Scheduled Caste
-
‘ప్రత్యేక నిధి’కి భారీగా..
సాక్షి, హైదరాబాద్ : దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి ఈసారి భారీగా పెరిగింది. 2025–26 వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.57,400.43 కోట్లు కేటాయించింది. గత వార్షిక బడ్జెట్లో ఎస్డీఎఫ్ కింద 50,180.13 కోట్లు కేటాయింపులు జరపగా... ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,220.30 కోట్లు అదనంగా కేటాయింపులు చేసింది. ఇందులో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్) కింద రూ.40,231.61 కోట్లు కేటాయించగా, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) కింద రూ.17,168.82 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనూ ఎస్సీ ఎస్డీఎఫ్కు అధిక ప్రాధాన్యం దక్కింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.7,107.57 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ఎస్టీ ఎస్డీఎఫ్కు మాత్రం 112.73 కోట్లు మాత్రమే పెరిగాయి. పరిశ్రమలకు రూ.3,527 కోట్లుఐటీ శాఖకు రూ.774 కోట్లు.. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.1,730 కోట్లు» ప్రగతి పద్దు కింద 2024–25 వార్షిక బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 2,248.13 కోట్లు కేటాయించి, తర్వాత రూ.1,321.57 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్లో పరిశ్రమల శాఖకు ప్రగతిపద్దు కింద రూ.2,383.42 కోట్లు ప్రతిపాదించారు. » పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు రూ.4,236 కోట్ల మేర పేరుకుపోయిన నేప థ్యంలో ప్రస్తుత బడ్జెట్లో వీటికి రూ.1,730 కోట్లు కేటాయించారు. » టీ హబ్ ఫౌండేషన్కు గత ఏడాది బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో నయాపైసా ఇవ్వలేదు. » ఐటీ శాఖకు 2024–25 బడ్జెట్లో ప్రగతిపద్దు కింద రూ.771.20 కోట్లు ప్రతిపాదించి, చివరకు 337.30 కోట్లకు సవరించారు. తాజా బడ్జెట్లోనూ ప్రగతిపద్దు కింద ఈ శాఖకు రూ.771.20 కోట్లు ప్రతిపాదించారు.» కొత్త పారిశ్రామిక పార్కుల్లోని ప్లాట్లలో 5 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు, 15 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు.» ప్రైవేటు ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు స్టాంప్ డ్యూటీ, విద్యుత్ చార్జీలు, భూమి ధరల్లో రాయితీలు ఇస్తామని ప్రకటించారు.» 2050 నాటికి రాష్ట్రమంతటా పారిశ్రామిక అభివృద్ధి కోసం ‘మెగా మాస్టర్ప్లాన్ 2050’ పాలసీ తెస్తామని ప్రభుత్వం తెలిపింది.» పాలసీలో భాగంగా ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, మెటల్, చేనేత, ఆభరణాల తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు.» జాతీయ రహదారి 163కు ఇరువైపులా హైదరాబాద్– వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును ప్రతిపాదించారు. -
59 కులాలు 3 గ్రూపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభాకు రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది నవంబర్ 11నుంచి 82 రోజుల పాటు వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది.సోమవారం (Monday) 199 పేజీలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పింపంచింది. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ఒక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2011 జనగణన (Census) ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ కింద ఉన్న 59 కులాలను వారి సామాజిక స్థితిగతుల ఆధారంగా మూడు గ్రూపులుగా కమిషన్ వర్గీకరించింది. గ్రూప్–1లో 15 కులాలు, గ్రూప్–2లో 18 కులాలు, గ్రూప్–3లో 26 కులాలను చేర్చింది.మూడింటికి ఓకే.. ఒక సిఫారసుకు నో» ఎస్సీ వర్గీకరణ అమలుకు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సిఫారసులు చేసింది. ఇందులో మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, ఒక సిఫారసును తిరస్కరించింది.» ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా, ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, ఇంతవరకు పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను కమిషన్ గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చింది. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 3.288 శాతం ఉండడంతో వారికి ఒక (1)శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది.» ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2లో చేర్చింది. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం ఉండగా, వారికి 9% రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. » మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లో చేర్చింది. ఎస్సీ జనాభాలో 33.963%ఉన్న వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది.» ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మేయర్ తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్–1 సర్వీ సుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్ కేటగిరీగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ వ్యక్తులకు సంబంధించి రెండో తరానికి రిజర్వేషన్ల ప్రయోజనం నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. అయితే ఈ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.» ఇక ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు వన్మెన్ కమిషన్ ప్రాధాన్యత నమూనాను రూపొందించింది. గ్రూప్–1లో నోటిఫై చేసిన అలాగే భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్లో అంటే గ్రూప్–2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. -
‘మతం మెలికను రద్దు చేయాలి’
ఢిల్లీ: మతం మెలికను దళితుల మెడకు చుట్టి రాజ్యాంగ ఫలాలను దళితులకు దూరం చేసిన 1950లో ఇచ్చిన షెడ్యూల్డు కులాల రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చెయ్యాలని కోరుతూ విశ్రాంత అదనపు డీజీపీ డాక్టర్ కూచిపూడి బాబూరావు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి మేధావుల బృందం ఎంక్వైరీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను కలిసింది. ‘‘ డెబ్బై నాలుగు సంవత్సరాల గణతంత్ర దేశ చరిత్రలో దళితుల మెడకు బిగించిన మతం మెలికను ఎత్తి వేయడానికి తగిన సిఫారసు చెయ్యాలని కోరాం. ఈ ఉత్తర్వు వలన దళితులు మతపరంగా విభజించబడ్డారు. ఏ మతంలోని దళితులకైనా కులపరంగా వివక్ష ఉంది. ఆ వివక్ష రూపాలను , వివక్ష జరుగుతున్న తీరును తెలిచెప్పాం. ఈ ఉత్తర్వు వలన క్రైస్తవ దళితులు షెడ్యూల్డు కులాలకు కల్పించే ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నారు. అంతే కాకుండా విద్య ఉద్యోగాలలో కొనసాగుతున్న వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. మతం, సంస్కృతి సంప్రదాయాలు ఆయా భౌగోళిక పరిస్థితుల ఆధారంగ వుంటాయి. సాంస్కృతిక విషయాలను గుర్తించాలి. అదే కోణంలో భారత దేశంలో క్రీస్తు పూర్వమే నెలకొన్న హిందూ మతాన్ని అందులోని కులాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ..ఎక్కడో ఇజ్రాయేలులో పుట్టిన క్రైస్తవ మతం లో కులం లేదు కాబట్టి భారత దేశంలో క్రైస్తవంలోకి చేరే దళితులకు కుల వివక్ష వుండదనే సూత్రీకరణల ఆధారంగా క్రైస్తవం తీసుకునే దళితులను షెడ్యూల్డు కులాల వారిగా గుర్తించనని చెప్పడం అర్థం లేనిలేదు. ఇజ్రాయెల్, ఇతర క్రైస్తవ దేశాలలో రంగు, జాతి వివక్ష అక్కడ ఉంది. ఆ దేశాలలో హిందూ మతం పుట్టలేదు. కాబట్టి అక్కడ కుల వివక్ష లేదు. భారత దేశంలో హిందూ మతం వుండడం వలన భారత దేశ మంతటా కుల వివక్ష విస్తరించింది. భారత్తో అన్ని మతాలలో కులం వుంటుందని అక్కడ అన్ని మతాలలో జాతి , రంగులను బట్టి వివక్ష వుంటుంది. భారత దేశంలో వుండే అన్ని రకాల మతాలలో కులం వుంటుందని భారతీయులు అధికంగా వలసపోతున్న అభివృద్ధిచెందిన దేశాలలో కుల వివక్ష ఆరంభమయ్యింది’ అని జస్టిస్ బాలకృష్ణన్ అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ బాబు రావు వివరణ ఇచ్చారు.‘‘ నాటి రాష్ట్రపతి ఉత్తర్వు నేటికీ దళితుల జీవితాల మీద ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును , ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించే హక్కును దళితులు మాత్రమే కోల్పోతున్నారు. తద్వారా దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది’’ అని సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పులుగుజ్జు సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘‘మాదిగ, మాల, పరయ, పులయ వంటి కులాల పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉందనే ఈ విషయాన్ని 2007వ సంవత్సరంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రుజువు చేసింది’’ అని బ్రదర్ జోస్ డేనియల్ చెప్పారు. ‘‘పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఏ మతం వారికైనా కులం తప్పకుండా రికార్డు చేయాలని అటువంటప్పుడు దళితులు ఏ మతంలో వుంటే ఏముంది’’ అని తెలంగాణ హైకోర్టు లాయరు చాట్ల సుధీర్ అన్నారు. సామాజిక, ఆర్థిక , రాజకీయ రంగాల్లో దళితులు రాణించాలంటే అడ్డంకిగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయడం తప్ప మరొక మార్గం లేదని విన్నవించారు. అనేక రకాల అభిప్రాయాలు విన్న తరువాత నవంబరు మాసంలో ఆంధ్ర తెలంగాణకు రాష్ట్రాలు పర్యటిస్తానని తమ వాదనలు క్షేత్ర స్థాయి పర్యటనలో తెలియజేయాలని జస్టిస్ బాలకృష్ణన్ ప్రతినిధి బృందానికి తెలియజేశారు. ప్రతినిధి బృందంలో ఫా. అంతోనిరాజ్ సీబీసీఐ సెక్రటరీ, బిషప్ వీరాజీ ఇజ్రాయెల్, గోనె సాల్మన్ రాజ్ , సిస్టర్ అనేయ ఫెర్నాండెజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక.. 24గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు. -
ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలం!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్సీ, ఎస్టీల్లోని ఉపకులాల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కల నెరవేరిందని ఆయా వర్గాల నేతలు చెబుతుండగా.. వాస్తవంగా ఏమేరకు లబ్ధి జరుగుతుందనే చర్చ మరోవైపు మొదలైంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అమలవుతున్నప్పటికీ అభివృద్ధిలో ఉన్న కులాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయనే వాదన తీవ్రంగా ఉంది.ఎస్సీల్లో మాలలే ఎక్కువగా రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్నారని, మాదిగలకు సరైన కోటా దక్కడం లేదనే వాదన ఉండగా.. ఎస్టీల్లో లంబాడాలే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారంటూ ఆదివాసీ తెగలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తు న్నాయి. ఈ క్రమంలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి పేరిట ఉద్యమాలు ఏళ్లుగా కొనసాగు తున్నాయి. ఇందులో అత్యంత చురుకుగా ఎమ్మార్పీఎస్ ముందు వరుసలో ఉంది. దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పరిష్కారం లభించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు...రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల కేటగిరీలో 60 ఉప కులాలున్నాయి. అదే విధంగా షెడ్యూల్డ్ తెగల (ట్రైబ్స్) కేటగిరీలో 32 ఉప కులాలు న్నాయి. గిరిజన కేటగిరీలో పర్టిక్యులర్లీ వల్నరెబుల్ (అత్యంత బలహీన) ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) విభాగం కింద మరో 5 కులాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో ప్రధానంగా నాలుగైదు కులాల్లోనే అత్యధిక జనాభా ఉండగా.. మిగిలిన కులాల్లో మాత్రం వెయ్యిలోపు నుంచి పదివేల లోపు జనాభా ఉన్నవే ఎక్కువ.కాగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతించడంతో పాటు అన్ని కులాలకు సమానంగా అందించేవిధంగా వర్గీకరణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఏవిధంగా జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
First general elections: ఒక్క స్థానం.. ఇద్దరు ఎంపీలు!
ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.తొలి ఎన్నికల్లో...మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!1957లో...సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్లో 18, ఆంధ్రప్రదేశ్లో 8, బిహార్లో 8, పశి్చమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
SC: ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు
ఢిల్లీ: ఎస్సీల(Scheduled Castes communities) వర్గీకరణ విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో..పరేడ్ గ్రౌండ్స్లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం. On the directions of PM, a Committee of Secretaries constituted under the Chairmanship of Cabinet Secretary to examine the administrative steps that can be taken to safeguard the interests of Scheduled Castes communities, like the Madigas and other such groups, who have… — ANI (@ANI) January 19, 2024 -
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
బీహార్ కులగణన: 34% మంది పేదలే.. నెల ఆదాయం రూ. 6 వేల కంటే తక్కువ..
పాట్నా: బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 34 శాతం పేదలు ఉన్నట్లు ఇటీవల చేపట్టిన కులగణన నివేదిక ద్వారా వెల్లడైంది. వీరి ఆదాయం నెలకు రూ.6 వేల కంటే దిగువన ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 29 శాతం మంది రూ.పది వేల కన్నా తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరో 28 శాతం మంది రూ.10 వేల నుంచి రూ.50 వేల మధ్య ఆదాయం పొందుతున్నారని, కేవలం 4 శాతం జనాభా మాత్రమే రూ.50 వేల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్లు రిపోర్టులో తేలింది. కులగణన ఆధారిత సర్వే రెండో విడత డేటాను బీహార్ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం 215 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనబడిన వర్గాలు, అత్యంత వెనకబడిన వర్గాలు(Extremely Backward Classes), జనరల్ కేటగిరికి చెందిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. సర్వే అందించిన సమాచారం ప్రకారం.. ఎస్సీ ప్రజల్లో 42 శాతం, ఎస్టీ జనాభాలో 42.70 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నట్లు వెల్లడైంది. వెనకబడిన వర్గాల్లో (ఓబీసీ) 33.16 శాతం, అత్యంత వెనకబడిన వర్గాల (ఈబీసీ) వారిలో 33.58 శాతం మంది సైతం పేదరికం అనుభవిస్తున్నట్లు తెలిపింది. జనరల్ క్యాటగిరీకి చెందిన 25.09 శాతం కుటుంబాలు పేదరికం జాబితాలో ఉన్నట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఇవేగాక ఇతర కులాల్లోని పేదలు 23.72 శాతం ఉన్నట్లు రిపోర్టులో తేలింది. షెడ్యూల్డ్ కులాల్లో కేవలం ఆరుశాతం కంటే తక్కువ మంది పాఠశాల విద్యను పూర్తిచేశారు. 11వ, 12వ తరగతి వరకు చదివిన వారు 9 శాతం మంది ఉన్నారు. ఇక గత నెలలో విడుదల చేసిన కులగణన మొదటి విడత నివేదికలో బీహార్లో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. మొత్తం 13.1 కోట్ల రాష్ట్ర జనాభాలో 20 శాతం జనాభా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాదవ్, ముస్లిం వర్గాల జనాభాను పెంచాలని నీతీశ్ కుమార్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనివల్ల ఓబీసీలకు, ఈబీసీలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. షా వ్యాఖ్యలపై మండిపడిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కేంద్రమంత్రి ఆరోపణలను కొట్టిపారేశారు. యాదవులు వెనుకబడినవారు కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏ ప్రాతిపదికన ఒకరి జనాభా తగ్గిస్తున్నారు, ఒకరి జనాభా పెంచుతున్నారని ఆరోపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనకు మద్దతివ్వడానికి తమ వద్ద శాస్త్రీయ డేటా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సర్వే డేటా బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే! -
చట్టం ముందు అందరూ సమానమే
దోమ: చట్టం ముందు అందరూ సమానమేనని, కులాల పేరుతో గొడవలు తగవని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్ అన్నారు. మండల పరిఽధిలోని బ్రాహ్మణపల్లిలో దళితుల ఆలయ ప్రవేశం విషయమై ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్కుమార్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ముందుగా గ్రామంలోని ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్థానికులతో సమావేశమై మాట్లాడారు. దేశంలో సామాజిక మార్పు కోసం ప్రజలను జాగృత పర్చాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో ఇలాంటి అసమానతలను తొలగించడానికి రాజకీయాలకు అతీతంగా జనాలను చైతన్యం చేయాలన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనలు జిల్లాలో ఎక్కడా పునరావృతం కాకుండా నిఘా పెట్టాలని సూచించారు. ఘటనకు బాధ్యులపైన వారిపై 302 సెక్షన్ అమలు చేసి త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగిన రోజే ఎస్ఐ విశ్వజన్ అప్రమత్తమై జిల్లా అధికారులతో కలసి బాధ్యులను గుర్తించి జైలుకు పంపడంపై ఎస్పీ కోటిరెడ్డి, ఎస్ఐని అభినందించారు. సోదర భావంతో మెలగాలి కులాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో కలసి మెలసి ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బడి, గుడి అందరివని కులాల ప్రస్తావన ఇక్కడ రావద్దని సూచించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘట నలు మళ్లీ రీపీట్ కాకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తాం.. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరిగినా పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనపై వెంటనే స్పందించి బాధ్యులైన 35 మందిపై కేసు నమోదు చేసి, 20 మందిని రిమాండ్కు తరలించామని, మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుని కోర్టులో ప్రవేశపెడుతామని స్పష్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే 100 నంబర్కు డయల్ చేసి చెప్పాలన్నారు. అనంతరం బాధితులైన రఘురాం, అనసూయమ్మకు ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్, కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రూ.25 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, అడిషన్ ఎస్పీ మురళీధర్, తహసీల్దార్ షాహెదబేగం, డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, ఎంపీడీఓ జయరాం, ఆర్ఐలు లింగం, శివప్రసాద్, సీఐ వెంకటరామయ్య, ఎస్ఐలు గిరి, శ్రీశైలం, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు, ఎస్బీ సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుడ్ని డిప్యూటీ సీఎం చేయకపోతే తీవ్ర పరిణామాలు
బెంగళూరు: ఐదు రోజులపాటు అలుపెరగకుండా చర్చించింది. చివరకు.. కర్ణాటక ముఖ్యమంత్రి అంశం ఓ కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం ఊపిరి పీల్చుకుంది. ఈ తరుణంలో కొత్త తలనొప్పులు సిద్ధం అవుతున్నాయా?. సామాజిక వర్గాల వారీగా పలు డిమాండ్లు తెర మీదకు రాబోతున్నాయా?.. కర్ణాటక సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననిపిస్తోంది. దళితుడ్ని గనుక డిప్యూటీ సీఎం చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటూ హెచ్చరించారాయన. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత జి. పరమేశ్వర పార్టీ అధిష్టానానికి ముందస్తుగా ఈ హెచ్చరికలు పంపారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకకే శివకుమార్ను ఏకైక డిప్యూటీ సీఎంగా ప్రకటించిన తరుణంలోనే.. పరమేశ్వర మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తానే ఏకైక సీఎంగా ఉండాలని శివకుమార్ పెట్టిన షరతును కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘శివకుమార్ కోణంలో ఆయన కోరింది సరైందే కావొచ్చు. కానీ, హైకమాండ్ ఆలోచన భిన్నంగా ఉండాలి. అదే మేం ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారాయన. డిప్యూటీ సీఎం పదవితోనే దళితులకు న్యాయం జరుగుతుందా? అని మీడియా ప్రశ్నించగా.. దళిత వర్గం భారీ అంచనాలు పెట్టుకోవడం సహజమే కదా అని పేర్కొన్నారు. ‘‘ఈ అంచనాలను అర్థం చేసుకుని.. మా నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే.. సాధారణంగానే ప్రతికూల స్పందన వస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మేల్కొనే బదులు.. ఇప్పుడే ఆ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకుంటే పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అదే అర్థం చేసుకోమని నేను హైకమాండ్ను కోరుతున్నా’’ అని పరమేశ్వర కాంగ్రెస్ అధిష్టానానికి సున్నితంగా హెచ్చరికలు పంపించారు. అలాగే.. తానూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను ఆశించిన వాళ్లలో ఉన్నట్లు చెబుతున్నారాయన. కానీ, హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది కదా అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతానికి వాళ్లిద్దరి పోస్టులను ప్రకటించారు. చూద్దాం.. కేబినెట్ ఏర్పాటులో దళితులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో’’ అని వ్యాఖ్యానించారాయన. దళిత సామాజిక వర్గానికి చెందిన 71 ఏళ్ల వయసున్న జి. పరమేశ్వర, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాదు.. సుదీర్ఘకాలం కర్ణాటక పీసీసీగా పని చేసిన రికార్డు కూడా(ఎనిమిది ఏళ్లు) ఈయన పేరిట ఉంది. 2013లో కేపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పరమేశ్వర.. ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకుంది ఈయన్నే. కానీ, ఓడిపోవడంతో సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పజెప్పింది. ఆ తర్వాత పరమేశ్వరని ఎమ్మెల్సీని చేసి.. తన ప్రభుత్వంలో మంత్రిని చేశారు సిద్ధరామయ్య. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం పరమేశ్వర కొరటగెరె స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇదీ చదవండి: డీకే శివకుమార్ నిజంగానే తలొగ్గాడా? -
మణిపూర్లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. అందులో పురుషుల సంఖ్య 1,76,11,633 కాగా మహిళలు 1,73,92,041మంది ఉన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం చూస్తే...మొత్తం ఎస్సీల జనాభా 54,08,800 కాగా వారిలో మహిళలు 27,15,673, పురుషులు 26,93,127 మంది ఉన్నారు. ఇక ఎస్టీల జనాభా విషయానికొస్తే... మొత్తం 31,77,940 ఉండగా, అందులో పురుషులు 16,07,656, మహిళలు 15,70,284 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఎస్టీల జనాభా సంఖ్య 3,92,034, మహబూబ్బాద్ జిల్లాలో 2,92,778, ఆదిలాబాద్ జిల్లాలో 2,24,622, నల్లగొండ జిల్లాలో 2,09,252, ఖమ్మం జిల్లాలో 1,99,342. ► ఎస్సీల విషయానికొస్తే...రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అంటే 3,34,337, ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 2,92,951, ఖమ్మం జిల్లాలో 2,79,319, సంగారెడ్డి జిల్లాలో 2,77,429. హైదరాబాద్ జిల్లాలో 2,47,927 మంది ఉన్నారు. ►బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయా అంశాలు పొందుపరిచారు. గతంలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలను షెడ్యూల్ ప్రాంతాల జిల్లాలుగా పరిగణించగా, ప్రస్తుతం అవే షెడ్యూల్ ప్రాంతం కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, నాగర్కర్నూల్ అనే 9 జిల్లాల్లో ఉన్నట్టు తెలియజేశారు. ►ఉట్నూరు, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాకతో సహా షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలు=1,286 ►వందశాతం ఎస్సీ గ్రామపంచాయతీలు (తండాలు/గూడెంలు) =1,177 ప్లెయిన్, ఎస్టీ రిజర్వ్ గ్రామపంచాయతీలు =687 ►2018–19 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు షెడ్యూల్ ప్రాంత జీపీలు, వంద శాతంఎస్టీ జీపీలు, షెడ్యూలేతర ప్రాంతాల్లో ఎస్టీ జీపీలకు విడుదల చేసిన గ్రాంట్లు సంక్షిప్తంగా కలిపి మొత్తం...రూ.2,062.75 కోట్లు గ్రాంట్ల రూపంలో విడుదల చేసినట్టు తెలియజేశారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి: ఈటల -
‘ఎస్సీ’ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ అయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీస్) దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎమ్మార్పీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎస్సీల్లో ఎక్కువ జనాభాగా ఉన్నప్పటికీ మాదిగ ఉపకులాలకు తగిన రిజర్వేషన్లు వర్తించడం లేదన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే ఈవీ చిన్నయ్య కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే... ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఆలస్యం అవుతోందని, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యంతర పరిష్కారం ఇవ్వాలని కోరారు. అయితే కేసు విచారణ వేగవంతం చేయాలని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరలేమని, అదే కేసులో ఇంప్లీడ్ కావాలని పిటిషనర్కు సీజేఐ సూచించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని రోహత్గి తెలపగా స్పందించిన సీజీఐ, ‘‘ఈ తరహా కేసులో విచారణ చేపట్టకుండా ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా?’’అని న్యాయవాదిని ప్రశ్నించారు. అనంతరం ‘‘రాజ్యాంగ ధర్మాసనం కేసులో ఇంప్లీడ్ కావడానికి పిటిషనర్కు అనుమతిస్తున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రతివాదులకు నోటీసులు జారీ పూర్తయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలి’’అని ధర్మాసనం ఆర్డర్లో పేర్కొన్నారు. వర్గీకరణతోనే న్యాయం: మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరు గుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతున్నామన్నారు. -
దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: దళితుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితుల కోసం చంద్రబాబు ఏం చేశారు? అని సూటిగా ప్రశ్నించారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా? నిలదీశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించి ఇప్పుడు దండలు వేస్తారా? అని మండిపడ్డారు. దళిత జాతిపై దాడి జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని దుయ్యబట్టారు. దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో దళిత జాతిపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక విప్లవానికి నాంది పలికింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. నవరత్నాలతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలన్నీ బినామీలు, దళారులకే దక్కేవని తెలిపారు. -
ఈసురోమని మనుషులుంటే...
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు నేడు అంతకు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో 2022–2023 వార్షిక బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవ నాల నిర్మాణం, వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు 90% శాతం ప్రైవేటు అద్దె బిల్డింగు లలో కొనసాగుతున్నాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గది, వసతి గది (డార్మెటరీ) రెండూ ఒకటే. ఇక సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే... అవి సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గతంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ల పేరుతో కొన సాగిన హస్టళ్ళు, నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లుగా మారాయి. సంక్షేమ వసతి గృహాలలో కొన్నింటిని 1990 ప్రాంతంలో రేకుల షెడ్డులుగా నిర్మించగా... ఇవ్వాల అవి శిథిలావస్థకి చేరాయి, మెజారిటీ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి. అద్దె బిల్డింగుల సముదా యాలు వ్యాపార సంబంధిత అవసరాలకై నిర్మించినవి కావడంతో కనీస వసతి సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తల్ల డిల్లిపోతున్నారు. మా క్షేత్ర స్థాయి పరిశీలనలో... గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు పూర్తిగా ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. పదవ తరగతిలోపు విద్యార్థు లుండే ప్రీ మెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు బాల బాలికలవి 12 ఉండగా... ఇందులో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాలలో ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 24 ఉండగా, ఇందులో 23 హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రైవేట్ బిల్డింగు లలో కనీస సౌకర్యాలు లేక పోగా, ప్రతి నెల అద్దె లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బుతో ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించ వచ్చు. కానీ ఆ పని చేయడంలేదు. హాస్టళ్లలో రీడింగ్ రూమ్లు, లైబ్రరీలు, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వెంటాడుతున్నాయి. గురుకులాల్లో కంప్యూ టర్ బోధన పేరుకు మాత్రమే సాగుతోంది. సంక్షేమ హస్టళ్ళలో చదువుతున్న పదవతరగతిలోపు విద్యార్థులకు రూ. 62 మాత్రమే కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తుండగా... పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వటం లేదు. నెల నెలా కాస్మోటిక్స్ కొనుక్కో వడానికి, బస్ పాస్, ఇంటర్నెట్ రీచార్జీ తదితర అవసరాలు నెరవేర్చుకోవడానికైప్రభుత్వం ఎలాంటి స్టైఫండ్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు కూలీ పనులకు వెళ్తూ అర్ధ కార్మికు లవుతున్నారు. ఇటీవల పనికి వెళ్లొస్తున్న అంబర్పేట హాస్టల్ విద్యార్థి యాక్సిడెంట్లో మరణించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. చాలా హాస్టళ్లకు రెగ్యులర్ వాచ్ మెన్, వాచ్ ఉమెన్, ఇతర సిబ్బంది లేరు, హాస్టళ్లలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు. సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ. 35 ఇస్తుండగా, కాలేజి విద్యార్థులకు రూ. 50 ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఖర్చుతోనే ప్రతిరోజూ మూడుసార్లు భోజనం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మెనూలో కూరగాయలతో కూర వండాల్సి ఉండగా... చాలా వసతి గృహాల్లో పప్పుతోనే సరిపెడు తున్నారు. మూడు పూటలా బియ్యంతో తయారైన ఆహారాన్నే తినటంతో... కార్బోహైడ్రేట్లు తప్ప శరీరానికి అందవలసిన మిగతా విటమిన్లు ఏ, సీ, బీ–కాంప్లెక్స్; ప్రొటీన్స్, కొవ్వులు ఇతర పోషకాలు తగినంతగా పిల్లలకు అందటంలేదు. భారత దేశంలోని పిల్లలందరి మనుగడ, పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యాలకు ఉపకరించే పోషకాహార విధానం లేదని యుని సెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్ఎన్ఎస్) 2016–18 ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితి గమనిస్తే 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారని తేలింది. చాలామంది అండర్ వెయిట్కి చేరి రోగాల బారిన పడుతున్నారు. ‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్’ అన్న గురజాడ మాటలు అందరూ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సరైన తిండి, బట్ట, వసతి సౌకర్యాల లేమితో బలహీనంగా తయారవుతున్న రేపటి పౌరులను ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కదా! కె. ఆనంద్ వ్యాసకర్త పి.డి.ఎస్.యు. (విజృంభణ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొబైల్: 96523 57076 -
ఉపకార వేతనాల దరఖాస్తులను అందజేయండి
సాక్షి,సిటీబ్యూరో: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు వెంటనే జిల్లా ఎస్సీ సంక్షేమాధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, విద్యార్థుల దరఖాస్తుల సమర్పించడంలో జరుగుతున్న జాప్యం పై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, వృత్తి విద్య కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులను వసతి గృహ అధికారులు ఈ నెల 28 లోగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ప్రతి షెడ్యూల్ కులాల విద్యార్థిచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామారావు, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు, ఏఎస్ఓలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
దళిత మహిళా సర్పంచ్కు టీడీపీ ఉప సర్పంచ్ వేధింపులు
సాక్షి, ప్రత్తిపాడు (గుంటూరు): కులం పేరుతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ దళిత మహిళా సర్పంచ్ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కథనం ప్రకారం.. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా గొట్టిపాడు సర్పంచ్గా టీడీపీ బలపరిచిన ఆది ఆంధ్రా కాలనీకి చెందిన ప్రత్తిపాటి మరియరాణి గెలుపొందారు. ఉప సర్పంచ్గా టీడీపీకి చెందిన ముఖుంద శివరంజనిని పంచాయతీ సభ్యులు ఎన్నుకున్నారు. నాటినుంచి సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే అనేకమార్లు పంచాయతీ కార్యాలయంలోనే వివాదాలు, వాగ్వాదాలు జరిగాయి. సర్పంచ్గా మరియరాణి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఉపసర్పంచ్ భర్త నిమ్మగడ్డ శ్రీకాంత్ ఆమెను కులం పేరుతో దుర్భాషలాడుతున్నాడు. ఇటీవల ఖాళీ చెక్కులపై సంతకాలు చేయాలంటూ శ్రీకాంత్, పంచాయతీ ఇన్చార్జి సెక్రటరీ రామ్మూర్తి కలిసి మరియరాణిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో దుర్భాషలాడుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై పంచాయతీకి వెళ్లనని శ్రీకాంత్ ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు. చదవండి: (విమ్స్లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్) ఆ తర్వాత కూడా మళ్లీ ‘నాతోనే క్షమాపణ చెప్పిస్తావా?, ...దానివి నీకెందుకు సర్పంచ్ కుర్చీ. మేం ఎలా చెబితే అలా చేయాలి లేకుంటే చంపేస్తాం’ అంటూ శ్రీకాంత్ బెదిరింపులకు దిగాడు. వేధింపులు తాళలేని మరియరాణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాంత్తో పాటు జూనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రతాప్కుమార్ తెలిపారు. -
రాజ్యాంగం జోలికొస్తే పతనం కాక తప్పదు!
మలక్పేట: ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగం జోలికి వస్తే పతనం కాక తప్పదని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల మహేష్కుమార్ అన్నారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన విద్యార్థి నాయకులతో కలిసి శనివారం మూసారంబాగ్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మహేష్కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మనువాద కుట్రలను తిప్పికొట్టడానికి దళిత, బహుజనులు సిద్ధం ఉన్నారన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షుడు నక్క వెంకటేష్, బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వడ్డేపల్లి రాకేష్, గ్యార సతీష్, మేడి నాగరాజు, అశోక్, సాయికిరణ్ యాదవ్, రవివర్మ, మారుతి, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు. -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్సింగ్ హస్తం పార్టీకి గుడ్బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్జిత్సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
BJP: తెలంగాణ టార్గెట్ 31
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా వర్గాల ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లపాటు ఆ నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్మ్యాప్ను, ఫార్మూలాను ఖరారు చేయనుంది. ఈ సీట్లలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానిపై లోతైన అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాలతోపాటు మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తోంది. ముందుగానే అభ్యర్థుల ఎంపిక దిశగా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించి ముందు నుంచే వారిని పోటీకి సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఆయా స్థానాలకు సంబంధించి పార్టీలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల, ఆయా సీట్లలో ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి, ఏ పార్టీ వారిని చేర్చుకొని సీటిస్తే పక్కాగా విజయం సాధించవచ్చు వంటి అంశాలపై కసరత్తు చేపడుతోంది. కనీసం 10 సీట్లు కైవసం చేసుకొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలు, కార్యక్రమాలను సిద్ధం చేసుకోనుంది. ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో అమలు కాని అంశాలపై విశ్లేషణకు కమలదళం సిద్ధమవుతోంది. దళితులకు ఇచ్చిన మూడెకరాల చొప్పున భూకేటాయింపు హామీ, దళితబంధు కింద రూ. 10 లక్షలు ఖాతాల్లో డిపాజిట్ అంశాలను ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపుదల, ఇతర హామీల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా నిరసనలు చేపట్టాలని భావిస్తోంది. 28న పార్టీ ముఖ్యుల భేటీ.. ఈ నెల 28న రాష్ట్రంలోని ఎస్సీ అసెంబ్లీ సీట్లపై కూలంకష పరిశీలనకు ఎస్సీ నేతలు, పార్టీ ముఖ్యనేతలతో బీజేపీ అంతర్గత భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి స్పష్టమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా ప్రధాన స్రవంతికి దూరంగా ఉండిపోయినా వారికి... రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు రూపంలో సమాన అవకాశాలు కల్పించాలని చూస్తున్నామని, దీనికి తగిన దారి చూపించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రానికి కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫు అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ... పదోన్నతుల్లో రిజర్వేషన్లపై తగిన మార్గదర్శకాలు రూపొందించకపోతే సమస్యలు తీవ్రం అవుతాయని, ఎప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని తెలిపారు. చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా) ‘‘పదోన్నతులు మెరిట్ ఆధారంగా తప్ప భర్తీ చేయడం లేదు. కానీ ఏళ్ల తరబడి ఓ వర్గం వెనకబడిపోయింది. దేశప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాల దృష్ట్యా సమానత్వం తీసుకురావాలి. దామాషా ప్రాతినిధ్యంతోనే సమానత్వం వస్తుంది’’ అని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఓ సూత్రం కావాలని, ఒక వేళ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని వేణుగోపాల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
అంబేడ్కర్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్ బర్క్ మాటలను అంబేడ్కర్ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్ చేసిన నిరసన గర్జన అది. షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, వర్కింగ్ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్ ఓటింగ్ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 1955లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్ భాయి పటేల్ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్ డిమాండ్ చేసిన ప్రత్యేక ఓటింగ్ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్ పటేల్ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు. అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్ అండ్ మైనారి టీస్’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్ ఎన్నికల సభల్లో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తీర్మానం. ఆ తర్వాత క్యుములేటివ్ ఓటింగ్ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్ మైనారిటీస్’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. రిజర్వేషన్ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
ఎస్సీల సమగ్రాభివృద్ధిలో రాష్ట్రానికి రెండు అవార్డులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన మూడు అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంలోని మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటికి ఎంపికైన మూడింటిలో రెండు జిల్లాలు మన రాష్ట్రానివే కావడం విశేషం. ఇందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. దేశంలోనే అత్యున్నత పనితీరు షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఎక్కువ మంది నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన.. సామాజిక, ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంలో మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నతంగా పని చేస్తోందని కేంద్రం ప్రశంసించింది. ఆ ప్రాంతాల్లో బడికి దూరంగా ఉండే పిల్లలను బడులలో చేర్పించడం, అక్కడి పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం అందజేయడం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల మంజూరు, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవనోపాధిని పెంచడంతో పాటు ఆ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఎక్కువగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాల పరిధిలో 19,172 గ్రామాల్లో ఈ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా 11 జిల్లాల పరిధిలోని 501 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు గ్యాప్ ఫండింగ్ రూపంలో ప్రత్యేకించి రూ.20 లక్షల చొప్పున అదనంగా ఒక్కొక్క గ్రామానికి ప్రభుత్వం నిధులిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చినప్పటికీ.. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే మన రాష్ట్రంలోఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు తీరు ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ విభాగం జిల్లాల వారీగా అవార్డులను ప్రకటించింది. సీఎస్కు లేఖ రాసిన కేంద్ర కార్యదర్శి మొత్తం మూడు అవార్డులకు గాను రెండు అవార్డులు ఏపీకే దక్కినట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్కు బుధవారం లేఖ రాశారు. ప్రభుత్వానికి, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల అధికారులకు ఆ లేఖలో అభినందనలు తెలియజేశారు. -
AP: బడుగుల భద్రతలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: దళితులు, గిరిజనులకు పూర్తి భద్రత.. సామాజికంగా భరోసా.. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ.. ఇదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడినా పర్వాలేదనే టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూలంగా సంస్కరించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అప్రతిహతంగా సాగిన దళితులు, గిరిజనుల హక్కుల హననానికి అడ్డుకట్ట వేసింది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నది. 2014–19 మేతో పోలిస్తే 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని జాతీయ క్రైమ్రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు తార్కాణంగా నిలుస్తోంది. 2019 నుంచి తగ్గిన కేసులు రాష్ట్రంలో 2015–19తో పోలిస్తే 2019–21లో దళితులు, గిరిజనులపై దాడులు, ఇతర వేధింపులు గణనీయంగా తగ్గాయి. గత ఆరేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యల్పంగా 2021లోనే నమోదు కావడం విశేషం. 2015తో పోలిస్తే 2020లో దళితులు, గిరిజనులపై నేరాలు 13శాతం తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను కేటగిరీలవారీగా పరిశీలిస్తే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లో హత్య కేసులు 40శాతం, అత్యాచారం కేసులు 15శాతం తగ్గాయి, దాడులు 6శాతం, గృహదహనాలు 38శాతం, ఎస్సీ, ఎస్టీ వేధింపులు 18శాతం, ఇతర కేసులు 12శాతం తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు చేస్తే పోలీసులైనా కఠిన చర్యలే.. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడితే పోలీసులయినాసరే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్నిచ్చింది. శ్రీకాకుళంజిల్లాలో కాశీబుగ్గ సీఐను 24 గంటల్లోనే అరెస్టు చేసింది. రాజమహేంద్రవరంలోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐను ఘటన జరిగిన రోజే అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ ఎస్ఐను అరెస్టు చేసి చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. బాధితులకు పరిహారం పెంపు నేరాలకు గురయిన దళితులు, గిరిజనులను ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచింది. 2014–2019లో టీడీపీ ప్రభుత్వం బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం రూ.52.32 కోట్లు మాత్రమే పరిహారంగా అందించింది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.87.70కోట్లు పరిహారంగా అందించడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సత్వరం పరిహారం అందేలా చొరవ చూపిస్తోంది. దేశంలోనే భేష్.. ఎస్సీ, ఎస్టీల రక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తోందని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో లక్షమందిజనాభాలో ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను ప్రమాణంగా తీసుకుని ఎన్సీఆర్బీ ఈ నివేదిక వెల్లడించింది. ► ఎస్సీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్ష ఎస్సీలలో రాజస్థాన్లో 55.6, మధ్యప్రదేశ్లో 46.7, బిహార్లో 39.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. గుజరాత్లో 34.8మందిపై, తెలంగాణలో 31.1మందిపై ఉత్తర ప్రదేశ్లో 28.6మందిపై, కేరళలో 28.2మందిపై, ఒడిశాలో 26.2మందిపై నేరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి లక్షమందికి 24.5 మందిపై మాత్రమే నేరాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ► ఎస్టీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్షమంది ఎస్టీలకు ఉత్తరప్రదేశ్లో 63.6మందిపై, కేరళలో 28.9మందిపై, రాజస్థాన్లో 19.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో 16.1మంది ఎస్టీలు దాడులకు గురవుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి లక్షమందికి కేవలం 12.5 మందిపైనే నేరాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. సమర్థంగా కేసుల పరిష్కారం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై నేరాల దర్యాప్తును వేగవంతం చేసి దోషులను సకాలంలో గుర్తించి శిక్షలు పడేలా చేస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితిని తీసుకువచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 94శాతం కేసుల్లో దోషులను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రికార్డు వేగంతో దర్యాప్తు దళితులు, గిరిజనులపై నేరాల కేసులను పోలీసు శాఖ రికార్డు వేగంతో దర్యాప్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై కేసుల దర్యాప్తును టీడీపీ ప్రభుత్వంలో కంటే 78శాతం తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తుండడం జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ► కేసుల వారీగా చూస్తే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో దళితులు, గిరిజనుల అత్యాచారాలు, హత్యల కేసుల దర్యాప్తునకు సగటున 240 రోజులు పట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 జూన్ నుంచి 2022 జూలై వరకు సగటున 55 రోజుల్లోనే విజయవంతంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. ► 2014 నుంచి 2019 మే వరకు సామూహిక అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 279 రోజులు పట్టి్టంది. కాగా 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 153 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో అయితే 44 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం విశేషం. ► 2014 నుంచి 2019 మే వరకు పోస్కో చట్టం కేసుల దర్యాప్తునకు సగటున 192 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 133 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో కేవలం 53 రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేయడం పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. ► 2014 నుంచి 2019 వరకు అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 266 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు సగటున 111 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. ఇక 2021లో కేవలం 46రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ► ఇక టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మే వరకు ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్లో ఉంచగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కేసులను సమర్థంగా దర్యాప్తు చేసి పూర్తి చేశారు. ఆ విధంగా అత్యాచారం– హత్య కేసులు 3, సామూహిక అత్యాచారం కేసులు 2, పోస్కో చట్టం కేసులు 19, అత్యాచారం కేసులు 64ను దర్యాప్తు పూర్తి చేయడం గమనార్హం. -
దళితులకు సీఎం జగన్ ఆశయాలు ఊపిరి
సాక్షి, అమరావతి: దళిత వర్గాల విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ప్రశంసించింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్కుమార్ ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాడు–నేడు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఆంగ్ల విద్యా బోధన లాంటి పథకాలు బడుగులకు చేయూతనిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయాలన్న ఆయన సంకల్పానికి తమ సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. -
ఎస్సీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయించిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక 27వ నోడల్ ఏజెన్సీ సమావేశం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్లో మంగళవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు నూరు శాతం వినియోగంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2020–21లో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో 44 శాఖలకు రూ.19,430 కోట్లు కేటాయించగా రూ.13,672 కోట్లు ఖర్చు చేశారన్నారు. కేటాయించిన నిధుల్లో 12 శాఖలు 76 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయగా, 23 శాఖలు 25 నుంచి 51 శాతం ఖర్చు చేశాయని, 9 శాఖలు ఏ విధమైన నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. 2021–22లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 42 శాఖలకు రూ.17,403 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే మూడు నెలల (త్రైమాసిక) సమీక్ష సీఎం అధ్యక్షతన జరుగుతుందని, ఈలోగా నూరు శాతం నిధులు సద్వినియోగం చేయాలని మంత్రి సూచించారు. -
ఎస్సీ కుటుంబాలకు రూ.5 లక్షల రుణం
సాక్షి, అమరావతి: షెడ్యూల్ కులాలు (ఎస్సీ)లకు చెందిన ఇంటి పెద్ద కరోనాతో మరణిస్తే.. ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు రుణంగా అందించనుంది. ఈ మొత్తంలో రూ.లక్ష సబ్సిడీ ఉంటుంది. మిగిలిన రూ.4 లక్షలను వాయిదాల్లో లబ్ధిదారులు చెల్లించాలి. ఈ మేరకు ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందించి భరోసా కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. నేషనల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీ బి.నవ్య అన్ని జిల్లాలకు పంపారు. దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపిక, తదితర విషయాలపై ఆమె శనివారం అన్ని జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)లతో మాట్లాడారు. అర్హతలివే.. ► ఎస్సీ కుటుంబాలకు ఆధారమైన భార్యాభర్తల్లో ఎవరు కరోనాతో మరణించినా ఈ సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ► 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. ► ఏడాదికి రూ.3 లక్షల లోపు ఆదాయం మాత్రమే ఉండాలి. ► ఈ నెల 20లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జత చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. ► ఈ దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయానికి పంపిస్తారు. ఎంపీడీవోలు వాటిని పరిశీలించి ఈ నెల 20లోపు ఆయా జిల్లాల్లోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయాలకు పంపాలి. ► జిల్లా కలెక్టర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు దరఖాస్తులు పరిశీలించి రాష్ట్ర స్థాయి అధికారుల తనిఖీకి పంపుతారు. ► అనంతరం లబ్ధిదారులకు రూ.5 లక్షల రుణాలు మంజూరు చేస్తారు. -
తెలంగాణ బడ్జెట్ 2021: ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి గాను 2,30,825.96 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టింది. షెడ్యూల్ కులాల ప్రజల అభివృద్ధికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో 2021-22 బడ్జెట్లో ఎస్టీల కోసం ప్రత్యేకంగా ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకాన్ని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించబోతుందన్నారు.షెడ్యూల్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పథకం కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. దాంతో పాటు ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్ల రూపాయలను హరీశ్ రావు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున డా. బీ.ఆర. అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్పులను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 623 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ అందుకున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 107.8 కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యా వికాసం కోసం చేస్తోన్న కృషిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లా కాలేజీల మంజూరీపై ఉన్న మారటోరియాన్ని సడలించి మన రాష్ట్రంలో రెండు గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీల ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అనుమతి జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఎస్టీ బాలుర కోసం న్యాయవిద్యా గురుకుల కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటు చేయగా.. దళిత బాలికల కోసం ఎల్బీ నగర్లో మరో న్యాయవిద్య గురుకులాన్ని ప్రారంభించింది. -
చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు
సాక్షి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం సద్దుమణగడం లేదు. కొన్ని కులాల ఉద్యోగులపై ఆయన వాడిన పదాలు మంటలు రేపుతున్నాయి. ఓసీ జేఏసీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటుండగా, నిన్నటి వరకు ఉమ్మడి వరంగల్కే పరిమితమైన ఆందోళనలు బుధవారం తెలంగాణలోని పలు జిల్లాలను తాకాయి. ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లగా, బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు పరకాల బంద్ ప్రశాంతంగా జరిగింది. కాగా, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల బాధ్యులు మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా, వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మారెడ్డి క్షమాపణ) శాంతించని సంఘాలు వరుస వివాదాలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు వేదికలుగా మారాయి. పరకాలలో జరిగిన ఓ సమావేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరిట నిధుల సేకరణకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తొలుత వివాదాస్పదమయ్యాయి. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, విరాళాలు సేకరిస్తున్న నేతలే జేబులు నింపుకుంటున్నారని అన్నారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ నేతలు హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడులు, ప్రతిదాడులతో వరంగల్ నగరం అట్టుడికిపోగా, హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ మహాగర్జన సభలోనూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి మరో వివాదానికి తెరలేపారు. ‘ఆ కులాల అధికారులకు అక్షరం ముక్క రాదు’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారు, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోంది’ అనడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆందోళనలకు దిగారు. ‘సారీ’తో ఆగని ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ‘ఆ సమావేశంలో నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, ఆ మాటలు ఎవరి మనసునైనా నొప్పించినట్లయితే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నా’ అని అన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజాప్రతినిధులతో కలిసి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దీంతో వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు. కానీ తమ మనోభావాలకు సంబంధించిన అంశంగా భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల, ఉద్యోగసంఘాలు ఆందోళనలను కొనసాగిçస్తున్నాయి. కాగా, రామమందిరం నిర్మాణంపై వ్యాఖ్యల వివాదం సమయంలో స్పందించిన టీఆర్ఎస్ వర్గాలు ఈ విషయంలో స్తబ్ధంగా ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా బీసీ, దళిత వర్గాల ఉద్యోగులను అవమానపరిచేలా పరకాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయంటూ జాతీయ బీసీ అధికార ప్రతినిధి దాసు సురేష్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. -
మార్చి 26న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్చి 26న హైదరాబాద్లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్ పోస్టు లేదా ఈ మెయిల్/ ఫ్యాక్స్ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in, jrlawnhrc@nic.in మెయిల్ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్ చేయవచ్చన్నారు. రిజిస్టర్ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది. -
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కీలక తీర్పు
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని పేర్కొంది. ‘రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేవు’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం తేల్చిచెప్పింది. 2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోటిఫికేషన్ను సమర్ధిస్తూ, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమని కోర్టు నిర్ధారించడం సరికాదని తీర్పులో పేర్కొంది. ‘పబ్లిక్ పోస్ట్ల్లో నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని చట్టంలో స్పష్టంగా ఉంది. అలాగే, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన కూడా లేదు. అయినా, ఒకవేళ రాష్ట్రాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, కచ్చితమైన గణాంకాలు సేకరించి, తద్వారా ఆయా వర్గాలను సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. రిజర్వేషన్లు కల్పించవచ్చు’ అని ధర్మాసనం వివరించింది. రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలపై కూడా ధర్మాసనం వివరణ ఇచ్చింది. ‘రాజ్యాంగంలోని 16(4), ఆర్టికల్ 16(4ఏ) అధికరణలు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ప్రభుత్వాలకు కల్పిస్తున్నాయి. ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని విశ్వసిస్తే ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయా అధికరణాల్లో ఆ విషయం స్పష్టంగా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. తీర్పును ఖండిస్తున్నాం: కాంగ్రెస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు ఆమోదనీయం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించింది. ఈ తీర్పును పార్లమెంట్ లోపల, వెలుపల కాంగ్రెస్ లేవనెత్తుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఆదివారం తెలిపారు. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అది ప్రభుత్వాల విచక్షణాధికారంపై ఆధారపడకూడదని కాంగ్రెస్ విశ్వాసం’ అని వాస్నిక్ పేర్కొన్నారు. -
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి!
న్యూఢిల్లీ: క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలు లభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు బుధవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీలను మతపరంగా తటస్థులుగా పరిగణించాలని ఆ పిటిషన్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సంస్థ కోరింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, ఎస్సీ జాతీయ కమిషన్కు, మైనారిటీల జాతీయ కమిషన్కు, భారత రిజిస్ట్రార్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని వారిని ఆదేశించింది. ‘ఇస్లాంలో రిజర్వేషన్లు లేవు. ఆ విషయాన్ని విచారణలో భాగం చేయొచ్చు కదా!’ అని కోర్టు అభిప్రాయపడింది. -
ఆదర్శ వివాహాలకు ప్రభుత్వం చేయూత
సాక్షి, మిర్యాలగూడ: ఇరువురు ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తోంది. కాగా ఈ కులాంతరం చేసుకున్న వారికి 1980 నుంచి ప్రోత్సాహకాలను అందిస్తుండగా.. అప్పట్లో ఈ ప్రోత్సాహకం రూ. 30వేలు ఉండేది. 1993లో దీనిని రూ. 40వేలకు పెంచింది. 2011లో రూ. రూ. 50వేలకు చేయగా.. 2019 అక్టోబరు 30న ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహ చేసుకున్న వారికి నజరానా రూ. 2.50లక్షలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జిల్లాలో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల బాధ్యతను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించింది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో ఎదురయ్యే పరిణామాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇందుకోసం కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు కాని వరుడు కాని కులాంతర వివాహం చేసుకొని ఉండాలని, వదుధు లేదా వరుడికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. సమర్పించాల్సిన పత్రాలు.. ఇరువురి ఆధార్ కార్డులను జత చేయాలి వధూవరులకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్ కార్డులు సైతం జత చేయాల్సి ఉంటుంది. వధూవరులు పూర్తి చిరునామా కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇప్పటివరకు రూ. 50వేలు ఉండగా.. ప్రభుత్వం వారికి చేయూతనిచ్చేందుకు రూ. 2.50లక్షలకు పెంచింది. అయితే కులాంతర వివాహం చేసుకున్న వారికి 3 ఏళ్ల పాటు డిపాజిట్ చేసిన చెక్కును అందించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ప్రోత్సాహకాలు తప్పనిసరిగా అందుతాయి. పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. – రాజ్కుమార్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ -
ఎస్సీ/ఎస్టీ క్రీమీలేయర్ అంశాన్ని సమీక్షించండి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లోని సంపన్న శ్రేణి(క్రీమీ లేయర్)కి రిజర్వేషన్ కోటాలో భాగం ఇవ్వకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సమీక్షించే భాధ్యతను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది. తీర్పు ఎస్సీ/ఎస్టీలకు వర్తించదని, ఈ తీర్పును సమీక్షించాలని, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేయగా సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. క్రీమీలేయర్కు రిజర్వేషన్ కోటా దక్కరాదన్న సూత్రం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు వర్తించదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ‘ఇది ఉద్వేగాలతో కూడుకున్న అంశం. విస్తృత ధర్మాసనానికి నివేదించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సమతా ఆందోళన్ సమితి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని గట్టిగా వ్యతిరేకించారు. -
ఎస్సీ వర్గీకరణపై మాటతప్పిన బీజేపీ
సాక్షి, మహబూబ్నగర్: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని మాదిగ మేధావుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకెపోగు రాములు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇందుకు మాదిగ యువకులు, మేధావులు, ఉద్యోగులు డిసెంబర్లో నిర్వహించతలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చి ఎస్సీ వర్గీకరణ అవశ్యకతను కేంద్రానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేలా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. అనంతరం ఎంఈఎఫ్ మహబూబ్నగర్, హన్వాడ మండలాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం కృష్ణయ్యను శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. నాయకులు గాలి యాదయ్య, సువార్తమ్మ, పి.బాలయ్య, పి.కొండయ్య, బోయపల్లి ఆంజనేయులు, నర్సిములు, తిరుపతయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం వెనక్కి
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఎస్సీ, ఎస్టీ ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, అంటరానివారుగా, వేధింపులకు, సామాజిక బహిష్కరణలకు గురవుతున్నారని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులకు మానవ వైఫల్యమే తప్ప కుల వ్యవస్థ కారణం కాదు. న్యాయస్థానం ఈ విషయంలో సంపూర్ణ అధికారాలను ఉపయోగించ జాలదు. రాజ్యాంగం మేరకు ఈ మార్గదర్శకాలను అనుమతించలేము. వీటి కారణంగా సంబంధిత కేసుల విచారణ జాప్యం అవుతుంది. అందుకే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసే ముందుగా ప్రాథమిక దర్యాప్తు జరపాలని, అరెస్టుకు సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలంటూ గత ఏడాది మార్చి 20వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నాం’అని తెలిపింది.‘ఒకవేళ నేరం నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ విషయంలో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఈ చట్టంలో ప్రాథమిక విచారణ జరపాలనే నిబంధనలు లేవని తెలిపింది.ఆర్టికల్ 15 ద్వారా రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కలి్పంచిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా వారు సామాజికంగా వేధింపులు, వివక్షకు గురవుతున్నారని పేర్కొంది. కులరహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యం. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన అటువంటి పవిత్ర లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాం’అని తెలిపింది. మనుషులతో మలమూత్రాల్ని ఎత్తివేయిస్తున్న పరిస్థితులు, ఈ సందర్భంగా సంభవిస్తున్న మరణాలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రపంచంలో మరెక్కడా కూడా మనుషులను గ్యాస్ చాంబర్లలోకి పంపి చంపడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచి్చన 70 ఏళ్ల తర్వాత కూడా వివక్షకు, అంటరానితనానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం రక్షించలేక పోయిందని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్నుద్దేశించి వ్యాఖ్యానించింది. గత ఏడాది మార్చిలో ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సెప్టెంబర్ 18వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టం దురి్వనియోగం అవుతున్నప్పుడు శాసనాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయగలమా? కులం ప్రాతిపదికన ఏ వ్యక్తినయినా అనుమానించగలమా? సాధారణ పౌరుడు కూడా తప్పుడు కేసు పెట్టొచ్చు కదా’అని పేర్కొంది. సమానత్వ సాధనకు సంబంధించిన ఈ అంశంపై నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా ఆ సమయంలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు గత ఏడాది సంచలన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో తక్షణమే అరెస్టులకు పూనుకోకుండా ఆరోపణల్లో వాస్తవాలను ముందుగా డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని పేర్కొంది. దీంతో ఈ చట్టాన్ని నీరుగార్చారంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టానికి సవరణలు చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులను సమీక్షించాలంటూ సుప్రీంలో పిటిషన్ వేసింది. -
మీ అంతు తేలుస్తా!
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : ‘మీరు ఉన్నతాధికారులైతే ఏంటి.. నాకు పెద్ద మొత్తంలో సమర్పించాల్సిందే. లేదంటే మీ అంతు చూస్తా. ఏసీబీకి పట్టించి నలుగురిలో నవ్వులపాలు చేస్తా. కులం పేరుతో దూషించారని తప్పుడు కేసులు బనాయిస్తా.’ ఇదీ ఏ రౌడీనో, గూండానో మామూళ్ల కోసం బెదిరింపులకు దిగుతున్న సందర్భం కాదు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ కుల సంఘానికి చెందిన నాయకుడు సాక్షాత్తూ జిల్లా ఉన్నతాధికారులే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న అంశం జిల్లాలో శుక్రవారం చర్చనీయాంశమైంది. తమపై బెదిరింపులకు పాల్ప డుతున్న మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ ఎస్ రత్నాకర్ వ్యవహార శైలిపై విసిగి వేసారిపోయిన 35 శాఖల అధికారులు జిల్లా అధికారుల సంఘం అధ్యక్షురాలు, జేసీ–2 జి.రాజకుమారి ఆధ్వర్యంలో విషయాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి, ఎస్పీ నయిం ఆస్మి వద్ద తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు. వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్, అతడి అనుచరులు జిల్లా ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మధ్యలో వాహనం ఆపి చెప్పిందేం చేశారని ప్రశ్నిస్తారు. ఇస్తే ఓకే లేదంటే తమలోని మరో కోణాన్ని బయటకు తీస్తున్నారని జిల్లా ఎïస్పీకి ఫిర్యాదు చేశారు. ‘‘నీ అంతు తేలుస్తాం’ అని బరితెగింపు వ్యవహారం నడుపుతారు. అక్కడికీ లొంగకపోతే మరో అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించారని తప్పుడు కేసులు బనాయిస్తామని కూడా హెచ్చరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కటికీ ఒప్పుకోని పక్షంలో ఉద్యోగులకు ఇబ్బందికరమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటి ప్రభావంతో అధికారులు మానసిక వేదనకు గురి కావాల్సివస్తోందని, ఇలాగేతే తాము ఉద్యోగాలు ఎలా చేయాలని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేధింపుల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని ఎస్పీ, కలెక్టర్ను కోరారు. ఇలాంటి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న రత్నాకర్పై చర్యలు తీసుకొని తమ విధులకు ఎలాంటి ఆటంకం, లేకుండా నిర్భయంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని 35 శాఖలకు చెందిన అధికారులు ఎస్పీ నయీం అస్మీని కలిసి వివరించారు. దీనిపై ఎస్పీ నయీం అస్మీ స్పందిస్తూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులందరూ కలెక్టర్ మురళీధర్రెడ్డిని కలిసి రత్నాకర్ చేస్తున్న బెదిరింపులు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. అయితే కలెక్టర్ మురళీధర్రెడ్డిని కూడా కించపరుస్తూ, బెదిరింపులకు దిగుతూ సోషల్మీడియాలో పోస్టులు పెట్టినట్టు, దీనిపై కూడా చర్యలు చేపట్టాలని అధికారుల సంఘం కోరింది. ఈ సందర్భంగా జెసీ–2 రాజకుమారి, పెద్దాపురం ఆర్డీవో ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రత్నాకర్, అతడి అనుచరులపై ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర డీజీపీకి, ఐజీ, డీఐజీకి వినతి పత్రాలు పంపించామన్నారు. జిల్లాలోని అధికారులెవ్వరూ ఇలాంటి బెదిరింపులకు భయపడే అవసరం లేదన్నారు. వినతి పత్రాలు అందించిన వారిలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, పెద్దాపురం ఆర్డీవో ఎస్ మల్లిబాబు, డీఆర్డీఏ పీడీ మధుసూదనరావు, జెడ్పీ సీఈవో ఎం జ్యోతి, స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ సుఖజీవన్బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత, పౌరసరఫరాల ఎండీ జయరాయలు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, పశుసంవర్థశాఖ జేడీ, తదితర శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. -
దళితులకు సీఎం జగన్ పెద్దపీట
సాక్షి, పెదవేగి రూరల్: దేశం అంతా రాష్ట్రం వైపు తొంగి చూసే విధంగా దళితులకు సీఎం పెద్ద పీట వేశారని వైసీపీ నియోజకవర్గ ఎస్సీసెల్ ఇన్చార్జ్ మెండెం ఆనంద్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లో దళితజాతి ముద్దుబిడ్డ, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం దుగ్గిరాల తన నివాసంలో గ్రామ ఎస్సీసెల్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజకీయ చరిత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చరిత్ర సృష్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విప్లవం సృష్టిస్తూ నవయుగానికి నాంది పలికారని, ఎస్సీలకు రాజకీయంగా అత్యున్నత గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం, అంతేకాకుండా ఏకంగా ఐదు మంత్రి పదవులను కేటాయించడం ద్వారా ఎస్సీ వర్గాలకు తాను ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో చేతల్లోనే చూపించారని తెలిపారు. సమావేశంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు దాసరి తంబి, పెదవర్తి చిన్న, పులవర్తి యాకోబు, సంజీవరావు, కొత్తపల్లి బాబి, తలారి దాసు, మెండెం జోసఫ్ పాల్గొన్నారు. -
దళితులకు ఓటు హక్కు కల్పించాలన్నదే నాలక్ష్యం
తిరుపతి తుడా: కొన్నేళ్లుగా ఓటుకు దూరంగా ఉన్న దళితులకు ఆ హక్కును కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేసినట్టు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో దళితులను ఓటు వేయనీయకుండా టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడడంతో, దానిపై పోరాటం చేసిన చెవిరెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం.. రీపోలింగ్కు ఆదేశించడం తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రగిరి నియోజ కవర్గంలోని వెంకట్రామాపురం, ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులో ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. వెంకట్రామాపురం పోలింగ్ స్టేషన్ వద్ద పోలింగ్ను పరిశీలించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో దళితులు ఏళ్ల తరబడి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఎలాగైనా ఈఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో పోరాటం చేసినట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మార్చి 11న జరిగిన ఎన్నికల్లో మరోసారి దళితులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఆ వివరాలు పరిశీలించిన ఎన్నికల కమిషన్ రీపోలింగ్కు ఆదేశించడం దళిత గిరిజనుల విజయమన్నారు. తనకు ఓటు వేయాలని పోరాటం చేయలేదని, ఓటు హక్కు విలువ వారికి తెలియాలనే ఇంతవరకు తీసుకువచ్చానని అన్నారు. కుప్పం బాదూరు, కాలేపల్లిలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయని, అక్కడ కూడా రీపోలింగ్ కోసం తెలుగుదేశం నాయకులు రీపోలింగ్కు కోరితే అందుకు తాను ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. -
దళితులపై దాడుల్లో ఏపీ నం.1
సాక్షి, హైదరాబాద్ : దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కాపుమాని రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతికి, అంబేద్కర్కు జరిగిన అన్యాయం గురించి టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించట్లేదన్నారు. టీడీపీ పాలనలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం పెడుతున్న దళితులను అడ్డుకుని 250 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని గుర్తు చేశారు. అప్పుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆ ఊరు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి దళిత మహిళపై దాడి చేశారని.. అడిగిన వారిని జైలులో పెట్టారని మండిపడ్డారు. జిల్లాలో టీడీపీ నేతలు మహిళలను వివస్త్రలు చేసి రోడ్ మీద తిప్పుతున్నా అడిగే నాథుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాక్లాగ్ పోస్ట్ల రిక్రూట్మెంట్ లేదు.. ఫీజు రియంబర్స్మెంట్ లేదని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహం పెడతామన్నారు.. దానికి కేటాయించిన రూ. 250 కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని చంద్రబాబు మాట్లాడుతుంటే టీడీపీలో ఉన్న దళిత నాయకులు నోరెత్తడంలేదని దుయ్యబట్టారు. వర్ల రామయ్య, చింతమనేని ప్రభాకర్ దళితులను అవమానించారు.. అయినా వీరి మీద చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితలుపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. దళితులకు రక్షణ కావాలన్నా, సామాజికంగా.. ఆర్థికంగా ఎదగలన్నా జగన్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని మండి పడ్డారు. -
పేదలకు రుణాల్లోనూ మోసమే
సాక్షి, అమరావతి: పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని భారీయెత్తున ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆయా వర్గాల వారిని నిలువునా మోసం చేసింది. సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ నెపాన్ని బ్యాంకులపైకి నెట్టి చేతులు దులుపుకుంది. దీంతో 14 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మెగా రుణ మేళాలు నిర్వహించి సబ్సిడీతో రుణాలు ఇస్తామని ప్రచారం చేయడంతో సుమారు 15 లక్షల మంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2015–16లో అరకొరగా రుణాలిచ్చిన ప్రభుత్వం అప్పటికి ఆ కార్యక్రమాన్ని ముగించేసింది. ఆ తర్వాత 2016–17, 2017–18, 2018–19 మూడు సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వకుండా ఎగనామం పెట్టింది. దరఖాస్తుదారులైన పేదలు, నిరుద్యోగులు తమకు సబ్సిడీ రుణాలు ఎప్పుడిస్తారంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, నేతలను నిలదీస్తుండటం, ఈలోగా ఎన్నికలు సమీపించడంతో గత జనవరిలో రుణ మేళాల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంది. ప్రచారార్భాటానికి రూ.4 కోట్ల వ్యయం రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికైతే మహిళలు, దళితులు, మైనార్టీలను భారీ స్థాయిలో బస్సులు, ఇతర వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఇందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. నాలుగు మెగా రుణమేళాలకు నాలుగు కోట్లు ఖర్చయ్యాయి. ఎంతో ఆశతో ఆయా సభలకు వెళ్లిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నామమాత్రంగా కొంతమందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. మొదటి రుణ మేళాలో 26,598 మందికి రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రెండో మేళాలో 3,419 మందికి, మూడో మేళాలో 2,965 మందికి, నాలుగో మేళాలో 2,896 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అంటే 15 లక్షల మంది దరఖాస్తుదారులకు గాను నాలుగు మేళాల్లో కలిపి 35,878 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేశారన్నమాట. నాలుగు రుణమేళాల్లో కలిపి నాలుగు లక్షల మందికి సుమారు రూ.2,000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం రూ.253.49 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ఇచ్చిన వారికన్నా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిందా అంటే అదీ లేదు. బ్యాంకులకు సబ్సిడీని విడుదల చేయడంలో కార్పొరేషన్లు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు సగం మందికి కూడా సబ్సిడీలు విడుదల చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. యూనిట్లు అందని వారు, సబ్సిడీ అందని వారు 30 శాతం వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. -
రుణాలిలా ..బతికేది ఎలా?
సాక్షి, అమరావతి: జీవనోపాధి కోసం ఎదురు చూస్తున్న షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వారికి రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రతి సంవత్సరం బ్యాంకు లింకేజ్డ్, నాన్ బ్యాంక్ లింకేజ్డ్ రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. నేషనల్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ పరిస్థితిని గమనిస్తే దళితుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. లక్ష్యాలు చూస్తే ఘనంగా ఉంటున్నాయి. ఆచరణలో మాత్రం వెక్కిరిస్తోంది. నిర్దేశిత లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. 2018–19లో ఇప్పటిదాకా లక్ష్యంలో కేవలం 8 శాతం మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేయడం గమనార్హం. సాకులు చెబుతున్న ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 80,002 మంది ఎస్సీలకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రూ.1,351.95 కోట్ల విలువైన యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ, 2018 డిసెంబరు 12వ తేదీ నాటికి కేవలం రూ.78.48 కోట్ల విలువైన యూనిట్లు 5,730 మందికి మాత్రమే పంపిణీ చేశారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకులను ఒప్పించి రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం సాకులు చెబుతూ తప్పించుకుంటోందని ఎస్సీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇది ప్రభుత్వ అసమర్థత ‘‘పేద ఎస్సీలకు రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వ అసమర్థత బయటపడుతోంది. ఎంతోమంది పేద ఎస్సీలు ప్రభుత్వ సాయం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాచరణ ప్రణాళికలు మాత్రం గొప్పగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం విఫలమవుతోంది’’ – కరవది సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి, దళిత హక్కుల పోరాట సమితి దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి ‘‘మరో నెలన్నరలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు ఇవ్వలేమని ప్రభుత్వం తప్పించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి. బ్యాంకు లింకేజీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ – ఆండ్ర మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం -
ఉద్యోగాల్లోనూ ఎస్సీలది వెనక‘బాటే’
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఎస్సీల ఉద్యోగ, ఉపాధి కోసం వివిధ పథకాల కింద వేల కోట్లు వెచ్చిస్తోంది. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలు గమనిస్తే ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ఎస్సీలు వెనుకబడి ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక వివక్ష, సామాజిక–ఆర్థిక స్థాయి ఈ వెనకబాటుకు కారణాలని తెలుస్తోంది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం(ఎన్ఎస్ఎస్వో)2011–12 తర్వాత దేశంలో ఉద్యోగాల పరిస్థితిపై ఎలాంటి సర్వే చేయలేదు.అయితే అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మిగతా కులాల వారితో పోలిస్తే ఎస్సీలు ఉద్యోగాల విషయంలో వివక్షకు గురవుతున్నారని స్పష్టమవుతోంది. వేతన కూలీలు 63% ఎన్ఎస్ఎస్ఓ 2011–12 సర్వే ప్రకారం ఎస్సీలలో 63% వేతన కూలీలు (ఉద్యోగ భద్రతలేని చిన్నాచితకా పని చేసే వాళ్లు –అంటే ఇళ్లలో పని చేసేవారు, హమాలీలు మొదలైన వారు) గా పని చేస్తున్నారు. ఇది ఓబీసీల్లో 44%, ఉన్నత కులాల్లో 42%, ఇతర కులాల్లో46%గా ఉంది. ఈ వేతన కూలీల్లో కూడా దినసరి కూలీలుగా పని చేస్తున్న వారిలోనూ ఎస్సీలే అధికంగా ఉన్నారు. దేశ జనాభాలో ఎస్సీలు 16శాతం ఉంటే, దినసరి కూలీల్లో ఎస్సీలు 32 శాతం ఉన్నారు. ఇతర కులాల్లో ఇది 20–30 శాతానికి మించలేదు. కులం కారణంగా వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రైవేటు రంగం ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఎన్ఎస్ఎస్ఓ తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎస్సీల్లో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే 1.7 శాతం ఎక్కువ ఉంది. 1990ల నుంచి ఎస్సీల్లో నిరుద్యోగ రేటు శాతం మిగతా వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటోంది. మన సమాజంలో తరతరాలుగా కొన్ని ఉద్యోగాలు ఉన్నత కులస్థులకని, మరి కొన్ని ఉద్యోగాలు నిమ్న జాతులకని నిర్దేశించడం జరిగింది. ఉన్నత కులస్థుల ఉద్యోగాల్లోకి ఎస్సీలను తీసుకోవడానికి యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. ఇక విద్య, నైపుణ్యం వంటివి కూడా ఉద్యోగాల్లో ఎస్సీల వెనకబాటుకు కారణమవుతున్నా సామాజిక వివక్షే కీలక పాత్ర వహిస్తోంది. ఉన్నత కులస్తుల ఇళ్లలో వంటవాళ్లుగా, పనివాళ్లుగా, హోటళ్లలో సర్వర్లుగా, ప్రార్థనా స్థలాల నిర్మాణంలో కూలీలుగా ఎస్సీలను తీసుకోవడానికి విముఖత చూపుతున్నట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ సర్వేలో తేలింది. ఉన్నత కులాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగాలకు ఉన్నత కులస్తులనే ఎంపిక చేస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఒక ఉద్యోగానికి సమాన అర్హతలున్న ఎస్సీ, ఇతర అభ్యర్ధులు దరఖాస్తు చేస్తే వారిలో ఉన్నత కులస్థులకే ఇంటర్వ్యూ పిలుపు వస్తోందని థోరట్ అండ్ అటెవెల్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఉన్నత చదువులు చదివిన ఎస్సీల కంటే తక్కువ చదువున్న ఇతర కులస్థులకే ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఆ సంస్థ వెల్లడించింది. ఈ వివక్ష కారణంగా ఉద్యోగాలు లభించక చాలా మంది ఎస్సీలు పేదలుగానే ఉండిపోతున్నారు. ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం 2011–12లో ఎస్సీల్లో మూడింట ఒక వంతు మంది పేదలు కాగా ఓబీసీల్లో 20శాతం, ఇతర కులాల్లో 9 శాతం పేదలు ఉన్నారు. -
టీవీ చానళ్లలో ఆ పదం వాడకూడదు
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలకు చెందిన వారి ప్రస్తావన వచ్చినప్పుడు దళితులు అనే పదాన్ని వాడకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) టీవీ చానళ్లకు సూచించింది. ముంబై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంఐబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ప్రవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు ఈ నిబంధన వర్తించనుంది. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంఐబీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంఐబీ ప్రవేటు చానళ్లకు రాసిన లేఖలో.. మీడియా దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు అనే పదాన్ని వాడాల్సి ఉంటుందని తెలిపింది.దళిత్ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఇంగ్లిష్లో షెడ్యూల్ క్యాస్ట్ అని గానీ, దేశంలో ఇతర జాతీయ భాషల్లో దానికి సరిపడు అనువాదాన్ని గానీ వాడాల్సి ఉంటుందని.. అధికారిక లావాదేవీలకు, వ్యవహారాలకు, ధృవపత్రాలకు సంబంధించిన వాటిలో ఈ నిబంధన వర్తిస్తుందని కోర్టు తెలిపిందన్న విషయాన్ని ప్రస్తావించింది. కానీ ఈ సూచనలు పాటించకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై ఎంఐబీ స్పష్టతనివ్వలేదు. కాగా ప్రభుత్వ దస్త్రాల్లో, సమాచార మార్పిడిలో దళిత్ అనే పదం వాడకూడదనే పిటిషన్పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఈ మేరకు జూన్లో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు వాడాలని మార్చి 15వ తేదీన సర్య్కూలర్ జారీ చేసింది. -
ఆ నిధులు.. ఏ ఖాతాలోకి..!
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధికి చెందిన మిగులు మొత్తం రానున్న ఏడాది బడ్జెట్ నిధులకు జతపరిచే విషయంలో గందర గోళం తలెత్తింది. ఖర్చుకాకుండా మిగిలిన మొత్తం ఏమి చేయాలనే దానిపై స్పష్టత కొరవడి అవి ఏ పద్దుల్లో చూపించాలో తేలకుండానే ఈ కార్యక్రమానికి తొలిఏడాది ముగిసింది. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులను సంతృప్తికర స్థాయిలో ఖర్చయినట్లు ప్రభుత్వం అంచనాకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎస్డీఎఫ్ చట్టం ప్రకారం.... తొలి ఏడాది కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే, వాటిని మరుసటి ఏడాది బడ్జెట్కు జత చేయాలి. అలా మిగులు నిధులతో పాటు తాజా కేటాయింపులను వార్షిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఈ నిబంధన ప్రకారం 2017–18 వార్షిక సంవత్సరం మిగులు నిధులను ప్రస్తుత నిధికి జోడించాలి. కానీ గతేడాది ప్రభుత్వం మిగులు నిధుల జోడింపు అంశాన్ని పక్కనపెట్టేసింది. మరి 4,846.45 కోట్లు...ఏ ఖాతాలోకి... 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీఎస్డీఎఫ్) కింద ప్రభుత్వం రూ.14375.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 42శాఖల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా... మార్చి చివరికి రూ.11,284.7 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రాథమికంగా లెక్కలు తేల్చింది. అదేవిధంగా ఎïస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీఎస్డీఎఫ్) కింద రూ.8,165.8 కోట్లు కేటాయించగా... ఏడాది చివరకి రూ.6410.15 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేసింది. ఈ రెండింటా రూ.4,846.45 కోట్లు మిగిలిపోయాయి. ఈక్రమంలో ఖర్చులను బడ్జెట్ వ్యయంతో దాదాపు సమానం చేసిన యంత్రాంగం రానున్న బడ్జెట్కు ఈ నిధులు జోడించే అంశం పక్కన పెట్టేసింది. ఆర్థికశాఖ నుంచి వివరాలు రావాలనీ, అక్కడ్నుంచి శాఖల వారీగా ఖర్చులు వెల్లడైతేనే వాటిని వెబ్సైట్లో పొందు పరుస్తామని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
‘ముద్రల’ రాజ్యం!
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఛాతీపై కులం ముద్రలు వేయాలని నిర్ణయించిన ఘనులెవరోగానీ దేశంలో వర్తమాన స్థితిగతులకు చక్కగా అద్దంపట్టారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం తప్పేనని ఆ జిల్లా ఎస్పీ వీరేంద్ర సింగ్ అంగీకరించారు. మంచిదే. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. కానీ అది జరగడానికి ముందే ఇందులో ‘చెడు ఉద్దేశం’ ఏమీ లేదని ఆయన సమర్థిస్తున్నారు. మరింక విచారణ దేనికి? ఇది వెలుగులోకొచ్చి 72 గంటలు గడుస్తున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని గురించి మాట్లాడలేదు. జరిగింది తప్పేనని అంగీకరించడానికి ఆయనకు తీరిక చిక్కలేదు. పాలకుల తీరు ఇలా ఉన్నది గనుకే దేశంలో ఏదో ఒక మూల దళితులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ఈ పోలీసు నియామకాల ఉదంతానికి ముందూ వెనకా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. రాజస్థాన్లోని గోర్ధన్పురా గ్రామంలో తన పెళ్లి వేడుకలకు గుర్రంపై ఊరేగుతూ వెళ్తున్న దళిత యువకుణ్ణి అక్కడి ఆధిపత్య కులాలవారు కిందకు పడదోసి అతన్ని తీవ్రంగా కొట్టడంతోపాటు ఊరేగింపులోని ఇతరులపై కూడా దాడి చేశారు. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు ఇప్పుడు ఆసుపత్రిలో గాయాలకు చికిత్స చేయించుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్లో మంగళవారం వెల్లడైన ఘటన మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలోని బదాయీలో తమ పొలంలో కోతలకు రానన్నాడని ఆగ్రహించి ఒక దళిత యువకుడిని ఆధిపత్య కులాలవారు ఊరంతా తిప్పి కొట్టుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టి కొట్టారు. అతనితో మూత్రం తాగించారు. ఈ దేశం శాంతి సామరస్యాలకు పుట్టినిల్లని, ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇక్కడ నాగరికత వెల్లివిరిసిందని కొందరు గర్వంగా చెప్పుకుంటారు. కానీ దళితుల పట్ల అమలవుతున్న దౌర్జన్యాలు గమనిస్తే కనీసం ఇప్పటికైనా మనం నాగరికతను అలవర్చుకోగలిగామా అన్న సందేహం కలుగుతుంది. జీవితంలో ప్రతి దశలోనూ తననూ, తనలాంటి కోట్లాదిమందిని అణగదొక్కడానికి ప్రయత్నించిన కులం మహమ్మారి బారిన దళిత వర్గాల్లో మరెవరూ పడకూడదని కాంక్షించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వలసపాలనలోనే ఎన్నో పోరాటాలు చేశారు. సంఘ సంస్కరణ మార్గం మన దేశంలో కంటకావృతమైనదని, దానికి మిత్రులు కొద్దిమంది అయితే, శత్రువులు అనేకమందని ఆయన 1936లో వెలువరించిన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి డబ్భై ఏళ్లు దాటుతున్నా ఏమాత్రం మారని దళితుల పరిస్థితిని గమనిస్తే ఆయన మాటల్లో ఎంత నిజమున్నదో అర్ధమవుతుంది. దళిత సంక్షేమం గురించి, సమానత్వం గురించి, అణగారిన వర్గాల ఉద్ధరణ గురించి సమయం చిక్కినప్పుడల్లా ఉపన్యాసాలివ్వడమే తప్ప అందుగురించిన చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని మధ్యప్రదేశ్ ఘటన రుజువు చేసింది. దీని గురించి మీడియాలో వచ్చిన మర్నాడే గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది డాక్టర్ అంబేడ్కర్, ప్రధాని నరేంద్ర మోదీ బ్రాహ్మణులంటూ వ్యాఖ్యానించారు. పైగా ‘బాగా చదువుకున్నవారిని బ్రాహ్మణులుగా సంబోధించవచ్చున’ని తన వ్యాఖ్యను సమర్ధించుకున్నారు. ఈ వ్యాఖ్యల లోలోతుల్లోకెళ్తే వాటి అంతరార్ధం సులభంగానే బోధపడుతుంది. మన నేతల్లో నరనరానా జీర్ణించుకుపోయిన కులతత్వం... కుల నిర్మూలన కోసం జీవితాంతం పాటుబడిన మేధావిని సైతం చివరకు కుల చట్రంలో ఇరికించింది! అవి పల్లెటూర్లా, పట్టణాలా లేక నగరాలా అన్న తేడా లేకుండా దేశంలో అడుగడుగునా దళితులు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. అవి ఎప్పటికప్పుడు మీడియాలో వెల్లడవుతూనే ఉన్నాయి. వాటిని నివారించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో, దోషుల దండనపై ఏమేరకు అవి దృష్టి పెడుతున్నాయో ఎవరికీ తెలియదు. మధ్యప్రదేశ్ సంగతినే చూస్తే ఎస్సీ, ఎస్టీలపై ఆగడాలు శ్రుతిమించుతున్న రాష్ట్రాల్లో అది అగ్రస్థానంలో ఉంది. అక్కడ దళితులపై దాడుల పెరుగుదల 49.4 శాతం ఉంది. ఎస్టీల విషయంలో ఆ పెరుగుదల 15.6 శాతం. ఇవి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో చెబుతున్న గణాంకాలు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల) నిరోధక చట్టంపై జారీ అయిన మార్గదర్శకాలను నిరసిస్తూ గత నెల 4న దేశవ్యాప్త బంద్ జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 8మంది చనిపోయారు. నిరుడు గుజరాత్లోని ఉనాలో గోహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నడిరోడ్డుపై తమను కొరడాలతో హింసించిన దుర్మార్గులపై చర్యలు లేకపోవడంతో విసుగెత్తిన దళిత కుటుంబం ఆదివారం బౌద్ధమతంలోకి మారింది. వారితోపాటు మరో 300 మంది సైతం బౌద్ధాన్ని స్వీకరించారు. కనీసం ఇలాంటి పరిణామాలైనా ఆధిపత్యకులాల్లోనూ, పాలకుల్లోనూ పరివర్తన తీసుకురావాలి. ‘ముద్రల’ ఉదంతంపై రకరకాల తర్కాలు పుట్టుకొస్తున్నాయి. పోలీసు నియామకాలకు హాజరైనవారెవరూ దీనిపై ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదన్నది అందులో ఒకటి. నానా అగచాట్లూ పడి ఈ స్థాయి వరకూ వచ్చిన అభ్యర్థులు తమను అవమానించారని ఫిర్యాదు చేయడానికి సాహసిస్తారా? ఈ తర్కం లేవదీసిన అధికారులు కేసును మూసేయడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని అనుకోవాలి. ఎవరూ ఫిర్యాదు చేయలేదు గనుక దీన్ని ఇంతటితో ముగిస్తున్నామని ఏణ్ణర్థం తర్వాత ప్రకటించినా ప్రకటించవచ్చు. కులం, మతం, జాతి, ప్రాంతం వగైరాలతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమానత్వాన్ని, సమాన హక్కుల్ని, న్యాయాన్ని అందించాలని నిర్దేశిస్తున్న రాజ్యాంగాన్ని మధ్యప్రదేశ్లోని ‘ముద్రలు’ ఉల్లంఘించాయి. శతాబ్దాలనుంచీ ఇక్కడ అమలవుతున్న కులజాడ్యాన్నే తలకెత్తుకున్నాయి. కనుక ఆ ముద్రలకు నైతికబాధ్యత వహించకపోతే, అందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలి. -
పాలనలో ‘దళిత్’ పదం వద్దు
న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో దళిత్ అనే పద ప్రయోగం తగదంటూ రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేంద్రం సూచించింది. అధికారిక వ్యవహారాలన్నింటిలోనూ షెడ్యూల్డ్ కాస్ట్ అనే పదానికి బదులుగా దళిత్ అని వాడరాదనీ, షెడ్యూల్డ్ కాస్ట్గానే దాన్ని ఉపయోగించాలని కోరుతూ మార్చి 15, 2018న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ లేఖరాసింది. అన్ని పాలనా వ్యవహారాల్లో, సర్టిఫికెట్లలో, అధికారిక లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో, రాజ్యాంగ పదమైన షెడ్యూల్డ్ కాస్ట్ అనే వాడాలని ఈ లేఖలో స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ లకు ఉద్దేశించిన ఈ లేఖలో మోహన్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జనవరి 15, 2018న ఇచ్చిన తీర్పుని ఉటంకించారు. భారత రాజ్యాంగంలో ప్రస్తావించని దళిత్ అనే పదాన్ని ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులనుద్దేశించి వాడకూడదని కూడా ఈ లేఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా 1982 ఫిబ్రవరి 10న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాల్లో సదరు వ్యక్తి కులాన్ని ప్రస్తావించాలనీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏ అంశం కింద ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించారో కూడా పేర్కొనాలని, అంతేకానీ ‘హరిజన’ అనే పదాన్ని ఉపయోగించకూడదనీ చెప్పిన విషయాన్ని చర్చించింది. మళ్ళీ రెండేళ్ళ తరువాత అంటే 1990 ఆగస్టు 18న సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వాలను షెడ్యూల్డ్ క్యాస్ట్నే వాడాలని సూచించిందని కూడా లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్లతో సంప్రదించి, కులాలు, జాతులు, తెగలను, లేదా ఆయా కులాల్లోని సమూహాలను ఆయా ప్రాంతాలను బట్టి రాష్ట్రపతి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా చట్టం ప్రకారం ఆ లిస్ట్లోనికి అదనంగా చేర్చడం లేదంటే తీసివేయడం పార్లమెంటు చేస్తుంది. -
ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్కు రూ.26,145 కోట్లు
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం అమల్లోకి తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)కి తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది కన్నా దాదాపు 12 శాతం నిధులు పెంచింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.26,145.90 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.16,452.79 కోట్లు, ఎస్టీలకు రూ.9,693.11 కోట్లు చొప్పున ఖర్చు చేయనుంది. ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖలకు విడదీస్తూ శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించింది. వ్యవసాయం, పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా విభాగాలకు ఎక్కువగా నిధులిచ్చింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుల్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలున్నాయి. ఎస్సీ ఎస్డీఎఫ్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రూ.2,551.67 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో రూ.2,800.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. కేటగిరీల వారీగా ఎస్డీఎఫ్ రూ.కోట్లలో కేటగిరీ 2017–18 2018–19 ఎస్సీ 14,375.12 16,452.79 ఎస్టీ 8,165.87 9,693.11 ఫిబ్రవరి నెలాఖరు నాటికి 54 శాతమే బడ్జెట్ మార్పుల్లో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు బదులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలో మార్పులు చేసిన సర్కారు.. కేటాయించిన ప్రతి పైసా ఖర్చు చేయాలని, పూర్తిస్థాయిలో ఖర్చవకపోతే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని నిర్ణయించింది. 2017–18కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఫిబ్రవరి నెలాఖరునాటికి 54 శాతం నిధులే ఖర్చు చేసినట్లు ప్రభుత్వ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి వార్షిక ఖర్చుల నివేదికపై స్పష్టత రానుంది. ఖర్చులపై ఆడిట్ ముగిసిన తర్వాత ఎంత మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేయాలో లెక్క తేలనుంది. ఈ ప్రక్రియంతా మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో తేలుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రాష్ట్రానికి రేపు జాతీయ ఎస్సీ కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం హైదరాబాద్కు రానుంది. ఈ నెల 20, 21 తేదీల్లో వివిధ వర్గాలతో సమీక్ష నిర్వహించనుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్శంకర్ కటారియా, వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, స్వరాజ్ విద్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి తదితరులు రెండ్రోజుల పర్యటనలో భాగంగా 20వ తేదీ ఉదయం నగరానికి చేరుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. సాయంత్రం అక్కడే ఎస్సీ ఉద్యోగ సంఘాలు, సంక్షేమ సంఘాలు, విద్యార్థి సంఘాలతో భేటీ కానున్నారు. అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘంతో సమావేశమవుతారు. 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు తాజ్ డెక్కన్ హోటల్లో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలును సమీక్షిస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం అమలుపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, డీజీపీ, సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమవుతారు. జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ పూర్తి చేసినట్లు ఆ శాఖ సంచాలకులు కరుణాకర్ తెలిపారు -
గడువులోగా నిధుల ఖర్చు: జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్డీఎఫ్)కి ప్రభుత్వం కేటాయించిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. 2017–18 వార్షిక సంవత్సరం ముగియడానికి నెలన్నర గడువుందని ఆలోపు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ ఎస్డీఎఫ్ అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించినట్లు జగదీశ్రెడ్డి చెప్పారు. జనవరి ఆఖరు నాటికి రూ.6,689 కోట్లు ఖర్చయ్యాయన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దళితుల అభివృద్ధికి 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. -
ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని దళిత యువతిని వేధిస్తున్న యువకుడిని త్వరలో అరెస్టు చేస్తామని తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేటకు చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నిద్రబోయిన స్వామి ఐదు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. యువకుడిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్గోపాల్రావు తెలిపారు. తూప్రాన్ సబ్డివిజన్లో ఇప్పటికే 450 సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. -
బేటీ..పిటీ!
సిటీబ్యూరో: పట్ణణ ప్రాంతాల్లో పేదరికం, ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి ఇటీవలి సోషియో ఎకనమిక్ సర్వే తేల్చిన అంశాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు. ముఖ్యంగా అభివృద్ధిపథంలోకి దూసుకెళుతోందనుకుంటున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బాలబాలికల నిష్పత్తి తెలంగాణ రాష్ట్ర సగటు బాలబాలికల నిష్పత్తికంటే కూడా అతి తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం మొత్తంమీద బాలబాలికల నిష్పత్తిలో అంతరాలు కొంత తగ్గినట్లుగా కన్పిస్తున్నా... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి కొంత మెరుగ్గానే ఉంది. తెలంగాణలో బాలబాలికల నిష్పత్తి గత పదేళ్ళలో ప్రతి వెయ్యిమంది బాలురకి 971 బాలికల నుంచి 988 బాలికలకు పెరిగింది. అయితే హైదరాబాద్లో ప్రతి వెయ్యిమంది బాలురకి రాష్ట్ర సగటుకంటే అతి తక్కువగా 954 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలలో ప్రతి వెయ్యిమంది బాలురకు 961 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ రెండు జిల్లాల పరిధిలో పేదరికం, నిరక్షరాస్యత, లింగనిర్ధారణ పరీక్షల ప్రభావం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. కాగా షెడ్యూల్డ్ కులాల్లో మాత్రం బాలికలు బాలురకన్నా (రాష్ట్ర సగటుకన్నా) అధికంగా ఉన్నట్టు తేలింది. ప్రతి వెయ్యిమంది బాలురకు 1008 మంది బాలికలు షెడ్యూల్డ్ క్యాస్ట్ కుటుంబాల్లో ఉండడం గమనార్హం. ఆదివాసీల్లోనైతే ప్రతి వెయ్యిమంది బాలురకి 977 మంది బాలికలు ఉన్నట్టు నమోదయ్యింది. అలాగే 0–6 వయసు బాల బాలికల నిష్పత్తిలో సైతం చాలా తేడా కనిపిస్తోంది. ఈ వయసు బాలబాలికల్లో ప్రతి వెయ్యిమంది బాలురకి బాలికల సంఖ్య 957 నుంచి 932కి పడిపోయింది. ఈ విభాగంలో హైదరాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలు చిట్టచివరి స్థానాల్లో ఉండడం గమనించాల్సిన విషయం. బాల్య వివాహాలు ఎక్కువే.. బాల్య వివాహాల విషయానికొస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్లు సోషియో ఎకనమిక్ సర్వేలో తేల్చారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో బాల్యవివాహాలు 3.7 శాతంగా ఉంటే తెలంగాణలో కొంత తగ్గి 2.1 శాతంగా ఉంది. అయితే 2017– సోషియో ఎకనమిక్ సర్వేలో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వీటికి పలు అంశాలను కారణాలుగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హైటెక్ సిటీగా పేరొంది...అభివృద్ధిలో దూసుకుపోతూ ఆదర్శ నగరంగా కీర్తిస్తున్న హైదరాబాద్ నగరంలో బాల్యవివాహాలు, బాలికల సంఖ్య తగ్గడం వంటి అంశాలు మచ్చలుగానే చెప్పొచ్చు. -
ఎస్సీ, ఎస్టీలంటే ఎందుకంత చులకన?
⇒ సర్కారు తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం ⇒ ఎస్సీ, ఎస్టీల కరెంటు బిల్లుల కింద ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది స్వల్పమే ⇒ కొన్ని నిధులు ఇస్తూ గొప్పగా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు ⇒ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్ సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్ కులాలు, తెగల కుటుంబాలకు విద్యుత్ ఛార్జీల మినహాయింపుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన సమాధానంపై అనుబంధ ప్రశ్న అడిగే సమయంలో మొదలైన వాగ్వాదం వాకౌట్కు దారితీసింది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ కుటుంబాలు 8,70,427, ఎస్టీ కుటుంబాలు 3,50,576 ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఎస్సీలకు ఏడాదికి రు.58.02 కోట్లు, ఎస్టీలకు రు.18.54 కోట్లు విద్యుత్ చార్జీల కింద చెల్లించినట్లు వివరించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ... రాష్ట్రంలో 1,474 గిరిజన గ్రామాలున్నాయని, తనతోపాటు వస్తే ఎక్కడెక్కడ విద్యుత్ సౌకర్యం లేదో చూపిస్తానని సవాల్ విసిరారు. ప్రైవేటు కాంట్రాక్టర్లు ఎక్కడో కూర్చొని బిల్లులు వసూలు చేసుకుపోతున్నారని, మీటర్లు లేని వాళ్లకు సైతం బిల్లులు వేస్తున్నారని విమర్శించారు. దీనిపై మంత్రి సమాధానం చెబుతూ... రాష్ట్రంలో కరెంటు లేని ఇల్లంటూ లేదని అన్నారు. ఈ దశలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్ను కోరారు. స్పీకర్ పట్టించుకోకుండా అధికార పక్షానికి చెందిన మరో సభ్యుడికి అవకాశం ఇవ్వబోతుండగా విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వాలని కోరారు. దీంతో జగన్కు మైకు ఇచ్చారు. మైకు ఆన్లో ఉందో, ఆఫ్లో ఉందో... గతంలో తమ ముందున్న మైకులు ఆన్లో ఉన్నాయో, ఆఫ్లో ఉన్నాయో అర్థమయ్యే దని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్ జగన్మోహనరెడ్డి చురక అంటించారు. అందువల్ల తాము మాట్లాడేటప్పుడు ఈ మైకుల వైపు చూడాలో, మీ వైపు (స్పీకర్) చూడాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయ్ ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల లోపు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆయా వర్గాలకు ఖర్చు చేస్తున్నది చాలా స్వల్పమేనని వైఎస్ జగన్ వివరించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఏదో ముష్టి వేసినట్టు కొన్ని నిధులు ఇస్తూ, గొప్పగా ఇచ్చినట్టు మంత్రి చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని ధ్వజమెత్తారు. బాబు రాక ముందు రూ.150 ఉండే విద్యుత్ బిల్లు ఇప్పుడు ఐదారు వందల రూపాయలకు చేరిందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలంటే ఎందుకంత చులకన? అని ప్రశ్నించారు. సర్కారు తీరుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
ఆ 17 కులాలకు సీఎం శుభవార్త!
-
ఆ 17 కులాలకు సీఎం శుభవార్త!
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కులంకార్డును తెరపైకి తెచ్చారు. గతకొంతకాలంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్న సీఎం అఖిలేశ్ తాజాగా 17 ఇతర వెనుకబడిన (ఓబీసీ) కులాలను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రతిపాదనను త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపనుందని, కేంద్రం ఆమోదం తెలిపితే.. ఆయా కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించనుందని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ ఓటర్లకు గాలం వేసేందుకే అఖిలేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, బహర్, ప్రజాపతి, రాజ్భర్, బథాం, గౌర్, తురా, మఝీ, మల్హా, ధీమర్, మచౌ తదితర 17 ఓబీసీ ఉప కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి 2013 మార్చిలో అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయా 17 కులాల స్థితిగతులపై యూపీ ఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సమగ్ర అధ్యయనం జరిపిందని, వాటికి ఎస్సీ జాబితాలో చేరే అర్హత ఉందని ఈ తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. -
రాజ్యాంగద్రోహం!
సమయం చిక్కినప్పుడల్లా దళిత సంక్షేమం గురించి స్వోత్కర్షలు పోయే నేతల పరువు తీసే గణాంకాలివి. గత మూడున్నర దశాబ్దాల్లో ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన రూ. 2.80 లక్షల కోట్లు ఖర్చు కాలేదని ‘ఇండియా స్పెండ్’ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో ఒకసారి, ఏప్రిల్లో మరోసారి షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఈ సంగతిని ఎత్తి చూపింది. అంతకు చాన్నాళ్ల ముందే పార్లమెంటరీ స్థాయీ సంఘం వంటివి కూడా హెచ్చరించాయి. అయితే పాలకుల్లోగానీ, అధికార యంత్రాంగంలోగానీ వీసమెత్తయినా మార్పు రాలేదు. కేంద్రం తరహాలో తాము కూడా ఉప ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం మొదలెడతామని ఈమధ్య కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినబూనాయి. అందుకు సంబంధించి చట్టాలు తీసుకురావడం మొదలుపెట్టాయి. ప్రకటనలు మోతెక్కి పోయాయి. కానీ అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిమ్న వర్గాల విషయంలో శ్రద్ధ చూపలేకపోయాయని తాజా గణాంకాలు వివరిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభు త్వాలైతే అసలు లెక్కలు చెప్పడానికే సిగ్గుపడుతున్నాయి. రేపు మాపంటూ మొహం చాటేస్తున్నాయి. బడ్జెట్లలో ఘనంగా కేటాయింపులు చేయడం... ఏ శాఖకు నిధుల కొరత ఎదురైనా వాటిని మళ్లించడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. అలా కాని పక్షంలో ఆ నిధులు మురిగిపోవడం రివాజు. కేటాయింపులు పెరిగిన కొద్దీ వేరే శాఖలకు ఎగిరిపోయే నిధుల మొత్తం ఎక్కువ కావడం లేదా మురిగిపోయే నిధుల శాతం పెరగడం తప్ప ప్రయోజనం శూన్యం. ప్రణాళికా సంఘం ఉన్నా, దాని స్థానంలో నీతిఆయోగ్ వచ్చినా పరిస్థితి పెద్దగా మారింది లేదు. మన రాజ్యాంగం నిమ్న వర్గాల సంక్షేమానికి, వారి ఆర్ధికాభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చింది. ఆ వర్గాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం అభి వృద్ధి సాధించగలదని భావించింది. అందుకోసం ప్రభుత్వాలు ఎలా వ్యవహరిం చాలో, ఏమేం చర్యలు తీసుకోవాలో వివిధ అధికరణలు చెబుతున్నాయి. కానీ అధికార పీఠాలపై ఉండేవారు వాటిని బేఖాతరు చేస్తూ ఇష్టానుసారం ప్రవర్తిస్తు న్నారు. అధికార గణం వారికి డిటో. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నిధులు కొల్ల గొట్టడం, వాటిని ఖర్చు చేయకపోవడంలాంటివి పదే పదే పునరావృతం కావడంలో వింతేముంది? చిత్రమేమంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా మాత్రం నిరుడు డిసెంబర్లో ఒక గోష్టి సందర్భంగా రాష్ట్రాల్లో పేద రికం గణనీయంగా తగ్గిందని ప్రకటించారు. అందులో ఎంతో కొంత నిజం ఉంద నుకున్నా దానికి ప్రభుత్వాల వైపుగా జరిగిన కృషి స్వల్పమేనని ఇప్పుడు ‘ఇండియా స్పెండ్’ విడుదల చేసిన గణాంకాలు చూస్తే అర్ధమవుతాయి. పేదరికం నుంచి బయటపడటం కోసం ఆ వర్గాల వైపు నుంచి సాగిన కృషికి ప్రభుత్వాలు బాసటగా నిలిచి ఉంటే పరిస్థితి మరెంత మెరుగ్గా ఉండేదో తెలుస్తుంది. మన దేశంలోని వ్యవసాయ బడ్జెట్ మొత్తం కంటే ఎనిమిది రెట్లు అధికంగా నిమ్న వర్గాల నిధులు మురిగిపోవడమో, దారి మళ్లడమో జరిగిందని తెలిసినప్పుడు మనస్సు చివుక్కు మంటుంది. కేంద్రంలో 1974-75లో గిరిజనుల కోసం ఉప ప్రణాళిక రూపొం దించడం మొదలైంది. 1979-80లో ఎస్సీ వర్గాలకు కూడా ఇదే తరహాలో ఉప ప్రణాళికల రూపకల్పన ప్రారంభమైంది. ఆ వర్గాల జనాభా దామాషా ప్రాతిపది కన ఈ ఉప ప్రణాళికలుండాలన్నది లక్ష్యం. లక్షిత వర్గాలకు మాత్రమే ఆ నిధులు ఖర్చు కావాలన్నది ఆశయం. దేశంలో ఎస్సీ వర్గాలు 16.6 శాతం ఉంటే... ఎస్టీల జనాభా 8.6 శాతం. అయితే నిరుపేద వర్గాల్లో మాత్రం వీరి శాతం అత్యధికం. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించడమే తప్ప ఆచరణ మాత్రం అరకొరగానే ఉంటు న్నది. ప్రతి మంత్రిత్వ శాఖ తాము ఖర్చు చేసే నిధుల్లో నిమ్నవర్గాలవారి జనాభా దామాషా ప్రాతిపదికన కేటాయించాలని మార్గదర్శకాలు చెబుతున్నా... నిధులు మురిగిపోవడం మాటే ఉండకూడదని అంటున్నా పట్టించుకుంటున్నవారేరి? పాల కుల పర్యవేక్షణ కొరవడటమే ఇందుకు కారణమని అంతా అనుకుంటారు. కానీ అది అర్ధ సత్యమే. వారలా పట్టనట్టు ఉండిపోవడంలో పాలకుల ప్రయోజనం కూడా ఉంటుంది. వాటిని ఖర్చు చేయకుండా వదిలేసినా ఎవరూ ప్రశ్నించకపోతే మరో ఖాతాకు మళ్లించి పబ్బం గడుపుకోవచ్చునని పాలకులు భావిస్తున్నారు. ఏ గిరిజన పల్లెకు వెళ్లినా గుడిసెలు కనబడతాయి. బడి, విద్యుత్, మరుగుదొడ్డి వంటివి అరుదుగా ఉంటాయి. తిండి, బట్ట సరిగాలేనివారు, రోగాలతో ఇబ్బం దులు పడుతున్నవారు కనిపిస్తారు. సరైన రహదారులే ఉండవు. ఇన్ని లక్షల కోట్లు సక్రమంగా ఖర్చు చేయగలిగి ఉంటే ఇంత దయనీయమైన స్థితి వచ్చేదా? వేయి కళ్లుండే ప్రభుత్వాలు నిమ్నవర్గాల విషయంలో, వారి సమస్యల పరి ష్కారంలో కబోదుల్లా వ్యవహరిస్తున్నాయి. 2012-13లో 26 రాష్ట్రాలు రూ. 80,310 కోట్లు ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించి అందులో కేవలం రూ. 61,480 కోట్లు మాత్రమే ఖర్చుచేశాయి. సబ్ప్లాన్ చట్టం అమల్లోకొచ్చాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013-14లో కేటాయించిన రూ. 8,584 కోట్లలో రూ. 2,595 కోట్లు మిగిలిపోయాయి. ఆ తర్వాతైనా ఏపీ, తెలంగాణల్లో పెద్దగా మారిం దేమీ లేదు. 2016-17లో ఏపీలో వివిధ ప్రధాన పథకాల కోసం కేటాయించిన రూ. 550.01 కోట్లలో ఎస్సీ ఉప ప్రణాళికకు రూ. 91.3 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ. 47.3 కోట్లు అందాలి. కానీ స్మార్ట్ సిటీ (రూ. 29.26 కోట్లు), మురికివాడల్లో అభి వృద్ధి కార్యక్రమాలు (రూ. 11.7 కోట్లు), గ్రామీణ పారిశుద్ధ్యం (రూ.120.9 కోట్లు) వగైరా పథకాల్లో నయాపైస కూడా ఖర్చు చేయలేదని దళిత బహుజన రీసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) మొన్న మార్చిలో వెల్లడించింది. పైగా కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని కూడా ఆరోపించింది. తెలంగాణలోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని, ఆ రాష్ట్రం 2014-15లో నిమ్నవర్గాలకు కేటాయించిన నిధుల్లో 61.26 శాతం ఖర్చు చేయలేదని ‘ఇండియా స్పెండ్’ అంటున్నది. ఈ పరి స్థితి మారాలి. నిమ్నవర్గాల నిధుల్ని దారి మళ్లించడమైనా, మురిగిపోయేలా చేయ డమైనా రాజ్యాంగ ద్రోహంగా పరిగణించాలి. అందుకు కారకులైనవారిని బోనె క్కించాలి. అప్పుడు మాత్రమే నిజమైన సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతాయి. -
దళితులపై దాడులను నిరసిస్తూ పాదయాత్ర
అమలాపురం టౌన్ : దళితులపై జరగుతున్న దాడులను నిరసిస్తూ అమలాపురం నుంచి కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వరకూ మూడు రోజుల పాటు సాగే దళితుల పాదయాత్ర ఆదివారం స్థానిక గడియారం స్తంభం సెంటరు నుంచి ప్రారంభమైంది. మాల, మాదిగ, రెల్లి, ఉపకులాల గిరిజన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు బొర్రా విజయకుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర బయలుదేరింది. దళితులందరినీ ఒకే తాటిపైకి తేవాలన్న లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సూదాపాలెం ఘటనలో బాధితులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ముమ్మిడివరం గేటు, నల్లవంతెన, ఎన్టీఆర్ మార్గ్, ఎర్రవంతెన, కిమ్స్ ఆçస్పత్రి మీదుగా 216 జాతీయ రహదారిపై కాకినాడ వైపు యాత్ర సాగింది. యాత్రలో న్యాయవాది యార్లగడ్డ రవీంద్ర, పీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండ్రు బుల్లియ్య, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు, రైతు ఫెడరేషన్ అధ్యక్షుడు మణిసింగ్, జంగా రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో దళితులకు రక్షణ లేదు
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య సూదాపాలెం బాధితులకు పరామర్శ అమలాపురం టౌన్ : దళితులకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య విమర్శించారు. సూదాపాలెంలో చర్మకారులపై దాడి జరిగి, ఆ ఘటనపై రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు. అయినప్పటికీ కూడా ఈ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళిత బాధితులను పరామర్శించే తీరిక లేదంటే, ఆయనకు దళితులపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత దళితులను బ్రహ్మయ్య ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత మండలంలో దళితులపై ఇంతటి దారుణమైన దాడి జరగటం బాధాకరమని బ్రహ్మయ్య అన్నారు. దళితులకు రక్షణ దొరకని చంద్రబాబు ప్రభుత్వంలో ఇక తమకు తాము రక్షించుకునే క్రమంలో ప్రతిఘటన ఉద్యమాలకు సిద్ధమవుతున్నామన్నారు. ఆ కానిస్టేబుల్పైనా కేసు నమోదు చేయాలి దళితులపై దాడి జరిగాక కూడా ఘటనపై పూర్తి వివరాలు సేకరించకుండా, దాడి చేసినవారి కొమ్ము కాస్తూ బాధితుల కుటుంబీకులను మోకాళ్లపై నిలబెట్టిన పోలీసు కానిస్టేబుల్ కడలి ఏడుకొండలపై కూడా కేసు నమోదు చేయాలని బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఐదేసి ఎకరాల భూమి, రూ.8.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఆయనతో పాటు ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆకుమర్తి సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా, కోనసీమ విభాగం అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. -
అట్రాసిటీ కేసుల్లో పరిహారం పెంపు
గత ఉత్తర్వులను సవరిస్తూ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు అత్యాచారాలు, దాడులకు గురైనపుడు సహాయం, పునరావాసం కింద అందించే పరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలోని ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన సందర్భాల్లో బాధితులు వందశాతం వైకల్యానికి గురైతే రూ. 8.25 లక్షల పరిహారం, 50 శాతం వైకల్యముంటే రూ.4.5 లక్షలు, 50 శాతం కంటె తక్కువ వైకల్యానికి గురైతే రూ. 2.5 లక్షల పరిహారాన్ని అందజేయనున్నారు. దాడిలో హత్యకు గురైనా.. లేదా మరణానికి దారితీస్తే రూ.8.25 లక్షలు, గ్యాంగ్ రేప్నకు గురైన వారికి రూ.8.25 లక్షలు, అత్యాచారానికి గురైన వారికి రూ.5 లక్షలు పరిహారమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక హత్య, మరణం, రేప్, గ్యాంగ్రేప్, శాశ్వత వైకల్యం, దోపిడీకి గురైన కేసుల్లో ఎస్సీ, ఎస్టీ బాధితుల భార్య లేదా వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి నెలకు రూ.5 వేల చొప్పున అందజేస్తారు. ఈ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇళ్లు వంటివి అందజేస్తారు. వారి పిల్లలను డిగ్రీ వరకు చదివిస్తారు. దాడుల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసం కావడం లేదా తగులబడితే అదేస్థలంలో ప్రభుత్వ ఖర్చులతో ఇంటిని నిర్మించి ఇస్తారు. వివక్ష బాధితులకు రూ.2 లక్షల పరిహారం.. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఇవ్వడం వంటి కేసుల్లో బాధితులకు రూ.4.15 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల చేతుల్లో వివక్ష లేదా బాధితులుగా మారిన వారికి లేదా వారిపై ఆధారపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం, ఆలయాల్లోకి, ప్రార్థనాస్థలంలోకి ప్రవేశించకుండా, సామాజిక, సాంస్కృతికంగా ఊరేగింపులు నిర్వహించకుండా అడ్డుకుంటే.. బాధితులకు రూ. లక్ష పరిహారంతో పాటు ఆయా హక్కులను కల్పించాలని నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో ఓటు వేయకుండా, నామినేషన్ దాఖలు చేయకుండా నిరోధించడం, ఎన్నికల్లో హింస.. ఇతరత్రా దౌర్జన్యకర సంఘటనల్లో బాధితులకు రూ.85 వేల పరిహారాన్ని అందించనున్నారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి బి. మహేశ్ దత్ ఎక్కా ఉత్తర్వులను జారీచేశారు. -
పార్లమెంటులో వర్గీకరణపై ప్రశ్నిస్తాం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. వర్గీకరణకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళన ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. అణగారిన వ ర్గాల అభ్యున్నతి కోసమే అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఒక కులమే దోచుకోవడం అన్యాయమని, వర్గీకరించుకొని రిజర్వేషన్లను పంచుకోవాలని అన్నారు. విభజన సమయంలో ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల అమలుకు సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు ఆ హామీని అమలు చేయాలన్నారు. స్వార్థపరులే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని.. అంబేడ్కర్ వాదులు వర్గీకరణకు సహకరిస్తారని మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు కె.కె.ప్రసాద్ మాట్లాడుతూ వర్గీకరణతోనే భవిష్యత్తు తరాలకు వెలుగు లభిస్తుందన్నారు. -
దళితుల్లో ఆ మతవ్యాప్తి పెరిగిపోతున్నది!
న్యూఢిల్లీ: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబసభ్యులు ఇటీవలే బుద్దిజంలోకి మారారు. దేశంలోని దళిత వర్గాల్లో బౌద్ధమత వ్యాప్తి పెరుగుతున్న ట్రెండ్కు ఈ ఘటన అద్దం పడుతున్నది. దళితుల్లో బుద్ధిజం బాగా పెరిగిపోతున్నదని తాజాగా ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. దేశంలో దళిత ఉద్యమం విజయవంతం కావడంలో బుద్ధిజం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాల ప్రజలు బుద్ధిజం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో బుద్ధిస్టు ఎస్సీలు 41.59 లక్షల మంది ఉండగా, 2011నాటికి 57.56 లక్షలకు చేరారు. అంటే ఎస్సీల్లో బుద్ధిజం 38శాతం పెరిగింది. 2001 నాటికి దేశంలో ఎస్సీల జనాభా 16.6 కోట్లు ఉండగా.. 2011నాటికి 21.3శాతం పెరిగి 20.14 కోట్లకు చేరుకుంది. బౌద్ధమతంలో ఉన్న ఎస్సీల్లో 90శాతం మంది మహారాష్ట్రలోనే నివసిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 52.04 లక్షలమంది బుద్ధిస్టులు ఉండగా, అక్కడ బౌద్ధమత వ్యాప్తి 60శాతం వృద్ధిరేటుతో ముందుకుసాగుతుండటం గమనార్హం. అదే సమయంలో 2001 నుంచి 2011 నాటికి హిందూ ఎస్సీల జనాభా కేవలం 19.6శాతం మాత్రమే పెరిగింది. 15.8 కోట్ల నుంచి 18.9 కోట్లకు వారి జనాభా చేరుకుంది. అయితే, మొత్తంగా చూసుకుంటే మాత్రం దళిత జనాభాలో బుద్ధిస్టులు కేవలం 2.83శాతం మాత్రమే ఉన్నారు. దేశంలో బౌద్ధమత పునరుత్థానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. తన మరణానికి కొన్నిరోజుల ముందు ఆయన బుద్ధమతంలో మారారు. హిందూమతంలో తమ పట్ల అణచివేత ఉందని భావిస్తున్న దళితులు చాలామంది బౌద్ధమతంలోకి మారుతున్నారు. -
బీసీ విద్యార్థులకు దొరకని చేయూత
♦ పది తర్వాత పెరుగుతున్న డ్రాపౌట్స్ ♦ 20 గురుకుల, 16 జూనియర్ కాలేజీల అప్గ్రేడ్ ప్రతిపాదన పెండింగ్ ♦ ప్రస్తుతమున్నవి మూడు జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజే సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలకు 250 గురుకులాలు ఇచ్చారు.. మంచిదే కానీ, మరి తమ సంగతేమిటని బీసీ వ ర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఏర్పాటు అంశం చర్చనీయాంశమైంది. ఇతర అణగారిన వర్గాల కోసం గురుకులాలను ప్రకటించి, బీసీలకు మాత్రం ఒక్కటి కూడా ప్రకటించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్టం లోని పది జిల్లాల్లో ప్రస్తుతం 23 రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. బీసీలకు పదో తరగతి తర్వాత రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యను కొనసాగించేందుకు కేవలం మూడే జూనియర్ కాలేజీలు, మహిళలకు ఒకే డిగ్రీ కాలేజీ ఉన్నాయి. ఈ కారణంతో జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బీసీ విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువు మానేసి చిన్నా, చితకా పనులు చే సుకుంటున్నట్లు పలు పరిశీలనల్లో వెల్లడైంది. ప్రభుత్వం వద్ద పెండింగ్ ప్రతిపాదనలు రాష్ర్ట వ్యాప్తంగా 20 బీసీ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 16 పాఠశాలలను జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆయా జిల్లాల వారీగా గురుకులాల ఏర్పాటు చేయాలని అధికారులు గుర్తిం చారు. అయితే తాజాగా సీఎం ప్రకటించిన 250 గురుకులాల్లో బీసీ గురుకులాలు లేకపోవడం పట్ల ఈ వర్గాల్లో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. -
లక్ష్యం ఘనం... సాధించింది శూన్యం!
షెడ్యూల్ కులాల అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం. వారి ఆర్థికాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామని, వారికి కావాల్సిన రుణాలు మంజూరు చేస్తున్నామని మన పాలకులు చెబుతున్న మాటలు ఉత్తుత్తిదేనని తేలిపోరుుంది. వీరి మాటలు పత్రికలకే పరిమితమని నిర్ధారణ అయింది. రోజుకోసారైనా ఎస్సీల సంక్షేమం అంటూ మంత్రులు, అధికారులు చెప్పే మాటలన్నీ వాస్తవాలు కావని జిల్లాలోని షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా గత ఏడాది మంజూరైన పథకాల రుణాల వివరాలు పరిశీలిస్తే తేలింది. వివరాల్లోకి వెళ్తే... * అవగాహనా లోపమే కారణం * మరోవైపు నిబంధనల అడ్డుకట్ట... శ్రీకాకుళం పాతబస్టాండ్ : షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా ఎస్సీ కులస్తులకు మంజూరు చేసే పలు పథకాలకు సంబంధించి ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. పథకాల మంజూరీలో ప్రభుత్వ జాప్యంతో పాటు పథకాల నిర్వహణకు సంబంధించి సంబంధిత వ్యక్తులకు అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అంతేకాకుండా కొందరు దరఖాస్తు చేసుకున్నా నిబంధనల పేరిట అడ్డుకట్ట వేస్తుండడంతో లక్ష్య సాధనలో ఆ శాఖ వెనుకబడుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు లబ్ధి చేకూర్చే ఎనిమిది పథకాలు ప్రస్తుతం ఉన్నారుు. వీటిలో ఒకటి రెండు పథకాలు మినహా, మిగిలిన పథకాలు ఎస్సీల చెంతకు చేరే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పథకాల తీరును ఓసారి పరిశీలిస్తే... * సబ్సిడీపై బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు ఉత్పాదకత ప్రయోజన యూనిట్లు 1143 మంజూరు చేసి అందుకుగాను రూ.12,91,68,000లు ఖర్చు చేయూలని నిర్ణరుుంచింది. అరుుతే 871 యూనిట్లకుగాను రూ.10,92,37,000లను మంజూరు చేశారు. వీరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో రాయితీ నగదు పడనుంది. మిగిలిన యూనిట్లకి లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు. * బ్యాంకు రుణంతో పని లేకుండా నేరుగా ఎస్సీ కార్పొరేషన్ పలువురు ఎస్సీ లబ్ధిదారులకు కొన్ని యూనిట్లు అందజేయూల్సి ఉంది. దీనిలో భాగంగా 107 యూనిట్లకుగాను రూ.1,52,16,000లు మంజూరుకు నిర్ణరుుంచింది. వీటిలో ఇప్పటి వరకు 43 యూనిట్లు మాత్రమే గ్రౌండయ్యూరుు. వీటికి సంబంధించి రూ.72,30,000లు మంజూరు చేసింది. మిగిలిన యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులే కరువయ్యూరు. * భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ రైతులకు నేరుగా కార్పొరేషన్ భూములు కొనుగోలు చేసి ఇస్తుంది. 254 మంది లబ్ధిదారులకు ఇలా గత ఆర్థిక సంవత్సరంలో అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ పథకం కింద ప్రయోజనం చూకూరలేదు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల కొరత అటుంచితే భూములు విక్రయించే రైతులు ముందుకు రాలేదు. దీంతో ఈ పథకం కాస్త నీరుగారింది. * ఎస్సీ కులాల బోరు బావి పథకం కింద 397కి రూ.1,58,50,000లు అందజేయాల్సి ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోలేదు. * ఎస్సీల్లో పేదలకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వడ్డీలేని రుణాలు అందజేస్తారు. వీటికిగాను రూ.25వేలు యూనిట్ వంతునా 39 మందికి లక్ష్యంగా నిర్ణరుుంచారు. ఇప్పటి వరకు తొమ్మిది మందికి మాత్రమే ఈ రుణాలు అందజేశారు. * వృత్తి ఉపాధి శిక్షణ పథకం క్రింద 303 మందికి వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. వీరు విజయవాడలోని శిక్షణ పొందుతున్నారు. అనంతరం ఉద్యోగం ఇప్పిస్తారు. * ఇన్నోషియేటివ్ పథకం కింద వికలాంగులకు, ఎయిడ్స్, యుక్త వయస్సులోని పిల్లలు గల వితంతువులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేయూల్సి ఉంది. ఈ పథకం ద్వారా ఒకరికి రూ.40వేలు ఉపాధి ప్రోత్సాహం కింద ఇస్తారు. దీనికి 39 మందికి లక్ష్యంగా నిర్ణయించగా 28 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22 మందికి రూ.8,80,000లు అందజేశారు. లబ్ధిదారులు ముందుకు రావాలి... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ముందుకు రావాల్సి ఉంది. పథకాలు అన్నింటిపైనా అవగాహన కల్పింస్తున్నాం. దర ఖాస్తు చేసుకున్న ప్రతి వారికి నిబంధనలు మేరకు రుణాలు, ఇతర పథకాల అందజేస్తున్నాం. ఇప్పటికే దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. ఈ ఏడాది మరింత అధికంగా ఈ పథకాలు లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. - కేవీ ఆదిత్యలక్ష్మి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ -
ఆ నిధులు అంతే...!
గతేడాది ఎస్సీ సబ్ప్లాన్ నిధులపై సంక్షేమ సలహాదారు రామలక్ష్మణ్ హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమానికి సంబంధించి గతేడాది ఖర్చు కాకుండా మిగిలిపోయిన ఉప ప్రణాళిక నిధులను మరుసటి ఏడాదికి బదిలీ చేయడం జరగదని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ సలహాదారు ఎ.రామలక్ష్మణ్ తెలిపారు. గ్రామజ్యోతి, తదితర కార్యక్రమాల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను మళ్లిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ... ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించరాదని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో ఆయా సంక్షేమ పథకాలకు నిధుల కొరత తలెత్తుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో వివిధ సంక్షేమశాఖల అధికారులు డా.ఎం.వి.రెడ్డి, జయరాజ్, దశరథ్నాయక్లతో కలసి రామలక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కుంటుపడుతున్నాయంటూ పత్రిక ల్లో కథనాలు రావడం బాధకలిగిస్తోం దని అన్నారు. దళితులకు భూ పంపిణీ పథకాన్ని అమలుచేస్తున్నామని, ఇప్పటివరకు 1,300 మందికి 3,600 ఎకరాల మేర పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-16కు సంబంధించి 80 శాతం రాయితీతో రుణాలు ఇవ్వనున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయన్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ఎస్సీ అమ్మాయిల పెళ్లి కోసం రూ.105 కోట్లు, ఎస్టీ అమ్మాయిల వివాహాల కోసం రూ.62 కోట్ల మేర ఖర్చుచేశామని తెలియజేశారు. -
'దళితులపై దాడులు అరికట్టాలి'
సంగారెడ్డి(మెదక్ జిల్లా): దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఫ్లెక్సీకి శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితులపై దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, అట్రాసిటి కేసులను నీరుగారుస్తున్న సంగారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలని, సంగారెడ్డి జడ్పీటీసీ మనోహర్గౌడ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీలకు పరిహారం పెంపు
* అత్యాచారాల నిరోధక చట్టం కింద సవరించిన పరిహారాలు.. * ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం * గత ఏడాది జూన్ 23 నుంచి వర్తింపు సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారు అత్యాచారాలు, దాడులకు గురైన సందర్భం లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం,1989 కిం ద ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్వర్వులు గత ఏడాది 23 జూన్ నుంచి అమల్లోకి వస్తాయని బుధవారం రాత్రి ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్ఏసీ) జె.రేమండ్పీటర్ ఆదేశాలు జారీచేశారు. ఆయా కేసులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సవరించిన పరిహారాలు ఇలా... - ఎస్సీ, ఎస్టీలు వినియోగించే నీటి వనరులను ఎవరైనా కలుషితం చేస్తే రూ.3.75 లక్షల వరకు పరిహారం. లేదా మొత్తం నీటిని శుద్ధి చేస్తారు. - తప్పుడు పద్ధతుల్లో ఎవరైనా ఎస్సీ, ఎస్టీల భూమిని ఆక్రమించి, సాగు చేసుకుంటుంటే నేర తీవ్రతను బట్టి కనిష్టంగా రూ.90 వేలు అంత కంటే ఎక్కువ చెల్లిస్తారు. - మహిళలపై అత్యాచారం, లైంగికంగా వేధించడం వంటి వాటికి రూ. 1.8 లక్షల మొత్తం బాధితురాలికి చెల్లింపు. - హత్యకు గురైతే సంపాదన ఉన్న వ్యక్తి విషయంలో రూ.7.5 లక్షలు.. సంపాదన లేనివారికి రూ.3.75 లక్షలు. - దాడుల్లో వంద శాతం అంగవైకల్యానికి గురైతే కుటుంబ సంపాదన చేసేవారికి రూ.7.5 లక్షలు.. సంపాదన లేనివారికి రూ.3.75 లక్షలు. - ఇళ్లు పూర్తిగా తగలబడడం లేదా ధ్వంసమైతే ఇటుకలతో ఇంటి నిర్మాణం లేదా దానికయ్యే ఖర్చును ప్రభుత్వ లెక్కల ప్రకారం చెల్లించడం. - హత్య, అత్యాచారం, గ్యాంగ్రేప్, పూర్తి అంగవైకల్యం, దోపిడీ వంటి కేసుల్లో ప్రభుత్వపరంగా స హాయంతో పాటు చనిపోయిన ఎస్సీ, ఎస్టీల భార్యలు లేదా వారిపై ఆధారపడినవారికి నెలకు రూ.4,500 చొప్పున పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా వ్యవసాయ భూమి, లేదా ఒక ఇల్లు ఇస్తారు. - అవమాన ం, అడ్డుకోవడం వంటి వాటికి ఒక్కొక్కరికి రూ.90 వేల వరకు. - భూమికి లేదా ఇతరత్రా దారి ఇవ్వకపోవడం.. రూ.3.75 లక్షల వరకు. - ఇంటిని వదిలిపెట్టి వెళ్లేలా చేసినందుకు ఒక్కో బాధితుడికి రూ.90 వేల చొప్పున చెల్లిస్తారు. - ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సాక్ష్యం ఇచ్చిన కేసులో కనిష్టంగా రూ.3.75 లక్షలు లేదా పూర్తి నష్టపరిహారం - ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎవరైనా నిరోధించిన కేసుల్లో రూ.75 వేల వరకు. -
అణగారిన కులాలు ఏకం కావాలి : గద్దర్
బషీర్బాగ్: జాతిని ప్రేమించే వారే ఆ జాతికోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనకాడబోరని గద్దర్ అన్నారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ రజక (దోభీ) అభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో రజక శంఖరావం మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ప్రాణాలర్పించిన ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నెలకొల్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, శ్రమ జీవులు భూమికీ దూర మయ్యారని ఆరోపించారు. ఆర్థిక సమానత్వం వచ్చినప్పుడే, రాజకీయ సమానత్వం వస్తుందని అందుకోసం ప్రజలు, అణగారిన కులాలు ఏకం కావాలన్నారు. ఈ సందర్భంగా తాను రాస్తున్న ‘ఊరి చరిత్ర’ ను పాటల ద్వారా వివరించారు. తెలంగాణ రజక అభివృద్ధ్ది సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎం. అంజయ్య మాట్లాడుతూ రజకులు 18 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా గుర్తింపు పొందారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చర్య లు తీసుకోవాలని, రజక వృత్తి దారులకు పెన్షన్ ఇప్పించాలని కోరారు. చాకలి ఐల మ్మ, గాడ్గె బాబా మహరాజ్ల పేర్లతో విద్యాలయా భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. త్వరలో తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సభకు గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం. నర్సింహ్మ అధ్యక్షత వ హించగా, నాయకులు వీర్ల వల్లీ శంక ర్, జి. మల్లయ్య, బి. చుక్కయ్య, చిమల శంకర్, సత్యనారాయణ, బండిరాల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారం, హత్య కేసులో అధికార పార్టీ మద్దతుదారులు ?
చిత్తూరు : ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అత్యాచారం, ఆపై హత్యకు గురైన దళిత యువతి(18) కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాలు..పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ ఎగువపూనేపల్లె దళితవాడకు చెందిన యువతి శనివారం గ్రామ సమీపంలో మేకలు మేపుతుండగా కొంత మంది దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కలవకుంటకు చెందిన ఉదయకుమార్ మొదలియార్(23)ను సోమవారం అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే గ్యాంగ్ రేప్ జరిగినప్పటికీ పోలీసులు ఒక్కడిపైనే కేసు నమోదు చేయడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు అధికార పార్టీకి చెందినవారని పోలీసుల విచారణలో తేలడంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ స్థాయిలో జిల్లా పోలీసులపై ఒత్తిడి పెంచారు. పలువురిని తప్పించి ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు సమాచారం. -
దళిత హక్కుల పరిరక్షణకు నిరంతర కృషి
హైదరాబాదు సిటీ (కాచిగూడ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం కేటాయించే నిధులు, సంక్షేమ పథకాలన్నీ క్షేత్రస్థాయి వరకు అర్హులందరికి అందే విధంగా దళిత హక్కుల పరిరక్షణ ఫోరం నిరంతరం కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి.కృష్ణ అన్నారు. సోమవారం కాచిగూడలోని దళిత హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయంలో ముషీరాబాద్ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతే లక్ష్యయంగా పనిచేస్తున్న ఫోరంకు దళితులందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సంక్షేమ పథకాల్లో దళితులకు దక్కాల్సిన వాటా రాకపోతే ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల చట్టబద్ధతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
అట్రాసిటీ కేసుల విచారణ వేగం పెంచండి
జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి వినోద్ అగర్వాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్ కులాలపై జరిగిన దాడులు, అత్యాచారాల కేసుల విచారణను వేగవంతం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి డా. వినోద్ అగర్వాల్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కేసుల్లో బాధ్యులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాడులు, అత్యాచారాలకు గురైన ఎస్సీలకు ఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ట్రస్ట్ ద్వారా రూ.5 లక్షల వరకు సాయమందే అవకాశం ఉందని, దీనిని ఉపయోగించుకోవాలన్నారు. ఎస్సీలపై అత్యాచారాలు, ఉప ప్రణాళిక, రిజర్వేషన్ల అమలుపై గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్శర్మ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విద్యాయోజన పథకం కింద విదేశాల్లో ఉన్నతవిద్యనభ్యసించేందుకు కేంద్రం అందించే సాయానికి సంబంధించి తల్లిదండ్రుల ఆదాయపరిమితిని రూ.2 లక్షల నుంచి 4.5 లక్షలకు పెంచాలని సూచించారు. రాష్ట్రస్థాయి ఎస్సీ కమిటీలను ఏర్పాటుచేయాలన్నారు. -
ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ప్యాకేజీ!
2015-16 బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రభుత్వ కసరత్తు సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు)గా సాంకేతికంగా గుర్తింపు పొందినా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందక వెనుకబడిపోతున్న ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ కులాలు, వర్గాల మధ్య సమస్థాయిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఎస్సీల్లో అల్పసంఖ్యాక వర్గాలు, ఆయా అభివృద్ధి ఫలాలు అందక నిర్లక్ష్యానికి గురవుతున్న ఉపకులాలను గుర్తించి అందులోని ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీని వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇదివరకే ఎస్సీ అభివృద్ధిశాఖ ఆయా సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఎస్సీలకు సంబంధించిన ఉపప్రణాళిక కింద వచ్చే నిధులను ఆయా ఎస్సీ కులాల జనాభా ప్రకారం నేరుగా తమ శాఖకే కేటాయించాలని కూడా సూచించింది. ఈ విధంగా తమ వద్దనున్న నిధులను ఆయా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగతంగా ఎస్సీ కుటుంబాలకు నేరుగా అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి పంపిన సిఫార్సుల్లో పేర్కొంది. ఈ కులాల్లోని అల్పసంఖ్యాక వర్గాలకు ఆయా పథకాల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి 2015-16 బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్టీ విద్యార్థులకు స్టడీ సెంటర్లు... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గిరిజన విద్యార్థుల కోసం సొంత భవనాల్లో స్టడీ సెంటర్లతోపాటు ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇతర హాస్టళ్లకు కూడా సొంత భవనాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చే ఆలోచనతో గిరిజన సంక్షేమశాఖ ఉంది. హైదరాబాద్తోపాటు వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే గిరిజన విద్యార్థులకు స్టడీ సెంటర్లు నడుస్తున్నాయి. రాష్ర్టంలోని పది జిల్లాల్లో అన్ని హంగులతో స్టడీ సెంటర్లను ఏర్పాటుతో విద్యార్థులకు తగిన శిక్షణనిచ్చే అవకాశం ఉంటుందని ఈ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతంలోనే ఈ స్టడీ సెంటర్ల ఏర్పాటు కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.10 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి జిల్లాలో గిరిజన భవన్లను ఏర్పాటు చేయాలని కూడా ఈ శాఖ నిర్ణయించింది. దీనిద్వారా ఆయా సామాజిక కార్యక్రమాలు, వ్యక్తిగత శుభకార్యాలు జరుపుకునేందుకు ఇవి దోహదపడతాయని ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. -
భోపాల్ డిక్లరేషన్ సాకారమయ్యేదెప్పుడు?
భారతదేశంలో దళితుల సమస్య మన సమాజంలోని సర్వసాధారణమైన అసమాన తలకు, అన్యాయాలకు ప్రతీక. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అనుభవిస్తు న్న వివక్ష, రాజ్యాంగంలో పొం దుపరిచిన విలువల ప్రజాస్వా మ్యంలో విషాదకరమైన నిరా కరణల ఫలితమే. సమాజం నిరాకరించిన ఈ వర్గాల అభ్యున్నతికి, అసమానతలు తొలగించేందుకు, ప్రగతి శీలమైన సామాజిక విధానాలు అవలంబించాలి. పద మూడేళ్ల క్రితం అంటే 2002 జనవరి 12, 13 తేదీల్లో దళిత, ఆదివాసీ మేధావులు భోపాల్లో సమావేశమై, దళితులు, ఆదివాసీలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుతూ, 21వ శతాబ్దానికి 21 అంశాల ప్రణాళికతో భోపాల్ డిక్లరేషన్ను ఆవిష్కరించారు. వారి ఆశలు ఫలించాయా? అడియాసలయ్యాయా? అని ఆత్మ పరిశీ లన చేసుకోవాల్సిన అవసరం దళిత, ఆదివాసీ, మేధా వులు, ఉద్యమకారులందరిపైనా ఉంది. దేశ వ్యవసాయరంగంలో ఎస్సీలు 72 శాతం, ఎస్టీలు 86 శాతం ఆధారపడి ఉన్నారు. నిర్మాణరంగంలో ఎస్సీలు 11.83 శాతం, ఎస్టీలు 4.86 శాతంగా ఉన్నారు. వివిధ రంగాల్లో సేవలందించే ఎస్సీలు 14.17 శాతం, ఎస్టీలు 7.23 శాతం ఉన్నారు. 72 శాతం ఎస్సీలు ఆధా రపడిన వ్యవసాయ రంగం చేసిన ఉత్పత్తి కంటే వ్యవ సాయేతర రంగంపై ఆధారపడిన శ్రామికులకు ఎక్కువ విలువ, ఎక్కువ ఆదాయం సమకూరుతుందని గణాం కాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, ట్రైబల్ సబ్ప్లాన్ల అమలు కోసం రూ. 90 వేల కోట్లు కేటాయించిన కేంద్రం దీంట్లో రూ. 74,365 కోట్లను విడుదల చేసింది. వీటిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేసింది రూ.48,124 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో రూ.4,492 కోట్లు విడుదల చేస్తే, ఖర్చు చేసింది రూ.2,551 కోట్లు. ఎస్సీలకు సంబంధం లేని రంగాలకు రూ.1,200 కోట్లు దారి మళ్లించారు. ఈ వర్గా ల వారికి ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు దారీతెన్నూ లేకుండా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఒకానొక ప్రభుత్వ రూపం కారా దు. అది కచ్చితంగా సమాజ రూపం కావాలి అన్న డా. బి.ఆర్. అంబేద్కర్ మాటలు పూర్తిగా నిర్లక్ష్యానికి గుర య్యాయి. ఈ నేపథ్యంలోనే భోపాల్ డిక్లరేషన్లో పాలు పంచుకున్న దళిత, ఆదివాసీ మేధావులు ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రజాస్వామిక సమాజం ఉండాలన్న డా. అంబేద్కర్ మాటలపై విశ్వాసాన్ని ప్రకటించారు. సాటి మనిషి నెత్తురును చెమటగా మార్చి సాధించిన ఉత్ప త్తిలో, ఆదాయంలో అధిక భాగాన్ని మోసపూరిత విధా నాలతో అనుభవిస్తూ, పరాన్నజీవులుగా బతుకుతున్న, విలాసవంత జీవితాలను గడుపుతున్న సహోదర భారతీ యుల హృదయాల్లో సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరుకుంటూ ఆవిష్కరించిన భోపాల్ డిక్లరేషన్ అమలు కోసం.. దళిత, ఆదివాసీ జనుల విముక్తి కోసం నిజాయి తీగా ఉద్యమం నిర్మిద్దాం, మరింత త్యాగం, మరింత ఉద్యమం, మరింత పోరాటం, మరింత ఐక్యతను మనం దరం కలసికట్టుగా ప్రదర్శిద్దాం. (వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు మాల మహాసభ, మొబైల్: 9291365253) -
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు ఓసీలతో కమిటీయా?
ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్ష నేత జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరుపై శనివారం రాష్ట్ర శాసనసభలో ఆగ్రహావేశాలతో కూడిన చర్చ జరిగింది. కిరణ్ సర్కారు తెచ్చిన జీవో 101ను చంద్రబాబు జమానా అమలు చేస్తోందంటూ విపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘‘జీవో 101 ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కమిటీలో సామాజిక కార్యకర్తలను పెడుతున్నామంటున్నారు. ఈ జీవో అన్యాయమైంది. ఓసీలతో కూడిన ఈ కమిటీకి ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏ అధికారం ఉంది? ప్రభుత్వ అధికారులు, ఎస్సీ, ఎస్టీ విభాగాల అధికారులు, బ్యాంకర్లు, ఆ వర్గాలకు చెందినవారుంటే సరిపోతుంది గానీ సామాజిక కార్యకర్తలు ఎందుకు? పాత విధానాన్నే అమలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్సార్సీపీ సభ్యులు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ జవాబు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వర్గాలకు రూ.580 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించామని చెప్పారు. అయితే మంత్రి కిషోర్ బాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన తేవడం, లేనిపోనివి ఆపాదించడంతో పలువురు అభ్యంతరం తెలిపారు. అనంతరం ఏ.సురేష్ మాట్లాడుతూ... ఎస్సీ లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించిన 135, 101 జీవోలను తప్పుబట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ పేరును సామాజిక సాధికారత సంస్థగా మారుస్తామంటూ ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ గొడవ చెలరేగింది. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘‘సామాజిక కార్యకర్తలు దళారులుగా మారి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు ఇచ్చేందుకు దళారులు ఎందుకు? వాళ్లను పెట్టి గబ్బులేపొద్దు. దీనికో ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పగలను. సలగాల సురేష్ అనే వ్యక్తి రుణానికి దరఖాస్తు చేసుకుంటే పైనుంచి కింది దాక అన్ని టిక్కులు (సరైనవేనని) పెట్టి చివర్లో తిరస్కరించారు. కారణమేమిటా? అని ఆరా తీస్తే ఆ వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని తిరస్కరించారు. దయచేసి వారి జీవితాలతో చెలగాటమాడవద్దు. అన్యాయమైన 101 జీవోను రద్దు చేయండి’’ అని డిమాండ్ చేశారు. -
ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు 9లోపు దరఖాస్తులు
ఒంగోలు వన్టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం నవంబర్ 9వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆదేశించారు. విద్యార్థుల వివరాలను www.epass.cgg.gov.in వెబ్సైట్లో లాగినై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నింపాలన్నారు. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించి తమ దరఖాస్తులను ఆన్లైన్లో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, ధ్రువీకరణ పత్రాలను జతపరిచి దరఖాస్తులను మండల విద్యాధికారి కార్యాలయాల్లో అందజేయాలన్నారు. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 10వ తేదీ నాటికి సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని విజయభాస్కర్ కోరారు. ఇవీ.. జాగ్రత్తలు - ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి అన్ని మండల విద్యావనరుల కేంద్రాల్లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు ఇవ్వాలని ఎంఈవోలను డీఈవో ఆదేశించారు - విద్యార్థులు ముందుగా తమ పేరు లేదా తల్లిదండ్రులు లేదా ఉమ్మడిగా బ్యాంకు ఖాతా తెరిచే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి - విద్యార్థులు సంబంధిత మండలంలో మీ సేవా ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, రూ.2 లక్షలకు లోబడి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందే విధంగా హెడ్మాష్టర్లు చర్యలు తీసుకోవాలి - ఈ వివరాలతో పాటు పాఠశాల వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నింపి దరఖాస్తు ప్రింట్ కాపీ, బ్యాంకు కాపీ మొదటి పేజీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్కార్డు, విద్యార్థి ఫొటో జతచేసి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందజేయాలి - ఈ పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత వాటిని ధ్రువీకరిస్తూ ప్రధానోపాధ్యాయులు సంబంధిత హాస్టల్ వార్డెన్కు అందజేయాలి - ప్రధానోపాధ్యాయులు సదరు విద్యార్థి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే మరే ఇతర స్కాలర్షిప్ పొందడం లేదని ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి - అర్హత కలిగిన ఏ విద్యార్థీ ఉపకార వేతనం పొందలేకపోతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. - అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయలు తమ పాఠశాలల్లో చదివే షెడ్యూల్డ్ కూలాల విద్యార్థులతో ఉపకార వేతన దరఖాస్తులను ఆన్లైన్ చేయించే బాధ్యతను తీసుకోవాలని డీఈవో విజయభాస్కర్ ఆదేశించారు. -
ప్రేమ‘కులం’.. ఏదీ ప్రోత్సాహకం
కర్నూలు(అర్బన్): షెడ్యూల్డ్ కులాల స్త్రీ, పరుషులను ఇతర కులస్తులు వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రోత్సాహకం అందిస్తోంది. గతంలో రూ.10వేలు అందిస్తుండగా.. మే 12, 2011 తర్వాత రూ.50వేలకు పెంచారు. అయితే బడ్జెట్ విడుదలలో నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో కులాంతర వివాహంతో ఒక్కటైన జంటలకు నిరాశే ఎదురవుతోంది. గత మూడు సంవత్సరాలుగా అరకొర బడ్జెట్ విడుదల చేస్తుండటంతో ఎదురుచూపులు తప్పని పరిస్థితి నెలకొంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.8.10 లక్షలు విడుదల కాగా.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ ప్రకారం 41 జంటలకు ఈ మొత్తాన్ని అందజేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.80 లక్షలు విడుదల కాగా ఆరు జంటలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం 100 పైగా జంటలు బడ్జెట్ కోసం నిరీక్షిస్తున్నారు. కొందరికి రూ.10వేలు, మరికొందరికి రూ.50వేలు చొప్పున మొత్తం రూ.50లక్షల ప్రోత్సాహకాన్ని అందజేయాల్సి ఉంది. ఈ విషయమై జిల్లా అధికారులు పలుమార్లు నివేదిక పంపగా.. గత జూలైలో రూ.56వేలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. విడుదల చేసిన మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు ఆప్షన్ లేకపోవడంతో అధికారులు కూడా చేతులెత్తేశారు. ఆ మొత్తం తీసుకునే అవకాశం కల్పిస్తే కనీసం ఐదు జంటలకైనా న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మార్చిలో రూ.10.70 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ట్రెజరీల్లో ఫ్రీజింగ్ కారణంగా నయాపైసా కూడా డ్రా చేసుకునే అవకాశం లేకపోయింది. తాజాగా ఆ నిధుల ఊసే కరువైంది. మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న జంటలకు ఇప్పటికీ ప్రోత్సాహకం విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వంపై ఆశతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి స్పందిస్తూ బడ్జెట్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వివిధ పద్దుల కింద ఇప్పుడిప్పుడే నిధులు విడుదలవుతున్న దృష్ట్యా కులాంతర వివాహాలకు సంబంధించి ప్రోత్సాహకం కూడా త్వరలోనే రావచ్చన్నారు. బడ్జెట్కు అనుగుణంగా సీనియారిటీ ప్రకారం ప్రోత్సాహకం పంపిణీ చేస్తామన్నారు. -
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా జీవిస్తోన్న షెడ్యూల్డ్ కులాల సంపూర్ణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఏజెన్సీ షెడ్యూల్డ్ కూలాల ఐక్య సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్ మండల కేం ద్రంలోని స్టార్ ఫంక్షన్ హాలులో సన్మాన సభ నిర్వహిం చారు. మంత్రితో పాటు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఖానాపూర్, బోథ్, ఆ సిఫాబాద్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, రాథోడ్ బాపురావు, కోవ లక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తదితరులను సన్మానించారు. మంత్రి రామన్న మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని అ న్నారు. ఏజెన్సీ చట్టాలతో ఇక్కడ నివాసం ఉంటున్న దళితులు పూర్తిస్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారని వివరించారు. వారి భూములకు పట్టా, పహాణి ప త్రాలు ఇవ్వడం న్యాయమని పేర్కొన్నారు. దీనికి చర్య లు తీసుకుంటామని పేర్కొన్నారు. వేణుగోపాలాచారి మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల సమస్యలు జఠిలం కాకముందే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పక్షాలు అనవసర విమర్శలు మాని ప్రజా సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వానికి కృషి చేయాలని సూచించారు. షెడ్యూల్డ్ కులాల ఐక్య సమితి జిల్లా అధ్యక్షుడు కాంబ్లే నాందేవ్, ప్రధాన కార్యదర్శి మోతె రాజన్న, ఉపాధ్యక్షుడు మోతె నర్సింగరావు, ప్రచార కార్యదర్శి దావుల రమేశ్, అదనపు కార్యదర్శి కాటం రమేశ్, లక్కారం, ఉట్నూర్ సర్పంచులు మర్సకొల తిరుపతి, బొంత ఆశారెడ్డి, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, నాయకులు భరత్ వాగ్మారే, దాసండ్ల ప్రభాకర్ పాల్గొన్నారు. కాగా, మండల పరిషత్ కార్యలయం ఆధ్వర్యంలోనూ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. -
ఎస్సీ, ఎస్టీల లెక్క తేలింది
తెలంగాణలో 59 ఎస్సీ, 32 ఎస్టీ కులాలు మన్నెదొర, తోటి కులం కూడా ఉన్నట్లు గుర్తింపు విభజన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం హన్మకొండ, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాల లెక్క తేల్చారు. ఎస్సీ, ఎస్టీ వాస్తవ కులాలు, వాటి ఉపకులాలెన్ని.. ఏ ప్రాంతంలో ఎక్కువ.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కులాలు..వీటన్నిటిపై స్పష్టంగా నివేదికల్లో పొందుపర్చారు. తెలంగాణ వ్యాప్తంగా 59 షెడ్యూల్ కులాలుం డగా కొన్నింటికి ఉపకులాలు కూడా ఉన్నాయి. 32 షెడ్యూల్ తెగలకు గాను ఉప కులాలు మరిన్ని ఉన్నా యి. ఎస్టీలకు సంబంధించి రెండు కులాలు మాత్రం కొన్ని జిల్లాల్లోనే ఉన్నట్లు జాబితాల్లో పేర్కొన్నారు. అయితే వీరి సంఖ్యను తేల్చలేదు. ఎస్టీ కులాల్లో ఎక్కువగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో తోటి అనే ఎస్టీ కులం ఉనికి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మన్నదొర కులం కూడా ఈ జిల్లాల్లోనే ఉన్నట్లు గుర్తిం చారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోనే ఎస్టీలు, వాటి ఉప కులాలు నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్ర కంటే తెలంగాణ ప్రాంతంలోనే ఎస్సీ, ఎస్టీ కులాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు.ఈ మేరకు రెండు రోజుల క్రితం గవర్నర్ నుంచి ఆయా జిల్లాల అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఉప కులాలూ ఎక్కువే: తెలంగాణలోని పది జిల్లాల్లో 59 షెడ్యూల్ కులాలుండగా వాటికి ఉప కులాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఎస్సీల జాబితాలోని చమర్ కులం పరిధిలో మోచి, మూచి, చమర్-రావిదాస్, చమర్-రొహిదాస్ కులాలున్నాయి. డక్కలకు ఉపకులంగా డక్కలవార్, దోమ్కు దోంబేరా, పైడీ, పానో, ఎల్లమల్వార్కు ఎల్లమ్మలవాండ్లు, ఘాసీ కులానికి హద్దీ, రేలీ, చెంచడి ఉప కులాలున్నాయి. కొలుపువాళ్ల కులానికి పంబాడా, పంబండా, పంబాల కులాలు, మాదాసి కురువ, మాదారి కురువగా గుర్తించారు. మాదిగ దాసుకు మస్తీం, మాల కులానికి మాల అయ్యవారు మాలా సాలీ, నేతాని కులాలు ఉప కులాలుగా ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఎస్టీ కులాల్లోనూ ఉప కులాలు అధికంగానే ఉన్నాయని జాబితాలో లెక్కగట్టారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో గోండు కులం ప్రత్యేకంగా నమోదై ఉన్నట్లు నివేదించారు. నాయక్ కులం కూడా కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మరో ప్రధాన కులం లంబాడాను కూడా ఉప కులంగానే ఉందన్నారు. ప్రధాన కులం సుగాలీలకు లంబాడీలు, బంజారాలను ఉప కులాలుగా చూపించారు. గదబ కులానికి ఉప కులంగా బోడో గదబ, గూడోబ్ గదబ, కల్ల్యాయి గదబ, పరంగి గదబ, కత్తెర గదబ, కాపు గదబ కులాలు ఉప కులంగా నమోదయ్యాయి. అదేవిధంగా గోండుకు నాయక్పోడ్, రాజ్గొండు, కోయితూర్ కులాలున్నాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతాలకే పరిమితమైన కొన్ని కులాలు ఇప్పుడు అంతటా వ్యాపించాయని పేర్కొన్నారు. వాటిలో కొండ కులం ఉన్నట్లు లెక్కల్లో చెప్పారు. -
సమ న్యాయం
బెంగళూరు : షెడ్యూలు కులాలు, తరగతుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన మేరకే నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపినట్లు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని కొట్టిపారేశారు. పశుసంవర్ధకశాఖకు నూతనంగా కేటాయించిన సంచార పశు చికిత్స వాహనాలను క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని చట్టం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక రెండోదన్నారు. ఈ చట్టం వచ్చే ఆర్థిక ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. 2013-14 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం గత ప్రభుత్వం రూ.8,600 కోట్లు కేటాయించిందన్నారు. అయితే నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.15,300 కోట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈ నిధులు 80 శాతం ఎక్కువని వివరించారు. కాగా, ఈ మొత్తం నిధుల్లో ఎస్సీలకు 17.95 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కేటాయిస్తామన్నారు. పశువైద్యుల నియామకం : మంత్రి జయచంద్ర లోక్సభ ఎన్నికల తర్వాత పశువైద్యుల నియామక ప్రక్రియను చేపడతామని కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధకశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. శాఖలో 911 పోస్టులు ఖాళీ ఉన్నాయని, వీటిలో 250 స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దశల వారిగా మిగిలిన వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. దాదాపు 200 పశు చికిత్స సంచార వాహనాలను పశుసంవర్ధక శాఖకు అందించనున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతగా 35 వాహనాలను అందించినట్లు తెలిపారు. -
చీకట్లోనే..
ఉట్నూర్/కాసిపేట, న్యూస్లైన్ : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని సంకల్పించింది. 0 నుంచి 50 యూనిట్ల లోపు కరెం టు వినియోగించుకున్న కుటుంబాలకు ఎస్టీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద బిల్లు మాఫీ చేస్తారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ, ఏజెన్సీ అధికారులకు అప్పగించిం ది. వీరు 20,260 ఎస్సీ, 17,734 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని రచ్చబండ సందర్భంగా తెలిపారు. రూ.18.20 కోట్లు మాఫీ 0-50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీలను సెప్టెంబర్ నుంచే అధికారులు గుర్తిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంటే ఆరునెలలు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న కుటుంబాల వారు చెల్లించిన బిల్లులను తిరిగి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏ రూపకంగా చెల్లిస్తుందనేది ప్రభుత్వం ప్రకటించనుంది. దీని ప్రకారం జిల్లాలో దాదాపు రూ.18.20 కోట్ల బిల్లులు ప్రభుత్వం మాఫీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మండలాల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలు వారి కుల ధ్రువీకరణ పత్రాలు విద్యుత్ కార్యాలయాల్లో సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు ప్రచారం కల్పించక పోవడంతో కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం లేదు. పూర్తిస్థాయిలో బిల్లు చెల్లిస్తున్నారు. కొందరు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీ, ఎస్టీ గూడాలకు విద్యుత్ సౌకర్యం నిలిపివేస్తున్నారు. వారం రోజులుగా చీకట్లోనే.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ వర్తించే కాసిపేట మండలం ఇప్పలగూడ, రేగులగూడ గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రెండు గ్రామాల్లో 33 కుటుంబాలకు చెందిన 180 మంది బిక్కుబిక్కమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రయిందంటే అందరూ ఒకటే చోట చేరుతున్నారు. దీపాల వెలుతురులో వంటలు చేసుకుని భోజనం చేస్తున్నారు. చంటి పిల్లలను వేసుకుని చీకట్లోనే నిద్రిస్తున్నారు. విషపురుగులు, క్రూరమృ గాలు రాకుండా మంటలు వేసుకుంటున్నారు. భయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అసలే తూర్పు ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దాని భారిన పడితే అందరూ మృత్యువాత పడే అవకాశం ఉంది. జైపూర్ పవర్ ప్లాంటు కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా ఏజెన్సీలో ఉండే గ్రామాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రూ. వేలల్లో బిల్లులు అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా బిల్లులు చెల్లించలేదని కరెంటు కట్ చేశారు. ఇక మాకు 30 యూనిట్లు కూడా కరెంటు వినియోగం కాదు. మేమందరం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు అర్హులమే. 50 యూనిట్లలోనే అందరం కరెంటు వినియోగించుకుంటాం. బిల్లులు మాత్రం రూ.వేలల్లో వస్తున్నాయి. విద్యుత్ అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. మేము కూలీకి వెళ్లేచ్చే వరకు బిల్లు మాత్రం తలుపులకు ఉంటుంది. తొమ్మిది నెలల నుంచి బిల్లుకట్టని మాట వాస్తవామే సబ్ప్లాన్లో మాఫీ చేయడం తరువాత ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు బిల్లులు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు యాభై యునిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం పూర్తిస్థాయిలో అమలు కాకముందే ఆయా గూడాలకు విద్యుత్ నిలిపి వెయ్యడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైన అధికారులు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని.. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని గిరిజనులు పేర్కొంటున్నారు. -
తెలంగాణ రాష్ర్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి
మిర్యాలగూడ టౌన్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితుడినే కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు ఇరుగు మధు అన్నారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 28న జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి హాజరవుతున్నారని చెప్పారు. జనవరి 30న నల్లగొండలో 10వేల మందితో జిల్లా స్థాయి ఎస్సీ సెల్ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశానికి ఎస్సీ ప్రతినిధులు, సర్పంచ్లు విధిగా హాజరుకావాలని కోరారు. 2014లో జరగనున్న ఎన్నికల్లో జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దైద నాగయ్య, జిల్లా కన్వీనర్ సీహెచ్ గోపాల్, పెన్పహాడ్ మండల సెల్ అధ్యక్షుడు వెంకన్న, నాయకులు నామ అరుణ్, కొడిరెక్క ఇళయరాజ, వివిధ సంఘాల నాయకులు మందుల కిరణ్, జానీ, తులసి, సతీష్, శివప్రసాద్, అంజి, అశోక్ పాల్గొన్నారు. సమావేశాన్ని జయప్రదం చేయాలి హుజూర్నగర్ : ఈనెల 28న నల్లగొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పెరక వెం కటేశ్వర్లు కోరారు. ఆదివారం స్థానిక ఇం దిరాభవన్లో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు కస్తాల శ్రావణ్కుమార్, నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, కొండయ్య, విజయభాస్కర్, జయరాజు, మట్టేష్, సత్యం, గోపాల్, రమేష్, వెంకటేశ్, వీరబాబు, రామకృష్ణ పాల్గొన్నారు. -
రేపటినుంచే దసరా ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ, న్యూస్లైన్ : ఆదిపరాశక్తి అయిన కనకదుర్గమ్మకు కళలంటే అమితమైన ఇష్టమని పురాణేతిహాసాలు తెలుపుతున్నాయి. ఇక ఆదిశంకరుడైన పరమేశ్వరుని నటరాజుగా కళాకారులందరూ కొలుస్తారు. అమ్మవారి సాన్నిద్ధ్యంలో తమ కళలను ప్రదర్శించడం అంటే కళాకారులు అదృష్టంగా భావిస్తారు. అటువంటి కళలపట్ల, కళాకారులపట్ల శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం అధికారులు చిన్నచూపు చూస్తున్నారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా దేవస్థానంలో ఇదే తంతు కొనసాగుతుంది. రేపటినుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానుండగా ప్రదర్శన కోసం దరఖాస్తు చేసుకున్న కళాకారులకు ఇంత వరకు సమాచారం అందించలేదు. మరో ప్రాంతంలో కార్యక్రమాలను ఒప్పుకోవాలో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో కళాకారులున్నారు. దసరా మహోత్సవాల్లో తొమ్మిది రోజులపాటు వివిధ కళారూపాలను ప్రదర్శింపజేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. భక్తులను అలరింపజేసేందుకు సంప్రదాయ నృత్యాలు, భక్తి రంజని, పౌరాణిక నాటిక, నాటక ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు, జానపద కళారూపాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చేందుకు గానూ కళాకారులనుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. గత నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. గడువు ముగిసే నాటికి దాదాపు 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆయా దరఖాస్తులను ప్రాథమిక పరిశీలన చేసి ఎంపిక చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆ బాధ్యతను చేపట్టిన సబ్ కలెక్టర్ 2వ తేదీన తొమ్మిది మందితో సెలెక్షన్ కమిటీ జాబితాను విడుదల చేసినట్లు తెలిసింది. సెలక్షన్ కమిటీ జాబితా ! సేకరించిన సమాచారం మేరకు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తులను ఎంపిక చేసేందుకు ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, కూచిపూడి సిద్ధేంధ్ర కళాపీఠం అధ్యక్షులు పసుమర్తి కేశవప్రసాద్, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు, దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్, పర్యాటక శాఖకు చెందిన రామలక్ష్మణ్, శంకరరావులతోపాటు దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులను నియమించినట్లు సమాచారం. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎనౌన్స్మెంట్ ఇచ్చేందుకు వచ్చిన ఒక వ్యక్తి మూడేళ్లుగా సెలక్షన్ కమిటీలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది కమిటీలోకూడా అతనికిస్థానం కల్పించడం విమర్శలకు దారితీస్తోంది. త్రిశంకు స్వర్గంలో కళాకారులు : అమ్మవారి సన్నిధిలో ప్రదర్శనలు ఇవ్వటం అదృష్టంగా భావించే కళాకారులు ఆ అవకాశం కోసం ప్రతి ఏటా దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది ఉత్సవాలు 5వతేదీనుంచి ప్రారంభం కానుండగా ఇంతవరకు వారి దరఖాస్తుల విషయమై ఎటువంటి సమాచారం లేకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ వంటి దూరప్రాంతాలనుంచి వచ్చే కళాకారులకు వారం రోజులు ముందుగా సమాచారం ఉంటే వారికి రైల్వే కన్సెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కొన్ని కార్యక్రమాలకు కావాల్సిన పక్క వాయిద్య కళాకారులు దొరికే అవకాశంకూడా లేకుండా పోతుంది. ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కళాకారులకు పలు చోట్లనుంచి అవకాశాలొస్తుంటాయి. అమ్మవారి దేవస్థానం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఒప్పుకోవాలో లేదో అర్ధంకాక సతమతమవుతున్నారు. నగరంలోని శ్రీధర్మ పరిషత్ వంటి ప్రైవేట్ సంస్థ ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాల వివరాలతో బుక్లెట్ను విడుదల చేసింది. కావాల్సినంత సిబ్బంది ఉండీ సకాలంలో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేని దుస్థితిలో దేవస్థానం అధికారులు ఉండటం విశేషం. కాగా ఎంపికయిన కళాకారులు తమ ప్రదర్శనలిచ్చేందుకు వేదిక వద్దకు చేరుకోవాలన్నా కష్టంగానే ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. కళావేదిక మార్పు : కొన్ని సంవత్సరాలుగా మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక ప్రదర్శనల వేదికను ఈ ఏడాది మండపం పక్కన మెట్ల మార్గం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలోకి మార్చారు. అక్కడ రేకుల షెడ్ నిర్మించి వేదికను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులనుంచే నేల చదును చేయటం ప్రారంభించారు. గురువారం వరకుకూడా షెడ్ నిర్మాణపనులు ప్రారంభం కాలేదు. రేకుల షెడ్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వలన ప్రదర్శనల సమయంలో వర్షం వస్తే అది రేకులపైబడి శబ్ధం వస్తుంది. దీంతో కళాకారుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అంతే కాకుండా పాత రేకులు వాడుతుండటం వలన కళా ప్రాంగణంలో వర్షపు నీళ్లు పడేఅవకాశం ఉంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన మల్లికార్జున మహా మండపంలో ఈ ఏడాది లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు. అసలు ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారా లేదా అన్నదికూడా ప్రశ్నార్థకంగా మారింది.