Share Market
-
ఇన్వెస్టర్లు ఇంతింతై.. నేడు 11 కోట్ల మంది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.ఎన్ఎస్ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.మార్కెట్లో 20 శాతం కుటుంబాలు 2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.యువ ఇన్వెస్టర్లుమార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. -
ఆప్షన్స్ ట్రేడింగ్లో సక్సెస్ కావాలంటే....
ఆప్షన్స్ ట్రేడింగ్ (options trading)లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడానికి ఎంత అవకాశం ఉందో... ఉన్న డబ్బులు ఊడ్చిపెట్టుకుని పోవడానికీ అంతే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎట్ ది మనీ (ఏటీఎం), ఇన్ ది మనీ (ఐటీఎం), అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం) లది ప్రధాన పాత్ర అని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం. అలాగే ఏటీఎం కాల్స్, పుట్స్ ఎలాంటి ప్రయోజనం కలగజేస్తాయో కూడా చర్చించుకున్నాం.ఇప్పుడు ఐటీఎం, ఓటీఎం ల గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో స్మార్ట్ ట్రేడర్లు అనుసరించే పద్ధతి ఐటీఎం. మళ్ళీ ఎస్బీఐ షేరు నే ఉదాహరణగా తీసుకుందాం.ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 దగ్గర ఉంది. స్ట్రైక్ ప్రైస్ 10 రూపాయల తేడాలో 730, 740, 750... ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇపుడు 730 రూపాయల కాల్ తీసుకుంటే.. అది ఐటీఎం కాల్ అవుతుంది. అంటే అండర్ లయింగ్ అసెట్ (ఈక్విటీ షేరు ధర) కంటే షేరు ధర తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఐటీఎం కాల్ గా వ్యవహరిస్తారు. ఇంకా తక్కువ ధరలు ఉండే 720, 710, 700 రూపాయల కాల్స్ కొనుగోలు చేస్తే అవి డీప్ ఐటీఎం కాల్స్ అవుతాయి. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. ధరల్లో ఊగిసలాటలు కూడా ఎక్కువే ఉంటాయి. అంటే పెరగడం ఎంత వేగంగా పెరుగుతాయో పడటమూ అంతే వేగంగా ఉంటాయి. కాబట్టి సగటు ట్రేడరు కొంచెం ఎక్కువ రిస్క్ భరించాల్సి ఉంటుంది.ఇప్పుడు ఎస్బీఐ షేరు ధరను దృష్టిలో పెట్టుకుని 730 రూపాయల కాల్ సెలెక్ట్ చేసుకుందాం. దీని ధర ప్రస్తుతం రూ. 28 వద్ద ఉంది. షేరు పెరుగుతున్న కొద్దీ ఇది పెరిగే వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే షేరు 730 దిగువకు రానంత సేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ కాల్ ధర తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ జోరు తగ్గుతుంది. అదెలాగంటే... షేరు ధర 730 నుంచి 780 కి వెళ్ళేటప్పటికి మీరు కొన్న కాల్ 28 రూపాయల నుంచి 70 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షేరు ధర 750 కి పడినప్పుడు 30 -35 కి వచ్చేస్తుంది. మళ్ళీ షేరు పెరగడం మొదలై 780 కి వెళ్లినా ఈసారి కాల్ ధర 60 దాటకపోవచ్చు. అంటే మొదట పెరిగినంత వేగంగా రెండోసారి పెరగదన్న మాట. దీనికి కారణం ఆప్షన్ గ్రీక్స్. ఇవే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పుట్స్ విషయానికొస్తే... కాల్స్ కి ఇది రివర్స్. షేరు ధర 744 దగ్గర ఉంది కాబట్టి మనం 760 పుట్ కొంటే.... అది ఎంత పడితే పుట్ ధర అంత పెరుగుతూ వెళ్తుంది. ట్రేడర్లు సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే... ఐటీఎం కాల్స్, పుట్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయన్నది నిర్వివాదం.ఇదీ చదవండి: Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!ఇక ఓటీఎంల విషయానికొద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో అత్యంత ప్రమాదకరమైనవే ఈ ఓటీఎం కాల్స్, పుట్స్. కానీ నూటికి 90 మంది ఈ ఓటీఎం ల్లోనే ట్రేడింగ్ చేస్తారు. సంపాదించేది తక్కువే అయినా.. పోగొట్టుకునేది మాత్రం వీటిలో ఎక్కువే. మరి డబ్బులు పోతాయి అని తెల్సినా... ఈ ఓటీఎంల్లోనే ఎందుకు ట్రేడింగ్ చేస్తారంటే దానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు.1. ప్రీమియం రేట్లు చాలా చౌకగా ఉండటం. 2. తక్కువ పెట్టుబడి తో భారీ లాభాలు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం.ఎస్బీఐ షేరు 744 దగ్గర ఉంది కదా... చాలామంది 760, 770, 780 కాల్స్ కొంటారు. ఇంకా చెప్పాలంటే 800 కాల్స్ కూడా తీసుకుంటారు. వీటి రేట్లు వరుసగా 11, 8, 6, 3 స్థాయిలో ఉన్నాయి. అంటే 760 కాల్ ఒక లాట్ కొనడానికి 8250 పెట్టుబడి అవసరమైతే... 770 కాల్ కు 6000, 780 కాల్ కు 4500, 800 కాల్ కు 2250 పెట్టుబడి సరిపోతుంది. అంటే కేవలం ఓ 3000 నుంచి 10000 చేతిలో ఉన్న వ్యక్తి కూడా చాలా సులువుగా ఎస్బీఐ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేయగలడు. రిటైల్ ట్రేడర్లని ఆకర్షించేవి ఈ రేట్లే. 6 రూపాయలు పెట్టి 780 కాల్ కొన్న వ్యక్తికి గిట్టుబాటు కావాలంటే... షేర్ ధర 780 దాటి పెరగాలి. అది కూడా కంటిన్యూ గా పెరుగుతూ రావాలి. ఒకసారి పెరిగి, ఇంకోసారి పడి... ఇలా ముందుకెళ్తే కుదరదు. వీటిలో ఉన్న దుర్లక్షణం ఏమిటంటే.... పెరిగినప్పుడు చాలా స్వల్పంగా పెరిగితే.. షేరు ధర పడేటప్పుడు చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. కాంట్రాక్టు ఎక్సపైరీ టైం కి మొత్తం పెట్టుబడి కాస్తా సున్నా అయిపోతుంది. కానీ సగటు ట్రేడరు మాత్రం మళ్ళీ పెరగొచ్చులే... అని చివరి దాకా ఎదురుచూస్తూనే ఉంటాడు. చివరకు నష్టంతోనే బయటకొస్తాడు. మార్కెట్ ను తిట్టుకుంటాడు.. మళ్ళీ పోగుట్టుకున్న డబ్బులు సంపాదించేయాలన్న ఆతృతతో విఫల యత్నాలు చేస్తూనే ఉంటాడు.ఇప్పుడు అర్ధం అయింది కదా... ఆప్షన్స్ ట్రేడింగ్ చిన్న ట్రేడర్లకు ఎంత ప్రమాదకరమో... ఆ తప్పులు చేయకూడదంటే.... ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాలి. తగిన క్యాపిటల్ చేతిలో ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చే న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. ప్రత్యేకించి ఒక షేరు కు సంబంధించి.. ఆప్షన్స్ కొంటున్నప్పుడు టైం కి ప్రాధాన్యమివ్వాలి.ఆప్షన్ గ్రీక్స్ అర్ధం చేసుకోవాలి. ఆప్షన్స్ చైన్ అనలైజ్ చేయడం రావాలి. టెక్నికల్ తెలిసి ఉండాలి. ఇవేవీ తెలియకుండా... చేతిలో కాసిన్ని డబ్బులు పెట్టుకుని... లక్షలు, కోట్లు సంపాదించేయొచ్చు అని వేషాలేస్తే... ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయం. అంచేత... పొరపాట్లకు తావివ్వక ముందుకు సాగే ట్రేడర్లు మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారనేది తోసిపుచ్చలేని వాస్తవం.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
17న హైరింగ్ కంపెనీ ఐపీఓ.. ఒక్కో షేరు రూ.117–124
లీడర్షిప్ హైరింగ్ సేవల్లో ఉన్న ఈఎంఏ పార్ట్నర్స్ (EMA Partners)ఐపీఓ (IPO) జనవరి 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.117–124 గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.76.01 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 53.34 లక్షల తాజా ఈక్విటీలను జారీ చేయనుంది.ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు క్రిష్ణన్ సుదర్శన్, సుబ్రమణియన్లు 7.96 లక్షల షేర్లను విక్రయించనున్నారు. క్యూఐబీలకు 50%, ఎన్ఐఐలకు 15%, రిటైల్ ఇన్వెస్టర్లకు 35% వాటా కేటాయింపు జరిగింది. ఐపీఓ పూర్తయిన తర్వాత ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లో షేర్లు లిస్ట్ కానున్నాయి.సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, ఐటీ విభాగపు మౌలిక అభివృద్ధికి, నాయకత్వ బృందాన్ని పెంచుకునేందుకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా ఇండోరియంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రిజిస్ట్రార్గా బిగ్షేర్ సర్వీసెస్ వ్యవహరిస్తున్నాయి.13న లక్ష్మీ డెంటల్ ఐపీఓఆర్బిమెడ్ ప్రమోట్ చేస్తున్న లక్ష్మీ డెంటల్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.314 కోట్లకు పైగా అందుకుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్,, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, కోటక్ ఎంఎఫ్, మిరే అసెట్ ఎంఎఫ్, టాటా ఎంఎఫ్, బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నోమురా, గోల్డ్మన్ సాక్స్, అల్ మెహ్వార్ కమర్షియల్స్ ఇన్వెస్ట్మెంట్స్, నాటిక్సిస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ తదితర 31 కంపెనీలు వీటిలో ఉన్నాయి.యాంకర్ ఇన్వెస్టర్లకు లక్ష్మీ డెంటల్ ఒక్కొక్కటి రూ.428 చొప్పున 73.39 లక్షల షేర్లు కేటాయించింది. కంపెనీ ఐపీవో జనవరి 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.407–428గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.138 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. రూ.560 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. -
Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలున్నాయి. అందులో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఒకటి. పరోక్షంగా పెట్టుబడి పెట్టడం రెండోది. అంటే ఈక్విటీ మార్కెట్లో రిస్క్ చేయలేని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవడమన్న మాట.అదే ట్రేడింగ్ విషయానికొస్తే... మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఈక్విటీలు 2. ఫ్యూచర్స్ ట్రేడింగ్3. ఆప్షన్స్ ట్రేడింగ్ ఇందులో మొదటిదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.సాధారణంగా మన దగ్గర డబ్బులున్నపుడు వాటిని బ్యాంకుల్లోనో, పోస్ట్ ఆఫీసుల్లోనో దాచుకుంటాం. ఈమధ్య స్టాక్ మార్కెట్ కల్చర్ బాగా పెరిగింది. అయితే చాలామంది ఇన్స్టంట్ లాభాల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాళ్ళు ట్రేడింగ్ వైపు చూస్తున్నారే తప్ప భవిష్యత్ భరోసా గురించి ఆలోచించడం లేదు. ట్రేడింగ్ వైపు వెళ్లే వ్యక్తుల్లో నూటికి 95 మంది నష్టాల్లో కూరుకుపోయి లబోదిబో మంటున్నారు. అలాకాకుండా దీర్ఘకాలిక దృక్పథం మార్కెట్లోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి ప్రయోజనాలే దక్కుతాయి.ఇందులో కూడా మూడు రకాల మార్గాలు అనుసరించవచ్చు. 1. స్వల్ప కాలిక పెట్టుబడి2. మధ్య కాలిక పెట్టుబడి 3. దీర్ఘకాలిక పెట్టుబడిపెట్టుబడులు పెట్టడానికి బాండ్లు, డిబెంచర్లు, రుణ పత్రాలు వంటి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ మనం కేవలం స్టాక్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే పై మూడింటి గురించి వివరంగా చర్చించుకుందాం.స్వల్ప కాలిక పెట్టుబడిసాధారణంగా మూడు నెలల వ్యవధి నుంచి 12 నెలల వ్యవధితో చేసే పెట్టుబడుల్ని స్వల్ప కాలిక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వెంటనే వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటిని మార్కెట్లోకి తరలిస్తే... మన అవసరానికి అనుగుణంగా మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకుని స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.ఇలాంటి సందర్భాల్లో మూడు పరిణామాలు చోటు చేసుకోవచ్చు. 1. మన పెట్టుబడి అమాంతం పెరిగిపోయి (మనం ఎంచుకునే షేర్లను బట్టి) మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. మనం పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించి వచ్చే సానుకూల వార్తలు ఇందుకు కారణమవుతాయి. ఉదా: సదరు కంపెనీ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పెంచడం, ప్రభుత్వపరంగా సంబంధిత రంగానికి అనుకూలంగా ప్రకటనలు రావడం, ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటం.... వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.2. మన పెట్టుబడి నష్టాల్లోకి జారిపోవడం. ఒక ఆరు నెలల పాటు మనకు డబ్బులతో పని లేదని వాటిని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోపు వివిధ ప్రతికూల అంశాలు మన పెట్టుబడిని హరించి వేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వాలు పడిపోవడం, ఆర్ధిక అనిశ్చిత పరిణామాలు, సంస్కరణలు పక్కదారి పట్టడం... వంటి అంశాలు మార్కెట్లను పడదోస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు షేర్లు కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి.మీరు పెట్టుకున్న కాల వ్యవధి దగ్గర పడుతూ ఉంటుంది. షేర్లు మాత్రం కోలుకోవు.అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు జీవుడా... అనుకుంటూ ఆ కాస్త సొమ్ముతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన అవసరాలు తీరడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్జించడం మాట పక్కన పెట్టి అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందన్న మాట.3. పెట్టిన పెట్టుబడి లో పెద్దగా మార్పులు లేకపోవడం. ఆరు నెలలు గడిచినా మనం కొన్న షేర్లు అనుకున్నట్లుగా పెరగకపోవడమో, లేదంటే స్వల్ప నష్టాల్లో ఉండటమే జరుగుతుంది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.మధ్య కాలిక పెట్టుబడి ఇది సాధారణంగా ఏడాది వ్యవధి మొదలుకొని 5 ఏళ్ల వరకు కాలవ్యవధి తో చేసే పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. స్వల్ప కాలిక పెట్టుబడులతో పోలిస్తే ఇవి ఒకింత మెరుగైన ప్రతిఫలాన్నే ఇస్తాయి. వ్యవధి ఎక్కువ ఉంటుంది కాబట్టి... ఒక ఏడాది రెండేళ్లపాటు మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ తర్వాత షేర్లు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.అదే సమయంలో మన దగ్గర సొమ్ములున్నప్పుడల్లా మనం కొన్న షేర్లనో, వేరే షేర్లనో కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నందువల్ల రాబడి పెరగడానికి కూడా కచ్చితంగా వీలుంటుంది. మనమంతా మిడిల్ క్లాస్ మనుషులం అవడం వల్ల మన అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అందువాళ్ళ మధ్య కాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ రిస్క్ తోనే గణనీయ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.దీర్ఘ కాలిక పెట్టుబడి ఇది అన్ని విధాలా శ్రేయోదాయకం. అదెలాగంటే...1. మార్కెట్లు ఏళ్ల తరబడి పడిపోతూ ఉండవు. పడ్డ మార్కెట్ పెరగాల్సిందే. 2. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. 3. వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఒకట్రెండు నష్టాల్లో ఉన్నా... మిగతావి లాభాల్లో ఉండటం వల్ల మన పెట్టుబడి దెబ్బతినదు.4 . ఒకేసారి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేయాల్సిన అవసరం ఉండదు. 5. మన షేర్లపై సదరు కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి. ఇదో అదనపు ప్రయోజనం. 6. ఆయా కంపెనీలు షేర్లను విభజించడం, బోనస్ షేర్లు ఇవ్వడం వల్ల మన పోర్ట్ ఫోలియో లో షేర్ల సంఖ్యా పెరుగుతుంది. 7. మన అవసరాలు దీర్ఘకాలానికి ఉంటాయి కాబట్టి... భవిష్యత్లో అవసరమైనప్పుడో, లేదంటే ఆ షేరు బాగా పెరిగిందని భావించినప్పుడో మనం కొన్ని ప్రాఫిట్స్ ను వెనక్కి తీసుకోవచ్చు లేదా వేరే పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. 8. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇత్యాది సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఉపయోగపడతాయి.సంప్రదాయ డిపాజిట్లు పొదుపులతో పోలిస్తే... స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి అధిక రాబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయం అర్ధమయింది కదూ...అయితే మీరు తీసుకునే నిర్ణయమే... మీ భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తుంది. మీ అవసరాలు స్వల్ప కాలికమా... మధ్య కాలికమా... దీర్ఘ కాలికమా... అన్నది మీరే నిర్ణయించుకోండి. తదనుగుణమా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేయండి. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను.ఎప్పటికప్పుడు మీ పోర్టు ఫోలియో మీద కన్నేసి.. తగిన లాభాలు రాగానే బయటపడటం అనేదే స్వల్ప, మధ్య కాలాలకు ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘ కాలిక దృక్పథం తో కొంటారు కాబట్టి... లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పటికీ మంచి ఫలితాలే ఇస్తాయి. అయితే దీర్ఘ కాలానికి కొంటున్నాం కదా అని ఎవరో చెప్పారనో... తక్కువకు దొరుకుతున్నాయనో.. వ్యవధి ఎక్కువ ఉంటుంది కదా.. కచ్చితంగా పెరక్కపోవులే అనో... పనికిమాలిన పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం పోకండి.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
కొత్త ఐపీవో.. క్వాడ్రాంట్ ఫ్యూచర్
రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) ఈ నెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
ఐపీవో బాటలో రెండు కంపెనీలు
వినియోగించిన ల్యాప్టాప్, డెస్క్టాప్లను పునరుద్ధరించే జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండుతో ల్యాప్టాప్, డెస్క్టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్ఫోన్ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఎలిగంజ్ ఇంటీరియర్స్ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్ వద్ద ఎలిగంజ్ ఇంటీరియర్స్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్ఎస్ఈ ఎమర్జ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తామని పేర్కొంది.సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ మేనేజర్గా, బిగ్షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్ ఇంటీరియర్స్ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్ ఫిట్ అవుట్ సేవలు అందిస్తోంది. -
షేర్లు కొంటా అంటున్న రాజేష్
-
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్ సెషన్లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు. -
రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పటికీ చాలా మంది జంకుతారు. ఎందుకంటే ఇందులో లాభాలతో పాటు నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కానీ ఓ ఇంజినీరు ఈక్విటీ మార్కెట్లో తన అద్భుతమైన ప్రయాణంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూపించారు.పంజాబ్లోని లుధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ 1986లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ సందర్భంగా రూ.1,000 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ విభజనలు, బోనస్ ఇష్యూల తర్వాత 2024 జూన్ 7న ఆయన పెట్టుబడి విలువ రూ.1.36 కోట్లు అయింది. అప్పట్లో రూ.10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు.కుల్దీప్ సింగ్ ప్రస్తుతం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన 7,580 షేర్లను కలిగి ఉండగా, 2024 జూన్ 7న ఒక్కో షేరు విలువ రూ.1,800 వద్ద ముగిసింది. 2017లో పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్గా పదవీ విరమణ చేసిన ఆయన పోర్ట్ఫోలియో విలువ ప్రస్తుతం రూ.4 కోట్లుగా ఉంది. -
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్షిప్కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్షా
షేర్ మార్కెట్పై హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత షేర్లు అమాంతం దూసుకెళ్తాయని (షూట్ అప్) జోస్యం చెప్పారు. ఆలోపే షేర్లు కొనేసుకోవాలని సూచించారు.అయితే ఇటీవలి మార్కెట్ పతనం గురించి హోంమంత్రి పెద్దగా ఆందోళన చెందడం లేదు. గత ఆరు నెలల వ్యవధిలో, బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 12 శాతం పెరిగింది. అలాగే ఏడాది వ్యవధిలో దాదాపు 20 శాతం పెరిగింది. ‘‘గతంలో కూడా మార్కెట్ చాలా సార్లు పడిపోయింది. కాబట్టి మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలతో ముడిపెట్టడం సరి కాదు. మార్కెట్ల పతనానికి బహుశా కొన్ని పుకార్లు కారణం కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం.. జూన్ 4 లోపు కొనండి (షేర్లు). తర్వాత మార్కెట్ షూట్-అప్ కానుంది’’ అని అమిత్షా వ్యాఖ్యానించారు.భారత స్టాక్ మార్కెట్ల పయనంపై తాను ఎందుకు ఆశాజనకంగా ఉన్నది అమిత్షా వివరించారు. “స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు, మార్కెట్లు బాగానే ఉంటాయి. మోదీజీ మళ్లీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. కాబట్టి, ఇది నా అంచనా" అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు మూడు దశలు ఎలా సాగాయని అడిగినప్పుడు తమ పార్టీ 190 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మొదటి మూడు దశల్లో 283 స్థానాలకు పోలింగ్ జరగింది. -
నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) కంపెనీ షేర్లు గత ఐదు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా సంస్థ షేర్స్ రెండు శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణం ఏంటి, మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి డిసెంబర్ 22 సాయంత్రం మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) రద్దు చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించిన తర్వాత సంస్థ షేర్లు పతనమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ప్రకటన ముందు వరకు దూసుకెళ్లిన షేర్లు ఒక్కసారిగా పడిపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. మూడు రోజుల వరుస సెలవుల తర్వాత డిసెంబర్ 26న(మంగళవారం) కంపెనీ ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాక్ రూ. 1,534 స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తేరుకుని 1.08 శాతం నష్టంతో రూ. 1546 వద్ద నిలిచింది. ఇదీ చదవండి: అప్పులపాలు.. యంత్రాలన్నీ తుప్పుపట్టి పనికిరాని దశలో.. టాటా రాకతో అంతా తారుమారు! ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో సంస్థ చేసుకున్న 1.5 బిలియన్ డాలర్లు లేదా సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఈ కారణంగానే కంపెనీ షేర్స్ ప్రస్తుతం తగ్గు ముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. -
కొత్త విభాగంలో అడుగెట్టిన ఫోన్పే - వివరాలు
బెంగళూరు: ఫిన్టెక్ సంస్థ ఫోన్పే తాజాగా స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. షేర్డాట్మార్కెట్ పేరిట ప్రత్యేక ప్లాట్ఫాంను ప్రారంభించింది. బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి బుధవారం దీన్ని ఆవిష్కరించారు. ప్రాథమికంగా స్టాక్స్, ఈటీఎఫ్లతో ప్రారంభించి క్రమంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తదితర సెగ్మెంట్స్ను కూడా ఇందులో అందుబాటులోకి తేనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరిస్తారు. స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ద్వారా తమ ఆర్థిక సేవల పోర్ట్ఫోలియో సంపూర్ణమైందని ఫోన్పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరోవైపు, 2025 నాటికల్లా ఫోన్పే నిర్వహణ లాభాలను సాధించే అవకాశం ఉందని సమీర్ నిగమ్ తెలిపారు. -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్విత్ 34, కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్గా స్వీకరిస్తున్నట్టే. చిట్ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
కోట్లు వచ్చేలా చేస్తాం.. రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా!
హిమాయత్నగర్: షేర్ మార్కెట్పై నగర వాసికి ఉన్న మక్కువను క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయన అకౌంట్ను హ్యాక్ చేసి తెలియకుండా అతి తక్కువ ధరకు షేర్స్ను అమ్మేశారు. మళ్లీ షేర్ హోల్డర్తోనే ఎక్కువ రేట్కు షేర్స్ను కొనుగోలు చేపించి రూ.లక్షలు నష్టపోయేలా చేయడంతో.. బాధితుడు శుక్రవారం సిటీసైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన హరీష్చంద్రారెడ్డి కొంతకాలంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్స్ను కొనుగోలు చేసి ఎల్ఐఎస్బ్లూ ఫైనాన్షియల్ త్రూ అమ్మడం, కొనడం చేస్తుంటాడు. ఈ క్రమంలో పరిచయం అయిన సైబర్ కేటుగాళ్లు హరీష్చంద్రారెడ్డి అకౌంట్ను హ్యాక్ చేశారు. రూ.700 విలువ గల షేర్స్ను కేవలం రూ.100కు ఇతరులకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్చంద్రారెడ్డి వెబ్సైట్లో ఉన్న వారిని ప్రశ్నించగా.. కోట్లు వచ్చేలా చేస్తామని నమ్మించారు. లాభాలు లేని వాటిని రూ.700–800 చొప్పున కొనుగోలు చేయించారు. ఇలా పలు దఫాలుగా కేవలం రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరీష్చంద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మీ డబ్బంతా ఏజెంట్ తినేశాడంటూ.. వృద్ధుడికి రూ.25లక్షలు టొకరా ఇన్సురెన్స్ ఎక్స్పైరీ అయినా సరే..సైబర్ కేటుగాళ్లు మాత్రం అమాయకుల్ని వదలట్లేదు. మీకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బును పొందారు. మీకేం బాధ అనిపించడం లేదా అంటూ సింపతితో లక్షలు కాజేశారు. కుల్సుంపురాకు చెందిన వృద్ధుడు రెండు సంస్థల్లో ఇన్సురెన్స్ చేశాడు. అది చాలా కాలం క్రితం ఎక్స్పైరీ కూడా అయ్యింది. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కాల్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ డిటైల్స్ తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టాలనడంతో వృద్ధుడు చెల్లించాడు. రూ.3 లక్షలు వస్తాయని నమ్మించి పలు దఫాలుగా అతడి నుంచి రూ.25లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీసైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్ -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు సరైన తరుణం ఏది?
మార్కెట్లు పడినప్పుడు ఈక్విటీ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసినట్టుగానే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు అనుకూల సమయం ఏది? డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. డెట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకునే ముందు, లంప్ సమ్ (ఒకే విడత మొత్తం) అయినా సరే.. మీ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఫథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది కీలకమవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఎంపిక చేసుకున్న పథకం రక్షణ ఎక్కువగా ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేలా ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేసే మాదిరి అని అన్నారు. కానీ, అదేమంత సులభం కాదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నప్పుడు దిద్దుబాటు చివరికి వచ్చిందా.. ఇంకా కరెక్షన్ మిగిలి ఉన్నదా అన్నది మీకు తెలియదు. అందుకని ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఆచరించాలని చెబుతుంటాను. మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే కొంత మొత్తాన్ని మార్కెట్లు పడినప్పుడు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవచ్చు. కనిష్ట స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టడం వల్ల మంచిగా పెరిగే వాటిల్లో పెట్టుబడుల అవకాశాలను కోల్పోవచ్చు. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉంటే, 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్విటీ పెట్టుబడుల్లో 10 శాతాన్ని తీసుకెళ్లి రీట్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి రాబడులు సెన్సెక్స్ను అధిగమిస్తాయా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చస్తుంటాయి. వీటి అద్దె రాబడులు అన్నవి ప్రస్తుతం అంత ఎక్కువేమీ లేవు. వచ్చే పదేళ్లలో కొంత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ప్రస్తుతం చూస్తున్న మాదిరి ప్రతికూలతలు మధ్యలో ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ, సెన్సెక్స్ పట్ల నేను ఎంతో ఆశావహంతో ఉన్నాను. రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను. ప్రతి నెలా ఫండ్స్లో రూ.50,000కు మించి పెట్టుబడులు పెట్టేట్టు అయితే పథకాల విభజన ఎలా? ప్రతి నెలా రూ.50,000తో ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, పోర్ట్ఫోలియో సరళంగా ఉండేలా చూసుకోవాలన్నది నా సూచన. రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలు సరిపోతాయి. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు తోడు, రెండు స్మాల్క్యాప్ పథకాలను కూడా చేర్చుకోండి. పెట్టుబడులు సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలి. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
రెడీగా ఉండండి.. 18 ఏళ్ల తర్వాత ఆ దిగ్గజ సంస్థ నుంచి ఐపీఓ
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఓ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ ఐపీఓకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్ను టాటా నియమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు టాటా గ్రూప్ మరో అనుబంధ సంస్థ అయిన టాటా స్కై కూడా ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఐపీఓ వార్తలపై టాటా గ్రూప్ స్పందించేందుకు నిరాకరించాయి. చదవండి: Anand Mahindra: ఎలాన్ మస్క్పై ఆనంద్ మహీంద్రా ట్విట్.. అది పొగిడినట్లు లేదే..! -
ప్లస్ 631 నుంచి మైనస్ 100 పాయింట్లకు
ముంబై: మిడ్సెషన్ నుంచి ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లు పతనమై 15,798 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ అరశాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.20శాతం నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ 30 తేదీ తర్వాత తొలిసారిగా రూ.1,296 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.258 కోట్ల అమ్మేశారు. ఆసియాలో జపాన్, హాంగ్కాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా మార్కెట్లు లాభపడ్డాయి. చైనా, సింగపూర్ స్టాక్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం క్షీణించాయి. బర్త్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్(జూలై 4) సందర్భంగా సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు కాగా అక్కడి స్టాక్ సూచీలు 2 శాతం మేర భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి 731 పాయింట్ల పతనం సెన్సెక్స్ ఉదయం 266 పాయింట్ల లాభంతో 53,501 వద్ద మొదలైంది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 15,909 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ప్రథమార్థంలో ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు అందాయి. భారత్లో సేవారంగ కార్యకలాపాలు జూన్ నెలలో 11 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు గణాంకాలు వెలువడ్డాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం క్షీణించి 20.79 శాతానికి దిగివచ్చింది. ఈ సానుకూలాంశాలతో ఒక దశలో సెన్సెక్స్ 631 పాయింట్లు బలపడి 53,866 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు బలపడి 16,026 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. అయితే ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో యూరప్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడంతో సెంటిమెంట్ దెబ్బతింది. ద్వితీయార్థంలో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో విక్రయాలు తలెత్తడంతో ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(53,866) నుంచి 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16,200 స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్లో గరిష్టస్థాయి (16,026) నుంచి 215 పాయింట్లు క్షీణించి 15,811 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦క్యూ1 ఫలితాలు ప్రకటన విడుదలకు ముందు(జూన్ 8న టీసీఎస్ క్యూ1 గణాంకాలు వెల్లడి) ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్అండ్టీ షేర్లు ఒకశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. ♦జూన్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడంతో ఆర్బీఎల్ బ్యాంక్ షేరు ఏడుశాతం క్షీణించి రూ.81.40 వద్ద స్థిరపడింది. ♦మోతీలాల్ ఓస్వాల్ ‘‘బై’’ రేటింగ్ను కొనసాగించడంతో ఎల్ఐసీ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.703 వద్ద నిలిచింది. -
మార్కెట్లో ఆర్బీఐ అప్రమత్తత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టంతో ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు ఒకశాతానికి పతనాన్ని చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్ల క్షీణించింది. చివరికి 568 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ట్రేడింగ్లో నిఫ్టీ 223 పాయింట్లు పతనమైంది. మార్కెట్ ముగిసే సరికి 153 పాయింట్ల నష్టంతో 16,416 వద్ద నిలిచింది. సూచీలకిది మూడోరోజూ నష్టాల ముగింపు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్అండ్గ్యాస్, ఆటో షేర్లకు మాత్రమే కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. విస్తృతస్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,294 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,311 కోట్ల షేర్లు కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 77.78 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయం సెన్సెక్స్ పతనంతో బీఎస్ఈలో రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.254.28 లక్షల కోట్లకు దిగివచ్చింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ఎల్ఐసీ షేరు ఆరోరోజూ పడింది. 3%పైగా పతనమై రూ.753 వద్ద ముగిసింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 20% క్షీణించింది క్రూడాయిల్ పెరుగుదల ఆయిల్ ఇండియా షేరుకు కలిసొచి్చంది. బీఎస్ఈలో మూడు శాతం లాభపడి రూ.286 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో రూ.301 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నష్టాలకు నాలుగు కారణాలు ఆర్బీఐ పాలసీ సమావేశం: ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. వడ్డీరేట్ల పెంపు ఖాయమే అయినప్పటికీ.., ఎంతమేర పెంపు ఉండొచ్చనే అంశంపై మార్కెట్ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు, అంతర్జాతీయ అనిశి్చతులపై ఆర్బీఐ స్పందన కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. క్రూడాయిల్ ధరల సెగలు ఆసియా దేశాలకు ఎగుమతి చేసే అన్ని రకాల ఆయిల్ ధరలను జూలై నుంచి పెంచుతున్నట్లు సౌదీ అరేబియా చేసిన ప్రకటనతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 120 డాలర్లు దాటింది. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. బాండ్లపై పెరిగిన రాబడులు ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడంతో ఈక్విటీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తాజాగా పదేళ్ల కాలపరిమితి గల బాండ్లపై రాబడులు మూడేళ్ల గరిష్ట స్థాయి 7.54 శాతానికి చేరింది. క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, ఆర్బీఐ పాలసీ సమావేశం సందర్భంగా అప్రమత్తతతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా ఈక్విటీలను అమ్మేసి.., పెట్టుబడులను బాండ్లలోకి మళ్లిస్తున్నారు. యూఎస్ స్టాక్ ఫ్యూచర్ల పతనం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీ శాయి. ఆ్రస్టేలియా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడికి ఇతర దేశాల కేంద్ర బ్యాంకులూ ఇదే కఠినతర ద్రవ్యపాలసీ వైఖరిని అనుసరించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కె ట్లు 1% నుంచి 1.5% క్షీణించాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 1% నష్టాల్లో ట్రేడయ్యాయి. -
అదే నా కొంప ముంచింది: పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ!
Paytm Share Decline Reason, న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎమ్ షేరు విలువ పతనంకావడానికి మార్కెట్ల ఆటుపోట్లే కారణమని వన్97 కమ్యూనికేషన్స్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్పై ఇటీవల మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. రానున్న ఆరు త్రైమాసికాల్లోకంపెనీ లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరుకోగలదని అంచనా వేశారు. నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే స్థాయికి చేరగలదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్లో మార్కెట్ ఒడిదుడుకులు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వాటాదారులకు రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. పేటీఎమ్ బ్రాండుతో వన్97 కమ్యూనికేషన్స్ డిజిటల్ పేమెంట్ సర్వీసులందిస్తున్న సంగతి తెలిసిందే. నేలచూపుల్లో...: గతేడాది షేరుకి రూ. 2,150 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన వన్97 కమ్యూనికేషన్స్ కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతూ వస్తోంది. ఇటీవల బీఎస్ఈలో రూ. 520 వద్ద జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. తాజాగా 5 శాతం బలపడి రూ. 637 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022) ఫలితాలు ప్రకటించవలసి ఉన్నదని, ప్రస్తుతం కంపెనీ బిజినెస్ అవకాశాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని లేఖలో శర్మ ప్రస్తావించారు. ఇది కొనసాగనున్నట్లు భావిస్తున్నామంటూనే, ఏడాదిన్నర కాలంలో నిర్వహణ ఇబిటాను సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. వెరసి 2023 సెప్టెంబర్కల్లా ఆశించిన ఫలితాలు అందుకోగలమని అభిప్రాయపడ్డారు. తద్వారా దీర్ఘకాలంలో వాటాదారులకు విలువ చేకూర్చనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్ విలువ ఐపీవో స్థాయికి చేరాకమాత్రమే తనకు జారీ అయిన షేర్లు తనకు సొంతమవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం
-
షేర్ మార్కెట్ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో ఘరానా మోసం
-
స్టాక్ మార్కెట్కి బడ్జెట్ బూస్ట్.. లాభాల్లో సూచీలు
ముంబై: కేంద్ర బడ్జెట్ ఇచ్చిన బూస్ట్తో దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. బడ్జెట్లో ఇన్ఫ్రాకి పెద్ద పీట వేయడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. దీంతో వరుసగా రెండో రోజు దేశీ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:10 గంటలకి 430 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ 59,293 పాయింట్ల వద్ద కదలాడుతోంది.మరోవైపు నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,706 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దేశీ సూచీలు జోరుమీద ఉండటంతో మరోసారి బీఎస్ఈ సెన్సెక్స్ 59 వేల మార్క్ని దాటింది. -
లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1
Elon Musk Wealth Drops 15billion Dollars as tech stocks plunge: షేర్ మార్కెట్ పరిణామాలు.. ఎప్పుడు? ఎవరి తలరాతను ఎలా? మార్చేస్తాయో ఊహించడం కష్టం. ఒక్కపూటలో కాసులు కురిపించి.. అదేటైంలో రోడ్డు మీదకు లాగేస్తుంది కూడా. ఐపీవో పరిణామాలైతే మరీ ఊహించని రేంజ్లో ఉంటున్నాయి. అయితే అపరకుబేరుల విషయంలో ఈ పరిణామాలన్నీ పెద్దగా అనిపించకపోయినా.. వాళ్ల ర్యాంకింగ్లను మాత్రం పైకి కిందకి మార్చేస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ తరుణంలో లక్ష కోట్లకుపైగా పొగొట్టుకున్నా ఆ అయ్యగారు.. ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈ అయ్యగారు ఎవరో కాదు.. స్పేస్ఎక్స్ అధినేత, అపరకుబేరుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్. శుక్రవారం అమెరికా ఈ-వెహికిల్స్ తయారీదారు కంపెనీ ‘టెస్లా’ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు ఎలన్ మస్క్. ఈ విలువ మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైనే. ఇదిగాక స్పేస్ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్లు(ఏడున్నర వేల కోట్ల రూపాయలకుపైనే) నష్టపోయాడు. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల(లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టంతో.. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లుగా ఉంది. ఇక ఈ లిస్ట్లో మస్క్ మొదటి ప్లేస్లో ఉండగా.. రెండో ప్లేస్లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. 195.6 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ బ్లూ ఆరిజిన్ బాస్. ఇక అమెజాన్ షేర్లు కూడా 1.20 శాతం పడిపోవడంతో.. 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయాడు బెజోస్. జాబితాలో బ్రిటిష్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్గేట్స్ (136.4 బిలియన్ డాలర్లు) నాలుగో ప్లేస్లో, లారీ పేజ్ (121.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో మార్కెట్లన్నీ పతనం దిశగా పయనిస్తుండగా.. ఫోర్బ్స్ టాప్ టెన్లో ఉన్న బిలియనీర్లంతా షేర్ల నష్టాలతో భారీగా సంపదను కోల్పోవడం విశేషం. ఎటు చూసినా టాపే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్లాలోని తన షేర్లను అమ్మేసుకున్నాడు ఎలన్ మస్క్. పైసా తీసుకోని జీతగాడిగా(జీరో శాలరీ) కేవలం టెస్లా షేర్లతోనే లాభాలు అందుకుంటున్న ఎలన్ మస్క్.. ఈ మధ్య 10 శాతం వాటా అమ్మేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తికర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి అమ్మకంతో 10.9 బిలియన్ డాలర్ల విలువైన 10.1 మిలియన్ షేర్లు అమ్మేసుకున్నాడు. ఇంకా దాదాపు ఏడు మిలియన్లు అమ్మేయాల్సి ఉంది. మరి మొత్తంగా తన వాటాగా ఉన్న 17 మిలియన్ షేర్లను వదులుకోవడం ద్వారా మస్క్ నష్టపోడా? బిలియనీర్ జాబితాలో కిందకి జారిపోడా? అనే అనుమానాలు చాలామందికే కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షేర్ల అమ్ముకోవడం ద్వారా కట్టాల్సిన ట్యాక్స్ నుంచి భారీ మినహాయింపు పొందాడు ఎలన్ మస్క్. పైగా ఈ అమ్మకాల ద్వారా వాటిల్లిన నష్టం(1,084 డాలర్లు) నుంచి తప్పించుకుని లాభపడ్డాడు కూడా!. ఇక ఈ ఏడాది మొదట్లో ఏకంగా 384 బిలియన్ డాలర్ల సంపదతో(266.8 బిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం) రిచ్చెస్ట్ మ్యాన్గా అవతరించాడు ఎలన్ మస్క్. మరోవైపు స్పేస్ఎక్స్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల సంపదను పోగేశాడు. ఇదీగాక ఈ మధ్యే కేవలం స్పేస్ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా స్పేస్ఎక్స్ అవతరించింది. ఇవిగాక భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్లు, శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్లింక్’ సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఎలా చూసుకున్నా అయ్యగారి నెంబర్ వన్స్థానానికి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ఫోర్బ్స్ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది ఈ మధ్య. చదవండి: ట్విటర్ సీఈవో పరాగ్పై వివాదాస్పద ట్వీట్ -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థికసంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 1,302 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,244 కోట్లకు చేరా యి. కన్జూమర్ ప్రొడక్టుల విభాగం ఆదాయం 31 శాతం జంప్చేసి రూ. 1035 కోట్లను తాకగా.. ఈపీసీ బిజినెస్ 37 శాతం క్షీణించి రూ. 267 కోట్లకు పరిమితమైంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 1,092 వద్ద ముగిసింది. -
గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు మంగళవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు పతనమై 60,433 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లను కోల్పోయి 18,044 వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లైన హెచ్డీఎప్సీ ద్వయం, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల క్షీణత కూడా సూచీల లాభాల్ని హరించివేశాయి. ఆర్థిక, కన్జూమర్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, ఆటో, ఇంధన, మౌలిక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 456 పాయింట్లు పరిధిలో, నిఫ్టీ 130 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యాయి. లార్జ్ క్యాప్ షేర్లు విక్రయాల ఒత్తిడికి లోనప్పటికీ.., చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు ఒకశాతం చొప్పున రాణించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు నివేదికలు తెలపడంతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు డిమాండ్ లభించింది. సెమీ కండెక్టర్ల సమస్యలు తీరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి అమ్మకాలు పుంజుకోవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆటో రంగ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,445 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్ల రూ.1,417 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ఉదయం సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 60,610 వద్ద మొదలైంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 18,084 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలి సెషన్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 124 పాయింట్లు ర్యాలీ చేసి 60,670 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు ఎగసి 18,113 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మిడ్సెషన్ నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడమే కాక నష్టాల బాటపట్టాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►క్యూ2లో మార్జిన్లు నిరాశపరచడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.3,622 వద్ద ముగిసింది. ►విద్యుత్ వాహన వ్యాపారానికి నిధులనుసమీకరణకు సిద్ధమవడంతో టీవీఎస్ మోటార్ షేరు ఇంట్రాడేలో 14 శాతం ఎగసి రూ.814 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. అయితే లాభాల స్వీకరణ జరగడంతో చివరికి మూడుశాతం లాభంతో రూ.731 వద్ద స్థిరపడింది. ►భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో ఎల్అండ్టీ రెండు లాభంతో రూ.1964 వద్ద 52–వారాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం లాభంతో రూ.1944 వద్ద నిలిచింది. -
ఈ షేర్లు... తారాజువ్వలు!
ఇన్వెస్టర్లకు సంవత్ 2077 బంపర్గా గడిచింది. ప్రజలను కరోనా భయాలు వెంటాడుతున్నా.. దేశీ మార్కెట్లు మాత్రం తారాజువ్వల్లాగా దూసుకెళ్లిపోయాయి. స్మాల్, మిడ్.. లార్జ్ క్యాప్ అనే భేదం లేకుండా అన్ని విభాగాల్లోని షేర్లూ గణనీయంగా పెరిగాయి. గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది అక్టోబర్ దాకా చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 40 శాతం రాబడులు అందించగా.. మిడ్క్యాప్ సూచీలు 60 శాతం, స్మాల్క్యాప్ సూచీలు 79.7 శాతం మేర రాణించాయి. కరోనా కేసుల కారణంగా అంతటా నిస్పృహ, నిరాశ నెలకొన్న పరిస్థితుల్లో ఊహకు కూడా అందని విధంగా స్టాక్ మార్కెట్లు ఎగిశాయి. కారణాలు అంతర్జాతీయంగా నిధుల లభ్యత పెరగడం, ఆర్థిక విధానాలు సానుకూలంగా ఉండటం, ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు (2021లో 2 కోట్ల పైచిలుకు) తెరవడం, టీకాలతో మహమ్మారిని కొంత కట్టడి చేయగలగడం, ఇంధన ధరలు పెరగడం, రిస్క్ సామర్థ్యాలు పెరగడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లో జోష్కి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్ 2078లోనూ మార్కెట్లు మరింత ఎగిసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే రాబడులు తగ్గడం, దేశీ ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలు పెరగడం, జీడీపీ వృద్ధి మెరుగుపడుతుండటం, టీకా ప్రక్రియ పుంజుకుంటూ ఉండటం ఇందుకు దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రంగాల్లో ట్రావెల్, టూరిజం, రియల్ ఎస్టేట్ దాని అనుబంధ రంగాలు మొదలైనవి మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. మరోవైపు, హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాలు ఆశావహంగా ఉండగలవని యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్లో మెరిసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని బ్రోకరేజి సంస్థలు సూచిస్తున్న స్టాక్స్ కొన్ని మీకోసం. బ్రోకింగ్ సంస్థ: ఎస్బీఐ సెక్యూరిటీస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,721 వృద్ధి: 33% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 4.8 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్, అసెట్ క్వాలిటీ, మెరుగైన మార్జిన్లు, రాబడులు దీనికి సానుకూల అంశాలు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ మొండి బాకీలు మరింత తగ్గగలవు. వ్యయాలు తగ్గించుకునే దిశగా డిజిటల్పై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రతి నెలా డిజిటల్ మాధ్యమం ద్వారా 5 లక్షల పైచిలుకు కస్టమర్లను చేర్చుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించడం, లాక్డౌన్లు విధిస్తే రిటైల్ సెగ్మెంట్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం, ఫిన్టెక్ కంపెనీల నుంచి పోటీ వంటివి బాంకుకు ప్రతికూలాంశాలు కాగలవు. .. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుత ధర రూ. 292 టార్గెట్ ధర రూ. 358 వృద్ధి: 22% వివిధ మౌలిక రంగ ప్రాజెక్టుల అభివృద్ధిలో రెండు దశాబ్దాలపైగా అనుభవం. పటిష్టమైన ఇన్హౌస్ ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సేవలు) విభాగం. ఇన్ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థలతో సత్సంబంధాల కారణంగా సంయుక్తంగా బిడ్డింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మెరుగైన అవకాశాలు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,786 టార్గెట్ ధర రూ. 2,151 వృద్ధి: 20% ఆదిత్య బిర్లా గ్రూప్లో భాగమైన కంపెనీ. దేశీయంగా విస్కస్ స్టేపుల్ ఫైబర్ (వీఎస్ఎఫ్), లినెన్, ఇన్సులేటర్స్ తయారీ సంస్థ. అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి అనుబంధ సంస్థలున్నాయి. డెకరేటివ్ పెయింట్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో వ్యాపారాలపై రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆకర్షణీయమైన వేల్యుయేషన్లో లభిస్తోంది. చైనా నుంచి సరఫరాపరమైన ఆటంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్, ముడి వస్తువులు..విద్యుత్, ఇంధనాల ఖర్చులు పెరగడం తదితర రిస్కులు పొంచిఉన్నాయి. .. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 612 టార్గెట్ ధర రూ.774 వృద్ధి: 26% ఇది మురుగప్పా గ్రూప్లో భాగమైన ఆర్థిక సేవల విభాగం. గృహ, వాహన రుణాలు, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సేవలు మొదలైనవి అందిస్తోంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 67000 కోట్ల పైగా ఉంది. దాదాపు 16.6 లక్షల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏయూఎం వార్షికంగా 7 శాతం వృద్ధి నమోదు చేసింది. మహమ్మారి కారణంగా వసూళ్లపై అనిశ్చితి,హామీగా పెట్టుకున్న వాటి విలువలో అత్యధిక శాతం రుణం ఇవ్వడం తదితర అంశాలు ప్రధానమైనరిస్కులు. సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ.836 టార్గెట్ రూ.1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్రోకింగ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.100 టార్గెట్ ధర రూ.135 వృద్ధి: 35% పేరొందిన పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. బ్యాంక్ మొత్తం అసెట్స్ రూ. 2.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు రూ. 1.72 లక్షల కోట్లుగా, ఇచ్చిన రుణాలు రూ. 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రొవిజనింగ్ తగ్గింది. అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.1582 టార్గెట్ ధర రూ.1,859 వృద్ధి: 17% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం. డిపాజిట్లు రూ. 14 లక్షల కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 12 లక్షల కోట్లుగాను ఉన్నాయి. రిటైల్ రుణాల వాటా 46 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో ఎన్పీఏలు తగ్గడంతో ఊహించిన దానికన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అసెట్ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, ద్వితీయార్ధం వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండటం తదితర అంశాలు ఈ స్టాక్కు సానుకూలమైనవి. సుప్రజిత్ ఇంజినీరింగ్ ప్రస్తుత ధర రూ.373 టార్గెట్ ధర రూ.425 వృద్ధి: 13% సుప్రజిత్ ఇంజినీరింగ్ దేశీయంగా ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్యాసింజర్ వాహనాల సంస్థలకు ఆటోమోటివ్ కేబుల్స్ సరఫరా చేస్తోంది. ఉత్పత్తులను చౌకగా అందించడం ద్వారా మార్కెట్ షేరును పెంచుకోవడంతో పాటు ప్రస్తుత కస్టమర్ల నుంచి మరింతగా ఆర్డర్లు దక్కించుకుంటోంది. వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచుకునే కొద్దీ సుప్రజిత్ కూడా గణనీయంగా ప్రయోజనాలు పొందగలదు. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర రూ.143 టార్గెట్ ధర రూ.175 వృద్ధి: 22% దేశీయంగా వాణిజ్య వాహనాల విభాగ దిగ్గజాల్లో ఒకటి. మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాల మార్కెట్లో సుమారు 28 శాతం వాటా ఉంది. సీవీ సెగ్మెంట్ కోలుకునే కొద్దీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలగే సత్తా ఉంది. స్క్రాపేజీ పాలసీ వల్ల కూడా కంపెనీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పీఐ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ.2733 టార్గెట్ ధర రూ.3,950 వృద్ధి: 44% అంతర్జాతీయ ఆగ్రోకెమికల్ కంపెనీలకు కస్టమ్ సింథసిస్, తయారీ సొల్యూషన్స్ (సీఎస్ఎం) అందిస్తోంది. కంపెనీ ఆదాయాల్లో ఈవిభాగం వాటా 70 శాతం పైగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కెమికల్స్, ఫార్మా ఏపీఐ, ఫ్లోరో కెమికల్స్ మొదలైన వాటిల్లోకి విస్తరిస్తోంది. బ్రోకింగ్ సంస్థ: యాక్సిస్ సెక్యూరిటీస్ ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ధర రూ. 2,420 టార్గెట్ ధర రూ. 2,570 వృద్ధి: 6% వ్యయాల తగ్గింపు చర్యలు, ఉత్పత్తులకు భారీ డిమాండ్, మెరుగైన ధర మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు. ప్రస్తుతం ఈ రంగంలోని మిగతా సంస్థలతో పోలిస్తే షేరు ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. సైయంట్ ప్రస్తుత ధర రూ.1,105 టార్గెట్ ధర రూ.1,300 వృద్ధి: 17% దీర్ఘకాలిక కోణంలో కంపెనీ వ్యాపార స్వరూపం పటిష్టంగా మారింది. అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు సంస్థ చేతిలో ఉన్నాయి. రూపాయి మారకం తక్కువ స్థాయిలో ఉంటడం, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గటం వంటి కారణాలతో సమీప భవిష్యత్తులో సైయంట్ ఆదాయాలు మరింత మెరుగుపడవచ్చు. మైండ్ట్రీ ప్రస్తుత ధర రూ.4,627 టార్గెట్ ధర రూ.5,100 వృద్ధి: 10% ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించగలగడంతో పాటు ప్రాజెక్టులను సమర్ధంగా పూర్తి చేయగలిగే ట్రాక్ రికార్డు కంపెనీకి సానుకూలాంశం. రూపాయి క్షీణత, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గుతుండటం కలిసొచ్చే అంశాలు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర రూ.744 టార్గెట్ ధర రూ.940 వృద్ధి: 26% నవీకరించిన కొత్త వ్యాపార విధానం ఊతంతో తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతో పాటు మార్కెట్ వాటాను కూడా పెంచుకోగలిగే అవకాశం ఉంది. బ్రాండ్ రీకాల్, వివిధ రకాల కస్టమర్లకు వినూత్న ఆఫర్లు అందిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ధర రూ.1,178 టార్గెట్ ధర రూ.1,350 వృద్ధి: 14% ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఎస్బీఐ లైఫ్కు అత్యంత విస్తృతమైన బ్యాంక్ఎష్యూరెన్స్ నెట్వర్క్ ఉంది. కార్యకలాపాలను స్వల్ప వ్యవధిలో విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యయాలకు సంబంధించిన నిష్పత్తులు అత్యంత తక్కువగా ఉండటం వల్ల వ్యాపా రం నెమ్మదించినా మార్జిన్లపై ఎక్కువగా ప్రభావం పడకపోవడం, లాభదాయక పాలసీలపై దృష్టి పెడుతుండటం సంస్థకు సానుకూలాంశం. బ్రోకింగ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ. 836 టార్గెట్ రూ. 1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ధర రూ. 101 టార్గెట్ ధర రూ. 120 వృద్ధి: 18% క్రమంగా కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలను ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం తదితర అంశాల ఊతంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుంది. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్కు బదలాయించడంతో ఎన్పీఏల భారం తగ్గుతుంది. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రావాల్సిన బాకీలు కూడా క్రమంగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రస్తుత ధర రూ. 253 టార్గెట్ ధర రూ. 300 వృద్ధి: 18% మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ రంగ పరికరాల వ్యాపారం పటిష్టంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు–నాలుగేళ్లలో 35–30 శాతం పెరగవచ్చని అంచనా. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీకి ఇది సానుకూలాంశం. బాటా ఇండియా ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,380 వృద్ధి: 17% వ్యయాలను తగ్గించుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగించడం, ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు మొదలైనవి కంపెనీకి లాభించగలవు. అలాగే భారం పెంచుకోకుండా ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ నెట్వర్క్ను క్రమంగా పెంచుకుంటూ ఉండటం సంస్థకు సానుకూల అంశం. మహీంద్రా లైఫ్స్పేస్ ప్రస్తుత ధర రూ. 283 టార్గెట్ ధర రూ. 325 వృద్ధి: 14% పటిష్టమైన మాతృ సంస్థ తోడ్పాటు, కార్యకలాపాల స్థాయిని విస్తరించడంపై మేనేజ్మెంట్ మరింతగా దృష్టి పెడుతుండటం కంపెనీకి సానుకూల అంశాలు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలాలతో రెసిడెన్షియల్ వ్యాపారాన్ని కూడా పెంచుకోవడానికి తోడ్పడగలదు. మధ్యకాలికంగా షేర్ టార్కెట్ను తాకవచ్చు. -
స్టాక్ మార్కెట్పై బేర్ పంజా.. నేల ముఖం పట్టిన సూచీలు
ముంబై: అనూహ్యంగా పెరుగుతూ పోయిన స్టాక్ మార్కెట్ క్రమంగా దిద్దుబాటు దిశగా పయణిస్తోంది. ఆరంభంలో దేశీ సూచీలు లాభాలు పొందినా.. మధ్యాహ్నం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలు షురూ చేయడంతో తిరిగి నష్టాలతోనే దేశీ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. చివరి నిమిషంలో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో భారీ నష్టాలు తప్పాయి. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, టాటాస్టీల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 61,044 పాయింట్లతో మొదలవగా ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో 61,420 పాయింట్లను తాకింది. దీంతో తిరిగి మార్కెట్లో బుల్ జోరు మొదలైందనే భావన ఏర్పడింది. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారింది. లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,627 పాయింట్ల కనిస్టానికి పడిపోయింది. చివరల్లో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో మార్కెట్ ముగిసే సమయానికి 102 పాయింట్లు నష్టపోయి 60,821 పాయింట్ల దగ్గర ఆగిపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 63 పాయింట్లు నష్టపోయి 18,144 దగ్గర క్లోజయ్యింది. -
చెన్నై‘సూపర్ కింగ్స్’.. అరుదైన ఘనత!
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యకర పరిణామాలకు కారణం కాబోతోంది. ధనా ధన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఇటు ఐపీఎల్ లీగ్పరంగానే కాకుండా అటు మార్కెట్ వేల్యుయేషన్పరంగానూ దుమ్ము రేపుతోంది. ఏకంగా క్రీడా రంగంలో తొలి యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా విలువ) హోదా దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ విషయంలో మాతృ సంస్థ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్ను కూడా దాటిపోతుండడం మరో విశేషం. ఈమధ్యే నాలుగోసారి లీగ్ను గెల్చుకోవడంతో సీఎస్కే టీమ్ విలువపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్లో రెండు జట్లకు చోటు కల్పించనున్నారని, వీటి విలువను సుమారు రూ. 4,000– 5,000 కోట్లుగా లెక్కించనున్నారని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టి చూస్తే, తొలి నుంచి నిలకడగా రాణిస్తున్న సీఎస్కే వేల్యుయేషన్ దాదాపు రెట్టింపు స్థాయికి చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘‘గత శుక్రవారం అనధికారిక మార్కెట్లో సీఎస్కే షేరు ధర రూ. 135గా ఉంది. దీని ప్రకారం సీఎస్కే మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 4,200 కోట్లు. అయితే, కొత్తగా వచ్చే జట్ల విలువ దాదాపు రూ. 4,000– 5,000 కోట్లుగా ఉంటే సీఎస్కే రిటైల్ షేరు ధర ఏకంగా రూ. 200కి చేరవచ్చు. దీంతో టీమ్ విలువ రూ. 8,000 కోట్లకు ఎగియవచ్చు. తద్వారా యూనికార్న్గా మారవచ్చు’’ అని పేర్కొన్నాయి. మరోవైపు, మంగళవారం నాటి పరిస్థితుల ప్రకారం సీఎస్కే మాతృ సంస్థ ఇండి యా సిమెంట్స్ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో షేరు ధర రూ. 205) మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 6,343 కోట్లుగా ఉంది. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే సీఎస్కే విలువ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్ను కూడా దాటిపోనుంది. ఇండియా సిమెంట్స్కు ఊతం ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్ శ్రీనివాసన్ కూడా ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే విలువ.. మాతృ సంస్థ వేల్యుయేషన్ను దాటేసే అవకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ లీగ్లు మరింతగా ప్రాచుర్యంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరో సందర్భంలో ఇండియా సిమెంట్స్కు సీఎస్కే ఊతంగా నిలుస్తోందంటూ ఆయన అంగీకరించారు. ‘‘ఇండియా సిమెంట్స్ నెలకొల్పి 75 ఏళ్లవుతోంది. అది స్వయంగా ఒక పటిష్టమైన బ్రాండ్. కానీ ఇప్పుడు సీఎస్కే మాతృ సంస్థగా గుర్తింపు పొందుతోంది. సీఎస్కే అనతికాలంలోనే ఇండియా సిమెంట్స్ ప్రాచుర్యాన్ని అధిగమించింది’’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ‘‘సీఎస్కే స్వయంగా ఒక భారీ బ్రాండ్గా ఆవిర్భవిస్తోంది. వేల్యుయేషన్ గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఇండియా సిమెంట్స్ దీన్నేమీ విక్రయించకపోవచ్చు. ఎందుకుంటే బ్రాండింగ్పరంగా ఇది మాతృ సంస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది’’ అని బ్రాండ్ మార్కెటింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఇండియా సిమెంట్స్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎస్కే టీమ్ ప్లేయర్లు సందడి చేయడం ఇందుకు నిదర్శనంగా తెలిపాయి. సీఎస్కే టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అటు ఇండియా సిమెంట్స్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. నిలకడగా రాణింపు 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పట్నుంచీ .. మిగతా టీమ్లతో పోలిస్తే సీఎస్కే నిలకడగా రాణిస్తోంది. 196 మ్యాచ్లలో 117 మ్యాచ్లలో గెలుపొంది.. 59.69 శాతం విజయాల రేట్తో కొనసాగుతోంది. ధోనీ సారథ్యంలో సీఎస్కే ఇప్పటికే పటిష్టమైన బ్రాండ్గా ఎదిగిందని, ఒకవేళ రేపు ఎప్పుడైనా అతను తప్పుకున్నా కూడా దాని ప్రాభవం తగ్గకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఎస్కే టీమ్ నిర్వహణ తీరు ఇందుకు కారణమని వివరించాయి. ‘‘మంచి బ్రాండ్స్ ఎలా వ్యవహరించాలన్నది సీఎస్కే చూపించింది. నిలకడగా రాణించడం, ప్రజల ఆప్యాయతను చూరగొనడం ఇలా అన్ని కీలకమైన అంశాల్లోనూ ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. పనితీరులో నిలకడగా రాణిస్తోంది. మిగతా బడా పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన టీమ్లను ధైర్యంగా ఎదుర్కొని, నిలబడగలుగుతోంది. పేరుకు చెన్నై సూపర్ కింగ్స్ అయినప్పటికీ చెన్నై పరిధిని దాటి దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడే టీమ్గా ఎదిగింది’’ అని పేర్కొన్నాయి. చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ షాక్ -
అదే దూకుడు.. లాభాల్లో సూచీలు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో సూచీలు సానుకూలంగా ఉండటం, ఇటు ఏషియా మార్కెట్లు సైతం లాభాల బాటలో పయణిస్తుండటం దేశీ మార్కెట్ల జోరుకు మరింత ఊతం ఇచ్చాయి. గత కొంత కాలంగా కొనసాగుతోన్న బుల్ జోరుని మరింతగా పెంచాయి. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఆల్టైం హైలను టచ్ చేశాయి. ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 62,123 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్సీ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 18,571 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు నిఫ్టీ ప్రారంభం కావడమే 18,602 పాయింట్లతో మొదలై ఆల్టైం హైని టచ్ చేసింది. ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, ఆల్ట్రాటెక్, టైటాన్, పవర్గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. -
ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే
వెండితెరపై హీరో హీరోయిన్ల జోడీ బాగా కుదిరితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అంటారు. అచ్చంగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు, లాభాల మధ్య కెమికల్ షేర్ల విషయంలో ఏడాది కాలంగా చక్కని కెమిస్ట్రీ కుదురుతోంది. ఈ కెమికల్ కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. యాక్షన్.. రియాక్షన్ అణువులు పరమాణువులు అందులో ఉండే ఎలక్ట్రాన్ల మధ్య చర్యలతో కూడినదే కెమిస్ట్రీ. కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో జరిగే రసాయనిక చర్యల కారణంగా కొత్త పదార్థాలు పుట్టుకొస్తాయి. అదేవిధంగా ఎక్కడో చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ వ్యవహరాలు ఇండియాలో కెమికల్ షేర్ల ధరలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. ఏడాదిలో ఐదింతలు ఏడాది వ్యవధిలోనే దేశీ స్టాక్మార్కెట్లో ఐదు కెమికల్ కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది వ్యవధిలోనే కనీసం లక్షకు రెండు లక్షలు మొదలు ఐదు లక్షల రూపాయల వరకు లాభాలు అందించాయి. ఐటీ, మెటల్, ఫైనాన్స్ కంపెనీలను వెనక్కి నెట్టి ముదుపరులకు అతి భారీ లాభాలను స్వల్ప కాలంలోనే కెమికల్ షేర్లు అందిస్తున్నాయి. అలా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన కొన్ని కంపెనీలు, వాటి షేర్ల ధరల వివరాలు ఇన్వెస్టర్ల ఇంట సిరుల పంట - బాలాజీ అమీన్స్ అనే కెమికల్ కంపెనీ 1988లో మార్కెట్లో లిస్టయ్యింది. అప్పటి నుంచి గతేడాది వరకు ఈ కంపెనీ షేరు విలువ సాధారణ స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కానీ గత ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ షేరు విలువ 450 శాతం పెరిగింది. 2020 అక్టోబరు 20న ఈ కంపెనీ ఒక షేరు విలువ రూ. 816 ఉండగా 2021లో ఈ ధర అమాంతం పెరిగి రూ.4,488లకు చేరుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ 14,525 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఫార్మా రంగానికి సంబంధించిన కెమికల్స్ తయారు చేస్తోంది. - గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీ 1987లో నోయిడా సమీపంలో స్థాపించారు. ఈ కంపెనీ రిఫ్రిజరెంట్ గ్యాసెస్, కాస్టిక్ సోడా, క్లోరో మీథేన్ తదితర రసాయనాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ 2020 అక్టోబరులో రూ. 484 ఉండగా ప్రస్తుతం ఈ విలువ రూ. 2,167లకు చేరుకుంది. ఏడాది వ్యవధిలోనే కంపెనీ షేర్ వ్యాల్యూ 348 శాతం పెరిగింది. - దీపక్ నైట్రేట్ సంస్థ బల్క్ కెమికల్ కమోడిటీస్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేరు విలువ గతేడాది రూ. 716లు ఉండగా 2021 అక్టోబరు వచ్చేసరికి 298 శాతం పెరిగి ఒక్కో షేరు ధర రూ. 2,852లుగా పలుకుతోంది. పెట్రోకెమికల్స్, అగ్రోకెమికల్స్, ఫార్మా తదితర రంగాలకు ఈ కంపెనీ నుంచి బల్క్ కెమికల్స్ వెళ్తుంటాయి. - ప్రివీ స్పెషాలిటీ కెమికల్ సంస్థ షేర్లు ఏడాది వ్యవధిలో 258 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబరులో షేరు విలువ రూ.527లు ఉండగా ప్రస్తుతం అది రూ.1,891కి చేరుకుంది. ఏడాది వ్యవధిలో గరిష్టంగా రూ.2,070ని తాకగా కనిష్టంగా రూ.501కి పడిపోయింది. - అల్కైల్ అమీన్స్ సంస్థ పెయింట్స్, రబ్బర్, వాటర్ ట్రీట్మెంట్ తదితర రంగాలకు కెమికల్స్ని సరఫరా చేస్తుంది,. గతేడాది ఈ కంపెనీ షేరు విలువ రూ.1,228 ఉండగా ఏడాది కాలంలో 223 శాతం పెరిగి ప్రస్తుతం రూ.3970 దగ్గర ట్రేడవుతోంది. ఈ ఏడాది కాలంలో గరిష్టంగా రూ.4,749కి చేరుకోగా కనిష్టంగా రూ. 1,138కి పడిపోయింది. కారణం ఇదేనా? కరోనా విపత్తుతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. కెమికల్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచానికి చైనా అతి పెద్ద తయారీ, సరఫరాదారుగా ఉండేది. కానీ కరోనాతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్వైపు చూస్తున్నాయి. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం చైనా దిగుమతుల పట్ల సానుకూలంగా లేదు. దీంతో దేశీ కెమికల్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. బ్లూచిప్లను మించి మెరుగైన పనితీరు కనిపిస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీల్లోనే ఉన్నప్పటికీ ముదుపరులకు భారీ లాభాలు అందివ్వడంలో బ్లూచిప్ కంపెనీలను వెనక్కి నెడుతున్నాయి. చదవండి:9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..! -
ఆకాశమే హద్దు! 61 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది. బుల్జోరు కంటిన్యూ అవుతుండటంతో దేశీ సూచీలు రయ్ రయ్మంటూ పైపైకి దూసుకుపోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది. నిన్న సాయంత్రం బీఎస్సీ సెన్సెక్స్ 60,737 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కానీ ఈ రోజు మార్కెట్ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత కాసేపు జోరు తగ్గినట్టు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్సీ సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 61,140 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 18,282 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. -
Stock Market : అదే జోరు .. తగ్గేది లేదు
ముంబై: స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. బుల్ పరుగులు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు తాజాగా మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. ఉదయం పది గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 263 పాయింట్లు లాభపడి 60,547 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ వంద పాయింట్లు లాభపడి 18,091 వద్ద కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలు పొందాయి. టాటాస్టీల్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనిలీవర్లిమిటెడ్ షేర్లు నష్టాలు పొందాయి. -
స్టాక్మార్కెట్లో అస్థిరత.. నష్టాల బాట పట్టిన సూచీలు
ముంబై : పెరిగిన ముడి చమురు ధరలతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లపై చమురు ధరల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో దేశీ స్టాక్మార్కెట్లో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నిన్న ఉదయం మార్కెట్ ప్రారంభం కావడంతోనే లాభాల బాట పట్టిన సూచీలు ఈ రోజు అడుగు ముందుకు వేసేందుకు మొరాయిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప లాభాలతో మొదలై నష్టాల బాట పట్టగా ఎన్ఎస్ఈ నిఫ్టీ నష్టాలతోనే ట్రేడ్ మొదలుపెట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 59,320 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ వెంటనే 59,560 పాయింట్లకు చేరకుంది. కానీ కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోవడం ప్రారంభమైంది. ఉదయం 9:47 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్లు నష్టపోయి 59,207 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 17,682 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతి సుజూకి ఇండియా, హెచ్యూఎల్, ఏషియన్ పేయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలు పొందగా హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ, టైటాన్ షేర్లు నష్టపోయాయి. -
కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్దేవ్.. సెబీ సీరియస్
యోగా గురువు రామ్దేవ్ బాబా మరోసారి చిక్కుల్లో పడ్డారు. యోగా క్లాసుల సందర్భంగా ఆయన చెప్పిన ఆర్థిక పాటాలపై సెబీ సీరియస్ అయ్యింది. అభ్యంతర వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలంటూ వివరణ అడిగింది. ఈ షేర్లు కొనండి కరోడ్పతి కండి ఇటీవల యోగా తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బాబా రామ్దేవ్ ప్రసంగించారు. ‘ ఈ సందర్భంగా మీ అందరికీ కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరంతా ఈ రోజే డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. స్టాక్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేందుకుద అన్నీ ఏర్పాట్లు చేసుకోండి. నేను చెప్పినప్పుడు రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి. అలా కొన్న వాటిని తిరిగి అమ్మడం , కొనడం వంటి పనులు చేయకండి. వాటిని కొన్న వెంటనే ‘సమాధి’ చేయండి. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోండి. పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయి’ అంటూ చెప్పారు. సెబీ సీరియస్ స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంస్థ నిర్వహిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం సరైన నైపుణ్యం, సర్టిఫైడ్కాని వ్యక్తులు షేర్ల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన సలహాలు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మార్కెట్పై అవగాహన లేని వారు తమ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కానీ బాబా రామ్దేవ్ ఈ నిబంధనను పట్టించుకోకుండా బహిరంగగా సలహా ఇవ్వడంపై సెబీ సీరియస్ అయ్యింది. దీనిపై రామ్దేవ్ బాబాను వివరణ కోరింది. సోయా రుచికి నోటీసులు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ సోయారుచికి ప్రమోటర్గా ఉంది. ఇటీవల అదనపు నిధులు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)కి వెళ్లేందుకు ఆగస్టులో సెబీ నుంచి అనుమతులు సాధించింది. త్వరలో ఈ సంస్థ ఎఫ్పీవో ద్వారా రూ. 4300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. అయితే ఇంతలో రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఈ సంస్థను చిక్కుల్లో పడేశాయి. రుచితో పాటు ఎప్పీవోకి మర్చంట్బ్యాంకర్లు ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. లభించని వీడియో కరోడ్పతి మంత్ర, సోయా రుచి షేర్లకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు రావడం తప్పితే సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా లభించడం లేదు. అయితే యోగా తరగతుల్లో బాబా మాట్లాడే సమయంలో కొందరు వీడియో తీశారని, ఆ ఫుటేజీ సెబీకి చేరిందని తెలుస్తోంది. సెబీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఆ వీడియోను తొలగించినట్టు సమాచారం. చదవండి : IIFL Wealth Hurun India 2021: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్జున్వాలా..అతని తర్వాతే..! -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్
స్టాక్మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ సెషన్ కూడా లాభాలతోనే ప్రారంభమైంది. ఇండియన్ బ్యాంక్ వార్షిక సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్కి బూస్ట్ని అందించాయి. అయితే రికార్డు స్థాయి హైలలో కొనసాగుతున్న సూచీలు ఏ క్షణమైనా కరెక్షన్ అవచ్చనే అభిప్రాయం కూడా మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఉదయం 9:15 గంటలకి బీఎస్ఈ సెన్సెక్స్ 321 పాయింట్లు లాభపడి 60,369 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రారంభంలో లాభాలు పొందిన వెంటనే పాయింట్లు నష్టపోయి 17,853 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. చదవండి : Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? -
ఈ కంపెనీ షేర్లు కొన్నవారి జాతకం మారిపోయింది
భవిష్యత్తు బాగుండాలంటే మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను పెట్టుబడిగా పెట్టడం ఉత్తమం అని పెద్దలు చెబుతుంటారు. ఈ పెట్టుబడి అనేది స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారం మొదలగు వాటిలో పెట్టవచ్చు. అయితే పెట్టుబడి వెనుక ప్రధాన ఉద్దేశం సంపద సృష్టించడం. పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే డబ్బుతో పిల్లల కళాశాల ఫీజులు, పెళ్ళిల్లు, సెలవులలో సరదాగా గడపడం, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరిగిపోతుంది. అయితే, ఈ పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపద ఎంత జాగ్రత్తగా సంపాదిస్తున్నామో అదేవిధంగా ఎందులో మనం పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా ముఖ్యం. అలాగే, డబ్బును కాపాడటం, అభివృద్ధి చేయడం అనేది ఒక ప్రత్యేక కళగా చెప్పుకోవాలి.(చదవండి: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో బంపర్ ఆఫర్లు) ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో వాటిలో వేగంగా రాబడి ఇచ్చేదీ ఏమైనా ఉంది అంటే? అది షేర్ మార్కెట్/ స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవాలి. అయితే, స్టాక్ మార్కెట్ మీద పూర్తి జ్ఞానం ఉన్న వాళ్లు అధిక లాభాలు గడిస్తారు. అందుకే, రాకేశ్ జున్జున్వాలా వంటి వారు కోట్లలో సంపదిస్తారు. స్టాక్ మార్కెట్ మీద పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ ఎంత లాభమో ఒక కంపెనీ షేర్ విలువ చూస్తే మీకే తెలుస్తుంది. కాంటినెంటల్ కెమికల్స్ అనే కంపెనీ స్టాక్ ధర కేవలం మూడు నెలల్లో దాదాపు 1,500% రాబడిని అందించింది. (చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా!) ఈ ఏడాది జూన్ 24, 2021న రూ.21.49గా ఉన్న షేర్ విలువ నేడు రూ.343.5కు పెరిగింది. అంటే, గత మూడు నెలల్లో 1,497.25% రిటర్న్లు ఇచ్చింది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే మీరు గనుక జూన్ 24 రూ.1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే అది నేడు రూ.15.98 లక్షలగా మారేది. అందుకే అంటారు చాలా మంది నిపుణులు ఒక్క రోజులో కోటీశ్వరుడు కావాలంటే షేర్ మార్కెట్ మాత్రమే అని. కానీ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. అర కొర జ్ఞానంతో పెట్టుబడులు పెడితే ఎక్కువ శాతం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు మార్కెట్ మీద పూర్తి జ్ఞానం సంపాదించకే చిన్న చిన్న అడుగులతో మీ ప్రస్థానాన్ని ప్రారంభించండి. -
స్టాక్ మార్కెట్లో అస్థిరత
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో దేశీ స్టాక్ మార్కెట్లో అస్థిరత నెలకొంది. క్రితం రోజు భారీ లాభాలతో ముగిసిన మార్కెట్ ఈ రోజు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతోంది. ఉదయం పది గంటల సమయానికి 10 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయి 58,992 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,562 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈ రోజు మార్కెట్లో టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ , సన్ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి షేర్లు లాభాలు పొందగా జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు ధర భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ ,టాటా స్టీల్, నెస్టల్ ఇండియా షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. చదవండి : స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య 8 కోట్లు, ఫ్రాన్స్ను వెనక్కి నెట్టిన భారత్ -
పుంజుకున్న స్టాక్ మార్కెట్.. లాభాలతో ముగింపు
ముంబై: స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది. ఈ సెషన్ తొలి రోజు భారీ నష్టాలను చవి చూసిన ఇన్వెస్టర్లు మంగళవారం తేరుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నా దేశీ సూచీలు లాభాల వైపు స్థిరంగా కదిలాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,630 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పొందింది. అయితే ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ మరోసారి నష్టాలు తప్పవనే పరిస్థితి ఎదురైంది. కనిష్టంగా 58,232 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు నమ్మకం చూపించడంతో క్రమంగా లాభపడుతూ ఓ దశలో 59,084 పాయింట్లను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 514 పాయింట్లు లాభపడి 59,005 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 17,564 పాయింట్ల దగ్గర ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు లాభాలను పొందగా మారుతి సుజూకి, బజాజ్ ఆటో, నెస్టల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ షేర్లు నష్టాలను చవి చూశాయి. చదవండి : ప్రతికూల పరిస్థితుల్లోనూ..లాభాల్లో స్టాక్ మార్కెట్లు -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై : స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాలతో ముగిసింది. దేశీ సూచీలు సరికొత్త ఎత్తులు తాకాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,482 పాయింట్లతో మొదలైంది.ఆ తర్వాత కొద్ది మొత్తంలో పాయింట్లు కోల్పోయినా నష్టాల్లోకి జారుకోలేదు. సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్ ముగిసే సమయానికి 69 పాయింట్ల లాభంతో 58,247 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,420 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 17,438 పాయింట్లను అత్యధిక స్థాయి టచ్ చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి 17,382 దగ్గర క్లోజయ్యింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం లాభాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రాలు ఉన్నాయి. నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి. చదవండి : ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం -
‘సిప్’కి జై కొడుతున్నారు
ముంబై: ఇంతకాలం చిట్టీలలో పొదుపు చేస్తూ, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టిన వారు తమ రూటు మార్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నెలవారీ చెల్లింపులు చేసే అవకాశం ఉండే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు క్రమంగా పెరుగుతున్న ఆధారణ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పెరిగిన ఆసక్తి కరోనా సంక్షోభం తర్వాత పొదుపు, పెట్టుబడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇదే సమయంలో ఇంటర్నెట్ వాడకం కామన్ అయ్యింది. దీంతో టెక్నాలజీని వాడుకుంటూ తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా మార్చేందుకు రిస్క్ తీసుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ, అయితే తక్కువ పెట్టుబడితో బ్లూ చిప్ కంపెనీల్లో షేర్ల కొనుగోలు కష్టంగా. దీంతో తక్కువ రిస్క్ కోరుకునే వారు మ్యూచ్వల్ ఫండ్స్కి మొగ్గు చూపేవారు. అయితే ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు తగ్గాయి. కేవలం రూ.8,666 కోట్ల రూపాయలే వచ్చాయి. అంతకు ముందు జులైలో ఈ మొత్తం రూ.22,583 కోట్లుగా నమోదు అయ్యింది. జోరుమీదున్న సిప్ నెలవారీగా చిట్టీలు కట్టినట్టు, ప్రతీ నెల ఈఎంఐలు చెల్లించినట్టు మ్యూచవల్స్ ఫండ్స్లో ప్రతీ నెల ఇన్వెస్ట్ చేయడాన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటారు. ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఒక సిప్ను ఎంచుకుంటే ప్రతీ నెలా కొంత మొత్తం మన అకౌంట్ నుంచి ఆయా కంపెనీలో పెట్టుబడిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రస్తుతం సిప్లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టులోనే సిప్కి సంబంధించిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏఎమ్యూ) విలువ రూ. 5.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం సిప్ ఏఎమ్యూ విలువ రూ.17.15 లక్షల కోట్లలో మూడో వంతుగా ఉంది. సిప్లపై చెల్లించే వడ్డీ ఆగస్టులో లైఫ్టైం హైకి చేరుకుని రూ.9,923 కోట్లుగా నమోదు అయ్యింది. ఆగస్టులోనే ఏకంగా 24.92 లక్షల కొత్త సిప్లు మొదలయ్యాయి. మెత్తంగా 4.32 కోట్ల సిప్లు ఉన్నాయి. సిప్లకు సంబంధించి అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్లో 53 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో మ్యూచవల్ ఫండ్స్లో పెట్టుబడులు తగ్గినా సిప్లో ఖాతాలు పెరగడం వల్ల ఓవరాల్గా మ్యూచ్వల్ ఫండ్ మార్కెట్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2021 ఆగస్టు నాటికి మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడులు 36.59 లక్షల కోట్లకు చేరుకుని ఆల్టైం హైని టచ్ చేశాయి. చదవండి: ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
Multi Bagger Stock : లక్ష పెట్టుబడి.. ఏడాదికల్లా రూ.9.94 లక్షల లాభం
ముంబై : షేర్ మార్కెట్లో అధిక లాభాలను అందించే స్టాక్లను పట్టుకోవడం ఓ కళ. కొందిరకే అందులో పట్టు ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందే ఆయా కంపెనీకలు సంబంధించిన పనితీరు, భవిష్యత్తులో రాబోయే మార్పులు, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాలను బేరీజు వేసుకుని పెట్టుబడులు పెడతారు. స్వల్ప కాలంలోనే భారీ లాభాలను చూస్తారు. ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్గా పాపులరైన ఎనేషనల్ స్టాండర్డ్ ఇండియా (ఎన్ఎస్ఐ) స్టాక్స్ గురించి కొన్ని వివరాలు. ఏడాదిలోనే లాభాల పంట మిడ్క్యాప్ షేర్గా ఎన్ఎస్ఐ బీఎస్ఈ స్టాక ఎక్సేంజీలో ట్రేడ్ అవుతోంది. గతేడాది సెప్టెంబరు 9న ఎన్ఎస్ఐ షేర్ విలువ కేవలం రూ. 298.60 మాత్రమే. అయితే ఆ రోజు నుంచి వరుసగా షేర్ విలువ పెరుగుతూనే పోయింది. ఐదో రోజు నుంచి మొదలైన షేరు విలువలో పెరుగుదల రెండోందల రోజు చేరుకునే సరికే రికార్డు స్థాయిలో 569 శాతం పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న షేరు 894 శాతం పెరిగి రూ. 2969.25 దగ్గర ట్రేడవుతోంది. ఉజ్జాయింపుగా గత సెప్టెంబరున లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఎన్ఎస్ఎల్ షేర్లు కొనుగోలు చేసిన వారికి సరిగ్గా ఏడాది తిరిగే సరికి దాని విలువల రూ.9.94 లక్షలకు చేరుకుంది. ఏ లెక్కన చూసినా ఏడాదిలో లక్షకు ఎనిమిది లక్షల లాభం తెచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్గా నిలిచింది. 52 వారాల్లో ఇదీ పరిస్థితి 2020 సెప్టెంబరు 9న ఎన్ఎస్ఐ షేరు విలువ రూ. 298.60 ఉండగా ఈ 52 వారాల వ్యవధిలో గరిష్టంగా ఆగస్టు 27న రూ. 3,820లకు చేరుకుంది. ఆగస్టులో ఈ కంపెనీ షేర్లు అమ్ముకున్న వారి మరింత లాభాలను సొంతం చేసుకున్నారు. స్టాక్ వ్యాల్యూ జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడంతో అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో 2021 సెప్టెంబరు 9న షేర్ వాల్యూ రూ.2969గా నమోదు అయ్యింది. ఎన్ఎస్ఐ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ది చెందిన లోదా గ్రూప్ సబ్సిడరీ కంపెనీ. చదవండి : ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
మార్కెట్లో అస్థిరత.. లాభ నష్టాల మధ్య ఊగిసలాట
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో దేశీ సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాలను చవి చూశాయి. ఆ వెంటనే పుంజుకుని లాభాల బాట పట్టాయి, గత కొంత కాలంగా కొనసాగిన పాజిటివ్ ట్రెండ్కి బ్రేక్ పడింది. మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,418 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ నిన్నటి ముగింపుతో పోల్చితే 17 పాయింట్లు నష్టపోయి 58,279 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత వెంటనే పుంజుకుంది. ఉదయం 9:20 గంటలకు 72 పాయింట్లు లాభపడి 58,351 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయినా తర్వాత కోలుకుని 17,362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. చదవండి: గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ -
మార్కెట్లో అస్థిరత.. లాభనష్టాల మధ్య సూచీల ఊగిసలాట
ముంబై: స్టాక్ మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్, ఏషియన్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు ఉండటంతో మార్కెట్ ప్రారంభం కావడంతోనే సెన్సెక్స్ అధికంగా పాయింట్లు లాభపడి ఆల్టైం హైకి చేరుకుంది.అయితే ఆ వెంటనే ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో క్రమంగా సెన్సెక్స్తో పాటు నిఫ్టీ కూడా పాయింట్లు కోల్పోతోంది. దేశీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,418 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పెరుగుతూ ఆల్టైం హై 58,459ని టచ్ చేసింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 58,269 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,401 పాయింట్ల వద్ద మొదలై వెంటనే నష్టాలను చవి చూసింది. ఒక దశలో 17,377 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ కోలుకుని ఉదయం పది గంటల సమయంలో 4 పాయింట్ల లాభంతో 17,381 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి: ఎన్ఆర్ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్ 19 వేదిక -
రెండో రోజు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ మద్దతుతో వరుసగా రెండవ రోజు రికార్డు స్థాయికి పెరిగాయి. చివరకు, సెన్సెక్స్ 662.63 పాయింట్లు(1.16%) పెరిగి 57,552.39 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 201.20 పాయింట్లు (1.19%) లాభపడి 17,132.20 వద్ద ముగిసింది. సుమారు 1434 షేర్లు అడ్వాన్స్ అయితే, 1537 షేర్లు క్షీణించాయి, 105 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.99 వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ మరియు శ్రీ సిమెంట్స్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ & గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.(చదవండి: ఇదేం టెక్నాలజీ! మన తారలకు చెప్పుకోలేని తలనొప్పి) -
బుల్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, రూపాయి బలపడడం, ఎఫ్డీఐల వెల్లువ మధ్య మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయి. ఇక చివరకు, సెన్సెక్స్ 765.04 పాయింట్లు (1.36%) పెరిగి 56,889.76 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 225.80 పాయింట్లు (1.35%) లాభపడి 16,931 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.28 వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్, దివిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియాలు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, టిసీఎస్ షేర్లు టాప్ లూజర్లలో ఉన్నాయి. ఐటి మినహా ఇతర అన్ని సూచీలు లాభాలతో ముగిశాయి.(చదవండి: ఓలా, టెస్లాకు పోటీగా సింపుల్ ఎనర్జీ సంచలన నిర్ణయం) -
దేశీ సూచీల జోరు .. లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికపు జీడీపీ గణాంకాలను కేంద్రం మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్ ఎఫెక్ట్ కారణంగా క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆటో సేల్స్ కూడా ఊపందుకుంటున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. రికార్డుల జోరు ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56,329 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పొందుతూ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. ఉదయం 10 గంటలకు 439 పాయింట్లు లాభపడి 56,564 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం జోరుమీదుంది. 123 పాయింట్లు లాభపడి 16,829 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత వారం 16,700 పాయింట్ల దగ్గర ఒడిదుడుకులు ఎదుర్కొన్న నిఫ్టీ ఈ సెషన్ ఆరంభంలోనే సునాయసంగా 16,800 పాయింట్లను క్రాస్ చేసింది. లాభాల బాట టైటాన్, టాటా స్టీల్, మారుతి సుజూకి, ఎంఅండ్ఎం, ఏషియన్ పేయింట్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సెర్వ్, భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాలను పొందాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. చదవండి: స్టాక్ మార్కెట్లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం -
స్టాక్ మార్కెట్లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారంలోనూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధిక ధరల వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయ డేటాతో పాటు ప్రపంచ పరిమాణాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేస్తాయని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా సూచీల ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. నిఫ్టీ పైపైకి ‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో సూచీల రికార్డు ర్యాలీ కొనసాగవచ్చు. లాభాల స్వీకరణ జరగకపోతే నిఫ్టీ 16,900 స్థాయిని అందుకుంటుంది. దిగువస్థాయిలో 16,550 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. మార్కెట్ను ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిశీలిస్తే.., క్యూ1 జీడీపీ గణాంకాలపైనే అందరి దృష్టి ... కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికపు (ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలను మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్ ఎఫెక్ట్ కారణంగా (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంచనాలు ఏమాత్రం తారుమారైనా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇతర స్థూల ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు... ఆటో కంపెనీలు ఆగస్ట్ వాహన విక్రయ గణాంకాలను బుధవారం విడుదల చేయనున్నాయి. దేశీయంగా కోవిడ్ ఆంక్షల సడలింపుతో ఉత్పత్తి ఊపందుకుంది. పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేతతో ఎగుమతులు పెరిగాయి. ఈ పరిణామాలతో ఆటో అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూలై నెల మౌలిక రంగ పనితీరు, ద్రవ్యలోటు గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఇక సెప్టెంబర్ 1వ తేదిన (బుధవారం) ఆగస్ట్ నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, ఆగస్ట్ మాసపు సేవల రంగపు డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. అదే శుక్రవారం ఆర్బీఐ ఆగస్ట్ 27వ తేదితో ముగిసే ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఈ వారంలో రెండు ఐపీఓలు... ఈ వారంలో ఒకే రోజున రెండు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ అమీ ఆర్గానిక్స్, హెల్త్ కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూలు సెప్టెంబర్ 1న మొదలై, మూడవ తేదీన ముగియనున్నాయి. ఈ రెండు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.2,465 కోట్లను సమీకరించనునున్నాయి. 4 నెలల తర్వాత తొలిసారి కొనుగోళ్లు నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ ఆగస్ట్లో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ ఆగస్టులో రూ.986 కోట్ల షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.13,494 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. అంచనాలకు కంటే ముందుగా వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో భారత్తో పాటు వర్థమాన దేశ మార్కెట్లలోకి చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ హెడ్ శ్రీవాస్తవ తెలిపారు. చదవండి : కేంద్రం చెబుతున్న మానిటైజేషన్తో ప్రయోజనం ఎవరికి ? ఆస్తుల నగదీకరణ ఎందుకు ? -
కోలుకున్న స్టాక్ మార్కెట్.. లాభాలతో ముగింపు
ముంబై : పెద్ద కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధించకుండా స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల అండతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను తప్పించుకుంది. అంతేకాదు మార్కెట్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్లకు లాభాలను సైతం అందివ్వగలిగింది. ఈ వారం చివరి సెషన్ చివరి భాగంలో మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. నష్టాల నుంచి లాభాల వైపు ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 55,862 పాయింట్లో మొదలైంది. కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 55,675 పాయింట్లను తాకింది. దీంతో ఈ సెషన్ నష్టాలతోనే ముగుస్తుందనే ఆందోలన నెలకొనగా ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్ కోలుకోవడం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పెరుగుతూ ఓ దశలో 56,188 పాయింట్లను టచ్ చేసింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 175 పాయింట్లు లాభపడి 56,126 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్ గరిష్ట, కనిష్ట పాయింట్ల మధ్య తేడా 513 పాయింట్లు ఉండటం గమనార్హం, మరోవైపు నిఫ్టీ సైతం ఆరంభంలో నష్టాల పాలైనా మార్కెట్ ముగిసే సమయానికి 68 పాయింట్లు లాభపడి 16,705 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ఫిన్కార్ప్, సన్ఫార్మా షేర్లు లాభాలు పొందాయి, చదవండి : కొత్త ఐటీ చట్టాలపై కోర్టుకెక్కిన వాట్సాప్, ఫేస్బుక్ -
Stock Market: ప్రారంభ లాభాలు ఆవిరి!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం ఒంటి గంటలకు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ సూచీల అస్థిరత మధ్య దేశీయ మార్కెట్ సూచీల ప్రారంభ లాభాలు ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకొని స్వల్ప లాభాలతో ఇంట్రాడే ముగిసింది. చివరకు సెన్సెక్స్ 4.89 పాయింట్లు (0.01%) పెరిగి 55,949.10 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 2.20 పాయింట్లు (0.01%) లాభపడి 16,636.90 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద నిలిచింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగియగా.. భారతి ఎయిర్ టెల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, మారుతి సుజుకి, హిందాల్కో ఇండస్ట్రీస్ పవర్ గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను చూశాయి.(చదవండి: బంగారం ధరలు: మరింత ప్రియం!) -
స్టాక్ మార్కెట్లో అస్థిరత... నష్టాలతో ముగింపు
ముంబై : స్టాక్మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీ సూచీలు మరోసారి ఆల్టైం హై దిశగా పయణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రెండో సారి 56 వేల పాయింట్లను క్రాస్ చేయగా నిఫ్టీ సైతం 16,700 పాయింట్లను క్రాస్ చేసింది. మధ్యాహ్నం వరకు పాయింట్లు పెరుగుతూ పోయిన మార్కెట్ ఆ తర్వాత క్రమంగా నష్టపోవడం మొదలైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో సాయంత్రానికి సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో క్లోజవగా నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిసింది. లాభాలు ఆవిరి ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 56,067 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో ఏకంగా 56,198 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత నష్టాలను చవి చూస్తూ 55,899 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 14 పాయింట్లు నష్టపోయి 55,944 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోసారి 56 వేల మార్క్ను కాపాడుకోలేకపోయింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 16,654 పాయింట్లతో ప్రారంభమై 16,712 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 10 పాయింట్ల లాభంతో 16,634 పాయింట్ల వద్ద ముగిసింది. లాభనష్టాలు నిఫ్టీలో అదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కో, కోల్ ఇండియా, ఓన్జీసీ షేర్లు లాభాలు పొందగా బజాజ్ ఫిన్ సర్వీస్, టైటాన్ కంపెనీ, మారుతి సుజూకి, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల పాలయ్యాయి చదవండి: కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్కే జై కొడుతున్నారు -
బుల్ జోరు.. మదుపర్లకు లాభాల పంట!
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఈ రోజు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ అండ అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండనుందన్న ఎస్బీఐ అంచనాలు మార్కెట్ సెంటిమెంటును బలోపేతం చేశాయి. దీంతో స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 403.19 పాయింట్లు (0.73%) పెరిగి 55,958.98 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 128.10 పాయింట్లు (0.78%) లాభపడి 16,624.60 వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నేటి మార్కెట్లో లాభపడితే.. బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా ఇతర అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.(చదవండి: పసి‘ఢి’ పోరుకు.. మేం సిద్ధం..) -
వంద బిలియన్ల క్లబ్లోకి మరో భారతీయ కంపెనీ
Infosys:టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ అరుదైన రికార్డు సాధించింది. ఐటీ సేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ మరో రేర్ ఫీట్ను సొంతం చేసుకుంది. ఇండియా నుంచి వంద బిలియన్ డాలర్ల విలువైన కంపెనీల సరసన చేరింది. పెరిగిన షేర్ ధర ఈ ఏడాది ఆరంభం నుంచి షేర్ మార్కెట్ జోరుమీదుంది. ఫిబ్రవరిలో బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 50 వేల మార్క్ని దాటితే ఆగస్టులో 56 వేలు క్రాస్ చేసింది. అయితే ఇందులో ఎక్కువగా లాభపడింది ఐటీ కంపెనీలే. దీంతో గత కొంత కాలంగా ఐటీ కంపెనీల ఆస్తుల విలువ పెరుగుతోంది. మంగళవారం మార్కెట్లో ఇన్ఫోసిస్ ఒక షేర్ వాల్యూ ఒక శాతం పెరగింది. దీంతో ఒక షేర్ విలువ రికార్డు స్థాయిలో రూ.1,755.60కి చేరుకుంది. వంద బిలియన్ల క్లబ్లోకి దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో రెండవదిగా ఇన్ఫోసిస్కి గుర్తింపు ఉంది. బ్లూ చిప్ కేటగిరికి చెందిన ఇన్ఫోసిస్ షేర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజగా ఒక షేర్ వాల్యూ రూ.1,755.60కి పెరిగిపోవడంతో కంపెనీ విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది. ఇండియన్ కరెన్సీలో ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 7.45 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. నాలుగో కంపెనీ ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం మూడు వ్యాపార సంస్థల విలువ వంద బిలియన్ డాలర్లను దాటింది. అందులో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీలు ఉన్నాయి. వాటి తర్వాత వంద బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన నాలుగో సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. చదవండి : వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ -
స్థిరంగా స్టాక్ మార్కెట్.. ఫ్లాట్గా కొనసాగుతున్న సూచీలు
ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా మార్కెట్ ఆరంభంలో భారీ స్థాయిలో లాభాలు ఉంటుండగా ఈ రోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీకి 56,000 దగ్గర ఎన్ఎస్ఈ నిఫ్టీకి 16,700 పాయింట్ల దగ్గర గట్టి నిరోధత ఎదురవుతోంది. గత సెషెన్స్లో ఆల్టైం హై పాయింట్లను టచ్ చేసిస సూచీలు తిరిగి ఆ స్థాయిలను ఇంకా అందుకోలేదు. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 55,647 పాయింట్లతో మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి కేవలం 4 పాయింట్లు లాభపడి 55,560 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీలో ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 16,532 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి : One Plus Buds Pro: స్ట్రెస్ను తగ్గించే ఇయర్ బడ్స్, ధర ఎంతంటే -
లాభాలతో ఆరంభమైన స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లో మరోసారి సానుకూల వాతావరణం నెలకొంది. మార్కెట్ ప్రారంభం అవడం ఆలస్యం ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిండంతో వరుసగా లాభాలు పొందుతూ పోయింది. మార్కెట్ మొదలైన అరగంటకే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి. గత వారం చివర్లో నష్టపోయిన పాయింట్లను తిరిగి పొందే ప్రయత్నం చేశాయి. అయితే అంతలోనే చెరో యాభై పాయింట్లు కోల్పోయాయి. అంతర్జాతీయ, ఏషియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం కారణంగానే దేశీ సూచీలు లాభాలను చూపిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 55,695 పాయింట్ల మొదలైంది. ఆ వెంటనే వరుసగా పొయింట్లు పొందుతూ ఉదయం 9:45 గంటల సమయంలో 363 పాయింట్లు లాభపడి 55,693 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 16,550 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్ సూచీలు ఇదే జోరు కొనసాగిస్తే గత వారం నమోదు చేసిన ఆల్టై హై పాయింట్లను టచ్ చేసే అవకాశం ఉంది. చదవండి: Fund Review : రిస్క్ తట్టుకుంటే రాబడులు -
నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్... భారీగా పతనమైన సెన్సెక్స్
ముంబై: అమెరికాలో ద్రవోల్బణం ఎక్కువగా ఉందంటూ ఫెడరల్ రిజర్వ్ , యూఎస్ఏ చేసిన ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి. ఏసియా మార్కెట్లలో అస్థిరత నెలకొంది. దాని ప్రభావం దేశీ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు ముగిసే వరకు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు నిఫ్టీలు వరుసగా పాయింట్లు కోల్పోతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 55,159వ పాయింట్లతో ప్రారంభమైంది. వెంటనే పాయింట్లూ కోల్పోతూ నష్టాల దిశగా వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొద్ది సేపు మాత్రం గరిష్టంగా స్థాయిలకు చేరుకుని 55,543 పాయింట్ల దగ్గర ట్రేడయ్యింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 380 పాయింట్లు నష్టపోయి 55,248 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 150 పాయింట్లు నష్టపోయి 16,418 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్యాంకుషేర్లు నష్టాలపాలయ్యాయి. బ్లూచిప్ కంపెనీగా పేర్కొనే టాటా స్టీల్ షేర్లు సైతం నష్టాల బారిన పడ్డాయి. కోటక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, లార్సెన్ అండ్ ట్రూబో షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, మారుతి, హెచ్యూఎల్ షేర్లు లాభపడ్డాయి. చదవండి: ఫోన్ కంపెనీలకు గూగుల్ భారీ ఆఫర్.. సీక్రెట్ కాంట్రాక్ట్లపై ఆగ్రహం -
బుల్ జోరుకు బ్రేకులు.. నష్టాలతో ముగిసిన మార్కెట్
ముంబై : రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో గత నాలుగు సెషన్లుగా జోరు కొనసాగిస్తున్న బుల్కి బ్రేకులు పడ్డాయి. ప్రారంభం భారీ లాభాలతో మొదైలన మార్కెట్ మధ్యాహ్ననం సమయానికి నష్టాల దిశగా వెళ్లింది. అయితే మార్కెట్ మరి కొద్ది సేపట్లో ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు నమ్మకం కనబరచడంతో మార్కెట్ కొంత మేర కోలుకుంది కొత్త రికార్డులు దేశీ సూచీలు ఈ రోజు మార్కెట్లో కొత్త ఎత్తులకు చేరాయి. సెన్సెక్స్ 57 వేల మార్క్ని టచ్ చేయగా నిఫ్టీ 16,700 మార్క్ని అందుకుంది. ఆగస్టు 13న సెన్సెక్స్ 55 వేలు క్రాస్ చేయగా కేవలం నాలుగు సెషన్స్లోనే రికార్డులు బద్దలు కొడుతూ ఆగస్టు 18న 56 వేలు క్రాస్ చేసింది. అంతకు ముందు 54,000 నుంచి 55,000కి రావడానికి ఏడు సెషన్లు, 53,000 నుంచి 54 వేలకి రావడానికి 30 సెషన్ల సమయం తీసుకుంది. ఇక 52,000 నుంచి 53,000లు టచ్ చేసేందుకు ఏకంగా 85 సెషన్లు పట్టింది. ఈ ఏడాదిలో ఈ వారమే సెన్సెక్స్ అత్యధిక పాయింట్లు పొందింది. మరోవైపు నిఫ్టీ సైతం రికార్డులు బద్దలు కొడుతూ 16,700 మార్క్ని దాటింది. ఆ తర్వాత మార్కెట్ ఒత్తిడి లోను కావడంతో ఇటు నిఫ్టీ, అటు సెన్సెక్స్లు తమ రికార్డులను నిలబెట్టుకోలేక పోయాయి. ఇకపై మార్కెట్లో బుల్ ట్రెండ్ కొనసాగాలంటే లార్జ్ క్యాప్ షేర్లు ప్రభావం చూపించాల్సి ఉంటుంది. నష్టాలతోనే ముగింపు ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 56,073 పాయింట్లతో ప్రారంభమైంది. ఒక దశలో 56,118 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 55,514 పాయింట్లకు పడిపోయంది. మార్కెట్ ముగిసే సమయానికి కొంత మేర కోలుకుని 162 పాయింట్లు నష్టపోయి 55,629 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ సైతం 45 పాయింట్లు నష్టపోయి 16,568 పాయింట్ల వద్ద ముగిసింది. -
ఆల్టైం హై టచ్ చేసిన సెన్సెక్స్... స్టాక్మార్కెట్లో బుల్ జోరు
ముంబై: స్టాక్మార్కెట్లో కొనసాగుతున్న బుల్జోరు ఇప్పుడప్పిడే ఆగేలా లేదు. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడులకు తట్టుకుంటూ కొత్త ఎత్తులను చేరుతున్నాయి. మంగళవారం రోజు సెన్సెక్స్ ఒక దశలో రికార్డు స్థాయిలో పాయింట్లు లాభపడి 55,854 పాయింట్లను టచ్ చేసి రికార్డు సృష్టించింది. కరోనా కట్టడిలో ఉండటంతో పాటు ఆఫ్ఘన్ వ్యవహరంలో అమెరికా స్థిరమైన అభిప్రాయానికి కట్టుబడి ఉండటంతో అంతర్జాతీయ సూచీలు స్థిరంగా కదలాడుతున్నాయి. దీనికి దేశీ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణం కలిసి వచ్చింది. ఫలితంగా ప్రారంభంలో దేశీ సూచీలు నష్టాలను చవి చూసినా ఎప్పటిలాగే తిరిగి కోలుకుని లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 55,565 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లు కోల్పోతూ 55,386 పాయింట్లను తాకింది. ఇక మార్కెట్లో కరెక్షన్ మొదలైందని అనుకునేలోగా ఒక్కసారిగా పుంజుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 209 పాయింట్లు లాభపడి 55,792 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 51 పాయింట్లు లాభపడి 16,614 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్మహీంద్రా, టీసీఎస్, నెస్టల్ ఇండియా, టైటాన్ కంపెనీ, హిందూస్థాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ కంపెనీల షేర్లు సెన్సెక్స్లో లాభాలు పొందాయి. మరోవైపు ఇండస్ఇండ్బ్యాంకు, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటాస్టీల్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 0.6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఐటీ 2.57 శాతం పెరిగింది. -
జోరు తగ్గని స్టాక్ మార్కెట్... లాభాల్లో సూచీలు
ముంబై : ఈ వారం లాభాలతో మార్కెట్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల దిశగా ప్రయాణించిన మార్కెట్ ఆ తర్వాత పుంజుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు మార్కెట్పై నమ్మకం చూపించడంతో పాటు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టిందంటూ వార్తలు వెలువడంతో మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. ద్రవ్యోల్బణ ప్రమాదం లేదని తేలడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 55,479 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లను కోల్పోయింది. ఓ దశలో ఏకంగా 55,281 పాయింట్లకు పడిపోయింది. ఇక ఇన్వెస్టర్లకు నష్టాలు తప్పవనుకునే క్రమంలో మళ్లీ పుంజుకుంది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 145 పాయింట్లు లాభపడి 55,582 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 34 పాయింట్లు లాభపడి 16,563 పాయింట్ల వద్ద ముగిసింది. టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్ సర్వీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభపడ్డాయి. మారుతి సుజూకి, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, అల్ర్టాటెక్ సిమెంట్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి -
నష్టాలతో మొదలైన మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెట్టడంతో ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సూచీలు వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. దేశీయంగా మార్కెట్పై ప్రభావం చూపే నిర్ణయాలు, సంఘటనలు చోటు చేసుకోకపోయినా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. గత వారం మొత్తం బుల్ జోరు కొనసాగగా.. ఈ వారం నష్టాలతో మార్కెట్ మొదలైంది. ఈరోజు ఉదయం సెన్సెక్స్ 55,479 పాయింట్లతో మొదలైంది. మార్కెట్ ప్రారంభైమంది మొదలు ఒత్తిడి లోనైంది. వరుసగా పాయింట్లు కొల్పోతూ వస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో 54 పాయింట్లు నష్టపోయి 55,383 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం నష్టాల దిశగానే ప్రయాణం చేస్తోంది. 40 పాయింట్లు నష్టపోయి 16,499 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు లాభాలు పొందగా బజాజ్ ఆటో , పవర్ గ్రిడ్, మారుతి, టైటాన్, ఏషియన్ పెయింట్ షేర్లు సెన్సెక్స్లో నష్టాలను చవి చూశాయి. -
బుల్ జోరు...స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులు
ముంబై: బుల్ రంకెలు వేయడంతో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కింది. దేశీ సూచీలు సరికొత్త ఎత్తులకు చేరుకున్నాయి. బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఉదయం మొదలైన జోరు సాయంత్రం మార్కెట్ ముగిసే వరకు కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సూచీ జోరు తగ్గడం లేదు. ఆగస్టు మొదలైనప్పటి నుంచి సెన్సెక్స్ సూచీ పైకి చేరుకుంటూనే ఉంది. అదో ఊపులో శుక్రవారం యాభై ఐదు వేల మార్క్ని క్రాస్ చేసింది. ఈరోజు ఉదయం 54,91 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓ దశలో 55,847 పాయింట్లను తాకింది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 593 పాయింట్లు లాభపడి 55,437 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ సైతం ఇదే జోరు కొనసాగించింది. ఈరోజు ఉదయం 16,385 పాయింట్లతో ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి 164 పాయింట్లు లాభపడి 16,529 పాయింట్లకు చేరుకుంది. ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్లో టాటా కన్సుమర్ ప్రొడక్ట్ షేర్లు అత్యధిక లాభం పొందగా ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలు పొందాయి. టెక్మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా షేర్లు నష్టాలను చవి చూశాయి. బ్యాంక్ నిఫ్టీ అర శాతం పైకి చేరుకుంది. -
స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. ఆల్టైం హై టచ్ చేసిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణానికి విదేశీ ఇన్వెస్టర్లు తోడవడంతో షేర్ మార్కెట్లో రికార్డులు బద్దలవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఆల్టైం హై పాయింట్లను టచ్ చేశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,641 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మొదలు పెట్టడంతో వరుసగా పాయింట్లు లాభపడుతూ పోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో 54,874 పాయింట్లను టచ్ చేసింది. చాలా సేపు అక్కడే కొనసాగింది. ఇక మార్కెట్ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా కొద్దిగా నెమ్మదించింది. మొత్తంగా ఈ రోజు సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 54,843 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీలోనూ ఇదే జోరు కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి 83 పాయింట్లు లాభపడి 16,364 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా నిఫ్టీ ఆల్టైం హై పాయింట్లు సాధించింది. -
ఫ్లాట్గా ప్రారంభం.. నష్టాలతో ముగింపు
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ బుధవారం చివరి గంటలో నష్టాలను మూటగట్టుకుంది. మరో గంటలో మార్కెట్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఉత్సాహం చూపటడంతో సెన్సెక్స్ ఒత్తిడికి లోనైంది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 54,730 పాయింట్లతో ప్రారంభమయ్యింది. తొలి గంట సేపు పాయింట్లను పొందుతూ ఒక దశలో గరిష్టంగా 54,758 పాయింట్లను తాకింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు సూచీ ఫ్లాట్గానే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువై పోవడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలుపెట్టింది. చివరకు మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 28 పాయింట్లు నష్టపోయి 54,525 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం నష్టాల దిశగా పయణించినా చివరి అరగంటలో కోలుకుంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి కేవలం రెండు పాయింట్లు లాభపడి 16,282 పాయింట్ల వద్ద ఆగిపోయింది. టాటీ స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు పొందగా కోటక్ మహీంద్రా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, నెస్టల్ షేర్లు నష్టాలు పొందాయి. బ్యాంకు నిఫ్టీ కిందివైపు 0.63 శాతం నమోదైంది. -
రెండోరోజు అదే జోరు.. లాభాల్లో మార్కెట్
ముంబై: ఐటీ, బ్యాంకు షేర్లు లాభాలు అందిస్తుండటంతో స్టాక్ మార్కెట్ జోరు తగ్గడం లేదు. మంగళవారం కూడా మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరుగుతూ పోయాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 54,461 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లూ పుంజుకుంటూ పైపైకి పోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో 214 పాయింట్లు లాభపడి 54,617 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 16,274 పాయింట్ల వద్ద మొదలై 60 పాయింట్లు లాభపడి 16,317 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. -
మార్కెట్లో అస్థిరత.. చివరకు లాభాలతో ముగింపు
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం నుంచే దేశీ సూచీలు లాభాల బాటలో పయణించాయి. మధ్యలో కొంత వరకు ఊగిసలాడినా చివరకు లాభాలతోనే ఈ రోజు మార్కెట్ ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,385 పాయింట్ల వద్ద ట్రేడ్ మొదలైంది. మొదటి గంటలోనే దాదాపు 250 పాయింట్లు లాభపడింది. ఓ దశలో గరిష్టంగా 54,584 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలుపెట్టడంతో మళ్లీ పాయింట్లు కోల్పోవడం మొదలైంది. మార్కెట్ ముగిసే సమయానికి 125 పాయింట్ల లాభంతో 54,402 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ ఈ రోజంతా ఒడిదుడుకులకు లోనైంది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత లాభాల బాటలో పయణిస్తూ ఓ దశలో గరిష్టంగా 16,320 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత నష్టపోతూ కనిష్టంగా 16,203 పాయింట్లను తాకింది. మరికొద్ది సేపట్లో మార్కెట్ ముగుస్తుందనగా కోలుకుని 20 పాయింట్ల లాభంతో 16,258 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. -
లాభాలతో మొదలైన మార్కెట్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్పై ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచడంతో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లో మొదలైంది. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,385 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో వరుసగా పాయింట్లు పొందుతూ పైపైకి చేరుకుంది. ఉదయం 9:50 గంటల సమయంలో 253 పాయింట్లు లాభపడి 54,531 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ సైతం 64 పాయింట్లు లాభపడి 16,302 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్లో ఎంఅండ్ఎం, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభాలు పొందగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల పాలయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ లాభం పొందగా ఆటో నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ నష్టపోయింది. గత వారం ఐపీవోకి వచ్చిన రోలేక్స్ రింగ్స్ షేర్లు 130 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ సాధించాయి. ఈవారం నిర్మా గ్రూపు నుంచి నువోవో విస్టా, కార్ ట్రేడ్లు ఐపీవోకి వస్తున్నాయి. -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్మార్కెట్ అస్థిరతకు లోనైంది. రోజంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడింది, చివరకు ఈవారాన్ని నష్టాలతో ముగించింది. గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో లాభాలు అందించిన మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తున్నా.. రిపోరేటు, రివర్స్ రిపోరేటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. బీఎస్సీ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,492 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే స్వల్ప నష్టాలపాలైన వెంటనే కోలుకుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే రెండు వందలకు పైగా పాయింట్లు నష్టపోయి 54,210 పాయింట్లకు పడిపోయింది, ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 215 పాయింట్లు నష్టపోయి 54,277 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం ఒడిదుడుకులకు లోనైంది. చివరకు 56 పాయింట్లు నష్టపోయి16,238 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫ్ఫ్యూచర్ గ్రూపు వివాదంలో రిలయన్స్కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత ఆల్ట్రాటెక్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు లాభాలు పొందాయి. ఇక ఈ రోజు లాభపడిన షేర్లలో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజూకి ఇండియాలు ఉన్నాయి. -
స్థిరంగా స్టాక్ మార్కెట్.. స్వల్ప లాభాల్లో సూచీలు
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు భారీ లాభాలను చూసిన స్టాక్ మార్కెట్ శుక్రవారం స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఈ వారం ప్రారంభం నుంచి రికార్డు స్థాయిలో లాభాలు చూసిన మార్కెట్లో కరెక్షన్ ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే శుక్రవారం ఉదయం నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉండగా. సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో మొదలై.. ఆ వెంటనే కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్తో పాటు ఏషియా మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలు ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో శుక్రవారం మార్కెట్ ఫ్లాట్గా కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,492 పాయింట్లతో మొదలైంది. కొద్ది సేపటికి కేవలం 2 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 11 పాయింట్లు లాభపడి 54,504 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 16,301 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు మార్కెట్లో గ్లెన్మార్క్ లైఫ్ సెన్సైన్స్ లిస్ట్ అయ్యింది. పదిహేను వందల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ కంపెనీ స్టాక్మార్కెట్లోకి వచ్చింది. -
సెన్సెక్స్ ఆల్టైం రికార్డు
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. దీంతో నిఫ్టీ సరికొత్త రికార్డులు నెలకొల్పిన మరుసటి రోజే సెన్సెక్స్ కూడా అదే పని చేసింది. 54,000 వేల పాయింట్లను బుధవారం అవలీలగా దాటేసింది. 54,000 క్రాస్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. నెలన్నర రోజుల్లో తన ఖాతాలో మరో వెయ్యి పాయింట్లు జమ చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 50వేల మార్క్ని దాటిన సెన్సెక్స్ జూన్ 22న సెన్సెక్స్ పాత రికార్డులు బద్దలు కొడుతూ 53 వేల మార్క్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత 54 వేలు చేరడానికి కేవలం 30 సెషన్లు మాత్రమే తీసుకుంది. బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు సెన్సెక్స్ సూచీ పైకి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 546 పాయింట్లు లాభపడి 54,369 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఓ దశలో 54,465 గరిష్ట పాయింట్లకు చేరుకుంది. నిన్న పదహారు వేల మార్క్ని క్రాస్ చేసిన నిఫ్టీ ఈ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగించింది. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 122 పాయింట్లు లాభపడి 16,253 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. పాజిటివ్ ట్రెండ్ జూన్ నెలలో వివిధ కంపెనీలు ప్రకటించిన క్వార్టర్ ఫలితాలు ఆశజనకంగా ఉండటంతో మార్కెట్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కోవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత స్మాల్, మిడ్క్యాప్ కంపెనీలు వ్యాపారాలు పుంజుకున్నాయి. మరోవైపు కోవిడ్ వ్యాప్తి కంట్రోల్లోనే ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్పై ఆసక్తి చూపించారు. లాభపడ్డ షేర్లు హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుల షేర్లు లాభాలు పొందగా టైటాన్, నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ కంపెనీలు సెన్సెక్స్లో నష్టాలు పొందాయి. మరోవైపు మార్కెట్లో బులట్రెండ్ కొనసాగుతుండటంతో స్మాల్క్యాప్, మిడ్క్యాప్ షేర్లు లాభపడ్డాయి. -
నిఫ్టీ రికార్డ్ ... 16 వేలు క్రాస్.. లాభాల్లో ఇన్వెస్టర్లు
ముంబై: ఇన్వెస్టర్లు లాభాలబాట పట్టారు. శరవేగంతో సెస్సెక్స్ పైపైకి చేరుకుంది. నిఫ్టీ తొలిసారిగా పదహారువేల మార్క్ను దాటింది. మొత్తంగా మంగళవారం మార్కెట్లో మంగళకర ఫలితాలు వెలువడ్డాయి. గతవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ మార్కెట్ ఈ రోజు రికార్డు సృష్టించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ రెండు ప్రధాన సూచీలు జీవితకాల గరిష్ఠాలను టచ్ చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ తొలిసారి 16 వేల మార్క్ను దాటింది. సెన్సెక్స్ దూకుడు బాంబే స్టాక్ ఎక్సేంజీలో ఈ రోజు సెన్సెక్స్ 52,125 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా లాభాలు పొందుతూ పోయింది, మార్కెట్ ముగిసే సమయానికి 872 పాయింట్లు లాభపడి 53,823 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 937 పాయింట్లు లాభపడి 53,887 పాయింట్లను టచ్ చేసింది. యాభై నాలుగు వేల మార్క్ని క్రాస్ చేస్తుందా అన్నట్టుగా సెన్సెక్స్ దూకుడు కొనసాగింది. నిఫ్టీ రికార్డు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ తొలిసారిగా పదహారు వేల మార్క్ని దాటింది. ఈ రోజు ఉదయం 15,951 పాయింట్లతో మార్కెట్ ప్రారంభమయ్యింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో నిఫ్టీ క్రమంగా పైపైకి చేరుకుంటూ పదహారు వేల మార్క్ని దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి 245 పాయింట్లు లాభపడి 16,130 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల బాట ఈ రోజు మార్కెట్లో మెటల్ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ 30 సూచీలో టైటన్, టైటన్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, సన్ఫార్మా, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎన్టీపీసీ నష్టాలు చవిచూశాయి. సానుకూల సంకేతాలు కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే సంకేతాలు ఇవ్వడం, ఆగస్టులోకి ప్రవేశించినా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండటంతో ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి తోడు మాన్యుఫ్యాక్కరింగ్ సెక్టార్ మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడం కూడా మార్కెట్కి ఊతం ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుడులు పెట్టేందుకు పోటీ పడ్డారు. -
నిఫ్టీ పదహారువేల మార్క్ దాటేనా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలే ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు. పైన పేర్కొన్న అంశాలతో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ.., ప్రాథమిక మార్కెట్లో ఐపీఓలకు లభిస్తున్న అపూర్వ ఆదరణతో స్టాక్ మార్కెట్లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కొనసాగుతోంది. ఈ వారంలోనూ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవ్వొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. దిగువస్థాయిలో 15,600 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో దేశీయ మార్కెట్ రెండోవారమూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆటో, బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో గతవారంలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను నష్టపోయాయి. అందరి చూపు ఆర్బీఐ వైపు... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం(ఆగస్ట్ 4న) ప్రారంభం కానుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను ఆగస్ట్ ఆరున ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత్దాస్ వెల్లడించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చని ఆర్థివేత్తలు భావిస్తున్నారు. అయితే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఆర్బీఐ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాలు... ఆటో కంపెనీలు జూలై వాహన విక్రయ గణాంకాల విడుదలను ఆగస్ట్ ఒకటి నుంచి వెల్లడించడం షురూ చేశాయి. పలు కంపెనీలు వాహన ధరల్ని పెంచిన నేపథ్యంలో వాహన అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం ఉండొచ్చు. కావున ఈ రంగ స్టాకులు అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వొచ్చు. ఇక ఆగస్ట్ రెండో తేదిన (సోమవారం) జూలై నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, జూన్ మాసపు తయారీ రంగపు డాటా 4వ తేదిన(బుధవారం) వెల్లడికానున్నాయి. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అవంతీ ఫీడ్స్, అల్కేమ్ అమైన్స్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, సిప్లా, డాబర్, ఇమామీ, ఎస్కార్ట్స్, గెయిల్, గ్లెన్మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, వోడాఫోన్ ఐడియా, నాల్కో, ఇన్ఫోఎడ్జ్, పీఎన్బీ, ఎస్బీఐ, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్ వంటి ప్రధాన కంపెనీలు వాటి జూన్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను వెల్లడించనున్నాయి.ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. నాలుగు ఐపీఓలు... ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో ఒకేరోజు నాలుగు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయాగ్నటిక్స్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.3,614 కోట్లను సమీకరించనునున్నాయి. ఈ ఐపీఓలు ఆగస్ట్ నాలుగవ తేదీ (బుధవారం)న ప్రారంభమై.., ఎనిమిదో తేది (శుక్రవారం) ముగియనున్నాయి. ఆగస్ట్ 6న గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ లిస్టింగ్... హెల్త్కేర్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ షేర్లు శుక్రవారం(ఆగస్ట్ 6న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓను ఈ జూలై 27– 29 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 695–720 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,514 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓ చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.720తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.130–150 మధ్య ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. నాలుగో నెలలో అమ్మకాలే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర అమ్మకందారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ జూలైలో రూ.23,193 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గతేడాది మార్చి నెల తర్వాత ఎఫ్ఐఐలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలకు పాల్పడటం ఇదే తొలిసారి. గతవారంలో ఏకంగా రూ.10,288 విలువైన షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు ధీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతూ సూచీలకు భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ఈ నెలలో డీఐఐ రూ.18,394 కోట్ల షేర్లను కొన్నారు. గత ఒక్క వారంలోనే రూ.8,206 కోట్ల షేర్లను కొన్నారు -
రిస్క్ తక్కువ,.. రాబడి ఎక్కువ...
మన రోజువారి అవసరాలు తీర్చే బహుల జాతి కంపెనీలు (ఎంఎన్సీలు) పెట్టుబడుల విషయంలో.. ఎంతో విశ్వసనీయంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంఎన్సీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే (థీమ్యాటిక్) పథకాలను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్ఎసీ ఫండ్ కూడా ఒకటి. ఈక్విటీల్లో తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఎంఎన్సీ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ పెట్టుబడుల విషయంలో మూడు రకాల విధానాలను అనుసరిస్తుంటుంది. భారత్కు చెందిన బహుళజాతి సంస్థలు (మన దేశంలో లిస్ట్ అయ్యి విదేశాలకూ వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన కంపెనీలు), భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇక్కడి స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్ట్ అయిన విదేశీ కంపెనీలు, భారత్లో లిస్ట్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఈ పథకం పెట్టబడులకు ఎంపిక చేసుకుంటుంది. వినియోగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, మెటల్స్, ఐటీ, సిమెంట్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించిన ఎంఎన్సీ కంపెనీలు పోర్ట్ఫోలియోలో భాగంగా ఉంటాయి. బహుళజాతి సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్లో అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తుంటాయి. నిపుణుల ఆధ్వర్యంలో డైనమిక్గా పనిచేస్తుంటాయి. లాభాల నుంచి వాటాదారులకు ఎక్కువ డివిడెండ్ కూడా పంచుతుంటాయి. కనుక స్థిరమైన రాబడులకు వీటిని మార్గంగా నిపుణులు పరిగణిస్తుంటారు. బలమైన బ్రాండ్, దండిగా నగదు నిల్వలు ఎంఎన్సీ కంపెనీల్లో చూడొచ్చు. అందుకే పరిణతి కలిగిన ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో ఎంఎన్సీ కంపెనీలకు చోటిస్తుంటారు. ఈ తరహా లక్షణాలు ఉండడం వల్ల ఇతర రంగాల థీమ్యాటిక్ పథకాలతో పోలిస్తే ఎంఎన్సీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ తక్కువ అస్థిరతలను ఎదుర్కొంటుంటాయి. సెబీ నిబంధనల మేరరు ఎంఎన్సీ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతం పెట్టుబడులను బహుళజాతి కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ మేరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎంఎన్సీ పథకాల్లోనూ సైక్లికల్ (రాబడుల్లో స్థిరత్వం లేని), డిఫెన్సివ్ (స్థిరమైన రాబడులతో రక్షణాత్మకమైనవి) ఉంటాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ పథకం 20 శాతం పెట్టుబడులను అంతర్జాతీయ ఎంఎన్సీలకు కేటాయించింది. వీటిల్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీలున్నాయి. దేశీయ ఎంఎన్సీ కంపెనీల విషయానికొస్తే.. ఈ పథకం పెట్టుబడుల్లో 61 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 26.5 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియో మొత్తం మీద వైవిధ్యంతో కూడుకుని ఉంది. దేశీయ కంపెనీల్లో కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, సాఫ్ట్వేర్, ఆటో, పారిశ్రామిక ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ రంగానికి చెందినవి ఉన్నాయి. రాబడులు పెట్టుబడుల విషయంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ మంచి పనితీరే చూపిస్తోంది. ఈ పథకానికి దీర్ఘకాల రాబడుల చరిత్ర లేదు. ఎందుకంటే 2019 జూన్లో ప్రారంభమైంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 28 శాతంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. మెరుగైన రాబడులుగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంచ్మార్క్తో పోల్చి చూసినా లేక ఎంఎన్సీ థీమ్యాటిక్ విభాగం రాబడులతో చూసినా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ రాబడులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. -
రెండో రోజు నష్టాలతోనే ప్రారంభం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాలను తోడు థర్డ్వేవ్ భయాలు వెంటాడుతుండటంతో అమ్మకాలకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు సూచీలు నష్టాలతోనే మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయంలో 301 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 52,252 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిన్న సెన్సెక్స్ 52,553 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు 52,432 పాయింట్లతో మొదలైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 15,652 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పేయింట్స్, పవర్గ్రిడ్ షేర్లు లాభాలు పొందగా హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
పాజిటివ్ మోడ్లో స్టాక్ మార్కెట్
దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. అయితే సెన్సెక్స్ నిన్నటి ఆల్టైం హై రికార్డును నిలుపుకోలేకపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ పైకి దూసుకుపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ నిన్నటి కంటే కొంచెం తక్కువగా 52,700ల కిందికి చేరుకుంది. ఎన్ఎస్సీ నిఫ్టీ సూచీ 15,800 దగ్గర నమోదైంది. లాభాల బాటలో సెన్సెక్స్ సూచీలో ఇండస్ఇండ్ బ్యాంకు అత్యధిక లాభాలు ఆర్జించగా ఆ తర్వాత స్థానంలో మారుతి, సుజూకి, టైటాన్, హెయూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఉన్నాయి. నిఫ్టీలో ఫార్మా సూచీలు పైకి ఎగబాకుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ స్వల్పంగా 0.13 పైకి చేరుకుంది. చదవండి : షేర్ మార్కెట్.. సెన్సెక్స్ ఆల్టైం రికార్డు -
నాలుగు రోజుల్లో భారీగా నష్టపోయిన గౌతమ్ అదానీ.. ఎంతంటే?
భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 2021 ఏడాదిలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లూ భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఏడాదిలో ఏ మేరకు లాభపడ్డాయో ఎన్ఎస్డీఎల్ సమస్య తర్వాత నాలుగు రోజుల్లోనే అంతేస్థాయిలో కుప్పకూలాయి. దీంతో కేవలం నాలుగు సెషన్లలో స్టాక్స్ పతనం కావడంతో కొన్ని కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. దీంతో గౌతమ్ ఆదానీ సంపద, అదానీ గ్రూప్ సంపద వేగంగా కరిగిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టపోవడంతో ఈ 58 ఏళ్ల బిలియనీర్ సంపద నాలుగు రోజుల్లో 14 బిలియన్ డాలర్ల(రూ.1,03,737 కోట్ల) మేర కరిగిపోయింది. ఈ ఏడాదిలో ఎంత వేగంగా అదానీ గ్రూప్ షేర్లూ పెరిగాయో అంతకంటే వేగంగా తగ్గాయి. ప్రపంచంలోనే ఈ వారంలో అత్యంత సంపద కోల్పోయిన వ్యాపారవేత్తగా ఆదానీ నిలిచారు. ఆయన సంపద ఏకంగా 62.1 బిలియన్ డాలర్స్(రూ.4,60,143 కోట్ల)కు తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది కూడా అదానీయే. దీంతో ఆయన ఆసియా ధనికుడి స్థానంలో రెండు నుంచి మూడవ స్థానానికి పడిపోయారు. చైనా టైకూన్ జోంగ్ షాన్ తిరిగి రెండవ స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికీ మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. చదవండి: వర్షాకాలంలో కారు ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా? -
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిసాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో మదుపర్లు అమ్మకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఉదయం 49,067 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 740.19 పాయింట్ల నష్టంతో 48,440.12 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 224.50 పాయింట్ల నష్టంతో 14,324.90 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 72.62గా ఉంది. నిఫ్టీలో మారుతీ సుజుకీ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. చదవండి: భారత మార్కెట్లోకి బీఎండబ్య్యూ 220ఐ స్పోర్ట్ -
రూ. 50 కోట్లు ముంచేసి.. రాత్రికి రాత్రే పరార్
సాక్షి, మక్తల్: లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్ ఇస్తానని చెప్పి, సుమారు రూ. 50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ పరిధిలోని రామకృష్ణారావుపేటకు చెందిన షేక్ మహిబూబ్ సుబానీ, భార్యాపిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి వలస వచ్చాడు. గుర్లపల్లి రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ‘మిత్ర’పేరుతో ఫర్టిలైజర్ షాపును తెరిచి పురుగు మందులను అమ్మేవాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకున్న అనంతరం ఆరు నెలల క్రితం దుకాణం మూసేసి, మిత్ర ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటుచేసి షేర్ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టాడు. రూ.లక్ష ఇస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్ వస్తుందని డిపాజిట్దారులను నమ్మించాడు. దీంతో బాధితులు ఐసీఐసీఐ గద్వాల బ్రాంచ్లో ‘మిత్ర’సంస్థ పేరిట డబ్బులు జమచేసి రసీదును సుబానీకి ఇచ్చేవారు. ఆ డబ్బులతో మక్తల్ మండలం మంతన్గోడ్, ఊట్కూర్లో పదెకరాల చొప్పున సుబానీ కొనుగోలు చేశాడు. నెల క్రితం తన కుమారుడు షేక్ అస్జర్అలీ యజమానిగా శ్రీఅంజలి పేరుతో జ్యువెలరీ షాపు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈనెల 21న మక్తల్ మండలం చందాపూర్కు చెందిన హన్మంతు రూ.ఐదు లక్షలు సుబానీకి ఇచ్చాడు. చదవండి: (టార్గెట్ రూ.216 కోట్లు! దొంగిలించేందుకు యత్నం) బుధవారం తమ షాపు వద్దకు వస్తే ఐదు తులాల బంగారంతో పాటు నెలకు రూ.30 వేల చొప్పున కమీషన్ ఇస్తానని సుబానీ ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. బుధవారం అక్కడికి వెళ్లిన హన్మంతు షాపు మూసి ఉండటంచూసి కంగుతిన్నాడు. విషయం మిగతా వారికి చెప్పడంతో ఆరా తీయగా ఈనెల 23న అర్ధరాత్రే సుబానీ కుటుంబసభ్యులతో కలిసి ఇల్లు, దుకాణం ఎత్తేసి పరారయ్యాడని తెలిసింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు మొదలుకుని రూ.25 లక్షల వరకు, సుమారు ఐదొందల మంది నుంచి డబ్బులు వసూలు చేశాడని సమాచారం. బాధితుల ఫిర్యాదుతో ఎస్ఐ రాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల బుధవారం ట్రేడింగ్ను కరోనా వేవ్ భయాలు చుట్టుముట్టాయి. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ కారణం చేత మదుపరులు వారి షేర్లను అమ్మకాలకు పెట్టారు. దీనితో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం నుంచి ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు. ఉదయం 49,786 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకి 49,851 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద ముగిసింది. ఇక 14,712 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ట్రేడింగ్ మొత్తం 14,535-14,752 మధ్య కదలాడుతూ చివరకు 265 పాయింట్ల నష్టంతో 14,549 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.61 వద్ద ఉంది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. సిప్లా, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభాలతో ముగిస్తే.. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిసాయి. చదవండి: భారత్లో స్టార్టప్ సంస్థల జోరు..