Share Market
-
ఇన్వెస్టర్లు ఇంతింతై.. నేడు 11 కోట్ల మంది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.ఎన్ఎస్ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.మార్కెట్లో 20 శాతం కుటుంబాలు 2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.యువ ఇన్వెస్టర్లుమార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. -
ఆప్షన్స్ ట్రేడింగ్లో సక్సెస్ కావాలంటే....
ఆప్షన్స్ ట్రేడింగ్ (options trading)లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడానికి ఎంత అవకాశం ఉందో... ఉన్న డబ్బులు ఊడ్చిపెట్టుకుని పోవడానికీ అంతే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎట్ ది మనీ (ఏటీఎం), ఇన్ ది మనీ (ఐటీఎం), అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం) లది ప్రధాన పాత్ర అని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం. అలాగే ఏటీఎం కాల్స్, పుట్స్ ఎలాంటి ప్రయోజనం కలగజేస్తాయో కూడా చర్చించుకున్నాం.ఇప్పుడు ఐటీఎం, ఓటీఎం ల గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో స్మార్ట్ ట్రేడర్లు అనుసరించే పద్ధతి ఐటీఎం. మళ్ళీ ఎస్బీఐ షేరు నే ఉదాహరణగా తీసుకుందాం.ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 దగ్గర ఉంది. స్ట్రైక్ ప్రైస్ 10 రూపాయల తేడాలో 730, 740, 750... ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇపుడు 730 రూపాయల కాల్ తీసుకుంటే.. అది ఐటీఎం కాల్ అవుతుంది. అంటే అండర్ లయింగ్ అసెట్ (ఈక్విటీ షేరు ధర) కంటే షేరు ధర తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఐటీఎం కాల్ గా వ్యవహరిస్తారు. ఇంకా తక్కువ ధరలు ఉండే 720, 710, 700 రూపాయల కాల్స్ కొనుగోలు చేస్తే అవి డీప్ ఐటీఎం కాల్స్ అవుతాయి. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. ధరల్లో ఊగిసలాటలు కూడా ఎక్కువే ఉంటాయి. అంటే పెరగడం ఎంత వేగంగా పెరుగుతాయో పడటమూ అంతే వేగంగా ఉంటాయి. కాబట్టి సగటు ట్రేడరు కొంచెం ఎక్కువ రిస్క్ భరించాల్సి ఉంటుంది.ఇప్పుడు ఎస్బీఐ షేరు ధరను దృష్టిలో పెట్టుకుని 730 రూపాయల కాల్ సెలెక్ట్ చేసుకుందాం. దీని ధర ప్రస్తుతం రూ. 28 వద్ద ఉంది. షేరు పెరుగుతున్న కొద్దీ ఇది పెరిగే వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే షేరు 730 దిగువకు రానంత సేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ కాల్ ధర తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ జోరు తగ్గుతుంది. అదెలాగంటే... షేరు ధర 730 నుంచి 780 కి వెళ్ళేటప్పటికి మీరు కొన్న కాల్ 28 రూపాయల నుంచి 70 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షేరు ధర 750 కి పడినప్పుడు 30 -35 కి వచ్చేస్తుంది. మళ్ళీ షేరు పెరగడం మొదలై 780 కి వెళ్లినా ఈసారి కాల్ ధర 60 దాటకపోవచ్చు. అంటే మొదట పెరిగినంత వేగంగా రెండోసారి పెరగదన్న మాట. దీనికి కారణం ఆప్షన్ గ్రీక్స్. ఇవే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పుట్స్ విషయానికొస్తే... కాల్స్ కి ఇది రివర్స్. షేరు ధర 744 దగ్గర ఉంది కాబట్టి మనం 760 పుట్ కొంటే.... అది ఎంత పడితే పుట్ ధర అంత పెరుగుతూ వెళ్తుంది. ట్రేడర్లు సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే... ఐటీఎం కాల్స్, పుట్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయన్నది నిర్వివాదం.ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!ఇక ఓటీఎంల విషయానికొద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో అత్యంత ప్రమాదకరమైనవే ఈ ఓటీఎం కాల్స్, పుట్స్. కానీ నూటికి 90 మంది ఈ ఓటీఎం ల్లోనే ట్రేడింగ్ చేస్తారు. సంపాదించేది తక్కువే అయినా.. పోగొట్టుకునేది మాత్రం వీటిలో ఎక్కువే. మరి డబ్బులు పోతాయి అని తెల్సినా... ఈ ఓటీఎంల్లోనే ఎందుకు ట్రేడింగ్ చేస్తారంటే దానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు.1. ప్రీమియం రేట్లు చాలా చౌకగా ఉండటం. 2. తక్కువ పెట్టుబడి తో భారీ లాభాలు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం.ఎస్బీఐ షేరు 744 దగ్గర ఉంది కదా... చాలామంది 760, 770, 780 కాల్స్ కొంటారు. ఇంకా చెప్పాలంటే 800 కాల్స్ కూడా తీసుకుంటారు. వీటి రేట్లు వరుసగా 11, 8, 6, 3 స్థాయిలో ఉన్నాయి. అంటే 760 కాల్ ఒక లాట్ కొనడానికి 8250 పెట్టుబడి అవసరమైతే... 770 కాల్ కు 6000, 780 కాల్ కు 4500, 800 కాల్ కు 2250 పెట్టుబడి సరిపోతుంది. అంటే కేవలం ఓ 3000 నుంచి 10000 చేతిలో ఉన్న వ్యక్తి కూడా చాలా సులువుగా ఎస్బీఐ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేయగలడు. రిటైల్ ట్రేడర్లని ఆకర్షించేవి ఈ రేట్లే. 6 రూపాయలు పెట్టి 780 కాల్ కొన్న వ్యక్తికి గిట్టుబాటు కావాలంటే... షేర్ ధర 780 దాటి పెరగాలి. అది కూడా కంటిన్యూ గా పెరుగుతూ రావాలి. ఒకసారి పెరిగి, ఇంకోసారి పడి... ఇలా ముందుకెళ్తే కుదరదు. వీటిలో ఉన్న దుర్లక్షణం ఏమిటంటే.... పెరిగినప్పుడు చాలా స్వల్పంగా పెరిగితే.. షేరు ధర పడేటప్పుడు చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. కాంట్రాక్టు ఎక్సపైరీ టైం కి మొత్తం పెట్టుబడి కాస్తా సున్నా అయిపోతుంది. కానీ సగటు ట్రేడరు మాత్రం మళ్ళీ పెరగొచ్చులే... అని చివరి దాకా ఎదురుచూస్తూనే ఉంటాడు. చివరకు నష్టంతోనే బయటకొస్తాడు. మార్కెట్ ను తిట్టుకుంటాడు.. మళ్ళీ పోగుట్టుకున్న డబ్బులు సంపాదించేయాలన్న ఆతృతతో విఫల యత్నాలు చేస్తూనే ఉంటాడు.ఇప్పుడు అర్ధం అయింది కదా... ఆప్షన్స్ ట్రేడింగ్ చిన్న ట్రేడర్లకు ఎంత ప్రమాదకరమో... ఆ తప్పులు చేయకూడదంటే.... ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాలి. తగిన క్యాపిటల్ చేతిలో ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చే న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. ప్రత్యేకించి ఒక షేరు కు సంబంధించి.. ఆప్షన్స్ కొంటున్నప్పుడు టైం కి ప్రాధాన్యమివ్వాలి.ఆప్షన్ గ్రీక్స్ అర్ధం చేసుకోవాలి. ఆప్షన్స్ చైన్ అనలైజ్ చేయడం రావాలి. టెక్నికల్ తెలిసి ఉండాలి. ఇవేవీ తెలియకుండా... చేతిలో కాసిన్ని డబ్బులు పెట్టుకుని... లక్షలు, కోట్లు సంపాదించేయొచ్చు అని వేషాలేస్తే... ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయం. అంచేత... పొరపాట్లకు తావివ్వక ముందుకు సాగే ట్రేడర్లు మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారనేది తోసిపుచ్చలేని వాస్తవం.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
17న హైరింగ్ కంపెనీ ఐపీఓ.. ఒక్కో షేరు రూ.117–124
లీడర్షిప్ హైరింగ్ సేవల్లో ఉన్న ఈఎంఏ పార్ట్నర్స్ (EMA Partners)ఐపీఓ (IPO) జనవరి 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.117–124 గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.76.01 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 53.34 లక్షల తాజా ఈక్విటీలను జారీ చేయనుంది.ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు క్రిష్ణన్ సుదర్శన్, సుబ్రమణియన్లు 7.96 లక్షల షేర్లను విక్రయించనున్నారు. క్యూఐబీలకు 50%, ఎన్ఐఐలకు 15%, రిటైల్ ఇన్వెస్టర్లకు 35% వాటా కేటాయింపు జరిగింది. ఐపీఓ పూర్తయిన తర్వాత ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లో షేర్లు లిస్ట్ కానున్నాయి.సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, ఐటీ విభాగపు మౌలిక అభివృద్ధికి, నాయకత్వ బృందాన్ని పెంచుకునేందుకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా ఇండోరియంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రిజిస్ట్రార్గా బిగ్షేర్ సర్వీసెస్ వ్యవహరిస్తున్నాయి.13న లక్ష్మీ డెంటల్ ఐపీఓఆర్బిమెడ్ ప్రమోట్ చేస్తున్న లక్ష్మీ డెంటల్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.314 కోట్లకు పైగా అందుకుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్,, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, కోటక్ ఎంఎఫ్, మిరే అసెట్ ఎంఎఫ్, టాటా ఎంఎఫ్, బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నోమురా, గోల్డ్మన్ సాక్స్, అల్ మెహ్వార్ కమర్షియల్స్ ఇన్వెస్ట్మెంట్స్, నాటిక్సిస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ తదితర 31 కంపెనీలు వీటిలో ఉన్నాయి.యాంకర్ ఇన్వెస్టర్లకు లక్ష్మీ డెంటల్ ఒక్కొక్కటి రూ.428 చొప్పున 73.39 లక్షల షేర్లు కేటాయించింది. కంపెనీ ఐపీవో జనవరి 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.407–428గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.138 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. రూ.560 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. -
Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలున్నాయి. అందులో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఒకటి. పరోక్షంగా పెట్టుబడి పెట్టడం రెండోది. అంటే ఈక్విటీ మార్కెట్లో రిస్క్ చేయలేని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవడమన్న మాట.అదే ట్రేడింగ్ విషయానికొస్తే... మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఈక్విటీలు 2. ఫ్యూచర్స్ ట్రేడింగ్3. ఆప్షన్స్ ట్రేడింగ్ ఇందులో మొదటిదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.సాధారణంగా మన దగ్గర డబ్బులున్నపుడు వాటిని బ్యాంకుల్లోనో, పోస్ట్ ఆఫీసుల్లోనో దాచుకుంటాం. ఈమధ్య స్టాక్ మార్కెట్ కల్చర్ బాగా పెరిగింది. అయితే చాలామంది ఇన్స్టంట్ లాభాల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాళ్ళు ట్రేడింగ్ వైపు చూస్తున్నారే తప్ప భవిష్యత్ భరోసా గురించి ఆలోచించడం లేదు. ట్రేడింగ్ వైపు వెళ్లే వ్యక్తుల్లో నూటికి 95 మంది నష్టాల్లో కూరుకుపోయి లబోదిబో మంటున్నారు. అలాకాకుండా దీర్ఘకాలిక దృక్పథం మార్కెట్లోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి ప్రయోజనాలే దక్కుతాయి.ఇందులో కూడా మూడు రకాల మార్గాలు అనుసరించవచ్చు. 1. స్వల్ప కాలిక పెట్టుబడి2. మధ్య కాలిక పెట్టుబడి 3. దీర్ఘకాలిక పెట్టుబడిపెట్టుబడులు పెట్టడానికి బాండ్లు, డిబెంచర్లు, రుణ పత్రాలు వంటి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ మనం కేవలం స్టాక్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే పై మూడింటి గురించి వివరంగా చర్చించుకుందాం.స్వల్ప కాలిక పెట్టుబడిసాధారణంగా మూడు నెలల వ్యవధి నుంచి 12 నెలల వ్యవధితో చేసే పెట్టుబడుల్ని స్వల్ప కాలిక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వెంటనే వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటిని మార్కెట్లోకి తరలిస్తే... మన అవసరానికి అనుగుణంగా మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకుని స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.ఇలాంటి సందర్భాల్లో మూడు పరిణామాలు చోటు చేసుకోవచ్చు. 1. మన పెట్టుబడి అమాంతం పెరిగిపోయి (మనం ఎంచుకునే షేర్లను బట్టి) మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. మనం పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించి వచ్చే సానుకూల వార్తలు ఇందుకు కారణమవుతాయి. ఉదా: సదరు కంపెనీ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పెంచడం, ప్రభుత్వపరంగా సంబంధిత రంగానికి అనుకూలంగా ప్రకటనలు రావడం, ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటం.... వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.2. మన పెట్టుబడి నష్టాల్లోకి జారిపోవడం. ఒక ఆరు నెలల పాటు మనకు డబ్బులతో పని లేదని వాటిని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోపు వివిధ ప్రతికూల అంశాలు మన పెట్టుబడిని హరించి వేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వాలు పడిపోవడం, ఆర్ధిక అనిశ్చిత పరిణామాలు, సంస్కరణలు పక్కదారి పట్టడం... వంటి అంశాలు మార్కెట్లను పడదోస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు షేర్లు కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి.మీరు పెట్టుకున్న కాల వ్యవధి దగ్గర పడుతూ ఉంటుంది. షేర్లు మాత్రం కోలుకోవు.అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు జీవుడా... అనుకుంటూ ఆ కాస్త సొమ్ముతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన అవసరాలు తీరడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్జించడం మాట పక్కన పెట్టి అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందన్న మాట.3. పెట్టిన పెట్టుబడి లో పెద్దగా మార్పులు లేకపోవడం. ఆరు నెలలు గడిచినా మనం కొన్న షేర్లు అనుకున్నట్లుగా పెరగకపోవడమో, లేదంటే స్వల్ప నష్టాల్లో ఉండటమే జరుగుతుంది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.మధ్య కాలిక పెట్టుబడి ఇది సాధారణంగా ఏడాది వ్యవధి మొదలుకొని 5 ఏళ్ల వరకు కాలవ్యవధి తో చేసే పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. స్వల్ప కాలిక పెట్టుబడులతో పోలిస్తే ఇవి ఒకింత మెరుగైన ప్రతిఫలాన్నే ఇస్తాయి. వ్యవధి ఎక్కువ ఉంటుంది కాబట్టి... ఒక ఏడాది రెండేళ్లపాటు మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ తర్వాత షేర్లు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.అదే సమయంలో మన దగ్గర సొమ్ములున్నప్పుడల్లా మనం కొన్న షేర్లనో, వేరే షేర్లనో కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నందువల్ల రాబడి పెరగడానికి కూడా కచ్చితంగా వీలుంటుంది. మనమంతా మిడిల్ క్లాస్ మనుషులం అవడం వల్ల మన అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అందువాళ్ళ మధ్య కాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ రిస్క్ తోనే గణనీయ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.దీర్ఘ కాలిక పెట్టుబడి ఇది అన్ని విధాలా శ్రేయోదాయకం. అదెలాగంటే...1. మార్కెట్లు ఏళ్ల తరబడి పడిపోతూ ఉండవు. పడ్డ మార్కెట్ పెరగాల్సిందే. 2. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. 3. వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఒకట్రెండు నష్టాల్లో ఉన్నా... మిగతావి లాభాల్లో ఉండటం వల్ల మన పెట్టుబడి దెబ్బతినదు.4 . ఒకేసారి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేయాల్సిన అవసరం ఉండదు. 5. మన షేర్లపై సదరు కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి. ఇదో అదనపు ప్రయోజనం. 6. ఆయా కంపెనీలు షేర్లను విభజించడం, బోనస్ షేర్లు ఇవ్వడం వల్ల మన పోర్ట్ ఫోలియో లో షేర్ల సంఖ్యా పెరుగుతుంది. 7. మన అవసరాలు దీర్ఘకాలానికి ఉంటాయి కాబట్టి... భవిష్యత్లో అవసరమైనప్పుడో, లేదంటే ఆ షేరు బాగా పెరిగిందని భావించినప్పుడో మనం కొన్ని ప్రాఫిట్స్ ను వెనక్కి తీసుకోవచ్చు లేదా వేరే పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. 8. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇత్యాది సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఉపయోగపడతాయి.సంప్రదాయ డిపాజిట్లు పొదుపులతో పోలిస్తే... స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి అధిక రాబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయం అర్ధమయింది కదూ...అయితే మీరు తీసుకునే నిర్ణయమే... మీ భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తుంది. మీ అవసరాలు స్వల్ప కాలికమా... మధ్య కాలికమా... దీర్ఘ కాలికమా... అన్నది మీరే నిర్ణయించుకోండి. తదనుగుణమా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేయండి. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను.ఎప్పటికప్పుడు మీ పోర్టు ఫోలియో మీద కన్నేసి.. తగిన లాభాలు రాగానే బయటపడటం అనేదే స్వల్ప, మధ్య కాలాలకు ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘ కాలిక దృక్పథం తో కొంటారు కాబట్టి... లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పటికీ మంచి ఫలితాలే ఇస్తాయి. అయితే దీర్ఘ కాలానికి కొంటున్నాం కదా అని ఎవరో చెప్పారనో... తక్కువకు దొరుకుతున్నాయనో.. వ్యవధి ఎక్కువ ఉంటుంది కదా.. కచ్చితంగా పెరక్కపోవులే అనో... పనికిమాలిన పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం పోకండి.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
కొత్త ఐపీవో.. క్వాడ్రాంట్ ఫ్యూచర్
రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) ఈ నెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
ఐపీవో బాటలో రెండు కంపెనీలు
వినియోగించిన ల్యాప్టాప్, డెస్క్టాప్లను పునరుద్ధరించే జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండుతో ల్యాప్టాప్, డెస్క్టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్ఫోన్ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఎలిగంజ్ ఇంటీరియర్స్ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్ వద్ద ఎలిగంజ్ ఇంటీరియర్స్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్ఎస్ఈ ఎమర్జ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తామని పేర్కొంది.సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ మేనేజర్గా, బిగ్షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్ ఇంటీరియర్స్ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్ ఫిట్ అవుట్ సేవలు అందిస్తోంది. -
షేర్లు కొంటా అంటున్న రాజేష్
-
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్ సెషన్లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు. -
రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పటికీ చాలా మంది జంకుతారు. ఎందుకంటే ఇందులో లాభాలతో పాటు నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కానీ ఓ ఇంజినీరు ఈక్విటీ మార్కెట్లో తన అద్భుతమైన ప్రయాణంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూపించారు.పంజాబ్లోని లుధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ 1986లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ సందర్భంగా రూ.1,000 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ విభజనలు, బోనస్ ఇష్యూల తర్వాత 2024 జూన్ 7న ఆయన పెట్టుబడి విలువ రూ.1.36 కోట్లు అయింది. అప్పట్లో రూ.10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు.కుల్దీప్ సింగ్ ప్రస్తుతం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన 7,580 షేర్లను కలిగి ఉండగా, 2024 జూన్ 7న ఒక్కో షేరు విలువ రూ.1,800 వద్ద ముగిసింది. 2017లో పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్గా పదవీ విరమణ చేసిన ఆయన పోర్ట్ఫోలియో విలువ ప్రస్తుతం రూ.4 కోట్లుగా ఉంది. -
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్షిప్కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్షా
షేర్ మార్కెట్పై హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత షేర్లు అమాంతం దూసుకెళ్తాయని (షూట్ అప్) జోస్యం చెప్పారు. ఆలోపే షేర్లు కొనేసుకోవాలని సూచించారు.అయితే ఇటీవలి మార్కెట్ పతనం గురించి హోంమంత్రి పెద్దగా ఆందోళన చెందడం లేదు. గత ఆరు నెలల వ్యవధిలో, బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 12 శాతం పెరిగింది. అలాగే ఏడాది వ్యవధిలో దాదాపు 20 శాతం పెరిగింది. ‘‘గతంలో కూడా మార్కెట్ చాలా సార్లు పడిపోయింది. కాబట్టి మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలతో ముడిపెట్టడం సరి కాదు. మార్కెట్ల పతనానికి బహుశా కొన్ని పుకార్లు కారణం కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం.. జూన్ 4 లోపు కొనండి (షేర్లు). తర్వాత మార్కెట్ షూట్-అప్ కానుంది’’ అని అమిత్షా వ్యాఖ్యానించారు.భారత స్టాక్ మార్కెట్ల పయనంపై తాను ఎందుకు ఆశాజనకంగా ఉన్నది అమిత్షా వివరించారు. “స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు, మార్కెట్లు బాగానే ఉంటాయి. మోదీజీ మళ్లీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. కాబట్టి, ఇది నా అంచనా" అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు మూడు దశలు ఎలా సాగాయని అడిగినప్పుడు తమ పార్టీ 190 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మొదటి మూడు దశల్లో 283 స్థానాలకు పోలింగ్ జరగింది. -
నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) కంపెనీ షేర్లు గత ఐదు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా సంస్థ షేర్స్ రెండు శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణం ఏంటి, మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి డిసెంబర్ 22 సాయంత్రం మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) రద్దు చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించిన తర్వాత సంస్థ షేర్లు పతనమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ప్రకటన ముందు వరకు దూసుకెళ్లిన షేర్లు ఒక్కసారిగా పడిపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. మూడు రోజుల వరుస సెలవుల తర్వాత డిసెంబర్ 26న(మంగళవారం) కంపెనీ ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాక్ రూ. 1,534 స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తేరుకుని 1.08 శాతం నష్టంతో రూ. 1546 వద్ద నిలిచింది. ఇదీ చదవండి: అప్పులపాలు.. యంత్రాలన్నీ తుప్పుపట్టి పనికిరాని దశలో.. టాటా రాకతో అంతా తారుమారు! ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో సంస్థ చేసుకున్న 1.5 బిలియన్ డాలర్లు లేదా సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఈ కారణంగానే కంపెనీ షేర్స్ ప్రస్తుతం తగ్గు ముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. -
కొత్త విభాగంలో అడుగెట్టిన ఫోన్పే - వివరాలు
బెంగళూరు: ఫిన్టెక్ సంస్థ ఫోన్పే తాజాగా స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. షేర్డాట్మార్కెట్ పేరిట ప్రత్యేక ప్లాట్ఫాంను ప్రారంభించింది. బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి బుధవారం దీన్ని ఆవిష్కరించారు. ప్రాథమికంగా స్టాక్స్, ఈటీఎఫ్లతో ప్రారంభించి క్రమంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తదితర సెగ్మెంట్స్ను కూడా ఇందులో అందుబాటులోకి తేనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరిస్తారు. స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ద్వారా తమ ఆర్థిక సేవల పోర్ట్ఫోలియో సంపూర్ణమైందని ఫోన్పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరోవైపు, 2025 నాటికల్లా ఫోన్పే నిర్వహణ లాభాలను సాధించే అవకాశం ఉందని సమీర్ నిగమ్ తెలిపారు. -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్విత్ 34, కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్గా స్వీకరిస్తున్నట్టే. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
కోట్లు వచ్చేలా చేస్తాం.. రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా!
హిమాయత్నగర్: షేర్ మార్కెట్పై నగర వాసికి ఉన్న మక్కువను క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయన అకౌంట్ను హ్యాక్ చేసి తెలియకుండా అతి తక్కువ ధరకు షేర్స్ను అమ్మేశారు. మళ్లీ షేర్ హోల్డర్తోనే ఎక్కువ రేట్కు షేర్స్ను కొనుగోలు చేపించి రూ.లక్షలు నష్టపోయేలా చేయడంతో.. బాధితుడు శుక్రవారం సిటీసైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన హరీష్చంద్రారెడ్డి కొంతకాలంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్స్ను కొనుగోలు చేసి ఎల్ఐఎస్బ్లూ ఫైనాన్షియల్ త్రూ అమ్మడం, కొనడం చేస్తుంటాడు. ఈ క్రమంలో పరిచయం అయిన సైబర్ కేటుగాళ్లు హరీష్చంద్రారెడ్డి అకౌంట్ను హ్యాక్ చేశారు. రూ.700 విలువ గల షేర్స్ను కేవలం రూ.100కు ఇతరులకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్చంద్రారెడ్డి వెబ్సైట్లో ఉన్న వారిని ప్రశ్నించగా.. కోట్లు వచ్చేలా చేస్తామని నమ్మించారు. లాభాలు లేని వాటిని రూ.700–800 చొప్పున కొనుగోలు చేయించారు. ఇలా పలు దఫాలుగా కేవలం రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరీష్చంద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మీ డబ్బంతా ఏజెంట్ తినేశాడంటూ.. వృద్ధుడికి రూ.25లక్షలు టొకరా ఇన్సురెన్స్ ఎక్స్పైరీ అయినా సరే..సైబర్ కేటుగాళ్లు మాత్రం అమాయకుల్ని వదలట్లేదు. మీకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బును పొందారు. మీకేం బాధ అనిపించడం లేదా అంటూ సింపతితో లక్షలు కాజేశారు. కుల్సుంపురాకు చెందిన వృద్ధుడు రెండు సంస్థల్లో ఇన్సురెన్స్ చేశాడు. అది చాలా కాలం క్రితం ఎక్స్పైరీ కూడా అయ్యింది. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కాల్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ డిటైల్స్ తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టాలనడంతో వృద్ధుడు చెల్లించాడు. రూ.3 లక్షలు వస్తాయని నమ్మించి పలు దఫాలుగా అతడి నుంచి రూ.25లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీసైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్ -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు సరైన తరుణం ఏది?
మార్కెట్లు పడినప్పుడు ఈక్విటీ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసినట్టుగానే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు అనుకూల సమయం ఏది? డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. డెట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకునే ముందు, లంప్ సమ్ (ఒకే విడత మొత్తం) అయినా సరే.. మీ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఫథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది కీలకమవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఎంపిక చేసుకున్న పథకం రక్షణ ఎక్కువగా ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేలా ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేసే మాదిరి అని అన్నారు. కానీ, అదేమంత సులభం కాదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నప్పుడు దిద్దుబాటు చివరికి వచ్చిందా.. ఇంకా కరెక్షన్ మిగిలి ఉన్నదా అన్నది మీకు తెలియదు. అందుకని ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఆచరించాలని చెబుతుంటాను. మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే కొంత మొత్తాన్ని మార్కెట్లు పడినప్పుడు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవచ్చు. కనిష్ట స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టడం వల్ల మంచిగా పెరిగే వాటిల్లో పెట్టుబడుల అవకాశాలను కోల్పోవచ్చు. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉంటే, 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్విటీ పెట్టుబడుల్లో 10 శాతాన్ని తీసుకెళ్లి రీట్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి రాబడులు సెన్సెక్స్ను అధిగమిస్తాయా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చస్తుంటాయి. వీటి అద్దె రాబడులు అన్నవి ప్రస్తుతం అంత ఎక్కువేమీ లేవు. వచ్చే పదేళ్లలో కొంత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ప్రస్తుతం చూస్తున్న మాదిరి ప్రతికూలతలు మధ్యలో ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ, సెన్సెక్స్ పట్ల నేను ఎంతో ఆశావహంతో ఉన్నాను. రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను. ప్రతి నెలా ఫండ్స్లో రూ.50,000కు మించి పెట్టుబడులు పెట్టేట్టు అయితే పథకాల విభజన ఎలా? ప్రతి నెలా రూ.50,000తో ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, పోర్ట్ఫోలియో సరళంగా ఉండేలా చూసుకోవాలన్నది నా సూచన. రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలు సరిపోతాయి. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు తోడు, రెండు స్మాల్క్యాప్ పథకాలను కూడా చేర్చుకోండి. పెట్టుబడులు సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలి. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
రెడీగా ఉండండి.. 18 ఏళ్ల తర్వాత ఆ దిగ్గజ సంస్థ నుంచి ఐపీఓ
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఓ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ ఐపీఓకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్ను టాటా నియమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు టాటా గ్రూప్ మరో అనుబంధ సంస్థ అయిన టాటా స్కై కూడా ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఐపీఓ వార్తలపై టాటా గ్రూప్ స్పందించేందుకు నిరాకరించాయి. చదవండి: Anand Mahindra: ఎలాన్ మస్క్పై ఆనంద్ మహీంద్రా ట్విట్.. అది పొగిడినట్లు లేదే..! -
ప్లస్ 631 నుంచి మైనస్ 100 పాయింట్లకు
ముంబై: మిడ్సెషన్ నుంచి ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లు పతనమై 15,798 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ అరశాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.20శాతం నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ 30 తేదీ తర్వాత తొలిసారిగా రూ.1,296 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.258 కోట్ల అమ్మేశారు. ఆసియాలో జపాన్, హాంగ్కాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా మార్కెట్లు లాభపడ్డాయి. చైనా, సింగపూర్ స్టాక్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం క్షీణించాయి. బర్త్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్(జూలై 4) సందర్భంగా సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు కాగా అక్కడి స్టాక్ సూచీలు 2 శాతం మేర భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి 731 పాయింట్ల పతనం సెన్సెక్స్ ఉదయం 266 పాయింట్ల లాభంతో 53,501 వద్ద మొదలైంది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 15,909 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ప్రథమార్థంలో ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు అందాయి. భారత్లో సేవారంగ కార్యకలాపాలు జూన్ నెలలో 11 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు గణాంకాలు వెలువడ్డాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం క్షీణించి 20.79 శాతానికి దిగివచ్చింది. ఈ సానుకూలాంశాలతో ఒక దశలో సెన్సెక్స్ 631 పాయింట్లు బలపడి 53,866 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు బలపడి 16,026 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. అయితే ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో యూరప్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడంతో సెంటిమెంట్ దెబ్బతింది. ద్వితీయార్థంలో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో విక్రయాలు తలెత్తడంతో ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(53,866) నుంచి 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16,200 స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్లో గరిష్టస్థాయి (16,026) నుంచి 215 పాయింట్లు క్షీణించి 15,811 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦క్యూ1 ఫలితాలు ప్రకటన విడుదలకు ముందు(జూన్ 8న టీసీఎస్ క్యూ1 గణాంకాలు వెల్లడి) ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్అండ్టీ షేర్లు ఒకశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. ♦జూన్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడంతో ఆర్బీఎల్ బ్యాంక్ షేరు ఏడుశాతం క్షీణించి రూ.81.40 వద్ద స్థిరపడింది. ♦మోతీలాల్ ఓస్వాల్ ‘‘బై’’ రేటింగ్ను కొనసాగించడంతో ఎల్ఐసీ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.703 వద్ద నిలిచింది. -
మార్కెట్లో ఆర్బీఐ అప్రమత్తత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టంతో ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు ఒకశాతానికి పతనాన్ని చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్ల క్షీణించింది. చివరికి 568 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ట్రేడింగ్లో నిఫ్టీ 223 పాయింట్లు పతనమైంది. మార్కెట్ ముగిసే సరికి 153 పాయింట్ల నష్టంతో 16,416 వద్ద నిలిచింది. సూచీలకిది మూడోరోజూ నష్టాల ముగింపు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్అండ్గ్యాస్, ఆటో షేర్లకు మాత్రమే కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. విస్తృతస్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,294 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,311 కోట్ల షేర్లు కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 77.78 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయం సెన్సెక్స్ పతనంతో బీఎస్ఈలో రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.254.28 లక్షల కోట్లకు దిగివచ్చింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ఎల్ఐసీ షేరు ఆరోరోజూ పడింది. 3%పైగా పతనమై రూ.753 వద్ద ముగిసింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 20% క్షీణించింది క్రూడాయిల్ పెరుగుదల ఆయిల్ ఇండియా షేరుకు కలిసొచి్చంది. బీఎస్ఈలో మూడు శాతం లాభపడి రూ.286 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో రూ.301 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నష్టాలకు నాలుగు కారణాలు ఆర్బీఐ పాలసీ సమావేశం: ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. వడ్డీరేట్ల పెంపు ఖాయమే అయినప్పటికీ.., ఎంతమేర పెంపు ఉండొచ్చనే అంశంపై మార్కెట్ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు, అంతర్జాతీయ అనిశి్చతులపై ఆర్బీఐ స్పందన కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. క్రూడాయిల్ ధరల సెగలు ఆసియా దేశాలకు ఎగుమతి చేసే అన్ని రకాల ఆయిల్ ధరలను జూలై నుంచి పెంచుతున్నట్లు సౌదీ అరేబియా చేసిన ప్రకటనతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 120 డాలర్లు దాటింది. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. బాండ్లపై పెరిగిన రాబడులు ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడంతో ఈక్విటీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తాజాగా పదేళ్ల కాలపరిమితి గల బాండ్లపై రాబడులు మూడేళ్ల గరిష్ట స్థాయి 7.54 శాతానికి చేరింది. క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, ఆర్బీఐ పాలసీ సమావేశం సందర్భంగా అప్రమత్తతతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా ఈక్విటీలను అమ్మేసి.., పెట్టుబడులను బాండ్లలోకి మళ్లిస్తున్నారు. యూఎస్ స్టాక్ ఫ్యూచర్ల పతనం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీ శాయి. ఆ్రస్టేలియా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడికి ఇతర దేశాల కేంద్ర బ్యాంకులూ ఇదే కఠినతర ద్రవ్యపాలసీ వైఖరిని అనుసరించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కె ట్లు 1% నుంచి 1.5% క్షీణించాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 1% నష్టాల్లో ట్రేడయ్యాయి. -
అదే నా కొంప ముంచింది: పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ!
Paytm Share Decline Reason, న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎమ్ షేరు విలువ పతనంకావడానికి మార్కెట్ల ఆటుపోట్లే కారణమని వన్97 కమ్యూనికేషన్స్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్పై ఇటీవల మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. రానున్న ఆరు త్రైమాసికాల్లోకంపెనీ లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరుకోగలదని అంచనా వేశారు. నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే స్థాయికి చేరగలదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్లో మార్కెట్ ఒడిదుడుకులు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వాటాదారులకు రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. పేటీఎమ్ బ్రాండుతో వన్97 కమ్యూనికేషన్స్ డిజిటల్ పేమెంట్ సర్వీసులందిస్తున్న సంగతి తెలిసిందే. నేలచూపుల్లో...: గతేడాది షేరుకి రూ. 2,150 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన వన్97 కమ్యూనికేషన్స్ కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతూ వస్తోంది. ఇటీవల బీఎస్ఈలో రూ. 520 వద్ద జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. తాజాగా 5 శాతం బలపడి రూ. 637 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022) ఫలితాలు ప్రకటించవలసి ఉన్నదని, ప్రస్తుతం కంపెనీ బిజినెస్ అవకాశాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని లేఖలో శర్మ ప్రస్తావించారు. ఇది కొనసాగనున్నట్లు భావిస్తున్నామంటూనే, ఏడాదిన్నర కాలంలో నిర్వహణ ఇబిటాను సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. వెరసి 2023 సెప్టెంబర్కల్లా ఆశించిన ఫలితాలు అందుకోగలమని అభిప్రాయపడ్డారు. తద్వారా దీర్ఘకాలంలో వాటాదారులకు విలువ చేకూర్చనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్ విలువ ఐపీవో స్థాయికి చేరాకమాత్రమే తనకు జారీ అయిన షేర్లు తనకు సొంతమవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం
-
షేర్ మార్కెట్ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో ఘరానా మోసం
-
స్టాక్ మార్కెట్కి బడ్జెట్ బూస్ట్.. లాభాల్లో సూచీలు
ముంబై: కేంద్ర బడ్జెట్ ఇచ్చిన బూస్ట్తో దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. బడ్జెట్లో ఇన్ఫ్రాకి పెద్ద పీట వేయడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. దీంతో వరుసగా రెండో రోజు దేశీ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:10 గంటలకి 430 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ 59,293 పాయింట్ల వద్ద కదలాడుతోంది.మరోవైపు నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,706 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దేశీ సూచీలు జోరుమీద ఉండటంతో మరోసారి బీఎస్ఈ సెన్సెక్స్ 59 వేల మార్క్ని దాటింది. -
లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1
Elon Musk Wealth Drops 15billion Dollars as tech stocks plunge: షేర్ మార్కెట్ పరిణామాలు.. ఎప్పుడు? ఎవరి తలరాతను ఎలా? మార్చేస్తాయో ఊహించడం కష్టం. ఒక్కపూటలో కాసులు కురిపించి.. అదేటైంలో రోడ్డు మీదకు లాగేస్తుంది కూడా. ఐపీవో పరిణామాలైతే మరీ ఊహించని రేంజ్లో ఉంటున్నాయి. అయితే అపరకుబేరుల విషయంలో ఈ పరిణామాలన్నీ పెద్దగా అనిపించకపోయినా.. వాళ్ల ర్యాంకింగ్లను మాత్రం పైకి కిందకి మార్చేస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ తరుణంలో లక్ష కోట్లకుపైగా పొగొట్టుకున్నా ఆ అయ్యగారు.. ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈ అయ్యగారు ఎవరో కాదు.. స్పేస్ఎక్స్ అధినేత, అపరకుబేరుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్. శుక్రవారం అమెరికా ఈ-వెహికిల్స్ తయారీదారు కంపెనీ ‘టెస్లా’ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు ఎలన్ మస్క్. ఈ విలువ మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైనే. ఇదిగాక స్పేస్ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్లు(ఏడున్నర వేల కోట్ల రూపాయలకుపైనే) నష్టపోయాడు. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల(లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టంతో.. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లుగా ఉంది. ఇక ఈ లిస్ట్లో మస్క్ మొదటి ప్లేస్లో ఉండగా.. రెండో ప్లేస్లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. 195.6 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ బ్లూ ఆరిజిన్ బాస్. ఇక అమెజాన్ షేర్లు కూడా 1.20 శాతం పడిపోవడంతో.. 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయాడు బెజోస్. జాబితాలో బ్రిటిష్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్గేట్స్ (136.4 బిలియన్ డాలర్లు) నాలుగో ప్లేస్లో, లారీ పేజ్ (121.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో మార్కెట్లన్నీ పతనం దిశగా పయనిస్తుండగా.. ఫోర్బ్స్ టాప్ టెన్లో ఉన్న బిలియనీర్లంతా షేర్ల నష్టాలతో భారీగా సంపదను కోల్పోవడం విశేషం. ఎటు చూసినా టాపే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్లాలోని తన షేర్లను అమ్మేసుకున్నాడు ఎలన్ మస్క్. పైసా తీసుకోని జీతగాడిగా(జీరో శాలరీ) కేవలం టెస్లా షేర్లతోనే లాభాలు అందుకుంటున్న ఎలన్ మస్క్.. ఈ మధ్య 10 శాతం వాటా అమ్మేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తికర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి అమ్మకంతో 10.9 బిలియన్ డాలర్ల విలువైన 10.1 మిలియన్ షేర్లు అమ్మేసుకున్నాడు. ఇంకా దాదాపు ఏడు మిలియన్లు అమ్మేయాల్సి ఉంది. మరి మొత్తంగా తన వాటాగా ఉన్న 17 మిలియన్ షేర్లను వదులుకోవడం ద్వారా మస్క్ నష్టపోడా? బిలియనీర్ జాబితాలో కిందకి జారిపోడా? అనే అనుమానాలు చాలామందికే కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షేర్ల అమ్ముకోవడం ద్వారా కట్టాల్సిన ట్యాక్స్ నుంచి భారీ మినహాయింపు పొందాడు ఎలన్ మస్క్. పైగా ఈ అమ్మకాల ద్వారా వాటిల్లిన నష్టం(1,084 డాలర్లు) నుంచి తప్పించుకుని లాభపడ్డాడు కూడా!. ఇక ఈ ఏడాది మొదట్లో ఏకంగా 384 బిలియన్ డాలర్ల సంపదతో(266.8 బిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం) రిచ్చెస్ట్ మ్యాన్గా అవతరించాడు ఎలన్ మస్క్. మరోవైపు స్పేస్ఎక్స్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల సంపదను పోగేశాడు. ఇదీగాక ఈ మధ్యే కేవలం స్పేస్ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా స్పేస్ఎక్స్ అవతరించింది. ఇవిగాక భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్లు, శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్లింక్’ సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఎలా చూసుకున్నా అయ్యగారి నెంబర్ వన్స్థానానికి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ఫోర్బ్స్ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది ఈ మధ్య. చదవండి: ట్విటర్ సీఈవో పరాగ్పై వివాదాస్పద ట్వీట్ -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థికసంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 1,302 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,244 కోట్లకు చేరా యి. కన్జూమర్ ప్రొడక్టుల విభాగం ఆదాయం 31 శాతం జంప్చేసి రూ. 1035 కోట్లను తాకగా.. ఈపీసీ బిజినెస్ 37 శాతం క్షీణించి రూ. 267 కోట్లకు పరిమితమైంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 1,092 వద్ద ముగిసింది. -
గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు మంగళవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు పతనమై 60,433 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లను కోల్పోయి 18,044 వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లైన హెచ్డీఎప్సీ ద్వయం, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల క్షీణత కూడా సూచీల లాభాల్ని హరించివేశాయి. ఆర్థిక, కన్జూమర్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, ఆటో, ఇంధన, మౌలిక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 456 పాయింట్లు పరిధిలో, నిఫ్టీ 130 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యాయి. లార్జ్ క్యాప్ షేర్లు విక్రయాల ఒత్తిడికి లోనప్పటికీ.., చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు ఒకశాతం చొప్పున రాణించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు నివేదికలు తెలపడంతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు డిమాండ్ లభించింది. సెమీ కండెక్టర్ల సమస్యలు తీరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి అమ్మకాలు పుంజుకోవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆటో రంగ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,445 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్ల రూ.1,417 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ఉదయం సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 60,610 వద్ద మొదలైంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 18,084 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలి సెషన్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 124 పాయింట్లు ర్యాలీ చేసి 60,670 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు ఎగసి 18,113 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మిడ్సెషన్ నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడమే కాక నష్టాల బాటపట్టాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►క్యూ2లో మార్జిన్లు నిరాశపరచడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.3,622 వద్ద ముగిసింది. ►విద్యుత్ వాహన వ్యాపారానికి నిధులనుసమీకరణకు సిద్ధమవడంతో టీవీఎస్ మోటార్ షేరు ఇంట్రాడేలో 14 శాతం ఎగసి రూ.814 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. అయితే లాభాల స్వీకరణ జరగడంతో చివరికి మూడుశాతం లాభంతో రూ.731 వద్ద స్థిరపడింది. ►భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో ఎల్అండ్టీ రెండు లాభంతో రూ.1964 వద్ద 52–వారాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం లాభంతో రూ.1944 వద్ద నిలిచింది. -
ఈ షేర్లు... తారాజువ్వలు!
ఇన్వెస్టర్లకు సంవత్ 2077 బంపర్గా గడిచింది. ప్రజలను కరోనా భయాలు వెంటాడుతున్నా.. దేశీ మార్కెట్లు మాత్రం తారాజువ్వల్లాగా దూసుకెళ్లిపోయాయి. స్మాల్, మిడ్.. లార్జ్ క్యాప్ అనే భేదం లేకుండా అన్ని విభాగాల్లోని షేర్లూ గణనీయంగా పెరిగాయి. గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది అక్టోబర్ దాకా చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 40 శాతం రాబడులు అందించగా.. మిడ్క్యాప్ సూచీలు 60 శాతం, స్మాల్క్యాప్ సూచీలు 79.7 శాతం మేర రాణించాయి. కరోనా కేసుల కారణంగా అంతటా నిస్పృహ, నిరాశ నెలకొన్న పరిస్థితుల్లో ఊహకు కూడా అందని విధంగా స్టాక్ మార్కెట్లు ఎగిశాయి. కారణాలు అంతర్జాతీయంగా నిధుల లభ్యత పెరగడం, ఆర్థిక విధానాలు సానుకూలంగా ఉండటం, ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు (2021లో 2 కోట్ల పైచిలుకు) తెరవడం, టీకాలతో మహమ్మారిని కొంత కట్టడి చేయగలగడం, ఇంధన ధరలు పెరగడం, రిస్క్ సామర్థ్యాలు పెరగడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లో జోష్కి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్ 2078లోనూ మార్కెట్లు మరింత ఎగిసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే రాబడులు తగ్గడం, దేశీ ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలు పెరగడం, జీడీపీ వృద్ధి మెరుగుపడుతుండటం, టీకా ప్రక్రియ పుంజుకుంటూ ఉండటం ఇందుకు దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రంగాల్లో ట్రావెల్, టూరిజం, రియల్ ఎస్టేట్ దాని అనుబంధ రంగాలు మొదలైనవి మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. మరోవైపు, హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాలు ఆశావహంగా ఉండగలవని యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్లో మెరిసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని బ్రోకరేజి సంస్థలు సూచిస్తున్న స్టాక్స్ కొన్ని మీకోసం. బ్రోకింగ్ సంస్థ: ఎస్బీఐ సెక్యూరిటీస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,721 వృద్ధి: 33% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 4.8 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్, అసెట్ క్వాలిటీ, మెరుగైన మార్జిన్లు, రాబడులు దీనికి సానుకూల అంశాలు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ మొండి బాకీలు మరింత తగ్గగలవు. వ్యయాలు తగ్గించుకునే దిశగా డిజిటల్పై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రతి నెలా డిజిటల్ మాధ్యమం ద్వారా 5 లక్షల పైచిలుకు కస్టమర్లను చేర్చుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించడం, లాక్డౌన్లు విధిస్తే రిటైల్ సెగ్మెంట్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం, ఫిన్టెక్ కంపెనీల నుంచి పోటీ వంటివి బాంకుకు ప్రతికూలాంశాలు కాగలవు. .. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుత ధర రూ. 292 టార్గెట్ ధర రూ. 358 వృద్ధి: 22% వివిధ మౌలిక రంగ ప్రాజెక్టుల అభివృద్ధిలో రెండు దశాబ్దాలపైగా అనుభవం. పటిష్టమైన ఇన్హౌస్ ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సేవలు) విభాగం. ఇన్ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థలతో సత్సంబంధాల కారణంగా సంయుక్తంగా బిడ్డింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మెరుగైన అవకాశాలు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,786 టార్గెట్ ధర రూ. 2,151 వృద్ధి: 20% ఆదిత్య బిర్లా గ్రూప్లో భాగమైన కంపెనీ. దేశీయంగా విస్కస్ స్టేపుల్ ఫైబర్ (వీఎస్ఎఫ్), లినెన్, ఇన్సులేటర్స్ తయారీ సంస్థ. అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి అనుబంధ సంస్థలున్నాయి. డెకరేటివ్ పెయింట్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో వ్యాపారాలపై రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆకర్షణీయమైన వేల్యుయేషన్లో లభిస్తోంది. చైనా నుంచి సరఫరాపరమైన ఆటంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్, ముడి వస్తువులు..విద్యుత్, ఇంధనాల ఖర్చులు పెరగడం తదితర రిస్కులు పొంచిఉన్నాయి. .. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 612 టార్గెట్ ధర రూ.774 వృద్ధి: 26% ఇది మురుగప్పా గ్రూప్లో భాగమైన ఆర్థిక సేవల విభాగం. గృహ, వాహన రుణాలు, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సేవలు మొదలైనవి అందిస్తోంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 67000 కోట్ల పైగా ఉంది. దాదాపు 16.6 లక్షల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏయూఎం వార్షికంగా 7 శాతం వృద్ధి నమోదు చేసింది. మహమ్మారి కారణంగా వసూళ్లపై అనిశ్చితి,హామీగా పెట్టుకున్న వాటి విలువలో అత్యధిక శాతం రుణం ఇవ్వడం తదితర అంశాలు ప్రధానమైనరిస్కులు. సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ.836 టార్గెట్ రూ.1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్రోకింగ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.100 టార్గెట్ ధర రూ.135 వృద్ధి: 35% పేరొందిన పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. బ్యాంక్ మొత్తం అసెట్స్ రూ. 2.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు రూ. 1.72 లక్షల కోట్లుగా, ఇచ్చిన రుణాలు రూ. 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రొవిజనింగ్ తగ్గింది. అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.1582 టార్గెట్ ధర రూ.1,859 వృద్ధి: 17% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం. డిపాజిట్లు రూ. 14 లక్షల కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 12 లక్షల కోట్లుగాను ఉన్నాయి. రిటైల్ రుణాల వాటా 46 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో ఎన్పీఏలు తగ్గడంతో ఊహించిన దానికన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అసెట్ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, ద్వితీయార్ధం వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండటం తదితర అంశాలు ఈ స్టాక్కు సానుకూలమైనవి. సుప్రజిత్ ఇంజినీరింగ్ ప్రస్తుత ధర రూ.373 టార్గెట్ ధర రూ.425 వృద్ధి: 13% సుప్రజిత్ ఇంజినీరింగ్ దేశీయంగా ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్యాసింజర్ వాహనాల సంస్థలకు ఆటోమోటివ్ కేబుల్స్ సరఫరా చేస్తోంది. ఉత్పత్తులను చౌకగా అందించడం ద్వారా మార్కెట్ షేరును పెంచుకోవడంతో పాటు ప్రస్తుత కస్టమర్ల నుంచి మరింతగా ఆర్డర్లు దక్కించుకుంటోంది. వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచుకునే కొద్దీ సుప్రజిత్ కూడా గణనీయంగా ప్రయోజనాలు పొందగలదు. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర రూ.143 టార్గెట్ ధర రూ.175 వృద్ధి: 22% దేశీయంగా వాణిజ్య వాహనాల విభాగ దిగ్గజాల్లో ఒకటి. మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాల మార్కెట్లో సుమారు 28 శాతం వాటా ఉంది. సీవీ సెగ్మెంట్ కోలుకునే కొద్దీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలగే సత్తా ఉంది. స్క్రాపేజీ పాలసీ వల్ల కూడా కంపెనీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పీఐ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ.2733 టార్గెట్ ధర రూ.3,950 వృద్ధి: 44% అంతర్జాతీయ ఆగ్రోకెమికల్ కంపెనీలకు కస్టమ్ సింథసిస్, తయారీ సొల్యూషన్స్ (సీఎస్ఎం) అందిస్తోంది. కంపెనీ ఆదాయాల్లో ఈవిభాగం వాటా 70 శాతం పైగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కెమికల్స్, ఫార్మా ఏపీఐ, ఫ్లోరో కెమికల్స్ మొదలైన వాటిల్లోకి విస్తరిస్తోంది. బ్రోకింగ్ సంస్థ: యాక్సిస్ సెక్యూరిటీస్ ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ధర రూ. 2,420 టార్గెట్ ధర రూ. 2,570 వృద్ధి: 6% వ్యయాల తగ్గింపు చర్యలు, ఉత్పత్తులకు భారీ డిమాండ్, మెరుగైన ధర మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు. ప్రస్తుతం ఈ రంగంలోని మిగతా సంస్థలతో పోలిస్తే షేరు ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. సైయంట్ ప్రస్తుత ధర రూ.1,105 టార్గెట్ ధర రూ.1,300 వృద్ధి: 17% దీర్ఘకాలిక కోణంలో కంపెనీ వ్యాపార స్వరూపం పటిష్టంగా మారింది. అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు సంస్థ చేతిలో ఉన్నాయి. రూపాయి మారకం తక్కువ స్థాయిలో ఉంటడం, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గటం వంటి కారణాలతో సమీప భవిష్యత్తులో సైయంట్ ఆదాయాలు మరింత మెరుగుపడవచ్చు. మైండ్ట్రీ ప్రస్తుత ధర రూ.4,627 టార్గెట్ ధర రూ.5,100 వృద్ధి: 10% ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించగలగడంతో పాటు ప్రాజెక్టులను సమర్ధంగా పూర్తి చేయగలిగే ట్రాక్ రికార్డు కంపెనీకి సానుకూలాంశం. రూపాయి క్షీణత, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గుతుండటం కలిసొచ్చే అంశాలు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర రూ.744 టార్గెట్ ధర రూ.940 వృద్ధి: 26% నవీకరించిన కొత్త వ్యాపార విధానం ఊతంతో తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతో పాటు మార్కెట్ వాటాను కూడా పెంచుకోగలిగే అవకాశం ఉంది. బ్రాండ్ రీకాల్, వివిధ రకాల కస్టమర్లకు వినూత్న ఆఫర్లు అందిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ధర రూ.1,178 టార్గెట్ ధర రూ.1,350 వృద్ధి: 14% ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఎస్బీఐ లైఫ్కు అత్యంత విస్తృతమైన బ్యాంక్ఎష్యూరెన్స్ నెట్వర్క్ ఉంది. కార్యకలాపాలను స్వల్ప వ్యవధిలో విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యయాలకు సంబంధించిన నిష్పత్తులు అత్యంత తక్కువగా ఉండటం వల్ల వ్యాపా రం నెమ్మదించినా మార్జిన్లపై ఎక్కువగా ప్రభావం పడకపోవడం, లాభదాయక పాలసీలపై దృష్టి పెడుతుండటం సంస్థకు సానుకూలాంశం. బ్రోకింగ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ. 836 టార్గెట్ రూ. 1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ధర రూ. 101 టార్గెట్ ధర రూ. 120 వృద్ధి: 18% క్రమంగా కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలను ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం తదితర అంశాల ఊతంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుంది. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్కు బదలాయించడంతో ఎన్పీఏల భారం తగ్గుతుంది. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రావాల్సిన బాకీలు కూడా క్రమంగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రస్తుత ధర రూ. 253 టార్గెట్ ధర రూ. 300 వృద్ధి: 18% మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ రంగ పరికరాల వ్యాపారం పటిష్టంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు–నాలుగేళ్లలో 35–30 శాతం పెరగవచ్చని అంచనా. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీకి ఇది సానుకూలాంశం. బాటా ఇండియా ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,380 వృద్ధి: 17% వ్యయాలను తగ్గించుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగించడం, ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు మొదలైనవి కంపెనీకి లాభించగలవు. అలాగే భారం పెంచుకోకుండా ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ నెట్వర్క్ను క్రమంగా పెంచుకుంటూ ఉండటం సంస్థకు సానుకూల అంశం. మహీంద్రా లైఫ్స్పేస్ ప్రస్తుత ధర రూ. 283 టార్గెట్ ధర రూ. 325 వృద్ధి: 14% పటిష్టమైన మాతృ సంస్థ తోడ్పాటు, కార్యకలాపాల స్థాయిని విస్తరించడంపై మేనేజ్మెంట్ మరింతగా దృష్టి పెడుతుండటం కంపెనీకి సానుకూల అంశాలు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలాలతో రెసిడెన్షియల్ వ్యాపారాన్ని కూడా పెంచుకోవడానికి తోడ్పడగలదు. మధ్యకాలికంగా షేర్ టార్కెట్ను తాకవచ్చు. -
స్టాక్ మార్కెట్పై బేర్ పంజా.. నేల ముఖం పట్టిన సూచీలు
ముంబై: అనూహ్యంగా పెరుగుతూ పోయిన స్టాక్ మార్కెట్ క్రమంగా దిద్దుబాటు దిశగా పయణిస్తోంది. ఆరంభంలో దేశీ సూచీలు లాభాలు పొందినా.. మధ్యాహ్నం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలు షురూ చేయడంతో తిరిగి నష్టాలతోనే దేశీ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. చివరి నిమిషంలో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో భారీ నష్టాలు తప్పాయి. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, టాటాస్టీల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 61,044 పాయింట్లతో మొదలవగా ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో 61,420 పాయింట్లను తాకింది. దీంతో తిరిగి మార్కెట్లో బుల్ జోరు మొదలైందనే భావన ఏర్పడింది. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారింది. లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,627 పాయింట్ల కనిస్టానికి పడిపోయింది. చివరల్లో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో మార్కెట్ ముగిసే సమయానికి 102 పాయింట్లు నష్టపోయి 60,821 పాయింట్ల దగ్గర ఆగిపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 63 పాయింట్లు నష్టపోయి 18,144 దగ్గర క్లోజయ్యింది. -
చెన్నై‘సూపర్ కింగ్స్’.. అరుదైన ఘనత!
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యకర పరిణామాలకు కారణం కాబోతోంది. ధనా ధన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఇటు ఐపీఎల్ లీగ్పరంగానే కాకుండా అటు మార్కెట్ వేల్యుయేషన్పరంగానూ దుమ్ము రేపుతోంది. ఏకంగా క్రీడా రంగంలో తొలి యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా విలువ) హోదా దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ విషయంలో మాతృ సంస్థ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్ను కూడా దాటిపోతుండడం మరో విశేషం. ఈమధ్యే నాలుగోసారి లీగ్ను గెల్చుకోవడంతో సీఎస్కే టీమ్ విలువపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్లో రెండు జట్లకు చోటు కల్పించనున్నారని, వీటి విలువను సుమారు రూ. 4,000– 5,000 కోట్లుగా లెక్కించనున్నారని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టి చూస్తే, తొలి నుంచి నిలకడగా రాణిస్తున్న సీఎస్కే వేల్యుయేషన్ దాదాపు రెట్టింపు స్థాయికి చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘‘గత శుక్రవారం అనధికారిక మార్కెట్లో సీఎస్కే షేరు ధర రూ. 135గా ఉంది. దీని ప్రకారం సీఎస్కే మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 4,200 కోట్లు. అయితే, కొత్తగా వచ్చే జట్ల విలువ దాదాపు రూ. 4,000– 5,000 కోట్లుగా ఉంటే సీఎస్కే రిటైల్ షేరు ధర ఏకంగా రూ. 200కి చేరవచ్చు. దీంతో టీమ్ విలువ రూ. 8,000 కోట్లకు ఎగియవచ్చు. తద్వారా యూనికార్న్గా మారవచ్చు’’ అని పేర్కొన్నాయి. మరోవైపు, మంగళవారం నాటి పరిస్థితుల ప్రకారం సీఎస్కే మాతృ సంస్థ ఇండి యా సిమెంట్స్ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో షేరు ధర రూ. 205) మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 6,343 కోట్లుగా ఉంది. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే సీఎస్కే విలువ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్ను కూడా దాటిపోనుంది. ఇండియా సిమెంట్స్కు ఊతం ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్ శ్రీనివాసన్ కూడా ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే విలువ.. మాతృ సంస్థ వేల్యుయేషన్ను దాటేసే అవకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ లీగ్లు మరింతగా ప్రాచుర్యంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరో సందర్భంలో ఇండియా సిమెంట్స్కు సీఎస్కే ఊతంగా నిలుస్తోందంటూ ఆయన అంగీకరించారు. ‘‘ఇండియా సిమెంట్స్ నెలకొల్పి 75 ఏళ్లవుతోంది. అది స్వయంగా ఒక పటిష్టమైన బ్రాండ్. కానీ ఇప్పుడు సీఎస్కే మాతృ సంస్థగా గుర్తింపు పొందుతోంది. సీఎస్కే అనతికాలంలోనే ఇండియా సిమెంట్స్ ప్రాచుర్యాన్ని అధిగమించింది’’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ‘‘సీఎస్కే స్వయంగా ఒక భారీ బ్రాండ్గా ఆవిర్భవిస్తోంది. వేల్యుయేషన్ గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఇండియా సిమెంట్స్ దీన్నేమీ విక్రయించకపోవచ్చు. ఎందుకుంటే బ్రాండింగ్పరంగా ఇది మాతృ సంస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది’’ అని బ్రాండ్ మార్కెటింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఇండియా సిమెంట్స్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎస్కే టీమ్ ప్లేయర్లు సందడి చేయడం ఇందుకు నిదర్శనంగా తెలిపాయి. సీఎస్కే టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అటు ఇండియా సిమెంట్స్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. నిలకడగా రాణింపు 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పట్నుంచీ .. మిగతా టీమ్లతో పోలిస్తే సీఎస్కే నిలకడగా రాణిస్తోంది. 196 మ్యాచ్లలో 117 మ్యాచ్లలో గెలుపొంది.. 59.69 శాతం విజయాల రేట్తో కొనసాగుతోంది. ధోనీ సారథ్యంలో సీఎస్కే ఇప్పటికే పటిష్టమైన బ్రాండ్గా ఎదిగిందని, ఒకవేళ రేపు ఎప్పుడైనా అతను తప్పుకున్నా కూడా దాని ప్రాభవం తగ్గకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఎస్కే టీమ్ నిర్వహణ తీరు ఇందుకు కారణమని వివరించాయి. ‘‘మంచి బ్రాండ్స్ ఎలా వ్యవహరించాలన్నది సీఎస్కే చూపించింది. నిలకడగా రాణించడం, ప్రజల ఆప్యాయతను చూరగొనడం ఇలా అన్ని కీలకమైన అంశాల్లోనూ ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. పనితీరులో నిలకడగా రాణిస్తోంది. మిగతా బడా పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన టీమ్లను ధైర్యంగా ఎదుర్కొని, నిలబడగలుగుతోంది. పేరుకు చెన్నై సూపర్ కింగ్స్ అయినప్పటికీ చెన్నై పరిధిని దాటి దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడే టీమ్గా ఎదిగింది’’ అని పేర్కొన్నాయి. చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ షాక్ -
అదే దూకుడు.. లాభాల్లో సూచీలు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో సూచీలు సానుకూలంగా ఉండటం, ఇటు ఏషియా మార్కెట్లు సైతం లాభాల బాటలో పయణిస్తుండటం దేశీ మార్కెట్ల జోరుకు మరింత ఊతం ఇచ్చాయి. గత కొంత కాలంగా కొనసాగుతోన్న బుల్ జోరుని మరింతగా పెంచాయి. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఆల్టైం హైలను టచ్ చేశాయి. ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 62,123 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్సీ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 18,571 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు నిఫ్టీ ప్రారంభం కావడమే 18,602 పాయింట్లతో మొదలై ఆల్టైం హైని టచ్ చేసింది. ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, ఆల్ట్రాటెక్, టైటాన్, పవర్గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. -
ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే
వెండితెరపై హీరో హీరోయిన్ల జోడీ బాగా కుదిరితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అంటారు. అచ్చంగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు, లాభాల మధ్య కెమికల్ షేర్ల విషయంలో ఏడాది కాలంగా చక్కని కెమిస్ట్రీ కుదురుతోంది. ఈ కెమికల్ కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. యాక్షన్.. రియాక్షన్ అణువులు పరమాణువులు అందులో ఉండే ఎలక్ట్రాన్ల మధ్య చర్యలతో కూడినదే కెమిస్ట్రీ. కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో జరిగే రసాయనిక చర్యల కారణంగా కొత్త పదార్థాలు పుట్టుకొస్తాయి. అదేవిధంగా ఎక్కడో చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ వ్యవహరాలు ఇండియాలో కెమికల్ షేర్ల ధరలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. ఏడాదిలో ఐదింతలు ఏడాది వ్యవధిలోనే దేశీ స్టాక్మార్కెట్లో ఐదు కెమికల్ కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది వ్యవధిలోనే కనీసం లక్షకు రెండు లక్షలు మొదలు ఐదు లక్షల రూపాయల వరకు లాభాలు అందించాయి. ఐటీ, మెటల్, ఫైనాన్స్ కంపెనీలను వెనక్కి నెట్టి ముదుపరులకు అతి భారీ లాభాలను స్వల్ప కాలంలోనే కెమికల్ షేర్లు అందిస్తున్నాయి. అలా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన కొన్ని కంపెనీలు, వాటి షేర్ల ధరల వివరాలు ఇన్వెస్టర్ల ఇంట సిరుల పంట - బాలాజీ అమీన్స్ అనే కెమికల్ కంపెనీ 1988లో మార్కెట్లో లిస్టయ్యింది. అప్పటి నుంచి గతేడాది వరకు ఈ కంపెనీ షేరు విలువ సాధారణ స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కానీ గత ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ షేరు విలువ 450 శాతం పెరిగింది. 2020 అక్టోబరు 20న ఈ కంపెనీ ఒక షేరు విలువ రూ. 816 ఉండగా 2021లో ఈ ధర అమాంతం పెరిగి రూ.4,488లకు చేరుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ 14,525 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఫార్మా రంగానికి సంబంధించిన కెమికల్స్ తయారు చేస్తోంది. - గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీ 1987లో నోయిడా సమీపంలో స్థాపించారు. ఈ కంపెనీ రిఫ్రిజరెంట్ గ్యాసెస్, కాస్టిక్ సోడా, క్లోరో మీథేన్ తదితర రసాయనాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ 2020 అక్టోబరులో రూ. 484 ఉండగా ప్రస్తుతం ఈ విలువ రూ. 2,167లకు చేరుకుంది. ఏడాది వ్యవధిలోనే కంపెనీ షేర్ వ్యాల్యూ 348 శాతం పెరిగింది. - దీపక్ నైట్రేట్ సంస్థ బల్క్ కెమికల్ కమోడిటీస్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేరు విలువ గతేడాది రూ. 716లు ఉండగా 2021 అక్టోబరు వచ్చేసరికి 298 శాతం పెరిగి ఒక్కో షేరు ధర రూ. 2,852లుగా పలుకుతోంది. పెట్రోకెమికల్స్, అగ్రోకెమికల్స్, ఫార్మా తదితర రంగాలకు ఈ కంపెనీ నుంచి బల్క్ కెమికల్స్ వెళ్తుంటాయి. - ప్రివీ స్పెషాలిటీ కెమికల్ సంస్థ షేర్లు ఏడాది వ్యవధిలో 258 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబరులో షేరు విలువ రూ.527లు ఉండగా ప్రస్తుతం అది రూ.1,891కి చేరుకుంది. ఏడాది వ్యవధిలో గరిష్టంగా రూ.2,070ని తాకగా కనిష్టంగా రూ.501కి పడిపోయింది. - అల్కైల్ అమీన్స్ సంస్థ పెయింట్స్, రబ్బర్, వాటర్ ట్రీట్మెంట్ తదితర రంగాలకు కెమికల్స్ని సరఫరా చేస్తుంది,. గతేడాది ఈ కంపెనీ షేరు విలువ రూ.1,228 ఉండగా ఏడాది కాలంలో 223 శాతం పెరిగి ప్రస్తుతం రూ.3970 దగ్గర ట్రేడవుతోంది. ఈ ఏడాది కాలంలో గరిష్టంగా రూ.4,749కి చేరుకోగా కనిష్టంగా రూ. 1,138కి పడిపోయింది. కారణం ఇదేనా? కరోనా విపత్తుతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. కెమికల్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచానికి చైనా అతి పెద్ద తయారీ, సరఫరాదారుగా ఉండేది. కానీ కరోనాతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్వైపు చూస్తున్నాయి. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం చైనా దిగుమతుల పట్ల సానుకూలంగా లేదు. దీంతో దేశీ కెమికల్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. బ్లూచిప్లను మించి మెరుగైన పనితీరు కనిపిస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీల్లోనే ఉన్నప్పటికీ ముదుపరులకు భారీ లాభాలు అందివ్వడంలో బ్లూచిప్ కంపెనీలను వెనక్కి నెడుతున్నాయి. చదవండి:9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..! -
ఆకాశమే హద్దు! 61 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది. బుల్జోరు కంటిన్యూ అవుతుండటంతో దేశీ సూచీలు రయ్ రయ్మంటూ పైపైకి దూసుకుపోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది. నిన్న సాయంత్రం బీఎస్సీ సెన్సెక్స్ 60,737 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కానీ ఈ రోజు మార్కెట్ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత కాసేపు జోరు తగ్గినట్టు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్సీ సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 61,140 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 18,282 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. -
Stock Market : అదే జోరు .. తగ్గేది లేదు
ముంబై: స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. బుల్ పరుగులు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు తాజాగా మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. ఉదయం పది గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 263 పాయింట్లు లాభపడి 60,547 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ వంద పాయింట్లు లాభపడి 18,091 వద్ద కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలు పొందాయి. టాటాస్టీల్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనిలీవర్లిమిటెడ్ షేర్లు నష్టాలు పొందాయి. -
స్టాక్మార్కెట్లో అస్థిరత.. నష్టాల బాట పట్టిన సూచీలు
ముంబై : పెరిగిన ముడి చమురు ధరలతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లపై చమురు ధరల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో దేశీ స్టాక్మార్కెట్లో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నిన్న ఉదయం మార్కెట్ ప్రారంభం కావడంతోనే లాభాల బాట పట్టిన సూచీలు ఈ రోజు అడుగు ముందుకు వేసేందుకు మొరాయిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప లాభాలతో మొదలై నష్టాల బాట పట్టగా ఎన్ఎస్ఈ నిఫ్టీ నష్టాలతోనే ట్రేడ్ మొదలుపెట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 59,320 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ వెంటనే 59,560 పాయింట్లకు చేరకుంది. కానీ కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోవడం ప్రారంభమైంది. ఉదయం 9:47 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్లు నష్టపోయి 59,207 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 17,682 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతి సుజూకి ఇండియా, హెచ్యూఎల్, ఏషియన్ పేయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలు పొందగా హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ, టైటాన్ షేర్లు నష్టపోయాయి. -
కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్దేవ్.. సెబీ సీరియస్
యోగా గురువు రామ్దేవ్ బాబా మరోసారి చిక్కుల్లో పడ్డారు. యోగా క్లాసుల సందర్భంగా ఆయన చెప్పిన ఆర్థిక పాటాలపై సెబీ సీరియస్ అయ్యింది. అభ్యంతర వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలంటూ వివరణ అడిగింది. ఈ షేర్లు కొనండి కరోడ్పతి కండి ఇటీవల యోగా తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బాబా రామ్దేవ్ ప్రసంగించారు. ‘ ఈ సందర్భంగా మీ అందరికీ కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరంతా ఈ రోజే డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. స్టాక్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేందుకుద అన్నీ ఏర్పాట్లు చేసుకోండి. నేను చెప్పినప్పుడు రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి. అలా కొన్న వాటిని తిరిగి అమ్మడం , కొనడం వంటి పనులు చేయకండి. వాటిని కొన్న వెంటనే ‘సమాధి’ చేయండి. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోండి. పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయి’ అంటూ చెప్పారు. సెబీ సీరియస్ స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంస్థ నిర్వహిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం సరైన నైపుణ్యం, సర్టిఫైడ్కాని వ్యక్తులు షేర్ల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన సలహాలు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మార్కెట్పై అవగాహన లేని వారు తమ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కానీ బాబా రామ్దేవ్ ఈ నిబంధనను పట్టించుకోకుండా బహిరంగగా సలహా ఇవ్వడంపై సెబీ సీరియస్ అయ్యింది. దీనిపై రామ్దేవ్ బాబాను వివరణ కోరింది. సోయా రుచికి నోటీసులు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ సోయారుచికి ప్రమోటర్గా ఉంది. ఇటీవల అదనపు నిధులు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)కి వెళ్లేందుకు ఆగస్టులో సెబీ నుంచి అనుమతులు సాధించింది. త్వరలో ఈ సంస్థ ఎఫ్పీవో ద్వారా రూ. 4300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. అయితే ఇంతలో రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఈ సంస్థను చిక్కుల్లో పడేశాయి. రుచితో పాటు ఎప్పీవోకి మర్చంట్బ్యాంకర్లు ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. లభించని వీడియో కరోడ్పతి మంత్ర, సోయా రుచి షేర్లకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు రావడం తప్పితే సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా లభించడం లేదు. అయితే యోగా తరగతుల్లో బాబా మాట్లాడే సమయంలో కొందరు వీడియో తీశారని, ఆ ఫుటేజీ సెబీకి చేరిందని తెలుస్తోంది. సెబీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఆ వీడియోను తొలగించినట్టు సమాచారం. చదవండి : IIFL Wealth Hurun India 2021: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్జున్వాలా..అతని తర్వాతే..! -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్
స్టాక్మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ సెషన్ కూడా లాభాలతోనే ప్రారంభమైంది. ఇండియన్ బ్యాంక్ వార్షిక సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్కి బూస్ట్ని అందించాయి. అయితే రికార్డు స్థాయి హైలలో కొనసాగుతున్న సూచీలు ఏ క్షణమైనా కరెక్షన్ అవచ్చనే అభిప్రాయం కూడా మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఉదయం 9:15 గంటలకి బీఎస్ఈ సెన్సెక్స్ 321 పాయింట్లు లాభపడి 60,369 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రారంభంలో లాభాలు పొందిన వెంటనే పాయింట్లు నష్టపోయి 17,853 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. చదవండి : Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? -
ఈ కంపెనీ షేర్లు కొన్నవారి జాతకం మారిపోయింది
భవిష్యత్తు బాగుండాలంటే మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను పెట్టుబడిగా పెట్టడం ఉత్తమం అని పెద్దలు చెబుతుంటారు. ఈ పెట్టుబడి అనేది స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారం మొదలగు వాటిలో పెట్టవచ్చు. అయితే పెట్టుబడి వెనుక ప్రధాన ఉద్దేశం సంపద సృష్టించడం. పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే డబ్బుతో పిల్లల కళాశాల ఫీజులు, పెళ్ళిల్లు, సెలవులలో సరదాగా గడపడం, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరిగిపోతుంది. అయితే, ఈ పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపద ఎంత జాగ్రత్తగా సంపాదిస్తున్నామో అదేవిధంగా ఎందులో మనం పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా ముఖ్యం. అలాగే, డబ్బును కాపాడటం, అభివృద్ధి చేయడం అనేది ఒక ప్రత్యేక కళగా చెప్పుకోవాలి.(చదవండి: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో బంపర్ ఆఫర్లు) ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో వాటిలో వేగంగా రాబడి ఇచ్చేదీ ఏమైనా ఉంది అంటే? అది షేర్ మార్కెట్/ స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవాలి. అయితే, స్టాక్ మార్కెట్ మీద పూర్తి జ్ఞానం ఉన్న వాళ్లు అధిక లాభాలు గడిస్తారు. అందుకే, రాకేశ్ జున్జున్వాలా వంటి వారు కోట్లలో సంపదిస్తారు. స్టాక్ మార్కెట్ మీద పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ ఎంత లాభమో ఒక కంపెనీ షేర్ విలువ చూస్తే మీకే తెలుస్తుంది. కాంటినెంటల్ కెమికల్స్ అనే కంపెనీ స్టాక్ ధర కేవలం మూడు నెలల్లో దాదాపు 1,500% రాబడిని అందించింది. (చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా!) ఈ ఏడాది జూన్ 24, 2021న రూ.21.49గా ఉన్న షేర్ విలువ నేడు రూ.343.5కు పెరిగింది. అంటే, గత మూడు నెలల్లో 1,497.25% రిటర్న్లు ఇచ్చింది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే మీరు గనుక జూన్ 24 రూ.1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే అది నేడు రూ.15.98 లక్షలగా మారేది. అందుకే అంటారు చాలా మంది నిపుణులు ఒక్క రోజులో కోటీశ్వరుడు కావాలంటే షేర్ మార్కెట్ మాత్రమే అని. కానీ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. అర కొర జ్ఞానంతో పెట్టుబడులు పెడితే ఎక్కువ శాతం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు మార్కెట్ మీద పూర్తి జ్ఞానం సంపాదించకే చిన్న చిన్న అడుగులతో మీ ప్రస్థానాన్ని ప్రారంభించండి. -
స్టాక్ మార్కెట్లో అస్థిరత
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో దేశీ స్టాక్ మార్కెట్లో అస్థిరత నెలకొంది. క్రితం రోజు భారీ లాభాలతో ముగిసిన మార్కెట్ ఈ రోజు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతోంది. ఉదయం పది గంటల సమయానికి 10 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయి 58,992 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,562 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈ రోజు మార్కెట్లో టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ , సన్ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి షేర్లు లాభాలు పొందగా జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు ధర భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ ,టాటా స్టీల్, నెస్టల్ ఇండియా షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. చదవండి : స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య 8 కోట్లు, ఫ్రాన్స్ను వెనక్కి నెట్టిన భారత్ -
పుంజుకున్న స్టాక్ మార్కెట్.. లాభాలతో ముగింపు
ముంబై: స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది. ఈ సెషన్ తొలి రోజు భారీ నష్టాలను చవి చూసిన ఇన్వెస్టర్లు మంగళవారం తేరుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నా దేశీ సూచీలు లాభాల వైపు స్థిరంగా కదిలాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,630 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పొందింది. అయితే ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ మరోసారి నష్టాలు తప్పవనే పరిస్థితి ఎదురైంది. కనిష్టంగా 58,232 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు నమ్మకం చూపించడంతో క్రమంగా లాభపడుతూ ఓ దశలో 59,084 పాయింట్లను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 514 పాయింట్లు లాభపడి 59,005 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 17,564 పాయింట్ల దగ్గర ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు లాభాలను పొందగా మారుతి సుజూకి, బజాజ్ ఆటో, నెస్టల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ షేర్లు నష్టాలను చవి చూశాయి. చదవండి : ప్రతికూల పరిస్థితుల్లోనూ..లాభాల్లో స్టాక్ మార్కెట్లు -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై : స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాలతో ముగిసింది. దేశీ సూచీలు సరికొత్త ఎత్తులు తాకాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,482 పాయింట్లతో మొదలైంది.ఆ తర్వాత కొద్ది మొత్తంలో పాయింట్లు కోల్పోయినా నష్టాల్లోకి జారుకోలేదు. సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్ ముగిసే సమయానికి 69 పాయింట్ల లాభంతో 58,247 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,420 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 17,438 పాయింట్లను అత్యధిక స్థాయి టచ్ చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి 17,382 దగ్గర క్లోజయ్యింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం లాభాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రాలు ఉన్నాయి. నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి. చదవండి : ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం -
‘సిప్’కి జై కొడుతున్నారు
ముంబై: ఇంతకాలం చిట్టీలలో పొదుపు చేస్తూ, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టిన వారు తమ రూటు మార్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నెలవారీ చెల్లింపులు చేసే అవకాశం ఉండే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు క్రమంగా పెరుగుతున్న ఆధారణ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పెరిగిన ఆసక్తి కరోనా సంక్షోభం తర్వాత పొదుపు, పెట్టుబడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇదే సమయంలో ఇంటర్నెట్ వాడకం కామన్ అయ్యింది. దీంతో టెక్నాలజీని వాడుకుంటూ తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా మార్చేందుకు రిస్క్ తీసుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ, అయితే తక్కువ పెట్టుబడితో బ్లూ చిప్ కంపెనీల్లో షేర్ల కొనుగోలు కష్టంగా. దీంతో తక్కువ రిస్క్ కోరుకునే వారు మ్యూచ్వల్ ఫండ్స్కి మొగ్గు చూపేవారు. అయితే ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు తగ్గాయి. కేవలం రూ.8,666 కోట్ల రూపాయలే వచ్చాయి. అంతకు ముందు జులైలో ఈ మొత్తం రూ.22,583 కోట్లుగా నమోదు అయ్యింది. జోరుమీదున్న సిప్ నెలవారీగా చిట్టీలు కట్టినట్టు, ప్రతీ నెల ఈఎంఐలు చెల్లించినట్టు మ్యూచవల్స్ ఫండ్స్లో ప్రతీ నెల ఇన్వెస్ట్ చేయడాన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటారు. ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఒక సిప్ను ఎంచుకుంటే ప్రతీ నెలా కొంత మొత్తం మన అకౌంట్ నుంచి ఆయా కంపెనీలో పెట్టుబడిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రస్తుతం సిప్లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టులోనే సిప్కి సంబంధించిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏఎమ్యూ) విలువ రూ. 5.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం సిప్ ఏఎమ్యూ విలువ రూ.17.15 లక్షల కోట్లలో మూడో వంతుగా ఉంది. సిప్లపై చెల్లించే వడ్డీ ఆగస్టులో లైఫ్టైం హైకి చేరుకుని రూ.9,923 కోట్లుగా నమోదు అయ్యింది. ఆగస్టులోనే ఏకంగా 24.92 లక్షల కొత్త సిప్లు మొదలయ్యాయి. మెత్తంగా 4.32 కోట్ల సిప్లు ఉన్నాయి. సిప్లకు సంబంధించి అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్లో 53 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో మ్యూచవల్ ఫండ్స్లో పెట్టుబడులు తగ్గినా సిప్లో ఖాతాలు పెరగడం వల్ల ఓవరాల్గా మ్యూచ్వల్ ఫండ్ మార్కెట్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2021 ఆగస్టు నాటికి మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడులు 36.59 లక్షల కోట్లకు చేరుకుని ఆల్టైం హైని టచ్ చేశాయి. చదవండి: ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
Multi Bagger Stock : లక్ష పెట్టుబడి.. ఏడాదికల్లా రూ.9.94 లక్షల లాభం
ముంబై : షేర్ మార్కెట్లో అధిక లాభాలను అందించే స్టాక్లను పట్టుకోవడం ఓ కళ. కొందిరకే అందులో పట్టు ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందే ఆయా కంపెనీకలు సంబంధించిన పనితీరు, భవిష్యత్తులో రాబోయే మార్పులు, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాలను బేరీజు వేసుకుని పెట్టుబడులు పెడతారు. స్వల్ప కాలంలోనే భారీ లాభాలను చూస్తారు. ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్గా పాపులరైన ఎనేషనల్ స్టాండర్డ్ ఇండియా (ఎన్ఎస్ఐ) స్టాక్స్ గురించి కొన్ని వివరాలు. ఏడాదిలోనే లాభాల పంట మిడ్క్యాప్ షేర్గా ఎన్ఎస్ఐ బీఎస్ఈ స్టాక ఎక్సేంజీలో ట్రేడ్ అవుతోంది. గతేడాది సెప్టెంబరు 9న ఎన్ఎస్ఐ షేర్ విలువ కేవలం రూ. 298.60 మాత్రమే. అయితే ఆ రోజు నుంచి వరుసగా షేర్ విలువ పెరుగుతూనే పోయింది. ఐదో రోజు నుంచి మొదలైన షేరు విలువలో పెరుగుదల రెండోందల రోజు చేరుకునే సరికే రికార్డు స్థాయిలో 569 శాతం పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న షేరు 894 శాతం పెరిగి రూ. 2969.25 దగ్గర ట్రేడవుతోంది. ఉజ్జాయింపుగా గత సెప్టెంబరున లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఎన్ఎస్ఎల్ షేర్లు కొనుగోలు చేసిన వారికి సరిగ్గా ఏడాది తిరిగే సరికి దాని విలువల రూ.9.94 లక్షలకు చేరుకుంది. ఏ లెక్కన చూసినా ఏడాదిలో లక్షకు ఎనిమిది లక్షల లాభం తెచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్గా నిలిచింది. 52 వారాల్లో ఇదీ పరిస్థితి 2020 సెప్టెంబరు 9న ఎన్ఎస్ఐ షేరు విలువ రూ. 298.60 ఉండగా ఈ 52 వారాల వ్యవధిలో గరిష్టంగా ఆగస్టు 27న రూ. 3,820లకు చేరుకుంది. ఆగస్టులో ఈ కంపెనీ షేర్లు అమ్ముకున్న వారి మరింత లాభాలను సొంతం చేసుకున్నారు. స్టాక్ వ్యాల్యూ జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడంతో అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో 2021 సెప్టెంబరు 9న షేర్ వాల్యూ రూ.2969గా నమోదు అయ్యింది. ఎన్ఎస్ఐ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ది చెందిన లోదా గ్రూప్ సబ్సిడరీ కంపెనీ. చదవండి : ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
మార్కెట్లో అస్థిరత.. లాభ నష్టాల మధ్య ఊగిసలాట
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో దేశీ సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాలను చవి చూశాయి. ఆ వెంటనే పుంజుకుని లాభాల బాట పట్టాయి, గత కొంత కాలంగా కొనసాగిన పాజిటివ్ ట్రెండ్కి బ్రేక్ పడింది. మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,418 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ నిన్నటి ముగింపుతో పోల్చితే 17 పాయింట్లు నష్టపోయి 58,279 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత వెంటనే పుంజుకుంది. ఉదయం 9:20 గంటలకు 72 పాయింట్లు లాభపడి 58,351 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయినా తర్వాత కోలుకుని 17,362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. చదవండి: గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ -
మార్కెట్లో అస్థిరత.. లాభనష్టాల మధ్య సూచీల ఊగిసలాట
ముంబై: స్టాక్ మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్, ఏషియన్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు ఉండటంతో మార్కెట్ ప్రారంభం కావడంతోనే సెన్సెక్స్ అధికంగా పాయింట్లు లాభపడి ఆల్టైం హైకి చేరుకుంది.అయితే ఆ వెంటనే ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో క్రమంగా సెన్సెక్స్తో పాటు నిఫ్టీ కూడా పాయింట్లు కోల్పోతోంది. దేశీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,418 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పెరుగుతూ ఆల్టైం హై 58,459ని టచ్ చేసింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 58,269 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,401 పాయింట్ల వద్ద మొదలై వెంటనే నష్టాలను చవి చూసింది. ఒక దశలో 17,377 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ కోలుకుని ఉదయం పది గంటల సమయంలో 4 పాయింట్ల లాభంతో 17,381 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి: ఎన్ఆర్ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్ 19 వేదిక -
రెండో రోజు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ మద్దతుతో వరుసగా రెండవ రోజు రికార్డు స్థాయికి పెరిగాయి. చివరకు, సెన్సెక్స్ 662.63 పాయింట్లు(1.16%) పెరిగి 57,552.39 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 201.20 పాయింట్లు (1.19%) లాభపడి 17,132.20 వద్ద ముగిసింది. సుమారు 1434 షేర్లు అడ్వాన్స్ అయితే, 1537 షేర్లు క్షీణించాయి, 105 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.99 వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ మరియు శ్రీ సిమెంట్స్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ & గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.(చదవండి: ఇదేం టెక్నాలజీ! మన తారలకు చెప్పుకోలేని తలనొప్పి) -
బుల్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, రూపాయి బలపడడం, ఎఫ్డీఐల వెల్లువ మధ్య మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయి. ఇక చివరకు, సెన్సెక్స్ 765.04 పాయింట్లు (1.36%) పెరిగి 56,889.76 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 225.80 పాయింట్లు (1.35%) లాభపడి 16,931 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.28 వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్, దివిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియాలు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, టిసీఎస్ షేర్లు టాప్ లూజర్లలో ఉన్నాయి. ఐటి మినహా ఇతర అన్ని సూచీలు లాభాలతో ముగిశాయి.(చదవండి: ఓలా, టెస్లాకు పోటీగా సింపుల్ ఎనర్జీ సంచలన నిర్ణయం) -
దేశీ సూచీల జోరు .. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికపు జీడీపీ గణాంకాలను కేంద్రం మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్ ఎఫెక్ట్ కారణంగా క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆటో సేల్స్ కూడా ఊపందుకుంటున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. రికార్డుల జోరు ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56,329 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పొందుతూ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. ఉదయం 10 గంటలకు 439 పాయింట్లు లాభపడి 56,564 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం జోరుమీదుంది. 123 పాయింట్లు లాభపడి 16,829 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత వారం 16,700 పాయింట్ల దగ్గర ఒడిదుడుకులు ఎదుర్కొన్న నిఫ్టీ ఈ సెషన్ ఆరంభంలోనే సునాయసంగా 16,800 పాయింట్లను క్రాస్ చేసింది. లాభాల బాట టైటాన్, టాటా స్టీల్, మారుతి సుజూకి, ఎంఅండ్ఎం, ఏషియన్ పేయింట్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సెర్వ్, భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాలను పొందాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. చదవండి: స్టాక్ మార్కెట్లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం -
స్టాక్ మార్కెట్లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారంలోనూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధిక ధరల వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయ డేటాతో పాటు ప్రపంచ పరిమాణాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేస్తాయని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా సూచీల ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. నిఫ్టీ పైపైకి ‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో సూచీల రికార్డు ర్యాలీ కొనసాగవచ్చు. లాభాల స్వీకరణ జరగకపోతే నిఫ్టీ 16,900 స్థాయిని అందుకుంటుంది. దిగువస్థాయిలో 16,550 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. మార్కెట్ను ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిశీలిస్తే.., క్యూ1 జీడీపీ గణాంకాలపైనే అందరి దృష్టి ... కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికపు (ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలను మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్ ఎఫెక్ట్ కారణంగా (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంచనాలు ఏమాత్రం తారుమారైనా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇతర స్థూల ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు... ఆటో కంపెనీలు ఆగస్ట్ వాహన విక్రయ గణాంకాలను బుధవారం విడుదల చేయనున్నాయి. దేశీయంగా కోవిడ్ ఆంక్షల సడలింపుతో ఉత్పత్తి ఊపందుకుంది. పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేతతో ఎగుమతులు పెరిగాయి. ఈ పరిణామాలతో ఆటో అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూలై నెల మౌలిక రంగ పనితీరు, ద్రవ్యలోటు గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఇక సెప్టెంబర్ 1వ తేదిన (బుధవారం) ఆగస్ట్ నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, ఆగస్ట్ మాసపు సేవల రంగపు డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. అదే శుక్రవారం ఆర్బీఐ ఆగస్ట్ 27వ తేదితో ముగిసే ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఈ వారంలో రెండు ఐపీఓలు... ఈ వారంలో ఒకే రోజున రెండు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ అమీ ఆర్గానిక్స్, హెల్త్ కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూలు సెప్టెంబర్ 1న మొదలై, మూడవ తేదీన ముగియనున్నాయి. ఈ రెండు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.2,465 కోట్లను సమీకరించనునున్నాయి. 4 నెలల తర్వాత తొలిసారి కొనుగోళ్లు నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ ఆగస్ట్లో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ ఆగస్టులో రూ.986 కోట్ల షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.13,494 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. అంచనాలకు కంటే ముందుగా వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో భారత్తో పాటు వర్థమాన దేశ మార్కెట్లలోకి చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ హెడ్ శ్రీవాస్తవ తెలిపారు. చదవండి : కేంద్రం చెబుతున్న మానిటైజేషన్తో ప్రయోజనం ఎవరికి ? ఆస్తుల నగదీకరణ ఎందుకు ? -
కోలుకున్న స్టాక్ మార్కెట్.. లాభాలతో ముగింపు
ముంబై : పెద్ద కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధించకుండా స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల అండతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను తప్పించుకుంది. అంతేకాదు మార్కెట్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్లకు లాభాలను సైతం అందివ్వగలిగింది. ఈ వారం చివరి సెషన్ చివరి భాగంలో మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. నష్టాల నుంచి లాభాల వైపు ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 55,862 పాయింట్లో మొదలైంది. కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 55,675 పాయింట్లను తాకింది. దీంతో ఈ సెషన్ నష్టాలతోనే ముగుస్తుందనే ఆందోలన నెలకొనగా ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్ కోలుకోవడం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పెరుగుతూ ఓ దశలో 56,188 పాయింట్లను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 175 పాయింట్లు లాభపడి 56,126 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్ గరిష్ట, కనిష్ట పాయింట్ల మధ్య తేడా 513 పాయింట్లు ఉండటం గమనార్హం, మరోవైపు నిఫ్టీ సైతం ఆరంభంలో నష్టాల పాలైనా మార్కెట్ ముగిసే సమయానికి 68 పాయింట్లు లాభపడి 16,705 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ఫిన్కార్ప్, సన్ఫార్మా షేర్లు లాభాలు పొందాయి, చదవండి : కొత్త ఐటీ చట్టాలపై కోర్టుకెక్కిన వాట్సాప్, ఫేస్బుక్ -
Stock Market: ప్రారంభ లాభాలు ఆవిరి!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం ఒంటి గంటలకు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ సూచీల అస్థిరత మధ్య దేశీయ మార్కెట్ సూచీల ప్రారంభ లాభాలు ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకొని స్వల్ప లాభాలతో ఇంట్రాడే ముగిసింది. చివరకు సెన్సెక్స్ 4.89 పాయింట్లు (0.01%) పెరిగి 55,949.10 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 2.20 పాయింట్లు (0.01%) లాభపడి 16,636.90 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద నిలిచింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగియగా.. భారతి ఎయిర్ టెల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, మారుతి సుజుకి, హిందాల్కో ఇండస్ట్రీస్ పవర్ గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను చూశాయి.(చదవండి: బంగారం ధరలు: మరింత ప్రియం!) -
స్టాక్ మార్కెట్లో అస్థిరత... నష్టాలతో ముగింపు
ముంబై : స్టాక్మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీ సూచీలు మరోసారి ఆల్టైం హై దిశగా పయణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రెండో సారి 56 వేల పాయింట్లను క్రాస్ చేయగా నిఫ్టీ సైతం 16,700 పాయింట్లను క్రాస్ చేసింది. మధ్యాహ్నం వరకు పాయింట్లు పెరుగుతూ పోయిన మార్కెట్ ఆ తర్వాత క్రమంగా నష్టపోవడం మొదలైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో సాయంత్రానికి సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో క్లోజవగా నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిసింది. లాభాలు ఆవిరి ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 56,067 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో ఏకంగా 56,198 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత నష్టాలను చవి చూస్తూ 55,899 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 14 పాయింట్లు నష్టపోయి 55,944 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోసారి 56 వేల మార్క్ను కాపాడుకోలేకపోయింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 16,654 పాయింట్లతో ప్రారంభమై 16,712 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 10 పాయింట్ల లాభంతో 16,634 పాయింట్ల వద్ద ముగిసింది. లాభనష్టాలు నిఫ్టీలో అదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కో, కోల్ ఇండియా, ఓన్జీసీ షేర్లు లాభాలు పొందగా బజాజ్ ఫిన్ సర్వీస్, టైటాన్ కంపెనీ, మారుతి సుజూకి, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల పాలయ్యాయి చదవండి: కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్కే జై కొడుతున్నారు -
బుల్ జోరు.. మదుపర్లకు లాభాల పంట!
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఈ రోజు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ అండ అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండనుందన్న ఎస్బీఐ అంచనాలు మార్కెట్ సెంటిమెంటును బలోపేతం చేశాయి. దీంతో స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 403.19 పాయింట్లు (0.73%) పెరిగి 55,958.98 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 128.10 పాయింట్లు (0.78%) లాభపడి 16,624.60 వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నేటి మార్కెట్లో లాభపడితే.. బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా ఇతర అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.(చదవండి: పసి‘ఢి’ పోరుకు.. మేం సిద్ధం..) -
వంద బిలియన్ల క్లబ్లోకి మరో భారతీయ కంపెనీ
Infosys:టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ అరుదైన రికార్డు సాధించింది. ఐటీ సేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ మరో రేర్ ఫీట్ను సొంతం చేసుకుంది. ఇండియా నుంచి వంద బిలియన్ డాలర్ల విలువైన కంపెనీల సరసన చేరింది. పెరిగిన షేర్ ధర ఈ ఏడాది ఆరంభం నుంచి షేర్ మార్కెట్ జోరుమీదుంది. ఫిబ్రవరిలో బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 50 వేల మార్క్ని దాటితే ఆగస్టులో 56 వేలు క్రాస్ చేసింది. అయితే ఇందులో ఎక్కువగా లాభపడింది ఐటీ కంపెనీలే. దీంతో గత కొంత కాలంగా ఐటీ కంపెనీల ఆస్తుల విలువ పెరుగుతోంది. మంగళవారం మార్కెట్లో ఇన్ఫోసిస్ ఒక షేర్ వాల్యూ ఒక శాతం పెరగింది. దీంతో ఒక షేర్ విలువ రికార్డు స్థాయిలో రూ.1,755.60కి చేరుకుంది. వంద బిలియన్ల క్లబ్లోకి దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో రెండవదిగా ఇన్ఫోసిస్కి గుర్తింపు ఉంది. బ్లూ చిప్ కేటగిరికి చెందిన ఇన్ఫోసిస్ షేర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజగా ఒక షేర్ వాల్యూ రూ.1,755.60కి పెరిగిపోవడంతో కంపెనీ విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది. ఇండియన్ కరెన్సీలో ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 7.45 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. నాలుగో కంపెనీ ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం మూడు వ్యాపార సంస్థల విలువ వంద బిలియన్ డాలర్లను దాటింది. అందులో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీలు ఉన్నాయి. వాటి తర్వాత వంద బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన నాలుగో సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. చదవండి : వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ -
స్థిరంగా స్టాక్ మార్కెట్.. ఫ్లాట్గా కొనసాగుతున్న సూచీలు
ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా మార్కెట్ ఆరంభంలో భారీ స్థాయిలో లాభాలు ఉంటుండగా ఈ రోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీకి 56,000 దగ్గర ఎన్ఎస్ఈ నిఫ్టీకి 16,700 పాయింట్ల దగ్గర గట్టి నిరోధత ఎదురవుతోంది. గత సెషెన్స్లో ఆల్టైం హై పాయింట్లను టచ్ చేసిస సూచీలు తిరిగి ఆ స్థాయిలను ఇంకా అందుకోలేదు. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 55,647 పాయింట్లతో మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి కేవలం 4 పాయింట్లు లాభపడి 55,560 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీలో ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 16,532 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి : One Plus Buds Pro: స్ట్రెస్ను తగ్గించే ఇయర్ బడ్స్, ధర ఎంతంటే -
లాభాలతో ఆరంభమైన స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లో మరోసారి సానుకూల వాతావరణం నెలకొంది. మార్కెట్ ప్రారంభం అవడం ఆలస్యం ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిండంతో వరుసగా లాభాలు పొందుతూ పోయింది. మార్కెట్ మొదలైన అరగంటకే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి. గత వారం చివర్లో నష్టపోయిన పాయింట్లను తిరిగి పొందే ప్రయత్నం చేశాయి. అయితే అంతలోనే చెరో యాభై పాయింట్లు కోల్పోయాయి. అంతర్జాతీయ, ఏషియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం కారణంగానే దేశీ సూచీలు లాభాలను చూపిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 55,695 పాయింట్ల మొదలైంది. ఆ వెంటనే వరుసగా పొయింట్లు పొందుతూ ఉదయం 9:45 గంటల సమయంలో 363 పాయింట్లు లాభపడి 55,693 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 16,550 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్ సూచీలు ఇదే జోరు కొనసాగిస్తే గత వారం నమోదు చేసిన ఆల్టై హై పాయింట్లను టచ్ చేసే అవకాశం ఉంది. చదవండి: Fund Review : రిస్క్ తట్టుకుంటే రాబడులు -
నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్... భారీగా పతనమైన సెన్సెక్స్
ముంబై: అమెరికాలో ద్రవోల్బణం ఎక్కువగా ఉందంటూ ఫెడరల్ రిజర్వ్ , యూఎస్ఏ చేసిన ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి. ఏసియా మార్కెట్లలో అస్థిరత నెలకొంది. దాని ప్రభావం దేశీ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు ముగిసే వరకు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు నిఫ్టీలు వరుసగా పాయింట్లు కోల్పోతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 55,159వ పాయింట్లతో ప్రారంభమైంది. వెంటనే పాయింట్లూ కోల్పోతూ నష్టాల దిశగా వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొద్ది సేపు మాత్రం గరిష్టంగా స్థాయిలకు చేరుకుని 55,543 పాయింట్ల దగ్గర ట్రేడయ్యింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 380 పాయింట్లు నష్టపోయి 55,248 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 150 పాయింట్లు నష్టపోయి 16,418 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్యాంకుషేర్లు నష్టాలపాలయ్యాయి. బ్లూచిప్ కంపెనీగా పేర్కొనే టాటా స్టీల్ షేర్లు సైతం నష్టాల బారిన పడ్డాయి. కోటక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, లార్సెన్ అండ్ ట్రూబో షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, మారుతి, హెచ్యూఎల్ షేర్లు లాభపడ్డాయి. చదవండి: ఫోన్ కంపెనీలకు గూగుల్ భారీ ఆఫర్.. సీక్రెట్ కాంట్రాక్ట్లపై ఆగ్రహం -
బుల్ జోరుకు బ్రేకులు.. నష్టాలతో ముగిసిన మార్కెట్
ముంబై : రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో గత నాలుగు సెషన్లుగా జోరు కొనసాగిస్తున్న బుల్కి బ్రేకులు పడ్డాయి. ప్రారంభం భారీ లాభాలతో మొదైలన మార్కెట్ మధ్యాహ్ననం సమయానికి నష్టాల దిశగా వెళ్లింది. అయితే మార్కెట్ మరి కొద్ది సేపట్లో ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు నమ్మకం కనబరచడంతో మార్కెట్ కొంత మేర కోలుకుంది కొత్త రికార్డులు దేశీ సూచీలు ఈ రోజు మార్కెట్లో కొత్త ఎత్తులకు చేరాయి. సెన్సెక్స్ 57 వేల మార్క్ని టచ్ చేయగా నిఫ్టీ 16,700 మార్క్ని అందుకుంది. ఆగస్టు 13న సెన్సెక్స్ 55 వేలు క్రాస్ చేయగా కేవలం నాలుగు సెషన్స్లోనే రికార్డులు బద్దలు కొడుతూ ఆగస్టు 18న 56 వేలు క్రాస్ చేసింది. అంతకు ముందు 54,000 నుంచి 55,000కి రావడానికి ఏడు సెషన్లు, 53,000 నుంచి 54 వేలకి రావడానికి 30 సెషన్ల సమయం తీసుకుంది. ఇక 52,000 నుంచి 53,000లు టచ్ చేసేందుకు ఏకంగా 85 సెషన్లు పట్టింది. ఈ ఏడాదిలో ఈ వారమే సెన్సెక్స్ అత్యధిక పాయింట్లు పొందింది. మరోవైపు నిఫ్టీ సైతం రికార్డులు బద్దలు కొడుతూ 16,700 మార్క్ని దాటింది. ఆ తర్వాత మార్కెట్ ఒత్తిడి లోను కావడంతో ఇటు నిఫ్టీ, అటు సెన్సెక్స్లు తమ రికార్డులను నిలబెట్టుకోలేక పోయాయి. ఇకపై మార్కెట్లో బుల్ ట్రెండ్ కొనసాగాలంటే లార్జ్ క్యాప్ షేర్లు ప్రభావం చూపించాల్సి ఉంటుంది. నష్టాలతోనే ముగింపు ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 56,073 పాయింట్లతో ప్రారంభమైంది. ఒక దశలో 56,118 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 55,514 పాయింట్లకు పడిపోయంది. మార్కెట్ ముగిసే సమయానికి కొంత మేర కోలుకుని 162 పాయింట్లు నష్టపోయి 55,629 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ సైతం 45 పాయింట్లు నష్టపోయి 16,568 పాయింట్ల వద్ద ముగిసింది. -
ఆల్టైం హై టచ్ చేసిన సెన్సెక్స్... స్టాక్మార్కెట్లో బుల్ జోరు
ముంబై: స్టాక్మార్కెట్లో కొనసాగుతున్న బుల్జోరు ఇప్పుడప్పిడే ఆగేలా లేదు. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడులకు తట్టుకుంటూ కొత్త ఎత్తులను చేరుతున్నాయి. మంగళవారం రోజు సెన్సెక్స్ ఒక దశలో రికార్డు స్థాయిలో పాయింట్లు లాభపడి 55,854 పాయింట్లను టచ్ చేసి రికార్డు సృష్టించింది. కరోనా కట్టడిలో ఉండటంతో పాటు ఆఫ్ఘన్ వ్యవహరంలో అమెరికా స్థిరమైన అభిప్రాయానికి కట్టుబడి ఉండటంతో అంతర్జాతీయ సూచీలు స్థిరంగా కదలాడుతున్నాయి. దీనికి దేశీ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణం కలిసి వచ్చింది. ఫలితంగా ప్రారంభంలో దేశీ సూచీలు నష్టాలను చవి చూసినా ఎప్పటిలాగే తిరిగి కోలుకుని లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 55,565 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లు కోల్పోతూ 55,386 పాయింట్లను తాకింది. ఇక మార్కెట్లో కరెక్షన్ మొదలైందని అనుకునేలోగా ఒక్కసారిగా పుంజుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 209 పాయింట్లు లాభపడి 55,792 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 51 పాయింట్లు లాభపడి 16,614 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్మహీంద్రా, టీసీఎస్, నెస్టల్ ఇండియా, టైటాన్ కంపెనీ, హిందూస్థాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ కంపెనీల షేర్లు సెన్సెక్స్లో లాభాలు పొందాయి. మరోవైపు ఇండస్ఇండ్బ్యాంకు, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటాస్టీల్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 0.6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఐటీ 2.57 శాతం పెరిగింది. -
జోరు తగ్గని స్టాక్ మార్కెట్... లాభాల్లో సూచీలు
ముంబై : ఈ వారం లాభాలతో మార్కెట్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల దిశగా ప్రయాణించిన మార్కెట్ ఆ తర్వాత పుంజుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు మార్కెట్పై నమ్మకం చూపించడంతో పాటు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టిందంటూ వార్తలు వెలువడంతో మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. ద్రవ్యోల్బణ ప్రమాదం లేదని తేలడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 55,479 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లను కోల్పోయింది. ఓ దశలో ఏకంగా 55,281 పాయింట్లకు పడిపోయింది. ఇక ఇన్వెస్టర్లకు నష్టాలు తప్పవనుకునే క్రమంలో మళ్లీ పుంజుకుంది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 145 పాయింట్లు లాభపడి 55,582 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 34 పాయింట్లు లాభపడి 16,563 పాయింట్ల వద్ద ముగిసింది. టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్ సర్వీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభపడ్డాయి. మారుతి సుజూకి, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, అల్ర్టాటెక్ సిమెంట్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి -
నష్టాలతో మొదలైన మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెట్టడంతో ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సూచీలు వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. దేశీయంగా మార్కెట్పై ప్రభావం చూపే నిర్ణయాలు, సంఘటనలు చోటు చేసుకోకపోయినా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. గత వారం మొత్తం బుల్ జోరు కొనసాగగా.. ఈ వారం నష్టాలతో మార్కెట్ మొదలైంది. ఈరోజు ఉదయం సెన్సెక్స్ 55,479 పాయింట్లతో మొదలైంది. మార్కెట్ ప్రారంభైమంది మొదలు ఒత్తిడి లోనైంది. వరుసగా పాయింట్లు కొల్పోతూ వస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో 54 పాయింట్లు నష్టపోయి 55,383 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం నష్టాల దిశగానే ప్రయాణం చేస్తోంది. 40 పాయింట్లు నష్టపోయి 16,499 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు లాభాలు పొందగా బజాజ్ ఆటో , పవర్ గ్రిడ్, మారుతి, టైటాన్, ఏషియన్ పెయింట్ షేర్లు సెన్సెక్స్లో నష్టాలను చవి చూశాయి. -
బుల్ జోరు...స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులు
ముంబై: బుల్ రంకెలు వేయడంతో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కింది. దేశీ సూచీలు సరికొత్త ఎత్తులకు చేరుకున్నాయి. బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఉదయం మొదలైన జోరు సాయంత్రం మార్కెట్ ముగిసే వరకు కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సూచీ జోరు తగ్గడం లేదు. ఆగస్టు మొదలైనప్పటి నుంచి సెన్సెక్స్ సూచీ పైకి చేరుకుంటూనే ఉంది. అదో ఊపులో శుక్రవారం యాభై ఐదు వేల మార్క్ని క్రాస్ చేసింది. ఈరోజు ఉదయం 54,91 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓ దశలో 55,847 పాయింట్లను తాకింది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 593 పాయింట్లు లాభపడి 55,437 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ సైతం ఇదే జోరు కొనసాగించింది. ఈరోజు ఉదయం 16,385 పాయింట్లతో ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి 164 పాయింట్లు లాభపడి 16,529 పాయింట్లకు చేరుకుంది. ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్లో టాటా కన్సుమర్ ప్రొడక్ట్ షేర్లు అత్యధిక లాభం పొందగా ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలు పొందాయి. టెక్మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా షేర్లు నష్టాలను చవి చూశాయి. బ్యాంక్ నిఫ్టీ అర శాతం పైకి చేరుకుంది. -
స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. ఆల్టైం హై టచ్ చేసిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణానికి విదేశీ ఇన్వెస్టర్లు తోడవడంతో షేర్ మార్కెట్లో రికార్డులు బద్దలవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఆల్టైం హై పాయింట్లను టచ్ చేశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,641 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మొదలు పెట్టడంతో వరుసగా పాయింట్లు లాభపడుతూ పోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో 54,874 పాయింట్లను టచ్ చేసింది. చాలా సేపు అక్కడే కొనసాగింది. ఇక మార్కెట్ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా కొద్దిగా నెమ్మదించింది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 54,843 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీలోనూ ఇదే జోరు కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి 83 పాయింట్లు లాభపడి 16,364 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా నిఫ్టీ ఆల్టైం హై పాయింట్లు సాధించింది. -
ఫ్లాట్గా ప్రారంభం.. నష్టాలతో ముగింపు
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ బుధవారం చివరి గంటలో నష్టాలను మూటగట్టుకుంది. మరో గంటలో మార్కెట్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఉత్సాహం చూపటడంతో సెన్సెక్స్ ఒత్తిడికి లోనైంది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 54,730 పాయింట్లతో ప్రారంభమయ్యింది. తొలి గంట సేపు పాయింట్లను పొందుతూ ఒక దశలో గరిష్టంగా 54,758 పాయింట్లను తాకింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు సూచీ ఫ్లాట్గానే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువై పోవడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలుపెట్టింది. చివరకు మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 28 పాయింట్లు నష్టపోయి 54,525 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం నష్టాల దిశగా పయణించినా చివరి అరగంటలో కోలుకుంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి కేవలం రెండు పాయింట్లు లాభపడి 16,282 పాయింట్ల వద్ద ఆగిపోయింది. టాటీ స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు పొందగా కోటక్ మహీంద్రా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, నెస్టల్ షేర్లు నష్టాలు పొందాయి. బ్యాంకు నిఫ్టీ కిందివైపు 0.63 శాతం నమోదైంది. -
రెండోరోజు అదే జోరు.. లాభాల్లో మార్కెట్
ముంబై: ఐటీ, బ్యాంకు షేర్లు లాభాలు అందిస్తుండటంతో స్టాక్ మార్కెట్ జోరు తగ్గడం లేదు. మంగళవారం కూడా మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరుగుతూ పోయాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 54,461 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లూ పుంజుకుంటూ పైపైకి పోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో 214 పాయింట్లు లాభపడి 54,617 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 16,274 పాయింట్ల వద్ద మొదలై 60 పాయింట్లు లాభపడి 16,317 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. -
మార్కెట్లో అస్థిరత.. చివరకు లాభాలతో ముగింపు
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం నుంచే దేశీ సూచీలు లాభాల బాటలో పయణించాయి. మధ్యలో కొంత వరకు ఊగిసలాడినా చివరకు లాభాలతోనే ఈ రోజు మార్కెట్ ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,385 పాయింట్ల వద్ద ట్రేడ్ మొదలైంది. మొదటి గంటలోనే దాదాపు 250 పాయింట్లు లాభపడింది. ఓ దశలో గరిష్టంగా 54,584 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలుపెట్టడంతో మళ్లీ పాయింట్లు కోల్పోవడం మొదలైంది. మార్కెట్ ముగిసే సమయానికి 125 పాయింట్ల లాభంతో 54,402 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ ఈ రోజంతా ఒడిదుడుకులకు లోనైంది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత లాభాల బాటలో పయణిస్తూ ఓ దశలో గరిష్టంగా 16,320 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత నష్టపోతూ కనిష్టంగా 16,203 పాయింట్లను తాకింది. మరికొద్ది సేపట్లో మార్కెట్ ముగుస్తుందనగా కోలుకుని 20 పాయింట్ల లాభంతో 16,258 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. -
లాభాలతో మొదలైన మార్కెట్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్పై ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచడంతో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లో మొదలైంది. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,385 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో వరుసగా పాయింట్లు పొందుతూ పైపైకి చేరుకుంది. ఉదయం 9:50 గంటల సమయంలో 253 పాయింట్లు లాభపడి 54,531 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ సైతం 64 పాయింట్లు లాభపడి 16,302 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్లో ఎంఅండ్ఎం, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభాలు పొందగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల పాలయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ లాభం పొందగా ఆటో నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ నష్టపోయింది. గత వారం ఐపీవోకి వచ్చిన రోలేక్స్ రింగ్స్ షేర్లు 130 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ సాధించాయి. ఈవారం నిర్మా గ్రూపు నుంచి నువోవో విస్టా, కార్ ట్రేడ్లు ఐపీవోకి వస్తున్నాయి. -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్మార్కెట్ అస్థిరతకు లోనైంది. రోజంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడింది, చివరకు ఈవారాన్ని నష్టాలతో ముగించింది. గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో లాభాలు అందించిన మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తున్నా.. రిపోరేటు, రివర్స్ రిపోరేటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. బీఎస్సీ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,492 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే స్వల్ప నష్టాలపాలైన వెంటనే కోలుకుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే రెండు వందలకు పైగా పాయింట్లు నష్టపోయి 54,210 పాయింట్లకు పడిపోయింది, ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 215 పాయింట్లు నష్టపోయి 54,277 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం ఒడిదుడుకులకు లోనైంది. చివరకు 56 పాయింట్లు నష్టపోయి16,238 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫ్ఫ్యూచర్ గ్రూపు వివాదంలో రిలయన్స్కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత ఆల్ట్రాటెక్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు లాభాలు పొందాయి. ఇక ఈ రోజు లాభపడిన షేర్లలో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజూకి ఇండియాలు ఉన్నాయి. -
స్థిరంగా స్టాక్ మార్కెట్.. స్వల్ప లాభాల్లో సూచీలు
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు భారీ లాభాలను చూసిన స్టాక్ మార్కెట్ శుక్రవారం స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఈ వారం ప్రారంభం నుంచి రికార్డు స్థాయిలో లాభాలు చూసిన మార్కెట్లో కరెక్షన్ ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే శుక్రవారం ఉదయం నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉండగా. సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో మొదలై.. ఆ వెంటనే కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్తో పాటు ఏషియా మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలు ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో శుక్రవారం మార్కెట్ ఫ్లాట్గా కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,492 పాయింట్లతో మొదలైంది. కొద్ది సేపటికి కేవలం 2 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 11 పాయింట్లు లాభపడి 54,504 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 16,301 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు మార్కెట్లో గ్లెన్మార్క్ లైఫ్ సెన్సైన్స్ లిస్ట్ అయ్యింది. పదిహేను వందల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ కంపెనీ స్టాక్మార్కెట్లోకి వచ్చింది. -
సెన్సెక్స్ ఆల్టైం రికార్డు
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. దీంతో నిఫ్టీ సరికొత్త రికార్డులు నెలకొల్పిన మరుసటి రోజే సెన్సెక్స్ కూడా అదే పని చేసింది. 54,000 వేల పాయింట్లను బుధవారం అవలీలగా దాటేసింది. 54,000 క్రాస్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. నెలన్నర రోజుల్లో తన ఖాతాలో మరో వెయ్యి పాయింట్లు జమ చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 50వేల మార్క్ని దాటిన సెన్సెక్స్ జూన్ 22న సెన్సెక్స్ పాత రికార్డులు బద్దలు కొడుతూ 53 వేల మార్క్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత 54 వేలు చేరడానికి కేవలం 30 సెషన్లు మాత్రమే తీసుకుంది. బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు సెన్సెక్స్ సూచీ పైకి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 546 పాయింట్లు లాభపడి 54,369 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఓ దశలో 54,465 గరిష్ట పాయింట్లకు చేరుకుంది. నిన్న పదహారు వేల మార్క్ని క్రాస్ చేసిన నిఫ్టీ ఈ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగించింది. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 122 పాయింట్లు లాభపడి 16,253 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. పాజిటివ్ ట్రెండ్ జూన్ నెలలో వివిధ కంపెనీలు ప్రకటించిన క్వార్టర్ ఫలితాలు ఆశజనకంగా ఉండటంతో మార్కెట్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కోవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత స్మాల్, మిడ్క్యాప్ కంపెనీలు వ్యాపారాలు పుంజుకున్నాయి. మరోవైపు కోవిడ్ వ్యాప్తి కంట్రోల్లోనే ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపించారు. లాభపడ్డ షేర్లు హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుల షేర్లు లాభాలు పొందగా టైటాన్, నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ కంపెనీలు సెన్సెక్స్లో నష్టాలు పొందాయి. మరోవైపు మార్కెట్లో బులట్రెండ్ కొనసాగుతుండటంతో స్మాల్క్యాప్, మిడ్క్యాప్ షేర్లు లాభపడ్డాయి. -
నిఫ్టీ రికార్డ్ ... 16 వేలు క్రాస్.. లాభాల్లో ఇన్వెస్టర్లు
ముంబై: ఇన్వెస్టర్లు లాభాలబాట పట్టారు. శరవేగంతో సెస్సెక్స్ పైపైకి చేరుకుంది. నిఫ్టీ తొలిసారిగా పదహారువేల మార్క్ను దాటింది. మొత్తంగా మంగళవారం మార్కెట్లో మంగళకర ఫలితాలు వెలువడ్డాయి. గతవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ మార్కెట్ ఈ రోజు రికార్డు సృష్టించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ రెండు ప్రధాన సూచీలు జీవితకాల గరిష్ఠాలను టచ్ చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ తొలిసారి 16 వేల మార్క్ను దాటింది. సెన్సెక్స్ దూకుడు బాంబే స్టాక్ ఎక్సేంజీలో ఈ రోజు సెన్సెక్స్ 52,125 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా లాభాలు పొందుతూ పోయింది, మార్కెట్ ముగిసే సమయానికి 872 పాయింట్లు లాభపడి 53,823 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 937 పాయింట్లు లాభపడి 53,887 పాయింట్లను టచ్ చేసింది. యాభై నాలుగు వేల మార్క్ని క్రాస్ చేస్తుందా అన్నట్టుగా సెన్సెక్స్ దూకుడు కొనసాగింది. నిఫ్టీ రికార్డు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ తొలిసారిగా పదహారు వేల మార్క్ని దాటింది. ఈ రోజు ఉదయం 15,951 పాయింట్లతో మార్కెట్ ప్రారంభమయ్యింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో నిఫ్టీ క్రమంగా పైపైకి చేరుకుంటూ పదహారు వేల మార్క్ని దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి 245 పాయింట్లు లాభపడి 16,130 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల బాట ఈ రోజు మార్కెట్లో మెటల్ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ 30 సూచీలో టైటన్, టైటన్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, సన్ఫార్మా, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎన్టీపీసీ నష్టాలు చవిచూశాయి. సానుకూల సంకేతాలు కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే సంకేతాలు ఇవ్వడం, ఆగస్టులోకి ప్రవేశించినా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండటంతో ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి తోడు మాన్యుఫ్యాక్కరింగ్ సెక్టార్ మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడం కూడా మార్కెట్కి ఊతం ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుడులు పెట్టేందుకు పోటీ పడ్డారు. -
నిఫ్టీ పదహారువేల మార్క్ దాటేనా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలే ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు. పైన పేర్కొన్న అంశాలతో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ.., ప్రాథమిక మార్కెట్లో ఐపీఓలకు లభిస్తున్న అపూర్వ ఆదరణతో స్టాక్ మార్కెట్లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కొనసాగుతోంది. ఈ వారంలోనూ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవ్వొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. దిగువస్థాయిలో 15,600 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో దేశీయ మార్కెట్ రెండోవారమూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆటో, బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో గతవారంలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను నష్టపోయాయి. అందరి చూపు ఆర్బీఐ వైపు... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం(ఆగస్ట్ 4న) ప్రారంభం కానుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను ఆగస్ట్ ఆరున ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత్దాస్ వెల్లడించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చని ఆర్థివేత్తలు భావిస్తున్నారు. అయితే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఆర్బీఐ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాలు... ఆటో కంపెనీలు జూలై వాహన విక్రయ గణాంకాల విడుదలను ఆగస్ట్ ఒకటి నుంచి వెల్లడించడం షురూ చేశాయి. పలు కంపెనీలు వాహన ధరల్ని పెంచిన నేపథ్యంలో వాహన అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం ఉండొచ్చు. కావున ఈ రంగ స్టాకులు అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వొచ్చు. ఇక ఆగస్ట్ రెండో తేదిన (సోమవారం) జూలై నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, జూన్ మాసపు తయారీ రంగపు డాటా 4వ తేదిన(బుధవారం) వెల్లడికానున్నాయి. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అవంతీ ఫీడ్స్, అల్కేమ్ అమైన్స్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, సిప్లా, డాబర్, ఇమామీ, ఎస్కార్ట్స్, గెయిల్, గ్లెన్మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, వోడాఫోన్ ఐడియా, నాల్కో, ఇన్ఫోఎడ్జ్, పీఎన్బీ, ఎస్బీఐ, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్ వంటి ప్రధాన కంపెనీలు వాటి జూన్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను వెల్లడించనున్నాయి.ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. నాలుగు ఐపీఓలు... ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో ఒకేరోజు నాలుగు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయాగ్నటిక్స్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.3,614 కోట్లను సమీకరించనునున్నాయి. ఈ ఐపీఓలు ఆగస్ట్ నాలుగవ తేదీ (బుధవారం)న ప్రారంభమై.., ఎనిమిదో తేది (శుక్రవారం) ముగియనున్నాయి. ఆగస్ట్ 6న గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ లిస్టింగ్... హెల్త్కేర్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ షేర్లు శుక్రవారం(ఆగస్ట్ 6న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓను ఈ జూలై 27– 29 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 695–720 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,514 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓ చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.720తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.130–150 మధ్య ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. నాలుగో నెలలో అమ్మకాలే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర అమ్మకందారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ జూలైలో రూ.23,193 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గతేడాది మార్చి నెల తర్వాత ఎఫ్ఐఐలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలకు పాల్పడటం ఇదే తొలిసారి. గతవారంలో ఏకంగా రూ.10,288 విలువైన షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు ధీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతూ సూచీలకు భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ఈ నెలలో డీఐఐ రూ.18,394 కోట్ల షేర్లను కొన్నారు. గత ఒక్క వారంలోనే రూ.8,206 కోట్ల షేర్లను కొన్నారు -
రిస్క్ తక్కువ,.. రాబడి ఎక్కువ...
మన రోజువారి అవసరాలు తీర్చే బహుల జాతి కంపెనీలు (ఎంఎన్సీలు) పెట్టుబడుల విషయంలో.. ఎంతో విశ్వసనీయంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంఎన్సీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే (థీమ్యాటిక్) పథకాలను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్ఎసీ ఫండ్ కూడా ఒకటి. ఈక్విటీల్లో తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఎంఎన్సీ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ పెట్టుబడుల విషయంలో మూడు రకాల విధానాలను అనుసరిస్తుంటుంది. భారత్కు చెందిన బహుళజాతి సంస్థలు (మన దేశంలో లిస్ట్ అయ్యి విదేశాలకూ వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన కంపెనీలు), భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇక్కడి స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్ట్ అయిన విదేశీ కంపెనీలు, భారత్లో లిస్ట్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఈ పథకం పెట్టబడులకు ఎంపిక చేసుకుంటుంది. వినియోగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, మెటల్స్, ఐటీ, సిమెంట్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించిన ఎంఎన్సీ కంపెనీలు పోర్ట్ఫోలియోలో భాగంగా ఉంటాయి. బహుళజాతి సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్లో అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తుంటాయి. నిపుణుల ఆధ్వర్యంలో డైనమిక్గా పనిచేస్తుంటాయి. లాభాల నుంచి వాటాదారులకు ఎక్కువ డివిడెండ్ కూడా పంచుతుంటాయి. కనుక స్థిరమైన రాబడులకు వీటిని మార్గంగా నిపుణులు పరిగణిస్తుంటారు. బలమైన బ్రాండ్, దండిగా నగదు నిల్వలు ఎంఎన్సీ కంపెనీల్లో చూడొచ్చు. అందుకే పరిణతి కలిగిన ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో ఎంఎన్సీ కంపెనీలకు చోటిస్తుంటారు. ఈ తరహా లక్షణాలు ఉండడం వల్ల ఇతర రంగాల థీమ్యాటిక్ పథకాలతో పోలిస్తే ఎంఎన్సీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ తక్కువ అస్థిరతలను ఎదుర్కొంటుంటాయి. సెబీ నిబంధనల మేరరు ఎంఎన్సీ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతం పెట్టుబడులను బహుళజాతి కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ మేరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎంఎన్సీ పథకాల్లోనూ సైక్లికల్ (రాబడుల్లో స్థిరత్వం లేని), డిఫెన్సివ్ (స్థిరమైన రాబడులతో రక్షణాత్మకమైనవి) ఉంటాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ పథకం 20 శాతం పెట్టుబడులను అంతర్జాతీయ ఎంఎన్సీలకు కేటాయించింది. వీటిల్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీలున్నాయి. దేశీయ ఎంఎన్సీ కంపెనీల విషయానికొస్తే.. ఈ పథకం పెట్టుబడుల్లో 61 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 26.5 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియో మొత్తం మీద వైవిధ్యంతో కూడుకుని ఉంది. దేశీయ కంపెనీల్లో కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, సాఫ్ట్వేర్, ఆటో, పారిశ్రామిక ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ రంగానికి చెందినవి ఉన్నాయి. రాబడులు పెట్టుబడుల విషయంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ మంచి పనితీరే చూపిస్తోంది. ఈ పథకానికి దీర్ఘకాల రాబడుల చరిత్ర లేదు. ఎందుకంటే 2019 జూన్లో ప్రారంభమైంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 28 శాతంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. మెరుగైన రాబడులుగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంచ్మార్క్తో పోల్చి చూసినా లేక ఎంఎన్సీ థీమ్యాటిక్ విభాగం రాబడులతో చూసినా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ రాబడులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. -
రెండో రోజు నష్టాలతోనే ప్రారంభం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాలను తోడు థర్డ్వేవ్ భయాలు వెంటాడుతుండటంతో అమ్మకాలకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు సూచీలు నష్టాలతోనే మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయంలో 301 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 52,252 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిన్న సెన్సెక్స్ 52,553 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు 52,432 పాయింట్లతో మొదలైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 15,652 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పేయింట్స్, పవర్గ్రిడ్ షేర్లు లాభాలు పొందగా హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
పాజిటివ్ మోడ్లో స్టాక్ మార్కెట్
దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. అయితే సెన్సెక్స్ నిన్నటి ఆల్టైం హై రికార్డును నిలుపుకోలేకపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ పైకి దూసుకుపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ నిన్నటి కంటే కొంచెం తక్కువగా 52,700ల కిందికి చేరుకుంది. ఎన్ఎస్సీ నిఫ్టీ సూచీ 15,800 దగ్గర నమోదైంది. లాభాల బాటలో సెన్సెక్స్ సూచీలో ఇండస్ఇండ్ బ్యాంకు అత్యధిక లాభాలు ఆర్జించగా ఆ తర్వాత స్థానంలో మారుతి, సుజూకి, టైటాన్, హెయూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఉన్నాయి. నిఫ్టీలో ఫార్మా సూచీలు పైకి ఎగబాకుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ స్వల్పంగా 0.13 పైకి చేరుకుంది. చదవండి : షేర్ మార్కెట్.. సెన్సెక్స్ ఆల్టైం రికార్డు -
నాలుగు రోజుల్లో భారీగా నష్టపోయిన గౌతమ్ అదానీ.. ఎంతంటే?
భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 2021 ఏడాదిలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లూ భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఏడాదిలో ఏ మేరకు లాభపడ్డాయో ఎన్ఎస్డీఎల్ సమస్య తర్వాత నాలుగు రోజుల్లోనే అంతేస్థాయిలో కుప్పకూలాయి. దీంతో కేవలం నాలుగు సెషన్లలో స్టాక్స్ పతనం కావడంతో కొన్ని కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. దీంతో గౌతమ్ ఆదానీ సంపద, అదానీ గ్రూప్ సంపద వేగంగా కరిగిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టపోవడంతో ఈ 58 ఏళ్ల బిలియనీర్ సంపద నాలుగు రోజుల్లో 14 బిలియన్ డాలర్ల(రూ.1,03,737 కోట్ల) మేర కరిగిపోయింది. ఈ ఏడాదిలో ఎంత వేగంగా అదానీ గ్రూప్ షేర్లూ పెరిగాయో అంతకంటే వేగంగా తగ్గాయి. ప్రపంచంలోనే ఈ వారంలో అత్యంత సంపద కోల్పోయిన వ్యాపారవేత్తగా ఆదానీ నిలిచారు. ఆయన సంపద ఏకంగా 62.1 బిలియన్ డాలర్స్(రూ.4,60,143 కోట్ల)కు తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది కూడా అదానీయే. దీంతో ఆయన ఆసియా ధనికుడి స్థానంలో రెండు నుంచి మూడవ స్థానానికి పడిపోయారు. చైనా టైకూన్ జోంగ్ షాన్ తిరిగి రెండవ స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికీ మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. చదవండి: వర్షాకాలంలో కారు ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా? -
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిసాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో మదుపర్లు అమ్మకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఉదయం 49,067 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 740.19 పాయింట్ల నష్టంతో 48,440.12 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 224.50 పాయింట్ల నష్టంతో 14,324.90 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 72.62గా ఉంది. నిఫ్టీలో మారుతీ సుజుకీ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. చదవండి: భారత మార్కెట్లోకి బీఎండబ్య్యూ 220ఐ స్పోర్ట్ -
రూ. 50 కోట్లు ముంచేసి.. రాత్రికి రాత్రే పరార్
సాక్షి, మక్తల్: లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్ ఇస్తానని చెప్పి, సుమారు రూ. 50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ పరిధిలోని రామకృష్ణారావుపేటకు చెందిన షేక్ మహిబూబ్ సుబానీ, భార్యాపిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి వలస వచ్చాడు. గుర్లపల్లి రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ‘మిత్ర’పేరుతో ఫర్టిలైజర్ షాపును తెరిచి పురుగు మందులను అమ్మేవాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకున్న అనంతరం ఆరు నెలల క్రితం దుకాణం మూసేసి, మిత్ర ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటుచేసి షేర్ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టాడు. రూ.లక్ష ఇస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్ వస్తుందని డిపాజిట్దారులను నమ్మించాడు. దీంతో బాధితులు ఐసీఐసీఐ గద్వాల బ్రాంచ్లో ‘మిత్ర’సంస్థ పేరిట డబ్బులు జమచేసి రసీదును సుబానీకి ఇచ్చేవారు. ఆ డబ్బులతో మక్తల్ మండలం మంతన్గోడ్, ఊట్కూర్లో పదెకరాల చొప్పున సుబానీ కొనుగోలు చేశాడు. నెల క్రితం తన కుమారుడు షేక్ అస్జర్అలీ యజమానిగా శ్రీఅంజలి పేరుతో జ్యువెలరీ షాపు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈనెల 21న మక్తల్ మండలం చందాపూర్కు చెందిన హన్మంతు రూ.ఐదు లక్షలు సుబానీకి ఇచ్చాడు. చదవండి: (టార్గెట్ రూ.216 కోట్లు! దొంగిలించేందుకు యత్నం) బుధవారం తమ షాపు వద్దకు వస్తే ఐదు తులాల బంగారంతో పాటు నెలకు రూ.30 వేల చొప్పున కమీషన్ ఇస్తానని సుబానీ ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. బుధవారం అక్కడికి వెళ్లిన హన్మంతు షాపు మూసి ఉండటంచూసి కంగుతిన్నాడు. విషయం మిగతా వారికి చెప్పడంతో ఆరా తీయగా ఈనెల 23న అర్ధరాత్రే సుబానీ కుటుంబసభ్యులతో కలిసి ఇల్లు, దుకాణం ఎత్తేసి పరారయ్యాడని తెలిసింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు మొదలుకుని రూ.25 లక్షల వరకు, సుమారు ఐదొందల మంది నుంచి డబ్బులు వసూలు చేశాడని సమాచారం. బాధితుల ఫిర్యాదుతో ఎస్ఐ రాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల బుధవారం ట్రేడింగ్ను కరోనా వేవ్ భయాలు చుట్టుముట్టాయి. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ కారణం చేత మదుపరులు వారి షేర్లను అమ్మకాలకు పెట్టారు. దీనితో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం నుంచి ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు. ఉదయం 49,786 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకి 49,851 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద ముగిసింది. ఇక 14,712 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ట్రేడింగ్ మొత్తం 14,535-14,752 మధ్య కదలాడుతూ చివరకు 265 పాయింట్ల నష్టంతో 14,549 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.61 వద్ద ఉంది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. సిప్లా, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభాలతో ముగిస్తే.. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిసాయి. చదవండి: భారత్లో స్టార్టప్ సంస్థల జోరు.. -
నష్టాల నుంచి తేరుకున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ను లాభాల్లో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుస నష్టాల నుంచి తేరుకున్న సూచీలు మరింత ఎగిసి ఉత్సాహంగా కొనసాగాయి. కొంచెం సేపు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ తర్వాత తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఉదయం 49,876 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 49,661 వద్ద కనిష్ఠాన్ని తాకి 50,264 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 280 పాయింట్లు లాభపడి 50,051 వద్ద ముగిసింది. ఇక 14,768 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ట్రేడింగ్ మొత్తం 14,878-14,707 మధ్య కదలాడుతూ చివరకు 78 పాయింట్ల లాభంతో 14,814 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.41 వద్ద నిలిచింది. చదవండి: కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల సోమవారం ట్రేడింగ్ నష్టాలతో ముగిసాయి. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసుల ఆందోళనకు తోడు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సోమవారం(మార్చి 22) కీలక సూచీలు నష్ట్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం 49,857 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 49,281 వద్ద కనిష్ఠాన్ని తాకి 49,878 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 86 పాయింట్లు నష్టపోయి 49,771 వద్ద ముగిసింది. ఇక 14,736 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ట్రేడింగ్ రోజులో 14,763-14,597 మధ్య కదలాడుతూ చివరకు 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,736 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.36 వద్ద నిలిచింది. చదవండి: పడిపోయిన బంగారం ధరలు -
వరుస లాభాలకు బ్రేక్
సాక్షి, ముంబై: వరుస లాభాలతో జోరుమీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం 50,711 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా కూడా నష్టాల్లోనే కొనసాగింది. బిఎస్ఇ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఇ)ల బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు నేడు 1 శాతానికి పైగా పడిపోయాయి. ట్రేడింగ్ ఇంట్రాడేలో సెన్సెక్స్ 51,245 వద్ద గరిష్ఠాన్ని.. 50,550 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 600 పాయింట్లు నష్ట్టపోయి 50,846.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 164.80 పాయింట్ల నష్టంతో 15,080 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభపడ్డాయి. చదవండి: 2 నెలల్లో పసిడి ధర ఎంత తగ్గిందంటే.. అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! -
దేశీయ మార్కెట్లో బుల్ జోరు
దేశీయ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూల పవనాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు రాణించడంతో వరుసగా మూడో రోజైన బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల తో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు బుల్ జోరును కొనసాగించింది. 50,738 వద్ద ప్రారంభమైన ట్రేడింగ్ ఇంట్రాడేలో సెన్సెక్స్ 51,505 వద్ద గరిష్ఠాన్ని.. 50,532 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,147 పాయింట్లు లాభపడి 51,444 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 327 పాయింట్ల లాభంతో 15,245 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది. నేటి మార్కెట్ లో బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడగా.. మారుతి సుజుకి ఇండియా, బజాజ్ ఆటో, మహీంద్రా & మహీంద్రా షేర్లు నష్టాల్ని చవిచూశాయి. చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధరలు గూగుల్లో ఇవి వెతికితే మీ పని అంతే! -
రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిసాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టినప్పటికీ.. దేశీయ మార్కెట్లు మాత్రం లాభాలతో ముగిసాయి. ఇవాళ 50,258 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 50,439 వద్ద గరిష్ఠాన్ని.. 49,807 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 50,296 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,865 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన నిఫ్టీ చివరకు 157 పాయింట్లు లాభంతో 14,919 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.38గా ఉంది. సెన్సెక్స్ టాప్ 30లో ఐదు కంపెనీలు మినహా మిగిలిన సంస్థల షేర్లన్నీ లాభాలను ఒడిసిపట్టాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, విప్రో లిమిటెడ్, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా.. ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూశాయి. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సాంకేతిక లోపాల కారణంగా స్టాక్ మార్కెట్లో(ఎన్ఎస్ఈ) ట్రేడింగ్ నిలిచిపోయింది. ఎన్ఎస్ఈ ఎఫ్అండ్ఓలో ఉదయం 11:40 నిమిషాల నుంచి ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాలని నిర్ణయించారు. సాయంత్రం 3:45 గంటలకు సెన్సెక్స్, నిప్టీ ట్రేడింగ్ను పునఃప్రారంభించాయి. తర్వాత సూచీలు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 50,881-49,648 మధ్య కదలాడింది. నిఫ్టీ 14,723 వద్ద కనిష్ఠాన్ని, 15,008 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో సెన్సెక్స్ 50 వేలు, నిఫ్టీ 15,000 పాయింట్ల కీలక మైలురాయిని మరోసారి తాకాయి. చివరకు సెన్సెక్స్ 1,030 పాయింట్ల లాభంతో 50,781 వద్ద ముగిసింది. నిఫ్టీ 279 పాయింట్లు పైకి ఎగసి 14,987 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.36 వద్ద నిలిచింది. చదవండి: ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఏడు స్క్రీన్ల ల్యాప్టాప్ను చూశారా! -
భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. భారీ స్థాయిల్లో లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్ ఆరంభించాయి. 50,936 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ కాసేపు లాభాల్లో పయనించింది. తర్వాత ఇంట్రాడేలో 50,975 వద్ద గరిష్టాన్ని తాకి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. సూచీకి ఏ దశలోనూ మద్దతు లభించలేదు. ఓ దశలో 1,257 పాయింట్లు కోల్పోయి 49,632 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 1,145.44 పాయింట్ల లేదా 2.25 శాతం నష్టంతో 49,744.32కు చేరుకుంటే, నిఫ్టీ 306.05 పాయింట్లు కోల్పోయి 14,675.70 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. స్టాక్ మార్కెట్ లో అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభపడితే.. ఐటీసీ లిమిటెడ్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి. దేశంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నా కరోనా కేసులు మళ్లీ పెరగడంతో ఆ ప్రభావం సూచీలపై పడినట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కేసుల సంఖ్య 7,000పైగా పెరిగాయి. కేసులు ఇలాగే కొనసాగితే త్వరలో లాక్ డౌన్ విధించే సూచనలు ఉన్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసేసరికి బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీ సూచీ 0.85 శాతం లేదా 434.93 పాయింట్లు దిగజారి 50,889.76 మార్క్ను చేరుకుంది. నిఫ్టీ సూచీ కూడా 0.91 శాతం లేదా 137.20 పాయింట్లు నష్టపోయి 14,981.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.55గా ఉంది. ఇంట్రాడేలో 51,432 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ 50,638 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండడం సూచీలను కిందకు జారాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. నిరుద్యోగం పెరిగిపోయిందన్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు తద్వారా ఆసియా మార్కెట్లు క్రితం సెషన్లో డీలా పడ్డాయి. ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ, టాటా మోటార్స్ లిమిటెడ్ షేర్లు నష్టపోగా.. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్ ఇండియా, హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ల ధరలు లాభపడ్డాయి. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
రెండో రోజు నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసేసరికి బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీ సూచీ 0.73 శాతం లేదా 379 పాయింట్లు దిగజారి 51,324.69 మార్క్ను చేరుకుంది. నిఫ్టీ సూచీ కూడా 0.60 శాతం లేదా 90 పాయింట్లు నష్టపోయి 15,119 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.60గా ఉంది. ఇంట్రాడేలో 51,794 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ 51,194 వద్ద కనిష్ఠాన్ని తాకింది. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నెస్లే ఇండియా నష్టపోగా.. ఓఎన్ జీసి షేర్ ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్ ధరలు లాభపడ్డాయి.(చదవండి: అమెజాన్ ఇండియా భారీ మోసం!) -
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 400 పాయింట్లు లేదా 0.77 శాతం నష్టపోయి 51,704 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా చివరకు 105 పాయింట్ల లేదా 0.68 శాతం క్షీణించి 15,208కు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81గా ఉంది. ఇంట్రాడేలో 52,068 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ 51,600 వద్ద కనిష్ఠాన్ని తాకింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్ఐఎల్ తదితర సంస్థలు లాభాలను చూడగా.. నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్స్వ్, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డిఎఫ్సి), కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.(చదవండి: ఐదు సెకన్లలో 20 లక్షల ఎస్బీఐ పర్సనల్ లోన్) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. భారత కంపెనీలు విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల నేపథ్యంలో నేడు భారత ఈక్విటీ బెంచ్మార్క్లు మరో రికార్డు స్థాయిని సాధించాయి. భారతీయ కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక లాభాలలో గత ఏడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 నాలుగు త్రైమాసికాలలో ఇదే అతిపెద్ద పెరుగుదల. దీనితో సెన్సెక్స్ 692 పాయింట్లు పెరిగి 52,235.97 రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 50 ఇండెక్స్ పెరిగి 15,300ను అధిగమించింది. నేడు సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 1.18 శాతం పెరిగి ఆల్ టైమ్ హై 52,154 వద్ద ముగిసింది. నిఫ్టీ 1 శాతం లేదా 151 పాయింట్లు పెరిగి 15,315 వద్ద స్థిరపడింది. కరోనా తర్వాత కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు వేగంగా పుంజుకోవడంతో మార్కెట్లు కూడా భారీ లాభాలతో ముగిసినట్లు విశ్లేషకులు తెలిపారు. చదవండి: దూకుడు: కొత్త శిఖరాలకు మార్కెట్ కర్ణాటకలో టెస్లా ప్లాంట్ -
నేవీ అధికారి సజీవదహనం: ఆ 6 రోజులు ఏం జరిగింది?
ముంబై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్కు గురైన నౌకాదళ అధికారి సూరజ్ కుమార్ దుబేని ముంబైలో సజీవదహనం చేయడంతో హత్యకు గురైన సంగతి తెలిసందే. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. మృతి చెందిన సూరజ్కుమార్ దుబే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాడని.. ఈ క్రమంలో బ్యాంక్, స్నేహితుల దగ్గర భారీగా అప్పు చేశాడని తెలిసింది. మరో విషాదకర అంశం ఏంటంటే దూబేకి గత నెల 15న నిశ్చితార్థం జరిగింది.. ఈ ఏడాది ఏప్రిల్లో ఇద్దరికి వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన సూరజ్ కుమార్ దుబే బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు అతడు చనిపోవడానికి ముందు బ్యాక్ నుంచి 8 లక్షల రూపాయల లోన్, ఓ కొలిగ్ వద్ద నుంచి 5.75 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. ఇదే కాక కాబోయే మామగారి దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది అన్నారు. ఇంత భారీ మొత్తం అప్పుగా తీసుకున్నప్పటికి ప్రస్తుతం అతడి ఖాతాలో కేవలం 392 రూపాయలు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. సూరజ్ దూబే అప్పు చేసిన ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక అప్పు ఇచ్చిన స్నేహితుడు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా దూబేపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక జనవరి నెల మొత్తం సెలవుల్లో ఉన్న దూబే విధుల్లో తిరిగి చేరడం కోసం జనవరి 30న ఉదయం 8 గంటలకు రాంచీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కాడు. దిగాక తన కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దూబే చెన్నైలో దిగగా ముగ్గురు వ్యక్తులు అతడిని గన్తో బెదిరించి కిడ్నాప్ చేశారు. మూడు రోజులు దూబేని చెన్నైలో ఉంచారు. ఇక దుబే నుంచి జనవరి 30 తర్వాత ఎలాంటి కాల్ రాకపోవడం.. ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు నేవీ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 1న దూబే మూడు ఫోన్లలో ఒక నెంబర్ రింగ్ అయినట్లు అతడి స్నేహితుడు తెలపడంతో పోలీసులు దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. దూబే ఈ నంబర్ని షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ కోసం వినియోగించేవాడని దర్యాప్తులో తెలిసిందన్నారు పోలీసులు. మరో నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 5న దుండగులు దూబేని పహల్గఢ్లోని ఎతైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికి లాభం లేకపోయింది. మరణించాడు. ఈ క్రమంలో జనవరి 31-ఫిబ్రవరి 5 మధ్యన ఆ ఆరు రోజుల పాటు ఏం జరిగి ఉంటుందనే విషయం కీలకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ చిక్కు ముడిని విప్పే ప్రయత్నం చేస్తున్నారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్, భారీ మొత్తంలో డబ్బు అప్పు చేయడం వంటి అంశాలే దూబే మరణానికి కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. దూబే మొబైల్కి ఓ నంబర్ నుంచి వరుసగా 13 కాల్స్ రావడంతో అది ఎవరిదనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి కొద్ది రోజుల్లోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు. ఇక దూబేకి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉందని కానీ.. అతడి దగ్గర మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయనే విషయం కానీ కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు.. చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం -
బోరోసిల్ -ఫైనోటెక్స్ కెమ్.. యమస్పీడ్
ముంబై, సాక్షి: ఈ ఏడాది మార్చి కనిష్టాల నుంచి 70 శాతం ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా కదులుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్చేసి 47,714ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ దాదాపు లాభాల సెంచరీ చేసి 13,968 సమీపానికి చేరింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా బోరోసిల్ రెనెవబుల్స్, ఫైనోటెక్స్ కెమికల్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. (ఐపీవో బాటలో- ఫ్లిప్కార్ట్ బోర్డు రీజిగ్) బోరోసిల్ రెనెవబుల్స్ 11 రోజులుగా దూకుడు చూపుతున్నసోలార్ గ్లాస్ తయారీ కంపెనీ బోరోసిల్ రెనెవబుల్స్ కౌంటర్ మరోసారి 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువై రూ. 280 వద్ద ఫ్రీజయ్యింది. ఇటీవల కంపెనీ రూ. 126.6 ధరలో క్విప్ను చేపట్టింది. ఈ ధరతో పోలిస్తే తాజాగా రెట్టింపునకుపైగా లాభపడింది. ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ తదితరాలలో వినియోగించే లో ఐరన్ సోలార్ గ్లాస్ను కంపెనీ తయారు చేస్తోంది. క్విప్ నిధులను ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు వినియోగించనుంది. ప్రస్తుతం రోజుకి 450 టన్నుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 950 టీపీడీకు పెంచే ప్రయత్నాల్లో ఉంది. కాగా.. గత 11 రోజుల్లో ఈ కౌంటర్ 113 శాతం దూసుకెళ్లడం విశేషం! ఫైనోటెక్స్ కెమికల్స్ నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో దాదాపు 6 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడికావడంతో ఫైనోటెక్స్ కెమికల్స్ కౌంటర్కు మరోసారి డిమాండ్ నెలకొంది. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 13 శాతం జంప్చేసి రూ. 62ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం లాభంతో రూ. 60 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లోనూ ఈ కౌంటర్ 29 శాతం దూసుకెళ్లడం గమనార్హం! సోమవారం నిప్పన్ ఇండియా ఎంఎఫ్ షేరుకి రూ. 45.25 ధరలో 6.61 మిలియన్ ఫైనోటెక్స్ షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 30 కోట్లు వెచ్చించింది. -
30 రోజుల్లో 100 శాతం లాభాలు
ముంబై, సాక్షి: కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పలు మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లవైపు దృష్టిసారించారు. వెరసి పలు కౌంటర్లు గత నెల రోజుల్లోనే 100 శాతానికిపైగా లాభపడ్డాయి. గత 30 రోజుల్లో 29 కంపెనీలు రెట్టింపునకుపైగా ఎగశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 6 శాతమే లాభపడటం గమనార్హం! ఇటీవల దూకుడు చూపుతున్న కంపెనీల జాబితాలో జెట్ ఎయిర్వేస్, వక్రంగీ, డైనకాన్స్ సిస్టమ్స్, గోల్డెన్ టొబాకో, ఆర్కిడ్ ఫార్మా, బాఫ్నా ఫార్మా, ఆర్వీ డెనిమ్స్ తదితరాలు చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. (కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు) జోరుగా హుషారుగా మురారీ లాల్ జలాన్, కల్రాక్ క్యాపిటల్ కన్సార్షియం ద్వారా తిరిగి రెక్కలొచ్చిన జెట్ ఎయిర్వేస్ కౌంటర్ వరుసగా 8వ రోజు అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 105.35 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. కొత్త ఏడాది(2021)లో దేశ, విదేశాలకు సర్వీసులను పునరుద్ధరించే ప్రణాళికల్లో ఉంది. మెట్రో నగరాలతో యూరోపియన్ దేశాలకు సర్వీసులను ప్రారంభించనుంది. దీంతో ఈ కౌంటర్ జోరందుకోగా.. గోల్డెన్ టొబాకో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్కు చేరింది. గత మూడు రోజుల్లోనే 60 శాతం దూసుకెళ్లింది. తాజాగా రూ. 50.55 వద్ద నిలిచింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ముంబైలోని విలే పార్లే ప్రాపర్టీని ఎక్సైజ్ శాఖ అటాచ్ చేసింది. అయితే ఈ సమస్యనుంచి బయటపడగలమని యాజమాన్యం భావిస్తోంది. అంతేకాకుండా గుంటూరులో గల ప్రాపర్టీని సైతం అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. (జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్) ఇతర కౌంటర్లూ ఫార్మా కంపెనీ సువెన్ లైఫ్ సైన్సెస్ నాలుగో రోజూ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 105.20 వద్ద ఫ్రీజయ్యింది. గత మూడు రోజుల్లో 10 శాతం చొప్పున జంప్చేసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 124 శాతం ర్యాలీ చేసింది. కాగా.. డైనకాన్స్ సిస్టమ్స్ తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్కు చేరింది. రూ. 85.50 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆపై తిరిగి 10 శాతం లోయర్ సర్క్యూట్కు చేరి రూ. 70 వద్ద ముగిసింది. ఈ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ షేరు గత వారం రోజుల్లోనే 88 శాతం పురోగమించింది. పీఎస్యూ సంస్థ యూబీఐ నుంచి రూ. 24.5 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు డైనకాన్స్ మంగళవారం ప్రకటించింది. నెల రోజుల తీరు స్మాల్ క్యాప్ కౌంటర్లలో ప్రధానంగా ఆర్కిడ్ ఫార్మా, బాఫ్నా ఫార్మా, రాజ్ ఆయిల్, జిందాల్ ఫొటో, గోల్డెన్ టొబాకో, ట్రాన్స్ఫార్మర్స్(ట్రిల్), సువెన్ లైఫ్, డైనకాన్స్, ఆర్వీ డెనిమ్స్, బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, వక్రంగీ, జెనిత్ ఎక్స్పోర్ట్స్, ఆర్ఫిన్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ తదితరాలు గత నెల రోజుల్లో 178-102 శాతం మధ్య దూసుకెళ్లడం విశేషం! -
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలంటూ..
సాక్షి, హైదరాబాద్: షేర్ మార్కెట్లో మోసాలకు పాల్పడుతున్న 9 మంది నిందితులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తె షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నిందితులు నమ్మించారు. కాగా షేర్ మార్కెట్లో అనుభవం ఉందంటూ వనస్థలిపురంకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగితో రూ 9.60 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో టాప్ గ్లోబల్ రీసెర్చ్ కంపెనీ పేరుతో అమాయకులను మోసం చేసి లక్షల్లో వసూలు చేశారు. డబ్బులు తీసుకున్న తరువాత నిందుతులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అయితే మధ్యప్రదేశ్ నుండి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా రాచకొండ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితులతో ఉన్న 13 కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు,18మొబైల్స్,17సిమ్ కార్డ్స్, 1ల్యాప్ టాప్,4 క్రెడిట్ కార్డ్స్, 1 వైఫై రూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు -
పెట్టుబడుల పేరుతో రూ.2.36 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: తన వద్ద పెటుబడి పెట్టిన మొత్తాలను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తానని, డిపాజిట్దారులకు నెలకు 3 శాతం వడ్డీ ఇస్తానంటూ రూ.2.36 కోట్లు స్వాహా చేసిన నిందితుడిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి తండ్రి మాజీ పోలీసు అధికారి కావడంతో డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే బెదిరిస్తున్నాడంటూ బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..శాంతినగర్లో ని ఓ మత సంస్థలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సయ్యద్ ముక్తర్ అలీ ఎంబీఏ పూర్తి చేశాడు. విజయ్నగర్ కాలనీతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన పలువురితో ఇతడు పరిచయం పెంచుకున్నాడు. తాను తిజార్హా స్టాక్ ఇన్వెస్టిమెంట్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నానని, దీని ద్వారా షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందుతున్నానని నమ్మబలికాడు. (ఇంటి దొంగ దొరికాడు) తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి నెలకు 3 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ చెప్పాడు. దీంతో రియాజ్ అనే వ్యక్తితో పాటు మొత్తం 39 మంది రూ.2.6 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీరికి గత ఏడాది పత్రాలు కూడా రాసి ఇచ్చాడు. తన మకాంను శాంతినగర్ నుంచి బజార్ఘాట్కు మార్చాడు. పెట్టుబడిదారులకు కొన్నాళ్లు లాభాలు ఇచ్చినా... ఆపై చేతులెత్తేశాడు. చివరకు తన స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లికి పారిపోయాడు. అతికష్టమ్మీద అతగాడి చిరునామా కనుక్కొని అక్కడికి వెళ్లిన వారిని బెదిరించాడు. తన తండ్రి మాజీ పోలీసు అధికారి అంటూ బెదిరింపులకు దిగడంతో బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. -
స్పెక్యులేషన్వైపు చిన్న ఇన్వెస్టర్ల చూపు
నిజానికి స్టాక్ మార్కెట్లలో లాభాల కోసం అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్వల్పకాలిక లాభాల కోసం ట్రేడర్లు ఎఫ్ండ్వో స్టాక్స్లో భారీగా పొజిషన్లు తీసుకుంటుంటారు. అయితే కొద్ది రోజులుగా రిటైల్ ఇన్వెస్టర్లు సైతం స్పెక్యులేటివ్ ట్రేడింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు శామ్కో గ్రూప్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా పేర్కొంటున్నారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లలో ఇటీవల ఆటుపోట్లు పెరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మార్కెట్ల తీరు, బ్యాంకింగ్ ఫలితాలు తదితర అంశాలపై మెహతా వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం.. డెలివరీలు తక్కువే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకంటే అధికంగా ఇటీవల చిన్న పెట్టుబడిదారులు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో రిటైల్ ఇన్వెస్టర్ల టర్నోవర్ 57 శాతం ఎగసింది. ఇదే సమయంలో రిటైల్ విభాగంలో స్టాక్స్లో డెలివరీలు క్షీణించడం గమనార్హం. వెరసి రిటైలర్లు కొద్ది రోజులుగా దీర్ఘకాలిక వ్యూహంతో కాకుండా స్పెక్యులేటివ్ ఆలోచనతోనే ట్రేడింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. నగదు విభాగంలో సగటు పరిమాణం 57 శాతం పుంజుకోగా రోజువారీ షేర్ల డెలివరీలు వెనకడుగులో ఉన్నాయి. వెరసి క్యూ1(ఏప్రిల్-జూన్)లో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లలో నమోదైన అధిక ఆటుపోట్లకు ఇదొక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎఫ్పీఐల అండ గత రెండు వారాలలో మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. గత 9 ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 5,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. సెకండరీ మార్కెట్లలో ఎఫ్పీఐల పెట్టుబడులు సెంటిమెంటుకు జోష్నిస్తున్నాయి. మరోవైపు కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలపై వెలువడుతున్న సానుకూల వార్తలు ఇన్వెస్టర్లకు సహకరిస్తున్నాయి. గత వారం యూరోపియన్ యూనియన్ 850 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి గ్రీన్సిగ్నల్ ఇవ్వడం, యూఎస్ ప్రభుత్వం సైతం మరో ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు వీటికి జత కలుస్తున్నాయి. బ్యాకింగ్ ఇలా బ్యాంకింగ్ రంగంలోని సంస్ధలు ప్రస్తావించదగ్గ స్థాయిలో ఫలితాలు ప్రకటిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితరాలు పటిష్ట పనితీరు చూపాయి. అయితే రుణ చెల్లింపులపై మారటోరియం అమలుతోపాటు.. మొండి బకాయిల(ఎన్పీఏలు) నమోదులో ఆలస్యానికి ఆర్బీఐ అనుమతించడం వంటి అంశాల కారణంగా బ్యాంకింగ్ ఫలితాలు ప్రోత్సాహకరంగా వెలువడుతున్నాయి. లాక్డవున్ల కారణంగా ప్రజలు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కోవిడ్-19 నేపథ్యంలో బీమా పాలసీలకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీ గుడ్ ప్రస్తుత కోవిడ్-19 అనిశ్చితుల్లోనూ ఐటీ రంగ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధిస్తున్నాయి. వ్యయాల తగ్గింపు, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉత్పాదకత మెరుగుపడటం, సప్లై చైన్ డిజిటల్ వినియోగం వంటి అంశాలు కంపెనీలకు లబ్దిని చేకూర్చనున్నాయి. కొత్తగా కాంట్రాక్టులు కుదుర్చోవడం, ఆశావహ అంచనాలు ఈ రంగానికి ఊపునిస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత మౌలికసదుపాయాలను పెంచుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంది. పెరుగుతున్న డిజిటల్ వినియోగం సైతం ఐటీ రంగానికి అదనపు డిమాండ్ను కల్పిచే అవకాశముంది. -
వోడాఫోన్ ఐడియాలో లాభాల స్వీకరణ
టెలికాం రంగానికి చెందిన వోడాఫోన్ ఐడియా షేరు మంగళవారం ట్రేడింగ్లో 21.50 శాతం నష్టాన్ని చవిచూసింది. సెర్చింగ్ సంస్థ గూగుల్ ఈ కంపెనీలో 5శాతం వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో గత 10ట్రేడింగ్ సెషన్ల్లో ఈ షేరు ఏకంగా 129శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘గతంలో నమోదైన వాల్యూయేషన్లను పరిశీలిస్తే.., కంపెనీ దివాళా తీసేందుకు ఎక్కువగా అవకాశాల ఉండేవి. కానీ ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నప్పటికీ.., కంపెనీ మనుగడ సాగించగలదని మార్కెట్ తొందరగానే గ్రహించింది. కంపెనీలో వాటా కొనుగోలుకు గూగుల్ ప్రయత్నాలు చూస్తుందనే నివేదికలతో షేరులో అప్మోవ్ ప్రారంభమైంది. ఈ రోజు మనం చూస్తున్నది లాభాల బుకింగ్.’’ అని పీఎంసీ ప్రభుదాస్ లిల్లాధర్ సీఈవో అజయ్ తెలిపారు. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.12.49 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఒక దశలో షేరు 21.50శాతం నష్టపోయి రూ.9.41 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 3గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.11.99)తో పోలిస్తే 15.50శాతం నష్టంతో రూ.10.12 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.61, రూ.13.54గా నమోదయ్యాయి. -
లాభాల జోరు, 30వేలకు చేరువలో సెన్సెక్స్
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడో సెషన్ లో కూడా కీలక సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 29600 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ 8600 స్థాయిని దాటేసింది. సెన్సెక్స్ 1143 పాయింట్లు పుంజుకుని 29679 వద్ద, నిఫ్టీ 317పాయింట్లు లాభంతో 8600వద్ద కొనసాగుతున్నాయి. దాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా వరుసగా రెండో రోజూ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. ప్రారంభంలోనే ఒకటిన్నర లాభంతో రూ.1100 మార్కును అధిగమించింది. జియోలో 10శాతం వాటాను 60 బిలియన్ డాలర్లకు (రూ.4.20 లక్షల కోట్ల) విక్రయించనున్నట్టు వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు లాభపడుతోంది. -
రెండో స్థానానికి తగ్గిన ముకేశ్ అంబానీ
-
కకావికలం
కరోనా ముసలం... కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రపంచమంతా పాకుతుండటంతో అంతర్జాతీయ వృద్ధిపై భయాందోళనలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతమున్న ఆర్థిక మందగమనం కోవిడ్ వైరస్ కారణంగా మాంద్యంగా పరిణమిస్తుందనే భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మన మార్కెట్ శుక్రవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతులన్నింటినీ కోల్పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.64 శాతం, నిఫ్టీ 3.71 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనం. 2015, ఆగస్టు 24 వ తేదీన సెన్సెక్స్ అత్యధికంగా 1,625 పాయింట్లు నష్టపోయింది. ఆరో రోజూ నష్టాలే...: సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఆరో రోజూ క్షీణించాయి. ఈ రెండు సూచీలు నాలుగున్నర నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఇక ఈ వారంలో సెన్సెక్స్ 2,873 పాయింట్లు, నిఫ్టీ 879 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 6.9%, నిఫ్టీ 7.2% పడ్డాయి ఎదురీదిన ఐటీసీ ►మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐటీసీ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా 8 శాతం, టాటా స్టీల్ 7.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 7.5 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 7 శాతం, బజాజ్ ఫైనాన్స్ 6 శాతం, ఇన్ఫోసిస్ 6 శాతం చొప్పున పతనమయ్యాయి. ►400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఏసీసీ, ఏబీబీ ఇండియా, అపోలో టైర్స్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొ, గెయిల్, కోల్ ఇండియా, విప్రో, మహీంద్రా, వేదాంత, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, లుపిన్, టాటా పవర్, హెచ్పీసీఎల్, పీఎన్బీ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ►మిధాని, డీఐసీ ఇండియా తదితర 30 పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు ఎగిశాయి. ►300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, శంకర బిల్డింగ్స్ ప్రొడక్టŠస్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా డీహెచ్ఎఫ్ఎల్, రుచి సోయా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తదితర షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పతనానికి ప్రధాన కారణాలు... ►వైరస్ విలయం... మొన్నమొన్నటిదాకా 30 దేశాలకే పరిమితమైన కోవిడ్–19 వైరస్ ఇప్పుడు మొత్తం ఆరు ఖండాల్లోని 57 దేశాలకు పాకింది. చైనాలో కొత్త కేసులు, కోవిడ్ వైరస్ బాధితుల మరణాలు తగ్గినప్పటికీ, న్యూజిలాండ్, నైజీరియా, అజర్బైజాన్, నెదర్లాండ్స్ దేశాల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య 80,000కు, మరణాల సంఖ్య 2,900కు చేరింది. ►ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో ఒక వారం పాటు ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మళ్లీ ఈ ఏడాది ఈ వారంలో అదే స్థాయి నష్టాలు వాటిల్లాయి. శుక్రవారం షాంఘై, హాంగ్సెంగ్, సియోల్, టోక్యో సూచీలు 2–4 శాతం వరకూ నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 4% క్షీణించాయి. గురువారం అమెరికా స్టాక్ సూచీ, డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,191 పాయింట్లు పతనమైంది. డోజోన్స్ చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో డోజోన్స్ మొత్తం 3,581 పాయింట్లు (12%) మేర క్షీణించింది. ►విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. ఈ వారంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రమారమి రూ.10,000 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. కోవిడ్–19 వైరస్ ప్రభావం మన దేశంపై లేనప్పటికీ, ప్రపంచ మార్కెట్ల పతనం కొనసాగితే, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ మరింతగా జరుగుతుందని నిపుణులంటున్నారు. ►ముడి చమురు ధరల పతనం కోవిడ్–19 వైరస్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించి చమురుకు డిమాండ్ తగ్గుతుందనే అంచనాలతో ముడి చమురు ధరలు 3.3 శాతం మేర నష్టపోయాయి. సాధారణంగా ముడి చమురు ధరలు పతనమైతే, మన మార్కెట్ లాభపడాలి. కానీ మాంద్యం భయాలతో ముడి చమురు ధరలు పడిపోవడం మన మార్కెట్పై ప్రతికూల ప్రభావమే చూపించింది. ►రూపాయి డౌన్ డాలర్తో రూపాయి మారకం విలువ 55 పైసలు క్షీణించి 72.16కు చేరడం కూడా స్టాక్ మార్కెట్లో అమ్మకాల జోరుకు ఒక కారణమైంది. పతనం ఇక్కడితో ఆగుతుందా ? స్టాక్ మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకులు విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మన మార్కెట్ అంతర్జాతీయ సంకేతాలపై అధికంగా ఆధారపడుతోందని, ప్రపంచ మార్కెట్లు పతనమవుతుండటంతో ప్రస్తుతానికి మార్కెట్కు దూరంగానే ఉంటే మంచిందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ప్రతి పతనం కొనుగోలుకు మంచి అవకాశమని మరికొందరంటున్నారు. వచ్చే వారం పుల్బ్యాక్ ర్యాలీ...! మార్కెట్ ఇక్కడ స్థిరపడటానికి ఇది మంచి అవకాశమని ట్రేడింగ్బుల్స్ సీనియర్ ఎనలిస్ట్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వచ్చే వారం పుల్బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. 200 రోజుల చలన సగటు(డీఎమ్ఏ)–11,687 పాయింట్లకు నిఫ్టీ చేరవచ్చని తెలిపారు. మద్దతు స్థాయిలు 11,200–11,100 పాయింట్లని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినప్పుడు నిఫ్టీ ఇక్కడినుంచే ర్యాలీ జరిపిందన్నారు. ఒకవేళ నిఫ్టీ 11,100 పాయింట్ల దిగువకు పడిపోతే నిఫ్టీ తదుపరి మద్దతు 10,700 పాయింట్లని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఇదే మంచి తరుణమా..? కాగా కరోనా విలయం ప్రపంచ మార్కెట్లపై మరింతగానే ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు. మన దేశంలో కోవిడ్–19 వైరస్ కేసులు ఏమీ నమోదు కాలేదని, ఈ విషయంలో ఇతర దేశాలతో పోల్చితే మన దేశం ఒకింత ఉత్తమ స్థాయిలోనే ఉందని మేబ్యాంక్ కిమ్ యంగ్ సెక్యూరిటీస్ సీఈఓ జిగర్ షా వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న షేర్లలో మదుపు చేయడానికి ఇదే మంచి తరుణమని సూచించారు. ఎగుమతులపై భారత్ అధికంగా చైనాపై అధారపడి ఉందని, అందుకని కోవిడ్–19 వైరస్ ప్రభావం భారత్పై కూడా ఉంటుందని విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని డాల్టన్ క్యాపిటల్ ఎనలిస్ట్ యూ.ఆర్. భట్ చెప్పారు. మరో రూ.5.5 లక్షల కోట్లు హుష్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.45 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.45,453 కోట్లు క్షీణించి రూ.1.46,94,572 కోట్లకు పడిపోయింది. గత ఆరు రోజుల్లో మొత్తం రూ.11,76,986 కోట్ల సంపద హరించుకుపోయింది. భారీగా తగ్గిన పసిడి ధర అంతర్జాతీయంగా ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం భారీగా దిగివచ్చింది. కేవలం రెండు రోజుల క్రితం 1,686.6 డాలర్లకు చేరి ఏడేళ్ల గరిష్టాన్ని చూసిన పసిడి, ఈ వార్త రాసే 10.30 గంటల సమయానికి 50 డాలర్ల నష్టంతో (గురువారం ముగింపుతో పోల్చి)1,594 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 1,575 డాలర్లకు పడిపోవడం గమనార్హం. ఇక క్రూడ్ విషయానికి వస్తే, ఒక దశలో 6 శాతం పైగా పడిపోయి 43.86 డాలర్లను చూసిన నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కొంచెం బలపడి 45 డాలర్ల స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఇది కోవిడ్ వైరస్ భయాలు త్వరలో ఉపశమిస్తున్నాయనడానికి సంకేతమా? అన్నది కొన్ని వర్గాల విశ్లేషణ. కోవిడ్–19 వైరస్ కొత్త దేశాలకు విస్తరిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్స్పోజర్ ఉన్న లోహ, ఐటీ షేర్లు అధికంగా పతనమయ్యాయి. ఈ వైరస్ ఆర్థికంగా ఏ మేరకు ప్రభావం చూపగలదో అనే విషయమై స్పష్టత లేనప్పటికీ, వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి ప్రభావం తీవ్రంగానే ఉండగలదు. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ -
చుక్ చుక్ బండి.. దుమ్మురేపింది!
ఐఆర్సీటీసీ: 4 నెలలు... 5 రెట్లు ఐఆర్సీటీసీ... భారతీయ రైల్వేకు చెందిన ఈ కంపెనీ షేరు జోరైన లాభాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్లో స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ షేర్... ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను పంచింది. నాలుగు నెలల్లోనే ఐదు రెట్లు పెరిగింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడూ, లిస్టింగ్లోనూ, ఆ తర్వాత ట్రేడింగ్లోనూ రికార్డ్ల మీద రికార్డ్లు సృష్టిస్తూ సాగిపోతోంది. ఈ రికార్డ్లకు, లాభాల పరుగుకు కారణాలు, షేరు భవిష్యత్తుపై నిపుణుల అంచనాలు తదితర విశేషాలు సాక్షి బిజినెస్ పాఠకుల కోసం... ప్రస్తుతం ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) 4 విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం, రైల్వే కేటరింగ్ సర్వీసులు నిర్వహించడం, టూరిజం సర్వీసులు నిర్వహణ, రైల్ నీర్ బ్రాండ్ కింద ప్యాకేజ్డ్ వాటర్ను విక్రయించడం. టూరిజం సర్వీసులు కాకుండా మిగిలిన మూడు విభాగాల్లో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఇక రైల్వేయేతర కేటరింగ్ సర్వీసులు, ఈ–కేటరింగ్, బడ్జెట్ హోటళ్ల రంగంలోకి కూడా విస్తరిస్తోంది. ఈ బుధవారమే ఈ కంపెనీ క్యూ3 ఫలితాలను వెల్లడించింది. నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ.206 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు చేరింది. ఒక్కో షేర్కు రూ.10 డివిడెండ్ను ఇవ్వనుంది. దీనికి రికార్డ్ డేట్గా ఈ నెల 25ను నిర్ణయించింది. ఆర్థిక ఫలితాలు అదరగొట్టడంతో ఐఆర్సీటీసీ షేర్ జోరుగా పెరిగింది. గురువారం ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,609ను తాకింది. చివరకు 11% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఐఆర్సీటీసీ షేర్ ధర 400 శాతం పెరగ్గా, ఈ కాలంలో సెన్సెక్స్ 9 శాతమే లాభపడింది. ఐపీఓ... అదిరిపోయే ఆరంభం... గత ఏడాది సెప్టెంబర్ 30, అక్టోబర్ 3ల మధ్య వచ్చిన ఐఆర్సీటీసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 112 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఇప్పటివరకూ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ ఈ స్థాయిలో ఓవర్ సబ్స్క్రైబ్ కావడం ఇదే మొదటిసారి. రూ.320 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ షేరు దాదాపు రెట్టింపు ధరకు రూ.626 వద్ద అక్టోబర్ 14న స్టాక్ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్ రోజునే రూ.744 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి రూ.729 వద్ద ముగిసింది. లిస్టింగ్లోనూ ఈ షేర్ రికార్డ్లే సృష్టించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో లిస్టింగ్ లాభాలు రావడం కూడా ఇదే మొదటిసారి. ఐపీఓలో షేర్లు దక్కని వాళ్లు జోరుగా ఈ షేర్లు కొన్నారు. ఆ ఒక్కరోజే రూ.3,500 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇటీవల కాలంలో మంచి లాభాలు గడించిన ఐపీఓ ఇదే. 23వ స్థానం...: అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం ఈ కంపెనీ 23వ స్థానంలో ఉంది. మార్కెట్ క్యాప్ రూ.25,279 కోట్లు. స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి టాప్50లో కూడా ఈ షేర్ లేదు. ఇప్పుడు ఆయిల్ ఇండియా, భెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీలను దాటేసింది. తేజస్తో మరింత దూకుడు.. ఈ కంపెనీ తొలి తేజస్ రైలును లక్నో– ఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 16న రెండో తేజస్ రైలును అహ్మదాబాద్ – ముంబై సెంట్రల్కు ప్రారంభించింది. ఆ రోజే ఈ షేర్ నాలుగంకెల ధరకు చేరింది. ఇక మూడో తేజస్ రైలును త్వరలోనే ఇండోర్– వారణాసి మధ్య నడిపించనుంది. తేజస్ రైళ్ల దూకుడుతో ఈ షేర్ ధర మరింత జోరుగా పెరగనుంది. షేరు ధర ఎందుకు పెరుగుతోందంటే.. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ వినూత్నంగా ఉండటం వల్ల షేర్ విలువ మదింపు చేయడం కొంచెం కష్టమేనన్నది నిపుణుల మాట. ఆన్లైన్ టికెట్ల విక్రయం, రైల్వే కేటరింగ్ సర్వీసుల్లో గుత్తాధిపత్యం ఈ కంపెనీదే. అసెట్– లైట్ బిజినెస్ మోడల్ను అనుసరిస్తున్న ఈ కంపెనీ ఫ్లోటింగ్ షేర్లు (ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య) చాలా తక్కువగా ఉండటం వల్ల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర కూడా పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే కేటరింగ్ ఉత్పత్తుల ధరలను పెంచింది. మార్జిన్లు అధికంగా ఉండే తేజస్ రైళ్లను మూడు రూట్లలో నడుపుతోంది. మరిన్ని తేజస్ రైళ్లను తెచ్చే యోచనలో ఉంది. బిజినెస్ మోడల్ నిలకడగా ఉండటం, డివిడెండ్ చెల్లింపులు బాగుండటం (గత మూడేళ్లలో సగటున 50% డివిడెండ్ ఇచ్చింది), రూ.1,100 కోట్ల మేర పుష్కలంగా నగదు నిల్వలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్స్కు ఉత్తమ షేరుగా విశ్లేషకులు చెబుతున్నారు. మూడేళ్లలో అమ్మకాలు 23%, లాభం 49% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. బహుపరాక్.. ఈ షేర్ ధర జోరుగా పెరుగుతోంది. అయితే డెలివరి అయ్యే షేర్ల నిష్పత్తి 11–13 శాతమే ఉంది. డే ట్రేడింగ్ బాగా జరుగుతోందనడానికి ఇది నిదర్శనమన్నది నిపుణుల మాట. మొమెంటమ్ గేమ్ ఆడాలనుకుంటే ఇన్వెస్టర్ల చేతులు కాలవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కంపెనీ వేల్యుయేషన్లు భారీగా పెరిగాయని, కంపెనీ షేరు ధర ఈపీఎస్కు 80 రెట్ల వద్ద ట్రేడవుతోందని, ఒకింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ కంపెనీలకు ఈ విలువ సమంజసమైనదే. అయితే ఒక ప్రభుత్వ రంగ కంపెనీకి మాత్రం ఈ విలువ చాలా అధికమన్నది వారి విశ్లేషణ. అధిక వేల్యుయేషన్లు ఉండటంతోపాటు, భవిష్యత్తులో ఈ కంపెనీలో మరోవిడత వాటా విక్రయానికి కూడా అవకాశం ఉందని, ఈ రెండూ ప్రతికూలాంశాలని వారంటున్నారు. అయితే మరింత వాటా విక్రయానికి మరో ఏడాది సమయం ఉంది. -
దావూద్ ‘షేర్’ దందా
న్యూఢిల్లీ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను ఎక్కడికక్కడ స్థంభింపచేస్తున్నా డ్రగ్స్ సహా అజ్ఞాత కార్యకలాపాల ద్వారా ఆర్జిస్తున్న మొత్తాన్ని ఆయన పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్)లో పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడైంది. పలు క్యాపిటల్ సెక్యూరిటీ సంస్థల ద్వారా దావూద్ ఇబ్రహీం తన రాబడులను పీఎస్ఎక్స్ పరిధిలోని మూడు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో మదుపు చేస్తున్నాడు. పీఎస్ఎక్స్లో దావూద్ తన అక్రమ నిధులను పెట్టుబడి పెట్టడం పట్ల భారత నిఘా సంస్ధలు కీలక ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధ లావాదేవీలు, నకిలీ భారత కరెన్సీ నోట్ల రాకెట్, దోపిడీ దందాల ద్వారా దావూద్ పెద్దమొత్తంలో డబ్బు కూడబెడుతున్నాడు. దావూద్ గ్యాంగ్ సభ్యుడు, ప్రస్తుతం లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్న జబీర్ మోతీకి చెందిన ఐదు క్యాపిటల్ సెక్యూరిటీ కంపెనీలు ప్రస్తుతం పీఎస్ఎక్స్ పరిధిలో ఉండగా, వీటి ద్వారా దావూద్ తన పెట్టుబడులను షేర్ మార్కెట్లోకి మళ్లించినట్టు చెబుతున్నారు. పాకిస్తాన్లోని ప్రముఖ షేర్ బ్రోకింగ్ కంపెనీ హబీబ్ బ్యాంక్ సబ్సిడరీ హబీబ్ మెట్రపాలిటన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా పలు షెల్ కంపెనీల పేరుతో దావూద్ గ్యాంగ్ షేర్ మార్కెట్లోకి నిధులను మళ్లించింది. హబీబ్ బ్యాంక్ ఉన్నతాధికారులను దావూద్కు పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్, దావూద్ కుమార్తె మెహ్రీన్ మామ పరిచయం చేసినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హబీబ్ బ్యాంక్పై మనీ ల్యాండరింగ్ సహా ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తుందని 2017లో అమెరికా ఆర్థిక సేవల శాఖ ఆరోపించడం గమనార్హం. -
స్టాక్ సూచనలతో జాగ్రత్త
పెట్టుబడుల విషయంలో సలహా సేవల పేరుతో ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున జరిగిన మోసం ఇటీవల వెలుగుచూసింది. ట్రోకా పేరుతో రూ.10 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ముగ్గురి పెట్టుబడుల సలహాలన్నీ మోసపూరితమేనని, అవి ఫలితాలు ఇవ్వలేదని, కాల్ చేసినా వారి నుంచి స్పందన లేదంటూ ఇన్వెస్టర్ల నుంచి సెబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పైగా ఈ కేటుగాళ్లు సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వాస్తవ లైసెన్స్ చూపించి మరీ మోసానికి పాల్పడడం పరాకాష్ట. ఇందుకు సంబంధించి రిషబ్ జైన్, ఉబైదుర్ రెహ్మాన్, జి కాదర్ హుస్సేన్లపై సెబీ నిషేధం విధిస్తూ ఈ ఏడాది మార్చి 20న ఆదేశాలు జారీ చేసింది. అయితే, మనలోనూ చాలా మందికి ఈ తరహా అనుభవాలు ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి మధ్యప్రదేశ్, ఇండోర్ కేంద్రంగా కాల్స్ వస్తుంటాయి. తాము స్టాక్స్ రికమండేషన్స్ ఇస్తామని, ముందు ఉచిత ట్రయల్ కూడా ఉందంటూ వారు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబడులకు హామీ లేదు... రిషబ్ జైన్, అతడి భాగస్వాములు భారీ హామీలను గుప్పించారు. తమ వెబ్సైట్లో రెండు ఉత్పత్తుల సమాచారాన్ని వీరు ఆకర్షణీయంగా పొందుపరిచారు. స్టాక్ ఆప్షన్ (నష్టాల్లేని) జాక్పాట్ ఇందులో ఒకటి. నిఫ్టీ ఆప్షన్ (నష్టాల్లేని) జాక్పాట్ మరొకటి. 95–99 శాతం కచ్చితమైన రికమండేషన్, నష్టాలు సున్నా, జాక్పాట్ వంటి పదాలను వినియోగించారు. వీటి ద్వారా అద్భుతమైన రాబడులపై ఇన్వెస్టర్లలో ఆశలు కల్పించారు. మొత్తం 10 వెబ్సైట్ల ద్వారా వీరు ఈ తరహా పెయిడ్ సూచనల సేవల వ్యవహారాలు నడిపినట్టు సెబీ దర్యాప్తులో వెలుగు చూసింది. నిఫ్టీష్యూర్ షాట్ డాట్కామ్, న్యూస్బేస్డ్టిప్స్ డాట్ కామ్, ఆప్షన్టిప్స్ డాట్ ఇన్ సైట్లు కూడా వీరు నిర్వహించినవే. ఈ తరహా జాక్పాట్, నష్టాల్లేని, కచ్చితమైన రికమండేషన్స్ అనే పదాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు ప్రతీ లావాదేవీలో రావడమన్నది అసాధ్యం. ఈ తరహా పదాలతో కూడిన ప్రకటనలు స్పెక్యులేటివ్ తరహావిగా భావించాలి. ఎందుకంటే సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గైడ్లైన్స్ 2013, సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ ప్రకారం... ఏ మ్యూచువల్ ఫండ్ కూడా, డిస్ట్రిబ్యూటర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రాబడులపై భరోసా కానీ, గ్యారంటీ కానీ ఇవ్వరాదు. ‘‘మార్కెట్ ఆధారిత సాధనాలపై రాబడులు గ్యారంటీ అని పేర్కొంటే అది మోసపూరితమే. ఎవ్వరూ ఈ తరహా హామీ ఇవ్వరాదు. వారు వారి ట్రాక్ రికార్డునే ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తు రాబడులపై హామీలు ఇవ్వరాదు’’ అని ఓరో వెల్త్ సహ వ్యవస్థాపకుడు విజయ్ కృష్ణ కుప్ప తెలిపారు. స్టాక్ టిప్స్కు దూరం స్టాక్ టిప్స్ రూపంలోనూ పెద్ద ఎత్తున మోసాలు జరుగుతాయన్న అవగాహన అవసరం. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గైడ్లైన్స్ ప్రకారం పెట్టుబడులకు సంబంధించి సలహాలిచ్చే వారు... కస్టమర్ల రిస్క్కు తగిన పోర్ట్ఫోలియోను సూచించాల్సి ఉంటుంది. ఆయా సాధనాల్లో ఉండే రిస్క్ గురించి కూడా వివరించాలి. కానీ, జైన్ అతడి సహచరులు మాత్రం ఈ పనిచేయలేదు. సెబీ వద్ద నమోదు చేసుకున్న సలహాదారులు... కేవలం ఈక్విటీలే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా అన్ని రకాల సాధనాల గురించి తెలియజేయడంతోపాటు, ఇన్వెస్టర్లకు అనుకూలమైన వాటిని సూచించాలి. ‘‘స్టాక్ ట్రేడింగ్ టిప్స్ ఇచ్చే వారి విషయంలో అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే వాటి రూపంలో మోసాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. కస్టమర్లు అధిక రాబడులు ఆశిస్తుంటారు. కొంత మంది ఆర్థికంగా కష్టాల్లో ఉండడంతో భారీ రాబడులు వచ్చే చోట ఇన్వెస్ట్ చేసి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని చూస్తుంటారు. దీన్నే మోసగాళ్లు అవకాశంగా మలుచుకుంటారు’’ అని అర్థయంత్ర సీఈవో నితిన్ బి వ్యాకరణం తెలిపారు. ట్రాక్ రికార్డు మీరు ఎంచుకునే సలహాదారులు, సలహా సంస్థలకు సంబంధించి గత ట్రాక్ రికార్డు అనేది ఒక ఆధారంగా పనికొస్తుంది. కానీ, ఆ ట్రాక్ రికార్డులో వాస్తవమెంతో ఎవరు చూసొచ్చారు? ఓ సారి ఆలోచించండి. జైన్ టీమ్ తమ వెబ్సైట్లో పేర్కొన్న రాబడుల చరిత్ర అంతా మోసపూరితమే. సానుకూల రివ్యూలు వారు సృష్టించినవి. అద్భుతమైన రాబడుల వివరాలను కూడా వారే కల్పించారు. వీటి ద్వారా చందాదారులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అందుకే ఈ తరహా పోర్టల్స్లోని సమాచారాన్ని గుడ్డిగా నమ్ముకోకూడదు. గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా ఆయా పోర్టల్స్ రికమండేషన్లలో ఉన్న మోసాల గురించి తోటి బాధితులు ఎవరైనా వివరాలు ఉంచితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపులు ఇక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థ గురించి బయట విచారించకోకుండా, ఆన్లైన్లోనే సబ్స్క్రిప్షన్ చెల్లించేయడం సరికాదు. మీ డబ్బులను తీసుకుని సదరు సంస్థ ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జైన్, అతడి బృందం చేసిన పనే ఇది. పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్ల నుంచి చందాలు తీసుకుని కాల్ చేసినా స్పందించకుండా ఉడాయించారు. ఆన్లైన్ వేదికగా ఫైనాన్షియల్ సేవలు అందించే సంస్థలు అన్నింటికీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఉండాలి. వీరితో ఒకసారి మాట్లాడి వివరాలను ధ్రువీకరించుకోవడం మంచిది. కాల్ చేసినప్పుడు మీ పెట్టుబడి రెట్టింపు అవుతుందని, రాబడులు గ్యారంటీ అనే మాటలు అటునుంచి వినిపిస్తే వారికి దూరంగా ఉండడం మంచిదన్నది నితిన్ వ్యాకరణం సూచన. ఆధారాలను పరిశీలించాల్సిందే మష్రువాలా, క్యాప్మెట్రిక్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ల లైసెన్స్లను ట్రోకా తనవిగా చూపించుకుని, సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్గా చలామణి కావడం గమనార్హం. కనుక సలహా తీసుకునే ముందు సంబంధిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లైసెన్స్ వాస్తవమైనదేనా అన్నది కూడా చూడాలని ఈ అనుభవం చెబుతోంది. డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఏదన్నది తెలిస్తే... యాంఫి సైట్కు వెళ్లి డిస్ట్రిబ్యూటర్ గుర్తింపును చెక్ చేసుకోవచ్చు. సెబీ వెబ్సైట్కు వెళ్లి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నిజమైనదేనా కాదా పరిశీలించుకోవచ్చు. వ్యక్తి పేరు లేదా వెబ్సైట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునే వీలుంది. రికార్డుల్లో కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలు లభిస్తాయి. ఆ వివరాల ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వారి వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలతో సరిపోల్చుకోవడం ద్వారా అసలైన వారా, నకిలీనా అన్నది తెలుసుకోవచ్చు. తమ వెబ్సైట్ దిగువ భాగంలో యాంఫి రిజిస్ట్రేషన్ నంబర్ (69583)ను చూడొచ్చని ఫండ్స్ ఇండియా డాట్ కామ్ సీవోవో శ్రీకాంత్మీనాక్షి సూచించారు. ఆ నంబర్పై క్లిక్ చేస్తే స్కాన్డ్ డాక్యుమెంట్ పాపప్ స్క్రీన్ఫై కనిపిస్తుందని, అందులో సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూడొచ్చని తెలిపారు. సంస్థ అసలు పేరు వెల్త్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అని అక్కడ ఉంటుందని చెప్పారు. యాంఫి వెబ్సైట్కు వెళ్లి తమ రిజిస్ట్రేషన్ నంబర్ 69583ను ఎంటర్ చేసినా అవే వివరాలు కనిపిస్తాయన్నారు. వివరాలు అక్కడ లేకుంటే సమస్య ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు. -
సలహా వల..షేర్లంటూ శఠగోపం
సాక్షి, హైదరాబాద్ : షేర్ మార్కెట్లో నమ్మకమైన సలహాలు..అంటూ వల విసిరి ఆ తర్వాత ప్యాకేజీలుగా టోకున సూచనలు ఇస్తామని బుట్టలో వేసుకొని చివరికి పెట్టుబడిపెట్టండి రూ.లక్షలు పట్టండి అంటూ శఠగోపం పెట్టిన నాలుగు బోగస్ కంపెనీల డైరెక్టర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండోర్లో నిర్వహిస్తున్న 4 సెబీ రిజిష్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీల డైరెక్టర్లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు పట్టుకొని ట్రాన్సిట్ వారంట్పై శనివారం నగరానికి తీసుకువచ్చారు. షేర్మార్కెట్లో లాభాలొస్తాయంటూ సలహాల పేరుతో రూ.15 లక్షల 61 వేలు మోసగించారని నలుగురు బాధితులు గతే డాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం మీడియాకు తెలిపారు. మొదట టెలికాలర్లు.. తర్వాత డైరెక్టర్లు ఎంబీఏ చదివిన స్వప్నిల్ ప్రజాపతి, అఖిలేష్ రఘువంశీ, సంతోష్ సింగ్ పరిహర్, సాగర్ సాహూలు సెబీ విద్యా అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెటీస్ నుంచి పీజీ డిపోమా కోర్సు లు చేసి ఆ తర్వాత సెబీ వద్ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీలుగా రిజిష్టర్ చేసుకున్నారు. ఈ సమయంలోనే వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ అడ్వై జరీ కంపెనీలో టెలికాలర్లుగా పనిచేసిన వీరు ఆ అనుభవంతో వేర్వేరు సంవత్సరాల్లో కంపెనీలు ఎవరికి వారు ఏర్పాటుచేసుకొని నిర్వహిస్తున్నారు. హైబ్రో మార్కెట్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వేటూస్ క్యాపిటల్.కామ్ను స్వప్నిల్ ప్రజాపతి, ద ఇక్వికామ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దఇక్వికామ్.కామ్ పేరుతో అఖిలేష్ రఘువంశీ, ట్రేడ్ బిజ్ రీసెర్చ్ పేరుతో ట్రేడ్బిజ్ఇండియా.కామ్ పేరుతో సంతోష్ సింగ్ పరిహర్, సఫల్ రీసెర్చ్ పేరుతో షఫల్రీసెర్చ్.కామ్ పేరుతోసాగర్ సాహూలు స్టాక్ మార్కెట్లలో అతి తక్కువ కాలంలో లాభాలంటూ డీమ్యాట్ ఖాతాదారులకు వల విసురుతున్నారు. ఇండోర్లోని విజయ్నగర్ కాలనీలో ఐటీ కంపెనీలను తలదన్నేలా సకల సౌకర్యాలతో కార్యాలయాలను నిర్వహిస్తూ 530 మంది టెలికాలర్లను నియమించుకొని రోజుకు వేలాది ఫోన్కాల్స్ చేస్తూ డబ్బును రెట్టింపు చేస్తామంటూ తియ్య టి మాటలతో కట్టిపడేస్తున్నారు. రూ.1.3 లక్షలు పెడితే నెలలో రూ.45 లక్షల లాభమంటూ... స్టాక్ మార్కెట్లో డీ మ్యాట్ ఖాతాదారుల వివరాలు సేకరించిన వీరు టెలికాలర్లు ద్వారా ఫోన్కాల్స్ చేస్తారు. ఫలానా సమయంలో ఫలానా షేర్ ధర పెరుగుతుంది, తగ్గుతుందంటూ వారిని నమ్మిస్తారు. వీరు చెప్పినట్టుగానే షేర్ల ధరలు ఉండటంతో నమ్మిన వేలాది మంది లాభాల కోసం రూ.5,900 ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. అలాగే 45 రోజుల్లో రూ.2,75,00 ల లాభానికి రూ. 22,499, రూ.7,50,000 లాభానికి రూ. 33,999లను ప్రాజెక్టుల రూపంలో చార్జీలు, టెక్నికల్ రిపోర్టుల కోసం ఒక్కోదానికి రూ.3,999 చొప్పున 20 అంటే రూ.79,980 లు వసూలు చేయడంతో పాటు 18 శాతం జీఎస్ టీని కూడా బాధితుల నుంచి తీసుకుంటున్నారు. లాభాల కోసం సలహాలు పక్కనపెడి తే డీ మ్యాట్ ఖాతా ద్వారా రూ.1,30,000లు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రూ.45 లక్షల లాభాలు వచ్చేలా చూస్తామని చెప్పడంతో పాటు చెల్లించే డబ్బులో 18 శాతం జీఎస్టీ, సెక్యూరిటీ డిపాజిట్ కింద 20 శాతం మొత్తం ముందుగానే వసూలు చేశారు. 4 గడుస్తున్నా సొమ్ములు రాకపోవడంతో బాధితులు నష్టాల్లో కూరుకుపోయారు. ఈ కంపెనీలపై సెబీ వద్ద దాదాపు 800 వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ 4 కంపెనీల మోసాలపై సెబీకి లేఖ రాస్తామని, వారికి వచ్చిన ఫిర్యాదుల చిట్టా తీసుకొని తెలంగాణ నుంచి ఎంత మంది బాధితులున్నారా అని తెలుసుకుంటామని సీపీ అన్నారు. అలాగే ఆయా కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.3.62కోట్లను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇండోర్ వెళ్లి నిందితులను పట్టుకొచ్చిన ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రామయ్య, ఎస్ఐ విజయ్ వర్ధన్లను సీపీ సజ్జనార్ ప్రశంసించారు. నమ్మించి మోసగించారు.. నేను స్టాక్ మార్కెట్లో షేర్లు క్రయ విక్రయాలు చేస్తుంటాను. ఒకరోజు దఇక్వికామ్.కామ్ పేరుతో స్టాక్ మార్కెట్ సలహాలు ఇస్తామంటూ ఫోన్కాల్ వచ్చింది. నమ్మలేదు. అయితే ఉదయం 9.30 నుంచి 9.45 గంటల సమయంలో ఫలానా కంపెనీ షేర్ల ధరలు ఇంత వరకు పెరుగుతాయని చెప్పారు. నేను వారం పాటు వారి సలహాలు చూశా. చివరకు నమ్మకం వచ్చాక విడతల వారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేశా. చివరకు ఒకసారి నేరుగా లక్ష రూపాయలు ఇస్తే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి మోసం చేశారు. వారి కంపెనీలో ఒకరు ఒక షేర్లు కొన్నారంటే...మరొకరు ఇంకొక షేర్లు కొన్నారని సమాధానం చెప్పడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ను సంప్రదించా. – ఆదిత్య, బాధితుడు ఇవీ.. తెలుసుకోండి... నగరంతో పాటు ఏ ఇతర నగరాల్లోనైనా ఉన్న షేర్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీల సలహా తీసుకోవాలనుకుంటే వారి కార్యాలయానికి వ్యక్తిగతంగా వెళ్లాలి. అక్కడ అన్నీ తెలుసుకున్నాకే మంచిదని అనుకుంటే ముందుకెళ్లాలి. స్థానిక సెబీ అధికారుల వద్ద కూడా వారి వివరాలు తెలుసుకోవాలి. -
బ్యాంక్లో డబ్బు షేర్స్లో పెట్టి..కటకటాలపాలై..
కడప అర్బన్ : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మార్తల గురుమోహన్రెడ్డి డిగ్రీ వరకు చదివి బ్యాంకు ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యాడు. ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లలను పోషించుకుని జీవితం సాగించాల్సిన ఆయన.. డిగ్రీ చదువుతున్న వయసు నుంచే వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలుగన్నాడు. అయితే తన ప«రిధిలో, అందుబాటులో ఉన్న నగదు, సహోద్యోగులను ఉపయోగించుకుని తద్వారా డబ్బు తీసుకుని.. వారి కళ్లు గప్పి ఏకంగా షేర్ మార్కెట్లో పెట్టాడు. ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే.. షేర్ మార్కెట్ మోజుతో కటకటాల పాలయ్యాడు. మొదటగా మైదుకూరు ఎస్బీఐలో పని చేసే సమయంలోనే ఏటీఎంలలో డబ్బులు పెడుతూ.. రూ.30–40 లక్షలు కాజేశాడు. ఈ విషయాన్ని అప్పట్లో బ్యాంకు అధికారులు పసిగట్టి సస్పెన్షన్ చేశారు. వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించడంతో తిరిగి పోరుమామిళ్లలోని రంగసముద్రం ఎస్బీఐ బ్రాంచ్కు క్యాషియర్గా పంపించారు. రంగసముద్రంలో చెలరేగాడు రంగసముద్రం ఎస్బీఐ బ్రాంచ్లో క్యాషియర్గా పని చేస్తున్న మహిళా ఉద్యోగి.. క్యాష్ ఇన్చార్జిగా ఉన్న గురుమోహన్రెడ్డిని నమ్మి సేఫ్ లాకర్ నుంచి నగదును తీసుకొచ్చి మరలా పెట్టడం లాంటి ప్రక్రియను అప్పగించింది. అమాయకురాలైన ఆమె అతని చర్యలను పసిగట్టలేకపోయింది. దీంతో ఖాతాదారులకు సంబంధించిన దాదాపు రూ.2.50 కోట్ల మేరకు బంగారు ఆభరణాలు, నగదు కాజేశాడు. ఆ డబ్బులను ఏటీఎంలో పెట్టేటపుడు తీసుకునే వాడు. ఉదాహారణకు రూ. 40 లక్షలు నగదును మిషన్లో పెట్టేటపుడు అందులో కొన్ని లక్షల రూపాయలు పక్కకు తీసి.. ఆన్లైన్లో మాత్రం రూ.40 లక్షలనే పెట్టినట్లుగా చూపిం చేవాడు. అలాగే బంగారు ఆభరణాలను కూడా ప్రొద్దుటూరులోని తన భార్య మంజులత ఖాతా లో తనఖా పెట్టి.. ఆ డబ్బును మరలా తన ఖాతా లోకి జమ చేసుకునే వాడు. ఏరోజుకారోజు షేర్స్లో డబ్బులు పెడుతుండడంతో.. లాభాలు వచ్చి న తర్వాత అదే డబ్బును మరలా మరుసటి రోజు షేర్స్లో పెట్టేవాడు. ఎక్కువ మొత్తం వస్తుందని ఆశ పడడం, మరలా నష్టపోవడం పరిపాటిగా మారింది. గతంలో మైదుకూరులో జరిగిన సంఘటన పునరావృతం అవుతుందని భావించాడు. ఆడిటింగ్ వారు కూడా వస్తారని, అదే సమయంలో తాను చేసిన చీటింగ్ వ్యవహారం బట్టబయలవుతుందని పసిగట్టాడు. మార్చి 28న తన భార్యతోపాటు రూ. 91 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. ఆటకట్టు గురుమోహన్రెడ్డి బద్వేలు, చెన్నైలో ఉన్న సురేష్రెడ్డి, కుమార్కు లక్షల్లో డబ్బులను ఇచ్చి తమ అవసరాలకు వాడుకోవాలని.. మరలా తాను తీసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న డబ్బును మరలా షేర్లలో పెట్టడంతో.. వస్తూ పోతూ ఉండడం గమనించాడు. ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న భార్య అతనితోపాటు ఉండకుండా ప్రొద్దుటూరులో తాము ఉంటున్న ఇంటికి వచ్చేసింది. అప్పటికే పోరుమామిళ్ల పోలీసులకు బ్యాంకు అధికారులు, ఖాతాదారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య పోలీసులకు చిక్కిందని తెలుసుకున్న గురుమోహన్రెడ్డి తన దగ్గర ఉన్న డబ్బులు, బంగారు నగలు తీసుకుని వచ్చేశాడు. ఈ నెల 11న కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉండగా మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ మధుసూదన్గౌడ్, ఎస్ఐలు ఘన మద్దిలేటి, పెద్ద ఓబన్న తమ సిబ్బందితో కలసి గురుమోహన్రెడ్డిని, అతనికి ఆశ్రయం కల్పించిన సురేష్రెడ్డి, కుమార్ను అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుతోపాటు బంగారు, నగదు రికవరీ పోరుమామిళ్ల టౌన్లోని రంగసముద్రం ఎస్బీఐలో క్యాష్ ఇన్చార్జిగా పని చేసిన గురుమోహన్రెడ్డి, అతని స్నేహితులు సురేష్రెడ్డి, కుమార్ను అరెస్టు చేసినట్లు ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 56.76 లక్షల నగదు, రూ. 51.54 లక్షల విలువైన 1.718 కిలో గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుంది. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను ఓఎస్డీ అభినందించారు. -
100 బిలియన్ డాలర్ల క్లబ్లో టీసీఎస్
-
టీసీఎస్ @ 100 బిలియన్ డాలర్లు!
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. భారత్ కార్పొరేట్ రంగ చరిత్రలో మొట్టమొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఘనతను సాధించేందుకు ఉరకలేస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. దీంతో శుక్రవారం స్టాక్ సూచీలు నష్టపోయినా, టీసీఎస్ షేరు మాత్రం రికార్డ్ స్థాయిని తాకింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వంద బిలయన్ డాలర్లకు అత్యంత దరిదాపుల్లోకి వచ్చింది. టాటా గ్రూప్ కామధేనువు... టాటా గ్రూప్కు కామధేనువు(టాటా గ్రూప్ లాభాల్లో 85 శాతం ఈ కంపెనీ నుంచే వస్తోంది), ఐటీ దిగ్గజం టీసీఎస్ షేర్ శుక్రవారం జీవిత కాల గరిష్ట స్థాయికి చేరింది. టీసీఎస్ ఇంట్రాడేలో 7.2 శాతం లాభంతో రూ. 3,421 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6.7 శాతం లాభంతో రూ.3,406 వద్ద ముగిసింది. ఇది ఆల్టైమ్ హై క్లోజింగ్ ధర. సెన్సెక్స్లోనూ, నిఫ్టీ సూచీలో కూడా అత్యధికంగా లాభపడిన షేర్ ఇదే. ఒక్క శుక్రవారం రోజే దాదాపు కోటి షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈలో 92 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. రూ.7,917 కోట్ల దూరంలో... టీసీఎస్ షేర్ భారీగా పెరగడంతో ఈ షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.41,301 కోట్లు పెరిగి రూ.6,52,083 కోట్లకు పెరిగింది. వంద బిలియన్(పదివేల కోట్లు) డాలర్ల మార్కెట్ క్యాప్కు(దాదాపు రూ.6,60,000 కోట్లు) చేరువైంది. పదివేల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించనున్న తొలి భారత కంపెనీ ఇదే కానున్నది. ప్రస్తుతం అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న భారత కంపెనీ కూడా ఇదే. వంద బిలియన్ డాలర్ల మార్కెట్క్యాప్ కంపెనీ అన్న ఘనతను సాధించడానికి ఈ షేర్ ఇంకా రూ.7,917 కోట్ల మార్కెట్ క్యాప్సాధిస్తే, చాలు. టీసీఎస్ షేర్ రూ.3,447ను తాకితే వంద కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డ్ సాధిస్తుంది. ఈ ధర కంటే రూ.41 తక్కువ ధరకు శుక్రవారం ఈ షేర్ ముగిసింది. ఈ ఏడాది జనవరి 24 నాటికి ఈ కంపెనీ తొలిసారిగా రూ. 6 లక్షల కోట్ల మార్క్ను దాటింది. బీఎస్ఈలో 3,000కు పైగా కంపెనీలు చురుకుగా ట్రేడవుతున్నాయి. వీటిల్లో వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్కు చేరువ అయిన తొలి భారత కంపెనీ ఇదే. టీసీఎస్ పోటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్తో పోల్చితే టీసీఎస్ మార్కెట్ క్యాప్ రెండున్నర రెట్లు అధికం. ఇక వంద కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 63 మాత్రమే ఉన్నాయి. అమెజాన్, యాపిల్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. టాప్ 5 కంపెనీలు కంపెనీ మార్కెట్ క్యాప్ (రూ. కోట్లలో) 1 టీసీఎస్ 6,52,083 2 రిలయన్స్ ఇండస్ట్రీస్ 5,87,830 3 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5,08,884 4 ఐటీసీ 3,36,778 5 హిందుస్తాన్యూనిలివర్ 3,17,212 14 ఏళ్లలో 23%చక్రగతి వృద్ధి... 2004లో ఐపీఓకు వచ్చినప్పటి నుంచి టీసీఎస్ షేర్ 14 సంవత్సరాల్లో 23% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ షేర్ 20% ఎగసింది. కంపెనీ భవిష్యత్తు అంచనాలు పటిష్టంగా ఉన్నాయని, ఐటీ రంగంలో తీవ్రమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో టీసీఎస్ విజేతగా నిలవగలదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ షేర్ ఫండమెం టల్స్ పటిష్టంగా ఉన్నాయని, షేర్ పడిపోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని, లార్జ్క్యాప్ ఐటీ కంపెనీల్లో టీసీఎస్కు అగ్రస్థానం ఇవ్వవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ షేర్ పతనమైనప్పుడల్లా కొను గోలు చేయవచ్చని వారు సూచిస్తున్నారు. -
భారీగా పడిపోయిన బిట్కాయిన్
లండన్/టోక్యో : షేర్ మార్కెట్ను తలదన్నుతూ లాభాల్లో దూసుకువెళుతున్న బిట్ కాయిన్... మార్కెట్లను షేక్ చేస్తోంది. గతవారం అత్యధికంగా 20వేల డాలర్లకు అంటే 12లక్షల 80వేలకు చేరిన ఈ కరెన్సీ... ఒక్కసారిగా ఢమాలమని పడిపోయింది. కేవలం ఐదు రోజుల్లోనే మూడో వంతు తన విలువను కోల్పోయిన బిట్కాయిన్, లక్సెంబర్గ్ ఆధారిత బిట్స్టాంప్ ఎక్స్చేంజ్లో 13వేల డాలర్లుగా నమోదైంది. అంటే రూ.8.50 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్యలో ట్రేడైంది. ఒకేసారి 20వేల డాలర్ల నుంచి 13వేల డాలర్లకు పడిపోవడంతో, 2013 నుంచి ఇదే అతి చెత్త వారంగా రికార్డైంది. ప్రతి రోజూ కొద్ది కొద్దిగా పడిపోతూ వస్తున్న బిట్ కాయిన్, శుక్రవారం దాని నష్టాలు మరింత పెరిగాయి. 12,560 డాలర్ల కనిష్ట స్థాయిలకు కూడా ఇది పడిపోయింది. ఒక్క రోజులోనే సుమారు 20 శాతం తన విలువను కోల్పోవడం గమనార్హం. వర్చ్యువల్ రూపంలో ఉండే బిట్ కాయిన్ పై.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇండియాలో ఇంకా ఈ కరెన్సీని అధికారికంగా గుర్తించలేదు. చాలా దేశాలు, మార్కెట్ నిపుణులు బిట్కాయిన్పై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇది అంత సేఫ్ కాదంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే క్రిస్మస్, న్యూఇయర్ పండుగలు రావటంతో చాలామంది బిట్ కాయిన్ పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగినట్టు విశ్లేషకులు చెప్పారు. పెద్ద సంఖ్యలో విక్రయాలకు పాల్పడటంతో ధర పడిపోయిందని పేర్కొన్నారు. మరోవైపు బిట్ కాయిన్ లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలని సెబీ కూడా హెచ్చరిస్తోంది. బిట్ కాయిన్పై హెచ్చరికలు జారీ అవుతున్న సమయంలోనే ఈ విలువ ఒక్కసారిగా భారీగా పడిపోయింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఇది మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. -
లాభాలు చూపాడు.. నిండా ముంచాడు
-
లాభాలు చూపాడు.. నిండా ముంచాడు
రాజాం: అతడొక సాధారణ యువకుడు. మారుమూల గ్రామంలో నివసించిన వ్యక్తి. ఉన్నత విద్య కూడా పూర్తిచేయని పరిస్థితి. నిండా పాతికేళ్లు ఉండవు. అటువంటి ఓ యువకుడు ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రూ. 187 కోట్లుకు కుచ్చుటోపి పెట్టాడు. షేర్మార్కెట్ పేరుతో 303 మందిని మోసగించాడు. ఈ ఘటన ఎక్కడో ముంబాయి, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో జరగలేదు. మారుమూల పల్లెలోనే చోటుచేసుకుంది. బాధితుల్లో ఎక్కువ మంది రైతు కూలీలు ఉండడం విచారించ దగిన విషయం. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన ఈ ఘరానా మోసానికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు అధికంగా ఉన్నాయి. ఆ కేటుగాడి వివరాలు, ఆ మోసం వెనుక కుట్ర తెలియాలంటే ఈ వివరాలు చదవాల్సిందే. సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన ఓ ఘరానా మోసగాడి ఉదంతం ఇది. రాజాం పట్టణ కేంద్రంలో నాలుగేళ్ల క్రితం ఆయువకుడు ఇండీ ట్రేడ్ను ప్రారంభించి ఆరంభంలో కొంతమందికి లాభాలను చూపించాడు. రూ. లక్షకు రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకు నెలవారీ ఆదాయం చూపించడంతో ఇదేదో బాగుందని రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర, జి.సిగడాం, పొందూరు, తెర్లాం మండలాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు లక్షల రూపాయలను ఈ షేర్మార్కెట్లో పెట్టుబడిగా పెట్టారు. కొన్నాళ్లపాటు అసలు కాకుండా నెలవారీ వచ్చే ఆదాయాన్ని అందరికీ ఇచ్చేస్తుండడంతో అందరూ షేర్మార్కెట్లో మంచి లాభాలు వస్తున్నాయని భావించి రూ. లక్షల్లో పెట్టుబడులు పెంచుకుంటూ వచ్చారు. సరిగ్గా ఏడాది క్రితం రాజాంలోని ఈ కార్యాలయాన్ని సంతకవిటి మండలం తాలాడ వద్దకు ఆ యువకుడు మార్చేసి అక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు ప్రారంభించాడు. అంతేకాకుండా తన స్వగ్రామం మందరాడలో రూ. 2 కోట్లు విలువచేసే కొత్త భవనం నిర్మాణం ప్రారంభించాడు. దీంతో ఇన్వెష్టర్లకు మరింత నమ్మకం కలిగి విచ్చలవిడిగా పెట్టుబడులను పెట్టేశారు. మందరాడతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రోజువారి కూలీలు, రైతులు, తమ ఆడపిల్లల పెళ్లిల్లు నిమిత్తం దాచుకున్న కొంతమంది వ్యక్తులు డబ్బులను ఈ షేర్మార్కెట్లో పెట్టుబడి రూపంలో పెట్టారు. ఒకరు ఇళ్లు కొనుక్కొందామని, మరొకరు తమ ఆడపిల్లలకు పెళ్లిచేద్దామని, ఇంకొకరు పిల్లలను ఉన్నత చదువులు చదివిద్దామని, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఆశపడ్డారు. అయితే ఏడాది క్రితం నుంచి నెలవారీ ఇచ్చే ఆదాయాన్ని షేర్ మార్కెట్ యజమాని నిలుపుదలచేసి వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. చివరకు ఇటీవల తన వివాహం వరకు తుదిగడువు పెట్టి వివాహం అనంతరం కూడా మొహం చాటేశాడు. దీంతో పెట్టుబడి దారులు గత వారం రోజులుగా ఒత్తిడిచేయడం ప్రారంభించడంతో ఈ నెల 10వ తేదీ నుంచి మందరాడలోని తన ఇళ్ల తలుపులకు తాళాలువేసేయడంతో పాటు తాలాడలోని కార్యాలయానికి తాళాలు వేసి పలాయనం చిత్తగించాడు. ఉన్నఫలంగా కార్యాలయానికి తాళాలు వేయడంతో పాటు ఇంటి వద్ద కుటుంబీకులు లేకపోవడంతో పెట్టుబడిదారులకు ఆందోళన ఎక్కువై ఒక్కొక్కరుగా తమ పెట్టిన పెట్టుబడులకు సంబంధించి వివరాలు బయటపెడుతూ లబోదిబోమంటున్నారు. రూ. 187 కోట్లకు కుచ్చుటోపి ఇండీట్రేడ్ షేర్మార్కెట్లో వాస్తవంగా షేర్ బిజినెస్ జరగలేదని, పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఒకరు పెట్టిన పెట్టుబడిని ఇంకొకరి పెట్టుబడికి వడ్డీగా చూపిస్తూ ఒకరికి తెలియకుండా ఒకరిని యజమాని మోసం చేసుకుంటూ వచ్చాడని చర్చించుకుంటున్నారు. పెట్టుబడి దారులు కూడా అధికలాభాలకు ఆశించి ఒకరికి తెలియకుండా ఒకరు భారీగా పెట్టుబడులు పెట్టేయడంతో ఇండీట్రేడ్లో రూ. 187 కోట్లుకుపైగా పెట్టుబడులు వచ్చిపడ్డాయి. 303 మందికిపైగా ఇన్వెష్టర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వీరికి పక్కా కాగితాలుకాని, బాండ్లుకాని, డీమేట్ ఖాతాలుకాని లేకపోవడంతో వీరంతా రోడ్డున పడ్డట్టు అయింది. అధికార పార్టీ అండదండలపై అనుమానాలు వందల మంది పేదలను మోసగించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఇండీట్రేడ్ యజమానికి టీడీపీ నేతలతో సత్సంబందాలు ఉన్నాయనే అనుమానాలు అధికంగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో మండల స్థాయి టీడీపీ నేతలకు ఈయన ఆర్థిక సాయం అందించడంతో పాటు వాహనం సమకూర్చినట్టు పలువురు పేర్కొంటున్నారు. ఓ టీడీపీ సీనియర్ నేత ఈయనతో కలసిమెలసి తిరగడంతో పాటు పలు సందర్భాల్లో టీడీపీ సమావేశాలకు, కార్యక్రమాల్లో ఈయనను ప్రధాన పాత్రధారిగా చూపించడంతో చాలా మంది ఇన్వెష్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఈ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఈయనతో సన్నిహితంగా ఉన్నట్టు వ్యవహరించడంతో అధికార పార్టీ అండదండలు ఈ యజమానికి ఉన్నాయనే అనుమానాలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం బాధితులు మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత ఇంటికి వెళ్లి ఈ వ్యవహారంపై ఆ నాయకుని వద్ద బోరున విలపిస్తున్నారు. తమను ఎలాగైనా కాపాడాలని, మీరంతా కలసి ఉన్నారన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టామని వాపోతున్నట్టు తెలిసింది. అయితే ఈ వివరాలు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. ఐపీ పెట్టిన యజమాని? ఇదిలా ఉండగా ఇండీట్రేడ్ యజమాని రాజాం పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు, ఐపీ ద్వారా కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. 303 మంది పెట్టుబడిదారుల పేర్లును జోడించి, రూ. 18 కోట్లు మాత్రమే తమ వద్ద పెట్టుబడి పెట్టినట్టు, మందరాడలో నూతనంగా నిర్మించిన ఇల్లు మాత్రమే తనకు ఆస్తి ఉన్నట్టు ఈ ఐపీలో న్యాయస్థానానికి విన్నవించినట్టు తెలిసింది. ఇంత సంఘటన జరిగినప్పటికీ బాధితులు మాత్రం పోలీసుస్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. కొంతమంది బాధితులు మోసపోయామనే బాధతో, ఇంకొంతమంది బాధితులు అత్యాసకు వెళ్లామనే సిగ్గుతో, మరికొంమంది ఉద్యోగులు తమ ఆదాయానికి మించిన ఇన్వెస్ట్మెంట్లు పెట్టడంతో ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో గోప్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై రాజాం రూరల్ సీఐ వీరకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఈ ఘటనకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదని, పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా ద్వారా వచ్చిన కథనాల ప్రకారం ఆరా తీస్తున్నామని అన్నారు. -
రూ.187 కోట్లకు టోకరా!
రాజాం: శ్రీకాకుళం జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. రూ.187 కోట్లకు టోకరా పెట్టి ఇన్వెస్టర్లను ఓ యువకుడు నట్టేట ముంచాడు. ఈ ఘటన రాజాం నియోజక వర్గంలోని సంతకవిటి మండలంలో చోటు చేసుకుంది. సంతకవిటి మండలం మంద రాడకు చెందిన ఓ యువకుడు ఇండీట్రేడ్ పేరుతో రాజాంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా నాలుగేళ్ల క్రితం షేర్మార్కెట్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఒకరిద్దరికి లాభాలను చూపించడంతో దాదాపు 300 మంది ఇన్వెస్టర్లు రూ.187 కోట్లను ఒకరికి తెలియకుండా మరొకరు షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. ఏడాది క్రితం ఈ కార్యాలయాన్ని సంతకవిటి మండలం తాలాడకు యువకుడు మార్చాడు. గతేడాది పెద్దనోట్ల రద్దు తరువాత నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇన్వెస్టర్లకు చూపించ లేదు. ఏడాదిగా వాయిదా వేసుకుంటూ వస్తుండటంతో సహనం నశించిన ఇన్వెస్టర్లు ఇటీవల గట్టిగా నిలదీశారు. తమ పెట్టు బడులు ఇచ్చే యాలని డిమాండ్ చేయగా ట్రేడ్ యజమాని ఈనెల 10కి వాయిదా వేసి ఉన్నపళంగా షేర్ మార్కెట్ కార్యాల యానికి, మందరాడ గ్రామంలోని తన ఇళ్లకు తాళాలు వేసి ఉడాయించాడు. దీంతో పెట్టుబడి దారులం తా లబోదిబోమంటున్నారు. ఇలా ఉండగా షేర్ మార్కెట్ యజమాని తన రక్షణ నిమిత్తం 303 మం దిపై కేసులు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి స్థానిక టీడీపీ నేతల తోపాటు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండ దండలున్నాయనే ఆరోపణలు వస్తు న్నాయి. ప్రస్తుతం ఈ యజమానిపై ఎటు వంటి కేసులు లేకుండా ఆ నేతలు నెట్టుకొస్తు న్నట్లు తెలుస్తోంది. కోట్లకు టోకరా పెట్టిన యజమానిపై ఇంత వరకు ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని రాజాం రూరల్ సీఐ వీరకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
బేసిక్ డీమ్యాట్ బెటర్ గురూ!
మధ్యలో చిన్నచిన్న ఒడిదుడుకు లొచ్చినా దాదాపు మూడేళ్లుగా మార్కెట్ బుల్ రన్ కొనసాగుతూనే ఉంది. ‘‘నాకు ఈ ఏడాది షేర్ మార్కెట్లో రెండు రెట్ల లాభాలొచ్చాయి. నేను పెట్టిన సొమ్ము ఆరు నెలల్లోనే రెట్టింపయింది’’ అనే మాటలు తరచుగానే వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూసి... కొందరు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్లలోకి మళ్లుతున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ఏం చేయాలనేది చాలామందికి తెలియదనే చెప్పాలి. తెలిసిన స్నేహితుల్ని సలహా అడగటం... వారు చెప్పినట్లు చేయటం... తరవాత తప్పొప్పులు బేరీజు వేసుకోవటం కూడా చాలామంది చేస్తుంటారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది ఒకటుంది!!. అదేంటంటే... తమకు ఏ తరహా డీమ్యాట్ ఖాతా సరిపోతుందనేది!. సాధారణంగా షేర్ల ట్రేడింగ్కు డీమ్యాట్ ఖాతా ఉండాలి. ఈ ఖాతా తీసుకున్నాక.. లావాదేవీలు, పోర్ట్ఫోలియో పరిమాణం ఎలా ఉన్నా నిర్వహణ చార్జీల పేరిట ఏటా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలాంటి చార్జీల ప్రమేయం లేకుండా ప్రాథమిక సర్వీసులను మాత్రమే ఉపయోగించుకోగలిగే డీమ్యాట్ ఖాతాలు కూడా తీసుకోవచ్చని చాలామందికి తెలియదు. వాటిని బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ ఖాతాలు అంటారు. ఇది పూర్తి స్థాయి డీమ్యాట్ అకౌంట్ కాదు. ప్రాథమిక సేవలు మాత్రమే అందుతాయి. ఇది ఎలాంటి వారికి అనువైనదో, ఏ సేవలు పొందవచ్చో ఒకసారి చూద్దాం.. బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ అంటే... షేర్లు వంటి ఆర్థిక సాధనాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చుకునేందుకు ఉపయోగపడే ఖాతాను డీమ్యాట్ ఖాతాగా వ్యవహరిస్తారు. అంటే డీమెటీరియలైజ్డ్ ఖాతా అన్నమాట. స్టాక్మార్కెట్లో మరింత మంది ఇన్వెస్ట్ చేసేలా పోత్సహించే ఉద్దేశంతో.. డీమ్యాట్ ప్రొవైడర్లు (డీపీ) కచ్చితంగా ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతాలు (బీఎస్డీఏ) కూడా అందించాలని సెబీ నిర్దేశించింది. దీంతో చిన్న మొత్తాల్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారు వార్షిక నిర్వహణ చార్జీలు మొదలైన బాదరబందీ లేకుండా బీఎస్డీఏని ఉపయోగించుకోవచ్చు. బీఎస్డీఏ ప్రత్యేకతలేమిటి.. మీ పోర్ట్ఫోలియో పరిమాణం రూ.2,00,000 కన్నా తక్కువే ఉండొచ్చని అనుకున్న పక్షంలో బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ అకౌంటు తెరవొచ్చు. ఏ డీమ్యాట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరైనా దీన్ని పొందవచ్చు. ఒకవేళ ప్రస్తుత డీమ్యాట్ ఖాతా పెద్దగా వినియోగంలో లేకపోయినా.. ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా ఒక రకంగా ఉచిత ఖాతాలాంటిదే. ఎందుకంటే మీ లావాదేవీల విలువ రూ.50,000 కన్నా తక్కువగా ఉన్న పక్షంలో మెయింటెనెన్స్ చార్జీల్లాంటివి కట్టక్కర్లేదు. అదే రూ.50,000 నుంచి రూ. 2,00,000 మధ్యలో ఉంటే రూ.100 కడితే సరిపోతుంది. ఒకవేళ మీ హోల్డింగ్స్ పరిమాణం రూ.2,00,000 దాటిన పక్షంలో బీఎస్డీఏని డీపీ సాధారణ డీమ్యాట్ ఖాతా కింద పరిగణించి తదనుగుణంగా చార్జీలు వసూలు చేస్తారు. ప్రధానంగా రిటైల్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లు తమ సెక్యూరిటీస్ను డీమ్యాట్ రూపంలో భద్రపర్చుకునేలా చూసేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే ఒక డీమ్యాట్ అకౌంటున్న పక్షంలో అది పెద్దగా వినియోగంలో లేకపోయినా లేదా పోర్ట్ఫోలియో పరిమాణం చాలా తక్కువగా ఉన్నా.. డీపీని సంప్రతించి దాన్ని బీఎస్డీఏ కింద మార్చుకునే వెసులుబాటు ఉంది. పోర్ట్ఫోలియో విలువ లెక్కించేదిలా.. పోర్ట్ఫోలియో విలువను డీపీ సంస్థ .. ఆయా షేర్లు, ఫండ్స్ మొదలైన వాటి రోజువారీ క్లోజింగ్ ధరల ఆధారంగా లెక్కిస్తుంది. మీ బీఎస్డీఏ పరిమితులతో దీన్ని పోల్చి చూస్తుంది. పోర్ట్ఫోలి యో విలువ పరిమితిని దాటిన పక్షంలో సాధారణ డీమ్యాట్ ఖాతా కింద గానీ లేదా నిర్దేశిత స్లాబ్ కింద గానీ మీ నుంచి ఫీజులు వసూలు చేస్తుంది. లావాదేవీల స్టేట్మెంట్.. బీఎస్డీఏ యాక్టివ్గా ఉండి, నిర్దిష్ట బ్యాలెన్స్ను కొనసాగిస్తూ ఉన్న పక్షంలో ప్రతి మూడు నెలలకోసారి లావాదేవీల స్టేట్మెంట్ వస్తుంది. అదే త్రైమాసికంలో లావాదేవీలేమీ జరగక పోగా సెక్యూరిటీ బ్యాలెన్స్ కూడా లేకపోతే లావాదేవీల నివేదిక రాదు. ఈ స్టేట్మెంట్ ప్రధానంగా ఎలక్ట్రానిక్ కాపీ (సాఫ్ట్ కాపీ), హార్డ్ కాపీల రూపంలో ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్స్ ఉచితంగానే పొందవచ్చు. అయితే, హార్డ్కాపీ కావాలనుకుంటే తొలి రెండు స్టేట్మెంట్స్ మాత్రమే ఉచితంగా లభిస్తాయి. అదనపు స్టేట్మెంట్స్ కోసం రూ. 25 చెల్లించాల్సి వస్తుంది. వార్షిక హోల్డింగ్ స్టేట్మెంట్.. ఏడాదికోసారి ఖాతాలో హోల్డింగ్స్కి సంబంధించిన స్టేట్మెంట్ను ఖాతాదారు నమోదు చేసుకున్న చిరునామాకు వస్తుంది. దీన్ని హార్డ్ కాపీ రూపంలో లేదా ఖాతాదారు కోరుకున్న పక్షంలో ఈమెయిల్కు సాఫ్ట్ కాపీ రూపంలో పంపడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ అలర్ట్ సదుపాయం.. ఖాతాలో జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్ పొందడానికి ఖాతాదారు తన మొబైల్ నంబరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
ట్రేడింగ్ పేరుతో రూ.27 కోట్ల టోకరా
ఇన్వెస్టర్ల సొమ్ము సొంతానికి వాడుకున్న వైనం మొత్తం 12 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు ఒకరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: షేర్ మార్కెట్ పేరిట భారీగా వసూళ్లు చేసి... పలువురిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆకుల శ్రీధర్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీఎస్సీ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద మొత్తంలో దండుకున్న ఈ వ్యవహారంలో మొత్తం 12 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీసీపీ అవినాష్ మహంతి గురువారం తెలిపారు. వీరు రూ.27 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారన్నారు. నిందితుల్లో అత్యధికులు బంధువులే ఉన్నారన్నారు. ఫ్రాంచైజీలు... పెట్టుబడులు... సికింద్రాబాద్ ఈస్ట్మారేడ్పల్లికి చెందిన ఆకుల శ్రీధర్ తన భార్య చందనతో కలసి నాగోల్లో ఎస్వీఎస్సీ సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్లుగా ఉన్న వీరిద్దరికీ షేర్ మార్కెట్తో పాటు ట్రేడింగ్పైనా అవగాహన ఉంది. గతంలో మాస్టర్ ట్రస్ట్ సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని పలువురి నుంచి పెట్టుబడులు సేకరించారు. కొన్నాళ్లకు దీన్ని మూసేసిన భార్యా భర్తలు... ఫ్రాంచైజీని తమ బంధువైన జె.శ్రీనివాస్ పేరు మీదకు మార్చారు. తమ బంధువైన కోమటిరెడ్డి భిక్షంరెడ్డి పేరుతో 2014లో పీర్లెస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. దీనికోసం 80 మంది నుంచి రూ.3.5 కోట్ల పెట్టుబడి రాబట్టారు. ఎస్వీఎస్సీ ద్వారా పీర్లెస్ సెక్యూరిటీస్లో ట్రేడింగ్ మొదలెట్టిన శ్రీధర్, చందన... 2015లో 20 మంది నుంచి రూ.కోటి పెట్టుబడి పెట్టించారు. ఆపై కె.సవితారెడ్డి పేరుతో ఎంకే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్న భార్యాభర్తలు.. 15 మంది నుంచి రూ.70 లక్షల మేర పెట్టుబడులు సేకరించారు. ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు పంచుతామంటూ 318 మందితో పెట్టుబడులు పెట్టించారు. దీని ద్వారా నిందితులు ప్రతి నెలా దాదాపు రూ.5 లక్షల మేర కంపెనీల నుంచి బ్రోకరేజ్ తీసుకున్నారు. అవగాహన లేనివారితో డీమ్యాట్ ఖాతాలు... స్టాక్ మార్కెట్పై సరైన అవగాహన లేని వారి పేరుతోనూ లాభాల ఆశ చూపిన వీరు డీమ్యాట్ ఖాతాలు తెరిపించారు. వారి మాటలు నమ్మిన మూసాపేట వాసి కె.చంద్రకళ తన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులతో కలిసి రూ.9 కోట్ల పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజులకు నిందితులు తమ షేర్లకు సంబంధించిన మొత్తాన్ని స్రవంతి, మహ్మద్ ఫసియుద్దీన్లకు చెందిన ఖాతాలకు మళ్లించి రూ.68 లక్షలు డ్రా చేసుకున్నారని వీరికి తెలిసింది. చివరకు మలక్పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎస్వీఎస్సీ సంస్థను మూసేసిన నిందితులు పరారయ్యారు. దీంతో చంద్రకళ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలినవారి కోసం గాలింపు... ఏసీపీ జి.జోగయ్య నేతృత్వం లో ఎస్సై ఎన్.సురేశ్కుమార్ ఈ కేసు దర్యాప్తు చేశారు. శ్రీధర్, చందనతో పాటు ఆమె తల్లిదండ్రులు కె.భిక్షంరెడ్డి, కె.సవితారెడ్డి, సోదరుడు చాణక్యరెడ్డి, అతడి భార్య స్రవంతి, బంధువులు సుభాషి ణి, ఎన్.పాపిరెడ్డి, ఎన్.మహేశ్రెడ్డి, ఏజెంట్లు డాక్టర్ ఇంతియాజ్అలీ, మహ్మద్ ఫసియుద్దీన్, వై.ప్రతాప్ రెడ్డిలను నిందితులుగా తేల్చారు. శ్రీధర్ అరెస్టు తర్వాత మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
షేర్లలో పెట్టుబడికి అవగాహన తప్పనిసరి
‘సాక్షి’ మైత్రి మదుపరుల అవగాహన కార్యక్రమంలో సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ వెనిశెట్టి సాక్షి, రాజమహేంద్రవరం: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు మదుపరులు మార్కెట్లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి పేర్కొన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘సాక్షి మైత్రి’ మదుపరుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఔత్సాహిక మదుపుదారులకు పలు సూచనలు ఇచ్చారు. ఏదైనా కంపెనీ షేర్లు కొనుగోలు చేసే ముందు దాని వ్యాపార లావాదేవీలు మూడేళ్లుగా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.డీమ్యాట్ అకౌంట్ తీసుకునేప్పుడు నామినీ పేరు చేర్చడం వల్ల.. అనుకోకుండా మదుపుదారుడు చనిపోయినా ఎలాంటి ప్రక్రియ లేకుండా నేరుగా ఆ షేర్లు నామినీకి బదిలీ అవుతాయన్నారు. మైనర్లు కూడా డీమ్యాట్ అకౌంట్ తీసుకోవచ్చని, లావాదేవీలు నిర్వహించేందుకు మాత్రం అనుమతి ఉండదని తెలిపారు. బ్యాంకులు, స్టాక్ బ్రోకర్ల ద్వారా సీడీఎస్ఎల్ మదుపుదారులకు సేవలందిస్తుందని చెప్పారు. బ్రోకర్ల ద్వారానే షేర్లు కొనుగోలు చేయాలని చెప్పిన ఆయన.. వారు ఇచ్చే కాంట్రాక్ట్ నోట్ భద్రపరుచుకోవాలని సూచించారు. చిన్న, కొత్త ముదుపుదారులకు రాజీవ్గాంధీ పథకం ద్వారా లభించే లాభాలు, రాయితీలను వివరించారు. అనంతరం మదుపుదార్ల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కొటక్ మ్యూచువల్ ఫండ్ తెలుగు రాష్ట్రాల హెడ్ విజయకుమార్ తిమ్ములూరు, హెచ్డీఎస్సీ ఏరియా సేల్స్ మేనేజర్ జి.విజయ్కుమార్, ‘సాక్షి’ రాజమహేంద్రవరం యూనిట్ మేనేజర్ శివుడు పాల్గొన్నారు. -
ఒడిసిపడితే లాభం... బెడిసికొడితే నష్టం
ఉమెన్ ఫైనాన్స్ / పుట్ ఆప్షన్స్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ తగ్గించుకోడానికి ‘డెరివేటివ్స్’ ఒక చక్కటి పరిష్కారం. డెరివేటి వ్స్లో రెండు రకాలు ఉంటాయి. ఫ్యూచర్స్, ఆప్షన్స్. డెరివేటివ్స్ గురించి, ఫ్యూచర్స్ గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం. ఆప్షన్స్లోని రెండు రకాలలో ఒకటైన కాల్ ఆప్షన్పై గతవారం అవగాహన కలిగించుకున్నాం. ఈవారం పుట్ ఆప్షన్ అంటే ఏమిటో, దాని లాభనష్టాలేమిటో చూద్దాం. పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్కి సరిగ్గా రివర్స్లో ఉంటుంది. అంటే కాల్ ఆప్షన్ కొన్నవారికి ధర పెరిగితే లాభం. అదే పుట్ ఆప్షన్ కొన్నవారికి ధర తగ్గితే లాభం. అలాగే పుట్ ఆప్షన్ అమ్మినవారు ధర తగ్గితే ఎక్కువ నష్టపోవలసి వస్తుంది. పెరిగితే ప్రీమియం మొత్తం గరిష్ట లాభంగా ఉంటుంది. ఈ పుట్ ఆప్షన్లోని లాభనష్టాలు ఎలా ఉంటాయో కింది పట్టికలో గమనించవచ్చు. ఆప్షన్ అమ్మిన వ్యక్తి అపరిమిత నష్టాన్ని భరించవలసి ఉండడమే కాకుండా, మార్జిన్ మొత్తాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. హెడ్జింగ్ (ముందస్తు రక్షణ ఏర్పాటు) చేసుకునేవారికి ఈ ఆప్షన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ స్పెక్యులేషన్ చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించకుంటే భారీగా నష్టపోవలసి ఉంటుంది. ఆప్షన్స్ అనేవి పదునైన కత్తి లాంటివి. సరైన క్రమపద్ధతిలో, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బెడిసికొడితే చాలా నష్టపోవలసి ఉంటుంది. -
షేర్లలో నష్టాలు.. భార్యపై అనుమానాలు..
- సింథియా హత్యకు దారితీసిన గొడవలు - వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ సాక్షి, హైదరాబాద్ : షేర్ మార్కెట్లో నష్టాలు... భార్య మరొకరితో ఫేస్బుక్లో చాటింగ్తో ఆమెపై అనుమానం... గొడవలకు కారణాలై చివరకు హత్యకు దారితీసింది. కాంగో వాసి సింథియా వెచెల్ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి, తగలబెట్టిన ఆగ్రా వాసి రూపేశ్కుమార్ మోహనాని అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ఆ వివరాలను వెల్లడించారు. శంషాబాద్ ఏసీపీ అనురాధతో కలిసి డీసీపీ సన్ప్రీత్సింగ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు దారితీసిన కారణాలను తెలిపారు. రూపేశ్కుమార్(36) కుటుంబం అతని చిన్నప్పుడే ఆగ్రా నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడింది. 1999లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న రూపేశ్ సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో వెళ్లి ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో సేల్స్మ్యాన్గా పనిచేశాడు. అదే సమయంలో అక్కడి మలిబు క్లబ్ డ్యాన్సర్ సింథియా వెచెల్(30)తో పరిచయం ప్రేమగా మారింది. 2008లో ఆమెను రూపేశ్ అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వారికి కుమార్తె సానియా జన్మించింది. 2012లో భార్య, కుమార్తె, వెచెల్ సోదరుడు డానిస్తో కలిసి హైదరాబాద్ వచ్చిన రూపేశ్ గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్ వ్యూలో అద్దెకు దిగాడు. ఆ రాత్రి ఏం జరిగింది..! షేర్ మార్కెట్లో నష్టాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. ఇదే సమయంలో సింథియా తరచూ ఫేస్బుక్లో ఆమె స్నేహితుడు కిన్యూని కమిటబుతో చాటింగ్ చేస్తుండేది. ఇది గమనించిన రూపేశ్... భార్యను పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నెల 3 అర్ధరాత్రి మూడు గంటల వరకు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కూతురు సానియాను తీసుకుని ఫ్రాన్స్ వెళ్లిపోతానని సింథియా పట్టుబట్టడంతో అందుకు ఒప్పుకోని రూపేశ్ ఒంటరిగా వెళ్లమన్నాడు. దీంతో మాటమాట పెరిగి తోపులాట జరిగింది. సింథియా రూపేశ్ను తోయడంతో గోడకు తగిలి అతని తలకు గాయమైంది. దీంతో కోపోద్రిక్తుడైన రూపేశ్ ఒక్క ఉదుటున సింథియాపై పడి గొంతు నులుమడంతో ఆమె సృ్పహ తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో మరో గదిలో సానియా, డానిస్ ఉన్నారు. సింథియా చనిపోయిందని నిర్థారించుకున్న రూపేశ్... సోమవారం ఉదయం తన గది నుంచి బయటకు వచ్చి తాళం వేశాడు. సానియాను రోజూ మాదిరిగానే రెడీ చేసి కారులో మాదాపూర్లోని స్కూల్లో వదిలి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత డానిస్ నిద్ర లేచి బయటకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో... వణ్యప్రాణులను వేటాడే అలవాటున్న రూపేశ్ గతంలోనే కొనుగోలు చేసిన కత్తి, సుత్తి, గొడ్డలితో భార్య మృతదేహంలో తల, మొండాన్ని వేరు చేశాడు. వాసన రాకుండా స్ప్రే చల్లి, వాటిని పెద్ద సైజు బ్యాగులో వేశాడు. సాయంత్రం 4 గంటలకు పాపను స్కూల్ నుంచి తీసుకొని వచ్చి బ్యాగులో ఉన్న చెత్తను కాల్చివద్దామంటూ ఫోర్డ్ కారులో బయలుదేరాడు. దారిలో పెట్రోల్ కొనుగోలు.. ఇంటి నుంచి బయలుదేరిన రూపేశ్.. దారి మధ్యలో పెట్రోల్ బంక్లో ఎనిమిది లీటర్ల పెట్రోలు కొనుగోలు చేశాడు. రాత్రి 7 గంటల సమయంలో మదన్పల్లి గ్రామ శివారు గ్రీన్ సిటీ వెంచర్లోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. చెత్తను పడేసి వస్తానంటూ కొంత దూరం ముందే కూతుర్ని దింపేసి, భార్య మృతదేహన్ని తీసి పెట్రోలు పోసి తగులబెట్టాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో వర్షం కారణంగా కారు బురదలో ఇరుక్కపోయింది. హెల్ప్ హెల్ప్ అంటూ రూపేశ్ అరవడంతో పక్కనే ఉన్న ఓ ఫాంహౌస్లో నుంచి ఇద్దరు కూలీలు వచ్చి కారును బయటకు లాగారు. ఈ లోగా అట్నుంచి బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులు చీకట్లో దూరంగా మంటలు కనిపించడంతో అక్కడకు వెళ్లారు. మృతదేహం కాలుతుండటం చూసి... రూపేశ్పై అనుమానంతో దేహశుద్ధి చేశారు. శంషాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో హత్య విషయం వెలుగు చూసింది. -
భవిష్యనిధికి భద్రతేది..?
► షేర్ మార్కెట్లో కార్మికుల సీఎంపీఎఫ్ సొమ్ము ► లాభాలొస్తే సరి.. లేకుంటే హరి ► స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం ► బొగ్గు బిడ్డల పీఎఫ్ చెల్లింపులకు గడ్డుకాలమే రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : గని కార్మికులకు రాబోవు కాలంలో పెన్షన్ చెల్లిం పులు కష్టతరంగా మారనున్నాయి. కార్మికులు జీవితకాంలో కష్టపడి సంపాదించిన వేతనం నుంచి దాచుకు న్న పెన్షన్ డబ్బును కేంద్రం ప్రభుత్వం స్పెషల్ ఆర్డినె న్స్ తీసుకువచ్చి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టింది. లాభాలొస్తే సరేసరి.. లేదంటే పీఎఫ్ సొమ్ముకు గ్యారెంటీ ఎవరనేది స్పష్టత లేదు. దీంతో కార్మిక వర్గం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి(ఎస్సీసీఎల్)తో పాటు వివిధ రాష్ట్రాల్లోని సీసీఎల్, ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్, మహానది కోల్ఫీల్డ్స్, నార్త్ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్, సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ఫీల్డ్స్ కంపెనీలు బొగ్గు ఉత్పత్తి రంగంలో ఉన్నారుు. ఇవన్నీ కోలిండియూ సబ్సిడరీ కంపెనీలుగా కొనసాగుతున్నారుు. గతంలో ఆయా కంపెనీల్లో పనిచేసే వారికి ఉద్యోగ విరమణ చేసిన అనంతరం పెన్షన్ పథకం వర్తింపజేయడానికి ఆయూ కంపెనీలు పీఎఫ్ రికవరీ విధానాన్ని అమలు చేస్తున్నా యి. ఒకప్పుడు 7.5 లక్షల మంది కార్మికులు ఉండగా ఇప్పటి వరకు 3.5 లక్షల మంది తగ్గిపోయూరు. ఇందులో కొందరు ఉద్యోగ విరమణ చేయగా మరి కొందరు వీఆర్ఎస్ పొందారు. ఇంకొందరు గోల్డెన్ హ్యాండ్షేక్ పథకం కింద దిగిపోయూరు. ప్రస్తుతం ఆయూ కంపెనీల్లో 4 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. సింగరేణిలో 54వేల మంది ఉన్నారు. పెన్షన్ ట్రస్ట్ బోర్డులో రూ.70వేల కోట్లు కోలిండియాలోని గని కార్మికులకు పెన్షన్ చెల్లించేం దు కు ఏర్పాటు చేసిన భవిష్య నిధి(పెన్షన్ ట్రస్ట్ బోర్డు) రూ.50వేల కోట్ల వరకు ఉంది. వీటితోపాటు ఇప్పటికే చనిపోయిన, పెన్షన్ అమలు కాని కార్మికులకు చెందిన మరో రూ.20వేల కోట్లు ఉన్నాయి. దీనిని కార్మికుల వేతనాల నుంచి ఆయా బొగ్గు కంపెనీలు రికవరీ(పెన్ష న్ కోసం) చేశాయి. ఈ నిధులపై వివిధ సంస్థలు కన్నేశారుు. ప్రపంచబ్యాంకు సైతం తమ బ్యాంకులో పెట్టాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) సైతం విశ్వయత్నం చేసినా ప్రయత్నాలు ఫలించ లేదు. అరుుతే ప్రస్తు తం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బొగ్గుగని కార్మికుల పెన్షన్ నిధులను షేర్ మార్కెట్లోకి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లింపులపై ఆందోళన.. బొగ్గు కంపెనీల్లో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఏడున్నర లక్షల నుంచి ప్రస్తుతం 4 లక్షలకు పడిపోయింది. సాధారణంగా బొగ్గు సంస్థల్లో కొత్త నియామకాలు చేపడితే ఎలాంటి గడ్డుపస్థితులు ఉండవు. కార్మికుల సంఖ్య నిలకడగా ఉన్నప్పుడే వారందరి వేతనాల్లోంచి పీఎఫ్ కోత విధించి దాన్ని ట్రస్టుకు మళ్లించడం రివాజు. అరుుతే కంపెనీల్లో కొత్త నియామకాలకు కాలం చెల్లిపోయింది. కార్మికుల సంఖ్య పడిపోరుు రికవరీ నిధి తగ్గిపోతోంది. సర్కారు తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఉద్యోగ విరమణ పొందిన, పొందుతున్న వారికి పెన్షన్ చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్మికుల సొమ్ముతో వ్యాపారం సరికాదు సీఎంపీఎఫ్ అనేది కార్మికుల సంక్షేమ నిధి. రిటైర్మెంట్ తర్వాత కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సింది. అటువంటి సొమ్మును షేర్మార్కెట్లో పెట్టడం సరికాదు. షేర్ మార్కెట్ అంటేనే జూదం లాంటిది. ఒకసారి డబ్బులు రావొచ్చు, పోవొచ్చు. కార్మికుల పెన్షన్ సొ మ్ము తో కేంద్రం వ్యాపారం చేయటం సరికాదు. దీనిని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాం. - వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి -
స్టాక్ మార్కెట్లో... రిస్క్తో పాటు అధిక రాబడులు
సాక్షి, హన్మకొండ: స్టాక్ మార్కెట్లో రిస్క్తో పాటు రాబడులు అధికంగా ఉంటాయని, అం దువల్ల అధిక రాబడుల కోసం షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) రీజనల్ మేనేజర్ వెనిశెట్టి శివప్రసాద్ అన్నారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, సీడీఎస్ఎల్ సహకారంతో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ స్టాక్మార్కెట్లో పెట్టుబడుల్లో రిస్క్ ఉందని, ప్రతీ వ్యక్తి తన వయసు ఆధారంగా రిస్క్ తీసుకోవాలని సూచించారు. తక్కువ వయసున్న వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చన్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే నిత్యం మార్కెట్ పోకడలను గమనిస్తూ ఉండాలని హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్స్, విజయవాడ బ్రాంచ్మేనేజర్ పద్మనాభముని అన్నారు. అదేవిధంగా షేర్ల క్రయవిక్రయాల్లో సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం కీలకమన్నారు. కంపెనీ వ్యాపారం, నిర్వహణ సామర్థ్యం, మార్కెట్ వ్యాల్యూ ( బిజినెస్, మేనేజ్మెంట్) వంటి చెక్పాయింట్ల ఆధారంగా షేర్లను కొనుగోలు చేయాలని హెచ్డీఎఫ్సీ సౌత్ రీజనల్ హెడ్, డీవీ సునీల్రెడ్డి సూచించారు. సదస్సులో స్టాక్ మార్కెట్కు సంబంధించి డీ మ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర అంశాల గురించి ఔత్సాహిక మదుపరులకు నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. సదస్సుకు వచ్చిన మదుపుదారులు పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. -
250 మందిని... రూ. 33 కోట్లకు ముంచేశారు
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 250 మందిని రూ. 33 కోట్ల మేర ముంచేసిన జంటను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. సంజీవరావు, బృంద అనే ఇద్దరు దంపతులు ఈరోడ్ ప్రాంతంలో 2012 సంవత్సరంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించారు. దాదాపు 250 మందికి పైగా వీళ్ల సంస్థలో దాదాపు రూ. 33 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే, తర్వాత వాళ్లు ఓ మంచి రోజు చూసుకుని అక్కడి నుంచి జెండా ఎత్తేశారు. దాంతో తమ సొమ్ము ఏమైపోయిందోనని పెట్టుబడులు పెట్టినవాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆ జంటను పోలీసులు అరెస్టు చేయడంతో ఏమైనా వెనక్కి వస్తాయేమోనని ఎదురు చూస్తున్నారు. -
అప్పు తెచ్చి.. ఐపీ పెట్టి!
పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చిన్న చిన్న వ్యాపారులే దివాళ తీసి ఐపీ పెట్టి ఊరు విడిచి వెళ్లారు. ఈమధ్యకాలంలో వరుసగా పెద్ద పెద్ద వ్యాపారులు ఐపీ పెట్టి పారిపోతున్నారు. తమకున్న పలుకుబడి మాట, మంచితనం వీటన్నిటిని ఆసరా చేసుకుని చుట్టాలు, బంధువులు, స్నేహితుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులుతీసుకున్న వారు ఊరువిడిచి ఊడాయిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో నలుగురు ప్రముఖులు చేతిలెత్తిన సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. కాసులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సదాల లక్ష్మయ్య సౌమ్యుడు కావ డంతో ఇరుగుపొరుగు వారు రూ.2 కోట్ల వరకు అప్పులిచ్చారు. ఆయన చేసిన క్రషర్దందాలో నష్టం రావడంతో ఊరు విడిచి వెళ్లిపోయారు. జాడ కనుక్కోవడానికి బంధువులు వెతుకులాట ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన డ్రాయర్ బనియన్ల హోల్సెల్ షాప్ యజమాని రూ.3 కోట్లకుపైగా అప్పులు చేసి భార్యాపిల్లలతో వెళ్లిపోయూరు. ఆయన అప్పు తీసుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కొడుకు కో డలు నలుగురివద్ద ఒక్కోరి నుంచి రూ.10 లక్షల చొప్పున అప్పులు తీసుకున్నారు. మరో వడ్డీ వ్యాపారిని మధ్యవర్తిగా పెట్టి రూ.2 కు వడ్డికి తెచ్చి రూ.3 చొప్పున మధ్యవర్తిద్వారా తీసుకుని మరీ ఉడారుుంచారు. బ్యాంకులో వేస్తే వడ్డి రూపాయలు చిల్లరకు కూడా కావని తాను రూ.2 నుంచి రూ.3 వరకు ఆశచూపడంతో ఎగబడి అప్పులిచ్చారు. ఇక పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు రూ.10 కోట్ల వరకు అప్పులు పుట్టించి పొరుగు రాష్ట్రాల్లో రియల్వ్యాపారంలో న ష్టపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన అసలుకు వడ్డీ అవసరం లేదు. కనీసం అసలైనా ఇప్పించడండి అంటూ బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పు తీసుకున్న సదరు వైద్యుడు మాత్రం అసలులో ఎంత తగ్గిస్తారంటూ బేరం ఆడుతున్నట్లు సమాచారం. కాల్వశ్రీరాంపూర్కు చెందిన మరో వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పు చేశాడు. ఆయన ఆస్తులు మొత్తం రూ.2 కోట్లే ఉండడంతో కనీసం సగంతో సరిపుచ్చుకుందామంటూ బేరసారాలు నడుపుతున్నారు. కొంప ముంచుతున్న షేర్ మార్కెట్... దివాలతీసిన వారిలో షేర్ మార్కెట్లో లక్షలాది రూపాయలు వెచ్చించి నష్టాల బారిన పడడంతో వాటిని పూడ్చుకునేందుకు మరిన్ని అప్పులుచేసి షేర్ మార్కెట్లోపెట్టి నష్టపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నష్టపోయిన నలుగురిలో ఇద్దరు షేర్ మార్కెట్ దందాలో చేతులుకాల్చుకున్న వారే కావడం విశేషం. చిన్న వ్యాపారులకు వడ్డీలకు ఇస్తే ముంచుతారని పెద్దవ్యాపారులను నమ్మితే అసలుకే సగంవచ్చే దిక్కులేకుండా పోయింది. -
షేర్ ద సిటీ కల్చర్!
షేర్ అంటే పులి అన్న సంగతి అందరికీ తెలిసిందే. షేర్ అనే పదం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనకు బాగా ఇష్టమైన వారి ముందు ఆ పదం చేర్చితే... షేర్ ఎంత మాత్రమూ బాధపడదు. పైగా తనను పులి అని సంబోధించినందుకు మనం పిలిచినవాడూ సంతోషపడతాడు. హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రతి వర్ధమాన నాయకుడి పేరు మొదటా ఆ బిరుదు ఉంటుంది. ఇందుకు నగరంలో ఏర్పాటయ్యే ఫ్లెక్సీలే సాక్షి. ఇక షేర్ అనే మాటకు నానార్థాలూ ఉన్నాయి. అవన్నీ మన నగరంలో ఉన్నాయి... ఉంటాయి. ముషాయిరాల్లో చదివే కవిత్వాన్ని షాయరీ అంటారన్న విషయం తెలిసిందే. పోయెట్రీ మొత్తాన్ని కలిపి షాయరీ అంటారేమోగానీ... పోయమ్ను మటుకు షేర్ అనే అంటారు. అలాంటి షేర్... షాయరీలకు ఎప్పట్నుంచో నిలయం మన హైదరాబాద్. ‘షేర్’ అర్జ్ కరూ’ అంటూ... పులిని వదుల్తా వదుల్తా అని బెదిరిస్తుంటాడు కవి. దాంతో వహ్వా వహ్వా అంటూ చుట్టూ ఉన్న రసజ్ఞులు వహ్వాకారాలు చేస్తారు. ఇక మరో రకం షేర్ల విషయానికి వస్తే... ఇవి పెట్టుబడులు. ఇటీవలే కొంతకాలం క్రితం ఫలానా కంపెనీ షేర్లు కొనూ, ఫలానావి అమ్ము అనే మాటలు విస్తృతంగా వినపడేవి. కానీ ఆ షేర్లలో చాలామటుకు పేపర్ టైగర్స్ అని మాత్రమే తెలిశాక... ఇటీవల ఈ మాటల విస్తృతి ఒకింత తగ్గింది. కానీ ఈ తరహా షేర్ల గౌరవార్థం మన నగరంలోనూ హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరిట షేర్ మార్కెట్ ఒకటుంది. అలా నగరం ఈ తరహా ‘షేర్’లనూ గౌరవించింది. ఇక ‘షేర్’వానీ అనే మాటకు వద్దాం. నవాబీ దుస్తుల తరీఖాలో ధరించే ఈ వస్త్ర విశేషం హైదరాబాద్కు ప్రత్యేకం. ఇప్పట్లో ఫార్మల్ మీటింగ్స్కు సూట్లు వేసుకున్నట్లే... అప్పట్లో నవాబు దర్జాలూ, పెద్ద పెద్ద ఉద్యోగ హోదాలూ, తాము పెద్దమనుషులమనే సందేశాలూ చాటుకోడానికి ‘షేర్’వానీనే ఉపయోగించేవారు. క్రమంగా అవి పెళ్లిళ్లకు మాత్రమే వాడే సంప్రదాయ దుస్తులైపోయాయి. వీటన్నింటినీ గమనించినకొద్దీ షేర్వానీ అంటే... ‘పులి దుస్తులు’ లేదా ‘పులి ధరించే దుస్తులు’ అనే అర్థం ఏదైనా ఉందేమోనని నా సందేహం. భాషావేత్తలు ఈ దిశగా కృషి చేస్తే నా మాటలోనూ నిజముందని నిగ్గుదేలే అవకాశముందని నా పూర్తి నమ్మకం. అలాగే... బిర్యానీతో పాటూ కలుపుకోడానికి వాడే పులుసులాంటి వంటకం ‘షేర్’వా. అంటే ఏమిటన్నమాట... తమ ఒక తరహా పులుసు కూరకూ పులి పేరు పెట్టుకోడానికే మన హైదరాబాదీలు ఇష్టపడ్డారన్నమాట. అందుకే షేర్వానీ ధరించి, బిర్యానీ తింటూ ‘షేర్వా’ కలుపుకుని మన నోట్లోని జీబ్ను సంతృప్తిపరచడం హైదరాబాదీ తెహ‘జీబ్’... అనగా ఫుడ్కల్చర్ అయింది. ఇప్పటి వాళ్లకు పెద్దగా ఆ పేరు తెలియదు గానీ... మన ఓల్డ్ సిటీలో ఒక ఏరియా మొత్తానికి కలిపి పులి పేరు పెట్టారు. అంతేనా... రేపెవరైనా ఆ ఏరియా పేరు మారుస్తారేమో అనే భయంతో అక్కడ మట్టితో చేసిన పులి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అందుకే ఆ ఏరియాను అందరూ ‘మిట్టీ కా షేర్’ అనగా... మట్టితో చేసిన పులి అని నామకరణం చేశారు. పులీ పులీ అంటూ మనవాళ్లు నగర మహిళల గౌరవాన్ని తగ్గించిందేమీ లేదు. ఎందుకంటే మిట్టీ కా షేర్ ప్రాంతంలో ఎక్కువగా తయారయ్యేది నగర ‘షేర్నీ’లకు చాలా ఇష్టమైనవీ, కళ్లు మిరిమిట్లుగొలిపేలా మెరుస్తూ ఉండేవైన గాజులే! ఇవన్నీ తెలిశాక నగరవాసి చెప్పే మాట ఒక్కటే. ‘మామూలుగా పులి అంటే అడవిలో ఉండే పులి. కానీ హైదరాబాద్ అంటే మాత్రం నగరాలకే పులి’!! -
భారీగా పడిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్
ముంబై:ఎదురులేకుండా సాగుతున్న షేర్ మార్కెట్ కు బ్రేక్ పడింది. పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంగళవారం షేర్ మార్కెట్ భారీ పతనాన్ని చవిచూసింది. దేశీయ షేర్ మార్కెట్ లో సెన్సెక్స్ 518 పాయింట్లుకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం 26, 190 పాయింట్ల తాకిన సెన్సెక్స్ నేడు అత్యల్పంగా పడిపోయి 25,582 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం కొద్దిలో కొద్ది మెరుగనిపించింది. 164 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 7,623 పాయింట్ల వద్ద ముగిసింది. ఇలా దేశీయ షేర్ మార్కెట్ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిపోవడం 2013 సెప్టెంబరు తరువాత ఇదే తొలిసారి. మంగళవారం రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. రైల్వే బడ్జెట్ మార్కెట్లకు ఏమీ ప్రతికూలంగా లేదని వారు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక దృక్పథం నుంచి చూస్తే రైలు బడ్జెట్ ఫర్వాలేదు కానీ,స్టాక్ మార్కెట్ కు ఒరిగిందేమీ లేదని అంటున్నారు. సాధారణ బడ్జెట్ రోజు మార్కెట్ భారీ పతనాన్ని దిగజారడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
గూగుల్ మై బుల్బుల్
గూగుల్... గురువులకే గురువులాంటిది.. నూడుల్స్ నుంచి న్యూక్లియర్ రియాక్టర్ వరకు... షేర్మార్కెట్ నుంచి శేర్లింగంపల్లి అడ్రస్ వరకు ... దేని గురించి తెలుసుకోవాలన్నా... మన మునివేళ్లు గూగుల్నే టైప్ చేస్తాయి.. గూగుల్ లేని కంప్యూటర్.. దేవుడి లేని గుడిలాంటిదంటే అతిశయోక్తి కాదేమో.. అందుకే ఆ గూగులమ్మకు పాటతో పట్టాభిషేకం చేశారు నెటిజన్లు... ఇంగ్లిష్ పదాలను శాస్త్రీయ సంగీతంలో కూర్చి... టెడ్డీబేర్తో గాత్రదానం చేయించారు.. గూగుల్పై తమకున్న గురుభక్తిని ఆన్లైన్ సాక్షిగా చాటిచెప్పారు. ఆ పాట వింటే మీ పొట్టచెక్కలవ్వాల్సిందే.. మనసు పులకించాల్సిందే.. చివరికి అవును నిజమే కదూ అంటూ తలూపాల్సిందే... ఆన్లైన్లో ఫన్నీ వీడియోతో అదరగొట్టే ఫన్జోవా.కామ్ దీన్ని క్రియేట్ చేసింది. మీరూ ఈ గూగుల్ సాంగ్ చూడాలంటే ఫన్జోవా.కామ్లో లేదా యూట్యూబ్లో ‘గూగుల్ మై బుల్బుల్’ అని టైప్ చేసి చూడొచ్చు. కడుపుబ్బా నవ్వించే ఆ పాట లిరిక్స్ ఇలా ఉంటాయి.. గూగుల్ గూగుల్... మై బుల్బుల్..బుల్ బుల్ ఇటీస్ సో యూస్ఫుల్... వేరీ కూల్.. వెన్ ఐ హావ్ క్వశ్చన్... ఐ సెర్చ్ ఇన్ ద హోమ్ పేజ్ ఇట్ విల్ ఆన్సర్, వేరీ రియల్ -ప్రవీణ్కుమార్ కాసం -
కొందామా.. ఆగుదామా!
నరసాపురం అర్బన్, న్యూస్లైన్: జిల్లా మార్కెట్లో బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోయూయి. పుత్తడి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో అంతర్జాతీయ పరిస్థితులు, షేర్ మార్కెట్ గమనాలు విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో అమ్మకం, కొనుగోలుదారుల్లో అయోమయం నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పతనం కావడమే దీనికి కారణమైంది. రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గుతాయని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, గత అనుభవాలను బట్టిచూస్తే బంగారం ధరలు తగ్గినా.. తిరిగి పుంజుకున్న పరిస్థితులే అధికంగా ఉన్నాయి. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని మా ర్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో కొత్తగా బంగారం కొనాలనుకునే వారు రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయన్న ఉద్దేశంతో జ్యూయలరీ షాపుల మెట్లెక్కడం లేదు. జిల్లాలో పుత్తడికి ప్రధాన మార్కెట్ అరుున నరసాపురంలో అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో సాగటం లేదు. ప్రస్తుత పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావటంతో సాధారణ రోజుల్లో సాగే అమ్మకాలతో పోలిస్తే నాలుగైదు రెట్లు అధికంగా ఉండాలి. కానీ.. 20 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయని బులియన్ వ్యాపారి అజిత్కుమార్జైన్ ‘న్యూస్లైన్’కు చెప్పారు. మూడేళ్ల కనిష్టానికి... ప్రస్తుతం బంగారం ధరలు మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. బుధవారం నరసాపురం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.27,900 పలికింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.25,950కు ట్రేడ్ అయింది. వారం రోజులుగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఇటీవల కాలంలో ధరలు ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. 2012 చివరిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32 వేలకు పైగా చేరుకుని రికార్డు సృష్టించింది. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.35 వేల మార్కును చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే ధరలు తగ్గుతూ వచ్చాయి. ఏడాది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల అనూహ్యంగా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, దేశీయంగా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం వంటి పరిస్థితులే ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.25 వేల దిగువకు వస్తుందని అంచనా కడుతున్నారు. భారీగా నష్టాలు మూడేళ్ల నుంచి బంగారంపై మదుపుచేసే వ్యక్తులు ధరల తగ్గడంతో భారీగా నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. షేర్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో బంగారంపై పెట్టుబడిని సురక్షితమైన మార్గంగా మదుపరులు భావించారు. పుత్తడిపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం అవసరానికి ఆదుకుం టుందనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలోనే కాసు బంగారం (8గ్రాములు) ధర రూ.2,500 వరకు తగ్గింది. దీంతో వారు భారీగా నష్టపోయినట్లైంది. ఇదిలావుంటే బంగారంపై అప్పులు ఇచ్చిన బ్యాంకులు, సంస్థలు కూడా ఆందోళనలో ఉన్నా యి. గ్రాముపై రూ.2 వేల వరకు ఆయూ సంస్థలు అప్పులు ఇచ్చాయి. జాతీయ బ్యాంకులు మాత్రం గ్రాముకు రూ.1,700 వరకు ఇచ్చాయి. ప్రైవేట్ వ్యాపారులు, కార్పొరేట్ బ్యాంకులు అధిక వడ్డీపై రూ.2,200 వరకూ అప్పులిచ్చారుు. ప్రస్తుతం ఆభరణాల బంగారు గ్రాము ధర రూ.2,580గా ఉంది. దీంతో అప్పుల వసూళ్లపై ఆయా బ్యాంకులు, సంస్థలు దృష్టిపెట్టాయి. ఖాతాదారులకు డిమాండ్ నోటీసులు పంపిస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. -
ఒంటిపై కిరోసిన్ పోసుకున్న లతీఫ్
-
పెరుగుతున్న మార్కెట్ షేర్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్లైన్: స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒకరోజు తారాజువ్వలా దూసుకుపోతే.. మరో రోజు పాతాళానికి దిగజారిపోతున్నాయి. ఇటువంటి ఒడుదొడుకుల పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడం చిన్న విషయం కాదు. కానీ ఆర్థికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఇలా పెట్టుబడులు పెరుగుతున్నాయంటే విశేషమే. గత కొన్నేళ్లుగా ఏటా సగటున రూ.200 కోట్ల లావాదేవీలు జిల్లాలో జరుగుతున్నాయి. రోజూ వేల కోట్ల టర్నోవర్ సాధించే స్టాక్ మార్కెట్లో ఇది చాలా చిన్న మొత్తమే కావచ్చు కానీ.. శ్రీకాకుళం లాంటి జిల్లా నుంచి ఈ మాత్రం లావాదేవీలు జరగడం కచ్చితంగా చిన్న విషయం మాత్రం కాదు. అంతేకాకుండా గతంలో ఇంజినీరు, డాక్టర్లు వంటి వృత్తి నిపుణులకే పరిమితమైన షేర్ వ్యాపారంలో ఇప్పుడు దాదాపు అన్ని రంగాల వారు.. చివరికి గృహిణులు సైతం పెట్టుబడులు పెడుతున్నట్లు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులు జిల్లాలో షేర్ మార్కెట్ విస్తరణపై జరిపిన సర్వేలో వెల్లడైంది. మరికొన్ని విశేషాలు చూస్తే.. గత మూడేళ్లుగా స్టాక్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో పెట్టుబడు లు పెట్టడానికి మదుపరులు ముందుకురారు. కానీ ఈ కాలంలోనే జిల్లా నుంచి పెట్టుబడులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో ఏటా సుమారు రూ.200 కోట్ల వరకు షేర్ మార్కెట్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం వాటా రూ.60 కోట్లు. షేర్ వ్యాపారం చేస్తున్న వారిని రంగాలవారీగా పరిశీలిస్తే.. ఉపాధ్యాయులు మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో వరుసగా బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, గృహిణులు, ఇతరులు ఉన్నారు. ఇంతకుముందు వరకు వృత్తి నిపుణులకే పరిమితమైన ఈ వ్యాపారంలో వారిని బాగా వెనక్కి నెట్టి ఉపాధ్యాయులు ముందు స్థానంలోకి రాగా.. గృహిణులు కూడా ఈ రంగంలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించడం ఆసక్తికరమైన విషయం. జిల్లాలో 12 స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. జేఆర్జీ సెక్యూరిటీస్, రెలిగేర్, స్టీల్ సిటీ, కార్వీ, బొనంజా పోర్టుఫోలియోస్, ఏంజెల్ బ్రోకింగ్, నార్త్ ఈస్ట్ బ్రోకరేజ్ సర్వీసెస్ తదితర సంస్థలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల అనుమతితో సేవలందిస్తున్నాయి. లావాదేవీలు చట్టబద్దంగా జరగడం, అధిక శాతం ఆన్లైన్ వ్యాపారం కావడం, పెట్టుబడులకు సెబీ(సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ ఆఫ్ ఇండియా) వంటి ప్రభుత్వ సంస్థల భద్రత ఉండటం, అవగాహన పెరగడం, ఎక్కడి నుంచైనా నెట్ సౌకర్యంతో ఈ లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం ఉండటం వంటి కారణాలు షేర్ మార్కెట్ విస్తరించడానికి దోహదం చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అప్రమత్తత అవసరం ఎంత చట్టబద్దత ఉన్నప్పటికీ ఏమరుపాటు వహిస్తే మోసపోయే ప్రమాదం కూడా ఉందని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వ్యాపారంలో ఎటువంటి అవగాహన లేకుండా స్టాక్ బ్రోకింగ్ సంస్థల మీద ఆధారపడి పెట్టుబడులు పెడితే మునిగిపోయే ప్రమాదం ఉంది. కంపెనీల పనితీరును పట్టించుకోకుండా పెట్టుబడులు పెడితే నష్టపోవడం తప్ప ఫలితం ఉండదు. పైగా లావాదేవీలన్నింటికీ పనుల రూపంలో అదనపు భారం పడుతుంది. అత్యంత రిస్క్తో కూడిన ఇంట్రాడే ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా కంపెనీల ఆర్థిక ఫలితాలు, పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలే ఆర్జించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. నిరంతరం స్టాక్ మార్కెట్ కదలికలను అధ్యయనం చేయడం, చెక్కుల రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా మోసాలు, నష్టాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు. అలాగే మార్కెట్ తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుంటుంది. పతన దశలో ఉన్నప్పుడు కంగారు పడి షేర్లను అమ్మేసుకోకుండా ధైర్యం, సహనంతో ఎదురు చూసి, మళ్లీ మర్కెట్ పుంజుకున్నప్పుడు విక్రయిస్తే లాభాలు వస్తాయని సూచించారు. అవగాహన తప్పనిసరి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఈ రం గంపై అవగాహన తప్పనిసరి. రోజూ వార్తా పత్రికల్లో వస్తున్న బిజినెస్ వార్తలు పరిశీలించాలి. వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిస్థితులపైనే సెన్సెక్స్ గమనంఆధారపడి ఉంటుంది.అందువల్ల ఆయా రంగాలను నిత్యం పరిశీలనలోకి తీసుకోవాలి. -ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ఎకనమిక్స్ విభాగాధిపతి పెట్టుబడి పెట్టవచ్చు ఇది జూదం కాదు. అందువల్ల స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుతం జిల్లాలో గృహిణులు సైతం ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. వందల నుంచి లక్షల్లో ఆర్థిక స్తోమత బట్టి బెట్టుబడులు పెట్టవచ్చు. -డాక్టర్ ఎన్.సంతోష్ రంగనాథ్, బోధకులు మోసాలు తగ్గాయి స్టాక్ బ్రోకింగ్ సంస్థల మోసాలు ఇటీవలి కాలంలో బాగా తగ్గాయి. ఏదైనా సంస్థ మోసానికి పాల్పడితే.. ఆ విషయం సెబీకి పిర్యాదధు చేయవచ్చు. అటువంటి సంస్థల లెసైన్సును సెబీ రద్దు చేస్తుంది. ప్రస్తుతం ఇది చట్టబద్ధ వ్యాపారం. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. స్టాక్ మార్కెట్ నిలకడగా లేకున్నా జిల్లాలో పెట్టుబడులు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. -ప్రొఫెసర్ గుంట తులసీరావు, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హెడ్ -
చౌకలో షేర్లను కనుక్కొనేదెలా?
ప్రపంచవ్యాప్తంగా షేర్లను ఎంపిక చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు అనేక విధానాలు అందుబాటులో ఉన్నా రెండు విధానాలనే ఎక్కువగా అవలంబిస్తుంటారు. వీటిని గ్రోత్ ఇన్వెస్ట్మెంట్, వేల్యూ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారు. ఈ రెండు విధానాల్లో షేర్ల ఎంపిక అనేది పీఈ నిష్పత్తి ఆధారంగానే జరుగుతుంది. కాని ఈ రెండు పూర్తి విభిన్నమైనవి. గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో పీఈ రేషియో ఎక్కువ ఉన్న షేర్లను ఎంచుకుంటే, వేల్యూ ఇన్వెస్ట్మెంట్లో తక్కువ పీఈ నిష్పత్తి ఉన్న షేర్లను ఎంపిక చేసుకుంటారు. వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే.. ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉండి కూడా మార్కెట్లోని పరిస్థితుల దృష్ట్యా తక్కువ రేటు వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే వాస్తవ విలువ కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతూ భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఈ విధానంలో ముఖ్యంగా ఆయా కంపెనీల ఫండమెంటల్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో వ్యాపార పరంగా వృద్ధికి అవకాశం ఉన్నా వివిధ పుకార్లు, లేదా మార్కెట్ సెంటిమెంట్ వంటి వాటి వల్ల షేర్లు బాగా పతనమవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాటిని గుర్తించి ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటారు. కంపెనీల సగటు పీఈ నిష్పత్తి కంటే ఎంత తక్కువగా ఉంటే అంత చౌకగా ఈ షేర్లు లభిస్తున్నట్లు. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే.. రూ.100 వస్తువు రూ.70కే లభిస్తుంటే దాన్ని కొనడం అనేది తెలివైన నిర్ణయమేనా... కాదా? తెలియడం లేదా?... కంపెనీ ఫండమెంటల్స్, పీఈ రేషియో అనేవి సాధారణ ఇన్వెస్టర్లు అందరికీ అర్థం కావు. ఇవి తెలుసుకోవాలంటే రోజువారీ స్టాక్ మార్కెట్ కదలికలపై పట్టు ఉండాలి. వీటిపై అవగాహన లేని వారి కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టాయి. ఇవి తక్కువ పీఈలో ఉన్న షేర్లను కొనుగోలు చేసి అవి అధిక ధరకు చేరిన తర్వాత విక్రయించడం జరుగుతుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్తో పాటు ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాయి. -
అప్పులంటే ఆమడదూరం..!
న్యూఢిల్లీ: బ్యాంక్ రుణాలను తీసుకునేందుకు వెనుకాడుతున్న ప్రజల సంఖ్య భారత్లో పెరుగుతోంది. ఆర్థిక మందగమనం, ఈ నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో నెలకొంటున్న అనిశ్చిత పరిస్థితులే దీనికి కారణం. అసోచామ్ సర్వే ఒకటి ఈ విషయాన్ని పేర్కొంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రత్యేకించి ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు లేదా బాండ్లను తనఖాగా ఉంచి వాటిపై రుణాలను తీసుకోవడం గణనీయంగా తగ్గిపోయినట్లు సర్వే పేర్కొంది. బ్యాంకింగ్ డేటా ప్రకారం- ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాలు తీసుకునే వినియోగదారుల రేటు 2012 ఆగస్టు-2013 ఆగస్టు మధ్య 20 శాతం వృద్ధి చెందింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఈ రేటు 1.6% క్షీణించింది. క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లోనూ...: క్రెడిట్ కార్డ్ల విషయంలోనూ రుణాలు తీసుకోవడానికి వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. చెల్లించాల్సిన మొత్తాలపై అధిక వడ్డీరేట్ల భయాలే ఇందుకు కారణం. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు సైతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ- చెల్లింపులను సకాలంలో చెల్లించేస్తూ, జరిమానాలకు గురికాకుండా చూసుకుంటున్నారు. షేర్లు, బాండ్లను తనఖాగా ఉంచి రుణాలను తీసుకునే వ్యక్తులు లేదా సంస్థల విషయానికి వస్తే- ఈ రేటు కూడా గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలంలో ఇందుకు సంబంధించి వృద్ధి రేటు 8.8% కాగా ఈ ఆర్థిక సంవత్సరం అసలు వృద్ధిలేకపోగా -6.6%(క్షీణత)లోకి జారిపోయినట్లు సర్వే వెల్లడించింది. దీనికి రుణ గ్రహీతలు అనుసరిస్తున్న జాగరూకత ధోరణి ఒక కారణం కాగా, షేర్ మార్కెట్లో ప్రస్తుత తీవ్ర ఒడిదుడుకుల ధోరణి పట్ల బ్యాంకులు పాటిస్తున్న జాగ్రత్తలు సైతం మరో కారణం.