Vaishnav Tej
-
మెగా హీరో బర్త్డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!
గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!) తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్ తేజ్ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్ తేజ్తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. A heart-warming glimpse of lovely couple Mega Power star @AlwaysRamCharan & @upasanakonidela with #VaisshnavTej from his birthday celebrations 😍#RamCharan #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/yyjBwe52JS — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ
థియేటర్ల సంగతి పక్కనబెడితే ప్రతివారం ఓటీటీల్లో కొత్త మూవీస్ విడుదలవుతూనే ఉంటాయి. హిట్ అయిన మూవీస్ కాస్త లేటుగా స్ట్రీమింగ్లోకి వస్తున్నాయి కానీ యావరేజ్, ఫ్లాప్ మూవీస్ మాత్రం దాదాపు నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ తెలుగు మూవీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్కి సిద్ధమైపోయింది. (ఇదీ చదవండి: తెలుగు యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్) ఇంతకీ ఏ సినిమా? ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, మెగాహీరో వైష్ణవ్ తేజ్-శ్రీలీల కాంబోలో తీసిన మూవీ 'ఆదికేశవ'. యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడి.. గతనెల అంటే నవంబరు 24న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ప్రేక్షకులని అలరించలేకపోయింది. రొటీన్ స్టోరీకి తోడు టేకింగ్ కూడా దెబ్బకొట్టేసింది. ఓటీటీలో ఎప్పుడు? నవంబరు 24న థియేటర్లలో రిలీజైన 'ఆదికేశవ'.. డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇకపోతే క్రిస్మస్ టైంలో స్మాల్ స్క్రీన్ రిలీజ్ ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే డిసెంబరు 22 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. సరిగ్గా అదే రోజు థియేటర్లలో ప్రభాస్ 'సలార్' రిలీజ్ అవుతుండటం విశేషం. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్) -
ఆదికేశవ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
మెగా హీరో వైష్ణవ్ తేజ్ - శ్రీలీల నటించిన 'ఆదికేశవ' చిత్రం నవంబర్ 24న విడుదలైంది. పలుమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. తొలి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్తో ట్రెండింగ్లోకి వచ్చిన వైష్ణవ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాలు డిజాస్టర్గానే మిగిలాయి. తాజాగా విడుదలైన ఆదికేశవ కూడా డిజాస్టర్గానే మిగిలే ఛాన్స్ ఉంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తెరకెక్కిన ఆదికేశవకు ప్రేక్షకుల ఆధరణ అంతగా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం నష్టాల దిశగా ఈ చిత్రం ఉంది. ఇలాంటి సమయంలో ఆదికేశవ ఓటీటీ విడుదలపై ఒక ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ నెలలో క్రిస్టమస్ కానుకగా నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఆదికేశవ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఈ చిత్రంలో ఎక్కువగా వయొలెన్స్తో పాటు ఎమోషన్ సీన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ అవి అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాత్రం ఓకే అనిపించినా.. ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్గా అనిపిస్తుంది. అలా ఫైనల్గా వైష్ణవ్ తేజ్ లిస్ట్లో మరో డిజాస్టర్గా ఈ చిత్రం మిగిలింది. మరి ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తోంది చూడాలి. -
Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ
టైటిల్: ఆదికేశవ తారాగణం: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, అపర్ణ దాస్, సుమన్, తణికెళ్లభరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ తదితరులు దర్శకుడు: శ్రీకాంత్ ఎన్ రెడ్డి సంగీతం : జీవీ ప్రకాశ్ నిర్మాత : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: 24 నవంబర్ 2023 ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకొచ్చాడు. మాస్ హీరోగా తన ముద్ర వేసేందుకు వైష్ణవ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే.. ఆదికేశవ కథ ఓ వైపు సిటీలో సాగుతుంది.. మరో వైపు రాయలసీమలోని బ్రహ్మసముద్రంలో జరుగుతుంటుంది. సిటీలో బాలు (వైష్ణవ్ తేజ్) కథ నడుస్తుంటుంది.. సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్న.. ఇలా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటాడు బాలు. తన కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను బాలు ప్రేమిస్తుంటాడు. బాలుని సైతం చిత్ర ఇష్టపడుతుంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే బాలు గతం, నేపథ్యం తెరపైకి వస్తుంది. బాలుకి ఆ సీమతోనే సంబంధం ఉంటుంది. సీమకు బాలు వెళ్లాల్సి వస్తుంది. బాలు కాస్త రుద్రకాళేశ్వరరెడ్డి అని తెలుస్తుంది... రుద్ర తండ్రి మహా కాళేశ్వర రెడ్డి (సుమన్) ఎలా మరణిస్తాడు? సీమలో అడుగు పెట్టిన బాలు అలియాస్ రుద్ర ఏం చేశాడు? చివరకు చెంగారెడ్డిని ఎలా అంతమొందించాడు? అనేది కథ. ఎలా ఉందంటే..? ఆదికేశవ కొత్త కథేమీ కాదు. ఈ ఫార్మాట్లో వచ్చిన ఎన్నో సినిమాలను మనం ఇది వరకు చూశాం. చూసిన కథే అయినా కూడా రెండు గంటల పాటు అలా నడిపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించినా.. అదే సమయంలో ఓ పాట, ఓ పంచ్ వేసి కవర్ చేసేశాడు డైరెక్టర్. పక్కా మీటర్లో తీసిన ఈ కమర్షియల్ చిత్రం బీ, సీ సెంటర్ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, హీరో మంచితనానికి అద్దం పట్టే సీన్లు బాగుంటాయి. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. తెరపై పాటలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంటర్వెల్కు కథ ఆసక్తికరంగా మారుతుంది. రెండో భాగమంతా కూడా రాయలసీమకు షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అవుతుంది. వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? యంగ్ హీరో వైష్ణవ్ తేజ్కు ఇది చాలా కొత్త పాత్ర. ఫస్ట్ హాఫ్లో జాలీగా తిరిగే పక్కింటి కుర్రాడిగా అవలీలగా నటించేశాడు. రెండో భాగంలో పూర్తి వేరియేషన్ చూపించాడు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. శ్రీలీల తన డ్యాన్సులు, గ్లామర్తో మరోసారి మెస్మరైజ్ చేసింది. మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ తెలుగులో మొదటి సారిగా కనిపించాడు. విలన్గా ఆకట్టుకున్నాడు. సుమన్, తణికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్గా టచ్ అవుతాయి. రెండు గంటల నిడివితో ఎడిటర్ ప్రేక్షకుడికి ఊరటనిచ్చాడనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చదవండి: సౌండ్ పార్టీ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదికేశవ్ సినిమాతోనైనా హిట్ కొడతాడా లేదా?
-
క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ .రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. శ్రీకాంత్ ఎన్ . రెడ్డి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్కి చెందిన ఓ కుర్రాడు అనంతపురం సమీపంలోని కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథాంశం. మూవీ ప్రారంభమైన 10 నిమిషాలకే వైష్ణవ్తేజ్ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సినిమాలోని చివరి 45నిమిషాల సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా, క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. బడ్జెట్, పారితోషికం.. ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా నా దృష్టంతా సినిమాపై కేంద్రీకృతమయ్యేలా చేసిన నాగవంశీగారికి థ్యాంక్స్. జీవీ ప్రకాష్ కుమార్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
‘ఆదికేశవ' ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు: దర్శకుడు
ఓ మంచి కథతో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు నా సన్నిహితులతో చెబితా.. మంచి కమర్షియల్ ఫిల్మ్ చేయమని సూచించారు. అప్పుడు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశాను.. అదే ఆదికేశవ.ఈ సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రం.. ఈ శుక్రవారం(నవంబర్ 24) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు.. ►హైదరాబాద్ లో ఉండే ఒక సాధారణ కుర్రాడు.. ఎక్కడో అనంతపురం దగ్గరున్న కళ్యాణదుర్గంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా లో చూస్తారు. ►భీమ్లా నాయక్ సెట్స్ కి వెళ్ళి వంశీ గారికి ఈ కథ చెప్పగా ఆయనకి నచ్చింది. ఆ తర్వాత చినబాబు గారికి, వైష్ణవ్ తేజ్ గారికి కథ చెప్పాను. అందరికీ నచ్చింది. అలా సితార సంస్థ తో దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది . ►ఏ రోజూ కూడా వంశీ గారు ఇంత బడ్జెట్ లో తీయమని నాకు చెప్పలేదు. కొత్త దర్శకుడివి నువ్వు, నీకు డబ్బుల గురించి ఆలోచన వద్దని చెప్పారు. సినిమా కోసం నేను అడిగినవన్నీ సమకూర్చి పెట్టారు. మంచి మంచి నటీనటులను ఇచ్చారు. బడ్జెట్, పారితోషికం ఇలాంటి పట్టించుకోకుండా నా దృష్టి అంతా సినిమా చిత్రీకరణ మీద ఉండేలా చూశారు. ►క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చివరి 45 నిమిషాలు అద్భుతంగా ఉందని ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎడిటర్ నవీన్ నూలి గారు కూడా చివరి 45 నిమిషాలు అదిరిపోయింది అన్నారు. డీఐ టైంలో ఈ సినిమా చూస్తూ ఎమోషనల్ అయినవాళ్ళు ఉన్నారు. సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఖచ్చితంగా ఈ సినిమా ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ►జి.వి. ప్రకాష్ గారి అనుభవం చాలా హెల్ప్ అయింది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఇచ్చారు. -
వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎవరైనా అడిగినే నేను హీరో కాదని చెబుతా: వైష్ణవ్ తేజ్
కథ నచ్చితే చాలు..ఫలితం గురించి ఆలోచించకుండా సినిమాను ఒప్పుకుంటాను. నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను. హీరో అని అనిపించుకోవడం కంటే..నటుడు అని పిలిపించుకోవడమే ఇష్టం. ఎవరైన నన్ను అడిగినా కూడా నేను హీరోని కాదు నటుడిని అని చెబుతాను’ అని అన్నారు యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్. తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. . జోజు జార్జ్, అపర్ణా దాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రంగ రంగ వైభవంగా చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ గారు ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే నాకు ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత కథ ఇంకా ఎన్నో మెరుగులు దిద్దుకుని అద్భుతంగా వచ్చింది. ► ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారు. ► నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టారు. మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తాయి సన్నివేశాలు. ► శ్రీలీలతో డ్యాన్స్ అనగానే కాస్త భయపడ్డాను. నేనసలు డ్యాన్సర్ ని కాదు(నవ్వుతూ). కానీ నేను మాస్టర్ కి ఒకటే చెప్పాను. మీరు ఓకే అనేవరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తాను అన్నాను. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమైపోయింది. మాస్టర్, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగాను. ► రాధిక నటిస్తున్నారని తెలియగానే..అంత సీనియర్ ఆర్టిస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతటి సీనియర్ ఆర్టిస్ట్ కలిసి పని చేయడం సంతోషంగా అనిపించింది. ► కథలో కొత్తదనం ఉంటే చాలు సినిమాను ఒప్పేసుకుంటాను. అలాగే నా పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. -
'ఆయన కోసమే అలా చేయించుకున్నా'.. మెగాస్టార్పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్!
చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన మూవీతో అభిమానులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం ఆదికేశవతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రం పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ మెగాస్టార్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిరు అని పేరు వచ్చేలా క్రాఫ్ చేయించుకున్న ఫోటోపై స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. 'మామయ్య పుట్టినరోజుకు అందరూ గిఫ్ట్స్ తెచ్చారు. సాయి ధరమ్ తేజ్ పెద్ద కత్తిని బహుమతిని తీసుకొచ్చాడు. నేను మాత్రం ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలనని అనుకున్నా. అందుకే చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. చిరు అని వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నా. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ అన్న అందరినీ ఆకట్టుకుంటాడు. సాయిధరమ్ తేజ్ బాగా అల్లరి చేస్తాడు. తన యాక్సిడెంట్ మా అందరికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆ విషయాన్ని మేము ఎప్పుడో మర్చిపోయాం.' అని అన్నారు. -
పక్కా మాస్
‘‘ఆదికేశవ’ సినిమా ట్రైలర్కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్లానే సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని హీరో వైష్ణవ్ తేజ్ అన్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఆదికేశవ’ పక్కా మాస్ చిత్రం. ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్.. ఇలా అన్నీ బాగుంటాయి. గతేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్ మాస్ మూవీ ‘ఆదికేశవ’’ అన్నారు. -
ఆదికేశవగా వస్తోన్న మెగా హీరో.. ట్రైలర్ చూశారా?
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉప్పెన, కొండపొలంతో అలరించిన హీరో వైష్ణవ్ తేజ్ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతమందించారు. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. -
మెగా హీరోతో రిలేషన్లో రీతూ వర్మ.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్!
మెగా ఫ్యామిలీ ఇంట ఏ సెలబ్రేషన్స్ జరిగినా అక్కడ వాలిపోయేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. నిహారిక స్నేహితురాలిగా తరచూ వారి ఇంటి వేడుకల్లో కనిపించేది. కానీ జనాలు మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని అనుమానపడ్డారు. అన్నట్లుగా వరుణ్-లావణ్య షికార్లకు వెళ్లడం, వీరిద్దరి మధ్య లవ్వాయణం నడుస్తోందని ప్రచారం జరగడం.. చివరకు అదే నిజమంటూ పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది. అయితే ఆ మధ్య వరుణ్-లావణ్యల పెళ్లికి అల్లు అర్జున్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ కూడా ఉంది. దీంతో ఆమె మెగా హీరోతో రిలేషన్లో ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ.. లావణ్య స్నేహితురాలు.. అందుకనే పార్టీకి వచ్చింది. పెళ్లి వేడుకల్లోనూ సందడి చేసింది. అంతకుమించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. కాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నవంబర్ 10న విడుదల కావాల్సింది. కానీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్? -
కమిట్ అయ్యారా..? అంటూ శ్రీలీలను అడిగిన నెటిజన్
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్లో శ్రీలీల టాప్లో ఉంటుంది. ఏడాది నుంచి చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. చిన్న సినిమా అయిన పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఇప్పుడు అగ్ర తారలతో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితమే భగవంత్ కేసరిలో అందరికీ గుర్తుండిపోయే పాత్రలో శ్రీలీల మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ భారీ చిత్రాల షూటింగ్ షెడ్యూల్లలో బిజీగా ఉంది. అయితే ఇంతటి బిజీ షెడ్యూల్లోనూ ఈ చిన్నది తన ఫ్యాన్స్ను పలకరించడం అస్సలు మరచిపోదు. వాళ్ల కోసం తన సోషల్ మీడియా వేదికల్లో సినిమా అప్డేట్స్తో పాటు లేటెస్ట్ ఫొటోలను షేర్ చెస్తుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ నుంచి అభిమానులతో ముచ్చటించింది.తన అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో అక్కడ వివిధ ఆసక్తికరమైన ప్రశ్నలకు శ్రీలీల సమాధానం ఇచ్చింది. అందులో ఒక నెటిజన్, ? ' మీరు ఈ రోజు బిగ్ బాస్కి వస్తున్నారా?' అని అడిగారు. దానికి శ్రీలీల స్పందిస్తూ, 'అవును, ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ కోసమే' అని చెప్పింది. మరో వ్యక్తి (ఆర్ యూ కమిటెడ్..?) అని శ్రీలీలను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు.. ఆమె సమాధానం సూటిగా అవును అని చెబుతూ.. ' నేను నా పని విషయంలో కమిటెడ్గానే ఉంటాను.' అని కౌంటర్లా సమాధానం ఇచ్చింది. అభిమానులు అడిగిన ప్రశ్నలతో పాటు ఆమె చెప్పిన సమాధానాలు కూడా శ్రీలీల షేర్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైష్ణవ్ తేజ్-శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
వరల్డ్ కప్ ఎఫెక్ట్.. వాయిదా పడ్డ మెగా హీరో సినిమా!
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, హాట్బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. ఇంకో పది రోజుల్లో అంటే నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ధృవీకరించారు. ‘ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడంలేదు. అందుకే నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన 'ఆదికేశవ'ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం’అని నిర్మాత నాగవంశీ తెలిపారు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నామని, కఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్, మాస్ ఆడియన్స్ని కూడా ఈ సినిమా అలరిస్తుందని అన్నారు. ‘ఉప్పెన' వంటి బ్లాక్బస్టర్తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు 'ఆదికేశవ' అనే మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. -
న్యూ లుక్ లో వైష్ణవ్ తేజ్..ఎందుకో తెలుసా..?
-
'ఆదికేశవ'సాంగ్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
మరో మాస్ పాట.. శ్రీలీల కేక పుట్టించే డ్యాన్స్!
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా 'ఆదికేశవ'. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి 'లీలమ్మో' అనే పాట లిరికల్ వీడియోని బుధవారం రిలీజ్ చేశాడు. ఫుల్ మాసీగా ఉన్న ఈ సాంగ్లో శ్రీలీల డ్యాన్స్తో అదరగొట్టేసింది. హైదరాబాద్లో ఓ హోటల్లో సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ పాట గురించి మాట్లాడిన శ్రీలీల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!) 'లీలమ్మో' నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది' అని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఇకపోతే 'ఆదికేశవ' సినిమాతో శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
Aadikeshava Movie HD Photos: వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?
ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన 'కృతి శెట్టి' తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమా తర్వాత ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్టుగా నిలవగా, బంగార్రాజు సినిమా యావరేజ్గా నిలిచింది. అలా ఆమెకు మొదటి మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ రావడంతో డిజాస్టర్లుగా నిలిచాయి. టాలీవుడ్కు ఆమె వచ్చిన కొత్తలో అమ్మడి అదృష్టం ఓ రేంజ్లో ఉండేది. ఏ సినిమా అయినా సరే 'కృతి శెట్టి' కావాలి అనేంతగా తన ఇమేజ్ ఉండేది. అప్పట్లో స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరైనా సరే సినిమా ఛాన్స్లు ఇస్తామని ఈ చిన్నదాని వెనుక తెగ తిరిగారు. అయితే అవకాశాలను మాత్రమే అందుకుంది కానీ, విజయాలను అందుకోలేకపోయింది. ఉప్పెన బ్యూటీ అని తెచ్చుకున్న అదే పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది. (ఇదీ చదవండి: మీ నుంచి చాలా నేర్చుకున్నా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!) ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక సినిమా మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఈ బ్యూటీ చుట్టూ అప్పుడప్పుడు పలు రూమర్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని ఆమె తన టీమ్ ద్వారా తిరిగి సమాధానం కూడా చెబుతూ వచ్చేది. పెళ్లిపై రూమర్స్ తాజాగా కృతి శెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి చెందిన 'వైష్ణవ్ తేజ్'తో ఆమె వివాహం అంటూ నెట్టింట వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా సమయంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందని పలు రకాలుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 'మిస్టర్' సినిమా సమయంలో మా మధ్య ప్రేమ మొదలైందని లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ చెప్పిన విషయం తెలిసిందే. సుమారు 7 ఏళ్లు పైగా వారి ప్రేమను దాచి.. నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. అదే మాదిరి 'కృతి శెట్టి- వైష్ణవ్ తేజ్'లు కూడా షాకిస్తారా..? కాదూ, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని తిప్పికొడతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తనకు లేనట్లు పలుమార్లు బేబమ్మ చెప్పిన విషయం తెలిసిందే. తనకు ఉన్న టాలెంట్కు ఒక మంచి కథ పడితే మళ్లీ ఆమె కెరియర్ ఇండస్ట్రీలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ బేబమ్మకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ టాలీవుడ్లో ఉంది. తన సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్ సినిమాతో ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాబట్టి ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకుని తన కెరియర్కు ఫుల్స్టాప్ పెట్టకపోవచ్చని తెలుస్తోంది. -
సిత్తరాల సిత్రావతి...
‘సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటుగా పోయే మతి’ అని పాడుకున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని ‘సిత్తరాల సిత్రావతి.’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్కుమార్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా రమ్య బెహ్రా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. -
‘సిత్తరాల సిత్రావతి’ వచ్చేసింది.. శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసిందిగా!
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘సిత్తరాల సిత్రావతి’పాటను విడుదల చేశారు మేకర్స్. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ పాట ఇది. వైష్ణవ్ తేజ్ తన చిత్ర(శ్రీలీల)ను 'సిత్తరాల సిత్రావతి' అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే గీతంగా ఈ పాట సాగుతుంది. ఈ పాటకు గేయ రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకి తన గాత్రంతో విభిన్నమైన జానపద రుచిని అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చాడు. -
నవంబరులో ఆదికేశవ
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఫ్యారిస్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ షెడ్యూల్తో ‘ఆదికేశవ’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ సినిమాను తొలుత ఈ నెల 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ‘ఆదికేశవ’ చిత్రాన్ని నవంబరు 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’కు ప్రిపేర్ అవుతున్న స్టార్స్!
విలన్ ముఖం మీద హీరో పంచ్ ఇవ్వాలా? కాలితో ఒక్క కిక్ కొట్టాలా? గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి మరీ విలన్ని కొట్టాలా? ఇవన్నీ చేయాలంటే కాస్త ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్ ఫైట్స్కి అయితే అక్కర్లేదు. బీభత్సమైన ఫైట్స్కి అయితే శిక్షణ తీసుకోవాల్సిందే. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఈ మధ్య రిస్కీ రోల్స్ ఒప్పుకున్న కొందరు స్టార్స్ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలరి పయట్టు వంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ కిందే వస్తాయి. ఫైట్కి సూట్ అయ్యే ఆర్ట్ నేర్చుకుని బరిలోకి దిగనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మూడు నెలలు బ్యాంకాక్లో... హీరో మహేశ్బాబు– డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు కెరీర్లో తొలిసారి ఈ సినిమా కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారట మహేశ్బాబు. ఇందుకోసం మూడు నెలల పాటు బ్యాంకాక్ వెళతారని టాక్. అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకోనున్నారట. ఈ శిక్షణ ఇవ్వనున్న బ్యాంకాక్ స్టంట్ టీమ్కి ఓ హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నేతృత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు మహేశ్బాబు. ఈ చిత్రం పూర్తయ్యాక బ్యాంకాక్లో శిక్షణ తీసుకుని, రాజమౌళి సినిమా షూట్లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్ల్యాండ్లో... తొలి చిత్రం ‘ఉప్పెన’తో (2021) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్తో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి ‘ఆదికేశవ’ చిత్రంలో ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్ల్యాండ్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో వైష్ణవ్కు జోడీగా శ్రీలీల నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. కలరి మార్షల్ ఆర్ట్లో... మలయాళ హీరో టొవినో థామస్ కలరి అనే మార్షల్ ఆర్ట్లో శిక్షణ పొందారు. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్కు ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉండటంతో టొవినో థామస్ ఈ విద్యలో శిక్షణ తీసుకుని నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతీ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతీయుడు కోసం... కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు. ‘భారతీయుడు’ (1996) సినిమాకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్ 2) రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్కు జోడీగా కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఫైట్స్ చేయడం కోసం అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలరి పయట్టు నేర్చుకున్నారు కాజల్. కలరి సాధన చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో.. వంటి క్రీడలు కలరి నుంచి పుట్టుకొచ్చినవే’ అని పేర్కొన్నారామె. ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కాజల్ అగర్వాల్. -
ఆగస్టులో ఆదికేశవ
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ఆదికేశవ’. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్, కెమెరా: డడ్లీ. -
చరణ్ అన్న క్యూట్ గ ఉంటాడు..
-
పవర్ఫుల్ రుద్ర
అదొక చిన్న గ్రామం. ఆ గ్రామంలోని శివాలయాన్ని కొందరు గూండాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని అడ్డుకోవడానికి రుద్ర రంగంలోకి దిగుతాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది? తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో హీరో వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఆది కేశవ’ అనే టైటిల్ని ఖరారు చేసి, పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం ఫస్ట్ గ్లింప్స్ని విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్లో పవర్ఫుల్ రుద్రగా ఉగ్రరూపం చూపించారు వైష్ణవ్ తేజ్. చిత్ర పాత్రలో హీరోయిన్ శ్రీలీల, వజ్ర కాళేశ్వరి దేవిగా కీలక పాత్రలో అపర్ణా దాస్, విలన్గా జోజు జార్జ్ నటిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, కెమెరా: డడ్లీ. -
మెగా హీరో మాస్ యాక్షన్.. ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయిందిగా!
‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పెళ్లిసందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: వైష్ణవ్ తేజ్, శ్రీలీల మాస్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది..) తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లింప్స్ చూస్తే పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ లుక్లో కనిపించనున్నారు. Meet the Fiercest #PanjaVaisshnavTej in a new action avatar! 🔥👊🏻 Here's the First Glimpse of #Aadikeshava 💥⚡ ▶️ https://t.co/qAkurwAtlp July 2023 Release, In Theaters worldwide. 🤩@sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj… — Sithara Entertainments (@SitharaEnts) May 15, 2023 (ఇది చదవండి: అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటున్నాను: శ్రీలీల) -
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్
మనోహరం, బీస్ట్ వంటి చిత్రాలతో మలయాళ, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణ దాస్. తాజాగా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రంలో (PVT04- వర్కింగ్ టైటిల్) కీలక పాత్రలో నటిస్తోంది అపర్ణా దాస్. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరీ దేవి పాత్రను పోషిస్తోంది అపర్ణా దాస్. ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆమె రాక సినిమాకు మరింత ఆకర్షణ అవుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా, ఎవరికీ చెప్పలేదు: నటి -
తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నూతన దర్శకుడు ఎన్.శ్రీకాంత్ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని చెంగారెడ్డి పాత్రలో మలయాళ నటుడు జోజు జార్జ్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారు. ‘జోసెఫ్, నాయట్టు, ఇరాట్ట’ వంటి మలయాళ హిట్ ఫిల్మ్స్లో నటించిన జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. Thank you ❤️🙏 https://t.co/1oHY9slrcV — joju george (@C_I_N_E_M_A_A) March 15, 2023 -
క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్.. ఈ సినిమాలు సూపర్ హిట్
ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం. ఉప్పెన సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్లో కూర్చోపెట్టేశారు. రంగస్థలం రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్తో ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు. ఆర్ఎక్స్ 100 క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్ని గెయిన్ చేసిన చిత్రం ఆర్ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్లైన్తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్నే విలన్గా చూపించేసి ఆడియన్స్ని షాక్కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు. కేరాఫ్ ‘కంచరపాలెం’ చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది. ఎవరు డిఫరెంట్ క్లైమాక్స్తో ఆడియన్స్ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్కి ఫోకస్ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్ప్లే నే భలే ట్విస్ట్గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది. మత్తువదలరా సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్గ్రౌండ్లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్ని థ్రిల్ చేసింది. హిట్ హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్తో…ఆడియన్స్ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్ని ఇన్స్టంట్గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్లో సస్పెన్స్ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి. ఆ! సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు. - దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ -
వైష్ణవ్ తేజ్, శ్రీలీల మాస్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది..
‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, వైష్ణవ్ తేజ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో వైష్ణవ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టైటిల్తో పాటు, చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డుడ్లే. A journey of the fierce one, #PVT04 in theatres from this 29 April 2023! 🔥@sreeleela14 #SrikanthNReddy @vamsi84 #Dudley #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/jk0vrf5fPQ — Panja Vaisshnav Tej (@VaisshnavTej) January 2, 2023 -
ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
మెగా ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా-అల్లు ఫ్యామిలీ ప్రీ-క్రిస్మస్ను సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎలాంటి పండగైన, బర్త్డే సెలబ్రెషన్స్ అంటే మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరుతారు. ఈ నేపథ్యంలో ప్రీ-క్రిస్మస్ వేడుకలో భాగంగా మెగా ఇంట సీక్రెట్ శాంట గేమ్ నిర్వహించారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జన్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, మెగా డాటర్స్ నిహారిక కొణిదేల, సుష్మితా కొణిదెల, శ్రీజలతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, చరణ్ వైఫ్ ఉపాసన, మిగతా కజిన్స్ అంతా పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలను ఉపాసన సీక్రెట్ శాంట అంటూ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మెగా హీరోలందరిని ఒకేఫ్రేంలో చూసి ఫ్యాన్స్ అంత మురిసిపోతున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
హీరో వైష్ణవ్ తేజ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సంక్రాంతి సంబరం... సమరం
సంక్రాంతి పండగ సెలవుల్లో వినోదం పంచడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులకు సినిమా సంబరం.. హీరోలకు బాక్సాఫీస్ సమరం. ఈసారి పండగ బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ ఇద్దరూ సంక్రాంతికి చాలాసార్లు పోటీపడ్డారు. ఇక పండగకి రానున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. వీరయ్య విజృంభణ దాదాపు ఆరేళ్ల తర్వాత సంక్రాంతి పండక్కి రానున్నారు చిరంజీవి. 2017 సంక్రాంతికి ‘ఖైదీ నంబరు 150’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా వస్తున్నారు చిరంజీవి. రవితేజ ఓ లీడ్ రోల్లో, శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్–పోలీస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది. వీరసింహారెడ్డి విశ్వరూపం సంక్రాంతి పండక్కి చివరిసారిగా రిలీజైన బాలకృష్ణ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆరేళ్ల తర్వాత బాలకృష్ణ సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా నట విశ్వరూపం చూపించనున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ డ్రామాగా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆదిపురుష్ ఆగమనం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వేసవిలో విడుదలైంది. దీంతో ‘ఆదిపురుష్’ సినిమాను ఎలాగైనా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రభాస్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ‘ఆదిపురుష్’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించింది చిత్రయూనిట్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్ ఫిల్మ్లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. భూషణ్కుమార్, క్రషణ్కుమార్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. వారసుడు వస్తున్నాడు తమిళ హీరో విజయ్ తెలుగులో ‘వారసుడు’గా సంక్రాంతి పండగకి వస్తున్నాడు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ సంపన్న ఉన్నత కుటుంబానికి వారసుడిగా వచ్చిన ఓ దత్తపుత్రుడు నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ కూడా... వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఏడెనిమిదిసార్లు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పుడు మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక గతంలో సంక్రాంతి పండగకి కాస్త ముందూ వెనకా విడుదలైన చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలేంటంటే... ఈ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వచ్చినా ఒకే తేదీన రాలేదు. ఒక్క 2001లో మాత్రమే చిరంజీవి నటించిన ‘మృగరాజు’, బాలకృష్ణ నటించిన ‘సమరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒకే రోజున అంటే జనవరి 11న విడుదలయ్యాయి. మరి...ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రిలీజ్ డేట్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
Ranga Ranga Vaibhavamga Review: 'రంగరంగ వైభవంగా’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగరంగ వైభవంగా నటీనటులు : వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, ప్రభు, నరేశ్ అలీ, సుబ్బరాజు, సత్య తదితరులు నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: గిరీశాయ సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: శామ్ దత్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్ రావు విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 తొలి సినిమా ‘ఉప్పెన’తోనే యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా వెండితెరపై కనిపించాడు. అయితే రెండో సినిమా ‘కొండపొలం’మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న వైష్ణవ్.. ఇప్పుడు ‘రంగరంగ వైభవంగా’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగరంగ వైభవంగా’చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రిషి(వైష్ణవ్), రాధ(కేతికా శర్మ) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంటుంది. కానీ రిషీ, రాధలకి మాత్రం ఒకరంటే ఒకరు పడదు. తరచూ గొడవ పడుతుంటారు. వీరి వయసుతో పాటు గొడవలు కూడా పెరుగుతూనే వస్తాయి. పెద్దయ్యాక వీరిద్దరు ఓ మెడికల్ కాలేజీలో చేరతారు. అక్కడ కూడా వీరిద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అయితే రిషీకి మాత్రం రాధపై అమితమైన ప్రేమ ఉంటుంది కానీ.. పైకి కోపంగా ఉంటాడు. వీరిద్దరు కలిసే సమయానికి ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి. అసలు ఆ గొడవలకు కారణం ఏంటి? తమ కుటుంబాలను కలపడం కోసం రిషీ, రాధలు ఏం చేశారు? చివరకు రిషీ, రాధల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'అర్జున్ రెడ్డి`ని తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరీశాయ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా 'రంగ రంగ వైభవంగా' తెరకెక్కించారు. వైష్ణవ్, కేతికా శర్మ పాత్రల చైల్డ్హుడ్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతోంది. మెడికల్ స్టూడెంట్స్గా వైష్ణవ్, కేతికా శర్మలో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కథంతా సరదాగా సాగుతుంది. రిషీ, రాధల మధ్య వచ్చే క్యూట్ ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సత్యతో వచ్చే సీన్స్ కూడా నవ్వులు పూయిస్తుంది. కావాల్సిన కామెడీ ఉన్నప్పటికీ.. కథనం మాత్రం రొటీన్గా సాగడం మైనస్. ఇక సెకండాఫ్లో మాత్రం కథంతా సింపుల్ గా సాగుతుంది. మెడికల్ క్యాంపులో భాగంగా హీరో హీరోయిన్లు గ్రామానికి వెళ్ళడం..అక్కడ మళ్ళీ ఇద్దరు కలవడం, తమ ఫ్యామిలీలను కలిపేందుకు ప్లాన్ చేయడం..ఇలా రొటీన్ గా సాగుతుంది. సర్పంచ్ సత్తిబాబుగా సత్య చేసే కామెడీ నవ్వులు పుయిస్తుంది.అలానే కార్తీక దీపం సీరియల్ సీన్తో ఇద్దరి తల్లులను కలపడం ఆకట్టుకుంటుంది. ఎన్నికల సీన్ సాగదితగా ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు గతంలో వేరే సినిమాలను గుర్తు చేసేలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్ బావున్నా దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్ప్లే, ఎమోషన్స్ పండకపోవడం, సెకెండాఫ్, తేలిపోయిన క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్గా మారాయి. ప్రభు, నరేశ్ అలీ, సుబ్బరాజు, నవీన్ చంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పనిచెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా ఇదొక రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. -
‘రంగరంగ వైభవంగా’ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్.`అర్జున్ రెడ్డి`ని తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. , మెగా ఫ్యామిలీ హీరో నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రంపై వైష్ణవ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన కొండపొలం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రంగరంగ వైభవంగా’ కథేంటి? సినిమా ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. నెటిజన్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. రంగరంగ వైభవంగా మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #RangaRangaVaibhavanga getting Below Average Reviews from the USA Premiere Shows 🇺🇲 — VCD (@VCDtweets) September 2, 2022 ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. క్లీన్ లవ్స్టోరీతో సినిమా సాగుతుందట. అయితే ఊహకందేలా సినిమా సాగడంతో ప్రేక్షకుడికి అంతగా ఆసక్తి కలించదని చెబుతున్నారు. సత్యతో కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. సెకండాఫ్తో పోలిస్తే.. ఫస్టాఫ్ కాస్త బెటర్అని అంటున్నారు. ఓవరాల్గా రంగరంగ వైభవంగా యావరేజ్ సినిమా అని చెబుతున్నారు. నెట్టింట కూడా ఈ సినిమాకు ఎక్కువగా బజ్ లేకపోవడం గమనార్హం. #RangaRangaVaibhavanga from USA Started with a Mediocre Outdated Story With a Vexing screenplay🤦🏻♂️🤦🏻♂️, Turned to Lackluster TV serial with Ultra bad Dialouges, poor editing👎🏻 and Jump cuts. Only good is Music, Camera and Satya Comedy. #PanjaVaisshnavTej pic.twitter.com/CdsxynAxbC — Pradyumna Reddy (@pradyumna257) September 2, 2022 ఇక వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం విడుదలైన సందర్భంగా మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్తో పాటు పలువురు నటులు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. #Vaisshu babu wish you all the best for your release tomorrow 🤗😘 I know the love & effort that has gone into this film. Wishing good luck to the entire team of #RangaRangaVaibhavanga.@BvsnP Garu, Baapineedu Anna@TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial pic.twitter.com/U6qOETmVdS — Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2022 My best wishes to the Vaishnav , @TheKetikaSharma , @GIREESAAYA and the entire team of #RangaRangaVaibhavamga Wishing you’ll a blockbuster!💯 pic.twitter.com/OLPuXYg813 — Varun Tej Konidela (@IAmVarunTej) September 1, 2022 -
ఆ సినిమా రీమేక్లో నటించాలని ఉంది
‘‘రంగ రంగ వైభవంగా’లో ఎంటర్టైన్మెంట్తో పాటు అందమైన ప్రేమకథ, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వైష్ణవ్ తేజ్. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ► నా సినిమా కథల ఎంపికలో ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ (వైష్ణవ్ అన్న) తో పాటు ఎవరి సపోర్ట్ తీసుకోను. నేనే ఎంచుకుంటున్నాను. గిరీశాయ కథ చెప్పిన విధానం, కథపై ఆయనకు ఉన్న నమ్మకం నచ్చింది. పైగా ఆయన మంచి అనుభవం ఉన్న దర్శకుడు. అందుకే ‘రంగ రంగ వైభవంగా’ చేశా. ► ఈ సినిమాలో చాలామంది సీనియర్ నటీనటులున్నారు. సీనియర్స్తో నటించడం వల్ల వారి అనుభవం, అంకితభావం వంటి విషయాలు తెలుసుకున్నాను. నటన విషయంలో మెగా ఫ్యామిలీలోని అందరి నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. ► బీవీఎస్ఎన్ ప్రసాద్గారి లాంటి సీనియర్ నిర్మాత బేనర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనే మంచి టీమ్ని సెట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. శ్యామ్దత్గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ► ‘ఉప్పెన’తో నాకు పెద్ద హిట్ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘కొండపొలం’ మేము అనుకున్నంతగా ఆడలేదు.. అందుకు ఎలాంటి బాధ లేదు. నా ప్రతి సినిమా రొటీన్గా కాకుండా వైవిధ్యంగా ఉండాలనుకుంటాను. పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) సినిమాలను నేను రీమేక్ చేయడమంటే సాహసమే. మంచి కథ కుదిరి, డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయగలిగితే ‘బద్రి’ సినిమా రీమేక్లో నటించాలనుంది. ప్రస్తుతం సితార బ్యానర్లో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. -
రంగ రంగ వైభవంగా సినిమా చిట్ చాట్
-
హీరోగా వైష్ణవ్ తేజ్.. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్: సాయిధరమ్ తేజ్
‘‘రంగ రంగ వైభవంగా’ హిట్ అవుతుందా? బ్లాక్బస్టర్ అవుతుందా? అనేది నాకు తెలియదు. కానీ నా తమ్ముణ్ణి (వైష్ణవ్ తేజ్) మీరు(ప్రేక్షకులు) హీరోగా యాక్సెప్ట్ చేశారు. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మళ్లీ ఇలా స్టేజ్పైకి వస్తానని ఊహించలేదు. నేను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ధరించడం వల్లే బతికాను. మీరు కూడా బైక్పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించండి. వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ హిట్ అవడంతో ఆనందపడ్డాం. నా ‘రిపబ్లిక్’ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న టైమ్లో సెప్టెంబరు 10న నాకు బైక్ ప్రమాదం జరిగింది. హాస్పిటల్లో పడుకుని ఉన్నప్పుడు నా తమ్ముడు వచ్చి ‘అన్నా..’ అని నన్ను పిలిస్తే పలకలేకపోయాను(భావోద్వేగంతో..). ఆ సమయంలో అమ్మ, నాన్న, నా తమ్ముడు నాతో ఉన్నారు. వైష్ణవ్ నా పక్కన ఉంటే నాకు ధైర్యం. వీడు నా బలం. సెప్టెంబరు 2న నా గురువుగారి (పవన్కల్యాణ్ను ఉద్దేశిస్తూ..) బర్త్ డే. ఈ సినిమా చూసి గరువుగారి బర్త్ డే చేసుకోండి’’ అన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘పెదనాన్న (చిరంజీవి), బాబాయ్(పవన్ కల్యాణ్) మాకు చెప్పింది ఒక్కటే.. ‘నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో అని’. మూడు సినిమాలు చేసినా వైష్ణవ్ తన కష్టాన్నే నమ్ముకున్నాడు’’ అన్నారు. ‘‘గిరిగారు కథ చెప్పినప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను’’ అన్నారు వైష్ణవ్తేజ్. ‘‘వైష్ణవ్గారు సెట్స్లో నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి నా పదిహేనేళ్ల కష్టాన్ని మర్చిపోయాను’’ అన్నారు గిరీశాయ. ‘‘మెగా హీరోలతో నేను చేసిన సినిమాలన్నీ హిట్స్ సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. నటులు అలీ, నాగినీడు, కెమెరామేన్ శ్యామ్దత్ పాల్గొన్నారు. -
మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ
‘‘విభిన్నమైన వృత్తుల్లో (పాత్రల్లో) కనిపించగలిగే అవకాశం యాక్టర్స్కు మాత్రమే దక్కుతుంది. అందుకే నేను యాక్టర్ని అయినందుకు సంతోషంగా ఉంది. నా పేరెంట్స్, తాతగారు డాక్టర్స్. మా నాన్నగారు నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు. కానీ నా ఇష్టం మేరకు నేను యాక్టర్ని అయ్యాను. అయితే ‘రంగ రంగ వైభవంగా..’ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ రాధగా నటించాను. అలా స్క్రీన్పై డాక్టర్గా కనిపించాను. ఈ విధంగా మా నాన్నగారి కల నిజం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేతికా శర్మ. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమా నాకో లెర్నింగ్ ఎక్స్పీరియన్సే.‘రొమాంటిక్’, ‘లక్ష్య’ చిత్రాలతో యూత్ ఆడియన్స్కు దగ్గరైన నేను ‘రంగరంగ వైభవంగా..’తో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర కానున్నందుకుసంతోషంగా ఉంది. ఇందులో నేను చేసిన రాధ పాత్రలో ప్రతి అమ్మాయి తనను తాను కొంచెం అయినా ఊహించుకుంటుంది’’ అన్నారు. -
తిరుపతిలో సందడి చేసిన రంగరంగ..వైభవంగా మూవీ టీమ్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో రంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ సందడి చేసింది. ఓ ప్రయివేటు హోటల్లో శుక్రవారం హీరో వైష్ణవతేజ్, హీరోయిన్ కృతికశర్మ, దర్శకుడు గిరిశాయ, నిర్మాత బీవీఎన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తిరుపతి నుంచి వైజాగ్ వరకు చిత్ర ఫ్రీ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు చిత్రాలకంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని, సెప్టెంబర్ 2న థియేటర్లలో సందడి చేస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చదవండి: (Liger Movie: థియేటర్ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ) -
తిరుపతిలో ‘రంగ రంగ వైభవంగా’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
ఆ సీన్ చేస్తున్నప్పుడు చిరు మామ నాపై సీరియస్ అయ్యారు: వైష్ణవ్
శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుని ఒక్కసారిగా దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొండపొలంతో మరో హిట్ అందుకున్న వైష్ణవ్ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే మరో ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు. గిరీశయ్యా దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా వైష్ణవ్ డైరెక్టర్ గిరీశయ్యాతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. చదవండి: సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్ ఈ సందర్భందగా శంకర్ దాదాలో మీ పెద్ద మామయ్య(మెగాస్టార్ చిరంజీవి)తో కలిసి నటించావ్ కదా ఆయన నీకు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారా? అని అడగ్గా.. ‘ఈ సినిమాలో నా పాత్ర అసలు కదలకూడదు, కల్లు అర్పకూడదు. అయితే ఒక సీన్లో బాగా నవ్వేశాను. దీంతో మామయ్య(చిరంజీవి) అప్పుడు కొంచ్ం సీరియస్ అయ్యారు’ చెప్పాడు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్, గ్యాదరింగ్ అయితే తేజ్ అంటే అందరు ఒకేసారి తిరిగి చూస్తారా? అడిగారు హోస్ట్. దీనికి ‘‘చిరు మామ ఓరేయ్ అని పిలిస్తే చాలు.. మేమంతా పలుకుతాం. ఇక ఉప్పెన స్క్రీప్ట్ను మొదట నా ఫ్రెండ్స్తో కలిసి విన్నాను. ఆ తర్వాత సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఈ కథను చిరంజీవి మామయ్యకు వినిపించారు. చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు ‘ఐడియా బాగుంది.. సినిమా తీయండి’ అని ఆయన అన్నారు’’ అని చెప్పుకొచ్చాడు. ఉప్పెన మూవీలోని రొమాంటిక్ సాంగ్(జల జల జలపాతం నువ్వు) చేసేటప్పుడు ఇబ్బంది పడ్డానన్నాడు. చూట్టు వందమంది ఉన్నారని, అంతమంది ముందు ఎలా చేయాలా? అనిపించదన్నాడు. ఈ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు తాను నిజంగా ఏడ్చానని, బేబమ్మ నీకో మాట చెప్పాలనే సన్నివేశానికి దాదాపు 20పైనే టేక్ తీసుకున్నానన్నాడు. అది చేసేటప్పుడే అందరి సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నానని గుర్తు రాగానే కన్నీళ్లు వచ్చాయన్నాడు. ఇక చిన్న మామయ్య(పవన్ కల్యాణ్) తమ్ముడు, బద్రి సినిమాలను తాను సుమారు 120 సార్లు చూశానని వైష్ణవ్ పేర్కొన్నాడు. -
‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ వచ్చేసింది
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, తారక్ సర్కస్ చేశారు.. ఆ దర్శకుడి చిత్రాలేవి నచ్చవు: ఆర్జీవీ) చిన్నప్పటి నుంచి గొడవపడే ఓ అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు వాళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశమని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివరల్లో ‘నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా’అంటూ వేష్ణవ్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
రంగరంగ వైభవంగా రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. కేతిక శర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. సెప్టెంబర్ 2న రంగరంగ వైభవంగా మూవీని థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి! The Love, Laughter & Drama filled Youthful Family Entertainer #RangaRangaVaibhavanga locks a POWERFUL Release Date 💥🤙In theatres from September 2nd 🎦🍿#PanjaVaisshnavTej @TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial @BvsnP @SonyMusicSouth#RRVOnSep2nd pic.twitter.com/dfZwocn3pN— SVCC (@SVCCofficial) July 13, 2022 చదవండి: ప్రముఖ నటి కుమార్తెపై ట్రోలింగ్.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై జీవితంలోని కష్టాలను నీ ప్రేమతో గెలిచేస్తా.. కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్ -
‘రంగరంగ వైభవంగా’ మూవీ (ఫొటోలు)
-
రంగరంగ వైభవంగా టీజర్ వచ్చేసింది..
పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ వైష్ణవ్తో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. నన్నే చూస్తావ్, నా గురించే కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు, కానీ నీకు నాతో మాట్లాడటానికి ఈగో.. అంటూ హీరోయిన్ వాయిస్తో టీజర్ మొదలైంది. ఈ మూవీలో హీరోహీరోయిన్లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్తో మాట్లాడకపోయినా సరే, ఆమె ఆపదలో ఉందంటే మాత్రం ఆదుకునేందుకు క్షణాల్లో బయలుదేరతాడని కనిపిస్తోంది. మొత్తానికి టీజర్ మాత్రం ఇంట్రస్టింగ్ ఉంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో చైతూతో డేటింగ్పై స్పందించిన శోభిత, వీడియో వైరల్! -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న వీడియో
PVT04 Shooting Started Announcement Video Released: పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వైష్ణవ్ 'రంగరంగ వైభవంగా' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా నేడు జూన్ (22) ఉదయం 11.16 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అతిరథుల మధ్య వైభవంగా ముహూర్తం జరుపుకుంది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కల్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయిధర్మ తే జ్ క్లాప్ ఇవ్వగా,దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు. చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇందులో "రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా..." అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరిక గా అంటే.. "ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..!" అంటూ కథానాయకుడు మరింత గా హెచ్చరించడం చూడొచ్చు. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. ఈ మూవీని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ #PVT04 ~ #ProductionNo16 begins with a pooja ceremony today✨ Shoot begins soon! 🎬🎥 ▶ https://t.co/h0m5jrbdl4 Directed by #SrikanthNReddy Produced by @vamsi84 & #SaiSoujanya#PanjaVaisshnavTej @sreeleela14 @SitharaEnts @Fortune4Cinemas Sankranthi 2023 Release ⚡ pic.twitter.com/UxGDdh35Wm — Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022 -
స్టూడెంట్స్గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్గా మారి బాక్సాఫీస్ ఎగ్జామ్కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్గా సాగే ఈ బాక్సాఫీస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్ డేట్స్ (రిలీజ్ డేట్స్) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఏప్రిల్లో రామ్చరణ్ అమృత్సర్కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్ అక్కడికి కాలేజీ స్టూడెంట్గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్ సినిమా కోసమే. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్చరణ్ పాత్రలో షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రల్లో రామ్చరణ్ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్డ్రాప్ సీన్లను అమృత్సర్లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్రూమ్కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అవికా గోర్ స్కూల్ స్టూడెంట్గా, కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాళవికా నాయర్ కూడా కాలేజీ స్టూడెంట్గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు ఆది, సత్యదేవ్ కూడా స్టూడెంట్ రోల్స్ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్డ్రాప్ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఇక ‘తీస్మార్ ఖాన్’ కోసం ఆది సాయికుమార్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్.. ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆది సాయికుమార్. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’. ఇది కంప్లీట్ క్యాంపస్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. -
పంజా వైష్ణవ్ 'కొత్తగా లేదేంటి?' ఫుల్ సాంగ్ విన్నారా?
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకత్వం వహించారు. కేతికా శర్మ హీరోయిన్గా నటించారు. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కొత్తగా లేదేంటి..’ అంటూ సాగే లవ్ డ్యూయెట్ సాంగ్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. శ్రీమణి రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్, హరిప్రియ పాడారు. ఈ పాట ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకోన్తో పాటు మరో హీరోయిన్! -
వైష్ణవ్ తేజ్ 'కొత్తగా లేదేంటి ?' ప్రొమో విడుదల..
Vaishnav Tej Ranga Ranga Vaibhavanga Movie Song Promo Release: మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం 'ఉప్పెన'తోనే పెద్ద హిట్ అందుకున్నాడు. తర్వాత కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్తో కలిసి 'కొండపొలం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాల్లో వైష్ణవ్ తేజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. మెడికల్ స్టూడెంట్స్ మధ్య వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలోని 'కొత్తగా లేదేంటి ?' అనే లిరికల్ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేశారు. పూర్తి పాటను మే 6న విడుదల చేయనున్నారు మేకర్స్. శ్రీమణి రాసిన ఈ సాంగ్ను ఆర్మన్ మాలిక్, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటుంది. చదవండి: 'రంగ రంగ వైభవంగా' ఫస్టు సింగిల్ రిలీజ్ -
జీవితంలో 2 పుట్టిన రోజులుంటే.. ఆ రోజే నాకు మరో బర్త్డే: కృతిశెట్టి ఎమోషనల్
‘ఉప్పెన’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్లో మెరిసింది కృతిశెట్టి. తొలి సినిమానే బ్లాక్బస్టర్ హిట్ కావడం, బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయం సాధించడంతో బేబమ్మ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఇండస్ట్రీలో లక్కీ గర్ల్గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ వారియర్, మాచేర్ల నియోజకం’ వంటి ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఆమె నటించిన ఉప్పెన సినిమా విడుదలై నిన్నటి(ఫిబ్రవరి 12) ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బేబమ్మ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చదవండి: నాన్న పీస్ డేని చెడగొట్టే మిషన్లో బిజీ, సితార పోస్ట్ వైరల్ ‘జీవితంలో మనకంటూ రెండు పుట్టిన రోజులు ఉంటే, అందులో ఒకటి... మనం పుట్టినరోజు. ఇంకొకటి.. మనం కెరీర్లో ఏం చేయాలో ఎంచుకున్న రోజు. ఏడాది క్రితం నటిగా పరిశ్రమలో అడుగుపెట్టాను. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నా.. కాబట్టి ఈరోజు నాకిది మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. నేను ఎంతో ఇష్టపడి నటిని అవ్వడం ఒక ఎత్తైయితే, మీ అందరూ ప్రేమ, అభిమానంతో నన్ను ఆదరించడం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ ఈ ప్రయాణాన్ని గుర్తుండేలా చేసిన నా అభిమానులకు కృతజ్ఞతలు. ఇకపై మరింత కష్టపడి మంచి పాత్రలతో అలరిస్తానని మాట ఇస్తున్నా. థాంక్యూ ఆల్’ అంటూ రాసుకొచ్చింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా గతేడాది 2021 ఫిబ్రవరి 12న విడుదలైంది. కరోనా సమయంలో విడుదలైన ఈ టాలీవుడ్ బాక్సాఫీసుకు బ్లాక్బస్టర్ హిట్ అందించింది. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వలో వైష్ణవ్-కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్ నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీర ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. ఈ మూవీకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: ‘ఖిలాడి’ మూవీ రివ్యూ ఇందులో వైష్ణవ్ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రంగ రంగ వైభవంగా మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి: Jagapathi Babu: 60వ పుట్టిన రోజు సందర్భంగా జగపతి బాబు కీలక నిర్ణయం Get Ready to meet Rishi & Radha❤️ in Theaters near you!#RangaRangaVaibhavanga in theaters from May 27th! A Rockstar @ThisIsDSP Musical 🎹 Directed by @GIREESAAYA #RRVonMay27#PanjaVaisshnavTej #Ketikasharma #RRVTheFilm @SVCCofficial @BvsnP pic.twitter.com/Ez2BlRJKLS — Panja Vaisshnav Tej (@VaisshnavTej) February 11, 2022 -
'రంగ రంగ వైభవంగా' ఫస్టు సింగిల్ రిలీజ్
Telusa Telusa Song From Ranga Ranga Vaibhavanga Is Out: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'రంగరంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుసా తెలుసా అనే ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు. 'తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో' అంటూ ఈ పాట సాగుతుంది. శంకర్ మహదేవన్ ఈ పాటను పాడారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడదులపై త్వరలోనే అప్డేట్ రానుంది. -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ చూశారా?
Vaisshnav Tej and Ketika Sharma First Look Released: వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ను డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం∙టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్, టీజర్ను విడుదల చేశారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించేలా రూపొందుతోన్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్ను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మెగా మేనల్లుడికి హీరోయిన్ బటర్ ఫ్లై కిస్!
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలకు సంతకం చేశాడు. ఈ క్రమంలో వచ్చిన 'కొండపొలం' పెద్దగా విజయం సాధించలేకపోయింది. తాజాగా తన మూడో సినిమాను అధికారికంగా ప్రకటించాడు వైష్ణవ్. గిరీశాయ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్కు ఫిక్స్ చేశారు. ఈ మేరకు సోమవారం(జనవరి 24) టైటిల్ టీజర్ను కూడా వదిలారు. ఇందులో యంగ్ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్తో జోడీ కట్టింది. అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్ ఫ్లై కిస్ను బహుమతిగా ఇచ్చింది. ఇది నెక్స్ట్ లెవల్లో ఉందన్న హీరో డైలాగ్తో టీజర్ పూర్తైంది. ఇది మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అని, ఇది కూడా ఉప్పెనంత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
క్యూట్ వీడియోతో వైష్ణవ్కు బర్త్డే విషెస్ చెప్పిన నిహారిక
మెగా మేనల్లుడు, యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నేటితో 32వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. నేడు(జనవరి 13) వైష్ణవ్ బర్త్డే. ఈ సందర్భంగా అతడికి మెగా ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక వైష్ణవ్ బర్త్డే సందర్భంగా అతడి కొత్త ప్రాజెక్ట్స్ను ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ఫ్యాన్స్తో పాటు వైష్ణవ్కు సినీ సెలబ్రెటీలు కూడా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక వైష్ణవ్కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఓ క్యూట్ వీడియోను షేర్ చేస్తూ ఈ మెగా మేనల్లుడికి విషెస్ చెప్పింది. ఈ వీడియోలో నిహారిక, వైష్ణవ్లు చిన్న పిల్లల్లా కొట్టకుంటూ కనిపించారు. పిల్లలు ఆడుకునే ప్లెయింగ్ నెట్లో కూర్చుని బాల్స్తో వీరిద్దరూ కొట్టుకుంటున్న వీడియోను నిహారిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి ‘ఈ వీడియో మన ఇద్దరి మధ్య బాండింగ్ను నిర్వచిస్తుంది(ఎప్పుడూ గొడవ పడుతూ, పక్కవారికి ఇబ్బంది లేకుండా సైలెంట్ జోక్స్తో మా వెర్రిలో మేముంటాం). మాటల కంటే చర్యలు పెద్దవి అనడానికి ఇది ఉదాహరణ. నేను ఇంతవరకు చూడని స్వచ్చమైన మనసు, వ్యక్తిత్వం నీది. ఇతరులకు అవసరం ఉన్నప్పడు సాయం చేసే మొదటి వ్యక్తివి నీవే. ధైర్యంతో, కష్టపడి పని చేసే వ్యక్తిత్వమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది వైషు. అందుకే నేనెప్పుడూ నీకు పెద్ద అభిమానిని. హ్యాపీ బర్త్డే వైషుగా. మై రాక్స్టార్’ అంటూ రెడ్ హర్ట్ ఎమోజీని జత చేసి షేర్ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరి బాండింగ్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. అంతేగాక ఈ పోస్ట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ వైష్ణవ్కు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
టీవీలో అదరగొట్టిన 'కొండపొలం'
మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి . దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ అందుకోలేదు. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి టీఆర్పీ దక్కించుకుంది కొండపొలం. అర్బన్ ఏరియాలో 12.34 టీఆర్పీ రాగా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మొత్తం కలిపి 10.54 రేటింగ్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రమే ఆడిన కొండపొలం ఈ స్థాయిలో రేటింగ్ రాబట్టుకోవడం విశేషమే అంటున్నారు సినీలవర్స్. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
ప్రముఖ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
మెగా మేనల్లుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు(జనవరి 13) వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రనిర్మాత నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో నిర్మితమవుతున్న 'సార్', నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ' డిజే టిల్లు', చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే. -
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే..
Kondapolam Movie Streaming Now On OTT: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 8 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఎంఎస్ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం ఈ మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత కొండపోలం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్ఎస్కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో రకుల్ ఒబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు -
‘కొండ పొలం’మూవీ రివ్యూ
టైటిల్ : కొండ పొలం నటీనటులు : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, హేమ, అంటోని, రవిప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్ ఎడిటింగ్: శ్రావన్ కటికనేని విడుదల తేది : అక్టోబర్ 8,2021 ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం కథేంటంటే..? కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ అలియాస్ రవీంద్ర(వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్తాడు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో అతనికి ఉద్యోగం లభించదు. దీంతో అతను తిరిగి పల్లెకు వస్తాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన రవీంద్రకు తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొంతమంది కొండపొలం(గొర్రెల మందలను తీసుకొని అడవుల్లోకి వెళ్లడం)చేస్తున్నారని, తమ గొర్రెలను కూడా తీసుకొని వారితో నల్లమల అడవుల్లోకి వెళ్లమని చెబుతాడు. పెద్ద చదువులు చదివిన రవీంద్ర.. తాత సలహాతో నాన్న గురప్ప (సాయి చంద్)కు సహాయంగా అడవికి వెళ్తాడు. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? ‘కొండపొలం’అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని ఏవిధంగా ఫారెస్ట్ ఆపీసర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే... మంచి చదువు ఉండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. ‘ఉప్పెన’లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించి వైష్ణవ్... కొండపొలంలో గొర్రె కాపరుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కనిపించాడు. ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ అద్భుత నటను కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్ని డామినేట్ చేసిందనిపిస్తుంది. ఆమె పాత్ర తీరే అలా ఉండడం అందుకు కారణం. అడవికి వచ్చిన రవీంద్రలో పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణమైన ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసింది రకుల్. రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్, హేమ, మహేశ్ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... అడవుల పరిరక్షణ, జంతువులను వేటాడే వేటగాళ్ల మీద, స్మగ్లర్ల మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మృగరాజు’నేపథ్యం కూడా ఇదే. అయితే పశువులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్దతిపై ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూస్తే ‘కొండపొలం’ ఓ కొత్త సినిమా అనే చెప్పాలి. ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో ‘కొండపొలం’చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా అదే పేరుతో వెండితెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు కూడా సన్నపురెడ్డి అందించడం గమనార్హం. అయితే నవలలో లేని ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి సృష్టించారు. గొర్రె కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై చాలా సహజసిద్దంగా ఆవిష్కరించారు. గొర్రెలను తమ సొంత బిడ్డలుగా భావించే గొర్రెకాపరులు..వాటికి ఆహారం అదించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపొలం చేయడం అంటే మామూలు విషయం కాదు. అడవితో మనిషికి ఉండే బంధాన్ని చక్కడ చూపించాడు డైరెక్టర్. పిరికి వాడైన హీరో.. తన గొర్రెలను కాపాడుకోవడం కోసం పులితో పోరాటం చేయడం సినిమాకు హైలైట్. అయితే ‘కొండపొలం’నవల చదివినప్పుడు కలిగే ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండకపోవడం మైనస్. అలాగే కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్లో సాగినంత వేగం.. సెకండాఫ్లో లేదు. ఓబులమ్మ-రవీంద్ర ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’,‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’లాంటి డైలాగ్స్ హృదయాన్ని తాకడంతో పాటు ఆలోచింప చేస్తాయి. కీరవాణి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘రయ్ రయ్ రయ్యారే’అంటూ తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్కి ప్రాణం పోశాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ శ్రవణ్ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కమర్షియల్గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక మూవీని చూశామనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడికి కలుగుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘కొండపొలం’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. ‘ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ నటిస్తున్న చిత్రం.. క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తెరకెక్కించడంతో ‘కొండపొలం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గొర్రెల కాపరుల జీవనం, సంస్కృతిని ఓ అందమైన ప్రేమ కథ మధ్య అల్లి చెప్పినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఇందులో గొర్రెల కాపరిగా వైష్ణవ్ కనిపిస్తుండగా, అదే సామాజిక వర్గానికి చెందిన యువతిగా రకుల్ నటిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: ‘కొండపొలం’ మూవీ రివ్యూ ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Just watched #KondaPolam A beautiful rustic love story with a powerful message. I love how Krish always deals with different genres & picks pertinent issues & extracts fantastic performances from artists.I trust this film will win as much acclaim & awards as it will get rewards. pic.twitter.com/tv4bZTv07q — Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021 #KondaPolam REVIEW 👇👍#PanjaVaisshnavTej #RakulPreetSingh #KondaPolamReview #KondaPolamMovie #Rakul #RakulPreet #VaisshnavTej pic.twitter.com/LUssnhol3o — Filmatic Corner (@FILMATICCORNER) October 8, 2021 #KondaPolam superb reviews so far Looks another blockbuster for Vaishnav@Rakulpreet #RakulPreet #VaishnavTej pic.twitter.com/NKpoXoYkXt — Telugu Cinema Fun (@TCinemaFun) October 8, 2021 #KondaPolam Movie Review : కొండపొలం మూవీ రివ్యూ 👌👌#PanjaVaisshnavTej #KondaPolamreview #Thetelugunews @DirKrish @Rakulpreet @KChiruTweets https://t.co/BBlYiIg2em — The Telugu News (@TheTeluguNews1) October 8, 2021 #KondaPolam trending in India 👌👍#KondaPolamInTheaters 🐅⛰️ Book Tickets🎟 https://t.co/QgtzJAW2Pd#RoaringKondaPolam #PanjaVaisshnavTej @RakulPreet @DirKrish @mmkeeravaani @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/ScWOUE67bY — AN Media (@anmediaoffl) October 8, 2021 #KondaPolam review should be like must avoided film of the year — Mr.T (@navadheepchowd3) October 8, 2021 #KondaPolam 1st half Rod — Ramakrishna (@krkrishnagoud) October 8, 2021 Krish sir mark first half.#KondaPolam — Pk3Vk (@pk3vk) October 8, 2021 Mega Tiger Second Blockbuster Anta 🐆#KondaPolam — Sanjay Sahu (@bhaaagi_) October 8, 2021 -
‘కొండపొలం’ మూవీపై చిరంజీవి రివ్యూ
‘ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక్క రోజు ముందే అంటే గురువారం ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి, అందరికి కంటే ముందే రివ్యూ ఇచ్చేశారు. సినిమా వీక్షించిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. అందమైన ప్రేమ కథతో అద్భుతమైన సందేశం ఇచ్చారని ప్రశంసించారు. ‘సాధారణంగా క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్కు లోనవుతారనే మాట వాస్తవం. నేనైతే కొండపొలంకు సంబంధించిన పుస్తకం ఏదీ చదవలేదు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామా.. క్రిష్గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అనగానే.. నేను ‘వెంటనే సినిమా చెయ్. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్ అంటేనే వెరైటీ ఆఫ్ మూవీ చేసే అవకాశం దొరుకుతుంది. మంచి పెర్ఫామెన్స్కు స్కోప్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్కు ఛాన్స్ ఉంటుంది అన్నాను. నేనెదైతే అన్నానో.. వైష్ణవ్ తేజ్ నటన కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. క్రిష్ సినిమాలను నేను ముందు నుంచి చూస్తూ వస్తున్నాను. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. ‘కొండపొలం’ విషయానికి వస్తే, గత చిత్రాల కంటే విభిన్నంగా ఉంది. చక్కటి రస్టిక్ లవ్స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్తో కూడిన లవ్స్టోరి. ఆర్టిస్టుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటనను బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. క్రిష్కు, నిర్మాతలకు, వైష్ణవ్, ఇతరులకు ఆల్ ది బెస్ట్’ అని చిరంజీవి అన్నారు. -
మహేశ్.. ప్రభాస్లా నాకూ చేయాలని ఉంది: వైష్ణవ్ తేజ్
‘‘మా మామయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్), అన్నయ్య (సాయితేజ్)కు ప్రేక్షకుల్లో ఇమేజ్ రావడం చూశాను. కానీ నాకో ఇమేజ్ వస్తే ఎలా రియాక్ట్ రావాలో ఆలోచించలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు అందరూ నన్ను చూస్తుంటే బిడియంగా ఉంటుంది’’ అన్నారు హీరో వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. ‘బిబో’ శ్రీనివాస్ సమర్పణలో జె. సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► క్రిష్గారి సినిమాలన్నా, మేకింగ్ అన్నా నాకు చాలా ఇష్టం. ‘వేదం, గమ్యం’ సినిమాలు బాగా నచ్చాయి. క్రిష్గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసమని అనుకోలేదు. పైగా అప్పటికి నా ‘ఉప్పెన’ విడుదల కాలేదు. నేను ఆయన ఇంటికి వెళ్లాక ‘కొండపొలం’ కథ చెప్పారు. నా రెండో సినిమాకే క్రిష్ వంటి సీనియర్తో పని చేసే అవకాశం రావడం సంతోషంగా అనిపించింది. ► ‘కొండపొలం’ అనే అంశమే కొత్తది. నేనెప్పుడూ వినలేదు. క్రిష్గారు కొత్త కథ చెప్పాలనుకున్నారు.. పైగా నాకూ కథ కొత్తగా అనిపించడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమా కోసం కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. అయితే ఎండలో రోజంతా మాస్కులు పెట్టుకుని చేయడం కష్టంగా అనిపించింది. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదగడమే ‘కొండపొలం’ కథ. అడవితో, అక్కడ ఉన్న ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఈ కథ, పాత్రలు చాలా కొత్తగా అనిపిస్తాయి. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకూ అలాంటి కమర్షియల్ కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్, మహేశ్బాబు అన్నల్లా నాక్కూడా కొట్టాలనిపిస్తుంది (సినిమాలో విలన్లను). మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త పాత్రలు చేయాలనిపిస్తుంది. ► ‘కొండపొలం’ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదు. కొన్ని పదాలు మాత్రం యాసలోనే మాట్లాడాలని క్రిష్గారు చెప్పారు.. అలానే చేశాను. నా రెండో సినిమాకే కీరవాణిగారితో పని చేయడం నా అదృష్టం. ► కథకు తగ్గట్టు సినిమా తీశారా? లేదా? అని ఇప్పుడే చెప్పేంత అనుభవం నాకు లేదు. నా నటన గురించి నేను జడ్జ్ చేసుకోవడం కంటే దర్శకుడు, ప్రేక్షకులు చెబితేనే బాగుంటుంది. కొన్నిసార్లు బాగా చేశామని మనసు చెబుతుంది.. అలాంటప్పుడు మానిటర్ చూస్తాను. ఓటీటీ ఆఫర్లు వస్తే నటిస్తాను. ప్రస్తుతానికి గిరి సాయితో (తమిళ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు) ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ సినిమా ఉంటుంది. ‘రిపబ్లిక్’ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్గా చేశారు. ‘కొండపొలం’ మూవీలో నేను ఐఎఫ్ఎస్. ‘రిపబ్లిక్, కొండపొలం’ సినిమాకు సంబంధం ఉండదు. అన్నయ్య బాగున్నారు.. భయపడాల్సిన పనిలేదు. ఫిజియోథెరపీ జరుగుతోంది.. త్వరలోనే ఆస్పత్రి నుంచి బయ టకు వస్తారు. అడవిలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మనకు అడవి ఎంతో ఆక్సిజన్ను ఇస్తుంది. అలాంటి అడవుల్లో ఎక్కువగా చెత్త వేయకూడదనిపించింది. ‘కొండపొలం’ షూటింగ్లో మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తల పొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి ఇష్టమైన పచ్చళ్లతో వాటిని కంట్రోల్ చేశాం. -
ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం
‘‘కొన్ని సన్నివేశాలకో, పాటలకే పరిమితం అయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను.. అందుకే సెలెక్టివ్గా ఉంటున్నాను. ఓబులమ్మ పాత్ర నన్ను ఎగై్జట్ చేయడంతో ‘కొండపొలం’ సినిమా చేశాను’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్రెడ్డి, జె.సాయిబాబు నిర్మించిన ఈ సినిమా రేపు(8న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రకుల్ ప్రీత్సింగ్ పంచుకున్న విశేషాలు... ► ‘కొండపొలం’ కథ చెప్పేందుకు క్రిష్గారు ఇంటికి వచ్చినప్పుడు నేను షార్ట్, టీషర్ట్లో ఉన్నాను. ‘చాలా యంగ్గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్గారు ఎగై్జట్ అయ్యారు. ఆయన కథ చెబుతున్నప్పుడే వెంటనే ఓకే చెప్పేశాను. గొర్రెల కాపర్ల గురించి ‘కొండపొలం’ లాంటి చిత్రం ఇంత వరకూ ఇండియాలో రాలేదు. ► ‘కొండపొలం’ లో పూర్తిస్థాయిలో గొర్రెలు కాసే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. అడవిలో గొర్రెలను కంట్రోల్ చేయడానికి నేను, వైష్ణవ్ మొదట్లో చాలా కష్టపడ్డాం. అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగైదు రోజుల్లోనే ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది. ► ‘కొండపొలం’ చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ, షూట్ చేయడం చాలా కష్టమైంది. కీరవాణిగారి సంగీతం అద్భుతంగా ఉంది. ► ఈ నెల 10న నా పుట్టినరోజు. అయితే ఆ రోజు ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. షూటింగ్లో ఉంటాను. ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏదీ అంగీకరించలేదు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేయాలని ఉంది. కరణం మల్లీశ్వరీ బయోపిక్ చేస్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదు. ► నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. కానీ మనం ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి. ఒక డీడీఎల్జే (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే), ఒక ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తే చాలనిపిస్తోంది. అలాంటి కేటగిరిల్లో ‘కొండపొలం’ కూడా ఉంటుందని నమ్ముతున్నాను. సాయి తేజ్తో నేరుగా మాట్లాడలేదు. వైష్ణవ్ తేజ్ నుంచి తేజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. -
ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది: డైరెక్టర్ క్రిష్
‘‘కొండపొలం’ ఫైనల్ కాపీ చూసినప్పుడు ‘ఇదీ సినిమా అంటే’ అనిపించింది. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారు’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ..‘‘కీరవాణిగారు మా సినిమాకి ఓ గైడ్లా పని చేశారు. ‘కొండపొలం’ హిట్ అనేది నాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి చాలా అవసరం. ఇప్పుడున్న థియేటర్లకి, మా మనుగడకు అవసరం. చాలా గొప్ప సినిమా, చాలా జాగ్రత్తగా తీశానని బలంగా నమ్మాను.. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు’’ అన్నారు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ...‘‘నా మొదటి చాప్టర్ ‘ఉప్పెన’ అయితే రెండో చాప్టర్ ‘కొండపొలం’. ఈ చిత్రంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. క్రిష్, రాజీవ్, జ్ఞానశేఖర్గార్లకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్లో సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాళ్లు చాలా కష్టపడ్డారు.. వారందరి కష్టమే ఈ ‘కొండపొలం’. జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా లేవాలనే ఒక స్ఫూర్తిని మా సినిమా కలిగిస్తుంది. రవీంద్ర అనే ఓ మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు క్రిష్గారికి థ్యాంక్స్’’ అన్నారు. రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’, వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ‘కొండపొలం’ మేమే నిర్మించాం. ‘కొండపొలం’తో వైష్ణవ్ స్టార్ అవుతాడు. రకుల్ ఎంతో అంకితభావంతో ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసినందుకు థ్యాంక్స్. క్రిష్కి గ్రేట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని జీవితాలను చూసి నేను రాసిన పాత్రలకు క్రిష్గారు తెరపై జీవం పోసి, సినిమాగా తీశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ జ్ఞానశేఖర్, దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు, లక్ష్మీకాంత్ చెన్నా, పాటల రచయిత చంద్రబోస్, నటి హేమ, ‘మ్యాంగో మీడియా’ రామ్, నటులు సాయిచంద్, రవి, మహేశ్ విట్టా తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఫిల్మ్ మేకింగ్లో నాకు నచ్చింది అదే!
‘‘దర్శకులంతా కలిసినప్పుడు పుస్తకాల గురించి చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో ఓసారి డైరెక్టర్స్ అందరం కలిసినప్పుడు ‘కొండపొలం’ నవల గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ, సుకుమార్ గార్లు చెప్పడంతో చదివాను.. బాగా నచ్చడంతో సినిమాగా తీశా’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా క్రిష్ చెప్పిన విశేషాలు. ►సాహసం నేపథ్యంలో ఓ కథ చెప్పాలనుకున్నాను. ఆ సమయంలో ‘సప్తభూమి, కొండపొలం’ పుస్తకాలు చదివా. ‘కొండపొలం’ బాగా నచ్చడంతో ఆ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని కలిసి హక్కులు తీసుకున్నాం. ‘కొండపొలం’ హక్కులు కొన్నావా? అని సుకుమార్ అడిగారు. నేను తీసుకున్నానని చెప్పడంతో వదిలేశారు. లేకుంటే ఆయన తీసుకోవాలనుకున్నారు. ‘సప్తభూమి’ నవల హక్కులు కొనేందుకు ట్రై చేశాం.. కానీ కుదరలేదు. ►రచయితకు విపరీతమైన పరిధి ఉంటుంది. పుస్తకం రాయడం వేరు.. సినిమాగా తీయడం వేరు. సన్నపురెడ్డి ‘కొండపొలం’ అద్భుతమైన కథ.. స్క్రీన్ప్లే చక్కగా ఉంటుంది. ఆ కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. కానీ దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే బాగుంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. దాన్ని సన్నపురెడ్డికి చెప్పాను.. ఆయనే ఈ సినిమాకు కథనం రాయడం వల్ల నాకు సులభం అయ్యింది. ►వైష్ణవ్ను తన పదో తరగతి అప్పుడో ఇంటర్లోనో చూశాను. ‘కొండపొలం’ అనుకున్నప్పుడు తనను ఓ పార్టీలో చూశా. అప్పటికింకా తన ‘ఉప్పెన’ చిత్రంలోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాట రాలేదనుకుంటాను. ఆ పాట చూడమన్నాడు.. చూడగానే వైష్ణవ్ తేజ్ కళ్లు బాగా అట్రాక్ట్ చేశాయి. కొండపొలం’లో రవీంద్ర పాత్రకు వైష్ణవ్ తేజ్ సరిపోతాడనిపించింది. వైష్ణవ్ని ఇంటికి పిలిపించి సినిమా గురించి చెప్పాను. వైష్ణవ్కి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ ఉండదు. నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది.. అందుకే ‘ఉప్పెన’, ‘కొండపొలం’ లాంటి కథలు ఎంచుకున్నాడు. ►ఓబులమ్మ పాత్రకు రకుల్ ప్రీత్ సరిపోతారని కెమెరామేన్ జ్ఞానశేఖర్ చెప్పారు. ఈ కథను రకుల్కు చెబుతున్నప్పుడే ఆమె హావాభావాలు చూసి ఈ పాత్రకు సరిపోతుందనుకున్నాను. తనకూ కథ నచ్చడంతో పాత్ర కోసం మరింత సన్నబడింది. ►గొర్రెలను అడవులకు తీసుకెళ్తే పులులు వస్తాయని గోవాలో షూటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. నల్లమలలో తీద్దామనుకుంటే కోవిడ్ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్ అడవుల్లో చేశాం. కొండపై దాదాపు 1000 గొర్రెలతో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఉదయం 6:30 గంటలకే అందరం సెట్స్లో ఉండేవాళ్లం. ఈ సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరిలా భావిస్తాం.. అంతలా కథలో లీనమవుతాం. ►‘కొండపొలం’ కోసం సంగీత దర్శకునిగా ముందుగా కీరవాణిగారి తనయుడు కాలభైరవకి ఫోన్ చేశాను. ‘కొండపొలం’ చదివి కీరవాణిగారు ఎగై్జట్ అయ్యారు. మీ కంటే ముందు ఓ మ్యూజిక్ డైరెక్టర్కు ఫోన్ చేశానని కీరవాణిగారికి చెప్పడంతో ఎవరు? అన్నారు. కాలభైరవ అంటే నవ్వారు. ‘ఎవరు కావాలో నువ్వే తేల్చుకో?’ అనడంతో ‘మీరే కావాలి’ అన్నాను. ∙ఫిల్మ్ మేకింగ్లో నాకు నచ్చింది రచనే. ఇప్పుడు నేను హాట్ స్టార్కు ఓ కథ రాస్తున్నాను. నేను చేసే ప్రతి సినిమా ఓ కొత్త అధ్యాయంలా ఉంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. ‘అతడు అడవిని జయించాడు’ స్ఫూర్తితో వెంకటేశ్గారితో అడవి నేపథ్యంలో సినిమా చేయాల్సింది... కానీ కుదర్లేదు. -
గాజువాకలో వైష్ణవ తేజ్, కృతిశెట్టి సందడి
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఉప్పెన ఫేం వైష్ణవ తేజ్, కృతిశెట్టి గాజువాకలో సందడి చేశారు. కొత్తగాజువాకలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి వీరు రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. గాజువాక ప్రధాన రహదారి జనంతో స్తంభించింది. అభిమానులనుద్దేశించి వైష్ణవ తేజ్ మాట్లాడుతూ తొలిచిత్రమే అఖండ విజయం సాధించిందని, దానికి కారణం అభిమానులేనని పేర్కొన్నారు. అభిమానులు మెచ్చే చిత్రాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో నటించిన కొండపొలం చిత్రం ఈ నెల 8న విడుదలవుతుందన్నారు. ఆ చిత్రాన్ని ఆదరించాలన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ..విశాఖలో ఉప్పెన షూటింగ్ జరిగిందని, ఇక్కడ ఎన్నో సుందర ప్రాంతాలకు ఫిదా అయ్యాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని కృతి పేర్కొన్నారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వస్త్ర ప్రపంచంలో మరింత రాణించాలని వైష్ణవ్తేజ్, కృతిశెట్టి ఆకాంక్షించారు. -
కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఫోటోలు
-
దేశం గర్వపడేలా చేసే కుర్రాడి కథ ఇది: వైష్ణవ్ తేజ్
‘‘నేను సినిమా తీసింది ఒకెత్తు అయితే.. కీరవాణిగారి సంగీతం మరో ఎత్తు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కీరవాణిగార్లు అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మన్యూనత భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు తనకు దక్కాల్సినదాన్ని ఎలా సాధించుకున్నాడు అనేది కథ. రాజీవ్ వల్లే ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను’’ అన్నారు క్రిష్. వైష్ణవ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండపొలం’. ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో జరిగిన ఆడియో విడుదల వేడుకలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణిగారే ఈ రోజు హీరో. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను తెరపైకి తీసుకుని వచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఎప్పుడూ తలెత్తుకుని దేశం గర్వపడేలా చేయాలని క్రిష్ చెబుతుంటారు. తలెత్తుకుని ఉంటూ దేశం గర్వపడేలా చేయాలనుకునే ఓ కుర్రాడి కథ ఇది’’ అన్నారు. ‘‘అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునేలా ఈ చిత్రంలో ఓ మంత్రాన్ని (రయ్...రయ్..) కంపోజ్ చేశాను’’ అని కీరవాణి అన్నారు. ‘‘కీరవాణిగారితో మళ్లీ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రాజీవ్రెడ్డి. ‘‘నల్లమల అడవుల్లో నలభై రోజులు ఉండి, అక్కడి సంఘటనలతో ‘కొండపొలం’ నవల రాశాను. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఆలోచిస్తారు. ఒకటి రెండు శాతమే ఉండే ఫ్యాక్షన్ను తీసేసి 98 శాతం ఉండే రైతులు, గొర్రెల కాపర్లు, అట్టడుగువర్గాల వారి కష్టాల గురించి చెప్పే కథ ఇది’’ అన్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు కర్నూల్లో ‘కొండపొలం’ ఆడియో ఫంక్షన్
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. ఇందులో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎమ్ఎమ్ కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు విడుదలైన ఈ మూవీలో సెకండ్ సాంగ్కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కొండపొలం’ ఆడియో రిలీజ్ ఈవెంట్ రేపు కర్నూల్లో జరగనుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. కర్నూల్లోని సంతోష్ నగర్ కాలనీలోని కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా అక్టోబర్ 8న ఈ మూవీ థియేటర్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. #KondaPolam Audio Release Event on 2nd Oct 5PM onwards in KURNOOL 🔥 An @mmkeeravaani Musical🎶 Roaring in Theatres from Oct 8th 💥🐅#KondaPolamOct8 #PanjaVaisshnavTej @RakulPreet @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/iHFF36AGwp — Krish Jagarlamudi (@DirKrish) October 1, 2021 -
కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
Shwaasalo Lyrical Video From Kondapolam: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఓ..ఓ ఓబులమ్మా సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటని విడుదల చేశారు. ‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. కీరవాణి సంగీతం అందించినీ పాటను యామిని ఘంటసాల, పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ పాటలో వైష్ణవ్, రకుల్ మధ్య కెమిస్ట్రీని ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ మూవీ స్టిల్స్
-
ఆకట్టుకుంటున్న ‘కొండపొలం’ ట్రైలర్, వైష్ణవ్ను ఆటపట్టిస్తున్న రకుల్..
Vaishnav Tej Kondapolam Trailer Out: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్, టీజర్, లిరికల్ సాంగ్కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘కొండపొలం’ ట్రైలర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. Embark on the Astounding Journey of #KondaPolam - "An Epic Tale of Becoming" ▶️ https://t.co/qlLNaZIJ9C#KondaPolamTrailer Out Now!#KondaPolamOct8#PanjaVaisshnavTej @Rakulpreet @mmkeeravaani @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel — Krish Jagarlamudi (@DirKrish) September 27, 2021 ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ విషయానికొస్తే.. వైష్ణవ్, రకుల్ల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్ర యాదవ్గా వైష్ణవ్ కనిపించాడు. అడవి నేపథ్యం నుంచి బాగా చదువుకున్న యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అతడు ఎదుర్కొ అవమానాలను ట్రైలర్లో చూపించారు. ఇక రకుల్, వైష్ణవ్ మధ్య సాగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ‘చదువుకున్న గొర్రె చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా?’ అంటూ రకుల్.. వైష్ణవ్ ఆటపట్టిస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక గొర్రెల కోసం వైష్ణవ్ చేసే సాహస సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్ వర్షంలో సైక్లింగ్ చేసిన సమంత.. వీడియో వైరల్ -
దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్ తేజ్
Vaishnav Tej Emotional Speech At Republic Pre Release Event:మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’.హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమా గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అన్నయ్య కోలుకోవాడనికి కారణం డాక్టర్లు అయితే, మీ అందరి ప్రేమాభిమానాలతోనే త్వరగా కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ స్పాట్లో వెంటనే ఆంబులెన్స్కు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లిన వాళ్లంత ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి అందరూ బైక్పై హెల్మెట్ వేసుకొని వెళ్లండి. ఒక తమ్ముడిగా, అన్నయ్యలా,కొడుకులా చెబుతున్నా. ప్లీజ్ మీ అందరిలా ఎవరికి ఏమైనా అయినా మేమందరం బాధపడతాం' అంటూ వైష్ణవ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక రిపబ్లిక్ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. -
సెట్స్లో పుట్టినరోజు జరుపుకున్న ఉప్పెన భామ కృతి శెట్టి..
-
‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్.. ఆకట్టుకున్న వైష్ణవ్, రకుల్ లవ్ ట్రాక్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్-వైష్ణవ్తేజ్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘కొండపొలం’. ఈ సినిమాలో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, టీజర్లకు విశేషణ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ..ఓ ఓబులమ్మా.. బుట్ట చెండు ఆటలో నా పూల కొమ్మా’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా వైష్ణవ్ తేజ్.. రకుల్ను ఊహించుకుంటూ ఈ పాట పాడుతుంటే.. లంగావోణిలో రోలు తప్పితూ ఈ పాటలో గొంతు కలిపింది రకుల్. ఈ సాంగ్లో వైష్ణవ్-రకుల్ మధ్య కెమిస్ట్రీ బాగా పడింది. చదవండి: హీరోయిన్ రకుల్ని ఇలా ఎప్పుడైనా చూశారా? వీరి లవ్ ట్రాగ్ పాటకు అట్రాక్షన్గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను గాయకులు సత్య యామిణి, పీవీఎన్ఎస్ రోహిత్లు ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, చంద్రబోస్లు పాటకు సాహిత్యం అందించారు. కొండపొలం నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్ లంబోర్ఘిని, చరణ్ ఫెరారీ..