ravanth reddy
-
12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. 12వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. మార్చి చివరి వారంలో సీఎం రేవంత్రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను రాష్ట్ర ప్రభుత్వ బృందం కలవనుంది.కాగా, తెలంగాణ సర్కార్ శనివారం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలను ప్రారంభించనుంది. పరేడ్ గ్రౌండ్లో మహిళా సంఘాలచే ఆర్టీసీ అద్దె బస్సులు- మొదటి విడతలో 50 బస్సులకు పచ్చ జెండా ఊపి సీఎం ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లింపు, 31 జిల్లాల్లో మహిళా సంఘాలచే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలో ఒప్పందాలు, 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగా వాట్ల చొప్పున 64 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా సీఎం శంకు స్థాపన చేయనున్నారు. 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయనుంది.ఇదిలా ఉండగా, ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గనుల శాఖపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీ ఎండీసీ ద్వారానే సరఫరా చేయాలన్నారు.హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందని.. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా అధికారులను సీఎం ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. -
విమర్శలు తప్ప.. కేటీఆర్ చేసిందేమీలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమలు చేయకుండా మోసం చేశాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ వారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు అమలు చేయకుండా ప్రజలను ఏవిధంగా ఇబ్బందులపాలు చేశారో చెప్పినట్లే ఉంది. కాంగ్రెస్ను, సీఎం రేవంత్ని విమర్శిస్తూ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది’’ అని మల్లు రవి విమర్శలు గుప్పించారు.‘‘రైతు భరోసా 12 వేలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ ఇలా మేము ఇచ్చిన హామీలను అమలు చేశాం. మేము చేసింది వాస్తవం, మీరు చేయనిది వాస్తవం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల మంది విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాం. కార్పొరేట్ విద్యను 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టింది వాస్తవం. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పమో మొదటి ఏడాదిలోనే చేసి చూపించాం’’ అని మల్లు రవి పేర్కొన్నారు.బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి రూ.6500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. పేదలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు తల తాకట్టు పెటైనా నెరవేర్చాలనే సంకల్పంతో రేవంత్ పనిచేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నాం. ఇష్టారీతిన మాట్లాడితే కేటీఆర్ మీదకు ప్రజలు తిరగబడతారు. రాష్ట్రంలో అనవసరంగా ఖర్చులు చేసింది కేసీఆర్. వందేళ్లు పనిచేసే సచివాలయాన్ని కూల్చేసి కట్టారు. కేసీఆర్ హయాంలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేదు. మా హయాంలో ప్రజల పాలన నడుస్తుంది’’ అని మల్లు రవి చెప్పారు. -
రాజుకున్న కులగణన చిచ్చు.. రేవంత్ సర్కార్ పై మండిపడ్డ ప్రతిపక్షాలు
-
ఇక్కడి వాళ్లతో దావోస్లో ఒప్పందాలేంటి?: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు. తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్రెడ్డి విమర్శించారు.కాగా, సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది. -
తెలంగాణలో టికెట్ రేట్లపై దిల్ రాజు హాట్ కామెంట్స్
-
చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డిని కటింగ్ మాస్టర్గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..‘‘లక్షా 20 వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు కేసీఆర్. రైతును బద్నాం చేసే మాట, దొంగగా చిత్రీకరించేలా ఏడు వేల కోట్ల రూపాయలు మళ్లించారని మాట్లాడిండు రేవంత్. రెండో పంట వేయని రైతులను తప్పుగా చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. టీచర్ అయితే రైతుబంధు కట్ అంటుండు రేవంత్. ఇప్పుడు సీఎం అంటే కటింగ్ మాస్టర్’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.‘‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది ఈ ఏడాది. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకుండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టం. బాక్సింగ్లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది గుండు సున్నా. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది..కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్కు అప్పజెప్పాం. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం?. ఢిల్లీకి పంపుతున్నారు పైసలన్నీ. తెలంగాణా ఢిల్లీకి ఏటీఎం అయిపోయింది.కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశాడు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానిది. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు?. మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు?’’ అంటూ కేటీఆర్ విమర్శించారు. -
పోలీసుల మరణ మృదంగం.. సర్కార్కి పట్టింపు లేదా?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ములుగు జిల్లాలో ఎస్ఐ, సిద్ధిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైంది.’’ అని హరీష్రావు ట్వీట్ చేశారు.పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని హరీష్రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ‘‘పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత.’’ అంటూ హరీష్రావు సూచించారు.పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా ? ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు.…— Harish Rao Thanneeru (@BRSHarish) December 29, 2024 -
హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
రేవంత్ను ఎందుకు అరెస్ట్ చేయరు?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందెవరు?. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అంటూ ప్రశ్నలు గుప్పించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని హరీష్రావు మండిపడ్డారు.రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ని ఎందుకు అరెస్టులు చేయరు?. రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి’’ అని హరీష్రావు పేర్కొన్నారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి‘‘ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?. ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి. ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’’ అని హరీష్రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్తో నాకేం సంబంధం లేదు’ -
జరగబోయేది అదే.. రాహుల్కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.‘‘నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?. గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదు!. అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ అందరూ బాధితులే. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకూ వంచితులే. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం. మేము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.‘‘మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?. ఈ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే! అంటూ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS లేఖ♦️చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు.♦️ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?♦️తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? ♦️నమ్మి అధికారమిస్తే… pic.twitter.com/D4Nt9d8yDf— BRS Party (@BRSparty) December 11, 2024ఇదీ చదవండి: ఏం చేశాం.. ఏం చేద్దాం? -
కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్
సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఫామ్హౌస్కే పరిమితం కావడం సరికాదన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏ రాష్ట్రంలోనైనా రూ.21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా?. నిరూపిస్తే మేమంతా వచ్చి క్షమాపణలు చెబుతాం అంటూ కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు.‘‘సమస్యను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత. కేసీఆర్ ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను పోషించారా?. ఒక్కరోజైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేశారా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిదేనా?. మేం ఓడిపోయినా మళ్లీ ప్రజా తీర్పు కోరినాం. గెలిస్తే ఉప్పొంగడం.. ఓడితే కుంగిపోవడం మంచిదేనా?. కేసీఆర్ ఓ గాలి బ్యాచ్ను జతచేశారు. పరిశ్రమలు తెస్తామంటే, ఫార్మాసిటీ కడతాం అంటే, రోడ్లు వేస్తామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే మీరు వద్దు అంటున్నారు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? అంటూ రేవంత్ దుయ్యబట్టారు.పరీక్షలు పెట్టొద్దు.. ఉద్యోగాలు ఇవ్వొద్దంటే తెలంగాణకు మంచిదేనా?. 1200 మంది ప్రాణ త్యాగం చేసింది మీ ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు చేయడానికా?. జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబరు 7కు అంతే ప్రాధాన్యత ఉంది. తొలి దశ ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేశారు. మలిదశ ఉద్యమకాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశాడు. తొలి, మలిదశ ఉద్యమంలో నల్లగొండ గడ్డ ప్రాధాన్యత ఎంతో గొప్పది. నల్లగొండ గడ్డపై కాలు పెడితే నిజాంలను తమిరికొట్టిన ఉద్యమ స్పూర్తి వస్తుంది. ఫ్లోరైడ్ కారణంగా కన్నపిల్లలను కూడా తాళ్లతో కట్టేసి పనికిపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది’’ అని మండిపడ్డారు. -
CM రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
-
లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. మాజీమంత్రి హరీశ్రావు వ్యాఖ్య.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రజా పాలన విజయోత్సవాలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 9వ తేదీ సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం చేయనున్నారు. భారీ బహిరంగ సభకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 1వ తేదీ ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు జరగనుంది.డిసెంబర్ 2వ తేదీ అన్ని జిల్లాల్లో సీఎం కప్ పోటీలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఒక్కో రోజు ఒక్కో డిపార్ట్మెంట్కు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఏడాది కాలం పనితీరుపై లెక్కలను మంత్రులు వెల్లడించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మంత్రులు వరుస మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త వేడుకలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది.డిసెంబర్ 1:ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)డిసెంబర్ 2:16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం213 కొత్త అంబులెన్సులు ప్రారంభం33 ట్రాన్స్ జెండర్ క్లినిక్ల ప్రారంభంట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టుడిసెంబర్ 3:హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలుఆరాంఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభండిసెంబర్ 4:తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపనవర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.డిసెంబర్ 5:ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభంస్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ లో) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభంఘట్ కేసర్లో బాలికల ITI కాలేజీ ప్రారంభండిసెంబర్ 6:యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తి ప్రారంభం244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.డిసెంబర్ 7:స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభంపోలీస్ బ్యాండ్ ప్రదర్శనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.డిసెంబర్ 8:7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టుల ప్రారంభం130 కొత్త మీ సేవల ప్రారంభంయంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలుడిసెంబర్ 9:లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలుడ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు -
అదానీ వ్యవహారంలో తెలంగాణలో పోటాపోటీ రాజకీయం!
అదానీ స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఇంకోపక్క బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు వ్యూహాలు రచిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ప్రకటించిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు రేవంత్ ప్రకటించి తొలి అస్త్రం సంధించగా అదే అదానీతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, హరీశ్లు ఆరోపణలకు దిగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఉలుకు, పలుకూ లేకుండా ఉండటం. బహుశా మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టుంది బాబు గారి పరిస్థితి!సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడింది. అయితే ఈ అంశం తెలంగాణలో రేవంత్కు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తూంటే.. రేవంత్ మాత్రం కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, రేవంత్లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు రాహుల్ కొంత తడబడాల్సి వచ్చింది.ఆ తర్వాత ఏమైందో కాని తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దావోస్లో అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని, రేవంత్ స్వస్థలం కొడంగల్లో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంగతేమిటి? అని కూడా కేటీఆర్, హరీశ్కు ప్రశ్నిస్తున్నారు. అదానీకి తాము గతంలో రెడ్లైట్ చూపామని, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం కమిషన్లు వేయడం, ఈ-ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం ఆరోపణతోపాటు కొన్ని ఇతర అంశాల విషయంలోనూ కేటీఆర్పై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల హామీల అమలు వైఫల్యంతోపాటు హైడ్రా వ్యవహారాలు, మూసీ నదీగర్భంలో ఇళ్ల కూల్చివేత, లగచర్ల భూసేకరణ వివాదం వంటి అంశాలతో బీఆర్ఎస్ జనాల్లోకి వెళుతోంది. వీటన్నింటి మధ్యలో వచ్చిన అదానీ కేసును కూడా అందిపుచ్చుకునేందుకు ఇరు పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. నిజానికి అదాని విరాళానికి, ఆయనపై వచ్చిన కేసుకు సంబంధం ఉండకూడదు. కానీ.. రాజకీయాలలో పరిస్థితి అలా ఉండదు. అదానీ ప్రధాని మోడీకి సన్నిహితుడని, అతడిని రక్షిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు ఆరోపిస్తున్న విషయం కొన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు, నేతలకూ ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో చత్తీస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. దీన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడులోని డీఎంకే ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. జమ్ము-కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉండగా ఒప్పందం కుదిరింది. అంటే బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రంలలో ఒప్పందం కుదురిందన్నమాట. ఇందులో అవినీతి జరిగి ఉంటే ఆ మకిలీ కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ అంటుకుంటున్నట్లు అవుతుంది కదా! బీజేపీ ఇదే వాదన చేసి కాంగ్రెస్ పై ద్వజమెత్తింది. ఈ క్రమంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడినట్లయింది.ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణతో జరగక పోయినా ఆ ప్రభావం పెట్టుబడులపై పడుతోంది. రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై రేవంత్ వివరణ ఇస్తూ తానేదో అప్పనంగా వంద కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం తనకు ఇష్టం లేదని, స్కిల్ యూనివర్శిటీ వివాదాలలో చిక్కుకోరాదన్న భావనతో అదానీ విరాళాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అయితే తొలుత రేవంత్ ప్రభుత్వం సంతోషంగానే ఈ మొత్తాన్ని స్వీకరించడానికి సిద్దపడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనివర్శిటీకి ఉపయోగపడుతుందని భావించింది. కానీ రాజకీయ విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు.గతంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమన్న భావను రేవంత్ వ్యక్తపరిచారు. వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదానీతో డేటా సెంటర్ తదితర అగ్రిమెంట్లు చేసుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై బీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. నిజమే! ఏ పారిశ్రామిక వేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానిని స్వీకరించకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే రేవంత్ అన్నట్లు పరిశ్రమలు రాకపోతే తేలేదని అంటారు. తీరా ఏవైనా పరిశ్రమలు వస్తే ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు.అనుభవమైంది కనుక రేవంత్ ఈ మాటలు చెబుతున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ విపక్షంలో ఉంటే ఆయన కూడా ఇదే తరహా రచ్చ చేసేవారు. అంతెందుకు...గతంలో వైఎస్ జగన్ పై పెట్టిన ఆక్రమ కేసులలో అనేక పరిశ్రమలకు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ అడ్డుపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఉమ్మడి ఏపీకి చాలా నష్టం జరిగింది. అమెరికాలో అదానీ కేసు తేలకముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించుకుని పెట్టుబడులపై ప్రభావం పడేలా చేస్తారా అన్న చర్చ వస్తుంది.మరో వైపు చంద్రబాబు నాయుడు ఏపీలో జగన్ టైమ్ లో ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ, అదే టైమ్లో అదానితో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. జగన్ లేనిపోని ఆరోపణలు చేసే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడదు. ఈ ఒప్పందం వల్ల రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఈనాడు రాసింది నిజమే అయితే చంద్రబాబు వెంటనే సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా! అదానితో జగన్ ప్రభుత్వం అసలు ఒప్పందమే చేసుకోకపోయినా, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. అదానీ పై తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పరు.జగన్ టైమ్ లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సౌర, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అదాని ముందుకు వచ్చారు. వాటిని కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అదానిని ఏమైనా అంటే అది మోడీకే తగులుతుందన్న భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలియడం లేదా? పోనీ జగన్ టైమ్ లో కుదిరిన అగ్రిమెంట్లను వదలివేసి కొత్తగా అదానితో ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. పైగా అదానికి స్వయంగా ఎదురేగి స్వాగతం పలికి అనేక రంగాలతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూపు ముందుకు వచ్చిందని చంద్రబాబు ఆనందంగా ప్రకటించారు. అంటే అదానితో స్నేహం ఉండాలి. కాని జగన్ ను మాత్రం అప్రతిష్టపాలు చేయాలన్నమాట. చంద్రబాబు వ్యూహంలోని డొల్లతనం ఇక్కడే బహిర్గతం అయిపోతోంది. అదానీ, అంబాని వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడి తెస్తూంటే ఎవరూ వద్దనలేని పరిస్థితి ఉంది. కాకపోతే పారిశ్రామికవేత్తలపై వచ్చే ఆరోపణలను తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నారు.ఇక్కడ ఒక సంగతి గమనంలోకి తీసుకోవాలి. అంబానీ, అదాని తదితర బడా పారిశ్రామికవేత్తలను కాదని కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయడానికి సిద్దపడవన్నది వాస్తవం. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అంబానీకి వ్యతిరేకంగా అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నేపథ్యంలో ఆయన శాఖే మారిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.ఈనాడు మీడియా ఇన్ని నీతులు వల్లిస్తుంటుంది కదా.. అంబానీకి వ్యతిరేకంగా ఒక్క వార్త ఇవ్వగలుగుతుందా? మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీకి అంబానీ సాయపడ్డారని చెబుతారు. ఇప్పుడు కూడా అంబానీ, అదానీలు బీజేపీకి సన్నిహితులే.కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదానీపై విమర్శలు చేస్తున్నా, అధికారంలోకి వస్తే వారూ ఏమీ చేయరన్నది బహిరంగ రహస్యమే. అంబానీ, అదానీలను కాదంటే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. రాజకీయ దుమారం వేరు. వాస్తవ పరిస్థితి వేరు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా అతీతం కాదన్నది నిజం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎవరనుకున్నారు.. ‘మార్పు’ ఇంత మోసగిస్తుందని..: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి ఎత్తి చూపారు. తెలంగాణాలో పింఛన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?. ఠంచన్గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?’’ అంటూ ప్రశ్నస్త్రాలు సంధించారు.‘‘మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి... కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?. మందుబిళ్లల కోసం కొడుకులు , కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే 'మార్పు' వస్తుందని ఎవరనుకున్నారు?’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో.. ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు?. మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు?’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఇట్లా అవునని ఎవరనుకున్నారు?తెలంగాణాలో ఫించన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?టంచన్ గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి...కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?… pic.twitter.com/hDQKbjOSrR— KTR (@KTRBRS) November 27, 2024 -
తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్లు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో నూతన ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్తో పాటు మరో మూడు (పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్) విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు.పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని.. నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని చేస్తామన్నారు.‘‘ఆదిలాబాద్కు ఓవైపు చత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. దరిదాపుల్లో విమానాశ్రయం లేదు. అక్కడ ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రో యాక్టివ్గా వ్యవహరిస్తూ భూసేకరణకు సర్క్యులర్ జారీ చేసింది. అక్కడ పూర్తిగా ఎయిర్ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తాం. విమానయాన శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాదు.. టూరిజం ఉద్యోగ కల్పన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పెరుగుతుంది’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. -
రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు పరాభవం!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది. రేవంత్ ప్రచారం నిర్వహించిన షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్, చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్గా డిప్యూటీ సీఎం భట్టి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్లో ఇండియా కూటమి హవా సాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది.జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో రాంచీలో కాంగ్రెస్ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు జరుపుతున్నారు. -
రేవంత్ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానుంది.కాగా, తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) చేరిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు కేటాయించారు. -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్నగర్లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందం: బండి సంజయ్
సాక్షి, వికారాబాద్: కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశారు.. అది ఏమైంది?. మళ్లీ గణన ఎందుకు..? ఆ రిపోర్ట్ వాళ్లు బయట పెట్టలేదు. ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?’’ అంటూ బండి సంజయ్ నిలదీశారు.‘‘కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి..?’’ అని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: హైడ్రా బాస్తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్ -
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
20న తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్వోఆర్ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, భూమాత పోర్టల్, కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు, విద్యా కమిషన్, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: మాజీ సీఎస్ సోమేష్కుమార్కు సీఐడీ నోటీసులు -
సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ, పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం.. వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.గోషామహల్లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. -
కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్ను ఆమోదించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ-ఫైబర్ లక్ష్యమన్నారు. టీ-ఫైబర్ ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందిస్తామని రేవంత్ చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యం. టీ-ఫైబర్ అమలుగానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్రెడ్డి కోరారు. -
‘ఫోర్త్ సిటీ’ వెనుక కాంగ్రెస్ సర్కార్ భూదందా: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా కొనసాగుతోందని.. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర జరుగుతోందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం.. గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి.. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు.ధరణిపై భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన బండి సంజయ్.. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ భూదోపిడీపై చర్యలేవి?. కాంగ్రెస్కు హిందూ పండగలంటే అంత చులకనెందుకు?’’ అంటూ ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని.. ఆ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని వ్యాఖ్యానించారు. -
పద్దులపై చర్చ.. సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి: స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిందిరైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసింది.వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదు.పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగింది నిన్న 18 గంటలు...19 పద్దుల పై చర్చ జరిగింది: స్పీకర్ గడ్డం ప్రసాద్పద్దుల పై వరుసగా ఒకేసారి సభ్యులు మాట్లాడాలిసమయాన్ని దృష్టిలో పెట్టుకొని వరుసగా అన్ని పద్దుల పై మాట్లాడాలిసభ సజావుగా జరిగేందుకు నిన్న అందరూ సహకరించారు.ఇవాళ సైతం 19 పద్దుల పై చర్చ జరగాలి.. సభ్యులు సహకరించాలిప్రారంభమైన తెలంగాణ శాసన సభఆరో రోజు శాసన సభ సమావేశాలుప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన సభస్కిల్ యూనివర్సిటీ పై మొదలైన చర్చస్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం..వ్యవసాయ ఉత్పత్తులతో వేధికను అలంకరించిన వ్యవసాయ శాఖలక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపురెండో విడుత నిధులు విడుదల చేయనున సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క17 మంది రైతులకు రుణమాఫీ చెక్కు లను అందజేయనున్న సీఎంసాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు(సోమవారం) 17 గంటలకు పైగా జరిగిన శాసనసభ.. వేకువ జామున 3 గంటలల వరకు కొనసాగింది. 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాల్లో ఐదోరోజు 2024–25 వార్షిక బడ్జెట్ పద్దులపై సోమ వారం సుదీర్ఘ చర్చ జరిగింది. సమయపాలన పాటించి డిమాండ్లకు పరిమితమై మాట్లాడాల్సిందిగా స్పీకర్ సభ ప్రారంభమైన వెంటనే కోరారు. డిమాండ్లపై చర్చకు సంబంధించి ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలపాటు సమయం కేటాయిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే సోమవారం ఉదయం 19 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే నేరుగా పద్దులపై చర్చ ప్రారంభమైంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19 పద్దులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు.అయితే సభ్యులు తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రసంగించడం, ఒకేరోజు 19 పద్దులను చర్చించి ఆమోదించాల్సి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటినా చర్చ కొనసాగింది. -
ఎన్టీపీసీ పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కిషన్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘ఇందులో భాగంగా.. మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో.. మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను 3 అక్టోబర్ 2023 తేదీన, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను 4 మార్చి 2024 తేదీన ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్లో 85 శాతం విద్యుత్ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారు...ఈ 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ ఎన్టీపీసీతో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుంది.ఒకవైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. STPP-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే.. పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. 5 అక్టోబర్, 2023 తేదీన, 9 జనవరి, 2024 తేదీన, 29 జనవరి, 2024 తేదీన.. ఆ తర్వాత మొన్న 29 ఏప్రిల్, 2024 నాడు లేఖలు రాస్తే.. వీటికి ట్రాన్స్కో నుంచి సమాధానం లభించలేదు.ఇన్నిసార్లు లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న STPP-II ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో.. దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నది ఎన్టీపీసీ రాసిన లేఖల సారాంశం.30 మే 2024న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్చి 2024లో తెలంగాణలో గరిష్ఠంగా (పీక్ పవర్ డిమాండ్)15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ను అందించేందుకు.. రెండోదశ NTPC పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది.తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా.. దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందనేది మరోసారి నిరూపితమైంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం.. NTPC రాస్తున్న లేఖలపై స్పందించి.. PPA చేసుకుంటే అంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది. దీన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.’’ అని కిషన్రెడ్డి చెప్పారు. -
సభలో మా గొంతు నొక్కుతున్నారు.. హరీష్రావు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మా గొంతు నొక్కుతున్నారని.. ఏ పార్టీకి ఎంత సమయం ఇచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం సభను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగం చేశారని.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు చేసే ప్రకటనలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని హితవు పలికారు.‘‘ఉదయ్ స్కీం వల్ల కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు గతంలో మాకు ఇస్తామన్న మేము ఒప్పుకోలేదు. వ్యవసాయ బోర్డు దగ్గర మీటర్లు పెట్టకూడదని 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాం. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు కాకుండా.. పాత మీటర్ల చోట కొత్త మీటర్ల అంశం అందులో ఉంది. వ్యవసాయ భూములు మీటర్లు ప్రైవేటుపరం చేయకూడదని మేము కేంద్రం పెట్టిన నిబంధనలకు ఒప్పుకోలేదు. కేంద్రం పెట్టిన నిబంధనలకు మేము ఒప్పుకుంటే ప్రతి ఏడాది 5000 కోట్లు మొత్తం ఐదేళ్లు 30 వేల కోట్లు వచ్చేవి’’ అని హరీష్రావు పేర్కొన్నారు.హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎంహరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టదు. తలకిందులుగా తపస్సు చేసిన రైతులకు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. -
రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ''మనకు పనికిమాలిన ప్రభుత్వం అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది'' అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్పల్లి ఫ్లైఓవర్ కొన్ని నెలల క్రితం పూర్తయింది. కానీ నేటికీ, ఇది ప్రారంభోత్సవం కోసం వేచి ఉంది, ఎందుకంటే ఢిల్లీలోని ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ శాసనసభ్యుల ఇళ్ల మధ్య సీఎం బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కంటే తమ వ్యక్తిగత ప్రజాప్రతినిధులే ముఖ్యమని భావిస్తోంది'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.సంబంధిత అధికారులు తక్షణమే ఈ ఫ్లై ఓవర్ను ప్రజల ఉపయోగం కోసం తెరవాలని నేను కోరుతున్నాను.. లేదంటే ప్రజలు స్వయంగా దానిని ప్రారంభిస్తారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
అసలు ఉన్నట్టా? లేనట్టా?.. సీఎం రేవంత్కి హరీష్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆగమ్య గోచరంగా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. ''రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?'' అంటూ హరీష్రావు ప్రశ్నించారు.సీఎంగా కేసీఆర్.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారని లేఖలో పేర్కొన్న హరీష్రావు.. పలు డిమాండ్లను ప్రస్తావించారు. ‘‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి'' అని కోరారు.బ్రాహ్మణ ఎంటర్ ప్రెన్యూయల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలి'' అని హరీష్రావు డిమాండ్ చేశారు. -
ఇది మతిలేని చర్య.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కార్కు చేతకాదంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది!’’అంటూ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని… pic.twitter.com/E2EWqT0hve— KTR (@KTRBRS) July 10, 2024 -
విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు?: అంబటి
సాక్షి, తాడేపల్లి: ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని.. అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ ప్రశ్నించారు.‘‘నాగార్జునసాగర్ కుడి కెనాల్కు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదు. టీటీడీ బోర్డు, ఆదాయంలో వాటా కావాలని తెలంగాణ కోరింది. పోర్టుల్లో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏ ద్రోహాన్నిచేయబోతున్నారు?’’ అని అంబటి రాంబాబు నిలదీశారు.‘‘రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే అర్థమేంటి?. తెలంగాణ డిమాండ్లను చంద్రబాబు అంగీకరించినట్టేనా?. నాగార్జునసాగర్లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ చొరవతో పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్, ఒడిశాతో వివాదాలు పరిష్కారం అయ్యాయి. పోలవరం విషయంలో ఏపీకి ద్రోహం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. కాంట్రాక్టర్లను మార్చడం, రివర్స్ టెండరింగ్తో పోలవరం ఆలస్యం కాలేదు. చంద్రబాబు నది మధ్యలో కాఫర్ డ్యాం కట్టడం వల్లే పోలవరం ఆలస్యానికి కారణం’’ అని అంబటి వివరించారు.‘‘రాష్ట్ర విభజన వలన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన జరిగాక మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు. పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండేది. అప్పుడు దాన్ని చంద్రబాబు వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు?. బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. చంద్రబాబు తప్పు చేసినందునే మెడ పట్టుకుని గెంటేశారు. రాష్ట్రానికి రావాల్సినది ఏదీ తీసుకుని రాకుండా ఎందుకు పారిపోయారు. తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఏపీకి అన్యాయం చేశారు...మొన్నటి సీఎంల సమావేశంలో అసలు చంద్రబాబు ఏం చర్చించారు?. విద్యుత్ బిల్లు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉండగా దానిపై ఎందుకు చర్చించలేదు?. నాగార్జునసాగర్ లో నీరు విడుదల చేయటానికి కూడా తెలంగాణ మీద ఆధారపడేలా చేశారు. శ్రీశైలంలో విద్యుత్ సరఫరా విషయమై ఎందుకు మాట్లాడటం లేదు?. ఏపీలో సముద్రం తీరంలో టీటీడీలో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ కోరింది...ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు వ్యక్తిగత అంశాల కోసం ఏపీకి చెందిన గ్రామాలను తెలంగాణలో కలిపేస్తారా?. అసలు ఇద్దరు సీఎంల మధ్య సమావేశాలు జరిగితే దేని గురించి చర్చించారో ఎందుకు చెప్పటం లేదు?. చర్చలను రహస్యంగా ఉంచటానికి కారణం ఏంటి?. రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని చంద్రబాబు అనటం వెనుక కుట్ర ఏంటో బయట పెట్టాలి. పోలవరానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపబోతున్నారు. పోలవరం కాంట్రాక్టరుని మార్చటం వలనో, రివర్స్ టెండర్ వలనో నష్టం జరగలేదు. చంద్రబాబు హయాంలో కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయటం వలనే నష్టం జరిగింది..వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చంద్రబాబు ఇంకా మాట్లాడుతున్నారు. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోతే జగన్ విజృంభిస్తారు. విభజనచట్టంలో ఉన్న ప్రత్యేక హోదా హామీని చంద్రబాబు ఎందుకు అడగటం లేదు?. 9, 10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాన్ని ఎందుకు అడగటం లేదు. పోలవరంపై ఏం చర్చించారో బయట పెట్టాలి. అసలు విషయాలను పక్కన పెట్టి డ్రగ్స్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైఎస్సార్ జయంతిని ఎవరైనా జరుపుకోవచ్చు. ఆయనకు అభిమానులు ఎక్కువ’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
బాబూ.. రేవంత్తో ఏం చర్చించావ్.. ఏం సాధించావ్?: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు.. రేవంత్రెడ్డితో ఏం చర్చించారో రాష్ట ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరస్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజామా కాదా?. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు రూపంలో ఏపీకి పాపం తగిలింది. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారు. ఏపీకి చెందిన ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారు.’’ అంటూ కాకాణి నిలదీశారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ ఆరంభ శూరత్వాలే. ఆయన అనుకూలం మీడియా ఆహా.. ఓహో అనడం తప్ప సాధించిన ఫలితాలు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశంపై ఎంతో హైప్ క్రియేట్ చేశారు. ఈ భేటీలో ఏ అంశాలపై స్పందించారో.. వేటికి పరిష్కారం లభించిందనే విషయాన్ని వెల్లడించలేదు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కోసం ఒక ఆర్కిటెక్ మాదిరిగా చంద్రబాబును రేవంత్రెడ్డి పిలిచినట్టుంది’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.ఈ సమావేశానికి ఒక దశ.. దిశా లేదు.. పరా డబ్బా.. పరస్పర డబ్బా తప్ప సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వీరి చర్యలు ఉన్నాయి. పోలవరానికి సంబంధించి ఐదు గ్రామాలు ఇవ్వాలని తెలంగాణ కోరినట్లు.. దానిపై చంద్రబాబు ఏమి మాట్లాడారనే విషయాన్ని వెల్లడించలేదు. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించలేదు. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి ఆ గ్రామాలపై నిర్ణయం తీసుకుంటే భారీ తప్పిదమే అవుతుంది.’’ అని గోవర్థన్రెడ్డి హెచ్చరించారు.ముంపు మండలాల్లోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. టీటీడీలో కూడా వాటా అడిగినట్లుగా సమాచారం వచ్చింది.. దీనిని మంత్రులు ఎవరూ ఖండించలేదు. ఓటుకు నోటు కేసులో.. చిక్కుకున్న చంద్రబాబు హడావుడిగా.. అక్కడ నుంచి వచ్చేశారు.. దీనివల్ల లక్షన్నర కోట్ల మేర ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలిగింది. 9,10 షెడ్యూల్ కింద రావాల్సిన ఆస్తులు ఎన్నో ఉన్నాయి.. వీటిపై చంద్రబాబు స్పందించ లేదు’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి దుయ్యబట్టారు. -
విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: విభజన సమస్యలపై లోతుగా చర్చించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై చర్చించామని.. రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ మంత్రులు ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాలకు చెందిన సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేశాం. సీఎంల భేటీలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. సమస్యల పరిష్కారం కోసం సీఎస్లతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం’’ అని చెప్పారు.‘‘మంత్రులతో కూడిన మరో కమిటీ వేయాలని నిర్ణయించాం. 2 వారాల్లోగా త్రీమెన్ కమిటీ కొన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. అనంతరం రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేస్తాం. డ్రగ్స్ను నియంత్రించడానికి రెండు రాష్ట్రాలు ముందుకు వెళ్లాలని నిర్ణయించాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పేర్ని నాని ఆసక్తికర ట్వీట్
సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోంది!’’ అంటూ ట్వీట్ చేశారు.తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది !— Perni Nani (@perni_nani) July 6, 2024 కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఈ రోజు.. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు.విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. -
రేపు ప్రజాభవన్లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజా భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంలు సమావేశం కానున్నారు. ప్రధానంగా షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది.విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు.మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. -
హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు.పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్లకు పట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశమిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. సీఎం రేవంత్కు కేటీఆర్ ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: నేతన్నలవి ఆత్మహత్యలు కావు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనంటూ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అంటూ సీఎం రేవంత్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటివరకు 10 మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు అందిన ప్రతి పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా?. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. -
వరుస ఘటనలే నిదర్శనం.. కాంగ్రెస్, బీజేపీపై జగదీష్రెడ్డి విమర్శనాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు.తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ. ఏ సందర్బం వచ్చిన తెలంగాణ హక్కులను పరిరక్షించేది కేసీఆరే. తెలంగాణ హక్కుల్ని కాంగ్రెస్ ధారాదత్తం చేస్తోంది. వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా ప్రవర్తించింది. కేసీఆర్పై ఎదురు దాడి చేసి తప్పించుకుందామనుకుంటుంది కాంగ్రెస్. సింగరేణి బొగ్గు గనుల విషయంలో కూడా ప్రత్యక్ష కార్యాచరణ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బొగ్గు గనుల వేలంపై రేవంత్ రెడ్డి మాట మార్చారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎదురు దాడి మొదలు పెట్టారు.’’ అంటూ జగదీష్రెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ ఉన్నప్పుడే సింగరేణి అమ్మారంటూ భట్టి విక్రమార్క చెప్తున్నారు. అబద్ధపు మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారు. దేనికో లొంగిపోయి బీజేపీ, కాంగ్రెస్లు కలిసిపోయాయి. బహిరంగంగా ఫొటోలు దిగి పెడుతున్నారు కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వెనక కలిసి, ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు.’’ అని జగదీష్రెడ్డి దుయ్యబట్టారు. -
దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం.. రేవంత్కు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేసీఆర్..ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని అమరుల త్యాగాల పర్యావసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షంగా ప్రచారం చేస్తున్న మీ భావదారిద్య్రాన్ని నేను మొదట నిరసిస్తున్నానని లేఖల పేర్కొన్నారు.‘‘1969 నుంచి 5 దశాబ్దాలు భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది వాస్తవం ఇది సత్యం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ఉక్కుపచ్చలారని యువకులు కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకొని ఇవ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కషత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోతుంది. మలిదశ ఉద్యమంలో వందలాదిమంది యువకులు ప్రాణాలు బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీ దే’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నించింది తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయం శక్తిగా మలిచింది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలేశాం. మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీరోగమన దిశలో వెళ్తోంది’’ అని కేసీఆర్ లేఖలో మండిపడ్డారు.‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్దీజ్ఞ ఉత్తేజ కరమైన సందర్భమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్న ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో నేను పాల్గొనడం సమంజసం కాదని టిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది. పైన పేర్కొన్న కారణాల విద్య ప్రజా జీవితాన్ని క్రమక్రమంగా కల్లోలం లోకి నెట్టుతున్న మీ పాలనను మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లు అడుగడుగున అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరిని నిరసిస్తున్నాం. ఇందుచేత రేపటి దశాబ్ది ఉత్సవాలలో నేను పాల్గొనడం లేదు’’ అంటూ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. -
మూడు రంగులతో కాంగ్రెస్ మార్క్ రాజముద్ర
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ తమ మార్క్ రాజ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికారిక గేయం ఎంపిక.. అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు చేస్తోంది. పలు రకాలు లోగోలు డిజైన్ చేయగా, రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ వీరుల స్తూపానికి చోటు లభించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున లోగా ఆవిష్కరించనున్నారు. లోగో ఖారారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖారారు చేసే అవకాశం ఉంది.కాగా, దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది.తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
రేవంత్ రెడ్డి అనే జోకర్.. కేటీఆర్ షాకింగ్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.‘‘నా బంధువుకు వెయ్యి కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి’’ అంటూ దుయ్యబట్టారు.సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ అయిన సీఎం రేవంత్ రెడ్డినీ జైల్లో ఎందుకు పెట్టకూడదు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 1. Revanth manufactured a shameless Lie that my relative got 10000 crore Covid Drug Contract 2. The same Joker created Fake narrative that I dug Nizams jewels which were under Secretariat3. Revanth circulated Fake Video of Union Home Minister4. Being a CM he posted a…— KTR (@KTRBRS) May 24, 2024 ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుంచి పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చినం!’’ అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ‘‘జననం నుండి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తెచ్చినం. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులు.. నగరం నలుమూలలా నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు. ఒకటా? రెండా?. కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవం’’ అని కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. #తెలంగాణదశాబ్ది #TelanganaDecade🏥🩺🚑నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకుఅనే దుస్థితి నుండిపోదాం పదసర్కారు దవాఖానకేఅనే ధీమాను ఇచ్చినం! జననం నుండి మరణం దాకా,ప్రతి దశలో మన సర్కారున్నది అనేగొప్ప భరోసా తెచ్చినం. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లుడయాలసిస్ సెంటర్లు,… pic.twitter.com/FNkfJZPPHS— KTR (@KTRBRS) May 24, 2024 -
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ సమావేశం నిర్వహణకు షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్య వసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని ఈసీ స్పష్టం చేసింది.లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్య వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారులెవరూ క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. -
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.‘‘విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది’’ అని హరీశ్ పేర్కొన్నారు.‘‘రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారు’’ అని హరీశ్రావు మండిపడ్డారు.‘‘తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం’’ అంటూ హరీశ్ వ్యాఖ్యానించారు.‘‘సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిది’’ అంటూ హరీశ్రావు హితవు పలికారు. కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే…— Harish Rao Thanneeru (@BRSHarish) May 15, 2024 -
రేవంత్కు మతి భ్రమించింది
కంటోన్మెంట్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మతి భ్రమించిందని, సంచలనం కోసం ఏదిపడితే అదే మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందని బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి కేన్సర్లా పట్టుకుందన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్, బీజేపీ సీనియర్ నేత మల్క కొమురయ్యలతో కలిసి మహేంద్రాహిల్స్లో విలేకరులతో మాట్లాడుతూ...వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే దేశానికి కేన్సర్లా తయారైందన్నారు. గత రెండు పర్యాయాలుగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయిన కాంగ్రెస్కు ఈసారి కూడా అదే పరిస్థితి తప్పదని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. పాలించే సత్తా మాకే ఉందంటూ రేవంత్రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అవమానించారని విమర్శించారు. డీకే అరుణ గెలిస్తే, ఈటల ఆధ్వర్యంలో పనిచేయాల్సి వస్తుందనడంలో రేవంత్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ప్రజల మద్దతు నాకే ఉంది కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే కంటోన్మెంట్లో డబ్బు సంచులతో దిగిపోయిందని ఈటల ఆరోపించారు. అయినప్పటికీ మల్కాజ్గిరి ప్రజలు తనకే మద్దతు ఇస్తున్నారని అన్నారు. మోదీ సమర్థ పాలనతో దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కంటోన్మెంట్ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. అయితే కంటోన్మెంట్ విలీనానికి వ్యతిరేకంగా బీజేపీకే చెందిన కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ రాసిన లేఖ ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు. -
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని.. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డే ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.దిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు సాగనివ్వనంటూ రేవంత్ హెచ్చరించారు. బలహీనవర్గాల కులగణన చేస్తున్నామని. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతామన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని రేవంత్ మండిపడ్డారు. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 2021లో జనగణన చేయాల్సి ఉన్నా.. అమిత్షా కుట్ర చేసి నిలిపివేయించారంటూ ధ్వజమెత్తారు.పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్కు ఏమీ చేయలేదని రేవంత్ మండిపడ్డారు. -
రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
సాక్షి, ఢిల్లీ: రేపు(గురువారం) సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా గత విచారణలో వాయిదా కోరారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్లో మాట్లాడిన ఆడియో ఏసీబీ బయటపెట్టింది. "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసుపై ఎమ్మెల్యే ఆర్కే.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని పిటిషన్ వేశానని తెలిపారు. దర్యాప్తును సైతం సీబీఐకి అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నానని ఆయన తెలిపారు. 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది. 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను. గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు. రేపు కేసు విచారణ జరగబోతుంది’’ అని తెలిపారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా?. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు. అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి. ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి. మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే మాజీ మంత్రులు జగదీష్రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు. ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు’’ అని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు. నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు. నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది. ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు. ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి. ఓటుకి నోటు కు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఐదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది. ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు. రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు’’ అని ఆర్కే పేర్కొన్నారు. -
Tukkuguda: ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్షవేస్తాం: రాహుల్ గాంధీ
తుక్కుగూడ జన జాతర సభ.. రాహుల్ గాంధీ ప్రసంగం ముఖ్యాంశాలు కొన్ని రోజుల కిందటే ఇక్కడే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశా కొన్ని నెలల క్రితం తెలంగాణకు చేసిన వాగ్ధానం గుర్తుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటాం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మ యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నాం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాం మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారు తెలంగాణలో 30 వేల ఉద్యోగాలిచ్చాం మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రూ.500కు గ్యాస్ ఇచ్చాం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చాం దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో నారీ న్యాయ్ కింద ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష వేస్తాం .. నారీ న్యాయ్తో దేశ ముఖ చిత్రం మారబోతోంది ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తాం పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం ధనవంతులకు మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తాం దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే బడుగుల జానాభా 50 శాతం ఉంటే 5 శాతం ఉన్నవారి దగ్గరే అధికారం ఉంది కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తాం కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారు... గతంలో ఉన్న సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో మీకు తెలుసు వేల మంది ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించాడు ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశాడు రాత్రి పూట ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశారు ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలు పెట్టింది.. నిజం మీ ముందుంది కేసీఆర్ ఏం చేశారో మోదీరు అదే చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేశారో ఢిల్లీలో మోదీ అదే చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ బీ టీమ్ను ఓడించాం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ ఈడీ ఎక్స్టార్షన్ డైరెక్టరేట్గా మారింది ఒక రోజు సీబీఐ ఒక కంపెనీకి ఝలక్ ఇస్తుంది అదే కంపెనీ మరుసటి రోజు ఎన్నికల బాండ్లు కొంటుంది బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర ప్రేముంది.. బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర మీ ప్రేముంది బీజేపీ అనే అతిపెద్ద వాషింగ్మెషిన్ నడుస్తోంది బీజేపీకి డబ్బు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది మేము రాజ్యాంగాన్ని రద్దు చేయం మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం మా మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చాం ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది: సీఎం రేవంత్రెడ్డి జాతికి 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారు జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషం బీఆర్ఎస్ను ఓడించినట్లే దేశంలో బీజేపీని ఓడించాలి గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు బీఆర్ఎస్ను తుక్కుతక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోంది ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది ఉద్యోగాలివ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసింది పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి కేసీఆర్కు చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా .. రేవంత్ మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదు పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు లుంగీ లాగి చర్లపల్లిలతో చిప్పకూడు తినిపిస్తా కేసీఆర్కు జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలులో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నేను జానారెడ్డిని కాదు.. ఊరుకోవడానికి పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాది మేం హామీలు నెరవేరిస్తే 14 లోక్సభ సీట్లు గెలిపించండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్గాంధీ తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కరించిన రాహుల్ తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో 23 అంశాలు న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో 5 గ్యారెంటీల పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల భట్టి విక్రమార్క కామెంట్స్.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ప్రకటించాం కేసీఆర్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నాం 200 యూనిట్ల విద్యుత్ జీరో బిల్లులిస్తున్నాం జనజాతర సభకు చేరుకున్న రాహుల్గాంధీ తుక్కుగూడ జనజాతర సభకు చేరుకున్న రాహుల్గాంధీ రాహుల్గాంధీ వెంట పలువురు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్గాంధీ కేసీఆర్ మాట, యాస అదుపులో ఉంచుకుని మాట్లాడాలి : మంత్రి పొన్నం పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్గాంధీ కాసేపట్లో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ సభ కోసం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ ఘనస్వాగతం పలికిన సీఎం రేవంత్, భట్టి, దీపాదాస్ మున్షీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్గాంధీ తెలంగాణకు ఇచ్చే హామీలు వివరించనున్న రాహుల్ మళ్లీ సమర శంఖం కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్గౌడ్, మాణిక్రావు, డి.సు«దీర్రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
కాంగ్రెస్పై బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి ఫైర్
సాక్షి, కర్నూలు: పక్క రాష్ట్రాల్లో తరిమేసిన వారిని కాంగ్రెస్ అధ్యక్షులను చేసిందంటూ.. ఆ పార్టీపై బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షర్మిలను అద్దెకు తెచ్చి పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆంధ్రా ద్రోహులను తెచ్చి ఏపీపై దండెత్తుతారా? అంటూ ధ్వజమెత్తారు. రాయలసీమకు నీరు ఇవ్వకూడదని తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన సీఎంను తెచ్చి తిరుపతిలో మునిఫెస్టో విడుదల చేయిస్తారట ధ్వజమెత్తారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాజెక్ట్లపై వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీసీ.. తెలంగాణ కాంగ్రెస్ను కోరాలంటూ విష్ణువర్థన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Telangana Assembly Budget 2024 Session Updates ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రి గా పనిచేశాను అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు ..మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు ..నియంత్రణ ఎలా పెడతారు ఇలాంటి వాటిని తట్టుకుంటాం ..పోరాడతాం అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాష ను ఖండిస్తున్నాం: కడియం శ్రీహరి చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు సీఎం భాష కు ధీటుగా బదులు ఇవ్వగలం ..కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వలేదు బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు కంచెలు తొలగిస్తామని.. ఇదేమి కంచెల పాలనా? తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ ఆపిన పోలీసులు, మార్షల్స్ సభ జరుగుతున్న సమయంలో మాట్లాడ వద్దనే నిబంధన ఉందన్న పోలీసులు కొత్తగా ఈ రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్రావు, కేటీఆర్ వాగ్వాదం మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నం స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన:బీఆర్ఎస్ సభలో మైక్ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా? ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నిరసన తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము ఊరుకోవాలా: మంత్రి శ్రీధర్రెడ్డి సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు రాజగోపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వాఖ్యలలో అభ్యంతరాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలి రేపు సభలో ఇరిగేషన్పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.. అప్పుడు కాళేశ్వరంపై మాట్లాడండి. ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉంది: కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా?: సీఎం రేవంత్ మేడిగడ్డకు వెళ్లి సమస్యను పరిశీలించాం: సీఎం రేవంత్ ప్రభుత్వం సరైన భాష మాట్లాడటం లేదంటున్నారు కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా ఉందా? తప్పందా కొత్త ప్రభుత్వానిదే అన్నట్టు కేసీఆర్ మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా? ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు.. ఇప్పుడు చొక్కా లాగుతారు ప్రాజెక్టులపై చర్చిద్దాం ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి అవినీతి బయటపడుతుందని సభకు రాకుండా దాక్కుంటున్నారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుంది కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం కడియం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఐటీలో లక్షల ఉద్యోగాలను సృష్టించినందుకు కేటీఆర్కు థాంక్స్: కడియం ఐటీని తారా స్థాయికి కేటీఆర్ తీసుకెళ్లారు గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు: కడియం. ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు: శ్రీధర్ బాబు టీసీఎస్ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు: శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వఃపై బీఆర్ఎస్ బురదజల్లుతుంది. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్పై సభలో స్పందించిన బీఆర్ఎస్ మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి: కడియం శ్రీహరి విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుంది మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలి మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కేటీఆర్ రన్నింగ్ కామెంట్స్ మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్ను సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్ భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నన్ను భయపెడితే నేను భయపడను: మంత్రి పొన్నం భయపడితే భయపడడానికి నేను బానిసను కాదు: మంత్రి పొన్నం ఇరిగేషన్పై తెలంగాణ శాసనసభలో రసాభాస కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లు మా యువరాజు సిరిసిల్లకు అన్యాయం చేశారు కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వింది. శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలి ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుంది.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం:శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు: కడియం వనరులు చూసుకోకుండా, లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా?: కడియం బడ్జెట్పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే ఎమర్జెన్సీ అనగానే కడియం ను అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే - మంత్రి పొన్నం కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలి పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? నేను బుక్ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నా: కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలి బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలి అందరి కోసం కాదు... కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ... మరో వైపు బయట తిడుతున్నారు గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అభివృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75వేలు ఎలా పెడతారు? తెలంగాణ శాసన సభలో బడ్జెట్ పై మొదలైన చర్చ బడ్జెట్ పై BRS నుంచి చర్చను మొదలు పెట్టిన కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు:కడియం శ్రీహరి. బడ్జెట్పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరు: కడియం శ్రీహరి బడ్జెట్పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు అసెంబ్లీలో.. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి ఇరిగేషన్పై సభలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు నేడు తెలంగాణ అసెంబ్లీలో.. కాసేపట్లో ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ ఇరిగేషన్పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఇరిగేషన్పై చర్చకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి పిలుపు -
సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్పై విచారణకు ఆదేశిస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చులపై విచారణ జరిపిస్తామన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. శాండ్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం రేషన్ కార్టుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు. కాళేశ్వరం టూర్కు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలి. ఒకరోజు ముందు వెనుక అయినా మేం రెడీగా ఉన్నామని రేవంత్రెడ్డి అన్నారు. గత బడ్జెట్ కంటే ఈ సారి 23 శాతం తగ్గిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు. మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నాం. ఇరిగేషన్లో గతంలో రూ.16 వేల కోట్లు అప్పులు కట్టారు. ఇరిగేషన్పై శ్వేతపత్రం ఇస్తాం. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను సైతం పిలుస్తాం. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జ్యుడీషియల్ ఎంక్వైరీలో దోషులు తేలుతారు. మాట్లాడదాం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
4న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. ఆదివారం జరగనున్న సమావేశంలో మరో రెండు గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: జన్మలో కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: సీఎం రేవంత్రెడ్డి -
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానన్నారాయన. ‘‘మేము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమన్నారని నేను టికెట్ను నా కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని మల్లారెడ్డి అన్నారు. మరోవైపు, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు 71 ఏళ్లు వచ్చాయని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానన్న ఆయన.. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి ఐదేళ్లు.. ఈ ఐదేళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు. ఇదీ చదవండి: Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి.. విజయవంతంగా ప్రజల వద్దకే పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా.. వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇందిరమ్మ కమిటీలను ఊరు వాడ ఏర్పాటు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణలో దాదాపు 80,000 వాలంటీర్ ఉద్యోగాలు నియామకం చేపట్టనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఆరు గ్యారెంటీలకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగం.. ఆరు గ్యారెంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. వలంటీర్ల నియామకంలో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు. అలాగే ఆరు గ్యారెంటీల అమలుకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఇది పక్కాగా వలంటీర్ వ్యవస్థేనని తేలిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80 వేలమంది వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. ఇక ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా ఇస్తున్న విషయం తెల్సిందే. ఇక తెలంగాణలో కొత్తగా రానున్న వలంటీర్లకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వీరికి కూడా దాదాపు రూ.5000 నుంచి రూ.10,000 మధ్యలో ఇచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కావొద్దు: సీఎం జగన్ -
మా లాంటి సీనియర్లకు మీరు కేటాయించడం బాగుంది సార్!
మా లాంటి సీనియర్లకు మీరు కేటాయించడం బాగుంది సార్! -
తెలంగాణ సీఎంకు అభినందనలు.. చిరంజీవి ట్వీట్!
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుముల రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతే కాకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాగా.. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. అధికారంలో బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో సభలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. Hearty Congratulations to Sri @revanth_anumula garu on being sworn in as the new Chief Minister of Telangana. 💐 May our state achieve greater growth and prosper further under your leadership! Hearty Congratulations to Dy. CM Sri @BhattiCLP garu & all the members of the new… — Chiranjeevi Konidela (@KChiruTweets) December 7, 2023 -
టీ కాంగ్రెస్లో ‘సీఎం సీటు’పై మాణిక్రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతోందని, అది కేసీఆర్కి నచ్చడం లేదని, అందుకే కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. కేసీఆర్ పదేళ్ల పాటు తన కుటుంబం బాగు కోసమే పని చేశాడు. తెలంగాణలో పంటల బీమాకు దిక్కు లేదు. రైతు రుణ మాఫీ చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారు. 24 గంటల ఉచిత కరెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం’’ అని ఠాక్రే వెల్లడించారు. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! ‘‘తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థులకు కొదవలేదని, మాది కేసీఆర్లా కుటుంబ పార్టీ కాదు. రేవంత్, ఉత్తమ్, భట్టీ, మధు యాష్కీ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క లాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగా సీఎం ఎంపిక ఉంటుంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండదు’’ అని ఠాక్రే తెలిపారు. -
కేసీఆర్కు ‘ముందస్తు’కు వెళ్లే ధైర్యం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. శనివారం ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారన్నారు. ప్రజల కోసం చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోందని చెప్పారు. నడిచేది తానే అయినా నడిపించేది మాత్రం ప్రజలేనన్నారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అందుకు వైఎస్సారే కారణమని పేర్కొన్నారు. కాగా, శనివారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ట్విట్టర్లో షర్మిల ఘన నివాళి అర్పించారు. పరిపాలనలో నూతన సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని అన్నారు. తాళ్లమడలో పునఃప్రారంభం.. ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. ఓటుకు నోటు కేసులో దొరి కిన దొంగ. రెడ్డి స మాజానికి అధికారం ఇవ్వాలని, నాయకత్వం కట్టబెట్టాలని ఆయన చెబుతున్నా రు. అంటే మిగిలిన కులాలు నాయకత్వానికి పనికిరావా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుల రాజకీయం చేస్తుంటే.. అధిష్టానం కనీస చర్యలు ఎందుకు తీసుకోవ డం లేదో చెప్పాలి’అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాద యాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడలో శనివారం పునఃప్రారంభం అయ్యింది. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ వల్లే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఒక్క నిజాన్ని మాత్రమే రేవంత్ చెప్పాడన్నారు. అయితే, వైఎస్సార్ ఏనాడూ ఒక కులం తక్కువ.. ఒక కులం ఎక్కువ అని చెప్పలేదని గుర్తు చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తూ, పిచ్చివాడిలా మాట్లాడుతున్నారన్నారు. -
బహిరంగ చర్చకు సిద్ధమా..? మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్
సాక్షి, కరీంనగర్: బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే బండి సంజయ్, రేవంత్రెడ్డిలు వారి పార్టీలకు అధ్యక్షులు అయ్యారన్నారు. సంక్షేమ ఫలాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి సవాల్ విసిరారు. అధికారం కోసం బీజేపీ పాకులాడుతుందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకు కూడా తెలియదని నిప్పులు చెరిగారు. గతంలో తెలంగాణ కోసం తాము రాజీనామా చేస్తే.. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు ముఖ్యం అయ్యాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఇవీ చదవండి: క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా మన బడి నాడు-నేడు: టీచర్గా మారిన ఎమ్మెల్యే రోజా -
ఏసీబీ కోర్టులో నేడు ఓటుకు కోట్లు కేసు విచారణ
-
ఓటుకు కోట్లు కేసు: ‘నాకు ప్రాణహాని’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) కోర్టుకు హాజరయిన అనంతరం సెబాస్టియన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందన్నారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్ రిపోర్ట్పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతానని అందుకే సూత్రధారులతో ప్రాణహాని ఉందని సబాస్టియన్ పేర్కొన్నారు. (రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) -
వారిని తీవ్రంగా అవమానించారు: ఉత్తమ్కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ: హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని 30 రోజుల్లోగా బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హత్య జరిగి నాలుగు రోజులైనా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికీ బాధితురాలి కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. దాంతో నేరాలు పెరుగుతున్నాయి. జాతీయ రహదారిలో సైతం టీఆర్ఎస్ నేతలు బార్లు పెట్టారు అని ఆరోపించారు. మరోవైపు... ప్రధాని నరేంద్ర మోదీ చట్టాలను సవరించాలంటూ తప్పించుకోవాలని చూస్తున్నారని ఎంపీలు విమర్శించారు. ఏ సమయంలోనైనా స్త్రీలు బయట తిరగలిగేలా రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇక లోక్సభలో దిశ ఘటనపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ’దిశ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయి. హజీపూర్లో వరుస హత్యలు జరిగాయి. తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే హైకోర్టు దానిని మారుస్తూ జీవిత ఖైదు చేసింది. బాధితులకు న్యాయం జరిగాలంటూ ఇటువంటి ఘటనల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చట్టాలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. వారిని అవమానించారు: ఉత్తమ్కుమార్ రెడ్డి దిశ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదు. మా పరిధిలోకి రాదంటూ వారిని అటూ ఇటూ తిప్పారు. అవమానించారు. బాధితురాలు ఎవరితోనో వెళ్లిపోయిందంటూ నీచంగా మాట్లాడారు. రెండు మూడు పోలీసు స్టేషన్లకు వారిని తిప్పారు. ఒకవేళ వెంటనే పోలీసులు స్పందించి ఉంటే బాధితురాలి ప్రాణం నిలిచేది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. అందుకే జాతీయ రహదారుల వెంట మద్యం అమ్ముతున్నారు. ఈ ఘటనలో నిందితులు ఫుల్లుగా తాగి ఉన్నారు. మద్యం వల్లే నేరాలు పెరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఉత్తమ్కుమార్ రెడ్డి విఙ్ఞప్తి చేశారు. -
‘వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు’
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలతో కేసీఆర్కు మోదీకి మధ్య ఉన్న చీకటి సంబంధం బయటపడిందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఇక్కడ మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక చేతిలో మజ్లీస్, మరో చేతిలో బీజేపీ ని పట్టుకుని తిరుగుతున్నాడని మిమర్శించారు. ఎన్నికల్లో ఎన్డీయే, యూపీయే మధ్య పోటీ జరిగితే కేసీఆర్ ఎన్డీయేకు మద్దతుకు ఇచ్చారని, దీంతో మోదీకి ఆయనకి మధ్య ఉన్నచీకటి అనుబంధం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు దిశగా వెళ్తోందని ఆరోపించారు. మోదీకి, కేసీఆర్కి చీకట్లో ఉన్న వ్యక్తి ఎవరో కూడా నిన్నటి తమిళనాడు పర్యటనలో తేలిపోయిందన్నారు. కేసీఆర్ గుజరాత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సొంత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లాడని, మోదీ కి కేసీఆర్ కు మధ్య అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి ఛత్తీస్గఢ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. మార్వా విద్యుత్ కంపనీకి అదానీ బొగ్గు సరఫరా చేస్తున్నారని, అందుకే అధిక ధరలకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేశారని విమర్శించారు. అదానీ కంపనీకి ఆర్ధిక ఇబ్బందులు తొలగడం కోసం కేసీఆర్ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. తన స్వార్ధానికి తెలంగాణ ను అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెంచుకోవడం కోసం విద్యుత్ సంస్థల మీద ఆర్ధిక భారం పెంచుతున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్లను ముందు నిలబెట్టి అడ్డుకో ఉస్మానియాలో బడుగు, దళిత విద్యార్థులను ముందు పెట్టి రాహుల్ పర్యటన ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్కు దమ్ముంటే కేటీఆర్, హరీశ్లకు ముందు నిలబెట్టి రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుల్ని కింద పడేసి తొక్కి ఓయూ పర్యటన చేస్తారని పేర్కొన్నారు. 1200 మంది మంది బిడ్డలను చంపి సమాధుల్లో పెట్టి కేసీఆర్ పిల్లలను మాత్రం మంత్రులు, పార్లమెంట్ సీట్లల్లో కూర్చొపెట్టారని ఆరోపించారు. -
పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలి
ఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రెవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘూన్ని కోరారు. టీడీపీ టీఆర్ఎస్లో విలీనమైనట్లు స్పీకర్ మధుసూదనాచారి చేసిన ప్రకటన చెల్లదంటూ టీడీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘూన్ని కలిశారు. దీనిపై స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలోని పాత పది జిల్లాలను అనుసరించే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేవలం తన రాజకీయ స్వార్ధం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు. -
ఆ డబ్బెక్కడిదో.. నాకేమీ తెలియదు!
-
ఆ డబ్బెక్కడిదో.. నాకేమీ తెలియదు!
ఏసీబీ అధికారుల ప్రశ్నలకు రేవంత్ అడ్డగోలు సమాధానాలు పూసగుచ్చినట్లు వివరాలు వెల్లడించిన సెబాస్టియన్, ఉదయ సింహ సాక్షి, హైదరాబాద్: ‘మేం ఎమ్మెల్సీని గెలవాలె. మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎట్ల తనవైపు తిప్పుకున్నడో అట్లనే మేం కూడా టీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కన్నేసినం. తెలుగుదేశానికి ఓటేస్తె భవిష్యత్ బాగుంటదని చెప్పినం. స్టీఫెన్సన్ మాకు టచ్లోకి వస్తెనే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడిన..’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. కానీ స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు. ఆదివారం కేసు పరిశోధనాధికారి అశోక్కుమార్తో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు నిందితులను విడివిడిగా ప్రత్యేక గదుల్లో నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రేవంత్తో పాటు పట్టుబడిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చి పంపించారనే దానిపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అధికారులు తరచూ మారుతూ.. ‘ఆయన అలా చెప్పారు. నువ్వి లా చెబుతున్నావేంటి?’ అంటూ వారి నుంచి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. జానారెడ్డి మీకెందుకు సాయం చేశారు?: కాంగ్రెస్ నేత జానారెడ్డితో సన్నిహిత సంబంధాల గురించి అధికారులు రేవంత్ను ప్రశ్నించారు. జానారెడ్డి రాజకీయంగా తెలుసని రేవంత్ చెప్పగా.. ‘మరి 2009 ఎన్నికల్లో జానారెడ్డి మీకు ఆర్థికంగా ఎందుకు సాయపడ్డార’ని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. 2009 ఎన్నికల గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారని రేవంత్ ఎదురు ప్రశ్నించారని, దాంతో ‘అది నిజమా కాదా?’ అని అధికారులు నిలదీయగా రేవంత్ అడ్డంగా తలూపారని తెలుస్తోంది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి రేవంత్ సాగించిన భూ దందాలు, ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులు సాగించిన సెటిల్మెంట్ల విషయాన్ని ప్రశ్నించి నట్లు తెలిసింది. పలు కీలక వివరాలు వెల్లడి.. రెండో రోజు ఏసీబీ విచారణలో రేవంత్ సరైన సమాధానాలు చెప్పకుండా సతాయించగా.. మిగతా నిందితులు టీడీపీ క్రిస్టియన్ విభాగంలో ముఖ్యనేతగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ మాత్రం డబ్బు విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించినట్లు సమాచారం. రేవంత్తో తనకున్న పరిచయం, మత్తయ్య ద్వారా స్టీఫెన్సన్ను కలిసి డీల్ మాట్లాడిన విషయాలను సెబాస్టియిన్ ఏసీబీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. తానో చిన్న నాయకుడినని, తనకు అండగా ఉంటానని రేవంత్రెడ్డి చెప్పాకే స్టీఫెన్సన్తో సంప్రదింపులు జరిపానని చెప్పినట్లు సమాచారం. అలాగే స్టీఫెన్సన్ వద్దకు డబ్బుల బ్యాగు తెచ్చిన ఉదయసింహ కూడా తనకు డబ్బు ఎవరి ద్వారా వచ్చిందో అధికారులకు వివరించినట్లు తెలిసింది. రేవంత్రెడ్డి చెప్పిన ప్రకారమే తాను నడి చానని, తనకు రూ.50 లక్షలు సొంతంగా సంపాదించే శక్తి లేదని కూడా ఒప్పుకొన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరు చెప్పిన మాటల ప్రకారం రేవంత్ను అధికారులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియదనే బుకాయించినట్లు తెలిసింది. బాస్ చంద్రబాబు డబ్బులు పంపించారా? అని అధికారులు అడగగా.. డబ్బు గురించే తనకు తెలియదన్నప్పుడు బాబు గురించి ఎందుకడుగుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తంగా రెండో రోజు విచారణ అనంతరం ఏసీబీ అధికారులకు కేసు విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులు పంపించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సౌకర్యాలు కల్పించడం లేదు ఏసీబీ అధికారులపై రేవంత్రెడ్డి న్యాయవాదుల ఆరోపణ రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్రెడ్డిని ఏసీబీ అధికారులు దర్యాప్తు అనంతరం సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారని, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రేవంత్రెడ్డి తరఫు న్యాయవాది సుధీర్కుమార్ ఆరోపించారు. రేవంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని.. కలుషితమైన నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చిందని, జ్వరం కూడా ఉందని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ రిమాండ్ ఖైదీకి ఇచ్చే కనీస సౌకర్యాలు కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. సిట్లో కాకుండా సౌకర్యాలున్న కార్యాలయంలో నిందితులను ఉంచాలని ఏసీబీని కోరినట్లు చెప్పారు. ఇక ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహల తరపు న్యాయవాదులు రవికుమార్, రాకేష్సింగ్ సైతం ఇవే ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా ఉదయం సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ హెడ్క్వార్టర్స్కు తీసుకొచ్చేటప్పుడు రేవంత్రెడ్డి మీడియాను చూస్తూ.. ‘ఈ కొడుకులు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు..’ అని అరవడం గమనార్హం. రేవంత్ అనుమానాస్పద సంచారంపై ఆరా ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్రెడ్డి అనుమానాస్పద సంచారంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీకి దొరికిపోవడానికి ముందు వారం రోజుల్లో మూడు సార్లు గన్మన్ లేకుండా రేవంత్రెడ్డి బయటకు వెళ్లారు. ఆయన ఎక్కడికెళ్లారు, గన్మెన్లను ఎందుకు వద్దని వారించారు, ఎంతసేపు వెళ్లారు, ఆ సమయంలో గన్మెన్ ఎక్కడున్నారు.. తదితర వివరాలకు సంబంధించి గన్మెన్ల వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీంతోపాటు రేవంత్రెడ్డి అరెస్టుకు ముందు వారం రోజులకు సంబంధించిన కాల్ డేటాను ఏసీబీ విశ్లేషించింది. ఈ ఫోన్ సంభాషణలో దాదాపు 70 సార్లు చంద్రబాబు ప్రస్తావన ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. ఇక రేవంత్తోపాటు సెబాస్టియన్, ఉదయ్సింహ ఫోన్లకు వచ్చిన కాల్స్పైనా అధికారులు ఆరా తీశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న దాదాపు 20 మంది కాల్డేటాను ఏసీబీ సేకరించింది. -
రేవంత్ కేసుపై కేంద్రం ఆరా
గవర్నర్ను నివేదిక కోరిన హోంశాఖ ఆకస్మికంగా గవర్నర్ను కలిసిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ ముడుపుల వ్యవహారం ఢిల్లీకి చేరింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో రూ.5 కోట్ల డీల్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉందన్న ప్రాథమిక సమాచారంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల నివేదికను పంపించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కోరింది. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయంతోపాటు కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో కేసు వివరాల కోసం రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, సాక్ష్యాధారాలేమున్నాయి వంటి వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా గవర్నర్ను కలిశారు. వీరిద్దరూ అరగంటకుపైగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. టీడీపీ ముడుపుల వ్యవహారంపై రాష్ర్ట ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను ఈ సందర్భంగా అధికారులు గవర్నర్కు అందించినట్లు తెలిసింది. ఈ వివరాలను రేపో మాపో కేంద్రానికి నరసింహన్ నివేదించే అవకాశముంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకరోజు ముందు(గత నెల 31న) నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల నగదు ఇవ్వజూపిన టీడీ పీ నేత రేవంత్రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ బాస్(చంద్రబాబు) ఆదేశాల మేరకే ఈ డీల్ చేస్తున్నట్లు రేవంత్ పలుమార్లు అన్నట్లు ఏసీబీ వద్ద వీడియో ఆధారాలున్నాయి. ఈ ఉదంతం బయటపడిన మరుసటి రోజునే సీఎస్ రాజీవ్శర్మను గవర్నర్ పిలిపించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజ్భవన్కు వెళ్లి నరసింహన్ను కలిశారు. ఈ మొత్తం పరిణామాలపై జాతీయ మీడియా దృష్టిసారించింది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఇరుక్కున్నారని వార్తలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం కూడా ఈ కేసుపై ఆరా తీసింది. తాజాగా గవర్నర్ నుంచి నివేదిక కోరడం ప్రాధాన్యాతను సంతరించుకుంది. నోటుకు ఓటు కేసులో బాబును వదలం: తలసాని సాక్షి,హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును వదలం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ‘తెలంగాణ సినిమా - నిన్న- నేడు - రేపు’ అనే అం శంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, రేవంత్ల విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిళ్లు, ప్రభావాలు పని చేస్తున్నాయంటూ కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాస్తున్నాయని.. అది వాస్తవం కాదని తెలిపారు. బాబుపై చట్ట పరిధిలో చర్య లు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి భయపడదని తేల్చి చెప్పారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పట్టుబడి ఉంటే... రేవంత్లాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఇలా పట్టుబడి ఉంటే కొన్ని ప్రసార మాధ్యమా లు, పత్రికలు సంబంధిత ఎమ్మెల్యే, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి పేజీలకు పేజీలు రాసేవారన్నారు. జగన్ను ముద్దాయిగా చేసేవారన్నారు. వైఎస్ జగన్ ఏపీలో దీక్ష వేదిక నుంచి 100 ప్రశ్నలు సంధిస్తే దానికి స్పందించిన చంద్రబాబు ఆ హామీలు తాను సమైక్యంలో ఉన్నప్పుడు ఇచ్చినవని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ ఆనాడు ఎన్నికల అధికారులు ప్రశ్నిస్తే ఇవి సాధ్యమేనని చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. రేవంత్ విషయంలో మీడియాలో క్లిప్పిం గ్లు రానంత వరకు మీసాలు మేలేసి కుట్రలు, ట్రాప్ చేశారని ప్రగల్భాలు పలికారని.. టీవీల్లో వీడియోలు ప్రసారం కాగానే బాబుకు దిమ్మదిరిగి పోయిందన్నారు. -
రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం కింది కోర్టులో జరుగుతున్న విచారణతో సహా తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ను కించపరిచేలా రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేశారని, అతనిపై కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది కె.గోవర్ధన్రెడ్డి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కోర్టు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. దీనిపై మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. -
నువ్వాగన్నా... నేను రాకుంటేంది?
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా నిన్న అసెంబ్లీ లాబీలో నేతల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం సభ పది నిమిషాలు వాయిదా పడిన తర్వాత టీడీపీ, బీజేపీ నేతలు స్పీకర్ను ఆయన చాంబర్లో కలిసేందుకు వచ్చారు. బీజేపీ నేత లక్ష్మణ్ అప్పటికే స్పీకర్ ఛాంబర్కు చేరుకోగా... రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఎర్రబెల్లి దయాకరరావు.. స్పీకర్ ఛాంబర్ ఎదటు నిలబడిపోయారు. ఆ సమయంలో రేవంత్..రేవంత్ అంటూ ఎర్రబెల్లి ఒకింత గట్టిగానే పిలిచారు. జానా ఛాంబర్ ఎదుట విలేకర్లతో ముచ్చటిస్తున్న రేవంత్...'నువ్వాగన్నా.. నేను రాకుంటేంది? మీరు మాట్లాడలేరా..?' అంటూ విసురుగా సమాధానం చెబుతూ వెళ్లారు. దీంతో అవాక్కయి చూడటం ఎర్రబెల్లి వంతయింది.