Sampath Nandi
-
మహా కుంభమేళాలో తమన్నా ‘ఓదెల 2’ టీజర్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ టీజర్ని ఈ నెల 22న కాశీ మహా కుంభమేళాలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ 'ఓదెల 2' కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉంది.ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించగా, అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూర్చాడు. -
'సింబా' సినిమా రివ్యూ.. థ్రిల్లింగ్ చేస్తుందా..?
టైటిల్: సింబా నటీనటులు: జగపతిబాబు, అనసూయ, శ్రీనాథ్ మాగంటి, కబీర్సింగ్ తదితరులు నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్ దర్శకత్వం: మురళీ మనోహర్ రెడ్డి విడుదల తేది: ఆగస్ట్ 9, 2024కథేంటంటే.. ?హైదరాబాద్ నగరంలో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త పార్థ(కబీర్ సింగ్) సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. విచారణ కోసం పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) నగరానికి వస్తాడు. ఈ క్రమంలో మరో హత్య కూడా అలానే జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్ టీచర్ అనుముల అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్(శీనాథ్ మాగంటి) ఉన్నారని తెలిసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకి తరలించే క్రమంలో హత్య చేయాలని పార్థ ప్లాన్ వేస్తాడు. అయితే వీరిద్దరు కలిసి తమను చంపాడానికి వచ్చిన వ్యక్తిని పోలీసుల ముందే చంపేస్తారు.ఈ హత్యలో డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) భాగస్వామి అవుతాడు. అసలు ఎలాంటి సంబంధంలే లేని ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? బొద్దింకను కూడా చంపడానికి ఇష్టపడని అక్షిక..దారుణ హత్యలు ఎలా చేసింది? పురుషోత్తమ్ రెడ్డి అలియాస్ సింబా(జగపతి బాబు) ఎవరు? ఆయనకు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పార్థకి, పురుషోత్తమ్ రెడ్డి మధ్య ఉన్న వైరం ఏంటి? పోలీసాఫీసర్ అనురాగ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? అనేది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక రివేంజ్ డ్రామా.. బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ని టాలీవుడ్కు డైరెక్టర్ పరిచయం చేశారు. ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే, ఇందులో వాటన్నింటికి భిన్నంగా ఆసక్తి రేకెత్తించేలా సినిమా ఉంటుంది. భవిష్యత్ సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. ఈ అంశాన్ని ఇందులో చూపించిన తీరుని డైరెక్టర్ మురళీ మనోహర్రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పస్టాప్లోనే కథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. దాదాపు చాలా సీన్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతున్న తీరును ఆసక్తిగా చూపించిన దర్శకుడు.. ఈ హత్యల వెనక ఎవరుంటారో అనేది చెప్పడంలో కాస్త విఫలం అయ్యాడు అనిపిస్తుంది.అలా వరుస హత్యలతో పస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతున్న క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సిల్లీగా అనిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని ఆసక్తిగా చెప్పడం లో కాస్త విఫలం అయ్యాడు. ఫోన్ కాల్ లిస్ట్తోనే హంతకులను పట్టుకున్న తీరు ఏమాత్రం మెప్పించదు. సెకడాఫ్లో క బయాలాజికల్ మెమరీ అంశం అనేది తెరపైకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. పురుషోత్తమ్ రెడ్డి (జగపతిబాబు ) కథ ఇక్కడే మొదలౌతుంది. సినిమాలో ఆయన పాత్రని చివరి వరకూ పెద్దగా ప్రభావం లేకుండా కథ నడపం కాస్త మైనస్ అనిపిస్తుంది. కథ సాధారణమై అయినా.. దర్శకుడు చూపించిన తీరు థ్రిల్లింగ్కు గురిచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ముందుగా సింబా దర్శకుడు మురళీ మనోహర్రెడ్డిని మెచ్చుకోవాలి. ఉన్నంతలో బాగానే తీశాడు. జగపతిబాబు, అనసూయ లాంటి స్టార్స్ను పాత్రల మేరకు బాగానే ఉపయోగించుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వశిష్ఠ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. కథ చివర్లో ఆయన నటించిన తీరు మెప్పిస్తుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించిన కబీర్ పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ మేరకు సినిమా మించే ఉందని చెప్పవచ్చు. ఫైనల్గా అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చే సింబా మెప్పిస్తాడు. -
ఆ డెరెక్టర్పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్ను సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కించిన రచ్చ బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. Thankyou for your kind words @IamSampathNandi , it means a lot✨ I have always strongly believed that filmmaking is a collaborative effort. Even if it begins with one person’s vision, it’s the fusion of each team member’s perspective that matters and Sampath truly understands… https://t.co/SVcRFRMt6O — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 10, 2024 -
Odela 2 Movie: ‘ఓదెల 2’లో మిల్కీ బ్యూటీ.. కాశీలో గ్రాండ్ గా ఓపెనింగ్ (ఫోటోలు)
-
'సౌండ్ పార్టీ' టీజర్.. స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తీస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?) తాజాగా ప్రసాద్ ల్యాబ్స్లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా 'సౌండ్ పార్టీ' టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సౌండ్ పార్టీ' టీజర్ బాగుంది. మోహిత్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుంది' అని అన్నారు. (ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ) -
‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ లో కనిపిస్తోంది: శర్వా
‘‘హీరో ఆది సాయికుమార్ని నేను బ్రదర్లా భావిస్తాను. ఆదికి సక్సెస్ వస్తే నేనూ ఎంజాయ్ చేస్తాను. నిర్మాత రాధామోహన్ గారు పదేళ్లుగా తెలుసు. నేను హీరోగా చేసిన ‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు శర్వానంద్. ఆది సాయికుమార్, మిర్నా మీనన్ జంటగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హీరో శర్వానంద్, దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు మారుతి. ‘‘రాధామోహన్ గారితో తొలి సినిమా చేసే దర్శకులకు విజయం వస్తుంది. అలా ఫణి కృష్ణకు కూడా ‘క్రేజీ ఫెలో’తో విజయం వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు సంపత్ నంది. ‘‘క్రేజీ ఫెలో’ హిలేరియస్ ఎంటర్టైనర్. సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది’’ అన్నారు ఆది. ‘‘ఈ సినిమాలో ఆది సాయికుమార్ కొత్తగా కనిపిస్తారు. మేం అందరం క్రేజీగా పని చేశాం’’ అన్నారు ఫణి కృష్ణ. ‘‘ఈ కథకు ఆది బాగా సరిపోయాడు. దర్శకుడిగా ఫణి కృష్ణకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు రాధామోహన్ . ఈ కార్యక్రమంలో నటుడు అనీష్ కురువిల్లా, నటి వినోదినీ వైద్యనాథన్, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పవన్తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?
ఒకవైపు రాజకీయాలు ఇంకో పైవు సినిమాలు అంటూ రెండు పడవల పై ప్రయాణం సాగిస్తున్నాడు పవర్స్టార్ పవన్ కల్యాణ్. అతని ప్లాన్ అతనికి ఉంది. కాని అతని సినిమాలతో కెరీర్ ప్లాన్ చేసుకున్న దర్శకుల ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతోంది. ఏళ్ల తరబడి పవన్ దర్శకులు ఖాలీగా కూర్చోవాల్సి వస్తోంది. మరికొందరికైతే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసినప్పటికీ అతనితో సినిమా చేసే అవకాశం మాత్రం రావడం లేదు. దీంతొ కొంత మంది దర్శకులు పవన్తో సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారు. గద్దలకొండ గణేష్(2019) తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు హరీశ్ శంకర్. వీరిద్దరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.కేవలం పవన్ కోసమే హరీశ్ రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు.ఇప్పుడు పవన్ భవదీయుడు చేసేందుకు టైమ్ లేదు అంటున్నాడట పవన్. అందుకే హరీష్ ఇక తన వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. (చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్లు ఇవే..) మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా ప్రకటన చేశాడు. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ తో మూవీ అంటుంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో మూవీ కమిట్ అయ్యాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలోనూ దర్శకుడు సంపత్ నంది పవన్ తో సినిమా కోసం ఇలాగే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశాడు. అయితే లాస్ట్ కు ఆ ఛాన్స్ ను బాబి అందుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు సినిమా ఆగిపోయిందంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే క్రిష్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలను అన్ని పక్కనపెట్టి , రెండేళ్లుగా తనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్న దర్శకులను కాదని, తమిళ సినిమా వినోదయ సిత్తంను సముద్రఖనితో కలసి రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కావాల్సింది..కానీ అదీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పవన్ చేతిలో ఉన్న సినిమాలేవి ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశల్లేవు. పవన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు నిరాశ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆ డైరెక్టర్తో సాయిధరమ్ తేజ్ యాక్షన్ ఎంటర్టైనర్..
Sai Dharam Tej Movie With Director Sampath Nandi: తనదైన శైలీలో సినిమాలతో అలరిస్తున్నాడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఇటీవల రిపబ్లిక్ మూవీతో సందడి చేసిన సాయిధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనుంది. హై ఓల్టేజ్ యాక్షన్గా రూపొందనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. సంపత్ నంది మార్క్ ఆఫ్ స్టైల్తో సాయితేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. కాగా కార్తీక్ అనే కొత్త దర్శకుడితో ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి:👇 లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
ఫారెస్ట్ మ్యాన్ గా జగపతిబాబు..ఫస్ట్లుక్ పోస్టర్ వైరల్
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సింబా’. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు డైరెక్టర్ సంపత్ నంది కథను అందించగా.. మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్పై సంపత్నంది, రాజేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం(జూన్ 5) ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్నంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుగారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నాం’ అని మేకర్స్ రాసిన వ్యాఖ్యలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్న వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. Here’s our Mother Nature's very own child💪🏾💚 Elated to introduce our beloved @iamjaggubhai garu as #SIMBAA - The Forest Man 🔥 on this #WorldEnvironmentDay More details 🔜@mmrdirects@SampathNandi_TW @anusuyakhasba #RajenderReddy @vamsikaka @dhani_aelay pic.twitter.com/j3FzSb5G78 — Sampath Nandi (@IamSampathNandi) June 5, 2022 -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు
Sampath Nandi Visits Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సంపత్ నంది వెంట కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పలువురు ఉన్నారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశామని సంపత్ నంది తెలిపారు. త్వరలో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంపత్ నంది 'బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్' చిత్రాలకు కథ అందించారు. 'ఏమైంది ఈవేళ' సినిమాతో తెరంగ్రేటం చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రచ్చ' చిత్రంతో హిట్ కొట్టిన డైరెక్టర్ సంపత్ నంది. తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దర్శకుడిగానే కాకుండా పేపర్ బాయ్, గాలిపటం సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన సిటీమార్ 2021లో భారీ హిట్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కబడ్డీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో గోపిచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదీ చదవండి: పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది -
‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది: గోపీచంద్
‘నేను హిట్స్, ఫ్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ఫ్లాపా? అని నాకొచ్చే ఫోన్కాల్స్ చెప్పేస్తాయి. ఈ మధ్య కాలంలో నా సినిమాలు హిట్ అని వినలేదు. కానీ, ‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది. శ్రీనివాసా చిట్టూరి, పవన్ పడిన కష్టానికి ఇంత పెద్ద హిట్ వచ్చింది. సంపత్ కూడా ఈ హిట్తో ఆపకుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాలి’ అన్నారు హీరో గోపీచంద్. చదవండి: Seetimaarr Review In Telugu: కూత అదిరింది.. సీటీ కొట్టాల్సిందే! సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటింన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సీటీమార్ ఈ నెల 10న విడుదలైంది. థియేటర్లో విడుదులైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. నిన్న జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్లో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ‘‘గౌతమ్ నంద’ మా అంచనాలు అందుకోలేకపోయింది. ‘సీటీమార్’తో గోపీచంద్ బాకీ తీర్చేసుకున్నాను’’ అన్నారు. చదవండి: బిగ్బాస్ అన్యాయం చేశాడని ఏడ్చేసిన సరయూ -
‘సీటీమార్’మూవీ రివ్యూ
టైటిల్ : సీటీమార్ నటీనటులు : గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: సంపత్ నంది సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో మ్యాచోస్టార్ గోపిచంద్ ఒకరు. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్.. ఇటీవల కాలంలో రొటీన్ సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’అని టైటిల్ పెట్టడం, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను గోపిచంద్ అందుకున్నాడా? ‘సీటీమార్’సినిమాకు ప్రేక్షకులు సీటీలు కొట్టారా లేదా? రివ్యూలో చూద్దాం. ‘సీటీమార్’ కథేంటంటే..? ఆంధ్రప్రదేశ్కు చెందిన కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపిచంద్) స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగం పొందుతాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన గ్రామంలోని ఆడపిల్లలకు కబడ్డీ కోచింగ్ ఇస్తుంటాడు. వారిని ఎలాగైనా నేషనల్ పోటీల్లో గెలిపించాలని తపన పడతాడు. కప్పు కొట్టి గ్రామంలోని పాఠశాలను మూతపడకుండా చేయాలనేది అతని లక్ష్యం. అనుకున్నట్లే కార్తీక్ టీమ్ నేషనల్ పోటీలకు ఎంపికవుతుంది. కట్చేస్తే..గేమ్ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్తీక్ టీమ్లోని ఆడపిల్లలు కిడ్నాప్నకు గురవుతారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి కార్తీక్కి ఎలాంటి సాయం చేసింది. నేషనల్ కప్పు కొట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్న కార్తీక్ ఆశయం నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? కబడ్డీ కోచ్గా గోపిచంద్ అదరగొట్టేశాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్తో సినిమా మొత్తాన్ని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్ సీన్స్లో అద్భుతంగా నటించాడు. ఇక తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా మెప్పించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్గా దిగంగన సూర్యవంశీ చక్కగా నటించింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా జీవించేశాడు. తెరపై చాలా క్రూరంగా కనిపించాడు. హీరో అక్కగా భూమిక, పోలీసు అధికారిగా రెహమాన్ ఫర్వాలేదనిపించారు. గ్రామ ప్రెసిడెంట్గా రావురమేశ్ మరోసారి తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. ఆయన చేసే సీరియస్ కామెడీకి, పంచులకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే.. గోపిచంద్ తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం‘సీటీమార్’. అయితే దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేసి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మలిచాడు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రగతి, అన్నపూర్ణమ్మల గ్యాంగ్.. టీవీ యాంకర్ దిగంగన పెళ్లిని చెడగొట్టే సీన్ అయితే థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్కి నవ్వని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సెకండాఫ్లో ఇలాంటి కామెడీ లేకపోవడం, కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా రోటీన్గా ఉండడం సినిమాకు మైనస్. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఫ్యాన్స్తో ఈలలు కొట్టిస్తున్న సీటీమార్ ట్రైలర్
Seetimaarr Trailer: హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్గా నటించిన చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఒక ఊరి నుంచి 8 కబడ్డీ ఆటగాళ్లను పంపించడం కుదరదు అని ఓ వ్యక్తి అడ్డు చెపుతుండగా.. 'రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు, రూట్ లభించి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు' అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. 'మన దేశంలో మగాళ్లు కనీసం అరవయ్యేళ్లు బతికి చచ్చిపోతున్నారు, ఆడాళ్లు కూడా అరవయ్యేళ్లు బతుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చచ్చిపోతున్నారు..' అని చెప్పే డైలాగ్ జనాలకు కనెక్ట్ అవుతుంది. మొత్తానికి తన టీమ్ను గెలిపించడానికి ఎంతకైనా తెగించడానికి రెడీ అయ్యాడీ కబడ్డీ కోచ్. మరి వీరి కూత వినాలన్నా, కబడ్డీ ఆట చూడాలన్నా సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే. -
గాడ్ ఫాదర్: సంపత్ నంది, చిరును కలవడానికి కారణం ఇదేనట!
ఇటీవల డైరెక్టర్ సంపత్ నంది మెగాస్టార్ చిరంజీవిని కలిసి భేటి అయిన ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న చిరును సంపత్ నంది కలవడం టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. దీంతో ఆయనతో చిరు ఓ మూవీ చేయబోతున్నాడా? అనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ ఉండబోతుందని అభిమానులంతా మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ వెనుక కారణంగా ఎంటన్నది తాజాగా బయటకు వచ్చింది. కాగా చిరు నటిస్తున్న లూసిఫర్ మూవీ టైటిల్ విషయంపై సంపత్ నంది, చిరుతో సమావేశం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోహన్ రాజా దర్శకత్వంలో చిరు లూసిఫర్ రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీకి కింగ్ మేకర్ అనే టైటిల్ పరీశీలించారు మేకర్స్. దీనితో పాటు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కూడా పరిశీలనకు వచ్చింది. ఇక గాడ్ ఫాదర్ టైటిల్నే ఖరారు చేయాలని దర్శక-నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఈ టైటిల్ను ఇప్పటికే ఓ దర్శకుడు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిసి ఆయన ఎవరా.. అని ఆరా తీయగా అది సంపత్ నంది అని తెలిసింది. దాంతో ఈ టైటిల్ ఇవ్వాల్సింది నేరుగా చిరు సంపత్ నందిని అడగడంతో ఆయన వెంటనే టైటిల్ను ఇచ్చేశాడట. చిరు అడగ్గానే ఏమాత్రం ఆలోచించకుండా టైటిల్ను త్యాగం చేశాడట సంపత్ నంది. ఈ విషయంపైనే చిరుతో చర్చించేందుకు ఆయన ఇంటికి వెళ్లి చిరు కలిశాడట. అక్కడ ఆయనతో కాసేపు ముచ్చటించి, సెల్ఫీ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ‘ఏమైంది ఈవేళ’ మూవీతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు సంపత్ నంది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘రచ్చ’ మూవీకి డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ మూవీ కమర్షియల్ హిట్ అందుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో ‘గబ్బర్ సింగ్ 2’ తీయాలనుకుని కొద్దిలో ఛాన్స్ కొద్దిలో మిస్సైయాడు సంపత్ నంది. ఆయనతో ఈ మూవీ స్టార్ట్ చేసిన పవన్.. మొదట్లోనే ఈ సినిమాను ఆపేశాడట. -
అలా పిలిస్తే కూత ఆగిపోద్ది!
‘‘నన్నెవడైనా అలా (రేయ్ కార్తి) పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి.. లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి.. ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’.. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్తో ‘సీటీమార్’ టీజర్ విడుదలైంది. ‘గౌతమ్నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. తమన్నా, భూమిక, దిగంగనా సూర్యవంశీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ. -
గోపీచంద్తో అప్సర రాణి డ్యాన్స్
రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన వెబ్ ఫిల్మ్ ‘థ్రిల్లర్’తో పాపులారిటీ సంపాదించుకున్నారు అప్సరా రాణి. ఆ తర్వాత రవితేజ ‘క్రాక్’లో ‘భూమ్ బద్దల్...’ అంటూ ఓ స్పెషల్ సాంగ్లో స్టెప్స్ వేశారామె. ఈ పాట మంచి హిట్ అయింది. తాజాగా మరో స్పెషల్ సాంగ్కి రెడీ అవుతున్నారు అప్సర. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. ఈ సినిమాలో అప్సరా రాణి స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ‘‘మా సీటీమార్లో ఓ స్పెషల్ పటాకా సాంగ్లో చేస్తున్నారు అప్సర. ఈ పాట బొంభాట్గా ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు సంపత్ నంది. ‘సీటీమార్’ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. చదవండి: శృంగార సన్నివేశం.. హీరోను చూసి భయపడ్డాను -
కబడ్డీ కోచ్గా తమన్నా
‘సీటీ మార్’ కోసం కబడ్డీ కోచ్ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీమ్కి దొరక్కుండా తన టీమ్ను తయారు చేసే కోచ్ పాత్రలో ఆమె కనిపిస్తారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. సోమవారం తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆమె లుక్ను విడుదల చేశారు. ఈ సినిమాలో జ్వాలా రెడ్డిగా నటిస్తున్నారామె. గోపీచంద్ కూడా కబడ్డీ కోచ్ పాత్రలోనే కనిపిస్తారు. సోమవారం సెట్లో తమన్నా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసింది చిత్రబృందం. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
సంక్రాంతికి సీటీమార్?
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవన్షీ కీలక పాత్రలో నటిస్తున్నారు. కబడ్డీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ పాత్రల్లో కనిపించనున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతానికి పైగా పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్స్లో తీసుకురావాలన్నది ప్లాన్ అని తెలిసింది. -
క్రైమ్ థ్రిల్లర్ ఆరంభం
‘ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్’ వంటి హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఓ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు సంపత్ నంది వద్ద అసోసియేట్ డైరెక్టర్గా చేసిన అశోక్ తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న చిత్రమిది. మా బ్యానర్లో ‘ఏమైంది ఈవేళ, బెంగాల్టైగర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నా¯Œ స్టాప్గా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, సంగీతం: అనూప్ క్రియేటివ్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, కథ, స్క్రీన్ప్లే, మాటలు: సంపత్ నంది. -
సీసీసీకి టాలీవుడ్ డైరెక్టర్ విరాళం..
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంపత్ నంది కోరారు. -
పర్ఫెక్ట్ కోచ్
‘జ్వాల’ క్యారెక్టర్ను ఓ చాలెంజ్గా తీసుకున్నానంటున్నారు తమన్నా. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ జ్వాల పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ పాత్ర కోసం తాను సిద్ధమవుతున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో తొలిసారి ఓ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా చేస్తున్నాను. కబడ్డీ ప్లేయర్స్కు కోచ్గా నేను నటిస్తానని అస్సలు ఊహించలేదు. జ్వాల పాత్రను పర్ఫెక్ట్గా చేసేందుకు ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ యాస నేర్చుకోవడాన్ని ఓ సవాల్గా తీసుకున్నాను.వీగన్ (శాకాహారి)గా మారిపోయి గ్లూటెన్ డైట్ ఫాలో అవుతూ యోగా కూడా చేస్తున్నాను. కోచ్గా నా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాను. సంపత్ నంది సూచనలతో పాటు మా సెట్లో ఉన్న జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్స్ సలహాలను తీసుకుంటున్నాను. ‘జ్వాల’ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఇంతలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ సిని మాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్గా కనిపించనున్నారు గోపీచంద్. -
‘చివరికి ఆ టైటిల్నే ఫిక్స్ చేశారు’
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుటున్న ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ముందుగా సోషల్మీడియాలో లీకువీరులు చెప్పినట్టుగానే ఈ సినిమాకు ‘సీటీమార్’అనే టైటిల్నే ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంతో కోచ్ అవతారం ఎత్తనున్న గోపిచంద్ అందుకు తగ్గట్టు మారారు. నెత్తిన టోపీ ధరించి, విజిల్ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా పోస్ట్ర్లో గోపిచంద్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన 28వ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్ కోచ్గా కనిపించనున్నారు. అంతేకాకుండా మిల్క్బ్యూటీ తమన్నా తెలంగాణ జట్టు కబడ్డీ టీమ్ కోచ్గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక వరుస ఫెయిల్యూర్తో సతమతమవుతున్న గోపిచంద్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ‘గౌతమ్నంద’తో తనకు ఫెయిల్యూర్ ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నందిపై మరోసారి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్కు ఒప్పుకున్నాడు. దీంతో సంపత్ నంది గోపిచంద్కు హిట్టు అందిస్తాడో లేదో చూడాలి. భూమిక, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. Here's the first look from my next #Seetimaarr! Dir by @IamSampathNandi Bankrolled by @SS_Screens #SrinivasaaChhitturi @tamannaahspeaks @bhumikachawlat @DiganganaS #Gopichand28firstlook pic.twitter.com/z5sSNrkXf0 — Gopichand (@YoursGopichand) January 27, 2020 -
గోపీచంద్ సీటీమార్
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్ను ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిరి్మస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోందని తెలిసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆంధ్ర మహిళల జట్టు కోచ్గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్గా తమన్నా నటిస్తున్నారని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్ చేసిందట. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వేసవి బరిలో.. .
‘గౌతమ్నంద’ చిత్రం తర్వాత గోపీచంద్– సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. తొలి షెడ్యూల్లో భాగంగా అజీజ్ నగర్లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. వేసవికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్కుమార్. -
గోపీచంద్ ‘28’వ చిత్రం షురూ
ఎప్పటికప్పుడు వినూత్నమైన కథాంశాలు, సరికొత్త పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గోపీచంద్. సినిమా ఫలితాలపై సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో రెండు రోజుల్లో ‘చాణక్య’ తో థియేటర్లలో కలవనున్నాడు. అయితే చాణక్య విడుదలకు సిద్దంగా ఉన్న సమయంలోనే మరో రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు గోపీచంద్. తాజాగా గోపీచంద్ తన 28వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సంపత్ నందికి ఇచ్చిన విషయం తెలిసిందే. ‘గౌతమ్నందా’తో నిరుత్సాహపరిచినప్పటికీ ఈ సారి బలమైన స్క్రిప్ట్తో రావడంతో సంపత్ నందికి ఈ యాక్షన్ హీరో మరోసారి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తొలి క్లాప్ కొట్టడంతో షూటింగ్ ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ "ప్రొడక్షన్ నెం.3" గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు బిను సుబ్రమణ్యం డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. -
కబడ్డీ.. కబడ్డీ...
ఈ మధ్య తమన్నాకు కాస్త తీరిక చిక్కితే చాలు.. కబడ్డీ కబడ్డీ అని నాన్స్టాప్గా చెబుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్లో ప్రత్యర్థి ఒడిసి పట్టుకుంటే, వదిలించుకుని వెళ్లేవరకూ కబడ్డీ కబడ్డీ అనాలి కదా... కాదు కాదు ప్లేయర్స్తో అనిపించాలి కదా. విషయం ఏంటంటే.. గోపీచంద్ సరసన తమన్నా ఓ సినిమాలో కథానాయికగా నటించబోతున్నారు కదా. ఇందులో ఈ బ్యూటీ కబడ్డీ కోచ్ పాత్ర చేయబోతున్నారట. సినిమాలో కబడ్డీ ప్లేయర్స్కు కోచింగ్ ఇవ్వడానికి ముందు తాను కబడ్డీ గురించి తెలుసుకుంటున్నారట తమన్నా. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ చిత్రానికి ‘సీటీ మార్’ అనే టైటిల్ని అనుకుంటున్నారని సమాచారం. -
ఆటాడిస్తా
వెండితెరపై క్రీడాకారిణిగా కనిపించబోతున్నారు తమన్నా. అయితే ఆమె ఏ ఆట ఆడబోతున్నారు? ప్రత్యర్థులను ఎలా ఆటాడిస్తారు? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందని తాజా సమాచారం. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికగా తమన్నాను ఎంపిక చేశామని మంగళవారం చిత్రబృందం తెలిపింది. సినిమాలోని క్యారెక్టర్ ప్రకారం తమన్నా క్రీడాకారిణిగా కనిపించనున్నారట. ఇదిలా ఉంటే సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ (2012), ‘బెంగాల్ టైగర్’ (2015) సినిమాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. -
గోపీచంద్ సరసన తమన్నా
సంపత్ నంది-తమన్నా కాంబినేషన్లో రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గోపిచంద్తో గౌతమ్ నందా అనే ఓ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించాడు. తాజాగా ఈ ముగ్గురి కాంబోలో ఓసినిమా పట్టాలెక్కుతోంది. మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ "ప్రొడక్షన్ నెం.3" గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాత తెలిపారు. -
మరో సినిమా లైన్లో పెట్టిన మాస్ హీరో
మాస్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నా.. కమర్షియల్ సక్సెస్లు సాదించటంలో ఫెయిల్ అవుతున్న నటుడు గోపిచంద్. యాక్షన్ చిత్రాల హీరోలకు ఆకట్టుకున్న గోపిచంద్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా చేస్తున్న గోపిచంద్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. తనతో గౌతమ్ నంద లాంటి స్టైలిష్ సినిమాను తెరకెక్కించిన కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు గోపిచంద్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో గోపిచంద్కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
డబ్బు సంపాదించాలని రాలేదు
‘‘కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాలని ప్రొడక్షన్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు అవకాశం ఇచ్చింది. కొత్తవారిని ప్రోత్సహించాలనుకుంటున్నా. నాకు ఓపిక ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంది’’ అని డైరెక్టర్ సంపత్నంది అన్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్నంది, వెంకట్, రాములు, నరసింహులు నిర్మించారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఆగస్టు 31న ఈ సినిమా విడుదల చేసింది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో సంపత్నంది మాట్లాడుతూ–‘‘మా సినిమాలో స్టార్ట్ డైరెక్టర్, స్టార్ హీరో లేరు. కానీ, మంచి డీసెంట్ టాక్ వచ్చింది. మా సినిమా చూసిన వారు మంచి ప్రయత్నం చేశామని ఫోన్ చేసి మెచ్చుకోవడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను. ఒక్క హైదరాబాద్లోనే ఏడు థియేటర్స్ పెంచాం. ఇందుకు కారణమైన అల్లు అరవింద్గారికి థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్లో సుధాకర్, మురళిల పాత్రలు ముఖ్యమైనవి. వెంకట్, రాములు, నరసింహులు ఉన్నారు కాబట్టే ఇంత దూరం రాగలిగాం. మా సినిమా ఆదరించిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో అందరం కొత్తవాళ్లమైనా మనసు పెట్టి చేశాం. సంపత్నందిగారు బాగా సపోర్ట్ చేశారు’’ అన్నారు సంతోష్ శోభన్. ‘‘పేపర్ బాయ్’ని సూపర్హిట్ బాయ్గా చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రియా సుమన్. ‘‘సంపత్గారు మాకు స్ట్రాంగ్ పిల్లర్లా నిలబడ్డారు. ఈ జర్నీలో నేర్చుకున్న కొత్త విషయాలు భవిష్యత్లో ఉపయోగపడతాయి’’ అన్నారు జయశంకర్. నటి అన్నపూర్ణమ్మ, సంగీత దర్శకుడు భీమ్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి పాల్గొన్నారు. -
‘పేపర్ బాయ్’ మూవీ రివ్యూ
టైటిల్ : పేపర్ బాయ్ జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : సంతోష్ శోభన్, రియా సుమన్ , తాన్య హోపే సంగీతం : భీమ్స్ సిసిరొలియో రచన : సంపత్ నంది దర్శకత్వం : జయశంకర్ నిర్మాత : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహా మాస్ మసాలా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను నేను ఫేం సంతోష్ శోభన్ హీరోగా సంపత్ నంది నిర్మాణంలో జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ పేపర్ బాయ్. ఈ సినిమా ట్రైలర్పై మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను పేపర్ బాయ్ అందుకున్నాడా..? సంతోష్ శోభన్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడా..? సంపత్ నంది నిర్మాతగా విజయం సాధించాడా..? కథ ; రవి (సంతోష్ శోభన్) బీటెక్ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్ బాయ్గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్ కొడుకు, పేపర్ బాయ్ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రెండో సినిమానే ఎంతో బరువైన పాత్రను ఎంచుకున్న సంతోష్ శోభన్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లవర్ బాయ్గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్లో కంటతడి పెట్టించాడు. బాధ్యత గల కుర్రాడి పాత్రలో కనిపించిన సంతోష్ ఫుల్ మార్క్స్ సాధించాడు. హీరోయిన్ రియా సుమన్ హుందాగా కనిపించారు. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్లో రియా చూపించిన ఎమోషన్స్ సూపర్బ్. తాన్య హోపే తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రలో విద్యుల్లేఖ రామన్, మహేష్, బిత్తిరి సత్తి, అభిషేక్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాకు హిట్ ఫార్ములా. ఇప్పటికే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కథను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు జయశంకర్. సంపత్ నంది రచన సినిమాకు హెల్ప్ అయ్యింది. కవితాత్మకంగా సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. భీమ్స్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరాయి. అయితే సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్తో మొదలు పెట్టిన దర్శకుడు ఆ టెంపోను కంటిన్యూ చేయటంలో కాస్త తడబడ్డాడు. నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో కథతో సంబంధం లేని కామెడీ సీన్స్ కథనంలో స్పీడ్ బ్రేకర్లలా మారాయి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; సంతోష్ శోభన్, రియా సుమన్ నటన నేపథ్య సంగీతం మాటలు మైనస్ పాయింట్స్ ; నెమ్మదిగా సాగే కథనం కథకు అడ్డుపడే కామెడీ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘పేపర్ బాయ్’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘పేపర్ బాయ్’ చిత్రబృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు
-
నా మొదటి సినిమానే పెద్ద డైరెక్టర్తో..
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): నా మొదటి సినిమానే సంపత్ నంది లాంటి పెద్ద డైరెక్టర్తో చేయటం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ డైరెక్టర్ శోభ తనయుడు, పేపర్ బోయ్ సినిమా హీరో సంతోష్శోభ అన్నారు. సినిమా ప్రొమోషన్లలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడారు. అదృష్టంగా భావిస్తున్నా నన్ను నమ్మి పేపర్బాయ్ సినిమాలో సంపత్నంది అవకాశం ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది సినిమాలా కాకుండా రియల్ క్యారెక్టర్స్ను చూసిన అనుభూతి కలుగుతుంది. నేను డిగ్రీలో మాస్కమ్యూనికేషన్ చేశాను. మా నాన్న డైరెక్టర్ కావటం వల్ల మా చుట్టూ సినిమా వాతావరణమే ఉండేది. నా ఆలోచనలు ఎప్పుడూ సినిమా రంగం వైపు ఉండేవి. ఒక వేళ నేను హీరోను కాకపోయి ఉంటే సినిమాల్లోనే వేరే దాన్ని ఎందుకునేవాడ్ని తప్ప బయటికి మాత్రమే వెళ్లే అలోచనే లేదు. నాకు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఆయన చేసిన కార్యెక్టర్లు అన్నీ నాకు చేయాలని ఉంది. హీరోయిన్ త్రిష అంటే ఇష్టం. ఆమెతో సినిమా చేయాలనేది నా కోరిక. పేపర్బాయ్ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది టీం వర్క్స్, పవిత్ర క్రియేషన్స్, బీఎల్ఎన్ సినిమా పతాకంపై సంపత్ నంది, వెంకట్, నరసింహ ఈ సినిమా నిర్మించారు. సంతోష్ శోభన్, రియా సుమన్ హీరో హీరోయిన్లగా నటించారు. ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించగా.. సంగీతం బీమ్స్ సిసిరోలియా అందించారు. ఆదివారం చిత్రబృందం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో నిర్వహించింది. పేపర్బాయ్ టైటిల్ సాంగ్ని కాసర్ల శ్యామ్ అద్భుతంగా రాశారన్నారు. చంద్రబోస్కు తాను పెద్ద అభిమానిని, ఆయన ఈ సినిమాకు టైటిల్ సాంగ్ పాడారని తెలిపారు. సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. చిత్రంలో మరో లవ్సాంగ్ను ఎంవీవీ రిలీజ్ చేశారు. సాగరతీరంలో ప్రీరిలీజ్ వేడుకలు పేపర్బాయ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి సాగర తీరంలో జరిగింది. చిత్ర సహా నిర్మాత, డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడారు. ప్రేమికులు తమ ప్రేమను ఎలా గెలిపించుకోవాలో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. హీరో సంతోష్ శోభ మాట్లాడుతూ పేపర్బాయ్ సినిమా వల్ల ఎంతో మంది ప్రేమికుల తల్లిదండ్రుల్లో మార్పు రావటం ఖాయమన్నారు. హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ వైజాగ్ చాలా అందంగా, ప్రశాంతంగా ఉందన్నారు. -
వైజాగ్లో వేడుక చేస్తే సినిమా హిట్టే
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో సత్తాచాటారు సంపత్ నంది. దర్శకుడిగా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్, మాస్ అంశాలను మేళవించి ప్రేక్షకులకు అందించడంలో ఈయన దిట్ట. తాను సహ నిర్మాతగా రూపొందించిన పేపర్బాయ్ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రొమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఆదివారం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. పేపర్బాయ్ ప్రేమలో పడితేఏమిటి అనేది కథ ప్రేమను గెలిపించుకోవటం కోసం పెద్దలతో గొడవులపెట్టుకోవటం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవటం లేదా ఆత్మహత్యలు చేసుకోవటం వంటివి ఈ రోజుల్లో చూస్తుంటాం. కానీ అలా కాకుండా పెద్దలను ఎలా ఒప్పించి ప్రేమను సాధించుకోవచ్చు అనేదే పేపర్ బోయ్ సినిమా. నేను బెంగాల్ టైగర్ సినిమా చేస్తున్నా సమయంలోనే నిర్మాత వెంకట్కు ఈ కథ చెప్పాను. కథ అంతా పూర్తిగా సిద్ధం చేయటానికి ఏడాది సమయం పట్టింది. ఆ తరువాత 2017లో షూటింగ్ మొదలిపెట్టాం. షూటింగ్ చాలా వరకు హైదరాబాద్లో చేశాం. కొన్ని సన్నివేషాలు కేరళ, గోవాల్లో జరిగాయి. పేపర్బాయ్ అంటే ఏదో చదువు రాని వాడు కాదు. బాధ్యతతో బీటెక్ చేసిన వ్యక్తి ఎంచుకున్న ఒక వృత్తి ఈ పేపర్బాయ్. ఒక ఇంటికి రోజు పేపర్ వేసే వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడితే తలెత్తే సమస్యలను పేపర్బాయ్లో చూస్తారు. ఇది విలువులతో కూడినసినిమా. తండ్రి కొడుకులు, తాతలు ఇలా అన్ని సంబంధాలు ఇందులో ఆకట్టుకుంటాయి. ప్రేమ కోసం ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగాలు ఈ చిత్రంలో స్పష్టంగా వివరించటం జరిగింది. సాధారణంగా ప్రేమ చిత్రాలు అంటే యూత్ మాత్రమే ఇష్టపడతారు. కానీ పేపర్బాయ్ సినిమా మాత్రం కుటుంబం మొత్తం వెళ్లి చూడదగ్గది. హీరో సంతోష్, హీరోయిన్ రియా సుమాన్ పాత్రలు మన చుట్టూ ఉన్న మనషులు వలే ఉంటాయి. సినిమా అయినా నిజజీవితంలా ఉంటుంది. యూ సర్టిఫికెట్ సినిమా తీస్తా అనుకోలేదు నేను ఇప్పటి వరకూ తీసిన ప్రతి సినిమా ఏ సర్టిఫికేట్ లేదా ఏ/యూ సర్టిఫికేట్వి. కాని మొదటి సారి యూ సర్టిఫికెట్ను సెన్సర్ బోర్డు ఈ సినిమాకు మంజూరు చేసింది. ఇలాంటి సినిమాలను నేను తీస్తానని అనుకోలేదు. సెన్సర్ బోర్డ్ సభ్యులు కూడా ఒక కట్ లేకుండా అనుమతి ఇచ్చారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బేనర్పై ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన చిత్రం పేపర్బాయ్. మా సినిమా కథనచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఈ చిత్రానికి పనిచేయటానికి ముందుకు వచ్చారు. మెగాస్టార్తో సినిమా తీస్తా మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తీయాలనేది నాకు జీవిత లక్ష్యం. ఎప్పటికైనా ఆయనతో కచ్చితంగా తీసితీరితా. ఆయన కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నా. అది పూర్తి అయిన తరువాత ఆయనకు చెప్తాను. మరో పెద్ద హీరోతో కూడా సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే ఈ సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభవుతుంది. సినీ పరిశ్రమకు వైజాగ్ సెంట్మెంట్ పేపర్బాయ్ సినిమా ట్రైలర్ చూసి మహేష్ బాబు, ప్రభాస్ ట్వీటర్ ద్వారా మెచ్చుకున్నారు. వారి ట్వీట్స్తో మా సినిమాకు చాలా ప్రచారం లభించింది. వైజాగ్లో సినిమాకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం చేస్తే హిట్ అవటం గ్యారంటీ. ఇది సినిమా పరిశ్రమ అంతా సెంట్మెంట్గా పెట్టుకుంది. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల కార్యక్రమాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. రచ్చ సినిమా సమయంలో కూడా మేము వైజాగ్ వచ్చాం. అది పెద్ద హిట్ అయింది. -
మెగా ప్రొడ్యూసర్ చేతికి ‘పేపర్ బాయ్’
మాస్ డైరెక్టర్గా సక్సెస్ సాధించిన సంపత్ నంది చిన్న సినిమాలకు కథను అందిస్తూ, నిర్మిస్తూ సక్సెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ అందించిన కథ, కథనాలతో తెరకెక్కిన సినిమా ‘పేపర్ బాయ్’. ఈ సినిమా ట్రైలర్తో బాగానే పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి చిన్న సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించడం మంచి పరిణామం. పైగా చిత్రయూనిట్ కూడా సినిమాకు వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గీత ఆర్ట్స్ చేతిలోకి వెళ్లింది. అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత చేతిలో సినిమా పడితే.. సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా కంటెంట్ ప్రేక్షకులకు నచ్చితే మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆగస్ట్ 31న రాబోతోన్న ‘పేపర్ బాయ్’
మాస్ డైరెక్టర్ సంపత్ నంది అందించిన కథతో రాబోతోన్న సినిమా పేపర్ బాయ్. తాజాగా విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన వచ్చింది. టీజర్తోనే ఆకట్టుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రబృందం. సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు వినూత్న పద్దతిలో ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. సంతోష్ శోభన్ హీరోగా, ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్గా.. సంపత్నంది టీమ్ వర్క్స్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల కానున్నట్టు ప్రకటించారు. అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నుండి రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇంటింటికి తిరిగి పేపర్ వేసి అందర్నీ కలవబోతున్నారు. ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు. -
‘పేపర్ బాయ్’ టైటిల్ సాంగ్ లాంచ్
-
‘పేపర్ బాయ్’ ముందే వస్తాడా..?
శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడటంతో ఆ తరువాతి వారం రిలీజ్ అవుతున్న సినిమాల దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సెప్టెంబర్ 7న భారీ పోటి ఉండటంతో ఒక్కడుగు ముందుకు వేసి ఆగస్టు 31న థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమాను వారం రోజులు ముందుగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తన బ్యానర్లో రెండో సినిమాగా పేపర్ బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో బాలనటుడిగా పరిచయం అయి తరువాత తను నేను సినిమాతో హీరోగా మారిన సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భీమ్స్ సంగీతమందిచిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. -
‘పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’
‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా టాలెంట్ చూపించాడు సంపత్ నంది. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో మాస్ డైరెక్టర్గా నిరూపించుకున్నాడు. డైరెక్టర్గానే గాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. గతంలో ఆది హీరోగా ‘గాలిపటం’ సినిమాను నిర్మించిన సంపత్ నంది...తాజాగా ‘పేపర్ బాయ్’ ను నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్ (‘వర్షం’ దర్శకుడు శోభన్ తనయుడు) హీరోగా నటించిన ‘పేపర్ బాయ్’ అందంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సంపత్ నంది అందించిన కథ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో డైలాగ్లు ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. ‘నాకు పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’, ‘ప్రేమంటే ఆక్సిజన్లాంటిది అది కనిపించదు.. కానీ బతికిస్తుంది’ లాంటి డైలాగ్లు బాగున్నాయి. భీమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సంపత్నంది టీమ్ వర్క్స్పై వస్తోన్న ఈ సినిమాకు జయ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. -
‘పేపర్ బాయ్’ వచ్చేస్తున్నాడు..!
సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా టీజర్ విడుదలైంది. రామ్చరణ్, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన సంపత్ తన స్వీయ నిర్మాణంలో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆది హీరోగా గాలిపటం సినిమాను నిర్మించిన సంపత్ నంది తాజాగా తన బ్యానర్లో రెండో సినిమాను సిద్ధం చేశాడు. తను నేను సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్ బాయ్ సినిమాను తెరకెక్కించారు. సపంత్ నంది స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమాలో రియా సుమన్, తాన్యా హోపేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియో, సినిమా రిలీజ్ డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
‘పేపర్ బాయ్’ టీజర్
-
బన్నీ కొత్త సినిమాకి క్రేజీ డైరెక్టర్..!
డీజేతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం తుది మెరుపులు దిద్దుకుంటున్న ఈ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నటించబోయే చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ బన్ని మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఏ సినిమాను ఫైనల్ చేయలేదు. కానీ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రానికి అంగీకరించినట్టుగా టాలీవుడ్ సమాచారం. మాస్ కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, బన్నీల కాంబినేషన్ సెట్ చేసేందుకు నిర్మాత సీ. కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారట. ఇదివరకే మెగా హీరో రామ్ చరణ్కు ‘రచ్చ’తో విజయం అందించిన సంపత్, మరి అల్లు అర్జున్కు అదే స్థాయిలో విజయాన్ని అందించేందుకు కథను సిద్దం చేసుకున్నట్టు సమాచారం. కాగా సంపత్ నంది చివరగా తీసిన సినిమా ‘గౌతమ్నంద’ నిరాశపరచటంతో అల్లు అభిమానులు ఈ సినిమాపై కొంత కలవరచెందుతున్నారు. -
'గౌతమ్నంద' మూవీ రివ్యూ
టైటిల్ : గౌతమ్నంద జానర్ : యాక్షన్ మూవీ తారాగణం : గోపిచంద్, హన్సిక, కేథరిన్ థెరిస్సా, సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషి సంగీతం : తమన్ దర్శకత్వం : సంపత్ నంది నిర్మాత : జె. భగవాన్, జె. పుల్లారావు చాలా కాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ హీరో గోపిచంద్, తన స్టైల్, బాడీలాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకొని చేసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గౌతమ్నంద. మాస్ హీరోయిజాన్ని సూపర్బ్ గా ఎలివేట్ చేసే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్ ఆశించిన విజయాన్ని అందించిందా..? సంపత్ కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడా...? కథ : ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్), ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించిన తెలుగు బిలియనీర్ విష్ణు ప్రసాద్ ఘట్టమనేని( సచిన్ కేడ్కర్) వారసుడు. ఆకలి, కష్టం, బాధ, కన్నీళ్లులతో పాటు ప్రేమ అంటే ఎంటో కూడా తెలియకుండా పెరిగిన కుర్రాడు. ఎప్పుడు పార్టీలు పబ్ లు అంటూ తిరిగే గౌతమ్ కు ఒక సంఘటన మూలంగా.. తను ఎవరు..? విష్ణు ప్రసాద్ కొడుకుగా కాక తనకంటూ వ్యక్తిగతంగా ఉన్న గుర్తింపు ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతుంది..? ఆ ఆలోచనలోనే గమ్యం తెలియకుండా ప్రయాణిస్తున్న గౌతమ్ కు, అచ్చు గుద్దినట్టు తనలాగే ఉండే మరో వ్యక్తి నంద కిశోర్ ఎదురుపడతాడు. డబ్బు తప్ప వేరే ఏ ఎమోషన్ తెలియని గౌతమ్, డబ్బుంటే చాలు ఏదైనా చేసేయోచ్చు అనే నంద, తమ స్థానాలు మార్చుకొని ఒకరి ఇంటికి ఒకరు వెళతారు. నందు ఇంటికి వెళ్లిన గౌతమ్, వారి ప్రేమతో జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఆ కుటుంబ కష్టాలు తీర్చడానికి చిన్న ఉద్యోగంలో చేరతాడు. కానీ వరుసగా నందు కుటుంబానికి ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో తన ఆస్తి మీద కన్నేసిన విష్ణు ప్రసాద్ స్నేహితుడు ముద్ర (ముఖేష్ రుషి) మీద గౌతమ్ కు అనుమానం వస్తుంది. మరి నిజంగా ముద్రానే నందు కుటుంబాన్ని ఎటాక్ చేశాడా..? ఆ ప్రమాదాల నుంచి నందు ఫ్యామిలీని గౌతమ్ ఎలా కాపాడాడు..? చివరకు నందు, గౌతమ్ లు ఎవరి స్థానాల్లోకి వారు వచ్చారా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మాస్ యాక్షన్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న గోపిచంద్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. మేకోవర్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా వేరియేషన్ చూపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్న గోపిచంద్, రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ తో మెప్పించాడు. హీరోయిన్ కేథరిన్ నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా.. గ్లామర్ షోతో అదరగొట్టింది. హన్సిక స్క్రీన్ టైం కూడా తక్కువ కావటంతో ఉన్నంతలో పరవాలేదనిపించింది. విలన్లుగా ముఖేష్ రుషి, నికితిన్ ధీర్ లు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో సచిన్ కేడ్కర్, చంద్రమోహన్, సీత తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : వరుసగా కమర్షియల్ హిట్స్ సాధిస్తున్న దర్శకుడు సంపత్ నంది రెండేళ్ల విరామం తరువాత తెరకెక్కించిన సినిమా గౌతమ్నంద. మాస్ హీరో గోపి చంద్ ను స్టైలిష్ గా ప్రజెంట్ చేయాలనుకున్న సంపత్ నంది మంచి విజయం సాధించాడు. గోపిచంద్ మేకోవర్ తో పాటు సినిమాను స్టైలిష్ గా ప్రజెంట్ చేయటం లో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాకు ప్లస్ అయ్యింది. డ్యూయల్ రోల్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే కథనే తనదైన టైకింగ్ తో కొత్తగా ప్రజెంట్ చేశాడు సంపత్. ఫస్ట్ హాఫ్ క్లాస్ గా నడిపించిన సంపత్ నంది, సెకండాఫ్ లో తన మార్క్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించాడు. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను పక్కగా యాడ్ చేసిన దర్శకుడు మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ సుందర్ రాజన్ సినిమాటోగ్రఫి. డ్యూయల్ రోల్ సీన్స్ చాలా నేచురల్ గా కనిపించాయి. లావిష్ గా కనిపించే గౌతమ్ ఇంటిని ఎంతో బాగా ప్రజెంట్ చేశాడో.. బోరబండ స్లమ్ ఏరియాను అంతే నేచురల్ గా చూపించాడు. తమన్ పాటలు పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. నిర్మాతలు సినిమా కోసం పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : గోపిచంద్ నటన నిర్మాణ విలువలు యాక్షన్ ఎపిసోడ్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'గౌతమ్నంద' వర్కింగ్ స్టిల్స్
-
గోపిచంద్కి లైన్ క్లియర్..!
బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరో గోపిచంద్ తాజా చిత్రం గౌతమ్నంద్. మాస్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెలఖరున రిలీజ్ అవుతోంది. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తోప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తన కెరీర్ కు కీలకమైన సినిమా కావటంతో గోపిచంద్ కూడా ఈ సినిమాపై చాలా కేర్ తీసుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సమయంలో భారీ పోటి మధ్య గౌతమ్నంద రిలీజ్ అవుతుందని భావించారు. కానీ జూలై 28న రిలీజ్ కావాల్సిన మిగతా సినిమాలు బరిలో నుంచి తప్పుకోవటంతో గోపిచంద్ కి లైన్ క్లియర్ అయ్యింది. అదే రోజు రిలీజ్ అవుతుందని భావించిన కృష్ణవంశీ నక్షత్రం ఆగస్టు 4కు వాయిదా పడింది. మరో సినిమా విఐపి 2 తమిళ వర్షన్ వాయిదా పడటంతో తెలుగు వర్షన్ కు వాయిదా వేయటం కన్ఫామ్ అయ్యింది. దీంతో సోలోగా బరిలో దిగుతున్న గోపిచంద్, గౌతమ్ నందగా బిగ్ హిట్ కొడతాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
జూలై 16న 'గౌతమ్ నంద' ఆడియో
మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'. హన్సిక, కేతరీన్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదలవుతుండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూలై 16న హైద్రాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్న వేడుకలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావ్లు మాట్లాడుతూ.. 'జూలై 28న సినిమా విడుదలకు అన్నీ సిద్ధం. ఇప్పటికే టీజర్, సాంగ్ ప్రోమోస్కి విశేషమైన స్పందన లభిస్తోంది. తమన్ ట్రెండీ మ్యూజిక్ అందించారు, ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గోపీచంద్ స్టైలిష్ లుక్స్, సంపత్ నంది స్టైలిష్ టేకింగ్, టీజర్ మరియు పోస్టర్కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో సినిమాను కూడా అంతకుమించిన స్థాయిలోనే ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అన్నారు. -
ఇలాంటి రిస్క్ ఏ హీరో తీసుకోడు
– ‘దిల్’ రాజు ‘‘గౌతమ్ నంద’లో గోపీచంద్ హీరోగా, విలన్గా చేస్తున్నాడు. ఆ రెండు పాత్రలు ఆయనొక్కడే చేయగలడు. మరో తెలుగు హీరో ఇలాంటి రిస్క్లు తీసుకోడు. ట్రైలర్ చూస్తుంటే సంపత్ నంది సినిమా ఎంత బాగా తీశాడో తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. గోపీచంద్ హీరోగా, హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న సినిమా ‘గౌతమ్ నంద’. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను నమ్మి గోపీచంద్ గారు ఈ సినిమా చేస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకపోవడంతో సినిమా చాలా క్వాలిటీగా వస్తోంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశమున్న చిత్రమిది. ఇందులో నా గత చిత్రాలకంటే డిఫరెంట్ లుక్లో కనిపిస్తా. సంపత్ గారు సినిమా బాగా తీస్తున్నారు. గత ఏడాది మీడియా సమక్షంలో పుట్టినరోజు చేసుకున్నా. ఈ ఏడాది ‘గౌతమ్ నంద’ యూనిట్ సమక్షంలో జరుపుకున్నా’’ అన్నారు గోపీచంద్. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
మ్యూజికల్ లవ్ స్టోరిగా 'పేపర్ బాయ్'
దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న సంపత్ నంది నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. రామ్ చరణ్ హీరోగా రచ్చ, రవితేజతో బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్స్ అందించిన ఈ మాస్ డైరెక్టర్, ప్రస్తుతం గోపిచంద్ హీరోగా గౌతమ్నంద సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను నిర్మించబోయే సినిమా పనులు మొదలెట్టాడు సంపత్ నంది. గాలిపటం సినిమాతో నిర్మాతగా మారిన సంపత్ నంది ఆ సినిమాతో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. దీంతో నిర్మాణానికి కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. తను నేను ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా ఐశ్వర్యను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పేపర్ బాయ్ అనే టైటిల్ను ఫైనల్ చేశారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
మరోసారి విలన్గా మాస్ హీరో..!
హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత సక్సెస్ కోసం విలన్గా మారిన మాస్ హీరో గోపిచంద్. విలన్గా మంచి విజయాలు సాధించిన గోపిచంద్ తరువాత హీరోగా కూడా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో గౌతమ్ నంద సినిమాలో నటిస్తున్నాడు గోపిచంద్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తోంది. గౌతమ్ నంద సినిమాలో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్లో స్టైలిష్ లుక్లో అలరిస్తున్న గోపి... రెండు పాత్రల్లో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. విలన్గా ఘనవిజయాలు సాధించిన గోపిచంద్ చాలా కాలం తరువాత మరోసారి విలన్ రోల్లో నటిస్తుండం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్లు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
సౌత్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం..!
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ చేస్తున్న తాజా చిత్రం గౌతమ్ నంద. మాస్ ఇమేజ్ ఉన్న గోపిచంద్ తొలిసారిగా ఓ స్టైలిష్ పాత్రలో కనిపిస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. యాక్షన్ సీన్స్ చేయటంలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న గోపిచంద్, గౌతమ్ నంద సినిమా కోసం ఓ రిస్కీ స్టంట్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి సారిగా ఓ పూర్తి స్థాయి స్కైడైవ్ సీక్వెన్స్ను గౌతమ్ నంద కోసం షూట్ చేసినట్టుగా తెలిపారు. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపిన దర్శకుడు సంపత్ నంది, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో స్కైడైవ్కు రెడీ అవుతున్న గోపిచంద్ ఫోటోలను పోస్ట్ చేశాడు. అయితే ఈ సీక్వెన్స్ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్లో వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం దుబాయ్లో రాజు సుందరం కొరియోగ్రఫిలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ను షూట్ చేస్తున్నారు. first time in south cinema...just wrapped up full fledged sky dive episode in our film GOWTHAM NANDA... pic.twitter.com/aQqXKTpOXb — Sampath Nandi (@DirectorSampath) 10 April 2017 Hats of to Gopi Chand gari courage...more updates soon...feast to his fans... — Sampath Nandi (@DirectorSampath) 10 April 2017 -
దుబాయ్ వెళ్తోన్న 'గౌతమ్నంద'
మాస్ హీరో గోపిచంద్ లోని స్టైలిష్ యాంగిల్ను పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా గౌతమ్నంద. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం గౌతమ్నంద యూనిట్ సాంగ్స్ షూట్ కోసం దుబాయ్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్లో రాజు సుందరం కొరియోగ్రఫిలో గోపిచంద్ ఇంట్రడక్షన్ సాంగ్తో పాటు మరో పాటను చిత్రీకరించనున్నారు. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత హైదరాబాద్లో మిగిలిన పాటలను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో.. తెర మీద గోపిచంద్ను మరింత స్టైలిష్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మేలో గౌతమ్నందను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సింగిల్ టేక్లో...l
లైట్గా వెయిట్ తగ్గింది.. మజిల్ పెరిగింది. లైట్గా హెయిర్ కట్ చేశాడు... రఫ్గా కాస్త గడ్డం పెంచాడు. కట్ చేస్తే.. న్యూ హ్యాండ్సమ్ లుక్తో గోపీచంద్ ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఆయన హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావ్ నిర్మిస్తున్న సినిమా ‘గౌతమ్నంద’. మహాశివరాత్రి సందర్భంగా గోపీచంద్ సెకండ్ లుక్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ లుక్కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సంపత్ నంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని హీరో క్యారెక్టర్ని సై్టలిష్గా ఎలివేట్ చేశారు. ప్రస్తుతం రామ్–లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ తీస్తున్నాం. మూడు నిమిషాల ఓ ఫైట్ కోసం గోపీచంద్ నాలుగు రోజులు రిహార్సల్స్ చేయడంతో సింగిల్ టేక్లో పూర్తి చేశాం. తెలుగులో ఈ విధంగా చేయడం ఇది మొదటిసారి. ఈ షెడ్యూల్తో టాకీ పూర్తవుతుంది. మార్చిలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళతాం’’ అన్నారు. హన్సిక, కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎస్. సౌందర్రాజన్, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
'గౌతమ్ నంద'గా గోపిచంద్
యాక్షన్ హీరో గోపిచంద్, మాస్ సినిమాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ లుక్లో మాత్రమే కనిపించిన గోపిచంద్, ఈ సినిమాలో స్టైలిష్ లుక్లో అలరించనున్నాడు. శ్రీ బాలజీ సినీ మీడియా బ్యానర్పై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో గౌతమ్ నంద మూవీ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
యాక్షన్ బ్యాంకాక్
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 22న బ్యాంకాక్లో మొదలవుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బ్యాంకాక్లో నెలరోజుల పాటు చిత్రీకరణ జరుపుతాం. హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. భారీ తారాగణం, కార్లు, గుర్రాలతో యాక్షన్ అడ్వంచరస్గా ఉంటుంది. హీరోయిన్లు హన్సిక, క్యాథరిన్, విలన్లు ముకేష్ రుషి, నికితన్ ధీర్, కమెడియన్ వెన్నెల కిశోర్ సహా సుమారు 70మంది నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కళ: కడలి బ్రహ్మ, కూర్పు: గౌతమ్రాజు, యాక్షన్: రామ్-లక్ష్మణ్, సంగీతం: ఎస్.ఎస్.తమన్. -
మాస్లో కొత్త కోణం!
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శరత్ మరార్ కెమేరా స్విచాన్ చేయగా, గోపీచంద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత సుధాకర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ- ‘‘గోపీచంద్లో మాస్ యాంగిల్ను సరికొత్తగా ఆవిష్కరించే చిత్రమిది. భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తు న్నారు. హన్సిక, క్యాథరిన్ హీరో యిన్లుగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘కమర్షియల్ హంగులతో కూడిన హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అని సంపత్ నంది తెలిపారు. తమన్, క్యాథరిన్ తదితరులు పాల్గొన్నారు. ముఖేశ్ రుషి, నికితన్ ధీర్, అజయ్, వెన్నెల కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, యాక్షన్: రామ్-లక్ష్మణ్. -
గోపీచంద్ కొత్త సినిమా షురూ
హీరో గోపీచంద్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మొదలయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హన్సిక, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో గోపీచంద్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సుధాకర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్గా ఈ చిత్రం రూపొందుతుందని చిత్ర నిర్మాత జె.భగవాన్ తెలిపారు. గోపీచంద్ కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా తెరకెక్కనుంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్లో ఉన్న మాస్ యాంగిల్ను సరికొత్తగా ప్రెజెంట్ చేసేలా ఈ చిత్రం ఉంటుందట. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబలి), అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
మరోసారి ఐటమ్ సాంగ్లో..!
హీరోయిన్గా వరుస సక్సెస్లు సాధిస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా మరోసారి ఐటమ్ సాంగ్లో కనిపించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్తో అలరించింది ఈ బ్యూటి. ఈ సారి మాస్ యాక్షన్ హీరో గోపిచంద్తో కలిసి స్పెషల్ సాంగ్లో స్టెప్పేసేందుకు రెడీ అవుతోంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన రచ్చ, బెంగాళ్ టైగర్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన తమన్నా, అదే దర్శకుడి కోసం ఐటమ్ సాంగ్కు ఒప్పుకుంది. సంపత్ నంది కూడా తమన్నా తనకు లక్కీ హీరోయిన్ అని భావించి ఆమెను సంప్రదించాడట. గోపిచంద్ ప్రస్తుతం ఆక్సిజన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు. -
గోపిచంద్ కోసం ఇద్దరు హీరోయిన్లు
లౌక్యం, జిల్ సినిమాలతో ట్రాక్ ఎక్కినట్టే కనిపించిన మాస్ హీరో గోపిచంద్ సౌఖ్యం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. యాక్షన్ డ్రామాలను పక్కనపెట్టి కామెడీ మీద దృష్టి పెట్టిన ఈ టాల్, స్టార్ ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజులు తరువాత స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా కావటంతో ఆక్సిజన్పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆక్సిజన్ సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు గోపిచంద్. రచ్చ, బెంగాళ్ టైగర్ సినిమాల సక్సెస్తో మాస్ సినిమాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది దర్వకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆడిపాడేందుకు ఇద్దరు ముద్దుగుమ్మలను ఫైనల్ చేశారు సంపత్ నంది. సరైనోడు సినిమా సక్సెస్తో మంచి ఫాలో ఉన్న కేథరిన్ థెరిస్సా తొలిసారిగా గోపిచంద్తో జతకడుతుండగా, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న హన్సికను మరో హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
క్రేజీ కాంబినేషన్లో...
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్కు అంకురార్పణ జరిగింది. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా బాక్సాఫీస్ పైకి దూకించిన దర్శకుడు సంపత్ నంది, మాస్ హీరో గోపీచంద్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. పుల్లారావు, జె. భగవాన్లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘గోపీచంద్లో ఉన్న మాస్ యాంగిల్ను సరికొత్తగా చూపించబోయే చిత్రమిది. సంపత్ నంది చెప్పిన కథ మాకు బాగా నచ్చింది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుంది. హై బడ్జెట్తో, మంచి టెక్నికల్ వేల్యూస్తో సినిమా నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కెమేరా: ఎస్. సౌందర్ రాజన్, ఆర్ట్: ఏయస్ ప్రకాశ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతంరాజు. -
గోపిచంద్ నెక్ట్స్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్
బెంగాళ్ టైగర్ సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న దర్శకుడు సంపత్ నంది, మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎదురుచూసిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పట్లో చెర్రీ డేట్స్ దొరికే అవకాశం లేకపోవటంతో మరో హీరోతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇన్నాళ్లు చరణ్ తో చోటా మేస్త్రీ అనే మాస్ ఎంటర్ టైనర్ చేయాలని భావించినా అది వర్క్ అవుట్ కాకపోవటంతో గోపిచంద్ హీరోగా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య మూవీస్ అధినేత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు గోపి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. దీంతో త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. -
సంపత్ నందితో గోపిచంద్
బెంగాళ్ టైగర్ సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న దర్శకుడు సంపత్ నంది, మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎదురుచూసిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పట్లో చెర్రీ డేట్స్ దొరికే అవకాశం లేకపోవటంతో మరో హీరోతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇన్నాళ్లు చరణ్ తో చోటా మేస్త్రీ అనే మాస్ ఎంటర్ టైనర్ చేయాలని భావించినా అది వర్క్ అవుట్ కాకపోవటంతో గోపిచంద్ హీరోగా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య మూవీస్ అధినేత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు గోపి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. దీంతో త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. -
పవన్ వద్దన్న దర్శకుడితో నితిన్
అ.. ఆ... సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు యంగ్ హీరో నితిన్. ఈ మంగళవారంతో 14 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న నితిన్ అదే సమయంలో 40 కోట్ల క్లబ్లో కూడా చేరటంతో మరింత ఆనందంగా ఉన్నాడు. అదే సమయంలో తన నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అ ఆ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఇంత వరకు తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే క్లాస్ హీరోగా మంచి ఇమేజ్ రావటంతో తన తదుపరి సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయాలని భావిస్తున్నాడట. అందుకే మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సంపత్ నందితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఏమైంది ఈ వేళ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంపత్ రెండో సినిమానే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించటంతో పవన్ కళ్యాణ్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. అయితే పవన్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ కావటంతో వెంటనే రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ను తెరకెక్కించి మరోసారి విజయం సాధించాడు. మాస్ సినిమాలతో ఆకట్టుకుంటున్న సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేయడానికి నితిన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. తన అభిమాన నటుడు పవన్ కాదన్న దర్శకుడితో నితిన్ నిజంగానే సినిమా చేస్తాడా..? లేక అన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేస్తాడా..? చూడాలి. -
బెంగాల్ టైగర్ హ్యాట్రిక్తో మరింత బాధ్యత పెరిగింది
►యువ దర్శకుడు సంపత్నంది ఈ రోజుల్లో వరుసగా మూడు సినిమాలు సక్సెస్ చేయడమంటే మాటలు కాదు. అది కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ చేయడం. యువ దర్శకుడు సంపత్ నంది సాధించిన క్రెడిట్ అది. వరుణ్ సందేశ్తో ‘ఏమైంది ఈవేళ’ చేసి తొలి హిట్టు సాధించిన సంపత్ నంది, రెండో సినిమానే రామ్చరణ్తో బాక్సాఫీస్ దగ్గర ‘రచ్చ’ చేశాడు. ఇటీవలే రవితేజను ‘బెంగాల్టైగర్’గా ప్రెజెంట్ చేసి భేష్ అనిపించుకు న్నాడు. ఈ హ్యాట్రిక్ విజయాల గురించి సంపత్ నంది ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘బెంగాల్టైగర్’తో హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ అండీ. నేనే కాదు, మా హీరో రవితేజ, మా నిర్మాత రాధామోహన్, మా టీమ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రవితేజ గారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్టు అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టగలిగాను.రవితేజగారికి ఇలాంటి విజయాలు కొత్త కాదు. కానీ, నైజామ్లో మాత్రం ఆయనకు ఇదే హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా. భవిష్యత్తులో మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ‘బెంగాల్ టైగర్’తో నేను మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కిస్తానని ఓ బ్రాండ్ వచ్చేసింది. అయితే ఇకపై కూడా మాస్ ఎంటర్టైనర్స్ చేస్తారా? అవునండీ. స్టార్స్ ఇమేజ్కనుగుణంగా అభిమానులను, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమంటే అంత ఈజీ కాదు. నాక్కూడా పర్శనల్గా మాస్ ఎంటర్టైనర్స్ చేయడమంటేనే ఇష్టం. మీలాంటి యువ దర్శకులు కూడా ప్రయోగాలు చేయకుండా ఇలా మాస్కే పరిమితం కావడం ఎంతవరకూ కరెక్ట్? ఇదంతా కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం. అందుకే చాలా జాగ్రత్తగా బాక్సాఫీస్ సూత్రాల కనుగుణంగా డీల్ చేయాల్సిందే. ఇక ప్రయోగాలంటారా? నిర్మాతగా అలాంటి సినిమాలు చేస్తాను. ఇంతకూ మీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఓ టాప్ హీరోతో అని వార్తలొస్తున్నాయి? సంక్రాంతి వరకూ ఆగండి. వాళ్ల దగ్గర నుంచే అధికారికంగా వార్త తెలుస్తుంది. ఇకపై కచ్చితంగా ఏడాదికి ఒక సినిమా చేస్తాను. ఇప్పటికే నా దగ్గర మూడు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన మాస్ ఎంటర్టైనర్తో త్వరలోనే మీ ముందుకొస్తాను. ‘బెంగాల్ టైగర్’ హ్యాట్రిక్తో నా పై మరింత బాధ్యత పెరిగింది. అది గుర్తు పెట్టుకునే సినిమాలు చేస్తాను. -
పవన్ను వాడేసుకుంటున్న యంగ్హీరోలు
-
'ముఠామేస్త్రీ' సీక్వెల్లో రామ్చరణ్..?
బ్రూస్ లీ పరాజయంతో ఆలోచనలో పడ్డ యంగ్ హీరో రామ్చరణ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్న మెగా పవర్స్టార్ ఆ సినిమా తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే ఫారిన్ ట్రిప్ ముగించుకొని వచ్చిన చెర్రీ.. ప్రస్తుతం తనీఒరువన్ రీమేక్ను సెట్స్ మీదకు తేవాలని భావిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నటీనటులు ఎంపిక కొనసాగుతోంది. ఈ సినిమా తరువాత మెగా చరిష్మాను కంటిన్యూ చేస్తూ, ఓ సీక్వెల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట మగధీరుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ముఠామేస్త్రీ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రచ్చ సినిమా ఘనవిజయం సాధించింది. అదే మ్యాజిక్ను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ. రచ్చ సినిమాతో మాస్కు నచ్చే హీరోయిజాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసిన సంపత్ నంది, లాంగ్ గ్యాప్ తరువాత బెంగాల్ టైగర్ సినిమా చేశాడు. రిలీజ్కు ముందునుంచే ఈ సినిమా మీద కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు సంపత్. ముఠామేస్త్రీ సీక్వెల్కు ఛోటా మేస్త్రీ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
నవంబర్లో బెంగాల్ టైగర్
తిరుమల: రవితేజ హీరోగా రూపొందిం చిన బెంగాల్ టైగర్ చిత్రాన్ని నవంబరులో విడుదల చేస్తామని ఆ చిత్ర దర్శకుడు సంపత్నంది అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఆడియో విడుదల చేశామని, మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఈ చిత్రం విడుదలయ్యాకే కొత్త ప్రాజెక్టులు చేపడతామన్నారు. పవన్కల్యాణ్తో పాటు మరి కొన్ని చిత్రాల గురించి త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. -
ఆయన బంగారు కొండ : సంపత్ నంది
‘‘ఈ వేడుకకు హీరో భీమ్స్. అతనిలో మంచి విషయం ఉంది. ఈ సినిమాతో భీమ్స్ స్టార్ మ్యూజిక్ డెరైక్టర్ అయిపోతాడు. మా నిర్మాతకు చాలా లాభాలు వస్తాయి. ఈ చిత్రంతో ఆయన పెద్ద నిర్మాత అయిపోతారు. నా లెక్క ప్రకారం ఈ చిత్రం నీకు హ్యాట్రిక్ అవుతుంది (సంపత్ నందిని ఉద్దేశించి)’’ అని రవితేజ అన్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హిందీ నటుడు బొమన్ ఇరానీ ఆడియో సీడీని ఆవిష్కరించి రవితేజకు ఇచ్చారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ - ‘‘రవితేజ ఎనర్జీ గురించి చెప్పాలంటే నా ఎనర్జీ చాలదు. ఆయన బంగారు కొండ. కరెక్టుగా ఆకలి వేసినప్పుడు నాకు అన్నం పెట్టిన వ్యక్తి. నాకు ఇంత మంచి అవకాశమిచ్చిన రవితేజగారికి కృతజ్ఞతలు. సింగిల్ సిట్టింగ్లో ఆయన ఈ కథను ఓకే చేశారు. రవితేజగారి అభిమానులను 1000 పర్సెంట్ శాటిస్ఫై చేసే చిత్రం. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రేపటి నుంచి భీమ్స్ పేరు మారుమ్రోగిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ రోజు మాట్లాడాలంటే కన్నీళ్లు ఆగడం లేదు. మాటలు రావడం లేదు. నేనీ రోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే సంపత్గారే కారణం. ఆయన మాట మీద రవితేజగారు నాకీ ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు’’ అని భీమ్స్ చెప్పారు. రాధామోహన్ మాట్లాడుతూ - ‘‘ఇంతకుముందు చిన్న సినిమాలు చేశాను. రవితేజగారు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండేది. రెండు మూడు సిట్టింగ్స్తో నా మీద ఆయనకు నమ్మకం వచ్చింది. సంపత్లో టాలెంట్ ఉంది. అందుకే ‘ఏమైంది ఈవేళ’ సినిమాకి అవకాశమిచ్చాను. భీమ్స్కి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. బొమన్ మాట్లాడుతూ - ‘‘సంపత్ చెప్పిన కథ విని, 15 నిముషాల్లో ఓకే చెప్పాను. రవితేజకు ఎనర్జీ ఎక్కణ్ణుంచి వస్తుంది అంటే.. ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచే వస్తుంది’’ అన్నారు. కెరీర్ ఆరంభించినప్పట్నుంచీ రవితేజతో సినిమా చేయాలనుకున్నాననీ, ఇప్పటికి కుదిరిందనీ తమన్నా చెప్పారు. గౌతంరాజు, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, పృథ్వీరాజ్, సమీర్, రాశీ ఖన్నా, అక్ష, హంసా నందిని తదితరులు పాల్గొన్నారు. -
మాస్ పంచ్లతో 'బెంగాల్ టైగర్'
'కిక్ 2' ఫెయిల్యూర్ నుంచి త్వరగానే కోలుకున్నాడు మాస్ మహరాజ రవితేజ. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ మార్క్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. 'నేను క్లైమేట్ లాంటోన్ని, అప్పుడప్పుడు చల్లగా ఉంటా.. అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా... అప్పుడప్పుడూ వణికిస్తూ ఉంటా..' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ను అలరిస్తున్నాయి. 'కిక్ 2' ఫెయిల్యూర్ తరువాత ఫుల్ ఎనర్జీతో వస్తున్న రవితేజ ఈసారి గ్యారెంటీ హిట్ మీద కన్నేశాడు. తమన్నా అందం సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది. రవితేజ సరసన తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో కెకె రాధమోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బెంగాల్ టైగర్' నవంబర్ 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
మాస్ పంచ్లతో 'బెంగాల్ టైగర్'
-
హంసానందినితో పోటా పోటీగా...
మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఇస్తే, రవితేజ ఓ రేంజ్లో రెచ్చిపోతారు. చాలా ఎనర్జిటిక్గా డ్యాన్స్ చేస్తారు. ప్రస్తుతం రవితేజ ఆ పని మీదే ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘బెంగాల్ టైగర్’. ఈ చిత్రంలో రవితేజ ఇంట్రడక్షన్ సాంగ్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో రవితేజతో కలిసి కాలు కదుపుతున్నది ఎవరో కాదు ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే...’ పాటలో చాలా హాట్గా కపిపించడంతో పాటు డ్యాన్స్ అదరగొట్టి, ఆ తర్వాత పలు ఐటమ్ సాంగ్స్ చేసిన హంసా నందిని డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు 120 మంది డ్యాన్సర్లు పాల్గొనగా కన్నడ కొరియోగ్రాఫర్, దర్శకుడు హర్ష నేతృత్వంలో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పరిచయ పాట చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని, మాస్ పల్స్ తెలిసిన సంపత్ నంది ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నా రని నిర్మాత తెలిపారు. రవితేజ. హంసా నందిని పోటాపోటీగా డ్యాన్స్ చేస్తున్నారని, ఎనర్జీ లెవల్స్కి తగ్గ సినిమా ఇదని దర్శకుడు అన్నారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: భీమ్స్, ఎడిటింగ్: గౌతంరాజు. -
నాకూ, పవన్ కల్యాణ్కూ మధ్య దూరం ఒక్క ఫోన్కాలే!
సంపత్ నంది... హన్మకొండ కుర్రాడు. బీఫార్మసీ టాపర్. ఎంఫార్మసీ డిగ్రీ హోల్డర్. డిగ్రీలు చదవడమే కాదు... పుస్తకాలూ అమితంగా చదివే సృజనశీలి. సినిమా మీద ప్రేమతో పోసాని దగ్గర రచయితగా మొదలై దర్శకుడయ్యారు. రెండు పెద్ద హిట్స్... సెట్స్పై ఇప్పుడు రవితేజతో ‘బెంగాల్ టైగర్’. ఇవాళ బర్తడే చేసుకొంటున్న ఈ మీడియా షై మ్యాన్తో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... *** మీ తాజా ‘బెంగాల్ టైగర్’ ఎందాకా వచ్చింది? 60 శాతమైంది. ఆపకుండా షూటింగ్ చేస్తున్నాం. *** హీరో రవితేజతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్నం అందరూ పెడతారు. కానీ, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం గొప్ప. ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్ట్ ఆగి, నేను డౌన్లో ఉన్నప్పుడు చాన్సిచ్చిన రవితేజకు ఋణపడ్డా. రవితేజ బంగారు కొండ. *** సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు? అవును. రెండూ సమాన ప్రాధాన్యం ఉన్న కీలక పాత్రలే. ఒకటి తమన్నా, రెండోది రాశీ ఖన్నా చేస్తున్నారు. తమన్నా ఎంత కో-ఆపరేటివో, అంతకు మించి ప్రొఫెషనల్. రేపటి సీన్ డైలాగుల్ని ఇవాళే నా మాడ్యులేషన్లో రికార్డు చేయించుకొనెళ్ళి, పొద్దుట కల్లా ప్రిపేరై వస్తుంది. *** రిలీజ్ డేటూ ముందే చెప్పేశారే! అదృష్టమో, దురదృష్టమో నేను చేయాల్సిన ‘గబ్బర్సింగ్-2’ ఆగిపోవడంతో గ్యాపొచ్చింది. దాంతో కథ, లొకేషన్లు, బడ్జెట్తో సహా అన్నీ ఈ స్క్రిప్టుకు ముందే సిద్ధమయ్యాయి. అందుకే, రిలీజ్ డేట్ (సెప్టెంబర్ 18)తో సహా ప్లాన్ చేసి చెప్పేశా. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరుగుతోంది. *** బొమన్ ఇరానీని ఎలా ఒప్పించారు? ‘అత్తారింటికి దారేది’ తర్వాత ఆయన ఎవరికీ ఓ.కె చెప్పలేదు. కానీ, ‘బెంగాల్ టైగర్’ కథ విని, విలన్గా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకు నటనంటే పిచ్చి ప్రేమ. రాసుకొనే ప్రతి స్క్రిప్ట్లో ఆయనకు వేషం ఇవ్వాలనిపించేంతగా సెట్స్లో ఫ్రెండైపోయారు. *** ‘గబ్బర్సింగ్2’ ఆగడం డిస్ట్రబ్ చేసిందా? ఈ విషయంపై మీడియాలో ఏవేవో వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదు. ‘గబ్బర్సింగ్2’కు వర్క్ చేయడం తీపి జ్ఞాపకం. ఎంతో నేర్చుకున్నా. నాలో క్రమశిక్షణ పెరిగింది. పుస్తకపఠనం రెట్టింపైంది. *** ఇంతకీ, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది? (గంభీరంగా...) కొన్నిటికి వ్యక్తులు కాదు, పరిస్థితులే కారణం. మా ప్రాజెక్ట్ ఆగడానికీ అంతే! *** పవన్కల్యాణ్తో మీకిప్పటికీ సత్సంబంధాలున్నాయా? (నవ్వేస్తూ...) మా మధ్య ఎంతో స్నేహానుబంధం ఉంది. మా ఇద్దరి మధ్య దూరమల్లా - ఒక్క ఫోన్ కాలే! త్వరలోనే తప్పకుండా ఆయనతో ఒక సినిమా చేస్తా. అందుకు ఆయన కూడా సిద్ధమే. ఆ మాటకొస్తే, ‘ఏ మైంది ఈ వేళ’ (2010) అనే చిన్న సినిమా తీసిన నాకు రామ్చరణ్ ‘రచ్చ’ అవకాశమిచ్చిన చిరంజీవి గారినీ, ‘మెగా’ ఫ్యామిలీనీ ఎప్పుడూ మర్చిపోను. ‘మెగా’ ఫ్యాన్గా చిరు సినిమాను డెరైక్ట్ చేయడం నా డ్రీమ్. *** ‘గబ్బర్ సింగ్2’కి చేసుకున్న స్క్రిప్టే ‘బెంగాల్ టైగ’రా? దానికీ, దీనికీ సంబంధమే లేదు. ఒక్క రెండు ఫైట్ సీక్వెన్స్ మాత్రం వాడుతున్నా. ఈ స్క్రిప్ట్ పూర్తిగా రవితేజకు అతికినట్లు సరిపోయేలా అల్లుకున్నదే. *** పవన్కల్యాణ్ ‘ఖుషి’ డైలాగుల ఇన్స్పిరేషన్ ఉందా? (నవ్వేస్తూ..) ‘టైగర్... బెంగాల్ టైగర్!’ అనే ‘ఖుషి’ డైలాగ్, ఆ సీన్, ఆయన మాట్లాడే విధానం స్ఫూర్తి ఉంది. ఆ ప్రేరణతో ఈ లైన్, టైటిల్ పుట్టాయి. కానీ, చాలామంది అనుకుంటున్నట్లు ఇది పోలీసు కథా కాదు, కలకత్తా నేపథ్యంలో నడిచే కథ అంతకన్నా కాదు. హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్ప్లే బేస్డ్ మాస్ ఎంటర్టైనర్. *** రవితేజ ఈ సినిమా కోసం బాగా సన్నబడ్డారేంటి? ఈ సినిమా కొద్దిగా స్టైలిష్డ్గా, మోడరన్ టచ్తో వెళుతుంది. ఆ మేరకు రవితేజను కొత్తగా చూపేందుకు ప్రయత్నించా. పైగా, ఏణ్ణర్ధంగా రవితేజలో ఫిట్నెస్ స్పృహ పెరిగింది. అందుకే, స్లిమ్గా కనిపిస్తున్నారు. *** 2010 మొదలైనా ఇది 3వ సినిమానే. ఇంత గ్యాపేం? ఇవాళ పెద్ద హీరోలతో సినిమా ఏడాది చిల్లర పడుతుందని అందరికీ తెలుసు. ఆ మధ్యలో ‘గాలిపటం’ అనే చిన్న సినిమా నిర్మించా. ఏమైనా, ఇకపైన దర్శకుడిగా ఎక్కువ గ్యాప్ రాకుండా సినిమాలు చేస్తా. *** ఇంతకీ మీరెందుకు నిర్మాతగా మారారు? సహజీవనం లాంటి సమకాలీన అంశాలతో సినిమా తీయాలని నేను, నా మిత్రులు అనుకొని ‘గాలిపటం’ తీశాం. మా ఫ్రెండ్ నవీన్ దర్శకుడు. ఇకపైనా యువ దర్శకులతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీస్తాం. *** పోసాని దగ్గర శిక్షణ మీకు ఉపయోగపడిందా? పోసాని గారి దగ్గర అసిస్టెంట్ రైటర్గా చేసిన మూడేళ్ళలో నేర్చుకున్నది ఎమోషనల్గా, స్క్రీన్ప్లే పరంగా సీన్లు రాయడంలో బాగా హెల్ప్ అయింది. ఇక, దర్శకుడిగా ప్రపంచ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నా. *** రచన, దర్శకత్వాల్లో ఎక్కడ సంతృప్తిగా అనిపించింది? నిజం చెప్పాలంటే, నేనింకా అసంతృప్తిగానే ఉన్నా. దర్శక, రచయితగా నా సామర్థ్యం చూపే సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా. ఆ వివరాలన్నీ ఈ సినిమా తరువాతే! ఇప్పటికైతే, నా దృష్టి అంతా ఈ ‘బెంగాల్ టైగర్’ మీదే! ఇది నా కెరీర్లో హ్యాట్రిక్ హిట్ ఫిల్మ్ అవుతుంది. - రెంటాల జయదేవ -
పవర్ఫుల్ టైగర్
‘‘బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్..! కోల్కతా కాళీఘాట్లో ఏసీపీగా డ్యూటీ చేస్తోంది’’ అనే డైలాగ్ వినబడగానే మనకు గుర్తొచ్చేది ‘పవర్ ’ చిత్రం లో రవితేజ పోషించిన బలదేవ్ సహాయ్ పాత్ర. ఇప్పుడా ‘బెంగాల్ టైగర్’ టైటిల్తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ ప్రధాన పాత్రధారి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆర్.ఎఫ్.సీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. బొమన్ ఇరానీ, సాయాజీ షిండేలతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ రవితేజతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి ఆ కోరిక తీరుతోంది. రవితేజ పాత్రను చాలా శక్తిమంతంగా డిజైన్ చేశాం. ఈ నెల 14 వర కు షెడ్యూల్ కొనసాగుతుంది’’అని చెప్పారు. -
బెంగాల్ టైగర్ సరసన!
మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా రంగప్రవేశం చేసి, పదేళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించిన తమన్నా ఒక్క రవితేజతో మాత్రమే నటించలేదు. వచ్చే ఏడాది ఈ మాస్ హీరోతో తెరపై కనిపించనున్నారామె. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరిలో ఆరంభం కానుంది. ఈ సినిమా గురించి తమన్నా చెబుతూ - ‘‘రవితేజతో మొదటిసారి నటించనున్నా. చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. సింగిల్ సిట్టింగ్లో ఈ కథ ఓకే చేశానని రవితేజ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు మీడియమ్ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన నాకు రవితేజ డేట్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నా’’ అన్నారు. రవితేజ ఎనర్జీకి తగ్గ కథ ఇదని సంపత్ నంది తెలిపారు. -
సింగిల్ సిట్టింగ్లో...సంపత్నందికి ఓకే!
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాను ‘ఓకే’ చేసేయడం రవితేజ శైలి. ప్రస్తుతం ఆయన ‘కిక్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ వేడిలోనే... సంపత్నంది సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కిక్-2’ చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే... ఆయన సంపత్నంది సినిమా సెట్లోకి ఎంటరవుతారన్నమాట. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ -‘‘సింగిల్ సిట్టింగ్లో సంపత్నంది కథ ఓకే చేశాను. మాస్ ఎలిమెంట్స్తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అంశాలున్న కథ ఇది. వినోదాన్ని పంచడంలో సంపత్నందిది ఓ భిన్నమైన శైలి. వాణిజ్యవిలువలతో కూడిన పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని సంపత్ తీర్చిదిద్దుతాడని నా నమ్మకం. ‘కిక్-2’ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్పైకి వెళుతుంది’’ అని తెలిపారు. ‘‘నాపై నమ్మకంతో సింగిల్ సిట్టింగ్లో నా కథను ఓకే చేసిన రవితేజగారికి ధన్యవాదాలు. ఆయనతో సినిమా చేయాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తా. ఇద్దరు కథానాయికలు ఇందులో నటిస్తారు. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని సంపత్నంది చెప్పారు. -
మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా?
ఒకేసారి రెండు ఆసక్తికరమైన వార్తలు.చిరంజీవి తన 150వ సినిమా కోసం మెగాఫోన్ పట్టనున్నారట. అలాగే ఎన్నాళ్లనుంచో ఊరిస్తూ వస్తున్న ‘గబ్బర్ సింగ్-2’ను పవన్ కల్యాణ్ తనే సొంతంగా డెరైక్ట్ చేసుకోబోతున్నారట. ఈ రెండు వార్తలూ ప్రస్తుతం ఫిలిమ్నగర్లో హాట్ టాపిక్గా నిలిచాయి. ఇంతకూ ఈ వార్తలు నిజమేనా? మొదట చిరంజీవి సినిమా విషయానికొద్దాం. ‘శంకర్దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేయడం, దాంతో సినిమాలకు ఏడేళ్లు ఆయన దూరం కావడం, మళ్లీ ఇటీవలే ఆయన తన 150వ సినిమాకు సంబంధించి ప్రయత్నాలు మొదలుపెట్టడం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి దృష్టి అంతా ఈ 150వ సినిమా మీదే. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. మునుపటి స్థాయిలో తన శరీరాన్ని తీర్చిదిద్దుకుని సన్నబడ్డారు కూడా. మరో పక్క కథల వేటలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతవరకూ ఏదీ ఓకే కాలేదట. చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేస్తారని ప్రచారం జరిగినా, చిరంజీవి మనసులో మాత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయాలనే ఉంది. ఆ మధ్య బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూల్లో కూడా ఈ విషయాన్ని చిరంజీవి స్పష్టం చేశారు. 2015లో తాను మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం ఖాయమని చెప్పారు. ఈ 150వ సినిమాను వీవీ వినాయక్ డెరైక్ట్ చేస్తారని చాలా కాలంగా వార్త వినిపిస్తోంది. మధ్య మధ్యలో కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా వినవచ్చిన వార్త ఏమిటంటే - చిరంజీవి తానే సొంతంగా ఈ సినిమా డెరైక్ట్ చేయనున్నారట. అయితే ఇది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తే తప్ప, ఇంతవరకూ అధికారిక సమాచారం లేదు. తీయబోయే సినిమాకు ఇప్పటికీ కథ ఓకే కాలేదు... కథ నిర్ణయం కాకుండా చిరంజీవి డెరైక్షన్ చేస్తారని చెప్పడం తొందరపాటే అవుతుందని కొంతమంది సినీ పెద్దలు చెబుతున్నారు. అయితే డిసెంబరు నాటికి ఈ సినిమా ప్రాజెక్ట్ విషయంలో ఓ స్పష్టత వస్తుందంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ విషయానికొస్తే - ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం చాలా నెలల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం, ఈలోగా హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్గా రూపొందుతోన్న ‘గోపాల... గోపాల’కు పవన్ కమిట్ కావడంతో ‘గబ్బర్సింగ్-2’ వెనక్కు వెళ్లిపోయింది. త్వరలోనే ప్రారంభం అని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి కానీ, ఇంతవరకూ షూటింగ్ మొదలు కానే కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ని తానే డెరైక్ట్ చేయాలని పవన్కల్యాణ్ నిశ్చయించుకున్నట్టు ఫిలిమ్నగర్ సమాచారం. పవన్ ఇంతకుముందు ‘జానీ’ సినిమా డెరైక్ట్ చేశారు. ఆ సినిమా వాణిజ్యపరంగా విఫలమైనా, పవన్లో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించింది. ఏది ఏమైనా మెగా బ్రదర్స్ మెగా ఫోన్ పట్టనున్నారన్న వార్త తెలుగు చిత్రపరిశ్రమలో హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో నిజానిజాల గురించి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అప్పటి వరకూ ఈ సస్పెన్స్ తప్పదు! -
నవంబర్ నుంచి గబ్బర్సింగ్ 2
పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బ్లాక్బస్టర్గా నిలిచిన 'గబ్బర్సింగ్' సినిమా సీక్వెల్ ఎప్పుడా ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నవంబర్ నుంచి గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభం కావచ్చని సినిమా దర్శకుడు సంపత్ నంది తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆలస్యం చేయడం ఇక మంచిది కాదని పవన్ భావిస్తుండటంతో దీన్ని వెంటనే చేపడుతున్నారు. వాస్తవానికి కొంతకాలం ముందే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాలని భావించినా, పవన్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఇది ఆలస్యమైందని సంపత్ నంది అన్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా మొదలుపెడదామని పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పవన్ హిందీలో బాగా విజయవంతం అయిన 'ఓ మైగాడ్' రీమేక్ 'గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక గబ్బర్సింగ్2లో ఇంకా ఎవరెవరు నటిస్తారన్న విషయం త్వరలోనే తేలిపోతుంది. పవన్, అతడి స్నేహితుడు శరత్ మరార్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. -
'గాలిపటం' సక్సెస్ మీట్
-
గాలిపటం టీంతో చిట్చాట్
-
గాలిపటం మూవీ స్టిల్స్