవడానికి చేరుకోవడానికి అల్-అరిష్ ఎయిర్పోర్టు అతి దగ్గరగా ఉంటుంది. ఇది రఫా బార్డర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రస్తుతం రఫా సరిహద్దు సమీపంలో పరిస్థితులు భీకరంగా తయారయ్యాయి. నిత్యం బాంబుల మోతతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
ఇరాక్తో ఒకలా! ఇజ్రాయెల్తో మరోలా!!
పాలస్తీనాలో భాగమైన గాజా రాజ్యరహిత పరిస్థితి... దాన్ని పాలిస్తున్న హమాస్ను తీవ్రవాదంలోకి నెట్టింది. ఇజ్రాయెల్లోని పాలస్తీనా బందీలను వదలమన్న ఐక్య రాజ్య సమితి 194వ తీర్మానాన్ని ఇజ్రాయెల్ ఖాతరు చేయలేదు. పైగా పాలస్తీనాను ఆక్ర మించింది. తీవ్ర నిరసనలతో 2023 అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార యుద్ధానికి దిగింది. ఈ చర్యను అనేక దేశాలు ఖండించాయి. గతంలో భద్రతా మండలి 1441వ తీర్మానాన్ని 2002 నవంబర్ 8న ఏకగ్రీవంగా ఆమోదించింది. అనేక తీర్మానాల్లో నిర్ధారించినట్లు తన నిరాయుధీకరణ బాధ్యత నిర్వహణకు సద్దాం హుస్సేన్కు ఈ తీర్మానం తుది అవకాశాన్నిచ్చింది. 687వ తీర్మాన యుద్ధ విరమణ ఆదేశాన్ని ఇరాక్ పాటించలేదనీ, విధ్వంసక నిషిద్ధ ఆయుధాలను సంపాదించి, నిషేధిత క్షిపణులను తయారు చేసిందనీ, 1990–91లో కువైట్ ఆక్రమణలో తన సైనిక దోపిడీకి పరిహారం నిరాకరించిందనీ ఆరోపించింది. ఇరాక్ తప్పుడు వ్యాఖ్యానాలు, సమర్థనలు, ఈ తీర్మాన అమలు వైఫల్యం ఇరాక్ బాధ్యతల ఉల్లంఘన అని హెచ్చ రించింది. ఈ తీర్మానంలో ఇరాక్పై యుద్ధ ప్రసక్తి లేదు. ఐరాస పర్యవేక్షణ, పరిశీలన, తనిఖీ కమిషన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలను ఇరాక్ అనుమతించాలని పేర్కొన్నారు. 2002 సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్లు్య. బుష్ ఐరాస సాధారణ సభలో ఇరాక్ తప్పు లను చదివారు. ఆ తప్పులు: ఐరాస భద్రతా సమితి 1373వ (ఉగ్రవాద నిరోధక) తీర్మానాన్ని ఇరాక్ ఉల్లంఘించింది. ఇరాన్, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తోంది. అఫ్గానిస్తాన్ నుంచి తప్పించుకున్న అల్ ఖైదా ఉగ్రవాదులు ఇరాక్లో ఉన్నారు. ఐరాస మానవ హక్కుల కమిషన్ 2001లో ఇరాక్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను గమనించింది. ఇరాక్లో జీవ, రసాయన ఆయుధాలు, దీర్ఘ లక్ష్య క్షిప ణుల తయారీ, ఉపయోగం ఐరాస తీర్మానాల అతిక్రమణ. ఐరాస పథకం ఆహారానికి చమురు డబ్బుతో ఇరాక్ ఆయుధాల కొనుగోలు. భద్రతా మండలిలో వీటో హక్కు, శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా, ఫ్రాన్స్లకు ఇరాక్పై అమెరికా యుద్ధానికి దిగుతుందన్న అనుమానముంది. తీర్మానంలో తీవ్ర పరిణామాలు, పాదార్థిక ఉల్లంఘనలు వంటి పదాలు యుద్ధానికి దారితీయరాదని, ఇరాక్పై చర్యకు మరొక తీర్మానం అవసరమని రష్యా, ఫ్రాన్స్లు వాదించాయి. 1441వ తీర్మాన ముసాయిదాను తయారుచేసిన అమెరికా, ఇంగ్లండ్లు, తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఏకైక అరబ్బు దేశం సిరియా, ఈ తీర్మాన లక్ష్యం ఇరాక్ నిరాయుధీకరణని, దానికి ఇరాక్ సహకరించకపోతే భద్రతా మండలి తర్వాతి కార్యక్రమాన్ని నిర్ణయించాలని అన్నాయి. ఇరాక్ 2002 నవంబర్ పదమూడున తీర్మానాన్ని అంగీకరించింది. అమెరికా (ఐరాస) తీర్మాన ఆరోపణలు రుజువు కాలేదని ఐరాస తనిఖీ అధికారులు 2002 నవంబర్లో నివేదించారు. అదే ఏడాది డిసెంబర్లో ఇరాక్ 12 వేల పేజీల ఆయుధ నివేదికను ఇచ్చింది. ఏ ఐరాస సభ్య దేశమూ యుద్ధానికి అనుకూలం కాదు. అమెరికా, ఇంగ్లండ్లు చాలా తారుమారు పనులు చేశాయి. ఒకటి రెండు దేశాలు ఐరాస భద్రతా మండలిని ఆదేశించలేవని ఐరాస సభ్య దేశాలు ప్రకటించాయి. ఇరాక్పై యుద్ధం అసమ్మతమని న్యాయ కోవిదులు తమ అభిప్రాయాలను తెలిపారు. అయినా 2003 మార్చి 19న అమెరికా ఇరాక్పై యుద్ధానికి దిగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్లు ఇరాక్పై యుద్ధం చేశాయి. 2003 మే వరకు వరకు యుద్ధం సాగింది. ఇరాక్ సర్వనాశనమైంది. సద్దాం హుస్సే న్ను బంధించి ఉరిదీశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఇరాక్పై యుద్ధం చట్టవ్యతిరేకమనీ, ఐరాస వ్యవస్థాపక ఒప్పంద ఉల్లంఘననీ 2004 సెప్టెంబర్లో ప్రకటించారు. యుద్ధనివారణ కోసం ఐరాస సభ్య దేశాలు ఒక దేశంపై మరొక దేశం దాడిని ఆపాలన్నది రెండవ ప్రపంచ యుద్ధ విధ్వంసం తర్వాత ఏర్పడ్డ ఐరాస ప్రధాన లక్ష్యం. ఇజ్రాయెల్ ఐరాస సభ్య దేశం. పాలæ స్తీనా, వాటికన్ నగరం ఐరాస పరిశీలన దేశాలు. యుద్ధ నిరోధంలో పాలస్తీనా కంటే ఇజ్రాయెల్పై ఎక్కువ బాధ్యత ఉంది. అంతర్జాతీయ మానవత్వ చట్టాలను పాటించి, మానవత్వంతో గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలనీ, ప్రజలకు అత్యవసర ఆహార, ఔషధాలను అందించాలనీ, బందీలను వదలాలనీ ఐరాస సర్వసభ్య సాధారణ సభ 2023 అక్టోబర్ 27న తీర్మానించింది. ఈనాటికీ ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ అమలు చేయలేదు. యుద్ధాన్ని ఆపలేదు. అమెరికా... ఇజ్రాయెల్ పక్షం వహిస్తోంది. కనీసం తాత్కా లిక విరామాన్ని పాటించమని అమెరికా మిత్ర దేశాలే కోరాయి. ఐరాస 1441వ తీర్మాన చట్టవ్యతిరేక దుర్వినియోగానికి, ఐరాస ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డ అమెరికా, అలాగే ఇరాక్పై యుద్ధంలో పాల్గొన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్లు నేటి ఐరాస తీర్మానాన్ని ఎందుకు అమలు చేయించవు? ఇరాక్ను కక్షతో శిక్షించిన అమెరికా మానవత్వంతో ఇజ్రాయెల్ను ఎందుకు దండించదు? సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 9490 20 4545 -
శిశువుల చిత్రనిద్రలో బాంబుల చప్పుడు
ఒళ్ళంతా బూడిద వర్ణం నిండి పోయిన ఆ బాలుడు గూడు చెదిరిన పిట్టలా రోడ్డుమీద అయోమయంగా గిరికీలు కొడుతున్నాడు. భయమో, ఏడుపో, ఆందోళనో, వెతుకు లాటో తెలీని ఆ పదేళ్లవాడిని ఎవరో ఆపి, ఏదో అడుగు తున్నారు. తన ఖాళీచేతుల వంక చూసుకుంటూ, ‘‘ఇపుడే బాల్ ఇద్దామని వచ్చాను, వాడు కారుకింద దాక్కున్నాడు. ఇంతలో మాకు దగ్గరలో బాంబు వేశారు వాళ్ళు. మా మేనల్లుడి వీపుకి గాయం అయింది. వాడిని మోసుకుని ఇంటికి వెళ్ళాను. మా పొరుగువాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళకి బుజ్జి బాబు ఉన్నాడు. వాడి తలంతా పగిలిపోయి మెదడు బైటకి వచ్చింది. మేము ఎలా బతకాలి, ఇది జీవితం కాదు’’ మాటల శిథిలాలను వదిలి మళ్ళీ పరుగందుకున్నాడు. శోక సముద్రపు అలలా, తీరం లాంటి తండ్రి గుండెకి తలని మోదుతూ ఎగిరెగిరి పడుతున్నది ఎనిమిదేళ్ళ పిల్ల. ‘‘మా తాతయ్యని, నాన్నమ్మని, చిన్నాన్నని, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేశారు. వాళ్ళు అమరులయ్యారట, కానీ మా అమ్మని తమ్ముడిని ఎలా చంపుతారు, అమ్మ లేకుండా నేనుండలేను’’ ఆ చిన్న గొంతులో ఎవరం వినగూడని ఉద్వేగం. లోకపు భయం అంతా ఒకముద్దలా మార్చి రెండు కళ్ళలో కూరినట్లు, ఆసుపత్రి బల్లమీద కూర్చున్న రెండు మూడేళ్ల చిన్నవాడు లోకపు నాగరికతని ముక్కలు ముక్కలు చేసేశాడు. వాడి పసినిద్రని చెల్లాచెదరు చేసిన బాంబుదాడి బీభత్సం అంతా ఆ విప్పార్చిన కళ్లలో కనిపించింది. అది చూసి తట్టుకోలేని డాక్టర్ వాడిని దగ్గరికి తీసుకుని ‘‘నాన్న దగ్గరికి తీసుకువెళ్లనా?’’ అనడ గగానే భయం బద్దలయి, కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు అయిదు వేలమంది పాలస్తీనా చిన్నారులు చనిపోయారు. ప్రతి పది నిమిషాలకూ ఒక చిన్నారిని మరణంలోకి నెట్టి వేస్తున్నది మాయదారి యుద్ధం. గాయపడినవారి లెక్కకి అంతే లేదు. శిథిలాల కిందన, రోడ్ల మీదా, ఆసుపత్రులలో, శిబిరాలలో నెత్తురోడుతున్న పిల్లలు... పిల్లలు... పసి కూనలు! ఏడుస్తూ అరుస్తూ, కాళ్లతో చేతులతో అందరినీ విసిరికొడుతూ, భయంతో నక్కి నక్కి దాగుతూ, ప్రతినలు పూనుతూ, అయినవారి శవయాత్రల్లో కక్కటిల్లిపోతూ, ఆసుపత్రుల్లో కింక పెడుతూ, శూన్యంలోకి చూస్తూ, నిశ్చేష్టులవుతూ, లోకపు నిర్దయని ఛీత్కరిస్తూ – పాలస్తీనా బాల్యం, హృదయమున్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. బిడ్డ గుక్కపట్టి ఏడిస్తేనే కిందుమీదులయ్యే సున్నితమైన పెంపకాల మధ్య ఈ సామూహిక రోదనలు వినడం అత్యంత విషాద సందర్భం. ఇజ్రాయెల్కూ, తమ మత ప్రయోజ నాలకూ కొమ్ము కాసే ఒక తరహా మీడియా, పసిపిల్లల బాధాకర వీడియోలను నటనలుగా వక్రీకరిస్తున్నది. వేలాది పిల్లల ఆర్తనాదాలలోని సహజత్వాన్ని పరీక్షకు పెట్టేంత బండబారిపోయామా! లోకంలో ఎక్కడైనా పిల్లల భద్రతకి అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే భావి పౌరుల ఎదుగుదలని బట్టే సమాజపు ఎదుగుదల ఉంటుంది కనుక. పిల్లల మనసు తెల్ల కాయితం లాంటిది. దాని మీద వారు తొలిగా అమ్మ, నాన్న, తోబుట్టువుల బొమ్మలు గీసుకుంటారు. ఆ మూలన సూర్యుడు, దానిమీద అడ్డంగా ఎగురుతున్న రెండు పక్షులు, ఒక స్కూలు, నలుగురు స్నేహితులు, కాసిన్ని ఆటపాటలు. ఇంతకి మించిన భారాన్ని వారి చిట్టి మనసులు మోయలేవు. ప్రపంచవ్యాప్తంగా జాతి, వర్ణ, కుల, సామాజిక, ఆర్థిక, ఇతరేతర వివక్షలకి తగిలిన గాయాలను పిల్లలు శతాబ్దాలుగా మోసుకు తిరుగుతున్నారు. వీటికి అదనం యుద్ధాల వంతు. ఇపుడు లక్షలాది పాలస్తీనా చిన్నారుల తెల్లకాయితాల మీద యుద్ధం – ఎరుపు, బూడిద రంగుల హర్రర్ వాక్వీ య్ను చిత్రిస్తుంది. వేలాది చిన్నారుల్లో, వారి మొహాల్లో, హావభావ కవళికల్లో కొట్టొచ్చినట్లు కనపడుతున్నవి, షాక్, ట్రామా. ఇవి సబ్ కాన్షియస్ మీద వేసే ముద్రలు సామాన్యమైనవి కావు. కూడూ, గూడూ, దుస్తులూ హాయిగా అమిరాక కూడా మన అభిప్రాయాలు, విశ్వాసాలే గొప్పవని నమ్మి, వాటిని గెలిపించడం కోసం ఎంతకైనా తెగించే నాగరీక లోకమిది. ఇక బతుకే ఊగిసలాటలో పడిన పసిపిల్లలు, భవిష్యత్తులో శాంతి కాముకులవుతారని నమ్మగలమా! రక్తపాతం సృష్టించిన వారు పశ్చాత్తాపంతోనో, తమ ప్రాణాల మీది తీపితోనో శాంతి మంత్రం జపించవచ్చు గాక. కానీ బాధితులను శాంతిగా ఉండమని చెప్పడమంత లౌక్యం, అమానుషం మరొకటి ఉండదు. పిల్లల విషయంగా పాలస్తీనా భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సమస్యలు రెండు. మానసిక కల్లోలా లను అదుపు చేసుకోలేక పిల్లలు స్వీయహింసకి పాల్పడడం, లేదా ఇతరుల పట్ల, ముఖ్యంగా తమని వేధించినవారి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడం. కుక్కలు, తూనీగలు, పురుగులు, పిట్టల వంటివాటిని– పిల్లలు తెలిసీ తెలియక హింసిస్తుంటారు. ప్రాణుల పట్ల దయగా ఉండాలని రేపుమాపు ఎవరైనా బోధించబోతే వారు తప్పక ఒక ప్రశ్న అడుగుతారు, ‘పాలస్తీనా ప్రజలు ప్రాణులు కారా?’ అని. ఇంత నలుగుడు పడి మనమేమి చేయగలం? నాలుగు కొవ్వొత్తులు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడం, నాలుగు అక్షరాలు రాయడం, మీతో మేమున్నామని పాలస్తీనీ యులకు తెలపడం, నలుగురు కూచుని నవ్వేవేళల –యుద్ధంతో ఛిద్రమవుతున్న బాలలు తలపున పడి చాటుగా కళ్ళు తుడుచుకోవడం తప్ప, మనమేమి చేయగలం! కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే malleswari.kn2008@gmail.com -
ఈ నరమేధం ఆగాలి!
నెల దాటిపోయినా, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి వ్యవహారానికి ముగింపు కనిపించడం లేదు. గాజా భూఖండంపై భూతల దాడిని ఇజ్రాయెల్ ముమ్మరం చేయడంతో మారణహోమం ముమ్మరమవుతోంది. ఆ ప్రాంతమంతటినీ నిర్జనవాసంగా మార్చేంత వరకు నెతన్యాహూ నిద్ర పోయేలా లేరు. పైపెచ్చు, గాజా ప్రాంతపు భద్రత బాధ్యత ఇకపై తమదేనంటూ ఇజ్రాయెల్ ప్రధాని సోమవారం మరో బాంబు పేల్చారు. దాని భావమేమిటో ఆయన విడమరిచి చెప్పనప్పటికీ, గాజాను తన హస్తాల్లో బిగించనున్నట్టు అర్థమవుతూనే ఉంది. గాజాను పునరాక్రమించుకోవడం, లేదంటే కనీసం 2005 సెప్టెంబర్ ముందు లాగా గాజా అంతటా తమ సైన్యమే ఉండేలా చూసు కోవడం ఇజ్రాయెల్ మనసులో మాటగా కనిపిస్తోంది. అదేమీ లేదని నెతన్యాహూ సహచరులు పైకి చెబుతున్నా, ఆ మాటలను నమ్మడం కష్టమే. సాక్షాత్తూ అమెరికా సైతం తనతో సహా పశ్చిమ దేశాలన్నీ తీవ్రవాద సంస్థగా భావిస్తున్న హమాస్తో రేపెప్పుడో యుద్ధం ముగిశాక గాజాను ఇజ్రాయెల్ పునరాక్రమించుకోరాదంటూ బుధవారం హెచ్చరించాల్సి వచ్చింది. అదే సమయంలో గాజాలో హమాస్ పాలన కొనసాగరాదనీ, అదే జరిగితే మళ్ళీ మొన్న అక్టోబర్ 7 తరహా దాడులు పునరావృతం కావచ్చనీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సన్నాయినొక్కు నొక్కారు. గాజా దిగ్బంధనం, భూభాగాన్ని తగ్గించడం, బలవంతాన జనాన్ని ఖాళీ చేయించడం లాంటివేమీ చేయరాదనీ, వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనియన్ అథారిటీ పాలన సాగించాలనీ అన్నారు. హమాస్ను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని పైకి చెబు తున్నప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న ధోరణి చూస్తే అలా అనిపించడం లేదు. సరిహద్దులు దాటి హమాస్ చేసిన అక్టోబర్ 7 నాటి దాడిలో ఇజ్రాయెల్లో 1400 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది దాకా బందీలయ్యారు. ఇజ్రాయెల్ నెల రోజుల పైగా సాగిస్తున్న ప్రతీకార దాడిలో ఇప్పటికి 11 వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయారని లెక్క. దాడికి ప్రతిదాడిగా మొదలై, తీవ్రవాదం పేరు చెప్పి, అమాయక ప్రజలు సహా అందరినీ కబళిస్తున్న యుద్ధం ఆందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న భూఖండంలో నరమానవుడు మిగలకుండా నేలమట్టం చేయాలన్న ఇజ్రాయెల్ దుందుడుకుతనం తీవ్రమైనది. ఇదే దూకుడు కొనసాగితే... అప్పుడిక పాలస్తీనా పక్షాన ఇరాన్ తదితర దేశాలు నేరుగా బరిలోకి దిగితే... పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దేశదేశాల ప్రపంచ వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో మెజారిటీ దేశాలు శాంతిస్థాపన వైపు మొగ్గి, యుద్ధ విరమణకు తీర్మానం చేయకపోలేదు. అయితే, ఆ శాంతి వచనాలను పట్టించుకున్న నాథుడు లేడు. ఆ తీర్మానాన్ని అమలు చేసేందుకు సమకట్టాల్సిన అగ్రదేశాల్లో అధికభాగం ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షం వెనుక పరోక్షంగానైనా నిలబడడం పెద్ద సమస్య. ఐరాస ప్రధాన కార్య దర్శి ఆ మధ్య అన్నట్టు... ఇజ్రాయెల్పై హమాస్ దాడి ఉన్నట్టుండి ఏ శూన్యం నుంచో జరగలేదు. అదే సమయంలో ఆయనే వ్యాఖ్యానించినట్టు... పాలస్తీనియన్లు కష్టాలు, కన్నీళ్ళకు పరిష్కారం ఇజ్రాయెల్పై హమాస్ చేసిన భయానక దాడి కూడా కాదు. నాణానికి ఉన్న ఈ రెండు వైపులనూ సమగ్రంగా చూడగలిగితేనే ప్రపంచ దేశాలు ఈ సంక్లిష్ట సమస్యకు సరైన జవాబు ఆలోచించగలవు. అసలు తాజా పరిణామాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బాధ్యత కూడా చాలానే ఉంది. అక్టోబర్ 7 హమాస్ దాడికి దారితీసిన ఇజ్రాయెల్ గూఢచర్య వైఫల్యానికీ, అసలు హమాస్ తీవ్రవాదం పెచ్చరిల్లడానికీ, నెల రోజులుగా పాలస్తీనా – ఇజ్రాయెల్లలో సాగుతున్న ప్రాణనష్టానికీ ఆయనే బాధ్యుడని సొంత పౌరులే తప్పుబడుతున్నారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లోని అస్థిరత సైతం గడచిన కొన్ని వారాల పరిస్థితికి పాక్షికంగా కారణమే. వాటి నుంచి దృష్టి మరల్చ డానికే అన్నట్టుంది నెతన్యాహూ వ్యవహారం. హమాస్కు అడ్డాలుగా మారాయంటూ, ఆయన ఆస్పత్రులపై బాంబులు వేయించారు. చివరకు నిరాశ్రయులైన పాలస్తీనీయులకు ఆశ్రయమిస్తున్న గాజాలోని అతి ప్రాచీన గ్రీకు ఆర్థొడాక్స్ చర్చినీ వదల్లేదు. గాజాలోని నివాస వసతుల్లో దాదాపు సగానికి పైగా దాడుల్లో నేలమట్టమైన పరిస్థితి. హమాస్ పేరిట సామాన్యులపై సాగుతున్న ఈ అసాధారణ యుద్ధ నేరంపై సహజంగానే నిరసన తలెత్తింది. ఇజ్రాయెల్ పక్షీయులతో సహా అన్ని దేశాలపై ఇప్పుడు తక్షణ కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. జీ–7 దేశాల విదేశాంగ మంత్రులు తమ తాజా సమావేశంలో శాశ్వత యుద్ధ విరమణ ఊసెత్త కుండా, అమాయక పాలస్తీనా పౌరులకు సాయం అందించడానికి వీలుగా మానవతా దృక్పథంతో దాడులకు విరామాలు ఇవ్వాలని కోరారు. విస్తృత శాంతి ప్రక్రియకు పూనుకోవాలని మాత్రం అనVýæలిగారు. ఇవి కంటితుడుపు మాటలే. గాజాలో నరమేధాన్ని మౌనంగా చూస్తున్న ప్రపంచ మానవాళి మొత్తం సమష్టి బాధ్యత వహించాల్సిందే. ఎవరి అంతరాత్మకు వారు జవాబు చెప్పుకోవా ల్సిందే. రోజూ 160 మంది పాలస్తీనా పసివాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఒక పోరులో పదుల సంఖ్యలో జర్నలిస్టులు అసువులు బాశారు. గాజాలో తిండి, నీరు లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక విలపిస్తూ, ఆత్మీయుల మృతదేహాలను గుర్రపుబండ్లల్లో తీసుకెళుతున్న దృశ్యాల్ని చూసి మనసు కరగనివారు మనుషులు కారు. ఇది త్రాసులో తప్పొప్పుల లెక్కలు తేల్చే తరుణం కాదు. అన్నెం పున్నెం ఎరుగని పిల్లల్నీ, అమాయకుల్నీ ఈ మతి లేని మహా విధ్వంసం నుంచి కాపాడాల్సిన సమయం. చిన్నారుల మరుభూమిగా మారు తున్న గాజా మరింత విధ్వంసంలోకి జారిపోక ముందే యుద్ధానికి తెర దించడం అత్యవసరం. -
భీకర యుద్దం..పాలస్తీనియన్ల కోసం ఈ చిన్నారి చేసిన పని తెలిస్తే!
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 8,525వేల మంది పాలస్తీనియన్లు బలయ్యారు. ఈ నేపథ్యంలో దాడులను ఆపివేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్కు పిలుపునిస్తున్నాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. అయితే ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర యుద్దం నేపథ్యంలో వర్తక, వాణిజ్యాల్లో కుదుపులకు కారణమవుతోంది. ఈ క్రమంలో పాలస్తీనియన్ల కోసం భారీగా నిధులు సమకూరుతున్నాయి. సిరియాలోని ఓ మసీదులో పాలస్తీయన్ల కోసం పలువురు విరాళాలు ఇస్తుండగా, ఓ చిన్నారి సైతం తనకు తోచినంత సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Crowd funding was being done for Palestinians in a Mosque in Syria when this little girl arrived with her small gift❤️#StopGenocideInGaza #Palestine pic.twitter.com/njxeUyLH7R — هارون خان (@iamharunkhan) November 1, 2023 -
ప్రపంచాన్ని విభజించిన తీర్మానం
అక్టోబర్ 7 నాటి హమాస్ తీవ్రదాడి ఇజ్రాయెల్ను రాజకీయంగా ఒక్కటి చేసింది. అయితే అత్యధిక దేశాలు ఇజ్రాయెల్ ప్రతిదాడుల తీవ్రతను ప్రశ్నిస్తు న్నాయి. హమాస్ దాడి తీవ్రవాద చర్య అని మరికొన్ని భావిస్తున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానం చాలా దేశాలను వర్గాలుగా, ప్రాంతా లుగా విడదీసిందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇజ్రాయెల్తో అరబ్ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నా... గాజా ప్రజల కష్టాలపై కనీస స్పందన కనబరచాలనే ఒత్తిడిలో తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో తీర్మానానికి మద్దతివ్వని ఏకైక దక్షిణాసియా దేశంగా ఉండటం వల్ల, ఇజ్రాయెల్కు సానుకూలంగా భారత్ మారిందన్న భావన అదే అరబ్ దేశాల్లో బలపడే వీలుంది. అందుకే భారత్ ఆచితూచి వ్యవహరించాలి. అక్టోబర్ 7 నాటి హమాస్ తీవ్రదాడికి కారణ మైన నిఘా వైఫల్యాలు, భద్రత లోపాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పటికీ, ఆ దేశ రాజకీయ వర్గం ప్రభుత్వం వెంట నిలిచింది. జాతీయ అత్యయిక పరిస్థితిలో రాజకీయ పక్షాలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టాయి. ‘అత్యవసర ఐక్యతా ప్రభుత్వ’ ఏర్పాటునకు పార్ల మెంటు ఆమోదం పొందే క్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ, ‘హోలోకాస్ట్ తరువాత యూదు ప్రజలు ఎదుర్కొన్న అతి దుర్భర ఘటన’గా అక్టోబర్ 7ను అభివర్ణించారు. హమాస్ దాడిలో 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. 229 మందిని హమాస్ బందీ లుగా కొనిపోయింది. అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతిదాడుల విష యంలో ప్రపంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక దేశాలు ఇజ్రాయెల్ ప్రతిదాడుల తీవ్రతను ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ రాజకీయ వర్గాలు హమాస్ అంతు చూడాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాయి. బందీల పరిస్థితేమిటి? హమాస్ దాడి జరిగిన వెంటనే, ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాపై బాంబుల వర్షం కురిపించాయి. వైమానిక, భూతల దాడుల్లో ఇప్పటివరకూ 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ఇంకో అడుగు ముందుకేసి విద్యుత్ సేవలు నిలిపి వేసింది. ఆహారం కూడా తక్కువ పరిమాణంలో గాజాలోకి వెళ్లేలా నియంత్రిస్తోంది. గాజా ఉత్తర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దక్షిణం వైపునకు పోవాలని హెచ్చరించింది. అక్టోబరు 27న ఇజ్రాయెల్ భూతల దళాలు గాజా లోకి ప్రవేశించాయి. ఒక రోజు తరువాత నెతన్యాహూ, యుద్ధంలో తరువాతి దశ ఇక మొదలవుతుందనీ, ఇది దీర్ఘకాలిక పోరు కానుందనీ ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించారు. బందీలను రక్షించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని ఇజ్రా యెల్ చెబుతోంది. తమ చర్యల కారణంగా గాజాలో ప్రాణనష్టానికి భయపడి హమాస్ బందీలను విడుదల చేస్తుందనేది ఇజ్రాయెలీల ఆలోచనగా కనిపిస్తోంది. గాజా ప్రజల ఒత్తిడికి కూడా హమాస్ తలొగ్గ వచ్చునని భావిస్తోంది. ఖతార్, ఈజిప్టు లాంటి దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి. బందీల విడు దలకు ప్రయత్నిస్తున్నాయి. అయితే హమాస్ తమకు రక్షణ కవచంగా ఉంటున్న బందీలను వదులుకునేందుకు సిద్ధంగా ఉందా అన్నది ప్రశ్న. మరోవైపు ఇజ్రాయెలీ అధికారులు కూడా అసందిగ్ధతను ఎదు ర్కొంటున్నారు. బందీల కుటుంబ సభ్యులు వారిపై ఒత్తిడి తెస్తు న్నారు. బందీలుగా ఉన్న పాలస్తీనీయులను వదిలితే ఇజ్రాయెలీల విడుదలపై ఆలోచిస్తామని హమాస్ షరతు విధించినట్టు తెలుస్తోంది. గతంలో ఒకే ఒక్క ఇజ్రాయెలీ సైనికుడి విడుదల కోసం ఇజ్రాయెల్ చాలామంది పాలస్తీనియన్లను వదిలిపెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావ నార్హం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. హమాస్ దాడి సమర్థనీయమే?! పాలస్తీనాను ఇజ్రాయెల్ చాలాకాలంగా ఆక్రమించి ఉండటం, రెండు దేశాల పరిష్కారానికి సిద్ధంగా లేకపోవడం కారణంగా అక్టో బరు 7 నాటి హమాస్ దాడి అర్థం చేసుకోదగినదే అని కొన్ని అరబ్ దేశాలతోపాటు, కొన్ని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. ఇంకో అడుగు ముందుకెళ్లి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ గత వారం భద్రతా మండలిని ఉద్దేశించి, హమాస్ దాడి శూన్యంలోంచి పుట్టుకొచ్చింది కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజంలో చాలామంది ఇజ్రాయెల్ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ హమాస్ దాడి తీవ్రవాద చర్య అనీ, సమర్థనీయం కాదనీ భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా ఇటీవలే ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానం విషయంలో స్పష్టమయ్యాయి. ‘ప్రజల భద్రత, న్యాయమైన, మానవీయ బాధ్యత’ కోసం ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి 121 దేశాలు మద్దతిచ్చాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 44 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ‘మానవతావాద సంధి ఒకటి తక్షణం కుదరాలనీ, ఈ ఏర్పాటు దీర్ఘకాలం కొనసాగేదిగా ఉండాలనీ’ ఈ తీర్మానం ప్రతిపా దించింది. హమాస్, ఇజ్రాయెల్ పేర్లను ప్రస్తావించలేదు. గాజా ప్రజలకు సాయం అందేలా చూడాలనడం, మానవత చట్టాల అమలు గురించి మాట్లాడటాన్ని బట్టి, ఈ తీర్మానం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రతిపాదించినదని స్పష్టంగా అర్థమవుతుంది... గాజాలోని ఇజ్రా యెల్ బందీలు అని అర్థమయ్యేలా అక్రమంగా నిర్బంధించిన పౌరుల విడుదల అంశాన్ని ఇందులో పేర్కొన్నప్పటికీ. ముఖ్యమైన విషయం ఏమిటంటే... అరబ్, ఇస్లామిక్ దేశాలతో పాటు రష్యా, చైనా కూడా ఇజ్రాయెల్ నిగ్రహం చూపాలనీ, ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గాన్ని వదిలేయాలనీ డిమాండ్ చేయడం. తీర్మా నానికి అనుకూలంగా ఓటేసిన దేశాల జాబితాలో ఐక్యరాజ్య సమతి భద్రత మండలి సభ్యదేశమైన ఫ్రాన్స్ కూడా ఉంది. తన ‘నాటో’ భాగస్వామి అమెరికాతో మాత్రమే కాదు, బ్రిటన్తోనూ ఫ్రాన్స్ విభేదించింది. అమెరికా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించగా, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉంది. యూరోపియన్ యూనియన్, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా యూనియన్, ఏసియన్, దక్షిణాసియా దేశాలను ఈ తీర్మానం వర్గాలుగా, ప్రాంతాలుగా విడదీసిందంటే అతిశయోక్తి కాదేమో! ఇజ్రాయెల్కు అమెరికా దన్ను! ఇజ్రాయెల్కు అమెరికా పూర్తి దన్నుగా నిలుస్తోంది. ఎన్నికలకు ఏడాది గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్ ను అమెరికా యూదుల లాబీ ప్రభావితం చేయడం దీనికి కారణం కావచ్చు. అమెరికాకు చెందిన బందీలపై ఆందోళన కూడా ముఖ్యమైన కారణం కావచ్చు. ఈ కారణంగానే హమాస్ను తుదముట్టించాలనే ఇజ్రాయెల్ కృతనిశ్చయాన్ని అమెరికా సమర్థిస్తుండవచ్చు. దీనర్థం, అమెరికా ఇకపై కూడా తన వీటో పవర్తో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇజ్రాయెల్కు దౌత్యపరమైన సాయం కొనసాగిస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్తో అరబ్ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నా... గాజా ప్రజల కష్టాలపై కనీస స్పందన కనబర చాలనే ఒత్తిడిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఇజ్రాయెల్తో ఆ దేశాలు, ముఖ్యంగా యూఏఈ, బహ్రెయిన్ , ఈజిప్టు తమ సంబంధాలను తెంచుకుంటాయా అనేది చూడాలి. భారత్ వైఖరి ఓటింగ్కు దూరంగా ఉన్న విషయంపై భారతదేశం వివరణ ఇచ్చింది. అది సరిగ్గానే ఉగ్రవాదంపై దృష్టి కేంద్రీకరించింది. నిగ్రహంగా ఉండాలని పిలుపునిచ్చింది. దౌత్యం, చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాగలదని స్పష్టం చేసింది. మానవతా చట్టాలను గౌరవించాలని చెబుతూనే తాను రెండు దేశాల సిద్ధాంతానికి మద్దతుగా నిలుస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే తీర్మానానికి మద్దతివ్వని ఏకైక దక్షిణాసియా దేశంగా ఉండటం వల్ల, ఇజ్రాయెల్కు సానుకూలంగా, పాలస్తీనియన్ల పట్ల పట్టింపు లేనిదిగా భారత్ మారిందన్న భావన అరబ్ దేశాల్లో బలపడేందుకు వీలుంది. ఇది వాస్తవం కాకపోవచ్చు. స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నప్పటికీ, వాటి విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలి. అరబ్ దేశాలతో కూడా మనకు అంతే భారీ ప్రయోజనాలు ఉన్నాయి. వివేక్ కాట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బలహీనంగానే సెంటిమెంట్
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగానే కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధ పరిణామాలు, దేశీయ కార్పొరేట్ క్యూ2 ఆరి్థక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. పశి్చమాసియా ఉద్రిక్తతలు, బాండ్లపై రాబడులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, మిశ్రమ కార్పొరేట్ ఆరి్థక ఫలితాల వెల్లడి తదితర పరిణామాల నేపథ్యంలో క్రితం వారం సూచీలు రెండున్నరశాతం నష్టపోయాయి. ట్రేడింగ్ నాలుగురోజులు జరిగిన గతవారంలో సెన్సెక్స్ 1,615 పాయింట్లు, నిఫ్టీ 495 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ‘‘వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ఆస్థిరత కొనసాగవచ్చు. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ రికవరీని ఆలస్యం చేయోచ్చు. ఇటీవల వరుస విక్రయాలతో నెలకొన్న ఓవర్సోల్డ్ ట్రెండ్తో నిఫ్టీ పతనం తాత్కాలికంగా ఆగింది. నిఫ్టీకి సాంకేతికంగా కీలకమైన మద్దతు 19,250 స్థాయి కోల్పోయింది. తిరిగి ఈ స్థాయిపైకి చేరుకుంటేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ తెలిపారు. క్యూ2 కార్పొరేట్ ఫలితాలు గత వారాంతంలో ఎన్టీపీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యూపీఎల్లు వెల్లడించిన ఆరి్థక ఫలితాలకు స్టాక్ మార్కెట్ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఇక నిఫ్టీ సూచీలో లిస్టైన టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, టైటాన్, యూపీఎల్, టాటా కన్జూమర్ ప్రొడెక్టŠస్, అదానీ ఎంటర్ప్రైజెస్, బ్రిటానియాతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 700 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆరి్థక ఫలితాలను వెల్లడించనున్నాయి. గెయిల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, మనోజ్ వైభవ్ జెమ్స్, యధార్థ్ హాస్పిటల్స్, గ్లాండ్ ఫార్మా, ఐఓసీ, అంజుజా సిమెంట్స్, టీవీఎస్, ఇండిగో, జొమోటో, డెల్హవరీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీఎల్ఎఫ్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సెపె్టంబర్ ద్రవ్యలోటు, ఎనిమిది కీలక రంగాల వృద్ధి డేటా మంగళవారం(అక్టోబర్ 31న), అక్టోబర్ తయారీ రంగ పీఎంఐ, ఇదే నెల ఆటో అమ్మకాలు బుధవారం, సేవా రంగ పీఎంఐ డేటా, పారెక్స్ నిల్వలు శుక్రవారం విడుదల అవుతాయి. అమెరికా తయారీ, సేవా రంగ పీఎంఐ, ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్ ఎకానామిక్ కాని్ఫడెన్స్, కన్జూమర్ కాని్ఫడెన్స్, సీపీఐ, జీడీపీ, తయారీ రంగ గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. చైనా తయారీ, నాన్ మాన్యూఫ్యాక్చరింగ్, సేవారంగ పీఎంఐ డేటా ఈ వారంలోనే వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబింజేసే కీలక స్థూల ఆరి్థక గణాంకాల వెల్లడికి ముందు మార్కెట్లలో అప్రమత్తత చోటు చేసుకోనే వీలుంది. అక్టోబర్లో రూ.20 వేల కోట్లు వెనక్కి ► విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్లో రూ.20,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. ఇదే కాలంలో డెట్ మార్కెట్లో రూ.6,080 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి తర్వాత భారత మార్కెట్పై విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ఏమిటనేది స్పష్టమవుతుంది. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. రేపు ఎఫ్ఓఎంసీ సమావేశం ప్రారంభం ► ద్రవ్య విధాన నిర్ణయాలు, వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 5.25 – 5.50% వద్ద యథాతథంగా ఉంచొచ్చని ఆరి్థకవేత్తల అంచనా. ద్రవ్య పాలసీ వెల్లడి సందర్భంగా చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలను ఈక్విటీ మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ఇదే మంగళ, బుధవారాల్లో బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లు సైతం ద్రవ్య సమీక్ష నిర్వహించనున్నాయి. -
మానవత్వం మేల్కొనేదెప్పుడు?
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గురికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు. ‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి? ఇంకెందరు మరణించాలి? మానవత్వం అనేది ఉందా? మానవత్వం మేల్కొనేది ఇంకెప్పుడు?అని ఆమె శుక్రవారం ‘ఎక్స్’లో ప్రశ్నించారు. గాజాలో మూడు వేల మంది అమాయక చిన్నారులు సహా మొత్తం ఏడు వేల మందికిపై ప్రాణాలు కోల్పోయినప్పటికీ రక్తపాతం, హింసకు పుల్స్టాప్ పడకపోవడంపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
సామూహిక శిక్షగా మారిన యుద్ధం
పశ్చిమాసియా ప్రాంతపు ప్రస్తుత నిత్యాగ్నిహోత్రాన్ని డాంబికాల మధ్య జరుగుతున్న యుద్ధం అని అంటే అతిశయోక్తేమీ కాదు. గాజాలో హమాస్ను కట్టడి చేశామని తమకు తాము సర్ది చెప్పుకునే ఇజ్రాయెలీలు ఒకవైపు.. ఇజ్రాయెల్తో వివిధ అరబ్ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి వస్తే – అది కూడా పాలస్తీనా అంశంతో సంబంధం లేకుండా జరిగిపోతే – ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ రాజకీయాలకు అక్కరకొస్తుందని అమెరికన్లు మరోవైపు భావిస్తున్నారు. కానీ నిత్య నిరాశావాది, స్వప్రయోజనాలే మిన్న అనుకునే నెతన్యాహూ రాజకీయాలు ఇజ్రాయెల్ ప్రయోజనాలను దెబ్బ తీశాయనడంలో సందేహం లేదు. ఒకరకంగా ఆయన హమాస్ ఆటలో పావు అయ్యారని చెప్పవచ్చు. ఇజ్రాయెల్కున్న ఆత్మరక్షణ హక్కును ఎవరూ కాదనరు. కానీ ప్రజలను నిర్బంధంలో ఉంచడం, ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా చేయడం ‘సామూహిక శిక్ష’ కిందకు వస్తుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ ఉగ్రవాదుల దాడి యూదుల చరిత్రలోనే తీవ్రమైనదని అందరూ అంగీకరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దాడికి ప్రతీకారం తీర్చుకుంటోంది. గాజా స్ట్రిప్కు నీరు, విద్యుత్తు, ఆహారం అన్నింటిని బంద్ చేసింది. పైగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇందులో కొన్ని జిల్లాలకు జిల్లాలు నేలమట్టమై పోయాయి. అయితే చర్యల ద్వారా హమాస్ను గాజా స్ట్రిప్ నుంచి ఎలా తీసివేస్తారన్నది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఇజ్రాయెల్ ప్రణాళికలు మొత్తం బెడిసికొడుతూండగా ప్రస్తుతం అది కొత్త, విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఇకనైనా కొంచెం ఆచి తూచి ముందడుగు వేయాలని మిత్రదేశాలే సూచిస్తూండటం ఇందుకు నిదర్శం. అమెరికాకు అనుభవమే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితికి, సెప్టెంబరు 11న అల్ఖైదా ఉగ్రవాదుల దాడి తరువాత అమెరికా ఎదుర్కొంటున్న పరిస్థితికి సారూప్యం కనిపిస్తుంది. అప్పట్లో అమెరికా గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజమ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మహా యుద్ధాన్ని ఒక్కసారి సమీక్షిస్తే అమెరికా అఫ్గానిస్తాన్ లో యుద్ధాన్ని కోరుకుందని, అదే సమయంలో ఇరాక్తో యుద్ధాన్ని ఎంచుకుందని చెప్పాల్సి వస్తుంది. రెండూ అమెరికాకు తలనొప్పి మిగిల్చిన మాటైతే నిజం. బాధితులు అఫ్గానిస్తాన్, ఇరాక్ ప్రజలు మాత్రమే. ఇప్పుడు ఇజ్రాయెల్ నేతలు కూడా ప్రజల బాధలు పట్టించుకునే స్థితిలో కనిపించడం లేదు. గాజాను సమూలంగా నేలమట్టం చేశాక, దాంతో సంబంధా లన్నీ తెంచేస్తామని ఇజ్రాయెలీ జనరళ్లు చెబుతున్నారు. అయినా సరే.. ఇజ్రాయెల్ పొరుగునే 20 లక్షల మంది బాధతప్త జనాభా ఉంటుంది. ఏదో ఒక ప్రాంతాన్ని మిలటరీ చర్యలకు అతీతంగా ఉంచినా సరే. ఇజ్రాయెల్ ఏర్పాటు ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ల గొట్టబడిన వారి శాపనార్థాలు ఇజ్రాయెల్కు తగులుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా అసమ్మతిని, వ్యతిరేకతను అణచివేసేందుకు సైనిక చర్య లనే ఆసరాగా చేసుకుంది ఇజ్రాయెల్. రహస్య గూఢచార వ్యవస్థ సాయంతో దాడులను ముందస్తుగా అణచివేస్తోందనీ అంటారు. ఇజ్రాయెల్ తన భద్రత చర్యల్లో భాగంగా 1967లో వెస్ట్బ్యాంక్, గాజాస్ట్రిప్లలోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది కూడా. ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఏర్పాటు కారణంగా నిర్వాసితులైన పాలస్తీని యన్లు ఎక్కువగా ఉంటారు. అంటే బలవంతంగా తమ ఇళ్ల నుంచి గెంటివేయబడిన వారన్నమాట. ఈ రకమైన చర్యలు ఇప్పటికీ కొన సాగుతున్నాయి. ఎలాగైతే ఉగ్రవాదాన్ని తమ ప్రతిచర్యగా హమాస్ ఎంచుకుందో.. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనియన్లను వారి స్వస్థలాల నుంచి తరిమేయడాన్ని ఒక పనిగా పెట్టుకుంది. సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ వాటిని ఎదుర్కొనేందుకు పాలస్తీనా మొత్తమ్మీద శక్తిమంతమైన గూఢచార వ్యవస్థను, వేగులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ అరబ్ దేశా లతోపాటు ఇరాన్ వరకూ వ్యాపించి ఉంది. గాజా చుట్టూ దుర్భేద్య మైన అత్యాధునిక ఏర్పాట్లు చేసుకున్నా హమాస్ ఇటీవల జరిపిన దాడి ఇజ్రాయెల్ శక్తియుక్తులను తక్కువ చేసి చూపుతోంది. పోటాపోటీగా హమాస్ పాలస్తీనాపై 38 ఏళ్ల ఆక్రమణ ముగిసిన రెండేళ్లకు అంటే 2005 లోనే హమాస్ సరిహద్దుల వెంబడి 45 కిలోమీటర్ల పొడవైన ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై నాలుగుసార్లు వైమానిక, భూతల దాడులు చేసింది. 2008లో మూడు వారాలపాటు కొనసాగిన యుద్ధంలో వెయ్యిమంది పాలస్తీ నీయులు మరణించగా ఇజ్రాయెల్ తరఫున 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత 2012లో ఇజ్రాయెలీలు గాజా స్ట్రిప్పై ఎనిమిది రోజులపాటు తీవ్రస్థాయి దాడులు చేశారు. అలాగే 2014లో ఆరువారాలపాటు జరిగిన యుద్ధంలో మరోసారి వైమానిక, భూతల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు రెండు వేల మంది పాలస్తీ నీయులు మరణించగా ఇజ్రాయెలీల ప్రాణనష్టమూ ఎక్కువగానే ఉందని అంచనా. 2021లో మొత్తం 11 రోజులపాటు మరోసారి ఇరు పక్షాల మధ్య యుద్ధం జరగ్గా హమాస్ రాకెట్లతో ఇజ్రాయెలీ పట్ట ణాలపై దాడులకు తెగబడింది. ప్రతిగా ఇజ్రాయెల్ గాజాను వైమా నిక, క్షిపణి దాడులతో అతలాకుతలం చేసింది. పాలస్తీనా తరఫున పోరాడిన 250 మంది, ఇజ్రాయెలీలు 13 మంది ప్రాణాలు కోల్పో యారు. తాజాగా ఈ ఏడాది మొదలైన ఘర్షణలో జరిగిన నష్టంపై ఇంకా మదింపు జరగలేదు. కాకపోతే ప్రాణనష్టం ఇరువైపులా పది వేలు ఆ పైమాటే అంటున్నారు. హింసకు హింసే సమాధానం అన్నట్టుగా సాగుతున్నాయి ఈ వ్యవహారాలు. ఈ నెల మొదట్లో జరిగిన హమాస్ దాడిలో ఇజ్రా యెల్కు జరిగిన ప్రాణనష్టాన్ని పరిగణించినా హమాస్ చేతుల్లోని బందీలను దృష్టిలో ఉంచుకున్నా ఈసారి యుద్ధం అంత ఆషామాషీగా ముగిసేది కాదని అర్థమవుతుంది. పాలస్తీనా మరోసారి దాడికి దిగ కుండా గట్టిగా బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటికే చాలాసార్లు ఇలా తీవ్రస్థాయిలో పాలస్తీనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. వాటి ఫలితాల ఆధారంగా మిలటరీ మార్గం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాజాలదని ఇజ్రాయెల్ ఇప్పటికే గుర్తించి ఉండాలి. రాజనీతిజ్ఞతా తోడవ్వాలి గాజాలో హమాస్ ప్రాభవాన్ని తగ్గించేందుకు ఒకవైపున మిలటరీ దాడులు, ఇంకోవైపున రాజకీయ చర్యలు అత్యవసరమవుతాయి. ప్రతీకార దాడులు కేవలం హమాస్ కేంద్రంగా జరిగేలా ఇజ్రాయెల్ జాగ్రత్తలు తీసుకోవాలి. పాలస్తీనీయులకు భారీ ప్రాణ నష్టం జరగడం, ఇబ్బందులకు గురికావడం హింసాత్మక చక్రం గిర్రున తిరిగేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్ అర్థం చేసు కోవాలి. ఆత్మరక్షణ విషయంలో ఇజ్రాయెల్కు ఉన్న హక్కును ఎవరూ కాదనరు. కానీ ప్రజలను నిర్బంధంలో ఉంచడం, ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా చేయడం అనేది ‘సామూహిక శిక్ష’ కిందకు వస్తుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది నేరం. ప్రస్తుతం ఇజ్రా యెల్ జరుపుతున్న బాంబుదాడుల్లో విచక్షణ అనేది ఏదీ లేదన్నది సుస్పష్టం. ఇక హమాస్ అమాయక ప్రజలను రక్షణ కవచంగా ఉప యోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా యుద్ధ నియ మాలను పాటించేలా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు చర్యలు తీసు కోవాలి. లేదంటే దక్షిణార్ధ గోళ దేశాలు పాశ్చాత్య దేశాల విషయంలో దురభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ చట్టాలు పాశ్చాత్యదేశాలు కేవలం తమ అనుకూలతకు తగ్గట్టుగా మలచుకుంటాయని ఇవి భావించే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్, దాని ప్రధాన మద్దతుదారైన అమెరికా.. పశ్చిమా సియా అనేది ఒకప్పటి అమెరికా ఆధిపత్యం చలాయిస్తున్న ప్రాంతాల్లో ఒకటి కాదని గుర్తుంచుకోవాలి. అలాగే ఇజ్రాయెల్ కూడా ఈజిప్టు, సౌదీ అరేబియా, ఖతార్... బహుశా ఇరాన్ తోనూ దీర్ఘకాలిక రక్షణ దృష్ట్యా రాజకీయపరమైన పరిష్కారాలు చేసుకోవడం మేలు. మనోజ్ జోషీ వ్యాసకర్త అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బాధితుల గోడు వినేదెవరు?
ఒకప్పుడు ప్రపంపంచంలో తన కంటూ ఒక చిరునామా లేని జాతి అది. అనేక రకాలుగా చరిత్రలో అవమానాలూ, బాధలూ ఎదుర్కొని చివరికి పాలస్తీనియన్ల చెంతకు చేరింది. తాము ఉండడానికి కాసింత స్థలం అడిగింది. తమ పవిత్ర గ్రంథం ఆ ప్రాంతం తమ పూర్వీకులదని చెబుతోందనీ,అందువల్ల ఈ ప్రాతం తమదేననీ పేచీపెట్టి పాలస్తీనియన్లతో కయ్యానికి దిగింది. అమెరికా వెన్నుదన్నుతో ఐక్యరాజ్యసమితి చేత తాను ఆక్రమించు కున్న ప్రాంతాన్ని 1947లో ఒక దేశంగా ప్రకటింపజేసుకొంది. ఆ జాతే యూదు జాతి. వారిదేశమే ‘ఇజ్రాయెల్’. ఇక ఆతిథ్యం ఇచ్చి మోసపోయిన అరబ్ ప్రజలు మాత్రం ‘పాలస్తీనా’ పేరుతో ఉన్న అతి చిన్న ప్రాంతానికి పరిమితమై అనేక అగచాట్లు పడుతూ ఇజ్రాయెల్పై దాడులకు దిగుతున్నారు. మానవాళిని పట్టి పీడిస్తున్న యుద్ధాలు మానవత్వాన్ని మట్టుపెడుతున్నాయి. జంతు దశ నుంచి నాగరికత కలిగిన ఆధునిక మానవునిగా ఎదిగిన మాన వుడు తాను అభివృద్ధి చేసుకున్న ఆయుధాలు, శాస్త్త్ర విజ్ఞానంతో తన అభివృద్ధిని తానే నాశనం చేసుకొంటున్నాడు. ఇందుకు తాజా ఉదాహరణ ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య చెలరేగిన ప్రస్తుత యుద్ధం. ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా వంటి అగ్రరాజ్య హస్తం ఉండడం మామూలయ్యింది. ఇజ్రాయెల్ను మొదటి నుంచీ అమెరికా అన్ని విధాలా వెనకేసుకొస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను భౌగోళికంగా గుర్తించకుండా కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే ఒక దేశంగా గుర్తిస్తూ 1948లో ఐక్యరాజ్య సమితితో ప్రకటన చేయించటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇజ్రాయెల్తో పాటుగా పాలస్తీనాను కూడా భౌగోళికంగా గుర్తించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదు. వారి నిర్లక్ష్య ఫలితమే నేడు ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్ రిపబ్లిక్ అయిన తర్వాత పాలస్తీనియన్లు ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించటం అనంతరం పాల స్తీనా ఓడిపోవటం జరిగింది. అయితే అప్పటినుంచీ పాలస్తీనా ప్రజల్లో అసంతృప్తి, ఆవేశం, అస్థిరత గూడు కట్టుకోవడం క్రమంగా పెరిగింది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా పాలస్తీనా తిరుగుబాటు దారులు ఇజ్రాయెల్పై దాడిచేసి హింసకు పాల్పడుతున్నారు. అందులో భాగమే ఇటీవల వందలాది రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్ను బెంబేలెత్తించిన ఘటనను చూడాలి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు మద్దతుగా ఐదు అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగాయి. కాని, ఇజ్రా యెల్ అరబ్ దేశాలపై విజయం సాధించింది. ఐక్యరాజ్య సమితి పాల స్తీనా సమస్యను ప్రపంచ శాంతి భద్రతల సమస్యగా పరిగణించి పరిష్కరించకపోవటం చారిత్రక తప్పిదంగా చెప్పుకోవాలి. తమ సొంత భూభాగంలోనే ఒక మూల పరాయి వాళ్లుగా జీవించవలసి రావడం, గాజాను దాటాలంటే ఇజ్రాయెల్ ఆధికారుల అనుమతి తీసుకోవలసి ఉండడం, తనిఖీల పేరుతో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం ఇబ్బంది పెట్టడం, తమ ఆంక్షలను ధిక్కరిస్తే అమాన వీయంగా చంపివేయడం, ఇళ్లను కూల్చడం వంటి అనేక అంశాలు స్వతంత్ర పాలస్తీనా కోరికను మరింత బలపడేలా చేసింది. గాజాలోని ‘‘అల్ అఖ్సా’’ మసీదులోకి వెళ్ళాలంటే కూడా ఇజ్రాయెల్ పోలీసుల అనుమతి తీసుకొని రావాల్సి ఉండటం పాలస్తీనియన్లకు అత్యంత బాధ కల్గిస్తున్న విషయం. ఈ క్రమంలోనే ‘పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్’, ‘పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’, ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్’ వంటి సంస్థలు ఆవిర్భవించాయి. యాసర్ అరాఫత్ నేతృత్వంలో (1969–2004) ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య 1993, 1995లలో శాంతి ఒప్పందాలు కుదిరాయి. దీంతో 1994లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఇత్జాక్ రాబిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి షిమన్ పెరెస్, పాలస్తీనా విమోచనా సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్లకు నోబెల్ శాంతి బహుమతి సంయుక్తంగా లభించింది. అయితే 1995లో రాబిన్ హత్యకు గురయ్యాడు. అనంతరం జరిగిన పరిణామాల్లో 2004లో యాసర్ అరాఫత్ అనుమానాస్పదంగా మరణించాడు. ఫలితంగా సమస్య మళ్ళీ మొదటి కొచ్చింది. రెండు వైపులా రైట్ వింగ్కు చెందిన వారు సమస్యను ప్రస్తుత స్థితికి సాగదీస్తూ వచ్చారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యను రెండు ప్రాంతాల మధ్య మత ఘర్షణలుగా చూడడం సరికాదు. పాలస్తీనియన్లు భౌగోళికమైన ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంగా మాత్రమే పరిగ ణించాలి. ‘భద్రతలను కలిగి ఉండటం వలన వ్యక్తిలో ఉద్భవించే మానసిక ప్రశాంతతయే స్వేచ్చ’ అంటాడు అమెరికన్ రాజకీయవేత్త మాంటెస్క్యూ. ఇక్కడ పాలస్తీనీయన్లు అభద్రతాభావానికి గురైన సందర్భంలోంచి వచ్చినదే నేటి ‘హమాస్’ సంస్థ. ‘ఆరు భద్రతా మండలి తీర్మానాల’నూ, 1993 పాలస్తీనాతో జరిగిన ‘‘ఓస్లో’’ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. పైగా ఐక్యరాజ్యసమితి లోని వీటో అధికారం కల్గిన దేశాల మద్దతుతో తరచుగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను ఉగ్రవాదం పేరుతో వేధించటం, చంపటం, పాల స్తీనా భూభాగాన్ని ఆక్రమించటం చేసింది. పాలస్తీనాతో ఘర్షణ తలెత్తిన దాదాపు ప్రతిసారీ ఎంతో కొంత వారి భూభాగాన్ని ఆక్రమించడం పనిగా పెట్టుకొంది ఇజ్రాయెల్ ఆ విధంగా ఇజ్రాయెల్ తన భూభాగాన్ని విస్తరిస్తూపోయి పాలస్తీనా ప్రజలను కొన్ని మైళ్ల భూభాగానికి పరిమితం చేసింది. అందుకే పాలస్తీనియన్లలో ఇజ్రా యెల్ అంటే విపరీతమైన ద్వేషం! ఆ ద్వేషం మరోసారి ప్రకోపించి ఇజ్రాయెల్పై తాజా దాడికి దారితీసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజ మిన్ నెత న్యాహూ ఈ సందర్భాన్ని అచ్చమైన రాజకీయ నాయకునిగా తనకు అనుకూలంగా మలచుకొంటున్నాడని విశ్లేషకుల మాట. తనపై ప్రజలలో పెరుగుతున్న అసమ్మతిని పాలస్తీనియన్లపై భీకర యుద్ధం చేయడం ద్వారా తగ్గించి, వారిని మళ్ళీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వారి అభిప్రాయం. యుద్ధం ఎవరి వైపు నుండి మొద లైనా నష్టపోయేది సాధారణ పౌరులే, సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు, ఇతర భవనాలూ పేకమేడల్లా కూలుతున్న దృశ్యాలూ, శిథిల భవనాల్లోంచి వినిపిస్తున్న చిన్న పిల్లల, మహిళల, వృద్ధుల హాహాకారాలూ మనసును చలింపజేసే విధంగా ఉన్నాయి. ప్రపంచ శాంతి కోసం పుట్టుకొచ్చిన ఐక్యరాజ్య సమితి కోరలు లేని సింహం అయినందు వల్లనే ఇవాళ ప్రపంచంలో అనేక చోట్ల అశాంతి, అభద్రతలు రాజ్యమేలుతున్నాయి, ఒక్క ఇజ్రాయెల్ – పాలస్తీనా ప్రాంతమే కాదు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, చైనా – వియత్నాం సమస్య, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, చైనా – అమె రికా, ఉత్తర కొరియా – అమెరికాల మధ్య కొనసాగుతున్న వివా దాలూ, అలాగే భారత్ – చైనా సరిహద్దు వివాదం, భారత్ – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ‘కశ్మీర్’ సరిహద్దు వివాదం... వంటివన్నీ ఐక్య రాజ్యసమితి నిష్క్రియాపరత్వం, బలహీనతల కారణంగా భవిష్య త్తులో ఏదో ఒకరోజు అగ్ని పర్వతం బద్దలైనట్లుగా హింసకు దారి తీసేవే అనేది విశ్లేషకుల అంచనా. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలపై జరిగిన దాడి తర్వాత అమెరికా ‘అల్ ఖైదా’ ఉగ్రవాదు లపై యుద్ధం పేరుతో ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టడం పైకి చూడడానికి బాగానే ఉన్నా ఈ పని చేయవలసింది ఐక్యరాజ్యసమితి. కానీ అమెరికా ఆర్థిక సహాయంపై అధికంగా ఆధారపడి ఉన్న ఐరాస నోరు మెదపకుండా ఉండిపోయింది. అలాగే ఇరాక్ ప్రమాదకర జీవ రసాయన ఆయుధాలు తయారు చేసిందని దానిపై దాడిచేసి పాలకుడైన సద్దాం హుస్సేన్ను ఉరితీయించడం వంటి దుశ్చర్యలు సూపర్ పవర్గా ఎదిగిన దేశం తన ఇష్టం వచ్చినట్లు చిన్న దేశా లపైనా, ప్రజా ఉద్యమాలపైనా ఉక్కుపాదం మోపిందని చెప్పడానికి ఉదాహరణ. ఐక్యరాజ్య సమితి బలంగా ఉంటే ఇటువంటి సంఘ టనలు చోటు చేసుకునేవేనా? ఇక ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్య దగ్గరకు వస్తే... దీన్ని అత్యంత పాధాన్యం గల అంతర్జాతీయ సమస్యగా అన్ని దేశాలూ పరిగణించాలి. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే ఐక్యరాజ్య సమితి కొంత వరకూ పాలస్తీనియన్లకు అండగా నిలిచే అవకాశం ఉంది. పది సంవత్సరాల పాలస్తీనా బాలిక నేలమట్టమైన ఇంటి ముందు నిలబడి ‘నేను ఏం పాపం చేశాను? ఏం తప్పు చేశాను? నా వాళ్ళందరూ ఇజ్రాయెల్ సైన్యం దాడిలో చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి’ అని ప్రపంచాన్ని ప్రశ్నించింది. దీనికి ఎవరు, ఏమని సమా ధానం చెబుతారు ఆ చిట్టి తల్లికి? డా‘‘ మహ్మద్ హసన్ వ్యాసకర్త నల్గొండ ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకుడు -
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
చేరువ కానివ్వని విరోధం!
ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితులమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు వారి వారి కరడుగట్టిన సమూహాలు వారిని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. ఇంకా అధ్వాన్నమైన సంగతి ఏమిటంటే... వారి స్నేహితులు, మిత్ర పక్షాలు.. వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. ఇజ్రాయెల్–పాలస్తీనా వ్యవహారాలు నాకు ఏ విధంగానూ అంతుబట్టనివి. నిజానికి ఆ రెండు దేశాల మధ్య వివాదం గురించి నాకు తెలిసిన రవ్వంత కూడా నేను ఈ రెండు మూడు వారాలుగా తెలుసుకుంటూ వచ్చినదే. అయితే ఆ తెలివిడి నాకు ప్రశ్నలు అడిగేందుకు సరిపోయేదే తప్ప, జవాబులు ఇవ్వగలిగేటంతటిది కాదు. అయినప్పటికీ ఆ మాత్రపు జ్ఞానం నాలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచి దానిని నేను పూర్తిగా విశ్వసించేలా క్రమంగా నాలో నమ్మకాన్ని పెంచుతూ వచ్చింది. ఈ ఉదయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నది ఇదే. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితు లమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. అయితే బాధ కంటే కూడా గర్వమే తరచూ ఆ ప్రభామండలం చుట్టూతా కాంతిలా ప్రకాశిస్తూ కనిపిస్తోంది. చరిత్రపై తమ దృష్టికోణమే నరైనదనే నమ్మకంతో, ఎవరికివారు స్వీయ నైతిక వర్తనను కలిగి ఉన్నామన్న విశ్వాసాన్ని సమానంగా కలిగి ఉన్నారు. వారు వర్తమానాన్ని ఎలా చూస్తున్నారన్న విషయంలోనూ ఇదే నిజం. ‘అవతలి’ దేశం తమ పట్ల ఘోరమైన తప్పిదాలకు ఒడిగట్టిందని ఆ రెండు దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అయితే వారు అంగీకరించలేని విషయం ఏమిటంటే... శత్రువు పట్ల తాము వ్యవహరిస్తున్న తీరులో ఇద్దరూ కూడా సరి సమానంగా దోషులేనన్నది! తమకేదైతే జరిగిందో సరిగ్గా అదే తమ ప్రత్యర్థికీ జరిగిందని వారు అంగీకరించరు, అంగీకరించబోరు. ఆ విధమైన ‘సమాన త్వాన్నే’ వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. అందుకే చాలా తక్కువ మినహాయింపులతో – వాస్తవానికి మీరు వాటిని బహుశా చేతి వేళ్లపైన కూడా లెక్కించవచ్చు – ఇంటర్వ్యూలన్నీ భయానకమైన ఏకపక్ష ధోరణితో ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రశ్న వేసినా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆహ్వానిత పాలస్తీనీయుడు ఆ ప్రశ్నకు జవాబుగా ఇజ్రాయెల్ను తీవ్రంగా విమర్శిస్తూ తామెంత ధర్మ బద్ధులో, రుజు ప్రవర్తన కలిగినవారో చెప్పుకుంటారు. ఒక ఇజ్రాయె లీని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కచ్చితంగా ఇదే విధమైన స్వీయ సమర్థన వైఖరి వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ! ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభంపై పద్నాలుగు రోజులలో పది ఇంటర్వ్యూల తర్వాత... ఈ రెండు వర్గాల వారు ఒకే భూమిపై – నిస్సందేహంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూనే, గాయాల రక్తం ఓడుతూనే – కలిసి ఉంటూ కూడా భిన్న ప్రపంచాలలో జీవిస్తున్నారని నేను గ్రహించాను. పర్యవసానంగా తమ భిన్న చరిత్రల నుంచి మాత్రమే కాకుండా తాము పంచుకున్న చరిత్రల నుంచి కూడా వారు అంగీకరించిన కఠిన సత్యాలతో వారికొక జగమొండి ప్రాపంచిక దృష్టి కోణం ఏర్పడింది. తర్వాత అది వర్తమానంలోని విరుద్ధ కోణాలతో బలోపేతం అయింది. వాస్తవాలు ఒకేలా ఉన్నప్పటికీ వాటి అర్థ, వివరణలు పూర్తిగా భిన్నమైనవి. విచారకరమైన వాస్తవం ఏంటంటే – ఈ రెండు దేశాల స్నేహి తులు, మిత్రపక్షాలు దేనికి దానిని విడిగా చూడటం అనే ఏక వైఖరి దృష్టి కోణానికి లోబడి ఉండటం. ‘ఏంటిది?!’ అని పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ను ఏమాత్రం నిలదీయకుండా భూత వర్తమానాలపై ఆ దేశపు దృష్టి కోణాన్ని అంగీకరిస్తుండగా, మధ్యప్రాచ్యంలోని అరబ్, ముస్లిం దేశాలు పాలస్తీనా పట్ల తమ తమ అవగాహనలపై ఒకే విధమైన నిబద్ధతతో నిలబడి ఉన్నాయి. పర్యవసానంగా మీరు ఎవరికి మద్ధతు ఇస్తున్నారనేది మీరెలాంటి ఆలోచనను కలిగివున్నారన్న దానిని మాత్రమే కాక, జరుగుతున్న పరిణామాల పట్ల మీ స్పందనను కూడా నిర్ధారణగా తెలియజేస్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ తోక పశ్చిమ కుక్కను ఊపుతుంది, అదే సమయంలో పాలస్తీనా తోక మధ్యప్రాచ్య కుక్కల్ని గుర్రుమని చూసేలా, మొరిగేలా ప్రేరేపించి వాటిని రెచ్చగొడుతుంది. బహుశా అందుకే పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాదం నేడు మనం ఎదుర్కొంటున్న వాటన్నింటిలోనూ కొంచెమైనా కొరుకుడు పడని అత్యంత కఠినమైన పరిస్థితిగా పరిణమించింది. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు కూడా వారి వారి కరడుగట్టిన సమూహాలు ఆ సంశయా త్మక ప్రారంభ ఉద్దేశాన్ని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. బహుశా అధ్వాన్నమైన విషయం ఏమిటంటే వారి స్నేహితులు, మిత్ర పక్షాలు... వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. శత్రుత్వ విరమణ కోసం, స్వల్పకాలిక అర్భక ఒప్పందాల కోసమైతేనే నెడతాయి. కానీ ఏదైనా – అసలు స్వరూపాలకు భిన్నంగా నిజాయితీతో అడుగు వేసినప్పుడు మాత్రమే సాధ్యం అయ్యే – దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రం నెట్టవు. అందుకే నేను చేసిన గత రెండు వారాల ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా ఉన్నాయి తప్పితే, ఆశాజనకంగా ఏమీ లేవు. పైగా నిస్పృహను కలిగించేలా ఉన్నాయి. నిజానికి, చెరగని విధంగా వారు వేసిన ముద్రే ఇక ఎటువంటి ఆశల్నీ పెట్టుకోలేని మనఃస్థితికి కారణం అయింది. ఇజ్రాయెల్–పాలస్తీనా ఊబిని బాగు చేయడం, ఆ సమస్యను పరిష్క రించడం అసాధ్యంలా కనిపిస్తోంది. నా భయం ఏంటంటే అనంతంగా అది నిరంతరం సాగిపోతూనే ఉంటుందని! రేపన్నది మిగతా ప్రపంచానికి మరొక రోజు కావచ్చు కానీ ఇజ్రాయెల్–పాలస్తీనాలకు మార్పును వాగ్దానం చేయని రోజూ ఉండే ఒక రోజే! కాబట్టి మనం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆలోచించండి. భీకరమైన హమాస్ దాడి ఇజ్రాయెల్ ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేసి,ఆ దాడిని తిప్పి కొట్టాలన్న ఆగ్రహ జ్వాలల్ని రగిల్చినందువల్ల – సాధ్యమైతే – ఏకంగా హమాస్ను తుడిచిపెట్టాలన్న ఇజ్రాయెల్ ప్రతీకారం వల్ల తీవ్రమైన మనోవేదన, ఎంతకూ తరగని బాధ మాత్రమే మిగిలి అనివార్యంగా అది భవిష్యత్తులో అధ్వాన్న పరిస్థితికి పునాదులు వేస్తుంది. ఇది దేనిని సూచిస్తోంది? అత్యంత విచార కరమైన, శోచనీయమైన ముగింపు ఏమిటంటే ఈ అంతులేని కథలో మరొక విషాద అధ్యాయానికి పునాది పడబోతుండటం! భవిష్యత్తు ప్రతిసారీ కూడా తిరిగి మనల్ని గతంలోకే తీసుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దద్దరిల్లుతున్న దక్షిణ గాజా
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ గాజా గజగజలాడుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించడం తెలిసిందే. దాంతో అంత మందీ నానా పాట్లు పడి అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అక్కడి ఖాన్ యూనిస్ నగరంతో పాటు పలు ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ క్షిపణులు వచ్చి పడుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. దాడుల్లో ఇప్పటికే కనీసం 4,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. 13 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు వివరించింది. ఇజ్రాయెల్లో ఇప్పటిదాకా 1,500 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు గాజాపై భూతల దాడికి అన్ని విధాలా ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. లెబనాన్ వైపు సరిహద్దుల్లో ఉన్న పెద్ద పట్టణాలను ఆగమేఘాల మీద ఖాళీ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్ ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దుల వెంబడి తన నగరాలు, ఆవాసాలను ఖాళీ చేయిస్తోంది. హమాస్కు నేరుగా దన్నుగా బరిలో దిగాలని లెబనీస్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లా నిర్ణయం తీసుకుందని ఇజ్రాయెల్ తాజాగా ఆరోపించింది. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. హెజ్బొల్లా ఇప్పటికే దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్పై అక్టోబర్ ఏడో తేదీన మెరుపుదాడికి దిగిన సందర్భంగా బందీలుగా పట్టుకున్న వందలాది మందిలో ఇద్దరు అమెరికన్లను హమాస్ తాజాగా విడుదల చేసింది. జుడిత్ రానన్, ఆమె 17 ఏళ్ల కూతురు నటాలీ హమాస్ చెర నుంచి బయటపడ్డట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. కీలక భేటీ యుద్ధాన్ని ఆపే మార్గాంతరాలపై డజనుకు పైగా ప్రాంతీయ, పాశ్చాత్య దేశాలకు అధినేతలు, నేతలు, ఉన్నతాధికారులతో ఈజిప్ట్ శనివారం సమావేశం నిర్వహించింది. యుద్ధానికి తెర వేయడం, వీలుకాని పక్షంలో కనీసం కాల్పుల విరమణకైనా ఇరు వర్గాలను ఒప్పించే మార్గాంతరాలపై నేతలు చర్చించారు. ఇందులో ఇటలీ, పెయిన్, గ్రీస్, కెనడా ప్రధాన మంత్రులతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు పాల్గొన్నట్టు ఈజిప్ట్ ప్రభుత్వం పేర్కొంది. ఖతర్, యూఏఈ తదితర దేశాల ఉన్నత స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. మరోవైపు, ఇరాక్ నుంచి తక్షణం అమెరికా బలగాలు పూర్తిగా వైదొలగాలని ఇరాన్ దన్నున్న స్థానిక మిలిటెంట్ సంస్థలు హెచ్చరించాయి. థన్బర్గ్ ట్వీట్కు దీటుగా బదులిచి్చన ఇజ్రాయెల్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్ చేసిన ట్వీ ట్కు ఇజ్రాయెల్ గట్టి సమాధానం ఇచి్చంది. యు ద్ధంపై పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్ చేసిన ట్వీట్కు ఇజ్రాయెల్ దీటుగా బదులిచి్చంది. గాజాకు మద్దతుగా కొందరు వ్యక్తులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న చిత్రాన్ని థన్బర్గ్ ట్వీట్చేశారు. ‘పాలస్తీనా, గాజాకు మద్దతిస్తున్నాం. పోరుపై ప్రప ంచం స్పందించాలి. పాలస్తీనా ప్రజలు, ఇతర బాధితుల కోసం కాల్పుల విరమణ ప్రకటించాలి. న్యా యం, స్వేచ్ఛ కోసం పిలుపు ఇవ్వాలి’ అని గ్రేటా ట్వీట్చేశారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘హమాస్ దాడుల వల్ల ఎంతోమంది అమాయకులై న ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధ బాధితుల్లో మీ స్నేహితులూ ఉండొచ్చు. వారి కోసం పోరాడండి’ అని వ్యాఖ్యానించింది. -
చేతులు కాలకముందే...
ఆగ్రహం ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు. కానీ సంయమనం మరిచి ఆగ్రహకారకుల్ని నిర్మూలించాలనుకోవటం ఉన్మాదమవుతుంది. చివరికది స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది. ఈ విషయంలో అమెరికాకు చాలా అనుభవం ఉంది. అందుకే కావొచ్చు ఇజ్రాయెల్కు సంఘీభావంగా పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన సలహా ఎంతో విలువైనది. ఆగ్రహాగ్నిని సకాలంలో చల్లార్చుకోనట్టయితే అది మిమ్మల్నే దహిస్తుందని చెప్పటమే కాదు... ఉగ్రదాడి తర్వాత అమెరికా తీసుకున్న చర్యలు ఎలా పరిణమించాయో గుర్తు చేశారు. ఈనెల 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా వందలమందిని హతమార్చటాన్ని ఎవరూ సమర్థించలేదు. అదే సమయంలో దాడి కార కులపై అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చర్య తీసుకోవాలని ఇజ్రాయెల్ను కోరారు. మిలిటెంట్లు రెచ్చిపోయి నప్పుడో, దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడో ఇజ్రాయెల్ అతిగా వ్యవహరించి పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీస్తుండటం దశాబ్దాలుగా రివాజైంది. వెస్ట్బ్యాంక్, గాజా, లెబనాన్లపై అపాచే హెలి కాప్టర్లు, ఎఫ్–16 యుద్ధ విమానాలతో క్షిపణుల వర్షం కురిపిస్తూ ఆసుపత్రులు, స్కూళ్లు, జనావా సాలు నేలమట్టం చేసిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ఇలాంటి సమయాల్లో క్షతగాత్రుల్ని ఆదుకోవ టానికీ, ఇతరత్రా సాయం అందించటానికీ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కూడా అనుమతులు లభించవు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. మందులు, ఆహారపదార్థాలు అందించ టానికి ఈజిప్టువైపునున్న సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు రెండురోజులుగా నిలిచిపోయాయి. మరోపక్క ఇజ్రాయెల్ భీకర దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒక ఆసుపత్రిపై జరిగిన రాకెట్ దాడిలో 500 మంది చనిపోయారు. ఇప్పటికే దాదాపు అయిదువేల మంది పాలస్తీనా పౌరులు చనిపోగా, పదివేలమంది గాయాలపాలయ్యారు. హమాస్ ప్రయోగించిన రాకెట్ గురి తప్పి ఆసుపత్రిపై పడిందని ఇజ్రాయెల్, అది ఇజ్రాయెల్ దళాల పనేనని హమాస్ అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ హితవచనం కీలకమైనది. కానీ ఆసుపత్రిపై జరిగిన దాడి విషయంలో ఇజ్రాయెల్ను వెనకేసుకు రావటం సరైందేనా? యుద్ధమంటూ మొదలయ్యాక కారకులు ఎవరో వెంటనే గుర్తించలేకపోవటం సర్వసాధారణం. కనీసం ఆ సంగతి తేలేవరకూ కూడా ఆగకుండా ఇజ్రాయెల్ వాదనను సమర్థించటం న్యాయమేనా? వేలాదిమంది క్షతగాత్రులకు వైద్య సాయం నిలువరించి, పదిలక్షల మందిని ఆకలిదప్పుల్లో ఉంచటం సమస్యను చక్కదిద్దగలదని ఆయన విశ్వసిస్తున్నారా? ఈ విషయంలో ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టాల్సిన అవసరం లేదా? హమాస్ చెరలో బందీలుగా వున్న 200 మందినీ విడుదల చేసేవరకూ గాజాకు ఏ రకమైన మానవతా సాయం అందనీయబోమని నెతన్యాహూ చేసిన ప్రతిన ఏ నాగరిక ప్రమాణాలతో చూసినా నిర సించదగ్గది. ఇజ్రాయెల్ రక్షణకు కావాల్సిన ‘అసాధారణ ప్యాకేజీ’ కోసం అమెరికన్ కాంగ్రెస్లో ప్రతి పాదిస్తానని చెబుతున్న బైడెన్కు సాధారణ ప్రజానీకం గోడు పట్టిన దాఖలాలు లేవు. 2001లో అమె రికాపై ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలతో తమకు న్యాయం దక్కిందని, ఆ క్రమంలో తప్పులు కూడా జరిగాయని ఆయన అంగీకరించటం మంచిదే. ఆనాడు ఇరాక్పై దురాక్రమణ యుద్ధానికి సెనెటర్గా ఆయన కూడా మద్దతునిచ్చారు. అది ఇరాక్ వినాశనానికే కాక, అమెరికా ఆర్థిక పతనానికి సైతం కారణమైంది. ఈ చేదు అనుభవాలను బైడెన్ పరోక్షంగా ప్రస్తావించటంకాక కుండబద్దలు కొట్టినట్టు చెప్పివుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అక్షరాలా ఉగ్రరూపం దాల్చింది. గతంలో కేవలం ఒకే ఒక సైనికుడి కోసం వేయిమంది పాలస్తీనా పౌరులను విడిచిపెట్టిన ఆ దేశం... హమాస్ చెరలో 200 మంది ఇజ్రాయెల్ పౌరులుండగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో బందీగా ఉన్న యువతి షెమ్ వీడియో తెలియజేస్తోంది. బాంబుల మోతలతో తాము చావుబతుకుల్లో బిక్కుబిక్కుమంటూ వున్నామని, తమను రక్షించటానికి పూనుకోవాలని ఆమె వేడుకుంటోంది. వాస్తవానికి ఇంకా సైన్యం భూతల దాడులకు దిగ లేదు. అది మొదలైతే ఇంకెన్ని వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో అనూహ్యం. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 6 వేల మంది పాలస్తీనా పౌరుల విడుదల, భూతల దాడుల ప్రయత్నాలకు స్వస్తి హమాస్ డిమాండ్లు. పాలస్తీనాలో శాంతి స్థాపన ఇజ్రాయెల్, హమాస్లకు లేదా పశ్చిమాసియాకు మాత్రమే కాదు... అమెరికాకు కూడా అత్యవసరం. ఇజ్రాయెల్ తన మతిమాలిన చర్యల ద్వారా ఇప్పటికే సంక్షోభాన్ని మరింత పెంచింది. ఇజ్రాయెల్కు అండగా ఉన్నట్టు కనబడకపోతే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఇంటిదారి పట్టాల్సివస్తుందని బైడెన్ భయపడుతూ ఉండొచ్చు. కానీ ఆ పని చేస్తే అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు పీటముడి వేయాలన్న అమెరికా లక్ష్యం గల్లంతవుతుంది. గాజా ఆసుపత్రిపై మారణకాండ తర్వాత ఆ ఛాయలు కనబడుతూనే వున్నాయి. సౌదీ అరేబియా–ఇజ్రాయెల్ మైత్రికి సంబంధించిన యత్నాలు కొన్ని వారాల క్రితమే ఫలించగా, అవి కాస్తా నిలిచి పోయాయి. ఇరాన్తోనూ ఒప్పందం కుదర్చాలని అమెరికా తహతహలాడింది. దానికి కూడా గండి పడింది. బైడెన్తో జరగాల్సిన సమావేశాన్ని పాలస్తీనా నాయకుడు మహమ్మద్ అబ్బాస్ రద్దు చేసుకున్నారు. జోర్డాన్, ఈజిప్టు దేశాల్లో బైడెన్ రెండో దశ పర్యటన వాయిదా పడింది. భూతల దాడులు మొదలైతే అరబ్ దేశాల్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుని, ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది. దాన్ని నివారించటమే అమెరికాకైనా, మరొక దేశానికైనా అంతిమ లక్ష్యం కావాలి. -
గాజాపై ఇజ్రాయెల్ ఆధిపత్యం.. జో బైడెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వాషింగ్టన్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కారణంగా వేల సంఖ్యలో పౌరులు, మిలిటెంట్ల మృత్యువాతపడ్డారు. ఇక, హమాస్ దాడులను ఇజ్రాయెల్ గట్టిగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ ప్రతిదాడితో గాజా వణికిపోతోంది. ఇప్పటికే పలువురు గాజాను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. హమాస్ మిలిటెంట్లను కూడా ఇజ్రాయెల్ బంధించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ బలగాలు సుదీర్ఘకాలం గాజాలో ఉండటం పెద్ద పొరబాటుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని సూచించారు. గాజాను ఇజ్రాయెల్ తన ఆధీనంలో ఎక్కవ కాలం ఉంచుకొంటుందని తాను భావించడంలేదన్నారు. అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలోనే అక్కడి పాలన నిర్వహించాలన్నారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందన్నారు. ప్రస్తుతం గాజా పరిస్థితి చూడండి.. హమాస్ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు అని తెలిపారు. US President Joe Biden said that Israel taking control of the Gaza Strip would be 'a big mistake', but Tel Aviv 'must respond' and 'go after Hamas' after the movement launched attacks aimed at entered Israel last weekend. #Israel, #PalestineGenocide, #HamasisISIS, #USA, #Gaza pic.twitter.com/bY0veoQRih — SamTin❤️🍀 (@Dng21509147) October 16, 2023 ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్లో జో బైడెన్ పర్యటిస్తారన్న వార్తలపై వైట్ హౌస్ స్పందించింది. ఈ సందర్బంగా వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదివారం కూడా జోబైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ దాడుల తర్వాత ఆయన ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడటం ఇది ఐదోసారి. -
శాంతి అనిత్యం, యుద్ధమె నిత్యం
బతుకు–చావు, యుద్ధమూ–శాంతి, ప్రేమ–విద్వేషం, కారుణ్యం–కర్కశత్వం... ఇవి పరస్పర వ్యతిరిక్తాలూ, ఒకదానికొకటి ఎంతో దూరాలూ అనుకుంటాం. కానీ, వాస్తవంలో ఎంత దగ్గరగా ఉంటాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతుకును అంటిపెట్టుకునే చావు ఉంటుందని తెలిసినా; అది హత్యో, ఆత్మహత్యో, యుద్ధం పేరిట సామూహిక హత్యో కాక, సహజ మరణమైతే, ఆ దారి వేరు. బతుక్కీ, చావుకీ మధ్య ఉంటుందనుకునే దూరాన్ని చెరిపివేస్తూ హఠాత్తుగా యుద్ధాలు బద్దలవుతాయి. ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య పదిరోజుల క్రితం మొదలైన యుద్ధం ఇప్పటికే వేలసంఖ్యలో బతుకు దీపాలను ఆర్పివేసింది. బతుకునిచ్చే అమ్మతనాన్ని భక్తితో స్మరించుకుంటూ తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో అమ్మవారిని మన దగ్గర కొలుచుకోనున్న రోజుల్లోనే, అక్కడ ఆ మూల సమరనాదాలు, తల్లుల గర్భశోకాలు మిన్నంటడం వైచిత్రి. అమ్మ ఎక్కడైనా అమ్మే! అమ్మకు, అమ్మతనానికి ప్రాంత, మత, భాషాభేదాలు లేవు. చారిత్రకంగా చూసినా ఒకప్పుడు ప్రపంచమంతటా మొదటగా కొలుపులందుకున్నది అమ్మే; అయ్య కొలుపు ఆ తర్వాతే వచ్చింది. అమ్మ అంటే అన్నమూ, అభయమూ కూడా! అమ్మవారిని ధనలక్ష్మిగాను, ధాన్యలక్ష్మిగానూ కూడా భావించుకుంటాం. అమ్మ చేతుల్లో వరికంకులను, చెరుకుగడలను అలంకరిస్తాం. అమ్మకు రకరకాల అన్నాలు ఇష్టమని చెప్పి నివేదించి ఆ అన్న ప్రసాదాలను మనమే ఆరగిస్తాం. మన దగ్గరే కాదు, ఒకప్పుడు అమ్మ ఆరాధన ఉన్న ప్రతిచోటా అమ్మను అన్నానికి ప్రతీకగానే కొలిచారు. అమ్మను బతుకమ్మ అనడంలోనే, పది కాలాలపాటు సుఖశాంతులతో బతికించే అమ్మ ఆశీస్సు ఉంది. అమ్మను కొలుస్తూనే అమ్మ మనసుకు దూరమై యుద్ధానికి దగ్గరవడమే మనిషి జీవితంలోని పెను విషాదం. తను దగ్గరవడమే కాదు; అన్నసాధనాలు ధరించిన అమ్మ చేతుల్లో కూడా ఆయుధాలు ఉంచి; అన్నపూర్ణను ఆయుధపూర్ణగా మలచిన చరిత్ర మనిషిది. మానవ చారిత్రక ప్రస్థానంలో ఇది ఎప్పుడు మొదలైందో కానీ, ఇప్పటికీ తనకు యుద్ధమే కావాలో శాంతే కావాలో తేల్చుకోలేని సందిగ్ధంలోనే మనిషి ఉన్నాడు. యుద్ధానికీ, శాంతికీ మధ్య మనిషి చక్రభ్రమణం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. యుద్ధమే ప్రధానమై శాంతి ఎంత అప్రధానమైందంటే,రెండు యుద్ధాల మధ్య తాత్కాలిక విరామాన్నే శాంతిగా నిర్వచించుకునే పరిస్థితికి వచ్చాం. శాంతికాలంలో యుద్ధాన్ని జపించడం, యుద్ధకాలంలో శాంతిని స్మరించడం మనిషికి పరిపాటిగా మారింది. యుద్ధం కడుపున శాంతిశిశువును, శాంతి కడుపున యుద్ధశిశువును కోరుకోవడమూ అంతే నిత్యసత్యమైంది. యుద్ధమొచ్చి శాంతిని చెదరగొడుతున్నట్టు భ్రమిస్తాం కానీ; వాస్తవానికి శాంతే మధ్య మధ్య వీచే మలయమారుతమై ప్రచండమైన యుద్ధపు వేడిగాడ్పులకు అవరోధ మవుతోందన్న ఎరుక మనకు లేదు. యుద్ధమే ఇక్కడ శాశ్వతంగా తిష్ఠవేసిన చుట్టమై; శాంతి ఎప్పుడైనా తొంగిచూసే అతిథి మాత్రమైంది. యుద్ధమనే ఎడారిలో శాంతీ, సుఖసంతోషాల ఒయాసిస్లను లియో టాల్స్టాయ్ నవల ‘యుద్ధమూ–శాంతీ’ అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. అమెరికా అంతర్యుద్ధం దరిమిలా ఎంత విధ్వంసం జరిగిందో, ఎందరి బతుకులు తలకిందులయ్యాయో మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’ అనితరసాధ్యంగా చిత్రిస్తుంది. ఇంకా వెనక్కి, మహాభారతానికి వెడితే, యుద్ధాన్ని యజ్ఞంగా పేర్కొని పవిత్రీకరించడమే కాదు; రోగమొచ్చి చావడం కన్నా యుద్ధంలో చావడం పరమపుణ్యప్రదమని కీర్తించడం కనిపిస్తుంది. చివరికది అపార జననష్టంతో పాటు, యోధజాతి మొత్తం ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఒక మహావిలయ సదృశంగా చిత్రిస్తుంది. అందులోని స్త్రీపర్వం మొత్తం భర్తలను, కొడుకులను, తండ్రులను, సోదరులను కోల్పోయి గుండెలు బాదుకునే స్త్రీ నిర్భరశోకాన్ని కరుణ రసార్ద్రంగా వినిపిస్తుంది. ఆ దుఃఖం గాంధారినోట శాపంగా మారి యాదవకుల విచ్ఛిత్తి రూపంలో మరో విధ్వంసం వైపు నడిపిస్తుంది. యుద్ధాన్ని ఆకాశానికెత్తిన మహాభారతమే, దాని విపరీత పర్యవసానాలను ఎత్తిచూపి సామాన్యులూ, మాన్యులైన మునులూ కూడా తీవ్రంగా గర్హించిన సంగతినీ నమోదు చేయడం విశేషం. యుద్ధపశ్చాత్తాపం జీవితాంతమూ ధర్మరాజును ఎంతగా వెన్నాడుతూ వచ్చిందంటే, అశ్వమేధయాగాన్ని తలపెట్టి అర్జునుని అశ్వం వెంట పంపిస్తూ, రాజులను ఓడించు కానీ ప్రాణనష్టం మాత్రం కలిగించవద్దని హెచ్చరించవలసి వచ్చింది. ప్రాంతాలు, మతాలు, సంస్కృతులు, భాషల మధ్య ఎక్కడా కనిపించనంత సాదృశ్యం యుద్ధాలలో కనిపిస్తుంది. యుద్ధరూపంలోని ఊచకోత ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్ చెప్పిన ఇలియడ్ అచ్చం మహాభారతానికి ప్రతిబింబంలా ఉంటుంది. అది చిత్రించిన ట్రాయ్ యుద్ధం చివరిలో కూడా అయినవారిని కోల్పోయిన తల్లులు, భార్యల దుఃఖారావాలూ, ఆర్తనాదాలూ గుండెల్ని పిండివేస్తాయి. ఇన్ని అనుభవాలున్నా; ఇన్నిన్ని శోకసముద్రాలు కట్టలు తెంచుకున్న ఉదాహరణలు కళ్ళముందున్నా మనిషిలో యుద్ధోన్మాదం ఉపశమించలేదు; సమర మోహం తీరలేదు; రుధిరదాహం చల్లారలేదు. శాంతియుతంగా జీవించడం మనిషి ఇప్పటికీ నేర్చు కోలేదు. యుద్ధంలో చివరికి అటూ ఇటూ విజితులే తప్ప విజేతలెవరూ ఉండరనీ; మిగిలేవి శవాలూ, జీవచ్ఛవాలు మాత్రమేనన్న నిష్ఠురసత్యాన్ని మనిషి ఇప్పటికీ జీర్ణించుకోలేదు. బతుకు నిచ్చే, బతకనిచ్చే అమ్మతత్వానికి దూరంగా చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం ఎంతకాలం?! -
ఇజ్రాయెల్ వార్పై ఒవైసీ రియాక్షన్.. ఆయనో డెవిల్ అంటూ..
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇలాంటి తరుణంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఇజ్రాయెల్ వార్పై ఘాటుగా స్పందించారు. తన మద్దతు పాలస్తీనాకు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు. కాగా, ఒవైసీ శనివారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒవైసీ మాట్లాడుతూ.. తాను పాలస్తీనా వైపే ఉంటానని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పటికీ పోరాడుతున్న వారికి లక్షలాదిమంది సెల్యూట్ చేస్తున్నారని అన్నారు. గాజాకు విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపివేయడంతో లక్షల మంది పౌరులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 21 లక్షల జనాభా ఉన్న గాజాలో 10 లక్షల మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా కూడా ప్రపంచం మౌనంగా ఉంది. 70 ఏళ్లుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఆక్రమణదారుగా ఉంది. అక్కడ దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | Hyderabad: On the Israel-Palestine conflict, AIMIM chief Asaduddin Owaisi says, "The poor people of Gaza, with a population of 21 lakh, 10 lakh have been rendered homeless...The world is silent...For 70 years Israel has been an occupier...You cannot see the occupation,… pic.twitter.com/9riNvVEOV1 — ANI (@ANI) October 15, 2023 ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహును దుష్టశక్తిగా(డెవిల్) అభివర్ణించారు. ఆయన క్రూరుడని, యుద్ధ నేరగాడని మండిపడ్డారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిండంపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. మన త్రివర్ణ పతాకంతోపాటు తాను పాలస్తీనా జెండాను కూడా గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. తాను పాలస్తీనా పక్షానే ఉంటానని తేల్చి చెప్పారు. పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ మానవత్వంతో స్పందించాలని కోరారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇది మానవతా సమస్య అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాలస్తీనాకు ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇరు దేశాల మధ్య వెంటనే కాల్పుల విరమణ పాటించాలని నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. -
అల్ఖైదా కంటే ప్రమాదకరం
వాషింగ్టన్: పాత మసీదులు, యూదుల పురాతన ఆలయాల ఆనవాళ్లు ఉన్న పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం మొదలైన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం పలు మలుపులు తీసుకుంటున్న వేళ హమాస్ సాయుధసంస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని ఫిలడెలి్ఫయాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ మాట్లాడారు. 2001 సంవత్సరంలో 9/11 సెపె్టంబర్ దాడులకు తెగబడిన అల్ఖైదా ఉగ్రసంస్థ కంటే హమాస్ ప్రమాదకరమైనదని అభివరి్ణంచారు. హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ ఇజ్రాయెల్పై దాడి చేసి హమాస్ ఏకంగా వేయి మందికిపైగా అమాయకులను పొట్టనబెట్టుకుంది. అల్ఖైదా సృష్టించిన 9/11 దాడులకంటే ఈ దాడి అత్యంత దారుణం. అల్ఖైదా కంటే హమాస్ ప్రమాదకరం. అల్ఖైదాను మించిన దుషు్టలు వీరు. మొదట్నుంచీ చెబుతున్నట్లే మేం ఇజ్రాయెల్కు బాసటగా నిలబడతాం. ఆత్మరక్షణ కోసం, ప్రతిదాడుల కోసం ఇజ్రాయెల్ తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతీ చర్యకూ అమెరికా అండగా ఉంటుంది. గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే ఇజ్రాయెల్కు చేరుకున్నారు’ అని బైడెన్ చెప్పారు. ఐరాసతోనూ చర్చిస్తున్నాం ‘ఇజ్రాయెల్ ప్రభుత్వంతోనేకాదు దాని పొరుగున ఉన్న జోర్డాన్, ఈజిప్ట్ ఇతర అరబ్ దేశాలతో మంతనాలు జరుపుతున్నాం. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్లలో నెలకొన్న మానవీయ సంక్షోభం పోగొట్టేందుకు ఐక్యరాజ్యసమితితోనూ సమష్టిగా కృషిచేస్తున్నాం. చర్చిస్తున్నాం’ అని అన్నారు. -
ఇజ్రాయెల్ ‘హెచ్చరిక’ మరీ డేంజరస్
ఐక్యరాజ్య సమితి: పాలస్తీనాలోని ఉత్తర గాజాపై దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 24 గంటల్లోగా వీడాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా తప్పుబట్టింది. న్యూయార్క్లో మీడియా సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం మాట్లాడారు. ‘ పది లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడం అత్యంత ప్రమాదకరం. అసలు ఇది అసంభవం. ఇలాంటి హెచ్చరికలు దారుణం. యుద్ధానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి’ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. దాదాపు 11 లక్షల జనాభా ఉన్న ఉత్తర గాజాపై దాడులు చేస్తామని, ఆలోపు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీచేసి దక్షిణ గాజా వైపుగా స్థానికులు తరలిపోవాలని ఇజ్రాయెల్ వైమానిక దళం హెచ్చరించడం తెల్సిందే. జనావాసాలు మాత్రమేకాదు ఉత్తర గాజాలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, ఐరాస శిబిరాలకూ ఇదే అలి్టమేటమ్ వర్తిస్తుంది. అందరూ ఉత్తర గాజా వైపు వస్తే ఆరోగ్య సంక్షోభం తలెత్తడం ఖాయం. యుద్ధవాతావరణంలో ఇంతటి భారీ వలసలు క్షేమం కాదు. ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 34 దాడి ఘటనల్లో 11 మంది ఆరోగ్యసిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇంధనం, ఆహారం, తాగునీరు అవసరాలు తీర్చాల్సి ఉంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా వలసలు ఇజ్రాయెల్ దాడులతో 7వ తేదీæ నుంచి ఇప్పటిదాకా 4,23,000కుపైగా స్వస్థలాలను వదిలిపోయారని ఐరాస రిలీఫ్, రెఫ్యూజీ విభాగం తెలిపింది. వీరిలో 2,70,000కుపైగా ఐరాస శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలో ప్రస్తుతం 50,000 మంది గర్భిణులు ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరికి అత్యవసర ఆరోగ్య సేవలు కరువయ్యాయి. ఆస్పత్రులపైనా రాకెట్ దాడులు జరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా ఉండనుందని తెలుస్తోంది. -
Gaza: ప్రాణ భయంతో.. ఉరుకులు పరుగులు!
వైమానిక దాడులతో గాజాను ఛిద్రం చేసిన ఇజ్రాయెల్ బలగాలు.. ఇక భూభాగంపై దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గాజా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో గాజా ప్రజలు ప్రాణాలు గుప్పిట పట్టుకుని భయంతో పరుగులు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బట్టలు, పరుపులు కార్ల పైభాగానికి కట్టుకుని.. ఇంతకాలం తమను ఆశ్రయం ఇచ్చిన నేలను వదిలేసి పారిపోతున్నారు గాజా ప్రజలు. కాలినడకన, దొరికిన వాహనం పట్టుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు నార్త్ గాజాకు చెందినవిగా పాలస్తీనాకు చెందిన ఓ రిపోర్టర్ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. హమాస్ సంస్థను నామారూపాలు లేకుండా చేస్తామని శపథం చేసిన ఇజ్రాయెల్.. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో బలగాలతో గాజాపై విరుచుకుపడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అదే జరిగితే.. గాజాలో ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐక్యరాజ్య సమితి. Gaza | Residents in North Gaza (Gaza City, Beit Lahia, Beit Hanoun, and Jabalia RC) are evacuating their homes in response to the Israeli military's threat that those who stay could face deadly consequences. pic.twitter.com/ZOlU0Rg5Rj — Younis Tirawi | يونس (@ytirawi) October 13, 2023 ‘‘గాజా నగర పౌరులారా.. మీరు, మీ కుటుంబాలు భద్రంగా ఉండాలంటే ఖాళీ చేసి వెళ్లిపోండి. హమాస్ ఉగ్రవాదులకు మీరు దూరంగా ఉండండి. మిమ్మల్ని వాళ్లు రక్షణ కవచంగా వాడుకుంటున్నారు’’ అని ఇజ్రాయెల్ మిలిటరీ తన హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. గాజాలో జనావాసాల్లో హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు మొదటి నుంచి ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు గాజా ప్రజల్ని తరలిపోవాలన్న ఇజ్రాయెల్ అల్టిమేటంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అది మరింత వినాశనానికి దారి తీయొచ్చని హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇజ్రాయెల్ హెచ్చరికలపై స్పందిస్తూ.. గాజా ఆస్పత్రుల్లో ఉన్న పేషెంట్ల తరలించడం సాధ్యం కాదన్న విషయాన్ని అక్కడి అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని అంటోంది. ముఖ్యంగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను తరలించడం వీలయ్యేది కాదని డబ్ల్యూహెచ్వో ప్రతినిధి తారిక్ జసరెవిక్ తెలిపారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు తర్వాత వేరు ప్రాంతంగా ఏర్పాటైనా గాజాలో.. 20 లక్షల కంటే ఎక్కువ జనాభానే ఉంది. అందులో శరణార్థులే ఎక్కువగా ఉన్నారు. గత 16 ఏళ్లుగా హమాస్ పాలనలో.. ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు, మరోవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని గాజా స్ట్రిప్ ఎదుర్కొంటోంది. ఇక.. గత శనివారం(అక్టోబర్ 7) హమాస్.. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడికి దిగింది. కేవలం 20 నిమిషాల్లో.. ఐదువేల రాకెట్ లాంఛర్లను ప్రయోగించింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులకు దిగింది. ఈ దాడుల్లో 1,300 ఇజ్రాయెల్ పౌరులు, 1800 దాకా పాలస్తీనియన్లు మృతి చెందారు. -
స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు భారత్ మద్దతు
ఢిల్లీ: స్వతంత్ర, సార్వభౌమత్వ పాలస్తీనా దేశ ఏర్పాటుకు భారత్ మద్దతు ఇస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. భారత్ చాలా ఏళ్లుగా ఇదే వైఖరి కొనసాగిస్తోందని తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు చర్చలు పున:ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు శాంతియుతంగా కలిసి జీవించాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తించిన సరిహద్దుల మధ్య పాలస్తీనా ప్రజలు భద్రమైన జీవితం గడపాలన్నదే భారత్ విధానమని, అందులో ఎలాంటి మార్పు లేదని అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత పాలస్తీనా అంశంపై భారత్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్పై హమాస్ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: గాజాపై భూతల యుద్ధం! -
పాలస్తీనాకు కాంగ్రెస్ సపోర్ట్.. సోషల్ మీడియాలో పొలిటికల్ వార్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్లో భీకర యుద్ధం నడుస్తోంది. పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైతం.. గాజాపై ఎదురుదాడికి దిగింది. ప్రతిదాడులు చేస్తూ మిలిటెంట్లను తరమికొడుతోంది. మరోవైపు.. భారత్ సహా కొన్ని దేశాలు ఇజ్రాయెల్కు తమ మద్దతు ప్రకటించాయి. ఇక, భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. దీంతో.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా మాటల పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పాలస్తీనీయులకు మద్దతుగా తీర్మానం చేసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్ ఉగ్రవాదులకు ఊతమిస్తోందని, వారికి మద్దతుగా నిలుస్తోందని పలువురు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ బెంగళూరు పార్లమెంటు సభ్యుడు, బీజేపీ యువ నేత తేజస్వీ సూర్య చేసిన ట్వీట్ తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సోషల్ మీడియా వార్.. కాగా, తేజస్వీ సూర్య ట్విట్టర్ వేదికగా.. ‘ఇజ్రాయెల్ ముద్ధంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం.. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు చక్కటి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టేసింది. మోదీ రాకతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. దీనికి కాంగ్రెస్ కౌంటరిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసిన పాత లేఖ ఒకదాన్ని కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. గత ఏడాది నవంబరు 22న రాసిన ఈ లేఖ పాలస్తీనీయులను ఉద్దేశించింది కావడం గమనార్హం. Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour. — Narendra Modi (@narendramodi) October 7, 2023 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ పాలస్తీనా సందర్భంగా రాసిన ఈ లేఖలో పాలస్తీనా కారణానికి భారత్ గట్టిగా మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలను ఈ లేఖలో ప్రస్తావించారు. పాలస్తీనా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి భారత్ చేస్తున్న సాయాన్ని ప్రస్తావించారు. అయితే.. తాజాగా పాలస్తీనా, ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం మొదలైన సందర్భంగా మోదీ.. ఇజ్రాయెల్కు మద్దతు పలకడం విశేషం. హమాస్ జరిపిన ఆకస్మిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీంతో, బీజేపీ డబుల్ గేమ్ విధానాలను కాంగ్రెస్ ఎత్తిచూపుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. Congress’s CWC resolution on Israel war is a classic example of how Indian foreign policy was hostage to Congress’s minority vote bank politics, until Modi happened. Also, a reminder on how quickly things will go back to zero if we aren’t vigilant in 2024. https://t.co/nJYk3mDCwq — Tejasvi Surya (@Tejasvi_Surya) October 9, 2023 -
Israel-Palestine war: ఫార్మాపై ప్రభావం తక్కువే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలస్తీనా–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత ఫార్మాపై పడే అవకాశం లేదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. దేశం నుంచి ఇజ్రాయెల్కు 2022–23లో ఎగుమతైన ఔషధాల విలువ రూ.766 కోట్లు. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం కంటే అధికం. దేశీయ మార్కెట్ నుంచి బల్క్ డ్రగ్స్ (ఏపీఐ), డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఆ దేశానికి సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఫార్మా రంగంలో వాణిజ్యం తక్కువగా ఉన్నందున.. ఫార్మాస్యూటికల్ వ్యాపారంపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ‘ఔషధ తయారీ రంగంలో ఇజ్రాయెల్ బలంగా ఉంది. అలాగే అధిక నియంత్రణ కలిగిన ఫార్మా మార్కెట్ ఆ దేశం ప్రత్యేకత. సహజంగానే యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఉంటాయి’ అని అభిప్రాయపడ్డారు. -
మానవాళి కోరుకోని యుద్ధం
ఆ దృశ్యాలు ఏదో హార్రర్ సినిమానో, మరేదో అమెరికన్ వార్ సినిమానో చూస్తున్నట్లుంది. ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన ‘హమాస్’ తీవ్రవాద సంస్థ జరిపిన ఆకస్మిక దాడులు, బదులుగా గాజా భూఖండంపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల దృశ్యాలు మూడు రోజులుగా చూస్తున్న వారికి ఒళ్ళు ఝల్లుమనేలా చేస్తున్నాయి. భారీ విధ్వంసాలు, 1200 మందికి పైగా మృతులు, వేలల్లో నిరాశ్రయులు, పసిపిల్లల మొదలు పదహారేళ్ళ పడుచుల దాకా తీవ్రవాదుల చేతిలో చిక్కిన వందకు పైగా బందీల కథ మానవతావాదుల గుండెను బరువెక్కిస్తోంది. పొరుగున ఉన్న అరబ్ దేశాలతో ఇప్పుడిప్పుడే ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపడుతున్నాయనీ, ఆర్థిక సహకారం – శాంతి సాధనే ధ్యేయంగా సరికొత్త మధ్యప్రాచ్యానికి బాటలు పడుతున్నాయనీ భావిస్తున్న వేళ ఉరుము లేని పిడు గులా హమాస్ దాడి మొత్తం కథను మార్చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చేసిన అనివార్య యుద్ధప్రకటన కాలాన్ని వెనక్కి తిప్పేసింది. తాజా ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో దశాబ్దాల పాటు మధ్యప్రాచ్యంలో కొనసాగిన అశాంతి మళ్ళీ భూతమై తిరిగొచ్చింది. ఇది యాభై ఏళ్ళ నాటి జ్ఞాపకాలను తట్టిలేపింది. అప్పట్లో 1973 అక్టోబర్ 6న యూదుల లెక్కలో పవిత్రమైన యోమ్ కిప్పూర్ రోజున ఈజిప్ట్, సిరియాలు సరిగ్గా ఇలాగే ఇజ్రాయెల్పై దాడి చేశాయి. 1949, 1956, 1967 తర్వాత ‘నాలుగో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం’గా పేరుబడ్డ ఆ 19 రోజుల యుద్ధంలో చివరకు ఇజ్రాయెల్ పైచేయి సాధించి, పొరుగు భూభాగాలను స్వాధీనం చేసు కుంది. దాంతో, పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అప్పటిలానే మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్పై భయానక దాడి జరిగింది. అదీ పవిత్ర హిబ్రూ బైబిల్లోని తొలి అయిదు భాగాల సమాహారమైన తోరా పఠనం ప్రారంభించే రోజున జరిగింది. గూఢచర్యంలో, దాడుల్ని నిరోధించే వ్యవస్థల్లో పేరున్న ఇజ్రాయెల్ ఈసారీ ఏమరుపాటుతో ఉంది. అక్టోబర్ 7 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న వేళ ఆకాశ, సముద్ర, భూ మార్గాలు మూడింటి ద్వారా, ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో హమాస్ తీవ్రవాదులు ఆకస్మిక దాడి జరిపి, దిగ్భ్రాంతికి గురిచేశారు. 5 నుంచి 7 వేల రాకెట్ల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్ అన్నట్టు ఒక రకంగా ఇది... 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో అంతర్జా తీయ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై అల్–ఖైదా తీవ్రవాదుల ‘9/11 దాడుల’ను గుర్తుచేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ క్షిపణి – రాకెట్ నిరోధక వ్యవస్థ ‘ఐరన్ డోమ్ సిస్టమ్’ను సైతం తప్పించుకొని, వందలాది రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొని రావడం నివ్వెరపరింది. ఇది నెతన్యాహూ సర్కార్ వైఫల్యాల్లో కొత్త చేరిక. తూర్పు జెరూసలేమ్లోని పవిత్ర అల్–అక్సా మసీదుకు వచ్చే పాల స్తీనా భక్తులపై దాడులు, మసీదులోకి యూదుల ప్రవేశం లాంటి రెచ్చగొట్టే చర్యలు పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చాయి. తాజా దాడి నుంచి ఇజ్రాయెల్ వెంటనే తేరుకొని, హమాస్ కీలక కేంద్రాలపై ప్రతి దాడులు జరిపింది. జొరబడిన హమాస్ తీవ్రవాదులను నిర్వీర్యం చేసింది. ఇప్పుడప్పుడే తెగే అవ కాశం లేని ఈ యుద్ధంలో సైనిక బలిమితో చివరకు ఇజ్రాయెలే గెలవచ్చు కానీ, ఇరువైపులా జరిగే నష్టం మాటేమిటి? ఇరాన్ను శత్రువుగా భావిస్తూ, దాన్ని శిక్షించడానికి ఇజ్రాయెల్ను వాటంగా చేసు కుంటున్న అమెరికా ఈ ఒత్తిడి వ్యూహం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు చల్లారవని గ్రహించాలి. మధ్యప్రాచ్యంలో మంటలు ఈనాటివి కావు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో లక్షలాది పాలస్తీనియన్లు నిరాశ్రయులై, సొంత గడ్డ మీదే శరణార్థులు కావాల్సి వచ్చింది. నాటి నుంచి పాలస్తీనియన్లకూ, ఇజ్రాయెల్కూ మధ్య పోరు సాగుతూనే ఉంది. గతంలో 2008–09లో, 2014లో ఇజ్రాయెల్కీ, హమాస్కీ మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ, కథ కంచికి చేరలేదు. నిజానికి, పాలస్తీనియన్ ప్రజలందరికీ హమాస్ ప్రతినిధి అనుకోవడం కూడా పొరపాటే. ఆ తీవ్రవాద సంస్థ చేసిన చర్యలన్నిటికీ పాలస్తీనాను తప్పుబట్టలేం. కానీ, దీర్ఘకాలిక పాలస్తీనా సమస్యకు పరిష్కారానికి చర్చలు, శాంతియుత మార్గమే సాధనం. అది గ్రహించకుండా హింసకు దిగేవారిని కూడా క్షమించలేం. తీవ్రవాద దాడుల దుష్ఫలితం ఇప్పటికే ప్రతిదాడుల రూపంలో గాజా భూఖండంలో అమాయకులపై పడింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, సుస్థిరతలు కావాలంటే పాలస్తీని యన్లకూ, ఇజ్రాయెల్కూ మధ్య పరస్పర అంగీకారయోగ్యమైన రాజకీయ రాజీ కుదరాలి. స్వతంత్ర పాలస్తీనా దేశమనేది అసాధ్యమైన వేళ ఆచరణయోగ్య పరిష్కారం వైపు ఆలోచించాలి. పాలస్తీనా పక్షాన ఇజ్రాయెల్కు ఎదురొడ్డుతున్న ఇరాన్, సిరియా, లెబనాన్లోని హెజ్బొల్లా బృందం అది గ్రహించాలి. ఉక్రెయిన్ యుద్ధంతో అస్తుబిస్తవుతున్న ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు. భారత్ సంగతికొస్తే, రక్షణ వ్యవహారాల్లో బలమైన భాగస్వామి అయిన ఇజ్రాయెల్ చేతిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో దశాబ్దాల తరబడి పాలస్తీనా అంశంలో బాధితుల గళానికి మద్దతుగా నిలిచిన చరిత్ర మనది. ఆ చారిత్రక వైఖరిని పూర్తిగా వదిలేసి, ఇరాన్తో పాటు వివిధ అరబ్బు దేశాలతో స్నేహానికి పీటముడి వేసుకోనూ లేము. ‘ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటిస్తున్నాం’ అని భారత ప్రధాని ప్రకటించారు. దురాక్రమణలు, తీవ్రవాద దాడులను విస్పష్టంగా ఖండించాల్సిందే. అదే సమయంలో గాజా భూఖండంపై ప్రతీకార దాడుల వల్ల ఇప్పటికే నిరాశ్రయులైన లక్షా పాతిక వేల మంది సామాన్య పౌరులపై మానవతాదృష్టి సారించాల్సిందే. అందుకు మనం ఇప్పుడు ఆచితూచి అడుగేయాలి. తటస్థంగా ఉంటూ, శాంతి స్థాపనకు కృషి చేయాలి. పాలస్తీనియన్లకు కొద్దిపాటి సడలింపులిస్తే ఇజ్రాయెల్తో సాధారణ సంబంధాలకు సిద్ధపడ్డ సౌదీ అరేబియా సైతం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మానవాళి కోరుకోని ఈ యుద్ధం ఆగాలి. -
Israeli-Palestinian Conflict: దేశాన్నే వణికిస్తున్న బుల్లి సంస్థ!
హమాస్. అత్యాధునిక నిఘాలో, అంతకుమించిన సైనిక సంపత్తిలో ప్రపంచంలోనే తిరుగులేనిదని పేరున్న ఇజ్రాయెల్ను మెరుపు దాడులతో నిలువునా వణికించిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్. పక్కా ప్రణాళిక ప్రకారం భూ, జల, వాయుతలాల గుండా దాడులకు దిగి గుక్కతిప్పుకోనివ్వలేదు. ఇంతకీ ఏమిటీ సంస్థ? ఎందుకు ఈ స్థాయిలో దాడులకు దిగింది? ఇంతటి శక్తి సామర్థ్యాలను ఎలా సంతరించుకుంది...? పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ను పాలిస్తున్న సాయుధ సంస్థ హమాస్. ఇజ్రాయెల్ వినాశనం, ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనే లక్ష్యమని ప్రకటించుకుంది. 2007లో గాజాను చేజిక్కించుకున్న నాటినుంచీ ఇజ్రాయెల్తో ఎన్నోసార్లు పోరుకు దిగింది. హమాస్ అంటే హర్కతల్ ముఖవమా అల్ ఇస్లామియా. రాజకీయ పారీ్టగా మొదలై సాయుధ సంస్థగా మారింది. 2000లో రెండో తిరుగుబాటులో భాగంగా ఇజ్రాయెల్పై భారీ దాడులకు పాల్పడి వందల మందిని బలి తీసుకుంది. ► శనివారం నాటి దాడి ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన వాటిలో అత్యంత తీవ్రమైనది. ఈజిప్టు, సిరియా ఇలాగే ఇజ్రాయెల్పై సరిగ్గా 50 ఏళ్ల కింద, 1973లో మెరుపు దాడికి దిగాయి. అది మధ్యప్రాచ్యంలో తీవ్ర యుద్ధంగా çమారింది. ► 2000లో బందీగా దొరికిన ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడిని అడ్డం పెట్టుకుని వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయించుకుంది. తాజాగా భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులను నిర్బంధించిన ఆ సంస్థ, ఈసారి ఏ స్థాయిలో బేరం పెడుతుందన్నది తేలాల్సి ఉంది! ► ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్ హమాస్ను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. ► ఈ సంస్థకు ఇరాన్ దన్నుగా నిలుస్తోంది. నిధులు, ఆయుధాలతో పాటు సాయుధ శిక్షణ ఇస్తోంది. తుర్కియే, ప్రవాస పాలస్తానీయులు, ప్రైవేటు దాతలతో పాటు పలు ఇస్లామిక్ సంస్థలు సాయం చేస్తుంటాయి. పాలస్తీనా సంగతేంటి? ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణ ఇప్పటిది కాదు. అవి ఆవిర్భవించినప్పటి నుంచీ నిత్య రావణకాష్టంలా రగులుతోంది. వెస్ట్బ్యాంక్, గాజాలను కలిపి పాలస్తీనాగా పిలుస్తారు. రోమన్ సామ్రాజ్య కాలంనాటి పాలస్తీనాలో నేటి తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్ కలిసే ఉంటాయి. బైబిల్లో వీటిని యూదు రాజ్యాలుగా పేర్కొన్నారు. యూదులు వీటిని తమ పూర్వీకుల భూభాగంగా పరిగణిస్తారు. ► 1948లో ఇజ్రాయెల్ తనను తాను స్వతంత్రదేశంగా ప్రకటించుకుంది. దీన్ని పాలస్తీనా ముస్లింలు మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ► పాలస్తీనియన్లతో పాటు అరబ్ దేశాలు తమ సైనిక చర్యలో పాల్గొని ఇజ్రాయెల్ను తుడిచి పెట్టాలని హమాస్ సైనిక కమాండర్ మొహమ్మద్ దెయిఫ్ శనివారం దాడులు మొదలయ్యాక వీడియో సందేశంలో పిలుపునిచ్చాడు. ► అరబ్బు దేశాల మాట అటుంచితే వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలేం పాలస్తీనియన్లు ఆ పిలుపునకు ఏ మేరకు స్పందిస్తారన్నది చూడాలి. ► పాత జెరూసలేంలోని అల్ అక్సా మసీదుపై నియంత్రణ దాడికి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. క్రైస్తవులతో పాటు ముస్లింలు, యూదులకు ఇది అతి పవిత్ర ప్రాంతం. ఇది ఇజ్రాయెల్ అ«దీనంలో ఉంది. శాంతి ఒప్పందానికి లోబడి అక్కడ ముస్లింల ప్రార్థనలకు అనుమతిస్తూ వస్తోంది. మసీదుకు పహారాగా ఉండే ఇజ్రాయెలీ దళాల దన్నుతో యూదు అతివాదులు అక్కడ హల్చల్ చేస్తుండటం హమాస్ ఆగ్రహానికి మరో కారణం. గాజా స్ట్రిప్ కథ ఇదీ.. ఇజ్రాయెల్, ఈజిప్టు, మధ్యదరా సముద్రం మధ్యన ఉండే కేవలం 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు భూభాగమిది. అక్కడ జనాభా ఏకంగా 23 లక్షలు! ► గాజా గగనతలమే గాక చాలావరకు సముద్ర తీరం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి గాజాలోకి ఆహార పదార్థాలు, నిత్యావసరాల సరఫరాను అనుమతిస్తోంది. అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వం! దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో రాజకీయ పారీ్టలన్నీ చేతులు కలుపుతున్నాయి. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అన్ని పారీ్టల ప్రతినిధులతో కూడిన అత్యవసర జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు జరుపుతున్నాయి. దీనిపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, విపక్ష నేతలు యాయిర్ లాపిడ్ బెన్నీ గాంట్జ్ ఇప్పటికే చర్చించుకున్నారు. అత్యవసర ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరేందుకు విపక్ష నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కళ్లు గప్పి.. ఇజ్రాయెల్కు పకడ్బందీగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ప్రపంచం నలుమూలల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్ నిఘా వర్గాలకే మొట్టమొదట సమాచారం అందుతుంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇజ్రాయెల్ కళ్లు గప్పి హమాస్ మిలిటెంట్లు ముప్పేట దాడులకు తెగబడడం అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలైన షిన్బెత్, మొసాద్ల గురించి ఎప్పుడూ ఆ దేశం గర్వంగా చెప్పుకుంటుంది. గాజా సరిహద్దుల్లో భారీగా భద్రతా సిబ్బంది మోహరించి ఉంటారు. నిరంతరం సీసీ కెమెరాలు పని చేస్తూ ఉంటాయి. ఆర్ట్ థర్మల్ ఇమేజింగ్, మోషన్ సెన్సర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్లను దాటుకొని హమాస్ మిలిటెంట్ల దాడులకు దిగారంటే కచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్న అభిప్రాయాలున్నాయి. మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో మోటరైజ్డ్ పారా గ్లైడర్ల సాయంతో సరిహద్దుల్లో కంచెలు దాటిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దిగుతూనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.సరిహద్దులు దాటడానికి పారా గ్లైడర్లు హమాస్ వినియోగిస్తుందని ఇజ్రాయెల్ ఊహకి కూడా అందలేదు. ుద్యాధర సముద్రం నుంచి చిన్న చిన్న బోట్లలో గాజా మీదుగా ఇజ్రాయెల్లోకి అడుగు పెట్టారు. పికప్ ట్రక్కుల్లో భారీ మిషన్ గన్లుతో భూ మార్గంలో చొచ్చుకువచ్చారు. సరిహద్దులు దాటినప్పుడు భారీగా పేలుడు పదార్థాలు వినియోగించారు. కొందరు మిలిటెంట్లు వైర్లను కట్ చేసుకుంటూ కంచెలు అడ్డం తొలగించి లోపలికి వచ్చారు. ఇలా ఏకకాలంలో మూడు మార్గాల ద్వారా దాడులకు దిగడంతో తేరుకొని ఎదురు దాడులకు దిగేలోపుల నష్టం జరిగిపోయింది. హమాస్ మిలిటెంట్లు పకడ్బందీగా దాడులు జరపడానికి పదేళ్ల కిందట నుంచే విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పారాగ్లైడర్ల దాడికి శిక్షణ తీసుకున్న వీడియోలను హమాస్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐరన్ డోమ్ను దాటుకొని మరీ.. ఇజ్రాయెల్ వద్ద శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఉంది. దూసుకొచ్చే శుత్రుదేశ రాకెట్ల దిశకు తగ్గట్లు ప్రతిగా రాకెట్లను ప్రయోగించి వాటిని ధ్వంసం చేయడంలో ఐరన్డోమ్ వ్యవస్థ పేరుగాంచింది. అయితే హమాస్ మిలిటెంట్లు ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ తికమకపడేలా లెక్కలుమిక్కిలిగా అంటే 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లను ప్రయోగించారు. ఇన్నాళ్లూ 80% సక్సెస్ రేటుతో పని చేసిన ఐరన్ డోమ్ వ్యవస్థ దీంతో ఒక్కసారిగా చేతులెత్తేసింది. ఈ రాకెట్ల దాడిలో ఇజ్రాయెల్లో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel-Palestine war: భీకర యుద్ధం
టెల్ అవివ్/జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం మొదలైన ఘర్షణ ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. దక్షిణ ఇజ్రాయెల్లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకువచి్చన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది. ఈ దాడుల్లో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే 20,000 మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్లు అంచనా. దాడులు, ప్రతి దాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్లో 600 మందికిపైగా, గాజాలో 370 మందికిపైగా మొత్తంగా దాదాపు వేయి మంది మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో ఉన్నట్లు ప్రధాని నెతన్యాహూ కేబినెట్ ఆదివారం ప్రకటించింది. సంక్షోభ నివారణకు సైనిక పరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. బందీలపై తీవ్రవాదుల అత్యాచారాలు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో బీభత్సం సృష్టించారు. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వీరిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ బందీలను అడ్డం పెట్టుకొని పెద్ద బేరమే ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనావాసులు ఖైదీలుగా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉన్నారు. వీరిని విడిపించుకోవడానికి మిలిటెంట్లు ఇజ్రాయెల్ బందీలను పావులుగా ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు చాలామంది ఇజ్రాయెల్ పౌరులను మిలిటెంట్లు అపహరించినట్లు ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్లో వందలాది మంది... ఇజ్రాయెల్లో హమాస్ దాడిలో మరణించిన వారి సంఖ్య ఇప్పటిదాకా 600కు చేరినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో 44 మంది సైనికులు ఉన్నారని తెలిపాయి. ఇజ్రాయెల్ ఎదురుదాడిలో గాజాలో 370 మందికి పైగా మృతి చెందారని పాలస్తీనా అధికారులు చెప్పారు. ఇరువైపులా 2,000 మంది చొప్పున గాయపడినట్లు సమాచారం. తమ సైనిక దళాలు 400 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలియజేశాయి. చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. తల్లిదండ్రుల కళ్లెదుటే పసిబిడ్డ హత్య హమాస్ తీవ్రవాదులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వారి ఘాతుకం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచి్చంది. తీవ్రవాదులు ఇజ్రాయెల్లో ఓ కుటుంబాన్ని బందీలుగా మార్చారు. తమ అ«దీనంలో ఉన్న భార్యాభర్తలు, వారి ఇద్దరి కుమార్తెలు, కుమారుడిని హింసించారు. ఒక పసిబిడ్డను ఆమె తల్లిదండ్రుల కళ్లెదుటే మెడు తాడు బిగించి చంపేశారు. అది చూసి బిగ్గరగా రోదిస్తున్న మరో కుమార్తె, కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ సోదరి స్వర్గానికి వెళ్లింది’ అని అరుస్తూ చెప్పారు. ఇజ్రాయెల్ జర్నలిస్టు హనాయా నఫ్తాలీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతీయులు క్షేమం.. ఇజ్రాయెల్, గాజాలో భారతీయులంతా ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. భారతీయులకు తాము అందుబాటులో ఉంటున్నామని, వారి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నామని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశాయి. మరోవైపు గాజాలో వాతావరణం భయంకరంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు. ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్లోని టెల్ అవివ్కు ఈ నెల 14 దాకా తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు -
Israel-Palestine War: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని, చేజిక్కించుకున్న ఇజ్రాయెల్ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఊహించని దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ తేరుకుని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరువర్గాల ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోరా్టర్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది. తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే’’అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ముందుగా చొరబాటుదారులను ఏరేస్తాం. అనంతరం భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరతాం’’అని ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్నేళ్లలో ఆ దేశంపై జరిగిన అతి తీవ్ర దాడి ఇదే. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 14 చోట్లనుంచి చొరబాటు...! ఇజ్రాయెల్లోకి కనీసం 7 నుంచి 14 ప్రాంతాల గుండా మిలిటెంట్లు చొచ్చుకొచి్చనట్టు చెబుతున్నారు. తొలుత వివాదాస్పద గాజా స్ట్రిప్ నుంచి తెల్లవారుజామున రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు దేశమంతటా వాయుదాడి సైరన్లు మోగాయి. ఆ వెంటనే మిలిటెంట్లు దేశంలోకి చొచ్చుకొచ్చారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దక్షిణాన గాజా–ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్సైకిళ్లు, వాహనాల్లో, పారా గ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. ప్రతిగా సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది. అల్ హక్సా మసీదుపై ఇజ్రాయెల్ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్ మిలిటరీ వింగ్ నేత మొహమ్మద్ దెయిఫ్ పేర్కొన్నాడు. దీన్ని ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’గా అభివరి్ణంచాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్ దాకా ఉన్న పాలస్తీనియన్లంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఈ దాడి నెతన్యాహూ నాయకత్వ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తింది. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, భారీ ఆందోళనలకు ఆయన కారకుడవడం తెలిసిందే. దాడి నేపథ్యంలో సైనిక ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్కు అన్నివిధాలా అండ: మోదీ ఇజ్రాయెల్పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. బాధిత పౌరులు, కుటుంబాల క్షేమం కోసం ప్రారి్థస్తున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాడిని అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించగా. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పలు ఇతర దేశాలు కోరాయి. అక్కడి భారతీయులకు అడ్వైజరీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారతీయు లు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అ నవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దని పేర్కొంది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఇంగ్లిష్తో పా టు హిందీ, మరాఠా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయె ల్లో 18 వేల మంది దాకా భారతీయులున్నారు. -
ఇజ్రాయెల్ X పాలస్తీనా వందేళ్ల కుంపటి..!
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూరీ్వకులకు చెందిన ప్రాంతమని తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్బులు అదే తమ మాతృభూమి అని దానిని వదల్లేమని కరాఖండీగా చెబుతూ వచ్చారు. 1920–40 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యూరప్లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదులు సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆరంభమైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు యూదులు, అరబ్బుల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇచ్చి జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఇజ్రాయెల్ ఆవిర్భావంతో యుద్ధవాతావరణం ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. దీంతో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకంచడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోయారు. అప్పట్నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. హమాస్ ఏర్పాటుతో సంక్షోభం 1987లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ హమాస్ సంస్థ ఆవిర్భావం తర్వాత సంక్షోభం మరింత ముదిరింది. పాలస్తీనాకు చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించిన హమాస్ తొలుత రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. 2000 సంవత్సరంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతల నివారణకు క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనియన్లకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం గాజా సిటీ హమాస్ ఆ«దీనంలో ఉంది. వెస్ట్బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ అ«దీనంలో ఉండడంతో తరచూ ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో మరోసారి ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలవంతంకాలేదు. దీంతో సమస్య అలాగే ఉండిపోయింది. కొలిక్కి రాని సమస్యలివే..! ఇజ్రాయెల్ జెరూసలేం మొత్తాన్ని తన రాజధానిగా ప్రకటించుకుంటే, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను తమ భవిష్యత్ రాజధానిగా ప్రకటించుకున్నారు. ► 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగినప్పటికీ ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే చూస్తోంది. ► వెస్ట్బ్యాంక్ ప్రాంతం ఇప్పటికి ఇంకా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉంది. ► ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ మారాయి. ► వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనల్ని తోసిరాజని ఎన్నో అక్రమ కట్టడాలను నిర్మించింది. వాటిని తొలగించే అంశంలో వివాదం నెలకొంది. ► పాలస్తీనా శరణార్థుల భవిష్యత్పై ఆందోళనలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్లో హమాస్ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే?
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడితో ఇజ్రాయెల్లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడులతో పదుల సంఖ్యలో సామాన్యపౌరులు మృతిచెందారు. వీరు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్పైకి 5వేల రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. Approximate of 2000 people running from a party where hamas militants attacked #Israel #Palestine pic.twitter.com/BRiOGm7cPK — meh° (@ImMehulOkk) October 7, 2023 మరోవైపు.. ఇజ్రాయెల్పై మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్ ఆల్-అక్సా స్ట్రామ్’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. హమాస్ ఏర్పాటు ఇలా.. హమాస్ ఒక మిలిటెంట్ ఉద్యమం. హమాస్, హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామియా (ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్) యొక్క సంక్షిప్త రూపం. ఇది గాజా స్ట్రిప్లో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లను పాలిస్తుంది. ఈ హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్కు సాయుధ ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందింది. షేక్ అహ్మద్ యాసిన్ అనే పాలస్తీనా మత గురువు హమాస్ను స్థాపించాడు. డిసెంబర్ 1987లో గాజాలో హమాస్ను బ్రదర్హుడ్ రాజకీయ విభాగంగా యాసిన్ తయారు చేశారు. More Israelis being taken hostage. #Israel #Hamas #Palestine #Palestinian #IronDome #Gaza #TelAviv pic.twitter.com/v005TC7IC7 — Paul Golding (@GoldingBF) October 7, 2023 ఇజ్రాయెల్ నాశనమే టార్గెట్.. ఆ సమయంలో హమాస్ యొక్క ఉద్దేశ్యం పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ), ఇజ్రాయెల్ను హింసాత్మకంగా ప్రతిఘటించడమే లక్ష్యం. ఈ మేరకు 1988లో, హమాస్ తన చార్టర్ను ప్రచురించింది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలని, చారిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. PLO నాయకుడు యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యిట్జాక్ రాబిన్ ఓస్లో ఒప్పందాలపై సంతకం చేయడానికి ఐదు నెలల ముందు ఏప్రిల్ 1993లో హమాస్ మొదటిసారిగా ఆత్మాహుతి బాంబు దాడిని ప్రారంభించింది. హమాస్కు ఎలా నిధులు సమకూరుతాయి? డజన్ల కొద్దీ దేశాలు హమాస్ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. 1997లో అమెరికా హమాస్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హమాస్కు ఇరాన్ వస్తుపరంగా, ఆర్థికపరంగా సహాయాన్ని అందిస్తోంది. టర్కీ దాని అగ్ర నాయకులలో కొంతమందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. పర్షియన్ గల్ఫ్లోని పాలస్తీనా ప్రవాసులు మరియు ప్రైవేట్ దాతలు నిధులను అందిస్తున్నారు. అదనంగా, పశ్చిమ దేశాలలోని కొన్ని ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు హమాస్ మద్దతు ఉన్న సామాజిక సేవా సమూహాలకు డబ్బును పంపిస్తున్నాయి. హమాస్ ద్వారా వందల మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించడానికి ఇజ్రాయెల్ ఖతార్కు అనుమతిస్తోంది. ఇతర విదేశీ సహాయం సాధారణంగా PA మరియు UN ఏజెన్సీల ద్వారా గాజాకు చేరుకుంటుంది. 2017 నుంచి దాడులు తీవ్రం.. ఇదిలా ఉండగా.. 2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు. జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు అంటూ అప్పట్లోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. శాంతి కోరుతున్న అంతర్జాతీయ సమాజం.. ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు విన్నవిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా వీలైనంత త్వరగా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కోరాయి. కానీ, దాడులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వందల మంది సామాన్యపౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. -
యుద్ధ భయం.. ఇజ్రాయెల్లోని భారతీయులకు కేంద్రం సూచనలు
ఇజ్రాయెల్, గాజా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడిన పాలస్తీనా హమాజ్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించారు. ఆపరేషన్ అల్-అక్సా’ పేరుతో శనివారం ఉదయం నుంచి 5 వేల మిస్సైల్స్తో విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణాల్లోకి ప్రవేశించి వీధుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 22 మరణించగా.. 500 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. Palestine has invited its doom! In today’s episode of f*Ck around & find out,brought to you by #Mossad/ #Israel. We Indians know it’s not Islamists vs Zionists;it’s Humanity vs Terrorists. May Allah help Netanyahu finish off Islamic terrorism from #Gazapic.twitter.com/9CJ5Vh3mBp — Pranav Pratap Singh (@PranavMatraaPPS) October 7, 2023 ఆకస్మిక దాడులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జెరూసలెంతో సహా ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు తెలిపింది. దక్షిణ, మధ్య ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలపింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది. హమాజ్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్’ పేరుతో గాజాలోని హమాజ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశం యుద్ధంలో పోరాడుతుందని, తప్పకుండా విజయం సాధిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ పౌరులను రక్షించుకుంటామని పేర్కొన్నారు. దాడులకు ప్రతిఫలంగా హమాజ్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. We are at war. We will protect our citizens. We will not give in to terror. We will make sure that those who harm innocents pay a heavy price. — Israel ישראל 🇮🇱 (@Israel) October 7, 2023 భారతీయ పౌరులకు అడ్వైజరీ.. ఇజ్రాయెల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్లో నివసిస్తున్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్ను పాటించాలని కోరింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే బాంబ్ షెల్టర్ల వద్ద ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండంటూ టెల్ అవివ్లోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. Just surreal! Footage of Palestinian Hamas terrorists who infiltrated into Israel from Gaza, firing at residents in Sderot from an SUV. pic.twitter.com/ffUO5XwG1I — Arsen Ostrovsky (@Ostrov_A) October 7, 2023 గాజా సరిహద్దులోకి ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన హమాజ్ ఉగ్రవాదులు పౌరుల నివాసాలపై కాల్పులకు తెగబడుతున్నారు. దక్షిణ ఇజ్రాయెల్లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దులోని వందలాది మంది జనాలు ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. Palestine has invited its doom! In today’s episode of f*Ck around & find out,brought to you by #Mossad/ #Israel. We Indians know it’s not Islamists vs Zionists;it’s Humanity vs Terrorists. May Allah help Netanyahu finish off Islamic terrorism from #Gazapic.twitter.com/9CJ5Vh3mBp — Pranav Pratap Singh (@PranavMatraaPPS) October 7, 2023 ఎందుకీ ఘర్షణలు ఇదిలా ఉండగా.. 2007లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి గాజాలో హమాజ్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ గజాన్ కార్మికులకు సరిహద్దులను మూసివేసిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఏడాది జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయిలీలు, ఇద్దరు విదేశీయులు మరణించారు. వీరిలో సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు. -
అందరూ అక్కడి నుండి వెళ్లిపోండి.. సౌదీ అరేబియా
బీరుట్: లెబనాన్లోని శరణార్ధుల శిబిరంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న కువైటీలు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది సౌదీ ఎంబసీ. సౌదీ అరేబియా తన పౌరులను త్వరగా లెబనాన్ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు లెబనాన్లోని సౌదీ రాయబార కార్యాలయం ట్విటర్లో పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా సౌదీకి లెబనాన్ కు మధ్య రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌదీ ఎంబసీ తమ దేశస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది కానీ ఎక్కడ సురక్షితమో చెప్పలేదు. ఇదిలా ఉండగా ఇదే నెల మొదల్లో ఇంగ్లాండ్ మాత్రం లెబనాన్ రాకపోకలపై ఆంక్షలు విధించింది. జూలై 29న లెబనాన్ రక్షణ బలగాలకు కరడుగట్టిన ఇస్లామిస్టులకు మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది మృతి చెందగా వారంతా మిలిటెంట్లేనని ధృవీకరించాయి శిబిరంలోని భద్రతా వర్గాలు. ఈ శిబిరం అన్నిటిలోకి పెద్దదని ఇక్కడ సుమారు 80,000 నుండి 250,000 మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇది కూడా చదవండి: పబ్జీ లవ్స్టోరీ: పాకిస్థాన్లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా? -
వెస్ట్బ్యాంక్లో ముగిసిన సైనిక ఆపరేషన్
వెస్ట్బ్యాంక్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ బుధవారం ముగిసింది. ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి వెళ్లిపోయాయి. సోమవారం, మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది పాలస్తీనావాసులు, ఒక ఇజ్రాయెలీ జవాను మృతిచెందారు. తాము నిర్వహించిన డ్రోన్ దాడుల్లో చనిపోయినవారంతా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. జెనిన్ శరణార్థుల శిబిరంలో భయం ఇంకా తొలగిపోలేదు. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నారు. ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా తిరిగివస్తున్నారు. క్యాంప్లో ఎక్కడ చూసినా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా పునరుద్ధరించలేదు. ఇంటర్నెట్ సేవలు సైతం ఆగిపోయాయి. డ్రోన్ దాడ్రుల్లో మిలిటెంట్ ముఠాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వెస్ట్బ్యాంక్ నుంచి ఉగ్రవాదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సైనిక ఆపరేషన్లు పునరావృతం కావడం తథ్యమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. జెనిన్ శివారులోని ఓ సైనిక స్థావరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. -
ఆగని ఇజ్రాయెల్ దాడులు.. వెస్ట్బ్యాంక్లో ముగ్గురు మృతి
జెరూసలేం: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం నబ్లాస్ సిటీపై జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. 40 మంది స్థానికులు గాయపడ్డారు. గాజా స్ట్రిప్లో మూడ్రోజుల కాల్పుల విరమణ ముగిసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలినాళ్లలో వెస్ట్బ్యాంక్లో వరుస దాడులకు కారకుడైన అల్–అక్సా సాయుధ దళం నేత ఇబ్రహీం అల్–నబుల్సీను ఆయన ఇంట్లోనే హతమార్చామని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నబుల్సీ, మరో ఇద్దరు సాయుధులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత మూడ్రోజుల గాజా దాడులు, ప్రతిదాడుల ఘటనల్లో మొత్తంగా 46 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 311 మంది గాయపడ్డారు. పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఉగ్ర సంఘర్షణలో నబుల్సీ మరణం ఒక మేలిమి ముందడుగు అని ఇజ్రాయెల్ ఆపద్ధర్మ ప్రధాని యాయిర్ లాపిద్ వ్యాఖ్యానించారు. 1967 నాటి మధ్యప్రాశ్చ్య యుద్ధానంతరం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ వశమైంది. ఆనాటి నుంచి దశాబ్దాలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ సంఘర్షణ కొనసాగుతోంది. చదవండి: (భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త) -
పాలస్తీనా చిన్నది... టోర్నీలోనే పిన్నది
చెన్నైకొచ్చిన 8 ఏళ్ల పాలస్తీనా పాప రాండా సెడార్. అసలు ‘ఎత్తు’ వేయకుండానే ఈ ‘చెస్ ఒలింపియాడ్’ పుస్తకాల్లోకెక్కింది. చెన్నై మెగా ఈవెంట్లో ఆడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత పొందింది. ఐదేళ్ల పసిప్రాయంలో తండ్రి దగ్గర ఏదో ఆటవిడుపుగా నేర్చుకున్న చదరంగంలో అసాధారణ ప్రావీణ్యం సంపాదించింది. మూడేళ్లు తిరిగేసరికే పాలస్తీనా మహిళల చాంపియన్షిప్లో రెండో స్థానంలో నిలిచి... ఈ ఒలింపియాడ్లో ఆడే జాతీయ జట్టుకు ఎంపికైంది. మయన్మార్ అమరవట్టి... మన కుట్టి! భారత సంతతికి చెందిన 11 ఏళ్ల మయన్మార్ అమ్మాయి కూడా చెన్నైలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మయన్మార్ అబ్బాయిలే ‘పావులు’ కదుపుతున్న చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి అమ్మాయిల జట్టు ఆడుతోంది. అరంగేట్రం చేస్తున్న అమ్మాయిల బృందంలో ఉన్న మిన్ అమరవట్టి తన మూలాలున్న చోట ఘనాపాఠిగా నిలిచేందుకు తహతహలాడుతోంది. చదవండి: Chess Olympiad 2022: భారత్పై విషం చిమ్మిన పాకిస్తాన్.. -
పాలస్తీనా భారత రాయబారి ముకుల్ హఠాన్మరణం!
పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య ఆకస్మిక మరణం చెందారు. రమల్లహ్ భవనంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ముకుల్ మరణానికి గల కారణాల గురించి ఇటు భారత విదేశాంగ శాఖతో పాటు పాలస్తీనా ప్రభుత్వంగానీ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఇరు దేశాలు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన భౌతికకాయాన్ని భారత్కు తరలించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య మృతిని ధ్రువీకరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ముకుల్ ఆర్య ప్రతిభావంతుడైన అధికారి అని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. స్నేహపూర్వక భారత ప్రభుత్వానికి, ప్రతినిధి ఆర్య కుటుంబానికి, సంతాపాన్ని ప్రకటించారు విదేశాంగ వ్యవహారాలు, వలసదారుల మంత్రి డాక్టర్ రియాద్ అల్-మాలి. Mukul Arya మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి తరలించే ఏర్పాట్లను పూర్తి చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అధికారిక సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ముకుల్ మృతి పట్ల పాలస్తీనా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. ఆయన మరణంపై దర్యాప్తు జరిపాలని అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని సైతం దర్యాప్తు విభాగాలను ఆదేశించారు. Deeply shocked to learn about the passing away of India’s Representative at Ramallah, Shri Mukul Arya. He was a bright and talented officer with so much before him. My heart goes out to his family and loved ones. Om Shanti. — Dr. S. Jaishankar (@DrSJaishankar) March 6, 2022 ముకుల్ నేపథ్యం.. ఢిల్లీలో పుట్టి, పెరిగిన ముకుల్ ఆర్య.. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదివాడు. 2008 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్కు చెందిన వారు. ఢిల్లీ విదేశాంగ విభాగాల్లోపని చేసిన ఆర్య.. యునెస్కో(పారిస్)లో శాశ్వత ప్రతినిధిగా పని చేశారు. అంతేకాదు కాబూల్, మాస్కోలోని రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. -
ప్రధాని మారినా వీడని చిక్కుముళ్లు
ఒకవైపు తీవ్రమైన హింసాత్మక ఘర్షణలు, మరోవైపున కాల్పుల విరమణ నేపథ్యంలో ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నఫ్టాలి బెన్నెట్ ఎంపిక ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు తీసుకొచ్చిన రెండు దేశాల పరిష్కారం ప్రతిపాదన సఫలం కావడానికి ఎన్నో చిక్కుముళ్లు అడ్డుపడుతున్నాయి. ఒకరి ఉనికిని మరొకరు గుర్తించడానికి ఇష్టపడని వాతావరణంలో సామరస్యపూర్వకంగా ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యను పరిష్కరించడం బైడెన్ యంత్రాంగానికి చాలా కష్టమైన పనే. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత సమతుల్యతతో వ్యవహరించాల్సి ఉంది. దాదాపు 11 రోజుల హింసాత్మక ఘర్షణల తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ మధ్య కాల్పుల విరమణ జరిగిన నెలరోజుల లోపు ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రిగా నప్టాలి బెన్నెట్ ఎంపిక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాల్పుల విరమణ కోసం చర్చలకు ప్రోత్సహించిన అమెరికా దాని మిత్రదేశాలు ‘రెండు దేశాల పరిష్కారం’ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాయి. పర్యవసానంగా ఈ అంశంపై ఈజిప్ట్, జోర్డాన్, ఇజ్రాయెల్ నేతలతో మరింతగా చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన తరపున విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ని పంపించారు. ఈ అంశంపై ఇజ్రాయెల్ నూతన ప్రధాని బెన్నెట్ కూడా కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో, ప్రతిపాదించిన పరిష్కారం వైపు ముందుకు నడవడం బైడెన్ యంత్రాంగానికి ఏమంత సులువైన పని కాదు. ఈ విషయంలో అనేక సంక్లిష్టతలు ఏర్పడి ఉన్నాయి. ఒకటి, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల ఏర్పాటు కోసం 1947 నవంబర్ 29న ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్లాన్ తీర్మానం 181 (ఐఐ) ప్రకారం, రెండు దేశాలమధ్య పరస్పరం విభజించుకున్న భూఖండాలను కలిగి ఉన్నాయి. అంటే ఇలా తమతమ భూఖండాలను దాటడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని దీని అర్థం. ఈ రెండు దేశాలు ఎంత మంచి సంబంధాలు కలిగి ఉంటున్నాయన్నదాన్ని బట్టి ఇలాంటి ఏర్పాట్లు విజయవంతమవుతుంటాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించకపోతే మళ్లీ ఘర్షణ ఏర్పడుతుందన్నది స్పష్టమవుతుంది. రెండు, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ), ఇజ్రాయెల్ మధ్య 1993లో కుదిరిన ఓస్లో ఒడంబడిక ఈ రెండు దేశాల ఉనికిని లాంఛనప్రాయంగా గుర్తించింది, పాలస్తీనా అథారిటీ స్థాపనకు మార్గం కల్పించింది. జెరూసలేం పాలనాధికార సంస్థకు సంబంధిం చిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కానీ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలూ జెరూసలేంని తమ రాజధానిగా ప్రకటించడమే కాకుండా ఆ నగరంతో ప్రత్యేకించి అక్కడి పవిత్ర స్థలాలపై చారిత్రక అనుబంధం తమకే ఉందని చెప్పుకున్నాయి. జెరూసలేంని తన నియంత్రణలో ఉంచాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం 181 ప్రతిపాదించినప్పటికీ పాలస్తీనా, ఇజ్రాయెల్ నేతలు ఇద్దరూ తిరస్కరించారు. 1949లో నాటి ఇజ్రాయెల్ ప్రధాని బెన్ గురియన్ మరికాస్త ముందుకెళ్లి పశ్చిమ జెరూసలేం ఇజ్రాయెల్లో అంతర్భాగం అని ప్రకటించేశారు. జెరూసలేంని రెండు దేశాల ఉమ్మడి రాజధానిగా వ్యవహరించాలని అంతర్జాతీయ సమాజం ప్రతిపాదించినప్పటికీ ఇజ్రాయెల్ దానికి అంగీకరించలేదు. మూడు, దాదాపు 45 కిలోమీటర్ల వరకు భౌతికంగా వేరుపడి ఉన్న గాజా, వెస్ట్ బ్యాంక్ వంటి పాలస్తీనా భూభాగాలు కూడా రెండు ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల నియంత్రణలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ మితవాద రాజకీయ పార్టీ ఫతాహ్ అదుపులో ఉంది. రాడికల్ ఉగ్రవాద సంస్థ హమాస్ గాజాను అదుపులో పెట్టుకుని ఉంది. పాలస్తీనా అథారిటీకి నేతృత్వం వహిస్తున్న మితవాద పార్టీలు ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిస్తుండగా, హమాస్ దాన్ని వ్యతిరేకించి ఇజ్రాయెల్తోపాటు ఇంతవరకు ఉన్న భూభాగాలన్నీ గ్రేటర్ పాలస్తీనాలో భాగమని ప్రకటిస్తూ ఆ లక్ష్య సాధనకోసం పోరాడుతోంది. హమాస్ 1988 చార్టర్ ఇజ్రాయెల్తో సహా మొత్తం పాలస్తీనాను వక్ఫ్ లాండ్ (తరతరాల ముస్లింలకు ధర్మనిధి) ప్రకటించింది. కాబట్టి దాని విభజనను హమాస్ ఒప్పుకోవడం లేదు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న శాంతి, రాజీ ప్రయత్నాలు హమాస్ కఠిన వైఖరి కారణంగా పలుచబడిపోయాయి. ఇప్పుడు రెండు దేశాల పరిష్కారాన్ని ఆమోదించవలసి వచ్చినప్పుడు హమాస్ నిజమైన ఉద్దేశాలు ఏమై ఉంటాయనేది ఇప్పటికైతే తెలీటం లేదు. నాలుగు, మరో సంక్లిష్టమైన సమస్య ఏమిటంటే వలసలు, శరణార్థులకు సంబంధించినది. వెస్ట్ బ్యాంక్, జెరూసలేంలలో ఇజ్రాయెల్ నిర్మించిన ఆవాస ప్రాంతాల్లో 5 లక్షలమంది కంటే ఎక్కువమంది యూదులు నివసిస్తున్నారు. అదే సమయంలో 50 లక్షలమంది పాలస్తీనీయులు తమ మాతృభూమికి దూరమై ఇరుగుపొరుగు దేశాల్లోని ఐక్యరాజ్యసమితి శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీరిని తిరిగి వారి స్వస్థలాలకు తరలించడం, లేదా వారికి కొత్త ప్రదేశాల్లో ఆశ్రయం చూపించడం ద్వారా హేతుపూర్వకమైన పరిష్కారం కనుగొనడం చాలా కష్టమైన పని. పైగా ఈ క్రమంలో భారీ స్థాయి హింస ప్రజ్వరిల్లే అవకాశం కూడా ఉంది. అరబ్ సంఘీభావం.. అతిపెద్ద అభాస క్షేత్రస్థాయిలో ఈ సంక్లిష్టతలు ఉన్న నేపథ్యంలో రెండు దేశాల పరిష్కారం ప్రతిపాదనను ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రత్యేకించి హమాస్ ఆమోదించేలా ఒప్పించడం అతి పెద్ద సవాలు అవుతుంది. 1967 నాటి సరిహద్దుల ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పర్చడాన్ని హమాస్ 2017 డాక్యుమెంట్ ఆమోదిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిం చకుండా, జెరూసలేం రాజధానిగా, అందరు శరణార్థులను తమ తమ స్వస్థలాలకు అంటే ఇజ్రాయెల్కు తీసుకువచ్చే నిబంధన కింద పాలస్తీనా వాసులందరినీ విముక్తి చేయడం అనే తన చిరకాల లక్ష్యాన్ని హమాస్ ప్రకటించడం గమనార్హం. మరోవైపున ఇజ్రాయెల్ ప్రధానిగా నూతనంగా ఎంపికైన నఫ్టాలి బెన్నెట్ ఈ రెండు దేశాల పరి ష్కారం అనే భావాన్నే తిరస్కరిస్తున్నారు. ఇరుపక్షాలు అవలంబిస్తున్న ఈ తరహా వైఖరి మరింత ప్రతిష్టంభననే తీసుకొస్తుంది. రెండు దేశాల పరిష్కారాన్ని ముందుకు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడానికి జరిగే ఏ ప్రయత్నానికైనా విస్తృతస్థాయి ప్రాతినిధ్యం, సంప్రదింపులు అవసరం అవుతాయి. అంతర్జాతీయ సమాజం ఈ భావాన్ని బలపరుస్తున్నప్పటికీ, దీనికి కీలకమైన మద్దతు పొరుగునే ఉన్న అరబ్ కమ్యూనిటీ నుంచి రావాల్సి ఉంది. ఇది ఇప్పుడు రాజకీయంగా, మతపరంగా వేరుపడి ఉంది. ఇరాన్, టర్కీ నుంచి గణనీయంగా హమాస్ మద్దతు పొందుతోంది. హమాస్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సౌదీ అరేబియా నాయకత్వాన్ని ఇరాన్, టర్కీలు సవాలు చేస్తున్నాయి. హమాస్కి ఇప్పటికీ బలమైన ఆర్థిక, సైనిక మద్దతు ఇరాన్ నుంచి వస్తోంది. దీంతో హమాస్ సంస్థతో ప్రత్యక్ష సంబంధాలు లేని అమెరికా దానితో చర్చించడానికి ప్రధానంగా జోర్డాన్, ఈజిప్టు దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సంక్లిష్ట వైరుధ్యాల గుండా ముందుకెళ్లి సామరస్యపూర్వకంగా ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యను పరిష్కరించడం బైడెన్ యంత్రాం గానికి చాలా కష్టమైన పనే. పరిష్కారం కుదరకపోతే.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తాత్కాలికమైనదిగా మాత్రమే కనిపిస్తుంది. 2008, 2012, 2014 సంవత్సరాల్లో కుదిరిన కాల్పుల విరమణలు తాత్కాలిక శాంతిని మాత్రమే కొనితెచ్చినట్లుగా ఈ ప్రాంతం మళ్లీ విస్తృత స్థాయి హింసాత్కక ఘర్షణలకు తావిస్తుందని భావించాల్సి ఉంటుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంది. తలపడుతున్న రెండు వర్గాలకు మద్దతు ప్రకటిస్తూనే జాగ్రత్తగా అడుగు వేయాలి. ఇజ్రాయెల్ పూర్వ ప్రధాని నెతన్యాహూతో సమానస్థాయి సంబంధాలను ప్రధాని మోదీ కలిగి ఉండనప్పటికీ, కొత్త ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఇజ్రాయెల్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్మరించకూడదు. అదేసమయంలో పాలస్తీనీయుల పట్ల భారత్ సానుభూతిని కూడా తోసిపుచ్చలేం. ఎందుకంటే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మద్దతును పాలస్తీనా ఉద్వేగభరితమైన మద్దతును పొందుతోంది మరి. డా. గద్దే ఓంప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సిక్కిం, మొబైల్:79089 33741 -
శాంతికి బాటలు పడాలి
దాదాపు 12 రోజుల దారుణ మారణ హోమం ముగిసింది. ఎప్పటిలాగే ఈజిప్టు చొరవతో ఇజ్రాయెల్–హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాడులు మొదలైన ప్పుడు ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందంటూ వెనకేసుకురావడమే కాక, భద్రతా మండలిలో దానికి అండగా నిలిచిన అమెరికా చివరకు వైఖరి మార్చుకుని తెరవెనక పావులు కదిపి ఈ కాల్పుల విరమణ ఒప్పందం సాకారమయ్యేలా చూసింది. కానీ ఈలోగా గాజా స్ట్రిప్లో 230మంది పౌరులు బలయ్యారు. 1,700మంది గాయపడ్డారు. రెండు వేలకుపైగా భవంతులు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ ఎందరినో పోగొట్టుకుని, ఆప్తుల్లో అనేకులు ఆసుపత్రుల పాలై విలపించే కుటుంబాలకు లెక్కలేదు. ఎటు చూసినా ఘర్ష ణలు మిగిల్చిన విధ్వంసమే. మొత్తం 60,000 మంది పౌరులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాల్సివచ్చింది. పాలస్తీనాలో ఎన్నో దశాబ్దాలుగా ఈ దృశ్యాలు పున రావృతమవుతూనే వున్నాయి. తాను ‘ఉగ్రవాద సంస్థల’ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నానని, వారి సైనిక సంపత్తిని దెబ్బతీస్తున్నానని ఇజ్రాయెల్ చెబుతూ వుంటుంది. అయితే గతంతో పోలిస్తే ప్రతిఘటన పెరిగింది. ఈసారి హమాస్ దాడులకు ఇజ్రాయెల్లో ఒక భారతీయ యువతితోసహా 12మంది మరణించారు. ఎవరు ప్రేరేపించారు...ఎవరు రెచ్చి పోయారన్న అంశాల్లో ఎప్పుడూ భిన్న దృక్పథాలుంటాయి. అయితే ఘర్షణలు చెలరేగినప్పుడు మొదటగా తగ్గవలసింది ఎప్పుడూ బలమైన పక్షమే. డోనాల్డ్ ట్రంప్ హయాంలోనైనా, అంతకు ముందు పాలించిన రిపబ్లికన్ అధ్యక్షుల సమయంలోనైనా అమెరికా ఎప్పుడూ ఇజ్రా యెల్కు మద్దతుగా నిలిచేది. డెమొక్రాట్లు మాత్రం కొంత ఊగిసలాట వైఖరితో ఇరుపక్షాలకూ శాంతి ప్రబోధం చేయడం రివాజు. ట్రంప్ సృష్టించిన వాతావరణం వల్ల కావొచ్చు... ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం శాంతికి పిలుపునిస్తూనే ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని మొదట్లో చెప్పారు. బహుశా స్వపక్షం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల చివరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో దాదాపు అరడజనుసార్లు మాట్లాడి కాల్పుల విరమణకు సిద్ధపడాలని ఒత్తిడి చేశారు. ఒకప్పుడు మన దేశం ఇజ్రాయెల్ చర్యలను గట్టిగా ఖండించేది. ఐక్యరాజ్య సమితిలో దానికి వ్యతిరేకంగా గళమెత్తేది. కానీ ఆ రోజులు పోయాయి. 2014 తర్వాత గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ చేసిన మొదటి భారీ దాడి కనుక మన ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుం దోనన్న ఆసక్తి ప్రపంచ దేశాలన్నిటా వుంది. అయితే ఇజ్రాయెల్పై హమాస్ దాడిని ఖండించ డంతోపాటు, ఇజ్రాయెల్ జరిపిన ‘ప్రతీకారదాడుల్ని’ కూడా భారత్ గతవారం నిరసించింది. వాటివల్ల భారీ సంఖ్యలో జననష్టం జరిగిందని, మహిళలు, పిల్లలు అనేకులు మరణించారని ప్రస్తావించింది. కానీ ఇజ్రాయెల్కు ఇది రుచించలేదు. అందుకే తమకు మద్దతునిచ్చిన దేశాలకు ట్విటర్లో కృతజ్ఞతలు చెప్పిన నెతన్యాహూ మన దేశం ఊసెత్తలేదు. పాలస్తీనా విషయంలో అమెరికా అనుసరిస్తూ వస్తున్న విధానమే ఇజ్రాయెల్కు బలంగా మారుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికల ప్రమేయం వుంటే...రష్యా, చైనాలకు కూడా పరిష్కార సాధనలో చోటిస్తే ఇజ్రాయెల్ ఇంత దూకుడుగా పోయేది కాదు. పాలస్తీనా ఈసరికే పూర్తి రాజ్య ప్రతిపత్తితో మనుగడ సాగించేది. పశ్చిమాసియాలో తన సైనిక, ఆర్థిక, రాజకీయ పలుకుబడి చెక్కుచెదరకూడదనుకుంటే ఇజ్రాయెల్ను గట్టిగా సమర్థించడమే మార్గమని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో గాజా స్ట్రిప్లో హమాస్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఏం చేయాలో తోచని ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా అక్కడి జనావాసాలపై దాడులు చేస్తోంది. భయకంపితులైన జనాలు సహజంగానే హమాస్పై తిరగబడి, దాన్ని కట్టడి చేస్తారని ఇజ్రాయెల్ వ్యూహం. నిరాయుధులైన పౌరులపై చేస్తున్న దాడులకు జవాబుదారీతనం వహించాల్సిందేనన్న ఒత్తిడి లేనంతకాలం అది ఈ వ్యూహాన్నే అమలు చేస్తుంది. భద్రతా మండలిలో ఎవరు తనకు వ్యతిరేకంగా నిలిచినా, అమెరికా తనకు అండగా నిలబడుతుందన్న భరోసా ఇజ్రాయెల్కు వుంది. అది పోగొట్టినప్పుడే పాలస్తీనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నానని, సౌదీ అరేబియాతో మరింతగా స్నేహసంబంధాలు ఏర్పడ్డాయని, ఇక ఇరాన్ కట్టడికి పకడ్బందీ వ్యూహం రూపొంది స్తున్నానని నెతన్యాహూ జబ్బలు చరుచుకున్నారు. కానీ గాజా స్ట్రిప్ నుంచి హమాస్ రాకెట్ దాడులు చేస్తున్న సమయంలోనే అరబ్, ఇజ్రాయెల్ పౌరుల మధ్య మత ఘర్షణలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికులతో వేలాదిమంది నిరసనకారులు తలపడటం గమనిస్తే అక్కడ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ప్రతిఘటన యధాతథంగా వుందని అర్ధమవుతుంది. కనుకనే తమకు వాస్తవమైన శాంతి కావాలని ఇజ్రాయెల్ పౌరులు కోరుకుంటున్నారు. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంకుల్లో గత కొన్నేళ్లుగా ఆక్రమిస్తూ వస్తున్న ప్రాంతాలనుంచి వైదొలగి, పాలస్తీనాతో శాంతియుత ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధపడినప్పుడే ఆ ప్రాంతంలో ప్రశాంతత సాధ్యమవుతుంది. ఇప్పుడు జరిగిన దురదృష్టకర పరిణామాలు ఆ దిశగా అడుగులు పడేందుకు దోహదపడాలని ఆశించాలి. -
ఇర్ఫాన్ పఠాన్, కంగనా రనౌత్ మధ్య మాటల యుద్ధం
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ల మధ్య సోషల్మీడియా వేదికగా మాటలయుద్దం నడిచింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి పరస్పరం ట్వీట్లతో విమర్శించుకున్నారు. విషయంలోకి వెళితే.. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాలస్తీనాలో జరుగుతున్న హింస గురించి ట్వీట్ చేశాడు. "నేను పాలస్తీనాకు మద్దతు తెలపడం లేదు. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న విధ్వంసకాండను తప్పు బడుతున్నా. మీకు కొంచెం మానవత్వం కూడా ఉంటే, పాలస్తీనాలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. మీరు మద్దతు ఇవ్వండి" అంటూ ట్వీట్ చేశాడు. అయితే పఠాన్ పాలస్తీన్కు మద్దతు ఇవ్వడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడింది. పఠాన్ను టార్గెట్ చేస్తూ .." ఇర్ఫాన్ పఠాన్కు ఇతర దేశాలపై అంత ప్రేమ ఉంది. కానీ తన సొంత దేశంలో బెంగాల్ జరుగుతున్న హింసపై ట్వీట్ పెట్టలేకపోయాడు" అంటూ విమర్శలు చేసింది. కంగనా ట్వీట్పై ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగానే బదులిచ్చాడు. "నా ట్వీట్లన్నీ మానవత్వం లేదా దేశస్థుల కోసమే. ఇందులో దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అభిప్రాయం ఉంది. మరోవైపు కంగనా మాత్రం ఇలాంటి వివాదాస్పద ట్వీట్లతో తన అకౌంట్ను తానే బ్లాక్ చేసేలా వ్యవహరిస్తుంది. ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు." అంటూ పేర్కొన్నాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య వివాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది? మరోవైపు ఇర్ఫాన్ ఫ్యాన్స్ కూడా కంగనా వ్యవహారంపై మండిపడుతున్నారు. చదవండి: వాడిలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని నాకు తెలియదు If you have even slightest of humanity you will not support what’s happening in #Palestine #SaveHumanity — Irfan Pathan (@IrfanPathan) May 10, 2021 All My tweets are either 4 humanity or countrymen, from a point of view of a guy who has represented India at d highest level. On d contrary counters I get from ppl like Kangna who’s account get dismissed by spreading hate n some other paid accounts are only about hate. #planned — Irfan Pathan (@IrfanPathan) May 13, 2021 -
అమ్మ కోసం ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గరే జపం
ఈస్ట్ జెరూసలేం: పేరు తెలిసిన వారికి కరోనా సోకితేనే అయ్యో, పాపం అని సానుభూతి చూపిస్తాం. అదే కుటుంబ సభ్యులకే పాజిటివ్ అని తెలిస్తే ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో బతుకుతాం. ఈ భయమే పాలస్తీనాలోని ఓ వ్యక్తిని వెంటాడింది. వెస్ట్ బ్యాంక్కు చెందిన జిహాద్ అల్ సువైతీ అనే వ్యక్తి తల్లి రష్మీ సువైతీ(73)కి కరోనా సోకింది. అప్పటి నుంచి అతని మనసు మనసులో లేదు. అమ్మే ప్రాణంగా బతుకుతున్న ఆ వ్యక్తి వెంటనే తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఎలా ఉందో చూడాలని ఒకటే తహతహలాడిపోయేవాడు. దగ్గరికి వెళ్తే కరోనా సోకుతుందన్న భయం, అమ్మను చూడకుండా ఉండలేని నిస్సహాయత.. వెరసి ఒక ఆలోచన చేశాడు. ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గర కూర్చుండి, అక్కడి నుంచి ఆమె తల్లిని కళ్లారా చూసుకునేవాడు. (కరోనా బాధితురాలిని ఇంటికి రానివ్వని అత్త) ఇలా ప్రతీరోజు జరుగుతూ ఉండేది. ఇంతలో హఠాత్తుగా ఆమె తల్లిని కరోనా కబళించింది. మంగళవారం సాయంత్రం కొడుకును తనివితీరా చూసుకున్న కొద్దిసేపటికే ఆ తల్లి ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్నంతటినీ సామాజిక కార్యకర్త మొహమ్మద్ సఫా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తల్లి కోసం తల్లడిల్లిన వ్యక్తి ఫొటోను సైతం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది. "కంట నీళ్లు ఆగడం లేదు", "మాటలు రావడం లేదు, కన్నీళ్లు మాత్రం జలజలా రాలుతున్నాయి", "నిజంగా ఎంత గొప్ప కొడుకు, ఇది చదువుతుంటే నాకు తెలీకుండానే కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి" అంటూ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా పాలస్తీనాలో ఇప్పటివరకు మొత్తం 8 వేల కేసులు నమోదవగా 60 మంది మరణించారు. (ఇంకోసారి కనిపిస్తే, దాని పీడ వదిలించుకుంటా) -
అదరకొడుతున్న ‘దబ్కే’ డ్యాన్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ సైనికులు ఓ పక్క దట్టమైన పొగ వెలువడేలా టైర్లను కాలుస్తూ మరో పక్క భాష్ప వాయువు గోళాలను ప్రయోగిస్తున్నా పాలస్తీనా నిరసనకారులు తమ ‘దబ్కే’ డ్యాన్స్ను ఆపలేదు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. ఒకప్పటి పాలస్తీనా ప్రజా నాయకుడు యాసర్ అరాఫత్ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన తరహాలోనే ముఖానికి ‘కెఫియే’ (తల మీదుగా నోటిని, ముక్కును చుడుతూ పాగా కట్టుకోవడం. భాష్ప వాయువు ప్రభావాన్ని తప్పించుకునేందుకే అరాఫత్ అలా కట్టుకునేవారట)ను కట్టుకొని చేతుల్లో చిన్న తాడును తిప్పుతూ ఆరుగురు మగవాళ్లు ‘దబ్కే’ డ్యాన్స్ చేస్తుంటే వారికి ఓ యువతి నాయకత్వం వహించిన వీడియో ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తోంది. ఇజ్రాయెల్లోని తమ సొంత గూటికి చేరే హక్కును పాలస్తీనీయన్లకు కల్పించాలనే డిమాండ్తో పాలస్తీనా ఆందోళనకారులు ‘గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్’ పేరుతో గత మార్చి 30వ తేదీన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ నిరసనకు మూడు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ శుక్రవారం నాడు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఈ ‘దబ్కే’ నత్యాన్ని ప్రదర్శించారు. దబ్కే అనేది అరబ్బుల సంప్రదాయ నత్యం. వేడుకల సందర్భంగా, ముఖ్యంగా పెళ్లిళ్లలో అరబ్బులు ఈ నత్యం చేస్తారు. పాలస్తీనా ఆందోళనకారులు ఈ మూడు నెలల నిరసన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి హింసకు పాల్పడకుండా వినూత్నంగానే నిరసన తెలిపారు. ఇజ్రాయెల్ సైనికులు ప్రయోగించిన భాష్ప వాయువు గోళాలను సేకరించి వాటిలో టెన్నీస్ రాకెట్లు పెట్టి విసరారు. కొన్ని రోజులు సరిహద్దుల్లో బుద్ధిగా కూర్చొని వలసవాద వ్యతిరేక పుస్తకాలను చదివారు. అవతార్ సినిమాల్లోని పాత్రల్లా ప్రత్యక్షమై వినోదాత్మకంగా నిరసన వ్యక్తం చేశారు. అయినా ఈ మూడు నెలల కాలంలో ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో 131 మంది పాలస్తీనా నిరసనకారులు చనిపోవడం, 14 వేల మంది గాయపడడం విచారకరం. -
ఇజ్రాయిల్ పాలస్తీనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత.. 37మంది మృతి
-
భారత్కు షాకిచ్చిన పాలస్తీనా!
రావుల్పిండి : అంతర్జాతీయ వ్యవహరాల్లో వెన్నుదన్నుగా ఉన్న అమెరికాను కాదని.. పాలస్తీనాకు భారత్ మద్దతిచ్చింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీసుకున్న జెరూసలేం నిర్ణయానికి వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. అంతేకాక జెరూసలేం నిర్ణయాన్నివెనక్కు తీసుకోవాలని అమెరికాను భారత్ కోరింది. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య సమతూకం పాటించే విషయంలో భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించింది. ఇదంతా జరిగి వారం రోజులు గడవకముందే భారత్కు పాలస్తానా భారీ షాక్ ఇచ్చింది. శుక్రవారం రావుల్పిండిలోని లియాఖత్ బాగ్లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని దిఫా ఈ పాకిస్తాన్ అనే సంస్థ జెరూసలేం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాకిస్తాన్లోని పాలస్తీనా రాయబారి వాలిద్ అబు వలీ, నిషేధిత ఉగ్రవాది హఫీజ్ సయీద్తో కలిసి వేదిక పంచుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సభలో మాట్లాడిన వక్తలంతా భారత్, అమెరికాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. హఫీజ్ సయీద్లో పాలస్తీనా రాయబారి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిషేధిత అంతర్జాతీయ ఉగ్రవాదితో పాలస్తీనా రాయబారి అలా వేదిక పంచుకోవడమేంటని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని భారత్లోని పాలస్తీనా రాయబారి, ఆ దేశ అధికారుల దృష్టికి తీసుకెళతామని, దానికి వారు సమాధానం చెప్పాలని మండిపడింది. దురదృష్టకరం : పాలస్తీనా ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో కలిసి తమ దేశ రాయబారి వేదికను పంచుకోవడంపై పాలస్తీనా విచారం వ్యక్తం చేసింది. ఇదొక దురదృష్టకర ఘటనగా ఆదేశం అభివర్ణించింది. పాకిస్తాన్లోని తమ రాయబారి వాలిద్ అబు వలీ ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పాలస్తీనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్ అభ్యంతరాలను గౌరవిస్తామని పాలస్తీనా పేర్కొంది. -
ట్రంప్ ప్రకటన.. కేంద్రంపై ఒవైసీ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జెరూసలెం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై గత రాత్రి నగరంలో పార్టీ తరపున నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న ఆయన స్పందించారు. ముందు ఇజ్రాయెల్ నుంచి ఆయుధాల కొనుగోలు ఆపేయాలని ఆయన భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలస్తీనా విషయంలో తటస్థ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్న భారత వైఖరిని ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. జనవరిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్హ్యు భారత్ లో పర్యటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వం ఆయా విషయాల్లో పునరాలోచన చేయటం మంచిదని ఒవైసీ హితవు పలికారు. ‘‘ట్రంప్ ప్రకటన ఒప్పందాల ఉల్లంఘన కిందకే వస్తుంది. తక్షణమే ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిది. అరబ్ దేశాలు, ఇస్లాం రాజ్యాలు కూడా ఈ విషయంలో ఇంకా మౌనంగా ఉండటం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పాలస్తీనాకు మద్దతుగా భారత్ నిలవాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన జెరుసలెం నగరాన్ని పాలస్తీనా రాజధానిగానే గుర్తించాలి’’ అని ఒవైసీ ప్రసంగించారు. ఇక ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటను ఒవైసీ గుర్తు చేశారు. ఫ్రెంచ్ వాళ్లు ఎలాగైతే ఫ్రాన్స్కు చెందుతారో.. అలాగే పాలస్తీనీయులు కూడా పాలస్తీనాకే చెందుతారు అని ఒవైసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1970 నుంచి ఇప్పటిదాకా అరబ్ దేశాల సరిహద్దుల్లో మోహరించిన ఇజ్రాయోల్ సైన్యాన్ని తక్షణమే ఎత్తివేయాలన్న డిమాండ్ను ఒవైసీ గట్టిగా వినిపించారు. -
జెరూసలేం పాలస్తీనాదే..!
ఇస్తాంబుల్: ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు ప్రపంచానికి పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్(ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొన్న ఆ డిక్లరేషన్లో ‘ ఇజ్రాయెల్ అధీనంలోని తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరుతున్నాం’ అని అన్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, అది శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియలో అమెరికా పాత్రను ఇకపై తమ ప్రజలు అంగీకరించబోరని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను ఇకపై ఐక్యరాజ్య సమితి చేపట్టాలని, అమెరికా ఆ అర్హత కోల్పోయిందన్నారు. జెరూసలేంను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ ఉగ్రదేశమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. -
సైనికులతో పాలస్తీనా పౌరుల కొట్లాట
బీరట్, లెబనాన్ : వివాదాస్పద నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తూర్పు దేశాల్లో పెను కల్లోలం రేపారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ బుధవారం రాత్రి ప్రకటించిన విషయం విదితమే. అక్కడితో ఆగని ట్రంప్ అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నగరం నుంచి జెరూసలేంకు మార్చుతున్నట్లు కూడా పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలతో ఆందోళనలకు పాలస్తీనాలోని రామల్లా, బెత్లేహంలోని ప్రజలు ఇజ్రాయెల్ దళాలతో కొట్లాటకు దిగారు. ట్రంప్ ప్రకటనపై అరబ్ దేశాల్లో ఓ వైపు బహిరంగ సభలు కొనసాగుతుండగా.. మరో వైపు నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియా దేశాల్లో మళ్లీ 1967 నాటి పరిస్థితులు తలెత్తుతాయేమోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ - పాలస్తీనాలు ‘జెరూసలేం’కు అంత ప్రాధాన్యతను ఎందుకు ఇస్తున్నాయో చూద్దాం. ‘జెరూసలేం’ ఓ ప్రాచీన పుడమి.. జెరూసలేం పుడమి ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ గడ్డపై క్రీస్తు నడయాడారని కూడా నమ్మకం. తొలిసారి 1948లో జెరూసలేం విషయమై అరబ్బులు, యూదుల మధ్య వివాదం రేగింది. దీంతో జెరూసలేంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఇజ్రాయెల్(యూదులు), తూర్పు ప్రాంతాన్ని అరబ్బులు కైవసం చేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో తూర్పుప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం ఎడతెగని రక్తపాతానికి కారణమైంది. జెరూసలేంలోని తూర్పు ప్రాంతంలో జరిగే ఘోరాల్లో బయటకు రాని వాటి సంఖ్యకు లెక్కేలేదు. ఆ ప్రాంతంలో అశాంతి రాజ్యమేలుతోంది. దాదాపు మూడు వేల ఏళ్ల నాటి నుంచి జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా ఉంటోందననేది యూదుల వాదన. ఇదే సమయంలో జెరూసలేంలోని తూర్పు ప్రాంతం పాలస్తీనాకు రాజధాని కావాలనేది అరబ్బుల కల. చాలా మంది అరబ్బులు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓటు హక్కు ఇవ్వకున్నా.. తూర్పు జెరూసలేంలోనే ఏళ్లుగా నివసిస్తున్నారు.