Wife killed husband
-
మెడకు చున్నీ బిగించి భర్తను చంపిన భార్య
మియాపూర్: నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయింది ఆ ఇల్లాలు. సహనం కోల్పోయి అతని మెడకు చున్నీ బిగించి చంపేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్ లస్కర్ (35), రుస్తానా బేగం లస్కర్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి మియాపూర్ హాఫీజ్పేటలోని ప్రేమ్నగర్ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అలీ హుస్సేన్ లస్కర్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడు. పిల్లలను కొట్టేవాడు. సోమవారం రాత్రి అలీ హుస్సేన్ లస్కర్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్య రుస్తానాతో గొడవ పడ్డాడు. మంగళవారం తెల్లవారు జామున మళ్లీ గొడవ పడడంతో సహనం కోల్పోయిన రుస్తానా చున్నీతో భర్త అలీ హుస్సేన్ లస్కర్ మెడకు బిగించింది. దీంతో అతడు మృతి చెందడంతో అక్కడి ఆమె నుంచి ఆమె పారిపోయింది. మృతుడి సోదరుడు అక్బర్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రుస్తానా బేగంను బుధవారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. భర్త వేధింపులకు విసుగు చెంది చునీతో మెడకు బిగించి తానే హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఆటో డ్రైవర్తో వివాహేతర సంబంధం.. బోనాల పండుగకు రప్పించి..
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోర్వెల్ డ్రిల్లర్ సల్ల సైదులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సఖ్యతకు అడ్డొస్తున్నాడన్న కారణంతో హతుడి ఇల్లాలు, ఆమె ప్రియుడు, మరో పాత్రధారుడితో కలసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సోమవారం డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సల్ల సైదులుకు శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి.సైదులు బోర్వెల్పై డ్రిల్లర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం గ్రామానికి వచ్చి కట్టెకోత పనికి వెళ్తున్నాడు. మూడేళ్లుగా వివాహేతర సంబంధం సైదులు బోర్వెల్ డ్రిల్లర్గా పనిచేస్తున్న క్రమంలో నెలల తరబడి విధి నిర్వహణలో ఉంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ధనమ్మ తరచూ గురజాలలోని పుట్టింటి వద్దే ఎక్కువగా ఉంటుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎడ్ల నవీన్తో మూడేళ్ల క్రితం ధనలక్షి్మకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ధనలక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండడంతో సైదులు అనుమానించాడు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. విషయం పెద్దమనుషుల వద్దకు చేరడంతో సర్దిచెప్పగా ప్రస్తుతం సజావుగానే కాపురం సాగుతోంది. బోనాల పండుగకు రప్పించి.. ధనలక్షి్మని పుట్టింటికి వెళ్లనీయకుండా తమ సఖ్యతకు సైదులు అడ్డొస్తున్నాడని ఎడ్ల నవీన్ కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని ప్రియురాలు ధనలక్షి్మతో కలసి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే సైదులు, ధనలక్ష్మి, పిల్ల లను తీసుకుని ఈ నెల 10వ తేదీన గురజాలలోని పుట్టింటికి వచ్చారు. అనుకున్న పథకం ప్రకారం సైదులు హత్య చేసేందుకు నవీన్ తన సమీప బంధువు స్వామి సహాయం కోరాడు. అందుకు అతడు ఒప్పుకోవడంతో ఈ నెల 11వ తేదీన ఇద్దరూ కలసి ధనలక్ష్మి పుట్టింటికి వచ్చారు. అనంతరం మద్యం తాగేందుకు సైదులును వెంటబెట్టుకుని ఆటోలో అమ్మనబోలుకు వెళ్లారు. అక్కడ నవీన్, స్వామి, సైదులు మద్యం తాగారు. పూటుగా మద్యం తాగిన సైదులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం నవీన్, స్వామి ఇద్దరూ కలసి ఆటో స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో సైదులు మెడకు ఉరి బిగించారు. అనంతరం సైదులు ఆటోలో వేసుకుని మోత్కూరు మండలం పొడిచేడులోని మూసీ నది బ్రిడ్జి వద్ద మట్టిరోడ్డులోకి వెళ్లి చనిపోయాడో లేదోనని మరో సారి తాడుతో ఉరి బిగించి ఘాతుకానికి ఒడిగట్టారు. ఆపై మృతదేహాన్ని పొడిచేడు లోని మూసీ నది ఒడ్డున గంగదేవమ్మ ఆలయం సమీపంలో పడవేసి వెళ్లిపోయారు. నిందితుడిని గుర్తించిన డాగ్స్కా్వడ్ మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలోని మూసీ నది ఒడ్డున వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సైదులు మెడకు రెండు చోట్ల తాడుతో ఉరిబిగించినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికే విష యం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హ తుడి తల్లి గురజాలకు చెందిన నవీన్పై అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో ఆటో గుర్తులను గుర్తించిన పోలీసులు పోలీస్ డాగ్స్వా్కడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే, అప్పటికే నవీన్ తన ఆటోలో ధనలక్ష్మి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆటోలో ఘటనా స్థలానికి తీసుకువచ్చాడు. దీంతో పోలీస్ జాగిలం సైదులు మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆటో చుట్టూ తిరగడంతో పాటు నవీన్ను గుర్తించింది. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మిగతా ఇద్దరు నిందితులు హైదరాబా ద్కు పారిపోతుండగా అనాజిపురం వద్ద పట్టుకున్నట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన తాడు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో పోలీస్ డాగ్స్కా్వడ్ కీలకంగా వ్యవహరించిందని డీసీపీ చెప్పారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరాం, మోత్కూర్ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని ప్రియుడితో కలిసి భర్త హత్య
అనంతగిరి: వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ సంఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లికి చెందిన నక్క రాములు(38) భార్య స్వప్న ఇదే గ్రామానికి చెందిన ఎం.పవన్కళ్యాణ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన రాములు పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాములు గొంతు నులిమి చంపేశారు. ఉదయాన్నే ఏమీ తెలియనట్లు స్వప్న రోదిస్తూ కూర్చుంది. మృతుడి మెడపై గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఇరు కుటుంబాల వారు గొడవ పెట్టుకుని.. పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, పోస్టుమార్టం పూర్తి చేయించారు. వికారాబాద్లో ఉండే మృతుడి చెల్లి ఎన్.యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి విచారణలో అసలు వివరాలు బహిర్గతమయ్యాయి. -
ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. భర్తను చంపి ముక్కలు చేసిన భార్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహా ఘటన మరొకటి వెలుగు చూసింది. కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచింది. ఆ తర్వాత రోజుకు కొన్ని శరీర భాగాల చొప్పున తీసుకెళ్లి గ్రౌండ్లో పడేసింది. పాండవ్ నగర్లో ఈ దారుణం జరిగింది. తల్లి, కుమారుడిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు కలిసే హత్య చేసి, శవాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్రిజ్లో దాచిన శరీర భాగాలను పాండవ్ నగర్లోని గ్రౌండ్తో పాటు, తూర్పు ఢిల్లీలో ఓ చోట పడేసినట్లు వెల్లడించారు. మొదట తూర్పు ఢిల్లీలో ఓ శవం శరీర భాగాన్ని గుర్తించామని.. సీసీటీవీలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch (CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X — ANI (@ANI) November 28, 2022 చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
మూడు నెలల క్రితం తండ్రి మృతి.. తల్లి కాల్ రికార్డు విని కూతురు షాక్
ముంబై: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో విస్తుపోయే ఘటన జరిగింది. తండ్రి చనిపోయిన మూడు నెలల తర్వాత కూతురు షాకింగ్ విషయం కనిపెట్టింది. తన తల్లే తండ్రిని చంపిందని తెలిసి నమ్మలేక పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వాళ్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ నేరం అంగీకరించింది. తానే భర్తను చంపినట్లు ఒప్పుకుంది. ఏం జరిగిందంటే..? రంజన రామ్తెకే భర్త విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఆగస్టు 6న ఆయన గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి రంజన అతడి మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసింది. దీంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్తను చంపేశానని, తెల్లవారాక బంధువులకు ఫోన్ చేసి గుండెపోటుతో చనిపోయాడని చెబుతానని అతనికి చెప్పింది. చెప్పినట్లుగానే మరునాడు అలానే చేసింది. అయితే బంధువులెవరికీ రంజనపై అనుమానం రాలేదు. నిజంగానే ఆమె భర్త గుండెపోటుతో చనిపోయాడు అనుకున్నారు. అంతిమసంస్కారాలు కూడా పూర్తయ్యాయి. అంతా ప్లాన్ ప్రకారమే జరగడంతో రంజన ఇక ప్రియుడితో హ్యాపీగా రిలేషన్ కొనసాగించవచ్చని సంబురపడింది. మూడు నెలల తర్వాత రంజనను చూసేందుకు కూతురు శ్వేత వచ్చింది. ఓ కాల్ చేసుకునేందుకు తల్లి ఫోన్ తీసుకుంది. ఈ క్రమంలోనే కాల్ రికార్డులను పరిశీలించగా ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. రంజన తన భర్తను చంపాక ప్రియుడితో మాట్లాడిన కాల్ రికార్డు అందులో ఉంది. వెంటనే శ్వేత పోలీసులకు సమాచారం అందించింది. వారు రంగంలోకి దిగి రంజన, ఆమె ప్రియుడు ముకేశ్ త్రివేదిని విచారించగా.. నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు కోర్టులో మరోసారి చుక్కెదురు -
రెండేళ్లుగా వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
కాకినాడ లీగల్: పథకం ప్రకారం భర్తను హత్య చేసిన కేసులో భార్యకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.కమలాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఆమెకు ఇష్టం లేకపోయినా 2019 మే 15 తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం చేశారు. వివాహం జరిగిన వారం రోజుల్లోనే సూర్యనారాయణను హతమార్చేందుకు భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు రాధాకృష్ణ పథకం వేశారు. ఇందులో భాగంగా 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడి నుంచి పాతర్లగడ్డ మార్గంలోని çపంట పొలాల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ సూర్యనారాయణను కూర్చోబెట్టి వెంట తెచ్చుకున్న కత్తితో నరికి హత్య చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు అప్పటి కరప ఎస్సై జి.అప్పలరాజు ఈ హత్యపై కేసు నమోదు చేశారు. నాటి కాకినాడ రూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఈ కేసు దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది. దీంతో హత్య చేసినందుకు గాను ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా, సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు గాను ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
డీజే ప్రవీణ్తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య
నల్గొండ (భువనగిరి) : వివాహేతర సంబంధం బయటపడుతుందని ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఆపై ఇద్దరూ కలిసి మృతదేహాన్ని బ్రిడ్జి పైనుంచి కిందపడేసి ప్రమాదంగా చిత్రీకించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేటశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా నర్మెట మండలం హన్మంత్పూర్ గ్రామానికి చెందిన లకావత్ కొంరెల్లి తన భార్య లకావత్ భారతి అలియాస్ సుజాతతో కలిసి జీహెచ్ఎంసీలో పనిచేస్తూ సికింద్రాబాద్లోని నామలగుండు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివాహ వేడుకలో పరిచయమై.. రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో డీజే ప్లే చేసే జనగాం జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన దరావత్ ప్రవీణ్తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంరెల్లి ఈ నెల 18న సొంతూరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. ఆ వెంటనే సుజాత ప్రియుడు ప్రవీణ్కు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇంటికి చేరుకుని దారుణం చూసి.. అయితే, కొంరెల్లి అందరూ నిద్రపోయాయక అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుజాతతో ప్రవీణ్ సఖ్యతగా మెలుగుతుండడాన్ని చేసి హతాశుడయ్యాడు. ఇదేమిటని భార్యతో గొడవపడ్డాడు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని సుజాత, తన ప్రియుడు ప్రవీణ్తో కలిసి కొంరెల్లి మెడకు చున్నీతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అదే రోజు రాత్రి కొంరెల్లి మృతదేహాన్ని బైక్పై వేసుకుని వరంగల్ ప్రధాన రహదారి మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి మండలం అనంతారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి మృతదేహాన్ని కింద పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కాగా, కొంరెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘాతుకాన్ని అంగీకరించింది. అనంతరం ప్రవీణ్ను కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద బైక్, చున్నీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకట్రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సై రాఘవేందర్గౌడ్లు పాల్గొన్నారు. -
నల్లగా ఉన్నావంటూ భార్యతో గొడవ.. గొడ్డలితో భర్తను నరికింది
రాయ్గఢ్: భార్యను పదే పదే నల్లగా ఉన్నావంటూ హేళన చేస్తూ వేధించాడో భర్త. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈసారి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. అదే కసితో భర్తని ఒక్కవేటుతో గొడ్డలితో నరికి చంపింది. అంతేకాదు అతని మర్మాంగాలను సైతం ఛిద్రం చేసి.. ఆపై నేరం నుంచి తప్పించుకునే యత్నం చేసింది. ఛత్తీస్ఘడ్ దుర్గ్ జిల్లా అమలేశ్వర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగీతకు, అనంత్ సోన్వానికి చాలాకాలం కిందట పెళ్లైంది. సంగీత.. అనంత్కు రెండో భార్య. అనంత్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. మొదటి సంతానంతో కలిగిన కొడుకు.. సంగీత బిడ్డ, అనంత్.. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే.. పెళ్లైన నాటి నుంచే భర్త ఆమె రంగును ప్రస్తావిస్తూ.. అసహ్యంగా ఉన్నావంటూ వేధించసాగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గతంలో చాలాసార్లు గొడవ కూడా జరిగింది. ఆదివారం రాత్రి కూడా అలాగే గొడవ జరగ్గా.. ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా భర్త మర్మాంగాలను గొడ్డలితో నరికి.. ముక్కలు చేసింది. భర్త శవం పక్కనే రాత్రంతా పడుకుని పోయిందామె. అయితే.. ఉదయం కాగానే భర్తని ఎవరో చంపారంటూ అరవడం ప్రారంభించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారించే సరికి సంగీత నేరం ఒప్పుకుంది. ఇదీ చదవండి: ఘోరం: కలుద్దామని పిలిచి... కత్తితో దాడిచేసిన ఇక్బాల్ షేక్ -
భర్త గొంతుకు తాడు బిగించి చంపిన భార్య
పాపన్నపేట (మెదక్): భర్త చేసే చిల్లర దొంగతనాలతో విసిగి వేసారిందో? లేక రైతు బీమా డబ్బులకు ఆశపడిందో? తెలియదు గాని.. మెడలో మూడుముళ్లు వేసి తాళి కట్టిన భర్త గొంతుకు తాడు బిగించి చంపేసిందో భార్య. కనిపెంచిన కూతుళ్లు సైతం మానవత్వాన్ని మరచి తల్లికి సహకరించారు. గురువారం రాత్రి 8 గంటలకు ఈ దారుణం జరిగితే.. శుక్రవారం ఉదయం 8 గంటలకు బయటపడిన ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సీతానగరానికి చెందిన రైతు లంగడి బాలయ్య(56), కిసనమ్మ భార్యాభర్తలు. వీరికి రాధమ్మ, వినోద అనే కూతుళ్లు ఉన్నారు. కొడుకు మల్లేశ్ ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లకు గ్రామానికి చెందిన వారికే ఇచ్చి పెళ్లిళ్లు చేశాడు. కాగా, బాలయ్యను ఇంట్లో సరిగా చూడకపోవడంతో మద్యం సేవిస్తూ అప్పుడప్పుడూ చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఇటీవల ఈ కుటుంబం ఏడుపాయల ఆలయంవద్ద విందు చేసుకొని తిరిగి వస్తుండగా, అద్దెకు తీసుకెళ్లిన ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు. దీంతో ట్రాక్టర్ యజమానితో కలసి బాలయ్య.. బాధిత కుటుంబాలకు రూ.2.50 లక్షల పరిహారం చెల్లించాడు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. గురువారం గొడవ తీవ్రం కావడంతో భార్య కిసనమ్మ భర్త గొంతుకు తాడు బిగించగా.. మనవడు దుర్గేశ్, కూతుళ్లు రాధమ్మ, వినోదలు తలోవైపునకు లాగారు. అనంతరం ఇంటి ముందు వీధిలోకి ఈడ్చుకొచ్చారు. అయితే 10వ తరగతి చదువుతున్న మరో మనవడు బాల్రాజ్.. తాతను చంపవద్దని ప్రాధేయ పడినప్పటికీ వారు వినలేదు. అప్పటికే బాలయ్య చనిపోవడంతో అంతా కలసి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. గ్రామస్తుల నిరసన అమాయకుడైన బాలయ్యను అమానుషంగా చంపిన కుటుంబీకులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు నిందితుల ఇంటి ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాపన్నపేట ఎస్ఐ విజయ్, మెదక్ సీఐ విజయ్.. గ్రామస్తులకు నచ్చజెప్పి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను విచారణ కోసం పోలీసు స్టేషన్కు తరలించారు. ఇంటి ముందు బైఠాయించిన గ్రామస్తులు -
పిల్లలను చంపాడని భర్త గొంతుకోసిన భార్య
కొల్లాపూర్ రూరల్: పిల్లలను హత్య చేశాడని కోపంతో రగలిపోయిన ఓ మహిళ తన భర్త గొంతుకోసి హత మార్చింది. తల్లితో కలిసి ఆమె ఈ హత్యకు పా ల్పడిన ఘటన వివరా లిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లకు చెందిన ఓంకార్(40), మహేశ్వరి భార్యా భర్తలు. వీరికి కూతురు, కుమా రుడు ఉన్నారు. ఇటీవల భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 17న భార్య, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి సమీపంలో భా ర్యను బైక్పై నుంచి తోసేసి ఇద్దరు చిన్నారులను తీసుకొని వెళ్లిపోయాడు. కోడేరు మండలం నాగుపల్లి సమీపంలోని అడ్డగట్టు పైకి పిల్లలను తీసుకెళ్లి గొంతుకోసి, తాను కూడా కోసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా ఓంకార్ ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. అప్ప టికే కోపంతో ఉన్న మహేశ్వరి ఆదివారం ఉదయం తన తల్లి జోగమ్మతో కలిసి ఓంకార్ గొంతును కోసి హత్య చేసింది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
కర్నూలు: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. మహానందిలోని ఈశ్వర్నగర్ కాలనీకి చెందిన సంగటి రామును ఈ నెల 4న ముగ్గురు యువకులు కొట్టి, చొక్కాతో గొంతు బిగించి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. సంగటి రాము భార్య మధురేణుక మహానందికి చెందిన బాబా ఫకృద్దీన్ అలియాస్ బాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొన్నాళ్లుగా భార్యాభర్తలు విడిపోయారు. అప్పటి నుంచి మధురేణుక నంద్యాలలోని బొమ్మలసత్రంలో నివాసం ఉంటోంది. వివాహేతర సంబంధానికి భర్త రాము అడ్డొస్తున్నాడని చంపించాలని పథకం రూపొందించారు. దీంతో బాబా ఫకృద్ధీన్, గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన మండ్ల వేణు, మహానందికి చెందిన ప్రేమ్కుమార్లు కలిసి రామును మద్యం సీసాలతో కొట్టి చొక్కాతో గొంతు బిగించి హతమార్చారు. మృతుడి తల్లి సంగటి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. వ్యవసాయ కళాశాల సమీపంలోని కాశినాయన ఆశ్రమం వద్ద సంచరిస్తున్న ముగ్గురితో పాటు మధురేణుకలను అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. -
వివాహేతర సంబంధం: ప్రేమ పెళ్లి చేసుకున్నావ్ కదా!.. ఇదేం పని శ్రావణి?
కరీంనగర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారమే భార్య తన తల్లితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. రామగుండంలోని ఆటోనగర్కు చెందిన మహ్మద్ అజీంఖాన్ (36) హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. అజీమ్ఖాన్ అదే ప్రాంతానికి చెందిన గరిశ శ్రావణిని 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అజీంఖాన్ కూలీగా.. శ్రావణి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో శ్రావణి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు భర్త అనుమానించాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఒకసారి ఇటుకతో దాడి చేసింది. మరోసారి యాసిడ్ పోసేందుకు యత్నించగా.. తప్పించుకున్నా డు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు గొడవపడ్డారు. వీధిలోకి వచ్చిన అజీంఖాన్ను ఇంట్లోకి తీసుకెళ్లి కిందపడేసి గొంతుపై కాలితో తొక్కింది. శ్రావణి తల్లి నర్మద అజీంఖాన్ కాళ్లు గట్టిగా పట్టుకుంది. పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్తో ఛాతిపై బలంగా కొట్టడంతో అజీంఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అజీంఖాన్ సోదరుడు నదీమ్ఖాన్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి శ్రావణితోపాటు ఆమెకు సహకరించిన ఆమె తల్లి నర్మదను అరెస్టు చేశామని తెలిపారు. అనాథలైన చిన్నారులు.. తండ్రి హత్యకు గురికావడం.. తల్లి శ్రావణి, అమ్మమ్మ నర్మద జైలు పాలుకావడంతో వారి ఇద్దరు కుమారులు హమాన్, హర్మాన్ అనాథలుగా మారారు. -
మొదట నుంచి స్రవంతి ప్రవర్తన అనుమానాస్పదమే..
నల్గొండ (శాలిగౌరారం) : శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో ఈ నెల 17న వెలుగుచూసిన మల్లాచారి(38) అనుమానాస్పద మృతి.. హత్యగానే పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. తన సఖ్యతకు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతోనే అతడి భార్యనే ఘాతుకానికి తెగబడినట్లు తెలిసింది. ఇప్పటికే నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. మనిమద్దె గ్రామానికి చెందిన మల్లాచారి కులవృత్తితో పాటు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. మల్లాచారికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రోజువారీ మాదిరిగానే ఈనెల 16న ఇంటివద్ద పనిచేసిన మల్లాచారి శాలిగౌరారంలో బ్యాంకువద్ద పని ఉన్నదని ఇంట్లో చెప్పి బైక్పై వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని మద్యం తాగి రాత్రి మనిమద్దె గ్రామానికి చేరుకున్నాడు. గ్రామ సమీపంలోకి రాగానే బైక్ నడపలేని స్థితిలో ఉండగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మల్లాచారిని ఇంటికి చేర్చాడు. అయితే మల్లాచారి ఇంట్లోకి వెళ్లకుండా అరుగుపై నిద్రపోయాడు. తెల్లవారుజామున విగతజీవుడయ్యాడు. దీంతో తన కొడకుది హత్యేనని, కోడలిపైను అనుమానం ఉందని మృతుడి తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదినుంచి స్రవంతి ప్రవర్తన అనుమానాస్పదమే.. మృతుడు మల్లాచారి భార్య స్రవంతి ప్రవర్త అదినుంచి అనుమానాస్పదమే గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో స్రవంతి చనువుగా ఉండేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరి వ్యక్తులు మధ్యలు ఘర్షణలు జరిగిన సమస్య పెద్ద మనుషుల వద్దకు చేరినట్లు సమాచారం. అయినప్పటికీ తీరు మారకపోవడంతో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు స్రవంతిపై దాడి చేయగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి స్రవంతికి దూరం కావడంతో ప్రస్తుతం గ్రామానికి చెందిన మరో ముగ్గురు యువకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలియవచ్చింది. గొంతునులిమి.. వివాహేతర సంబంధానికి మల్లాచారి అడ్డుగానే ఉన్నాడనే ఉద్దేశంతోనే హత్య చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల మల్లాచారి మద్యం తాగి ఇంటకి చేరుకుని లోనికి రాకుండా అరుగుపైనే నిద్రించగా గొంతునులిమి హత్య చేసినట్లు సమాచారం. అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులకు స్రవంతి విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం. అయితే బలియమైన శరీర సౌష్టంవం కలిగిన మల్లాచారిని అంతమొందించడం స్రవంతి వల్ల కాదని, ఈ హత్యోదంతంలో మరో ఇద్దరు పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత్రధారుల పాత్ర నిగ్గుతేల్చేందుకు ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నుంచి తప్పించుకునేందుకేనా ? కొడుకు మల్లాచారి మృతిపై కోడలుపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 19న స్రవంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన స్రవంతి అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీస్స్టేషన్ని బాత్రూంలో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను నల్లగొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం బుధవారం తిరిగి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?
నర్సీపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హత్య చేయించింది. గతేడాది ఆగస్టు 7న ఈ ఘటన జరిగింది. తొమ్మిది నెలల తరువాత గొలుగొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రుత్తల సత్తిబాబు భార్య రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడుకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో తరచూ తాగి వచ్చి భార్య రామలక్ష్మితో గొడవ పడేవాడు. దీంతో సత్తిబాబును హతమార్చాలని రామలక్ష్మి, ఆమె మేనత్త సన్యాసమ్మ, రామలక్ష్మి ప్రియుడు ఎర్రినాయుడు కలిసి కుట్రపన్నారు. సత్తిబాబును హత్య చేస్తే రూ.50 వేలు ఇచ్చేందుకు అదే గ్రామానికి చెందిన కర్రి కృష్ణతో ఎర్రినాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సత్తిబాబుకు మద్యపానం, పేకాట అలవాటు ఉంది. గత ఏడాది ఆగస్టు 7న సత్తిబాబుకు ఫోన్ చేసి మాకవరపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎర్రినాయుడు,కృష్ణ నమ్మబలికారు. ఎర్రినాయుడు, కృష్ణ ఒక బైక్పై, సత్తిబాబు తన మోపెడ్పై బయలుదేరారు. మార్గం మధ్యంలో ఏటిగైరంపేట, పెద»ొడ్డేపల్లిల్లో సత్తిబాబుతో ఫుల్గా మద్యం తాగించారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం దగ్గరలో ఏలేరు కాలువ పక్కన తోటలోకి తీసుకు వెళ్లారు. సత్తిబాబును ఎర్రినాయుడు కిందపడేశాడు. కృష్ణ గట్టిగా పట్టుకోగా ఎర్రినాయుడు అతని గొంతునొక్కి చంపేసి పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడేశారు. మోపెడ్ను కూడా కాలువలో పడేశారు. సత్తిబాబు కనిపించకపోవడంతో అతని తండ్రి దేముడు, అక్క పైడితల్లి, ఆమె భర్త రమణమూర్తి గత ఏడాది ఆగస్టు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. రామలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఎర్రినాయుడు కలిసి సత్తిబాబును చంపేసి ఉంటారని గత నెల 19న హతడు తండ్రి దేముడు, కుటుంబ సభ్యులు గొలుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముందు పరారీ.. తరువాత లొంగుబాటు గొలుగొండ ఎస్ఐ ధనుంజనాయుడు, సిబ్బందితో కలిసి విచారణ చేస్తుండగా ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు. తరువాత ఈ నెల 27న గ్రామ వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో కాలువలో గాలించగా మోపెడ్ లభ్యమైంది. సంఘటన జరిగి తొమ్మిది నెలలు కావడంతో సత్తిబాబు మృతదేహం లభ్యం కాలేదు. హత్య కేసులో మరో నిందితుడు కృష్ణ ఇటీవల గంజాయి కేసులో పట్టుబడి జైలులో ఉన్నాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. కృష్ణను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. -
శ్వేత బాడీపై గాయాలు.. భర్తే కీలక సూత్రధారి
దొడ్డబళ్లాపురం: భార్యను హత్య చేసిన భర్త ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని నాటకమాడిన ఉదంతం నెలమంగల తాలూకా తోణచినకొప్పె గ్రామంలో వెలుగుచూసింది. చౌడేశ్ (35), తన భార్య శ్వేత (30)ను హత్య చేశాడు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన శ్వేతను తొమ్మిదేళ్ల క్రితం హిరియూరు తాలూకా కురుబరహళ్లికి చెందిన చౌడేశ్కిచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. హఠాత్తుగా బుధవారం రాత్రి శ్వేతకు అనారోగ్యంగా ఉందని నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు చౌడేశ్. అయితే అప్పటికే ఆమె చనిపోయి ఉందని వైద్యులు తెలిపారు. శ్వేత అనారోగ్యంతో మృతి చెందిందని చౌడేశ్ నమ్మించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసికెళ్లగా ఆమె దేహంపై గాయాల గుర్తులు కనబడ్డాయి. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చౌడేశ్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..?
సాక్షి, మేళ్లచెరువు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ దారుణానికి తెగబడింది. మద్యం సేవించి నిద్రమత్తులో ఉన్న భర్త తలను గోడకు బలంగా మోది కడతేర్చింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని కప్పలకుంట తండాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ శివరాంరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పలకుంటతండాకు చెందిన భూక్యా బాలాజీ (40)కి కోదాడ మండలం బాలజీనగర్ తండాకు చెందిన బుజ్జీతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. బాలాజీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భర్త దుబాయ్ బాట.. భార్య అడ్డదారి బాలాజీకి స్థానికంగా కూలి పనులు దొరక్కపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో తెలిసిన వారి సహకారంతో నాలుగేళ్ల క్రితం దుబాయ్కి వెళ్లాడు. అక్కడినుంచి ప్రతి నెలా డబ్బులు పంపిస్తుండడంతో బుజ్జి పిల్లలను పోషించుకుంటోంది. అయితే ఇదే సమయంలో బుజ్జి గ్రామానికి చెందిన రాముడుతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డదారులు తొక్కింది. బాలాజీ అక్కడి నుంచి బాగా డబ్బులు సంపాందించి రెండేళ్ల క్రితం తన ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిపించాడు. కుమారుడు ప్రస్తుతం స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదవండి: (తల్లితో సహజీవనం.. కుమార్తెపై ఘాతుకం) నాలుగు నెలల క్రితం తిరిగి రాగా.. బాలాజీ నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతడికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. పలుమార్లు ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయినా బుజ్జి తగ్గకుండా ప్రతిసారి ఇబ్బందులకు గురిచేయడంతో పాటు చిత్రహింసలు పెట్టింది. భార్య ప్రవర్తనకు విసిగి వేసారిన బాలాజీ తాగుడుకు బానిసగా మారాడు. ఒక్కతే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా బాలాజీ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజూ మాదిరిగానే దంపతులు గొడవపడుతుండగా కుమారుడు పక్క గదిలో నిద్రపోయాడు. తెల్లారేసరికి బాలాజీ విగత జీవిగా మారడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శివరాంరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే బుజ్జి మాత్రం తానే భర్త తలను గోడకు బలంగా మోది హత్య చేశానని తెలిపిందని సీఐ తెలిపారు. కాగా, బుజ్జి ఒక్కతే ఘాతుకానికి తెగబడిందా లేక ఇందులో ప్రియుడి హస్తం కూడా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఐ ధ్రువీకరించలేదు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాలాజీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నెహ్రూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: (సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య) -
భర్త అడ్డు తొలగించుకోవాలని.. ప్రియుడుకి రూ.15 లక్షల సుపారి
సాక్షి, యశవంతపుర: భర్తను హత్య చేయడానికి పథకం వేసిన భార్య రూపతో పాటు మరో ఇద్దరిని మాదనాయకనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రూప, గిరీశ్లకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇటీవల రూప ఒక ఫ్యాక్టరీలో పనికి చేరింది. అక్కడ కుమార్ జైన్ అనే వ్యక్తితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. రూప సంగతి తెలిసిన భర్త పనికి వెళ్లవద్దంటూ కట్టడి చేశాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రూప, ప్రియుడు రూ.15 లక్షలకు సుపారి ఇచ్చారు. నలుగురు దుండగులు మాదనాయకనహళ్లిలో మంకీ క్యాప్ ధరించి తిరుగుతుండగా పోలీసులు అనుమానం వచ్చి ప్రశ్నించగా సుపారి విషయం బయటపడింది. రూప, కుమార్జైన్ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, పటాన్చెరు టౌన్ : వివాహేతర సంబంధంతో వరసకు బావతో కలసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన మంగళవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చత్తీస్ఘడ్ రాష్ట్రం... దురుగు జిల్లా..మరోదా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ దారు (35) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం స్నేహితుడు హరినారాయణ (అలియాస్) సంజీవుతో కలసి అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్కు వచ్చాడు. సమీపంలోని మెడికల్ డివైజ్ పార్క్ సమీపంలో సెంటరింగ్ పని చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటున్నాడు. పది రోజుల క్రితం వరసకు సడ్డకుడు నర్వోత్తంతో కలిసి మృతుడి భార్య భువనేశ్వరి అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ వచ్చింది. భువనేశ్వరి, నర్వోత్తంల మధ్య వివాహేతర సంబంధం ఉంది. భర్త అనిల్ కుమార్ను హతమారిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని మృతుడి భార్య బావ నర్వోత్తంతో చెప్పింది. దీంతో అతను అనిల్ కుమార్ను ఆదివారం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. ఒక్కసారిగా అనిల్కుమార్ కనిపించకుండా పోవడంతో తోటి కార్మికులు, స్నేహితుడు సంజీవు .. నర్వోత్తంని అడిగారు. ఎవరో వచ్చి బైక్పై తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అనంతరం కాసేపు వెతికినా అనిల్కుమార్ దొరక్కపోవడంతో మరోసారి నర్వోత్తంను గట్టిగా నిలదీశారు. అనిల్కుమార్ భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె చెబితేనే హత్య చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ భీంరెడ్డి, పటాన్చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, అమీన్పూర్ ఎస్ఐలు మురళి, కిష్టారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతుడి భార్య భువనేశ్వరిని, నర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్నేహితుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): డబ్బుల విషయంలో వివాదంతో అయినవారే అంతమొందించిన సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేసి కాల్చేసిన కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించడం విశేషం. వివరాలను డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్లో నివసిస్తున్న విజయ్సింగ్ (42), మల్లీశ్వరి దంపతులు. 16 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి 14ఏళ్ల కుమార్తె ఉంది. విజయ్సింగ్ తన కుమార్తె పేరుపై రూ.లక్షను బ్యాంక్లో ఫిక్స్డ్ చేశాడు. నామినీగా మల్లీశ్వరిని ఉంచాడు. నెల రోజుల క్రితం భర్తకు తెలియకుండా మల్లీశ్వరి బ్యాంక్లో ఉన్న రూ.లక్షను తెచ్చి తన తమ్ముడైన మంద కృష్ణకు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల తర్వాత విషయం విజయ్సింగ్కు తెలిసింది. తనకు తెలియకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావని నిలదీయడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా తిరిగిచ్చేయాలని మంద కృష్ణపై విజయ్సింగ్ ఒత్తిడి పెంచాడు. డబ్బు తిరిగిచ్చే పరిస్థితి లేకపోవటంతో మందకృష్ణ అక్క మల్లీశ్వరితో కలిసి విజయ్సింగ్ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. తనను కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడని మల్లీశ్వరి, చెల్లెలు తలారి పద్మ, తల్లి మంద లక్ష్మితో కలిసి పథకం వేశారు. ఆదివారం రాత్రి విజయ్సింగ్కు ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత నలుగురూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. రాత్రి 12 గంటల తర్వాత హృతదేహాన్ని సైకిల్పై తీసుకెళ్లి ఓఆర్ఆర్ సర్వీస్రోడ్డు సమీపంలోని ఓ ముళ్ల పొదలో పడేసి తగులబెట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ సాగించగా వారు నేరం అంగీకరించారు. ఈ మేరకు నలుగురినీ రిమాండ్కు తరలించారు. హత్య ఉదంతం వెలుగు చేసిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. విలేరుల సమావేశంలో సీఐ ప్రశాంత్, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసింది. భార్య ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ ఘటన తేని జిల్లా దేవనాంపట్టిలో చోటుచేసుకుంది. కొంగువార్ పట్టికి చెందిన శివకుమార్ (43) రైతు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పాపాత్తికి ముగ్గురు కుమార్తెలు. 24వ తేదీ కల్లుపెట్టి, కామక్కాపట్టిలోని మైదాన ప్రాంతంలో శివకుమార్ తీవ్రగాయాలతో మృతి చెంది పడివున్నాడు. ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అతని మృతిపై అనుమానం ఉందని బంధువులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాపాత్తిని అనుమానించిన పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వద్ద పాపాత్తి ఇచ్చిన వాంగ్మూలంలో తనకు, తన భర్త శివకుమార్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్న సెల్వరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఈ విషయం శివకుమార్కు తెలియడంతో అతను తనను మందలించినట్టు తెలిపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని శివకుమార్ను సెల్వరాజుతో కలిసి హత్య చేసేందుకు మరో ట్రాక్టర్ డ్రైవర్ అయ్యనార్ వద్ద సాయం కోరినట్టు పేర్కొంది. శివకుమార్కు మద్యం తాగించిన అయ్యనార్ అతన్ని బైకులో ఎక్కించుకుని వెళ్లి మైలేజీ రాయికి ఢీకొట్టించి తరువాత శివకుమార్ గొంతు కోసి హత్య చేశాడని పాపాత్తి పోలీసులకు విచారణలో తెలిపింది. -
వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య
సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్కు చెందిన లక్ష్మణ్ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్నగర్లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్షాపు నడుపుతూ లక్ష్మణ్ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్ సెంటర్ వద్ద లక్ష్మణ్ దూరపు బంధువు లాల్బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్కు మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ అనంతరం లాల్బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది. దీంతో లక్ష్మణ్ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ పడుకున్నాక లాల్బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
సాక్షి, హుబ్లీ: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో హతుడి భార్య వివాహేతర సంబంధం గుట్టు ఈ హత్యతో బట్టబయలైంది. ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి నివాసి అక్షతకు హావేరి జిల్లా హానగల్ నివాసి జగదీష్తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం అక్షతకు ఓ మగబిడ్డ జన్మించింది. ఈక్రమంలో భార్య, బిడ్డలను చూడటానికి వచ్చిన భర్త దారుణ హత్యకు గురయ్యాడు. (మంజీరలో ఏఓ గల్లంతు?) ఈ కేసు కూపీ లాగిన సీఐ రమేష్ గోకాక్ అక్షత కాల్ డేటాను తెలుసుకొని ఆమె ప్రియుడు కాశప్పను అదుపులోకి తీసుకుని పోలీసు పద్ధతిలో విచారించగా అసలు విషయం నిగ్గు తేలింది. అక్షత ప్రియుడు కాశప్ప స్వగ్రామం బాదామి తాలూకా బండకేరి. ఇతడు గత ఐదేళ్ల నుంచి కేఈబీ లైన్మెన్గా ఉంటూ అంచటగేరిలో అక్షత ఇంటి ఎదుట ఇల్లు తీసుకొని ఉండేవాడు. వీరి మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. అంతేగాక నాలుగు నెలల క్రితం కాశప్పకు మరో యువతితో వివాహమైంది. (పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం) తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న భర్త జగదీష్ను చంపేయాలని ఇద్దరూ పథకం వేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్కు మంగళవారం కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు చివరలోని చెన్నాపుర క్రాస్ వద్ద తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేసి పరారయ్యాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు గురువారం నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. -
దారుణం: భర్తపై భార్య విషప్రయోగం
సాక్షి, కాటారం(జయశంకర్ భూపాలపల్లి): మూడుమూళ్లు, ఏడు అడుగుల బంధానికి కళంకాన్ని తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెంలో చోటు చేసుకుంది. ఆగస్టు 19న ఈ ఘటన చోటుచేసుకోగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. కాటారం సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.హతీరాం కేసు వివరాలను వెల్లడించారు. రేగులగూడెం గ్రామానికి చెందిన మారుపాక దేవేందర్(40), మారుపాక స్వప్నకు 12 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇదే క్రమంలో 2017లో మహాముత్తారం గ్రామానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్తో స్వప్నకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం దేవేందర్కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆయనను అడ్డు తొలగించాలని స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం కళ్యాణ్ పురుగుమందు విషపు గుళికలు స్వప్నకు అందించగా, ఆమె మద్యంలో కలిపి దేవేందర్కు ఆగస్టు 19న తాగించింది. మరుసటి రోజు ఉదయం దేవేందర్ వాంతులు, విరోచనాలు చేసుకొని మృతి చెందాడు. అయితే, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని దేవేందర్ తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాటారం సీఐ హతీరాం నేతృత్వంలో దర్యాప్తు చేపట్టగా, రసాయనిక పరీక్షల ఆధారంగా మృతుడిపై విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు స్పప్నపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. దీంతో బుధవారం స్వప్న, కల్యాణ్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
ప్రియుడి మోజులో భర్త హత్య
సాక్షి, నెక్కొండ: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిందో మహిళ. శవాన్ని కాల్చి.. బూడిదను చెరువు లో కలిపి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో జరిగింది. సీఐ తిరుమల్ కథనం ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి శివారు గేటుపల్లికి చెందిన బాదావత్ ధర్యావత్ సింగ్ (42), జ్యోతి దంప తులకు ఇద్దరు సంతానం. సింగ్ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తుండగా.. జ్యోతి స్థానికంగా టైలరింగ్ శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో మండలంలోని అప్పల్రావుపేటకు చెందిన సాంబరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త సింగ్కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి ధర్యావత్ సింగ్ ఇంట్లోనే ఉంటుండటంతో జ్యోతికి సాంబరాజును కలవడం సాధ్యం కావడం లేదు. ఎప్పటికైనా ఈ సమస్య ఎదురవుతుందని భావించిన ఆమె.. భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ప్రియుడితో కలసి పథకం పన్నింది. హత్య, ఆపై దహనం ఈనెల 14న రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్తను హతమార్చేం దుకు ఇదే సరైన సమయమని భావించిన జ్యోతి.. సాంబరాజుకు సమాచారం ఇచ్చింది. దీంతో అతను ట్రాలీ ఆటోలో నెక్కొండకు వచ్చాడు. తాడును సింగ్ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం తన పత్తి చేను వద్దకు మృతదేహాన్ని తరలించాడు. అప్పటికే అక్కడ ఉన్న సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్ సాయంతో శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా శవం సగమే కాలింది. దీంతో మళ్లీ దహనం చేశారు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు 16న బూడిద, అస్థికలను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం దర్గా చెరువులో కలిపారు. గుట్టురట్టు చేసిన కాల్డేటా.. మృతుడి సోదరుడు వీరన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జ్యోతి కదలికలపై నిఘా పెట్టి.. ఆమె సెల్ఫోన్ కాల్డేటా ను సేకరించారు. సాంబరాజుతో మాట్లాడిన సంభాషణల ఆధారంగా జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సాంబరాజు, జ్యోతిని అరెస్టు చేశారు. సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్ పరారీలో ఉన్నారు. -
ప్రియుడిపై మోజుతో.. విషం కలిపి
అన్నానగర్: భర్త గొంతు నులిమి హత్య చేసిన భార్య, ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. పూందమల్లి సమీపంలోని కాట్టుపాక్కం ఓం శక్తి నగర్ కు చెందిన ధరణీ ధరణ్ (39), కారు డ్రైవర్. ఇతని భార్య భవాని (31). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 22వ తేదీ అప్పుల బాధతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు భవాని పూంద మమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ప్రకారం పూందమల్లి పోలీసులు ధరణీధరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ధరణీ ధరణ్ గొంతు నులిమి హత్య చేయబడినట్లు తేలడంతో భవానిని పోలీసులు విచారణ చేశారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమె సెల్ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆమె తరచూ ఫోన్లో మాట్లాడుతున్న ఓ వ్యక్తి మృతుడి ఇంటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు భవానిని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను, పుందమల్లికి చెందిన దినేష్ (31) ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పథకం బెడిసికొట్టడంతో.. పోలీసుల విచారణలో ధరణీ ధరణ్, దినేష్ స్నేహితులు. ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. తరచూ ధరణీ ధరణ్ ఇంటికి దినేష్ వచ్చేవాడు. ఈ క్రమంలో భవానితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. దినేష్కు ఇది వరకే వివాహమై భార్యను విడిచిపెట్టి ఉంటున్నాడు. భవానితో వివాహేతర సంబంధానికి ధరణీ ధరణ్ అడ్డుగా ఉండటం అతన్ని హత్య చేసేందుకు పథకం వేసినట్లు తెలిసింది. గత 21వ తేదీ పురుగుల మందు తీసుకువచ్చిన దినేష్ దానిని భవాని ఇంటికి వెళ్లి ఇచ్చాడు. ఆహారంలో కలిపి ఇవ్వమని భవానికి చెప్పాడు. పథకం ప్రకారం ఆ రోజు రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన అతనికి భవాని ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చింది. దాన్ని తిని నిద్రపోయిన ధరణీధరన్ మరుసటి రోజు ఉదయం లేచి వాంతులు చేసుకున్నాడు. తర్వాత కాఫీ తాగి మళ్లీ నిద్రించాడు. ఆహారంలో విషం కలిపి ఇచ్చినా భర్త చావక పోవటంతో భవాని దినేష్కి సమాచారం ఇచ్చింది. ఇద్దరు పిల్లలను తాతయ్య ఇంటికి పంపించింది. దినేష్ ఇంటికి రాగానే నిద్రపోతున్న ధరణీ ధరణ్ దుప్పటితో గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ధరణి ధరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా దుప్పటిని రెండు చేతులతో చుట్టి దినేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భవాని నాటకం ఆడింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. -
క్రికెట్ బ్యాట్ తో భర్త మర్మాంగాలపై కొట్టి..
చిత్తూరు,పలమనేరు: మండలంలోని మొరం పంచాయతీ నక్కపల్లిలో బుధవారం భార్య, ఆమె తల్లి కలిసి క్రికెట్ బ్యాట్, రోకలితో కొట్టి భర్తను హత్య చేశారు. పట్టణ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోపీనాథ్ రెడ్డి (36) కి అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీత(32)తో కలిసి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. గోపీనాథ్ రెడ్డి కొన్నాళ్ల క్రితం బెంగకూరు వెళ్లి అక్కడే సొంతంగా క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం కుటుంబంతోపాటు స్వగ్రామానికి వచ్చి అత్తాగారింట్లో ఉంటున్నారు. డ్యూలు కట్టకపోవడంతో కారును ఫైనాన్స్ కంపెనీవారు ఇటీవల తీసుకెళ్లారు. దీంతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉపాధి పొందాలని గోపీనాథ్రెడ్డి భావించాడు. అందుకు నగలు ఇవ్వా లని భార్యను అడిగాడు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి గోపీనాథ్రెడ్డి నగల విషయంపై భార్య, అత్తతో గొడవపడ్డాడు. ఆగ్రహం చెందిన భార్య క్రికెట్ బ్యాట్, అత్త రోకలితో మద్యం మత్తులో ఉన్న అతన్ని చితకబాదారు. ఈ క్రమంలో అతని మర్మాంగాలకు తీవ్రగాయాలయ్యాయి. పురుషాంగం కొంత తెగింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య చేసింది తామేనంటూ భార్య, అత్త పోలీసులకు తెలిపారు. మృతునికి తొమ్మిదేళ్ల కుమారుడున్నాడు. సీఐ శ్రీధర్ కేసును విచారిస్తున్నారు. అందరితో కలిసిమెలసి ఉండే గోపీనాథ్రెడ్డి హత్య గ్రామంలో కలకలం రేపింది. -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆ తర్వాత!
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఈనెల 7వ తేదీన జరిగింది. రంగారెడ్డి జిల్లా చేగురూకు చెందిన బైండ్ల చెన్నయ్య(38)ను అతడి భార్య శశికళ, ఆమె ప్రియుడు కలిసి అనంతగిరి అడవిలో హత్య చేశారు. చెన్నయ్య మృతిపై అనుమానం రావడంతో గ్రామస్థులు ప్రియుడిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రావడంతో మృతుడి భార్య శశికళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నంచింది. దీంతో స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రి తరలించగా ప్రస్తుతం శశికళ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు -
భర్తకు బీమా చేసి హత్య చేసిన భార్య
కాజీపేట అర్బన్: మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. అయితే.. కుటుంబ పెద్దను హత్య చేస్తే తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఆలోచించిన ఆమె.. రూ.20 లక్షలకు బీమా చేయించి మరీ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యకు భర్త సోదరి, బావ సహకారం కూడా తీసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ఈ కేసు వివరాలన మీడియాకు వెల్లడించారు. పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న భార్య యాకమ్మతో కలసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దోబీగా పనిచేసేవాడు. లాక్డౌన్తో పాఠశాలను మూసివేయగా ఖాళీ మద్యం సీసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎస్సై ) మద్యానికి బానిసైన వీరన్న భార్యను వేధించడం.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదు. దీంతో యాకమ్మ భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకు చెన్నారావుపేటలో నివాసం ఉండే వీరన్న సోదరి భూక్యా బుజ్జి, బావ భూక్యా బిచ్చాల సహకారం కోరింది. వారు అంగీకరించడంతో అందరూ కలసి హత్యకు పథక రచన చేశారు. తొలుత గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు. తర్వాత ఈనెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో సైకిల్పై ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు వీరన్న వెళ్లగా.. ఆ సమాచారాన్ని భూక్యా బిచ్చాకు అందజేసింది. నెక్కొండలో సాయంత్రం వీరన్నను కలసిన బిచ్చా.. తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హత్యాతండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో మద్యం తాగి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11.45 గంటలకు తీసుకెళ్లగా.. అప్పటికే భార్య యాకమ్మ, సోదరి బుజ్జి ఉన్నారు. అందరూ కలసి వీరన్నకు తాడుతో ఉరి వేసి హత్య చేశారు. బతికి ఉన్నాడన్న అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి పక్కనే ఉన్న కెనాల్లో పడేశారు. అనంతరం బిచ్చా, బుజ్జి తమ స్వగ్రామానికి వెళ్లిపోగా.. యాకమ్మ తన భర్తను ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది. దీంతో పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా.. అయితే, సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా అనుమానం రావడంతో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ హత్య తామే చేశామని వారు అంగీకరించారు. దీంతో నిందితులు యాకమ్మ, బిచ్చా, బుజ్జిలను అరెస్టు చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు ప్రశాంత బాబు, నర్సింగరావు, సురేష్తో పాటు, కానిస్టేబుళ్లను సీపీ రవీందర్ అభినందించారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. అడ్డుగా ఉన్నాడనే!
సాక్షి, నాగర్కర్నూల్ : వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. అనంతరం పోలీసుల విచారణతో ఆందోళన చెంది హత్యానేరాన్ని భార్య ఒప్పుకుంది. ఈ ఘటన తాడూరు మండలం పర్వతాయిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. కేసుకు సంబంధించి సీఐ గాంధీనాయక్ తెలిపిన వివరాలిలా.. తాడూరు మండలం పర్వతాయిపల్లికి చెందిన దాసరి యాదయ్య (35), భాగ్యమ్మ దంపతులు. యాదయ్య గత నెల 28న ఇంటి నుంచి మేస్త్రి పనిచేసేందుకు నాగర్కర్నూల్కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతికినా ఎలాంటి లాభం లేకుండాపోయింది. అయితే, ఈ నెల 1న చెర్ల తిర్మలాపూర్, తుమ్మలసూగరు మధ్యలోగల కేఎల్ఐ కాల్వలో ఒక మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో కటుంబసభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించి అది దాసరి యాదయ్యగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు.. అయితే, మృతుడి ద్విచక్రవాహనం ఘటనా స్థలికి 2కిలోమీటర్ల దూరంలో కాల్వలో పడివుండటంతో అనుమానం వచ్చిన మృతుడి తమ్ముడు దాసరి పురుషోత్తం తాడూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా పోలీసులు విచారణ ప్రారంభించడంతో ఆందోళన చెందిన మృతుడి భార్య భాగ్యమ్మ బుధవారం సర్పంచ్ బాల్రెడ్డి దగ్గరకు వెళ్లి తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చినట్లు తెలిపింది. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించగా వారు భాగ్యమ్మను అదుపులోకి తీసుకుని స్టేషన్లో విచారించారు. అడ్డుతొలగించుకోవాలనే.. ఈమేరకు భాగ్యమ్మ వివరిస్తూ.. భర్త యాదయ్య స్నేహితుడు అయిన మెగావత్ గోవింద్తో చాలాకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని, విషయం భర్తకు తెలియడంతో చాలాసార్లు గొడవ జరిగిందని తెలిపింది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి గత నెల 28న బిజినేపల్లికి వెళ్లి ఓ తాడు, మద్యం దుకాణంలో రెండు మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు పేర్కొంది. అనంతరం ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించి బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పగా.. భర్త యాదయ్య అక్కడి చేరుకోవడంతో వివాహేతర సంబంధం విషయం గురించి మాట్లాడుకుందామని అతన్ని నమ్మించి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. భర్త మద్యం మత్తులోకి జారుకోగా తాడుతో ఉరివేసి చనిపోయాడనే నిర్ధారించుకున్నారు. అనంతరం అతని మృతదేహాన్ని కాల్వలో పడేసి తిరిగి ఇంటికి వెళ్లిపోయామని పేర్కొంది. నిందితులు ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో తాడూరు ఎస్ఐ నరేందర్ ఉన్నారు. -
గోర్లు పీకి, రాడ్లతో కొట్టి భర్తను చంపిన మహిళ
మానవ సంబంధాలన్నీ డబ్బుమయం అవుతున్నాయి. దారి తప్పి నేరాల పాలవుతున్నాయి. డబ్బుల విషయమై ఓ మహిళ రెండో భర్తను కిడ్నాప్ చేయించి కొన్నిరోజుల పాటు హింసించింది. వీరిద్దరూ బెంగళూరులో ఉన్నత ఉద్యోగులే. బాధితుడు మంగళవారం మైసూరులో మృత్యువాత పడ్డాడు. నిందితురాలిని అరెస్టు చేయగా, మిగతావారు పరారీలో ఉన్నారు. కర్ణాటక, బొమ్మనహళ్లి: నగదు వ్యవహారంలో భార్యభర్తల మధ్య వచ్చిన గొడవలో భర్త ప్రాణం పోగొట్టుకున్నాడు. భార్య తన సోదరుడు, అతని ఇద్దరు స్నేహితులతో కలిసి భర్తను కిడ్నాప్ చేసి సుమారు ఐదు రోజుల పాటు ఇంట్లో బంధించిచిత్రహింసలకు గురిచేసింది. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల సమీపంలో ఉన్న ముడిగుండం గ్రామంలో జరిగింది. మృతుడు బెంగళూరులో ప్రైవేటు బ్యాంకులో మేనేజర్గా పనిచేసే ముడిగుండంవాసి సుబ్రమణ్యం (36). నిందితురాలు బెంగళూరులో ఐటీ ఇంజనీర్గా పని చేస్తున్న రశ్మి. ఆమెను కొళ్లెగాల పోలీసులు అరెస్టు చేసి విచారిస్తుండగా, ఆమె సోదరుడు రాకేష్, అతని స్నేహితులు ప్రదీప్, రాకేష్ పడగూరు పరారీలో ఉన్నారు. ఐదురోజులూ చిత్రహింసలు రశ్మి సోదరుడు రాకేష్తో కలిసి తన భర్తను బెంగళూరులో కిడ్నాప్ చేసి ముడిగుండంకి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టసాగింది. సుబ్రమణ్యం చేతి గోళ్ళను పీకివేయడంతోపాటు ఇనుప కడ్డలతో కొట్టి హింసించారు. చివరకు అతని ఇంటివద్ద పడేసి పరారయ్యారు. చుట్టుపక్కల వారు గ్రహించి కొళ్ళెగాలలో ఉన్న ప్రవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కొసం మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరళించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మంగళవారం చనిపోయాడు. కొళ్ళెగాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సుబ్రమణ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రశ్మిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. సుబ్రమణ్యం బెట్టింగ్ కోసం తన డబ్బులు మొత్తం తీసుకొని పోగొట్టాడని, వాటి కోసమే ఈ రగడ జరిగిందని రశ్మి పోలీసులకు తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది. ఏం జరిగింది రశ్మికి పెళ్ళి జరిగి సుమారు 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం సుబ్రమణ్యంను ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకుంది. ఏడాది పాటు బాగానే ఉన్నారు. ఇటీవల అతనితో ఘర్షణ పడి మళ్లీ మొదటి భర్తకు వద్దకు వచ్చి ఆరునెలలు ఉంది. మళ్లీ రెండవ భర్త వద్దకు వెళ్లిపోయింది. సుబ్రమణ్యం నుంచి ఆమె లక్షల రూపాయలు తీసుకుంది. ఆ డబ్బులు ఇవ్వాలని అతడు అడగడం ఆమె ఆగ్రహానికి కారణమైంది. తన నుంచి తీసుకున్న ఐదు లక్షలను తిరిగి ఇవ్వాలని ఆమె కూడా సుబ్రమణ్యాన్ని డిమాండ్ చేయగా ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. -
భర్తను చంపి..
భువనేశ్వర్: దాంపత్య జీవనానికి సముచిత గుర్తింపు ఇవ్వకుండా నిత్యం వేధింపులకు గురి చేసిన భర్తను ఓ భార్య హతమార్చి పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయింది. తన జీవితాన్ని విచ్ఛిన్నం చేసిన భర్త ఉన్నా, పోయినా ఒకటేనన్న మనోవేదనతో ఈ అమానుష చర్యకు ఆమె పాల్పడింది. బాలాసోర్ జిల్లాలోని సహదేవ్ ఖుంటొ పోలీస్ స్టేషన్ పరిధి గుడొపొదొ గ్రామంలో ఈ సంఘటన బుధవారం జరిగింది. కత్తితో నరికి భర్తను హతమార్చిన భార్య బరిపద సదర్స్టేషన్లో లొంగిపోయింది. నిందితురాలు బరిపద సదర్ స్టేషన్ పరిధిలోని సిరిసొబొణి గ్రామస్తురాలు సీతా హేంబ్రమ్. ఆమెకు బొఢొ మరాండితో చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక మగబిడ్డ సంతానం. భర్త తనను నిరాకరించి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, బిడ్డను అంగీకరించకుండా వేధించడంతో భరించలేక మనోవేదనకు గురై భర్తను హత్య చేసినట్లు ఆమె పోలీసుల ఎదుట పేర్కొంది. భర్తను కత్తితో నరికి చంపేసి బాలాసోర్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో బయల్దేరి రుప్సా వరకు ప్రయాణించింది. అక్కడి నుంచి మరో రైలులో బరిపద రైల్వేస్టేషన్కు చేరి నడుచుకుంటూ బరిపద సదర్ స్టేషన్కు చేరుకుని తాను భర్తను హత్య చేశానని లొంగిపోతున్నానని పోలీసులకు తెలిపింది. -
భార్యే సూత్రధారి..!
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టించుకుంది.. అతడితో జీవితం పంచుకుని నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. క్షణిక సుఖం కోసం మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం కాస్తా భర్తకు తెలియడంతో తాగుబోతు అంటూ నింద వేసి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.అక్కడ యథేచ్ఛగా తన ప్రియుడితో సఖ్యతగా మెలిగింది. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని వెళ్లిన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా అంతమొందించింది. ఇదీ.. ఇటీవల రాజాపేట మండలం దూదివెంకటాపురంలో వెలుగుచూసిన నరేష్ హత్యోదంతం వెనుక ఉన్న కారణాలు. భువనగిరిఅర్బన్ : ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి శనివారం తన కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొల్లూరు నరేష్(35)కు రాజపేట మండలం దుదివెంకటాపురం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల భాగ్యతో పదిహేడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా వీరికి నలుగురు సంతానం. వీరు 13 సంవత్సరాలు కలిసి జీవించారు. ఈ సమయంలో భాగ్యతో మోటకొండూరు గ్రామాని చెందిన వంగపల్లి అయిలయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం నరేష్కు తెలియడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవలకు దారితీసిందర్థా క్రమంలో నరేష్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో భాగ్య భర్త తాగుబోతు అంటే నింద వేసి నాలుగేళ్ల క్రితం మోటకొండూరు నుంచి తన తల్లిగారి గ్రామమైన దుదివెంకటపురానికి పిల్లలతో కలిసి వచ్చి ఉంటోంది. వంగపల్లి అయిలయ్యతో వివాహేతర సంబంధం అలానే కొనసాగిస్తోంది. పిల్లలను చూసేందుకు వెళ్లగా.. నరేష్ తన పిల్లలను చూడటానికి ఈ నెల 9వ తేదీన దుదివెంకటాపురం గ్రామానికి వెళ్లాడు. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని భార్యను కోరాడు. అందుకు భాగ్య ఒప్పుకోకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. తదనంతరం రాత్రి సమయంలో ఎక్కవగా మద్యం సేవించిన నరేష్ తన అత్తవారి ఇంటిముందున్న మంచంపై నిద్రపోయాడు. పథకం ప్రకారం.. తన సఖ్యతకు అడ్డొస్తున్నాడనే నెపంతో భాగ్య భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం వెంటనే విషయాన్ని ప్రియుడు అయిలయ్యకు ఫోన్ చేసి తెలిపింది. భర్త మద్యం మత్తులో నిద్రపోయిన విషయాన్ని తెలిపి దూదివెంకటాపురం రావాలని కోరింది. అయిలయ్య గ్రామానికి చేరుకోవడంతో ఇద్దరు కలిసి ఆదమరచి నిద్రపోయిన నరేష్ ముఖంపై భాగ్య దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేయగా అయిలయ్య కాళ్లు, చేతులు పట్టుకున్నాడు. కాసేపటికి నరేష్ ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. తదనంతరం అతడి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో.. కొల్లూరి నరేష్ను హత్య చేసిన వెంటనే భాగ్య అయిలయ్య ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారి పోయారు. మృతుడు నరేష్ తల్లి కొల్లూరి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే శనివారం భువనగిరి పట్టణ శివారులో ఉన్న బొమ్మాయిపల్లిలో భాగ్యలక్ష్మి, అయిలయ్య ఇద్దరు ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తామే నరేష్ను హత్య చేసినట్టు అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీసీపీ వివరించారు. సమావేశంలో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, రూరల్ సీఐ అంజనేయులు, ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు. -
తమ్ముడితో కలిసి భర్తకు ఉరేసిన భార్య..
సాక్షి, మామడ(నిర్మల్): ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు తన తమ్ముడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. మామడ మండలకేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, సోన్ సీఐ జీవన్రెడ్డి, ఎస్సై అనూష వివరించారు. మండలకేంద్రానికి చెందిన సయ్యద్ సద్దాం (30) ఈనెల 16న మృతిచెందాడు. మృతిపై అనుమానాలు రావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని చేధించారు. బోథ్కు చెందిన సయ్యద్ సద్దాం.. మామడకు చెందిన సయ్యద్ నూరిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మామడలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సద్దాం వద్ద మహ్మద్ షఫీ మేకలకాపరిగా పనిచేస్తున్నాడు. షఫీ కుమారుడైన అలీంతో సద్దాం భార్య నూరికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న సద్దాం భార్యను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. మద్యం సేవించి వచ్చి మందలిస్తుండడంతో నూరి తన ప్రియుడు అలీంకు తెలిపింది. దీంతో సద్దాంను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు ఈనెల 16నరాత్రి నూరి తన తమ్ముడు రియాజ్ సహకారంతో సద్దాం మెడకు చున్నీతో ఉరివేసి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోని ఓ కర్రకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. మొదట్లో ఆత్మహత్యగానే భావించిన కుటుంబ సభ్యులు మృతదేహంపై గాయాలు, భార్య తీరుపై అనుమానం ఉండటంతో సద్దాం తల్లి తాజ్బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నెలలోనే మరో ఘటన.. మామడ మండలంలో ఇదే తీరులో.. నెల వ్యవధిలో మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు ప్రియులతో కలిసి స్థానిక పొన్కల్ శివారులోనే గోదావరి వద్ద చంపించింది. ఆ కేసు ఈనెల ఒకటిన తేలింది. తాజాగా ఇదే మండలకేంద్రంలో ప్రియుడి మోజులో పడి భార్య భర్తను హతమార్చిన ఘటన వెలుగు చూసింది. -
రెండో భార్యే హంతకురాలు ?
రోలుగుంట(చోడవరం): మాకవరంపాలెం మండలం అప్పన్నదొర పాలెంకు చెందిన ఎత్తుల రాజేంద్ర ప్రసాద్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి రెండో భార్య హత్య చేసినట్టు గుర్తించారు. మండలం గుండుబాడు చెరువులో ఈ నెల 4న రాజేంద్రప్రసాద్ శవమైతేలాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్రెడ్డి అన్ని కోణాల్లో విచారణ జరిపి, మృతుడి రెండో భార్య మంగ , ఆమె ఇద్దరు సోదరులను గురువారం అరెస్టు చేసి, జైలుకు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను ఏఎస్పీ వెల్లడించారు. మాకవరంపాలెం మండలం అప్పన్నదొర పాలెంకు చెందిన ఎత్తుల రాజెంద్ర ప్రసాద్కు ఇద్దరు పిల్లలున్నారు. తరువాత మంగ అనే మహిళను పదేళ్ల కిందట రెండో వివాహం చేసుకున్నాడు. తమ సోదరి కులాంతర వివాహం చేసుకోవడం మంగ అన్నదమ్ములకు ఇష్టం లేదు. మంగ, రాజేంద్రప్రసాద్కు ముగ్గురు పిల్లలున్నారు. రాజేంద్రప్రసాద్ కూలి డబ్బులతో మద్యం సేవిస్తూ మంగపై తరచూ చేయి చేసుకునేవాడు. సెప్టెంబర్ 4న కూడా మంగను కొట్టడంతో ఆమె తన పుట్టింటికి మామిడిపాలెం వెళ్లిపోయింది. భర్త తరచూ చేయి చేసుకోవడంతో మంగ భర్తపై అయిష్టత పెంచుకుంది. ఈ నేపధ్యంలో అదే నెల 20న మంగ తమ్ముడు ప్రమాదంలో గాయపడడంతో విశాఖకు చికిత్స కోసం తరలించారు. ఆ రోజు కూడా రాజేంద్రప్రసాద్ పూటుగా తాగి, ఆ మైకంలో భార్య వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంగ లావుపాటి సర్వే కర్రతో అతనిని బలంగా కొట్టింది. దీంతో రాజేంద్రప్రసాద్ స్పృహ తప్పి పడిపోయాడు. తరువాత కూడా రెండు దెబ్బలు వేసింది. అంతలో మంగ అన్నలు కచ్చాల గోవింద, కచ్చాల అప్పలనాయుడు ఇంటికి వచ్చి రాజేంద్రప్రసాద్ను పరీక్షించి, మృతిచెందినట్టు గుర్తించారు. వెంటనే చెల్లితో కలసి ఇంటి వెనుక భాగంలోంచి సమీప సుకుమారకొండపైకి మృతదేహాన్ని తీసుకెళ్లి పాతిపెట్టారు. కొన్ని రోజుల తరువాత ఈ ప్రాంతంలో ఎవరైనా తిరిగితే అనుమానం వస్తుందని భావించిన వారు, కొండ పైకి వెళ్లి మృతదేహాన్ని గోనె సంచెలో వేసి, పాలిథిన్ కవర్ మూసి పాతిపెట్టి వచ్చేశారు. కొన్ని రోజుల పోయిన తరువాత ఈ నెల 4 న కొండ దిగువన రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ శివారు కశిరెడ్డిపాలెం ఊట చెరువులో మృతదేహాన్ని పడేశారు. చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ ఉమా మహేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లివిచారించారు. మృతదేహాన్ని మొద టి భార్య గున్న గుర్తించింది. పాత కక్షలతో ఎవ రో చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలతో కలసి ఏఎస్పీ సంఘటనా స్థలాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. అనుమానితులైన మృతుడి రెండో భార్య మంగ, ఆమె సోద రులను మంగళ, బుధవారాలు విచారించారు. లభించిన ఆధారాలు, విచారణలో వెలువడిన విషయాలు ధ్రువపడడంతో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో కొంతమందికి సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఏఎస్పీ రిషాంత్ రెడ్డి విలేకరులకు వివరించారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..
కర్ణాటక,బళ్లారి అర్బన్: బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చిన ఘటన చోటు చేసుకొంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొళగల్లు గ్రామానికి చెందిన కాగి సోమయ్య(34) అనే వ్యక్తి ఈనెల 20న తన భార్య యల్లమ్మతో కలిసి ద్విచక్ర వాహనంలో బళ్లారి–హొసపేటె రోడ్డులోని రామేశ్వరినగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వంతెన వద్దకు రాగానే పథకం ప్రకారం యల్లమ్మ తన ప్రియుడు, అదే గ్రామానికి గ్రామ పంచాయితీ సభ్యుడు సంజీవప్పను అక్కడకు పిలిపించింది. దీంతో సంజీవప్ప వారిని అటకాయించి సోమయ్యపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి హెచ్ఎల్సీ ప్రధాన కాలువలోకి మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి సోమయ్య ఆచూకీ లేకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి యల్లమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న సంజీవప్ప కోసం గాలింపు చేపట్టారు. కాగా సోమయ్య మృతదేహం మంగళవారం లభ్యమైంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హనుమంతప్ప దర్యాప్తు చేపట్టారు. -
దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య
తమిళనాడు ,టీ.నగర్: దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హతమార్చిన భార్యతో సహా ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని పుళల్ బుద్దగరం వెంకటేశ నగర్ 13వ వీధికి చెందిన సురేష్ (24) అదే ప్రాంతంలోని మాంసం దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి విల్లుపురానికి చెందిన అనసూయతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి లోకేష్ అనే కుమారుడు ఉన్నారు. ఇలా ఉండగా సోమవారం ఉదయం పుళల్ పోలీసు స్టేషన్కు సురేష్ మృతి చెందినట్టు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ తంగదురై ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు విచారణలో అనసూయను విచారించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఆమె భర్త సురేష్ తరచుగా మద్యం సేవించి తగాదాకు దిగేవాడని తెలిపింది. దీంతో తన బంధువు మారన్ (22)ను పిలిపించి, అతని సాయంతో భర్త సురేష్ గొంతును దుప్పట్టాతో నులిపి హతమార్చినట్లు తెలిపింది. ముందుగా సురేష్కు దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పినట్లు తెలిపింది. ఆ తర్వాత మారన్ సాయంతో ఉరిపై వేలాడదీసినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో అనసూయను పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మారన్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
అత్తారింటికి వెళ్లి.. హత్యకు గురయ్యాడు
సాక్షి, దేవరకద్ర: ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను హతమార్చి పూడ్చిపెట్టింది. ఈ సంఘటన మండలంలోని మద్దూరులో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ పాండురంగారెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాన్గల్ మండలం కేతేపల్లికి చెందిన ఆంజనేయులు(40)కు చిన్నచింతకుంట మండలం మద్దూరు చెందిన రాములమ్మతో గత 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన ఐదేళ్ల నుంచి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో రాములమ్మ భర్త ఆంజనేయులుతో గొడవపడి ఐదేళ్ల క్రితం తల్లిగారి ఊరైన మద్దూరుకు ఐదేళ్ల క్రితం తిరిగి వచ్చింది. అయితే గత నెల 23న రాములమ్మ తల్లికి ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలుసుకున్న ఆంజనేయులు అదేరోజు మద్దూరుకు వచ్చాడు. ఆ తర్వాత ఆంజనేయులు అదృశ్యమయ్యాడు. అదృశ్యంపై కేసు నమోదు ఈ నెల 5న రాములమ్మ తన భర్త ఆంజనేయులు కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానంతో రాములమ్మ, ఆమె ప్రియుడు సలీం, రాములమ్మ తమ్ముడు రాజు ముగ్గురు కలిసి ఆంజనేయులును గత నెల 23న హత్య చేసినట్లు సలీం ఒప్పుకున్నాడు. ఈ మేరకు గురువారం శవాన్ని పూడ్చిన స్థలాన్ని చూయించగా కుటుంబ సభ్యుల సమక్షంలో శవాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కటుంబ సభ్యులకు అప్పగించారు. ఆంజనేయులుకు భార్యతోపాటు ఒక కూతురు ఉంది. పాన్గల్ (వనపర్తి): మండలంలోని కేతేపల్లికి ఆంజనేయులు అత్తగారింటికి వెళ్లి హత్యకు గురవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బండలయ్య, బాలకిష్టమ్మ దంపతుల రెండో కుమారుడు ఆంజనేయులు. అయితే భార్య రాములమ్మకు వివాహేతర సంబంధం ఉండటంతో ఆంజనేయులును హత్య చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అనుమానిస్తున్నాడని చంపేసింది?
సాక్షి, వేములవాడ: అనుమానం..వేధింపులు పెరిగిపోవడంతో భర్తను భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతనెల21న అగ్రహారం గుట్టల్లో వ్యక్తి శవమై కనిపించిన లక్ష్మణ్ (27)ను అతడి భార్య మౌనిక (25)నే కడతేర్చిందని ఆరోపిస్తూ గురువారం వీర్నపల్లి గ్రామస్తులు వేములవాడ పోలీస్స్టేషన్ను ముట్టడించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం... వీర్నపల్లికి చెందిన మంచాల లక్ష్మణ్ (27) ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లాడు. నాలుగేళ్లక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న క్రమంలో సెల్ఫోన్లో సంభాషణపై దృష్టి పెట్టాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని, ఎవరితో నీకు సంబంధాలు ఉన్నాయని, నీకు వ్యాధి సోకిందని నిత్యం వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. తనకు చెకప్ చేయించాలని మౌనిక భర్తను ప్రాధేయపడింది. లక్ష్మణ్కు భార్య మౌనిక ప్రవర్తనపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం గొడవలు జరగడం కొనసాగాయి. ఈ క్రమంలో గతనెల16న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనంకోసం లక్ష్మణ్, మౌనికతోపాటు కుమారుడు, కూతురు వెళ్లారు. అంజన్నను దర్శించుకుని వేములవాడకు చేరుకుని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. 17న ఉదయం ఇద్దరు పిల్లల్ని లాడ్జి వద్దనే ఉంచి భార్యభర్తలిద్దరూ అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భర్తతో చనువుగా మాట్లాడుతూ అగ్రహారం గుట్టపై ఉన్న క్వారీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మద్యంలో తాను వెంట తెచ్చిన గడ్డి ముందు కలిపి లక్ష్మణ్కు తాగించి గుట్టపైనుంచి నెట్టేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. మంచాల లక్ష్మణ్(ఫైల్): గతనెల 21న అగ్రహారం గుట్టల్లో లభ్యమైన మృతదేహం అనంతరం వీర్నపల్లికి చేరుకున్న మౌనిక తన భర్త లక్ష్మణ్ తిరిగి గల్ఫ్కు వెళ్లాడని చెప్పింది. అనుమానం వ్యక్తం చేసిన లక్ష్మణ్ కుటుంబసభ్యులు, బంధువులు మౌనికపై ఒత్తిడి పెంచారు. పలుమార్లు హెచ్చరించడంతో గతనెల 29న పోలీస్స్టేషన్లో తన భర్త లక్ష్మణ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు 30న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మౌనికను విచారణ చేపట్టగా జరిగిన విషయం పోలీసులకు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు వేములవాడలోని పలు ప్రాంతాలను గురువారం పరిశీలించినట్లు తెలిసింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వీర్నపల్లి గ్రామస్తులు ఠాణా నుంచి వెళ్లిపోయారు. కాగా హత్య ప్రమేయంలో మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎవరేది పోలీసులు విచారిస్తున్నారు. -
భార్య చేతిలో.. భర్త హతం
షాద్నగర్రూరల్: మద్యం సేవించి తరుచు గొడవ పడుతున్న భర్తను అతని భార్య దారుణంగా హతమార్చిన సంఘటన శనివారం అర్థరాత్రి ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. షాద్నగర్ పట్టణ సీఐ శ్రీధర్కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామానికి చెందిన విష్ణుమూర్తి(30) వివాహం కొన్నేళ్ల క్రితం కొందుర్గు మండలం పీర్జాపూర్ గ్రామానికి చెందిన శారదతో జరిగింది. విష్ణుమూర్తి కందివనం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రిక్షా నడిపిస్తూ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అయితే విష్ణుమూర్తి తరుచుగా మద్యం సేవించి ఇంటికి రావడంతో పాటు భార్య, పిల్లలతో నిత్యం గొడవపడేవారని తెలిపారు. కళ్లలో కారంపొడి వేసి.. మద్యం సేవించి శనివారం అర్థరాత్రి ఇంటికి వచ్చి గొడవ పడుతున్న భర్త విష్ణుమూర్తి తీరుతో అప్పటికే విసుగు చెందిన అతని భార్య శారద.. విష్ణుమూర్తి కళ్లల్లో కారంపొడి చల్లించింది. దీంతో కింద పడిపోయిన విష్ణుమూర్తి తలపై బండరాయితో బలంగా బాది హతమార్చింది. ఈ విషయాన్ని ఇంటి చుట్టుపక్కల వారికి, బంధువులకు శారదనే స్వయంగా వెళ్లి చెప్పింది. రోజూ మద్యం తాగి తనను, తన పిల్లలను చిత్రహింసలు పెట్టడాన్ని భరించలేక ఈ పనిచేశానని భోరున విలపించింది. నిందితురాలని చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. భర్తను హతమార్చిన శారదను గ్రామస్తులు ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు తాళ్లతో కట్టేశారు. ఎక్కడికైనా పారిపోతుందేమోనని ఆమెను చెట్టుకు కట్టేసినట్లు గ్రామస్తులు వివరించారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ పట్టణ సీఐ శ్రీధర్కుమార్, ఎస్ఐ విజయ్కుమార్ ఆదివారం ఉదయం సంఘటనా çస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
భర్తను చంపిన భార్య
సాక్షి, ఇందల్వాయి: భార్య తన భర్తను హత్య చేసిన ఘటన ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో జరిగింది. స్థానిక డిచ్పల్లి సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాయిడి గంగారాం(53) నాయిడి సాయవ్వ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి వివాహాలు చేసి తమకున్న ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. పిల్లల పెళ్లీళ్ల నిమిత్తం దుబాయ్ వెళ్లిన గంగారాం నాలుగు నెలల క్రితమే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో గంగారాం మద్యం తాగినప్పుడల్లా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. తెల్లవారేసరికి గంగారాం మృతదేహం ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉందని స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తన భర్తను తానే చంపినట్లు సాయవ్వ ఒప్పుకున్నా.. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి సొదరి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
ప్రియుడిపై మోజుతోనే..
సాక్షి, నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో రియల్టర్ సోమకేశవులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతోనే కట్టుకున్న భార్యే తన ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యోదంతంలో భాగస్వాములైన ఐదుగురు నిందితులను ప్రవేశపెట్టి జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని చైతన్యపురిలో నివాసముంటున్న రియల్టర్ సోమ కేశవులు భార్య స్వాతితో శాంతినగర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి(సీసీ కెమెరాల ఏర్పాటు) దుబ్బ ప్రదీప్తో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం రెండు నెలల క్రితం భర్తకు తెలియడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. తరచుగా ఫోన్లో మాట్లాడడం, వాట్సప్లో ఫొటోలు ఉండడంతో ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో స్వాతి తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు రూ.2లక్షలు ఇస్తానని స్వాతి ప్రియుడికి చెప్పింది. హత్య చేసింది ఇలా... ప్రియుడు దుబ్బ ప్రదీప్ సోమ కేశవులును హత్య చేసేందుకు బొట్టుగూడలో ప్రింటర్గా పనిచేస్తున్న కొడిదేటి శివకుమార్ను సంప్రదించాడు. స్వాతితో తనకున్న సంబంధాన్ని వివరించాడు. స్వాతి భర్త అడ్డు తొలగించాలని చెప్పడంతో హత్యకు ప్లాన్ వేశారు. కొడిదేటి శివకుమార్ మర్రిగూడ మండలంలోని వెంకపల్లి గ్రామానికి చెందిన కంబం ప్రసాద్, బొట్టుగూడకు చెందిన ఆటోడ్రైవర్ చింతపల్లి నగేశ్, ప్రదీప్ అందరూ కలిసి ప్రదీప్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటిపై ఈ నెల 1న మద్యం సేవించారు. కేశవులును హత్య చేసేందుకు రాత్రి 10గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే స్వాతి ఇద్దరు పిల్లలకు కూల్డ్రింక్లో నిద్ర మాత్రలు కలిపి తాగించింది. కాగా, కేశవులు ఇంకా నిద్రపోలేదని, నిర్ధారించుకొని మళ్లీ వెళ్లి మద్యం తాగారు. కేశవులు భార్య స్వాతి హాల్లో పడుకున్నాడని ప్రదీప్కు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే గ్లామర్ బైక్పై సుత్తె, టవల్ తీసుకొని వచ్చారు. ఇంటి వెనుక గేట్ నుంచి చిన్నపిల్లల గది ద్వారా హాల్లోకి వచ్చారు. ప్రియుడు ప్రదీప్ ఒక్కసారిగా సోమకేశవులు మెడకు టవల్ గుంజి కట్టాడు. ఊపిరి ఆడకుండా చేశాడు. కొడిదేటి శివకుమార్ సుత్తెతో తలపై కొట్టబోగా సుత్తెకామ ఊసి పడింది. కంబం ప్రసాద్ కేశవులు కాళ్లు కదలకుండా పట్టుకున్నారు. ఊడిపోయిన సుత్తెను తీసుకున్న శివకుమార్ ఛాతిపై గట్టిగా కొట్టాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత దుబ్బ ప్రదీప్, శివకుమార్, ప్రసాద్ కలిసి కేశవులు మృతదేహాన్ని వరండాలో ఉంచారు. ఎవరో డబ్బుల గురించి చంపి పోయారని అనుకునే విధంగా కారం తెచ్చి చల్లారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు స్వాతి బెడ్రూం బయటినుంచి గడియ పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఇలా చిక్కారు... స్వాతి, ప్రదీప్లకు మధ్య వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఫోన్కాల్ డేటాను పరిశీలించారు. ఇద్దరూ అనేక సార్లు మాట్లాడుకున్నట్లు నమోదైంది. దీంతో సోమ కేశవులు దహన సంస్కారాల అనంతరం వెంటనే స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రదీప్తో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది. అనంతరం నిందితులు జిల్లా కేంద్రంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఉన్నారని పోలీసులు తెలుసుకుని అరెస్ట్ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన వన్టౌన్ సీఐని ఎస్పీ, ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ గంగారాం అభినందించారు. హత్యలో పాలుపంచుకుంది వీరే... సోమ కేశవులును హత్య చేసేందుకు భార్య స్వాతి ప్రియుడు ప్రదీప్ను ప్రోత్సహించింది. దుబ్బ ప్రదీప్, కంబం ప్రసాద్, శివకుమార్, చింతపల్లి నగేశ్లు హత్యకు ప్లాన్ వేశారు. చింతపల్లి నగేశ్ రెండోసారి కేశవులును చంపేందుకు ఇంటికి వచ్చే సమయంలో అధికంగా మద్యం తాగడంతో లేవలేని స్థితిలో ఉన్నాడు. నగేశ్ను వదిలేసి శివకుమార్, ప్రసాద్, భార్యస్వాతి, ప్రియుడు ప్రదీప్లు కలిసి కేశవులును హత్య చేశారు. -
భర్తను కడతేర్చిన భార్య
సాక్షి, ఆసిఫాబాద్: తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్న భర్తను కూల్డ్రింక్లో పురుగుల మందు ఇచ్చి కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్లో మంగళవారం వెలుగుచూసింది. ఎస్సై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన చౌదరి శంకర్ (34) 11 సంవత్సరాల క్రితం ఆసిఫాబాద్ పరిధిలోని చిలాటిగూడకు చెందిన రూపతో వివాహమైంది. ప్రస్తుతం వీరికి హరిక, కీర్తణ ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఇటీవల భార్యభర్తలకు తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శంకర్ తాగుడుకు బానిసగా మారాడు. సోమవారం సాయంత్రం శంకర్ కూల్డ్రింక్ కావాలని భార్యను కోరాడు. కూల్డ్రింక్ తెప్పించిన రూప బాటిల్లోని కొంత పిల్లలకు పోసి మిగిలిన దాంట్లో పురుగుల మందు కలిపి శంకర్కు ఇచ్చింది. దానిని తాగిన శంకర్ చేదుగా ఉందని భార్యను నిలదీశాడు. అప్పటికే శంకర్ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక ఆర్ఎంపీని పిలిపించి పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కాగజ్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించేలోగా మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భర్త గొంతు కోసి హైడ్రామా
చెన్నై ,సేలం: ఇంట్లో భర్త గొంతు కోసి హత్య చేసి బయట తలుపులు వేసి అతడే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించేందుకు ప్రయత్నించిన కసాయి భార్యను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలోని తన్నీర్ పందల్ పాళయం గ్రామ పంచాయతీలోని మేడా మంగళం గ్రామంలోని ఎంజీఆర్ నగర్కు చెందిన నేత కార్మికుడు కల్యాణ సుందరం (66). ఇతను వివాహమై పిల్లలు ఉన్న స్థితిలో తనతో పనిచేస్తూ వచ్చిన పూంగొడి (46) అనే మహిళను కల్యాణ సుందరం రెండో పెళ్లి చేసుకుని, ఆమెతో జీవిస్తూ వచ్చాడు. వీరికి 21, 19 ఏళ్ల వయస్సులో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలాఉండగా, కల్యాణ సుందరంకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నట్టు పూంగొడికి తెలిసింది. ఇదే విధంగా పూంగొడి ప్రవర్తనలో కూడా కల్యాణ సుందరంకు సందేహం ఏర్పడింది. ఈ కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కత్తితో గొంతు కోసి.. ఈ స్థితిలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు కల్యాణ సుందరం పనికి వెళ్లి వస్తానని తెలిపాడు. తాను కూడా అతనితో పాటు వస్తానని పూంగొడి పట్టుబట్టింది. రావొద్దని కల్యాణ సుందరం ఎంత చెప్పిన వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. కల్యాణ సుందరం తన చేతికి అందిన కత్తి చూపి తనతో వస్తే కత్తితో పొడిచేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన పూంగొడి కల్యాణ సుందరంను తోసివేసింది. అతని చేతిలో ఉన్న కత్తిని లాక్కుని కల్యాణ సుందరం గొంతుకోసి హతమార్చింది. వెంటనే ఇంటి నుంచి వెలుపలికి వచ్చి తలుపులను మూసి వెలుపలి వైపు నుంచి గొళ్లెం తగిలించింది. తలుపులు మూసి హైడ్రామా: ఇంటిలోపల గొంతు కోసిన స్థితిలో ప్రాణాలకు పోరాడుతున్న కల్యాణ సుందరం అతి కష్టం మీద లేచి తలుపు, కిటికీలు తట్టాడు. శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోగా, ఇంటి బయట ఉన్న పూంగొడి కల్యాణ సుందరం కత్తితో తనను చంపడానికి వస్తున్నాడని, అందుకోసమే బయట తలుపులకు గొళ్లెం పెట్టినట్టు చెప్పి నమ్మించింది. తర్వాత కొంత సేపటికి ఇంటి నుంచి శబ్దం రాకపోవడంతో అక్కడున్న వారిని లోపలికి వెళ్లి కల్యాణ సుందరం ఏం చేస్తున్నాడో చూడమని కోరింది. అక్కడికి వెళ్లిన చూసిన వారు రక్తపు మడుగులో కల్యాణ సుందరం నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. దీంతో తన భర్త గొంతు కోసుకుని చనిపోయాడంటూ బోరున విలపించింది. తడబడి...పట్టుబడి: సమాచారం అంద.ుకున్న పోలీసు కమిషనర్ ఆరోగ్యరాజ్ నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. పూంగొడి వద్ద విచారించగా తొలుత కల్యాణ సుందరం తనకు తానుగానే కత్తితో గొంతు కోసుకున్నట్టు తెలిపింది. అయితే, ఆ సమయంలో పూంగొడి మాటలు తడబడడంతో సందేహించిన పోలీసులు ఆమె వద్ద తీవ్ర విచారణ చేపట్టారు. తాను భర్త గొంతు కోసి హత్య చేసినట్టు పూంగొడి అంగీకరించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కల్యాణ సుందరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మరిదితో వివాహేతర సంబంధం.. భర్త హత్య
చైతన్యపురి: వివాహేత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం ఎల్బీనగర్ ఏసీసీ పృథ్వీదర్రావు, సీఐ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. డిండి మండలం, దేవత్పల్లి తండాకు చెందిన బానోవత్ దులియా అలియాస్ శంకర్ (33) భార్య విజయ, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి చైతన్యపురి యదవనగర్లో ఉంటూ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే విజయ మరిది వరసయ్యే సపావత్ కిషన్తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిని గుర్తించిన శంకర్ ఆమెను మందలించడంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి మద్యం తాగిన శంకర్ నిద్రలో ఉండగా విజయ, కిషన్ అతని ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం కరెంట్ షాక్తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. శంకర్ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. తామె హత్య చేసినట్లు అంగీకరించడంతోవారిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
జహీరాబాద్: తన ప్రియురాలిని కలుసుకునేందుకు భర్త అడ్డంకిగా మారాడని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్యచేయించినట్లు డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన సయ్యద్ కరీం(26)ను ఈనెల 2వ తేదీన మహ్మద్ ముబీన్(26) అనే నిందితుడు తన స్నేహితుడికి సుపారి ఇచ్చి హత్య చేయించాడు. నిందితుడు ముబీన్ మృతుడి భార్యతో కలిసి 1నుంచి 8వ తరగతి వరకు జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ముబీన్ అప్పటి నుంచి మృతుడి భార్యను ప్రేమిస్తున్నాడు. మృతుడు కరీం బతుకుదెరువు గురించి సౌది దేశం వెళ్లిన సమయంలో అతడి భార్య జహీరాబాద్లోని తల్లిగారింటికి వచ్చింది. దీంతో ముబీన్ ఆమెతో కలిసేవాడు. సుమారు 8 నెలల క్రితం మృతుడు కరీం సౌదీ దేశం నుంచి పూర్తిగా తిరిగి వచ్చాడు. ఆరు నెలల క్రితం జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా సమీపంలో హైటెక్ ఎస్.ఎస్ రేయిలింగ్ షాపును పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ముబీన్ తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కరీంను ఎలాగైనా చంపించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందుకు పథకం వేసి తన స్నేహితుడు అయిన జహీరాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ సమద్(30)ని ఆశ్రయించాడు. సమద్ స్కూల్ బ్యాగులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అతడు వ్యాపారం సక్రమంగా చేయనందున అప్పుల పాలయ్యాడు. మద్యంకు బానిసగా మారాడు. ముబీన్ సమద్ బలహీనతలను గమనించి తన బాధలను చెప్పుకున్నాడు. కరీంను చంపినట్లయితే రూ.3లక్షలు సూపారి కింద ఇస్తానని, ఈ డబ్బుతో అప్పులు తీర్చుకోవడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోమని నమ్మబలికాడు. దీంతో సమద్ తన అప్పులు తీరుతాయని భావించి ముబీన్ సూచన మేరకు కరీంను హత్యచేసేందుకు నిర్ణయించుకున్నాడు. సమద్కు రూ.10వేలు ముట్టచెప్పాడు ముబీన్. ముబీన్ను నమ్మి ఈనెల 2వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముబీన్ తన పల్సర్ మోటారు సైకిల్పై సమద్ను కూర్చోబెట్టుకుని ఆదర్శనగర్ క్రాసింగ్ వద్ద విడిచి పెట్టాడు. సమద్ తన వెంట కొబ్బరి బొండాం నరికే కత్తిని ప్యాంట్లో పెట్టుకుని కరీం దుకాణం వద్దకు వెళ్లాడు. వెళ్లి ఖాశీంపూర్ గ్రామంలో గల దర్గా వద్ద రేయిలింగ్ చేయాలని కరీంను రమ్మని కోరాడు. అతడిని బయటకు పిలిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై రెండు సార్లు నరికాడు. ఇంకా కొట్టబోగా చేతులు అడ్డం పెట్టాడు. దీంతో దాడిలో కరీం రెండు చేతులు, భుజానికి గాయాలయ్యాయి. కుడికాలుపై కూడా వేటు వేశాడు. దీంతో అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. కరీం చనిపోయాడని నిర్దారించుకున్నాక వారు వేసుకున్న పథకం ప్రకారం.. బీదర్ క్రాస్ రోడ్డువద్ద ముబీన్, సమద్లు కలుసుకున్నారు. అనంతరం మోటారు సైకిల్పై కర్ణాటకలోని మన్నా ఎక్కెల్లికి పారిపోయారు. శుక్రవారం ఇరువురు తమ ఇళ్ల వద్దకు రాగా అరెస్టు చేసి మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. మృతుడు కరీంకు 4 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమార్తె ఉంది. ఈ సంఘటన మూడు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్సై రాజశేఖర్లు పాల్గొన్నారు. -
కసితీరా నరికేసి.. బ్యాగుల్లో ప్యాక్ చేసి..!
సాక్షి, న్యూఢిల్లీ: క్రైమ్ షోలకు అలవాటు పడ్డ భార్య తనను అనుమానిస్తున్నాడని భర్తను కిరాతకంగా చంపేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ హత్య ఢిల్లీలో చోటు చేసుకుంది. రాజేశ్, సునీత భార్యాభర్తలు. వీరి మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు సునీతకు ఎవరితోనో సంబంధం ఉందంటూ అనుమానించడంతో అతనిపై మరింత కోపాన్ని పెంచుకుంది. ఎలాగైనా సరే ఈ గొడవలకు స్వస్తి చెప్పాలని భావించిన సునీత తన భర్తను చంపడానికే సిద్ధపడింది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 14న రాజేశ్కు మత్తుమందు ఇచ్చి, తన కుమారుడిని పక్కింటికి పంపించింది. రాజేశ్ శరీరాన్ని కసితీరా 8 భాగాలుగా నరికింది. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ముక్కలను వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్ చేసింది. తలను డ్రైనేజీలో వేసింది. కాళ్లను ఇంటి ఆవరణలో, మిగతా భాగాలను తన బెడ్రూమ్తో పాటు, మిగతా ప్రాంతాల్లో పూడ్చిపెట్టింది. తర్వాత 2 రోజులకు తన భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత సునీత ఇంటి దగ్గరలో డ్రైనేజీలో గుర్తుపట్టని స్థితిలో తల కన్పించింది. కానీ అది రాజేశ్ తలగా నిర్ధారణ చేసుకోలేకపోయారు పోలీసులు. కానీ గతవారం సునీత గదిలో పూడ్చిన నేలపై కుళ్లిపోయే స్థితిలో ఉన్న వేళ్లను ఇంటి యజమాని గమనించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సునీతను విచారించగా హత్య చేసినట్టుగా అంగీకరించింది. ప్రేమికుల రోజు నాడే భర్తను పరలోకానికి పంపిన సునీత తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తుంది. తల్లికి, తండ్రికి దూరమైన బాలుడిని పిల్లల ఆశ్రమంలో చేర్పించారు. -
ఉసురు తీస్తున్న.. వివాహేతర సంబంధాలు
మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు కట్టుకున్న భర్తల ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తున్నారు. వారం వ్యవధిలో కోదాడ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడు ఘటనలు సభ్యసమాజాన్ని కలవరపరుస్తున్నాయి. మూడు ఘటనల్లో రెండింటిలో భార్యలే భర్తల హత్యకు సూత్రధారులుగా వ్యవహరించగా ప్రియులు పాత్రధారులుగా మారి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. మరో ఘటనలో ఓ భర్త తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె ప్రియుడిని దారుణంగా హత్యచేసాడు. తండ్రి హత్యకు గురికాగా, తల్లి జైలుపాలు కావడంతో మూడు కుటుంబాల్లో చిన్న పిల్లలు అనాథలుగా మారారు. సాక్షి, కోదాడ : మూడు హత్యలను పరిశీలిస్తే తాత్కాలిక ఆకర్షణకు లోనైన వీరు కుంటుంబ పరిస్థితులను పట్టించుకోకుండా వివాహేతర సంబంధాలను కొనసాగించారు. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తలను పొట్టన పెట్టుకున్నారు. గుడిబండ గ్రామానికి చెందిన పులికాశయ్య హైదరాబాద్లోని ఎల్బీనగర్ వద్ద ఓ అపార్టుమెంట్లో వాచ్మన్గా పని చేస్తున్నాడు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న యువకుడితో కాశయ్య భార్య నాగలక్ష్మి విహహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరో ఘటనలో చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడేనికి చెందిన కుక్కల గోపిని అతని భార్య రేణుక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో దారుణంగా హత్య చేయించింది. వీరికి వివాహం జరిగి 8 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతి చెందడం, తల్లిని పోలీసులు అరెస్టు చేయడంతో పట్టుమని పది సంవత్సరాలు కూడా లేని వీరి ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. భార్యభర్త చేతిలో ప్రియుడు ఇక నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఓ భర్త తన భార్యతో కలిసి యువకుడిని దారుణంగా హత్య చేసి సాగర్ కాలువలో పడవేశాడు. పక్షం రోజుల తర్వాత ఘటన వెలుగు చూడడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో యువకుడు రహీం హత్యకు గురికాగా భార్యభర్తలు కోటయ్య, త్రీవేణిలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వీరి కొడుకు ఇపుడు దిక్కులేనివాడయ్యాడు. ఇటీవల హత్యకు గురైన కుక్కల గోపి గుడిబండ వాసి పులి కాశయ్యరహీమ్ (ఫైల్) పాపం పసివాళ్లు ఇలాంటి బంధాల వల్ల అభం శుభం తెలియని పసిపిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయ్యారయ్యింది. కోదాడలో చోటు చేసుకున్న మూడు ఘటనల్లో పదేళ్ల లోపు ఐదుగురు పిల్ల అనాథలు గా మారారు. తండ్రి మరణించడం, తల్లి జైలుపాలు కావడంతో వారి అలనాపాలనా చూసే వారు కరువయ్యారు. అసలేం జరిగిందో కూడా అర్థం చేసుకోలేని వయస్సులో జరిగిన ఈ ఘటనలు వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతా యని ఇలాంటి బంధాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. -
తల్లి అక్రమబంధానికి కుమార్తె సహకారం..
కీసర: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన కేసులో కీసర పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కీసర సీఐ నరేందర్గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిస్సాకు చెందిన బీర వసంత్(40) చాలా కాలం క్రితం నగరానికి వలస వచ్చి భార్య రేణుకతో కలిసి రాజీవ్గృహాకల్పలో ఉంటూ టెంట్హౌస్లో కూలీగా పని చేస్తున్నాడు. రేణుక గ్యాస్ గోదాంలో పనిచేసేది. వారికి ఇద్దరు సంతానం. భార్యా, భర్తలిద్దరూ తరచూ మద్యం తాగి గొడవపడేవారు ఈ నేపథ్యంలో రేణుకకు గ్యాస్ గోదాంలో తనతో పాటు పని చేస్తున్న కిషోర్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రియుడి మోజులో పడిన రేణుక ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. ఇందుకు తన కుమార్తె (13) సహకారం కోరింది. తల్లి సూచనమేరకు ఈనెల 13న కుమార్తె చికెన్లో ఎలుకల మందు కలిపి తండ్రి వసంత్కు పెట్టింది. దీనిని పసిగట్టిన వసంత్ చికెన్ను బయట పారవేశాడు. రాత్రి మద్యం తాగి నిద్రిస్తున్న వసంత్ను రేణుక తన ప్రియుడు కిషోర్, కుమార్తెతో కలిసి చున్నీతో మెడకు భిగించి హత్య చేశారు.అనంతరం అతిగా మద్యం తాగినందునే చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో హత్య చేసినట్లు నిర్ధారణైంది. హత్యకు వినియోగించిన చున్నీ, టవల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు రేణుక, కిషోర్ను రిమాండ్కు తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డొస్తున్నాడని అంతమొందించింది
అనంతపురం, ఓడీ చెరువు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితోపాటు మరోవ్యక్తితో కలిసి అంతమొందించింది. నేరం తనపైకి రాకుండా అనుమానాస్పద కేసుగా చిత్రీకరించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. కదిరి డీఎస్పీ శ్రీనివాసులు గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన తంబాల పెద్ద ఆదెప్ప(35) తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో భార్య రమాదేవి అదే గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడు మంజునాథ్తో కలిసి పథకం రచించింది. ఇందుకు చరణ్ అనే మరో వ్యక్తిని సాయం కోరింది. ఈమేరకు చరణ్ ఈ నెల 18న రాత్రి(సోమవారం) మద్యం సేవిద్దామని చెప్పి పెద్ద ఆదెప్పను మండల కేంద్రంలోని చెరువులోకి పిలుచుకెళ్లాడు. అక్కడ పూటుగా మద్యం తాపాడు. ఇంతలో మంజునాథ్, రమాదేవి అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న పెద్ద ఆదెప్పను ముగ్గురూ కలిసి గొంతు, మర్మావయవాలు నులిమి చంపేశారు. తర్వాత ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకున్నారు. మంగళవారం మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లమాడ సీఐ నరసంహారావు, ఎస్ఐ ఫణిధర్కుమార్రెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్ని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహారావు, ఎస్ఐ ఫణిధర్కుమార్రెడ్డిని డీఎస్పీ అభినందించారు. -
ప్రియురాలితో ఉన్నభర్తను చంపి ఆపై..
చెన్నై, తిరువొత్తియూరు: కోవై సమీపంలో ప్రియురాలితో కాపురం చేస్తున్న భర్తను భార్య హతమార్చింది. అనంతరం అరెస్ట్ భయంతో ఆత్మహత్యాయత్నం చేసింది. కోవై సుందరాపురం బాలమురుగన్ ఆల యం వీధికి చెందిన బాబురాజ్ (37) కార్పెంటర్. ఇతని భార్య భాగ్యం (34). వీరికి ముగ్గురు కుమార్తెలు. బాబురాజ్కు గునియముత్తూరు బి.కె.పుదూర్కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబం ధం ఏర్పడింది. కొన్ని నెలలుగా ఇతను భార్య పిల్లలను వదలి ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. భాగ్యం కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. శనివారం ఇంటికి వచ్చిన బాబు రాజ్తో భాగ్యం గొడవ పడింది. రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవ ఏర్పడింది. ఆగ్రహించిన బాబురాజ్ అక్కడున్న బీర్ బాటిల్తో భార్యను పొడవడానికి ప్రయత్నించాడు. తప్పించుకున్న భాగ్యం కర్రతో భర్త తలపై దాడి చేయడంతో మృతి చెందాడు. అనంతరం పోలీసులకు భయపడి భాగ్యం చేతిని కత్తితో కోసుకుని, దోమల మందు తాగి స్పృహ తప్పింది. ఉదయం నిద్ర లేచిన పిల్లలు తండ్రి మృతి చెంది ఉండడం, తల్లి స్పృహతప్పి పడి ఉండడంతో కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని భాగ్యం ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కట్టుకున్నోడిని కాటికి పంపింది
-
డాక్టర్తో కలిసి.. భర్తను హత్య చేసిన రజని!
ప్రకాశం ,పెద్దదోర్నాల: కంభంలో కలకలం సృష్టించిన మోహన్రెడ్డి కిడ్నాప్ విషాదాంతమైంది. మూడు రోజులుగా కనిపించకుండాపోయిన మోహన్రెడ్డి దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని రోళ్లపెంట గిరిజన గూడేనికి సమీపం రోడ్డు పక్కనున్న లోయలో సుమారు 50 అడుగుల దూరంలో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వివరాలు.. కంభం పట్టణంలో నివాసం ఉంటున్న మోహన్రెడ్డి ఈ నెల 29వ తేదీ నుంచి కనబడటం లేదన్న బంధువుల ఫిర్యాదుతో డివిజన్లోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జగన్ అదృశ్యం వెనుక అన్ని కోణాలను లోతుగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మృతుడి భార్యతో పాటు అమెతో సన్నిహితంగా మెలిగే కంభం పట్టణానికి చెందిన ఓ డాక్టర్, వీరితో పాటు కర్నూలు పట్టణంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బంధువును గురువారం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో జగన్మోహన్రెడ్డిని హతమార్చినట్టు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుల నుంచి నిజం రాబట్టిన పోలీసులు మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. జిల్లా సరిహద్దు ప్రాంతం రోళ్లపెంట గిరిజన గూడెంలోని అటవీ శాఖకు సంబందించిన బేస్ క్యాంపునకు కూతవేటు దూరంలో కర్నూలు జిల్లా పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతలో జగన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.(భర్త కిడ్నాప్..అదుపులో భార్య, వైద్యుడు..) సంఘటన స్థలానికి భారీగా చేరుకున్న సన్నిహితులు నల్లమల అటవీ ప్రాంతంలో మోహన్ మృతదేహం బయట పడిందన్న సమాచారం తెలియడంతో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పలు వాహనాల్లో భారీగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కర్నూల్ రహదారి పక్కన లోయలోని 50 అడుగుల దూరంలో మరింత లోతుకు దొర్లకుండా చెట్టు సాయంతో ఆగి ఉన్న జగన్మోహన్రెడ్డి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనకు నల్లమల అటవీ ప్రాంతం సజీవ సాక్ష్యంగా నిలిచింది. అనంతరం స్థానిక గిరిజనుల సహకారంతో పోలీసులు మృతదేహానికి రోడ్డుపై చేర్చి పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు భావిస్తున్నామని, మృతుడి భార్యతో పాటు, మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. సంఘటన స్థలం వద్ద మార్కాపురం, యర్రగొండపాలెం సీఐలు శ్రీధర్రెడ్డి, మారుతీకృష్ణ, పెద్దదోర్నాల ఎస్ఐ సుబ్బారావు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, కంభం ఏఎస్ఐ రంగస్వామి పర్యవేక్షించారు. వైద్యుడే ప్రధాన నిందితుడు? ఎల్.కోట గ్రామానికి చెందిన వైద్యుడు, జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ బాలవెంకట నారాయణ గతేడాది కంభంలో వైద్యశాల ప్రారంభించాడు. వైద్యశాల సమీపంలో నివాసం ఉంటున్న మోహన్రెడ్డి భార్యతో వైద్యుడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. జగన్ తన భార్యను మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అక్కడి నుంచి స్థానిక సింధూరి సూపర్ మార్కెట్ వెనుక ఉన్న అపార్ట్మెంట్లోకి కాపురం మారారు. అయినా వైద్యుడికి ఆమెకు మధ్య ఉన్న వివాహేతర సంబంధం కొనసాగింది. మోహన్రెడ్డిని అడ్డు తొలిగించుకునేందుకు ఆయన భార్య రజని..డాక్టర్తో కలిసి పథకం ప్రకారం మోహన్ను కిడ్నాప్ చేసి హత్య చేసి పెద్దదోర్నాల సమీపంలోని అడవుల్లో మృతేహాన్ని పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన జనసేన పార్టీ కార్యకర్తలు శనివారం సాయంత్రం కంభంలోని వైద్యశాల వద్ద డాక్టర్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఆస్పత్రి వద్ద జనసేన ఫ్లెక్సీలు తొలగిస్తున్నఆ పార్టీ కార్యకర్తలు డబ్బు కోసమా? మృధుస్వభావైన మోహన్రెడ్ది ఆర్థిక లావాదేవీలన్నీ భార్యకే అప్పగించేవాడని బంధువుల ద్వారా తెలిసింది. జేసీబీ, ట్రాక్టర్లు, తదితర వ్యాపారాలు చేస్తుండటంతో అధిక మొత్తంలోనే డబ్బులు వచ్చేవి, వచ్చిన ఆ డబ్బులన్నీ భార్య చేతికే ఇచ్చేవాడు. వాటితో పాటు ఆమె వద్ద సుమారు కేజీకిపైగా బంగారు నగలు కూడా ఉన్నాయి. హత్యకు గురైన మోహన్ పేరు మీద పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ తర్వాత అనంతరం ఇంట్లోని నగలు, డబ్బులు సైతం కనబడక పోవడంతో హత్య వెనుక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధం ఒక్కటే హత్యకు కారణమా, డబ్బు, ఆస్తి కోసం అంతమొందించారా అన్న వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. మార్కాపురం వైద్యశాలలో మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. -
భార్య, ప్రియుడు కలిసి..
రాంచీ : భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం, తరుచు భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. జంషెడ్పూర్లో నివసిస్తున్న తపన్ దాస్, శ్వేతాదాస్కు ఏనిమిదేళ్ల అమ్మాయి ఉంది. తపన్ దాస్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడప పడేవాడని దీంతో విసుగు చెందిన భార్య.. మూడు నెలల క్రితం పరిచయమైన ఫేస్ బుక్ ప్రియుడు, అతని స్నేహితుడు ముగ్గురు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. జనవరి 12 రాత్రి మద్యం తాగి వచ్చిన తపన్దాస్కు అతని భార్యకు గొడవ జరిగింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన సుమిత్ సింగ్కు ఫోన్ చేయగా.. అతని స్నేహితుడైన సోను లాల్ను వెంటపెట్టుకుని వచ్చాడు. ముగ్గురు కలిసి తపన్ దాస్ను హత్య చేశారు. అనంతరం అతని శవాన్ని ఫ్రిజ్లో పెట్టి.. ఊరి చివరన పడేశారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా శ్వేతాదాస్.. తన భర్త తాగొచ్చి 1.5లక్షలు తీసుకెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని జనవరి 12న పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు శ్వేతాదాస్ ఫోన్ రికార్డులు, ఇంటిముందు సీసీటీవీలు పరిశీలించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తుండగా.. ముగ్గురు నిందితులు హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. -
అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నాడనే హత్య
కర్ణాటక, కోలారు: నగరంలో గత ఏడాది డిసెంబర్లో చోటు చేసుకున్న యూపీవాసి అనుమానాస్ప మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిణి కటౌచ్ బుధవాం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన గురైన శభానా, ఆమె పిన్నమ్మకుమారుడైన సమీర్లు పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేము అంగీకరించని పోషకులు శభానాను ఉత్తర ప్రదేశ్ శ్యామిలి జిల్లా కైరాణా గ్రామానికి చెందిన సాజిద్ (30)కు ఇచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం దంపతులు హాసన్లో సంవత్సర కాలం క్షురక వృత్తిలో ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కోలారుకు వలస వచ్చారు. అయితే శభానా తన ప్రియుడుతో అక్రమ సంభంధం కొనసాగించింది. సాజిద్ పలు మార్లు హెచ్చరించినా ఫలితం కనిపించలేదు. దీంతో తరుచుగా దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 28న సాజిద్ షనాషా నగర్లో విగతజీవిగా కనిపించాడు. తన భర్తను ఉదయం ఎవరో తీసుకెళ్లారని, ఇంతలోనే విగతజీవుడై కనిపించాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు శబానాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ప్రియుడితో కలిసి ఇంట్లోనే గొంతునులిమి హత్య చేసి, తర్వాత మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసినట్లు అంగీకరించింది. కేసును ఛేదించడంలో ఎస్ఐ అణ్ణయ్య, సిబ్బంది హమీద్ఖాన్, రాఘవేంద్రలు చాకచక్యంగా వ్యవహరించారని ఎస్పీ ప్రశసించారు. -
పెళ్లైన మూడు నెలలకే.. భర్తని హత్య ?
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: పెళ్లై మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే భర్త హత్యకు గురయ్యాడు. అతని భార్యే ఈ హత్య చేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన గెడ్డం రాజు(25)కు అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మితో ఇటీవల వివాహమైంది. సోమవారం రాత్రి రాజు తల్లి లక్ష్మి ఆసుపత్రి çపనిపై వేరే గ్రామం వెళ్లింది. రాజు అతని భార్య సుబ్బలక్ష్మి గదిలో నిద్రించారు. రాజు తండ్రి ఆంజనేయులు గది బయట వరండాలో పడుకున్నాడు. మంగళవారం తెల్లవారు జామున తన భర్త రాజు లేవలేని స్థితిలో ఉన్నాడని రాజు తండ్రి ఆంజనేయులకు సుబ్బలక్ష్మి చెప్పింది. అతను వెళ్లి కుమారుని నిద్రలేపే ప్రయత్నం చేశాడు. ఎంతకీ లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా చనిపోయాడని నిర్ధారించుకున్నారు. అయితే స్థానికులు హత్యగా భావించడంతో రాజు తండ్రి ఇరగవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుబ్బలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుగొండ సీఐ విజయకుమార్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు సందర్శించారు. ఎస్సై బి.రవికుమార్, సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.. సుబ్బలక్ష్మిని గెడ్డం రాజు తన బంధువుల పెళ్లిలో చూసి ఇష్ట పడినట్టు స్థానికులు చెప్పారు. రాజు ఇష్ట ప్రకారమే పెద్దలు పెళ్లి చేసినట్టు తెలిపారు. వ్యవసాయ కూలి పనులు చేసుకునే రాజుకు మద్యం అలవాటు ఉందని, మద్యం మత్తులో ఉండగా చంపేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ హత్య రాజు భార్య ఒక్కతే చేసిందా? లేక మరి కొందరు ఆమెకు సహకరించారా? అనే అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. రాజు నిద్రించే గదికి ఒక వైపు కిటికీకి ఫ్రేమ్ లేదని, అందువల్ల వరండాలో పడుకున్న రాజు తండ్రి ఆంజనేయులు కంట పడకుండా కిటికీ ద్వారా లోనికి ప్రవేశించి ఈ హత్యకు పాల్పడి ఉంటారన్న కొందరు పేర్కొంటున్నారు. -
కంటి‘పాప’ను కాటేయబోయిన తండ్రి
కామంతో కళ్లు మూసుకుపోయిన భర్తను కడతేర్చిన భార్య ఉదంతమిది. వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా భార్య భరించింది. తాగొచ్చి హింసించినా సర్దుకుపోయింది. కుమార్తె అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడంతో సహనం కోల్పోయి దాడి చేయడంతో భర్త ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అనంతపురంలో గురువారం చోటు చేసుకుంది. అనంతపురం సెంట్రల్: కొత్తచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ సదాశివరెడ్డి హత్యకు గురయ్యాడు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసముంటున్న ఈయనకు పాతికేళ్ల కిందట శోభా అనే మహిళతో వివాహమైంది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత నుంచి తాగుడుకు బానిసయ్యాడు. దీనికి తోడు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. కళ్యాణదుర్గంలో పనిచేసే సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళను ఏకంగా అనంతపురం తీసుకొచ్చి రాంనగర్లో వేరు కాపురం పెట్టాడు. జీతం డబ్బులు తాగుడుకు, వివాహేతర సంబంధాలకు వెచ్చిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. వారానికి, రెండువారాలకోసారి ఇంటికి వచ్చి తాగిన మత్తులో భార్య, పిల్లలను కొడుతూ చిత్రవధకు గురి చేసేవాడు. అయినా వారు అలాగే భరిస్తూ వస్తున్నారు. బుధవారం రాత్రి పూటుగా తాగి ఇంటికి వచ్చి న సదాశివరెడ్డి భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా లేసి కూతురితో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించాడు. దీన్ని చూసి భరించలేని ఆయన భార్య రీపర్ కట్టెతో తలపై మోదింది. అంతే.. నిమిషాల్లో ఆయన ప్రాణం కోల్పోయాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగు చూసింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. -
ప్రియుడి కోసం భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి..
కర్ణాటక, హొసూరు: వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని హితవు చెప్పిన భర్తకు ప్రియుడితో కలిసి విష ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యను పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. వివరాలిలా ఉన్నాయి. క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం(35), సోనియా(25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి జీవ, హరి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సోనియాకు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం బయట పడటంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. అనైతిక సంబంధాన్ని మానుకోవాలని రాజలింగం హితవు పలికాడు. అయితే సోనియా భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. శనివారం రాత్రి రాజలింగం కూలిపనులకెళ్లి ఇంటికి రాగా అప్పటికే అక్కడకు చేరుకున్న సోనియా ప్రియుడు తన మిత్రులతో కలిసి రాజలింగం నోటిలో బట్టలు ఉంచి ఇంజక్షన్ వేసి హత్యచేశారు. అనంతరం మృతదేహానికి ఉరి వేశారు. తర్వాత సోనియా పెద్దగా కేకలు వేస్తూ ఇంటినుంచి బయటకు వచ్చి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రోదించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. రాజలింగం పిల్లలతో విచారణ జరిపారు. అయితే అక్కడ జరిగిన ఉదంతాన్ని పిల్లలు పోలీసులకు వెల్లడించడంతో సోనియాను అరెస్ట్ చేశారు. ఆమె సెల్ఫోన్ నుంచి ప్రియునికి ఫోన్ చేయించగా అతను పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు పలు ప్రాంతా ల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. -
ప్రియుడితో కలిసి భర్తను ఉరి బిగించి..
నాగోలు: తరచూ తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. రాజమండ్రి సమీపంలోని గోకారం ప్రాంతానికి చెందిన తోట దుర్గారావు (40) డ్రైవర్గా పనిచేస్తూ చందానగర్లో ఉంటున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన లావణ్యను 2013లో రెండో వివాహం చేసుకున్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన లావణ్యను తన దూరపు బంధువు వీర రామకృష్ణతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ కూడా తల్లితండ్రులతో కలిసి నగరానికి వలస వచ్చి నేరేడ్ మెట్లో ఉంటూ శివశక్తి ఏజెన్సీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు తమ ఇంటి సమీపంలోనే దుర్గారావు కుటుంబానికి ఇల్లు అద్దెకు ఇప్పించాడు. అయితే దుర్గారావుకు గుర్తుతెలియని వ్యాధులు ఉన్నట్లు తెలియడంతో లావణ్య అతడిని దూరం పెడుతోంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న దుర్గారావు ఆమెను వేధిస్తున్నాడు. గత నెల 31న అతను తన ఇంట్లో రామకృష్ణ ఇంట్లో ఉండటాన్ని చూసి లావణ్యతో గొడవపడ్డాడు. దీంతో ఇద్దరూ ఐరన్ పైప్తో దుర్గారావు తలపై కొట్టి, చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా రక్తాన్ని కడిగేసి మృతదేహాన్ని బెడ్కవర్లో చుట్టారు. మరుసరి రోజు రామకృష్ణ మారుతి వ్యాన్లో మృతదేహాన్ని తీసుకెళ్లి కీసర రహదారి సమీపంలోని పొదల్లో పడేశారు. తనిఖీలు చేస్తున్న కీసర పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఓమ్నీ వ్యాన్ను గుర్తించారు. వ్యాన్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా దుర్గారావు హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రామకృష్ణ, లావణ్యను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఓమ్నీ వ్యాన్, రెండు ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర రావు, సీఐ రవికుమార్, ఐటీ సెల్ సీఐ శ్రీధర్రెడ్డి, కీసర సీఐ ప్రకాశ్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రియుడితో కలిసి భర్త, రెండో భార్యను..
వేలూరు: ప్రేమికుడితో కలిసి భర్త, రెండో భార్యను హత్య చేయించిన మొదటి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన తిరుపత్తూరు సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. వేలూరు జిల్లా తిరుపత్తూరు సమీపంలోని ఈచనేరి గ్రామానికి చెందిన షణ్ముగం(40) రైతు. ఇతని భార్య కళ. దంపతులకు ఆనందన్, నందని అనే ఇద్దరు పిల్ల లున్నారు. ఈ నేపథ్యంలో కళకు అదే గ్రామంలోని ఏకాంబరంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న షణ్ముగం భార్య కళను మందలించాడు. గతేడాది కళ ప్రేమికుడు ఏకాంబరంతో పరారై కేరళలో నివశిస్తున్నారు. దీంతో షణ్ముగం ఆరు నెలల క్రితం సింగారపేటకు చెందిన సుజాత(30)ని రెండవ వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కళ గత నెలలో ప్రేమికుడితో కలిసి కేరళ రాష్ట్రం నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తాను భర్తతో కలిసి జీవించేందుకు అనుమతించాలని గ్రామంలో పంచాయతీ పెద్దల సమక్షంలో తెలిపింది. అనంతరం కళ షణ్ముగం ఇంట్లోనే ఉండిపోయింది. అయితే భర్త కళతో మాట్లాడకపోవడంతో పాటు రెండవ భార్యతోనే కలిసి జీవిస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేక కళ ప్రేమికుడితో కలిసి భర్త, రెండో భార్యను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం హత్య.. గురువారం రాత్రి భర్త షణ్ముగం, రెండవ భార్య సుజాత ఇంట్లో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఏకాంబరం, అతని అనుచరులు కలిసి షణ్ముగం, సుజాత తలపై ఇనుప రాడ్తో దాడిచేసి పరారయ్యారు. శుక్రవారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు షణ్ముగం మొదటి భార్య కళ, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. కళ ప్రేమికుడు ఏకాంబరం పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం : నిద్రిస్తున్న భర్త మర్మాంగాలపై..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తను కర్కశంగా హతమార్చింది. ఈ ఘటన ఫిరంగిపురం మండలం సిరింగిపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. భర్త నిద్రిస్తున్న సమయంలో మర్మాంగాలపై రోకలితో మోది, గరిటెతో గాయాలు చేసి ఆపై గొంతు నులిమి ప్రాణం తీసింది. అనైతిక బంధానికి దాంపత్య అనుబంధం ఛిద్రమైంది. అపోహలు, అనుమానాల దావాగ్నికి ఆలుమగల బంధం బుగ్గిగా మారింది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో కష్టసుఖాల్లో తోడుంటున్న భర్తను కటిక చీకట్లో కనికరం లేకుండా ఓ భార్య కాటికి పంపింది. శనివారం ఫిరంగిపురం మండలం సిరింగిపురంలో జరిగిన ఈ ఉదంతం.. మూడు ముళ్ల బంధానికి ఉరితాడు బిగించింది. అనైతిక బంధాల వ్యామోహం, క్షణికావేశం కలిసి ఆణిముత్యాల్లాంటి ఇద్దరి బిడ్డల జీవితాలను అనాథలుగా మార్చింది. చిన్నారుల భవిష్యత్ ప్రతి ఒక్కరి గుండెలపై ఆందోళన తడి మిగిల్చింది. పేరేచర్ల(తాడికొండ) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను భార్య హతమార్చింది. ఫిరంగిపురం మండలం సిరింగిపురంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరింగిపురానికి చెందిన చుక్కా రత్నబాబు(30)కు అదే గ్రామానికి చెందిన స్వర్ణలతతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి డేవిడ్ అనే ఏడేళ్ల కుమారుడు, షైనీ అనే ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. రత్నబాబు తాపీ వర్కర్. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని స్థానికుల ద్వారా తెలుసుకున్న రత్నబాబు అనేక సార్లు వారించాడు. ఇదే విషయమై స్థానిక పెద్దల వద్ద పంచాయితీ కూడా జరిగింది. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటే చాలనే ఉద్దేశంతో తిరిగి భార్యతో కాపురం చేస్తున్నాడు. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శుక్రవారం రాత్రి ఆమెను మందలించాడు. దీనిని తట్టుకోలేకపోయిన స్వర్ణలత భర్త ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో అతని మర్మాంగాల మీద మోదింది. అంతటితో ఆగక వంటకు ఉపయోగించే పదునైన గరిటెతో గాట్లు పెట్టింది. అయినా చనిపోలేదనే అనుమానంతో గొంతు నులిమి హత మార్చింది. శనివారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రత్నబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ హత్య జరిగిన ప్రదేశాన్ని నర్సరావుపేట రూరల్ డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ ప్రభాకర్తోపాటు ఫిరంగిపురం ఎస్ఐ ఉజ్వల్ పరిశీలించారు. స్థానికులు, రత్నబాబు, స్వర్ణలత బంధువులను పలు విషయాలపై ఆరా తీశారు. హత్య చేసినట్లు ఒప్పుకొన్న స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. -
మెడకు చీరను బిగించి ప్రియుడి సహాయంతో..
గుంటూరు, విజయపురిసౌత్: వివాహేతర సంబంధ నేపథ్యంలో భార్య తన భర్తను కడతేర్చింది. ఈ ఘటన విజయపురిసౌత్లోని డౌన్మార్కెట్లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానిక డౌన్మార్కెట్కు చెందిన సోరాడ రాంబాబు(30) కృష్ణా జలాశయంలో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన మల్లేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. మల్లేశ్వరి గత కొంత కాలంగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి రాంబాబు ఇంటికి మద్యం సీసాలను, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని మద్యం సేవించాడు. అర్థరాత్రి మద్యం మత్తులో ఉన్న రాంబాబు మెడకు చీరను బిగించి మల్లేశ్వరి ప్రియుడి సహాయంతో హత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మల్లేశ్వరి రాత్రి హత్య జరిగిన తరువాత చుట్టుపక్కల ఇళ్ల వాళ్లని లేపి రాంబాబు విరోచనాలు, రక్త వాంతులతో స్పృహ కోల్పోయాడని తెలిపింది. రాంబాబును ఆటోలో హుటాహుటిన హిల్కాలనీ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మృతి చెందిననట్లు డాక్టర్లు ధ్రువీకరించటంతో మృతదేహాన్ని విజయపురిసౌత్లోని స్వగృహానికి తరలించారు. బంధువుల ద్వారా రాంబాబు హత్య వార్త తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ సీహెచ్ సురేష్, మాచర్ల రూరల్ సీఐ దిలీప్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్మార్టం అనంతరం రాంబాబు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను కడతేర్చిన భార్య
వేలూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా భావించి స్నేహితులతో కలిసి భర్తను ఓ భార్య కడతేర్చింది. భార్య సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వేలూరు జిల్లా రాణిపేటలో జరిగింది. రాణిపేట స్వామినాయుడు వీధికి చెందిన అసిఫ్ అలియాస్ అక్బర్(31) పశువుల వ్యాపారి. ఇతను గత నెల 7న వాలాజ సమీపంలోని వళ్లివేడు జాతీయ రహదారి పక్కన అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించి విచారణ చేపట్టారు. అక్బర్ భార్య రిగానీ బేగం(27) భర్త మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వాలాజ సమీపంలోని బాగవెలి గ్రామానికి చెందిన రాజకుమారుడు వివేక్ వళ్లివేడు గ్రామ పరిపాలన కార్యాలయానికి వచ్చాడు. ఈ సమయంలో గ్రామ పరిపాలన అధికారి సత్యమూర్తి వద్ద తాను తన స్నేహితులు కలిసి పశువుల వ్యాపారి అక్బర్ను గత నెల 6వ తేదీన రాత్రి హత్య చేశామని అనంతరం ఆతని మృతదేహాన్ని జాతీయ రహదారి పక్కన వేసి వెళ్లామని తెలిపాడు. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న వీఏఓ సత్యమూర్తి వెంటనే వాలాజ సోలీసులకు సమాచారం ఇచ్చాడు. వివేక్ వద్ద పోలీసులు జరిపిన విచారణలో అక్బర్ భార్య రిగానిబేగంకు వివేక్ స్నేహితుడు కాలిత్ అహ్మద్తో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. విషయం తెలిసి అక్బర్ భార్యను మందలించాడని, దీంతో ఆగ్రహించిన రిగానిబేగం, ప్రేమికుడు కాలిత్ అహ్మద్ కలిసి అక్బర్ను హత్య చేసేందుకు ప్రణాళికి సిద్ధం చేసుకున్నారన్నారు. దీంతో కాలిత్ అహ్మద్ స్నేహితులైన బెల్లియప్ప నగర్కు చెందిన సతీష్, బాగవెలికి చెందిన వివేక్, కృపాకరన్, లోకనాథన్ల సాయంతో అక్బర్ను హత్య చేయాలని నిర్ణయించి హత్య చేసినట్టు నేరం అంగీకరించారు. పోలీసులు హత్యకు కారణమైన అక్బర్ భార్య రిగానిబేగం, వివేక్, సతీష్, కృపాకరన్లను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
అంతా ఆమేనట..
తూర్పుగోదావరి, రామచంద్రపురం: పట్టణంలో గత నెల 26న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చెల్లూరి రాంబాబు మృతి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాంబాబు భార్య క్రాంతి తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీధర్కుమార్ ఆయన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తొలుత రాంబాబు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం రాంబాబు హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చి రాంబాబు భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. రాంబాబు భార్య క్రాంతి ప్రియదర్శినికి పట్టణంలోని శీలంవారిసావరానికి చెందిన కుడిపూడి మోహన్శివసాయికిశోర్తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో తన భర్తను అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడు కిశోర్తో హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫోన్ ద్వారా మాట్లాడుకుంటే విషయం బయటపడుతుందని డమ్మీ ఫేస్బుక్ అక్కౌంట్లను మారు పేర్లు, అమ్మాయిల పేర్లతో ఓపెన్ చేసి మెసెంజర్ ద్వారా మాట్లాడుకుంటూ రాంబాబు హత్యకు కుట్రలు పన్నినట్టు సీఐ తెలిపారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న కిశోర్ పథకంలో భాగంగా గతనెల 25న శనివారం సాయంత్రం పట్టణానికి చేరుకున్నాడు. రాంబాబు నివాసం ఉంటున్న అపార్టుమెంటులోనే భార్య క్రాంతి, కిశోర్లు తాము వేసుకున్న పథకాన్ని అమలు చేశారు. అందులో భాగంగా భార్య క్రాంతి, రాంబాబుకు నిద్ర మాత్రలు ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అపార్ట్మెంట్కు వెళ్లిన కిశోర్తో కలిసి రాంబాబు చేతులు కట్టివేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. ఈ మేరకు వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ శ్రీధర్కుమార్ తెలిపారు. కిశోర్ వద్ద నుంచి రూ.రెండు లక్షలు స్వాధీనంచేసుకున్నట్టు ఆయన తెలిపారు. -
చదివింది డీఫార్మసీ.. బోర్డు మాత్రం ఎంబీబీఎస్
తూర్పుగోదావరి, రంపచోడవరం: విలీన మండలం నెల్లిపాకలో విద్యుత్శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గొర్లె చెల్లారావు హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య గొర్లె హేమలత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేల్చారు. నిందితులు హతుడి భార్య గొర్లె హేమలత, రెడ్డి శివప్రసాద్లను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోలీసులు హత్యకేసు వివరాలు వెల్లడించారు. భర్త చెల్లారావుతో విడిపోయిన హేమలత స్థానిక ఎర్రంరెడ్డి నగర్లో నివాసం ఉంటోంది. విశాఖపట్నం జిల్లా నాతవరానికి చెందిన ప్రైవేట్ వైద్యుడు రెడ్డి శివప్రసాద్ రంపచోడవరంలో ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు క్లినిక్కు వెళ్లడంతో ఆమెతో పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్తను హత్య చేసి అడ్డు తొలగించుకునేందుకు ఇద్దరు కలిసి పథక రచన చేశారు. గత నెల 30న తెల్లవారు జామున భార్య ఇంటికి వచ్చిన చెల్లారావు భార్య ప్రియుడు అక్కడే ఉండడంతో గొడవకు దిగాడు. దీంతో ప్రియుడితో భార్య హేమలత కలిసి చెల్లారావు తలపై తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. అక్కడ సమీపంలోని డ్రైనేజీలో శవాన్ని పడవేశారు. సంఘటన జరిగిన తరువాత ఏఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సై జె విజయబాబు పర్యవేక్షణలో దర్యాప్తు చేసి కేసును చేధించారు. చదివింది డీఫార్మసీ.. బోర్డు మాత్రం ఎంబీబీఎస్, ఎండీ(న్యూరోసర్జన్) నిందితుడు శివప్రసాద్ డీఫార్మసీ చదివినట్టు సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొన్నేళ్లుగా రంపచోడవరంలో ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్నాడని, అతను నిర్వహించే క్లినిక్ వద్ద ఎంబీబీఎస్, ఎండీ (న్యూరోసర్జన్) బోర్డు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఎటువంటి అర్హతలు లేకుండా ఎంబీబీఎస్ అంటూ బోర్డు పెట్టుకుని వైద్య సేవలు చేసిన దానిపై ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వివరాలు అందజేస్తామన్నారు. వారి నివేదిక ఆధారంగా మరో కేసు నమోదు చేస్తామన్నారు. -
భార్యే హత్య చేసిందా..?
తూర్పు గోదావరి ,రామచంద్రపురం: ముఖమంతా రక్తంతో.. అనుమానస్పదంగా ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన రామచంద్రపురం పట్టణంలో ఆదివారం సంచలనం కలిగించింది. మృతుని బంధువులు, సన్నిహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని తోటవారి వీధికి చెందిన చెల్లూరి రాంబాబు( 38), అదే వీధిలో నివసించే క్రాంతిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. రాంబాబుపై గతంలో రామచంద్రపురం పోలీసుస్టేషన్లో రౌడ్షీట్ నమోదయ్యింది. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని ఎత్తివేశారు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య కాపురంలో గొడవలు ఏర్పడ్డాయి. ఇరువురూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వీరికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అనంతరం స్థానిక తోటవారి వీధిలో గల ఒక అపార్టుమెంట్లో వారు కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం రాంబాబు భార్య క్రాంతి తన భర్త మంచం మీద నుంచి లేవలేదని, నోట్లో నుంచి రక్తం వస్తోందని చెప్పటంతో స్థానికులు అతనిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్థానికంగా ఎస్సై, సీఐలు లేకపోవటంతో ద్రాక్షారామ ఎస్సై సతీష్, మండపేట రూరల్ సీఐలక్ష్మణ రెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. రామచంద్రపురం ఆదనపు ఎస్సై ఆర్. వెంకటేశ్వరరావు మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. మిస్టరీగా మారిన మరణం తాను ఉంటున్న ప్లాట్లోనే మంచంపై నోట్లో రక్తం వస్తూ రాంబాబు మృతి చెందటం మిస్టరీగా మారింది. ఆసుపత్రికి తరలించే సమయానికే రాంబాబు మృతి చెందగా అర్థరాత్రి దాటిన తరువాతనే మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ మంతా రక్తంతో ఉండటం, తాను నిద్రించిన మంచంపైన కూడా రక్తపు మరకలు ఉండటం తో రాంబాబు మృతిపై పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. తన కుమారుడిని కోడలు క్రాంతి చంపేసిందంటూ రాంబాబు తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయటం దీనికి బలం చేకూరుస్తోంది. ఆ డబ్బే కారణమా...? ఈ మధ్య రాంబాబుకు రూ.25లక్షల వరకు చేతికందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ డబ్బుతో తోటవారివీధిలో ఒక స్థలాన్ని రాంబాబు కొనుగోలు చేసేందుకు ఆదివారం అగ్రిమెంటు చేసుకోవాల్సి ఉంది. దాని కోసం రూ.16 లక్షలు తీసుకువచ్చి ఇంట్లో ఉంచినట్టు తెలుస్తోంది. తన పేరునే ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని భార్య క్రాంతి ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి వారిద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చని, అదే రాంబాబు మృతికి కారణం అయ్యి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. కాగా రాంబాబు తెచ్చిన సొమ్ములు మాయమైనట్టు తెలుస్తోంది. పోలీసులు క్రాంతిని, ఇతర కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. -
వివాహమైన ఆరునెలలకే భర్తను..
అన్నానగర్: కాంచీపురం సమీపంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వెంబాక్కం సమీపం పిల్లాతాంగల్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ (32) భార్య పునిత (26). వీరికి ఆరు నెలల ముందు వివాహం జరిగింది. పుష్పరాజ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత 20వ తేదీ పనికి వెళ్లిన పుష్పరాజ్ తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం కాంచీపురం జిల్లా కోలివాక్కం నది ఒడ్డున పుష్పరాజ్ మృతదేహం లభించింది. నిందితులను అరెస్టు చేయాలని బుధవారం పుష్పరాజ్ మృతదేహాన్ని వెంబాక్కం– కాంచీపురం రోడ్డుపై ఉంచి బంధువులు రాస్తారోకో చేశారు. ఘటనపై కాంచీపురం తాలూకా సీఐ వెట్రిసెల్వన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హత్యకు సంబంధించి పుష్పరాజ్ భార్య పునిత, ఆమె ప్రియుడు ప్రకాష్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు మాట్లాడుతూ పుష్పరాజ్ను వివాహం చేసుకోవడానికి ముందే పునిత, ప్రకాష్ ప్రేమికులు. వివాహం అయిన తరువాత కూడా పునిత ప్రియుడితో స్నేహం కొనసాగింది. ఇది తెలుసుకున్న పుష్పరాజ్, పునితని మందలించాడు. వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పుష్పరాజ్ను హత్య చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పునిత, ప్రియుడు ప్రకాష్తో కలిసి పుష్పరాజ్ను హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు వారి వద్ద విచారణ చేస్తున్నారు. -
తాగొచ్చి వేధిస్తున్నాడని..
నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వస్రాతండా పాశంబోడు గుట్టపై కాలిన మృతదేహం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం మానుకోట ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హత్య వివరాలను వెల్లడిం చారు. మండలంలోని వస్రాంతండా శివారులోని పాశంబోడు గుట్టపై ఈనెల 10వ తేదీన కాలిన మృతదేహం ఆనవాళ్లను గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. స్థానిక ఎస్సై సతీష్కుమార్ అనుమానాస్పద స్థితి మృతి కేసును నమోదు చేసుకుని, సీఐ చేరాలుతో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మృతదేహం ముంగిమడుగు శివారు లాలితండాకు చెందిన గుగులోతు సురేష్ (38)గా గుర్తించారన్నారు. అనంతరం అతడి భార్య సరిత, బంధువులను విచారించగా విషయాలు బయటికొచ్చాయన్నారు. నెల రోజులుగా మద్యం తాగివచ్చి వేధిస్తున్న భర్తను ఎలాగైన హతమార్చాలని భార్య సరిత పూనుకుందని, బంధువులైన సుమన్, గణేష్ సాయంతో ముందుగా పథకం వేసుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన రాత్రి తన తల్లిగారి గ్రామమైన వస్రాంతండాలో అతడికి బాగా మద్యం తాగించారు. అనంతరం విసురురాయి బండతో తలపై మోదీ హతమార్చారని ఎస్పీ పేర్కొన్నారు. సమీపంలోని పాశంబోడు గుట్టపైకి మృతదేహాన్ని పెట్రోల్తో కాల్చివేశారు. ఈ సందర్భంగా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఎస్పీ స్వాధీనం చేసుకుని సమావేశంలో హాజరుపరిచారు. భార్య సరితతోపాటు హత్యకు సహకరించిన బంధువులు సుమన్, గణేష్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వివరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజారత్నం, సీఐ చేరాలు, ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కీలక ఆధారమైన నల్ల నువ్వులు.. సురేష్ మృతదేహం చుట్టూ చల్లిన నల్ల నువ్వులు నిందితులను పట్టించడానికి కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీన పాశంబోడు గుట్టపై మృతదేహం ఉందని గొర్రెల కాపరులు చెప్పడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, కాల్చిన మృతదేహం చుట్టూ నల్ల నువ్వులు, కళ్లలో సూదులు గుచ్చి ఉండడం ఫోరెన్సిక్ విచారణలో తేలినట్లు సమాచారం. అయితే లంబాడీలు.. చనిపోయిన వ్యక్తి చుట్టూ నల్లనువ్వులు చల్లి, కళ్లలో సూదులతో గుచ్చి అంత్యక్రియలు చేస్తారు. దీంతో చనిపోయిన వ్యక్తి తండావాసిగా గుర్తించి సంబంధిత కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నల్ల నువ్వలతో కేసును ఛేదించడం పోలీసులకు తేలికైనట్లు తెలుస్తోంది. -
చిన్నారులు చెప్పిన ఆధారాలతో ..
-
భర్త శవం పక్కనే ప్రియుడితో..
వేదమంత్రాల సాక్షిగా వివాహమాడిన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ దారుణాన్ని చూసిన తన పిల్లలను బాత్రూమ్లో వేసి తాళం వేసింది. భర్త మృతి చెందాడని నిర్థారించుకున్నాక శవం పక్కనే ప్రియుడితో గడిపినట్టు సమాచారం. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ సంఘటన ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్ నగర్ బస్తీలో జరిగింది. బంజారాహిల్స్: ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చింది ఓ కసాయి ఇల్లాలు. పక్కా పథకంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడమే కాకుండా ఈ ఘటనలో ప్రియుడిని కేసు నుంచి తప్పించేందుకు తానే హత్య చేశానంటూ పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. హత్య చేస్తున్న సమయంలో పిల్లలు చూడకుండా ఇద్దరినీ బాత్రూమ్లో వేసి గడియ వేసింది. కట్టుకున్న భర్త తుదిశ్వాస విడిచాడని నిర్థారణకు వచ్చాక ప్రియుడితో కలిసి మద్యం తాగి శవం పక్కనే ఇద్దరూ గడిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్ నగర్ బస్తీలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న జగన్ హత్య మిస్టరీనిబంజారాహిల్స్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ హత్యలో మృతిడి భార్య దేవికతో పాటు ఆమె ప్రియుడు తోట బెనర్జీ(32) హస్తం ఉన్నట్లు నిర్థారించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్లోని జ్ఞాని జైల్సింగ్ నగర్ బస్తీలో బర్త్ప్లేస్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బానోతు జగన్(35), దేవిక(30) దంపతులు అద్దెకుంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉదయ్, ఆరేళ్ల కూతురు జ్యోతశ్రీ ఉన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జి(32) ఫిలింనగర్లోని అడ్వాన్ సాఫ్ట్ బీపీఓలో లైజన్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. ఇదే సంస్థలో దేవిక హౌస్ కీపింగ్ పనిచేసేది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి దగ్గరయ్యారు. ఏడాది క్రితం బెనర్జి దేవిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. కుటుంబ సభ్యులు అతడిని తిట్టి పనిచేస్తున్న సంస్థ వద్దకు వచ్చి చితకొట్టారు. ఆరు నెలల క్రితమే దేవిక అక్కడ హౌస్కీపింగ్ పనుల నుంచి తప్పుకుంది. అయితే భర్త కళ్లుగప్పి ప్రియుడితో తరచూ కలుస్తుండేది. అనుమానం వచ్చిన జగన్ పలుమార్లు ఆమెను హెచ్చరించి పరువుతీయవద్దంటూ బెదిరించాడు. ఇలా అయితే లాభం లేదనుకున్న బెనర్జి, దేవిక ఒకే ఇంట్లో అద్దెకుంటే ఈ గొడవ ఉండదని అనుమానాలు కూడా రావని నిశ్చయించుకున్నారు. రెండు నెలల క్రితం బెనర్జి.. జైల్సింగ్ నగర్లోని ఓ ఇంటిలో జగన్ దంపతులను అద్దెకు దిగేలా చేశాడు. తర్వాత రెండు రోజులకే తాను కూడా అదే ఇంటి పెంట్హౌస్లోకి మారుపేరుతో అద్దెకు దిగాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఇద్దరూ కలుసుకునేవారు. తమ ప్రేమకు అడ్డు వస్తున్న భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్ వేసి సోమవారం అర్ధరాత్రి ఇందుకు సరైన సమయంగా నిర్ణయించారు. బెనర్జీని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి పిలిపించి నిద్రిస్తున్న జగన్ మర్మాంగాలను దేవిక గట్టిగా పిసికేస్తుండగా అతడి ఛాతిపై బెనర్జి కూర్చొని ముఖాన్ని, గొంతును నులిమేశారు. అరగంట పాటు జగన్ ప్రాణం రక్షించుకునేందుకు పెనుగులాడినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నిద్ర లేచిన పిల్లలు ఈ ఘటనను చూస్తుండడంతో వారిద్దరినీ ఈ కసాయితల్లి బాత్రూమ్లో వేసి గడియ వేసింది. భర్త చనిపోయాక అక్కడే మద్యం తాగి ఇద్దరూ కలిసి గడిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే గంట తర్వాత బావ చనిపోయాడంటూ దేవిక తన సోదరుడికి ఫోన్ చేసింది. అప్పటికే బెనర్జీ అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ విషయం పోలీసుకు చేరడంతో వారు అక్కడకు చేరుకోగా దేవిక చేతులకు గాట్లు పెట్టుకొని వారిని నమ్మించేయత్నం చేసి విఫలమైంది. పిల్లలు దేవుళ్లు... పిల్లలను దేవుళ్లు అని ఎందుకంటారో జగన్, దేవిక దంపతుల ఇద్దరి చిన్నారుల ఉదంతం కళ్లకు కట్టింది. భర్తను తానే చంపానని దేవిక అంటుండగా అర్ధరాత్రి ఓ అంకుల్ వచ్చాడని చిన్నారి ఉదయ్ పోలీసులకు చెప్పాడు. ఓ వైపు దేవిక హత్య తానే చేశానని చెబుతుంటే బాలుడు మరొకరు ఉన్నారంటూ చెప్పడంతో పోలీసులు ఆ దిశలోనే దర్యాప్తు చేశారు. మృతుడి బావమరిది రమేష్ను విచారించగా ఆరు నెలల క్రితం జరిగిన బెనర్జీ గొడవను ప్రస్తావించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అడ్వాన్ సాఫ్ట్ సంస్థకు వెళ్లి బెనర్జీ గురించి విచారించగా హత్య జరిగిన ఇంటి టెర్రస్పై ఉంటాడని తేలింది. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అడ్వాన్ సాఫ్ట్ అధికారితో ఫోన్ చేయించి సెల్టవర్ సిగ్నల్స్ ఆధారంగా టీవీ 9 పక్క సందులో ఓ ఆటోలో దాక్కున్న నిందితుడిని పట్టుకున్నారు. విచారించగా హత్యకు తాను కూడా సహకరించినట్లు ఒప్పుకున్నాడు. ఆగమైన చిన్నారుల బతుకులు కన్నతల్లి కర్కశత్వానికి ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన తల్లి పిల్లల భవిష్యత్తును ఆగం చేసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన దేవిక పిల్లలు ఆగమయ్యారు. ఎటు వెళ్లాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పిల్లలు తల్లి పోలీస్ స్టేషన్లో ఉండడంతో రెండు రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. కళ్లముందే తల్లి తమ తండ్రిని హతమారుస్తుంటే నిశ్చేష్టులై చూసిన ఆ చిన్నారులపై ఏ మాత్రం దయకలగలేదు. ‘అమ్మా.. అమ్మా’.. అంటూ ఏడుస్తున్నా ఆ కిరాతకురాలి మనసు కరగలేదు. ఎవరికైనా చెబితే మీరూ చస్తారంటూ ఇద్దరినీ బాత్రూమ్లో వేసి గడియ వేసింది. ఇప్పుడు ఈ చిన్నారులు ఎక్కడ ఉండాలన్నదానిపై చర్చ మొదలైంది. అరకొర సంపాదనతో తాను బతుకు వెళ్లదీయడమే కష్టంగా ఉన్న మేనమామ రమేష్.. ఈ ఇద్దరి పోషణ బాధ్యతలు కూడా ఎంత వరకు తీసుకుంటాడన్నది సందేహంగా మారింది. రెండు రోజులుగా తల్లి పోలీస్స్టేషన్లోని పై అంతస్తులో ఉండగా.. చిన్నారులు స్టేషన్ ఆవరణలో గడుపుతున్నారు. గంటకోసారి తల్లిని చూసి వస్తున్నా ఆ తల్లి ఏ మాత్రం చింతించడం లేదు. తాను చేసిన పని పట్ల కించిత్తు ఆవేదన కూడా చెందకపోవడం గమనార్హం. -
గడ్డం అంకుల్ గురించి అమ్మ చెప్పొద్దంది..
బంజారాహిల్స్: అనుమానిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను తానే చంపానంటూ నిందితురాలు పేర్కొంటుండగా అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడని ఆమె కుమారుడు పోలీసులకు చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం, గారకుంటతండాకు చెందిన బానోతు జగన్(35), దేవిక దంపతులు జ్ఞానిజైల్సింగ్నగర్లో ఉంటున్నారు. వీరికి ఉదయ్(8), జోషితశ్రీ(6) అనే ఇద్దరు సంతానం. జగన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని బర్త్ప్లేస్ పిల్లల ఆస్పత్రిలో రన్నర్బాయ్గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా దేవికపై అనుమానం పెంచుకున్న జగన్, తాను లేని సమయంలో అపరిచిత వ్యక్తి ఇంటికి వచ్చిపోతున్నాడని ఆమెను వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి జగన్ తన బావమరిది రమేష్కు ఫోన్ చేసి మద్యం కావాలని అడిగాడు. అతని సూచన మేరకు ఫిలింనగర్లోని బెల్టుషాపుకు వెళ్లి బీరు తీసుకువచ్చాడు. అందులో నల్లుల మందు కలిపి ఇద్దరం తాగుదామంటూ భార్యకు ఇవ్వగా, చస్తే నువ్వు చావు నేనెందుకు చస్తానంటూ దేవిక ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవేశంగా బీరు సీసాతో తనను పొడిచేందుకు వస్తున్న భర్త ప్రైవేట్ పార్ట్లపై గట్టిగా తన్నడంతో జగన్ కుప్పకూలిపోయాడు. ఏడుస్తున్న పిల్లలను బాత్రూమ్లోకి నెట్టి బయట గడియ పెట్టిన దేవిక భర్త పొత్తికడుపుపై కూర్చొని రెండు చేతులతో గొంతు నులిమి హత్య చేసింది. తెల్లవారుజామున సమీపంలో ఉండే తన సోదరుడు రమేష్కు సమాచారం అందించింది. ఈ అలికిడితో మేల్కొన్న ఇంటి యజమాని హత్య జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న క్లూస్టీమ్ ఆధారాలు సేకరించింది. అనుమానంతో వేధిస్తున్నందునే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితురాలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హత్యపై అనుమానాలు ఉండటంతో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు మూడు బృందాలుగా విడిపోయారు. మరో వ్యక్తి సాయంతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు ఉండటంతో అతడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అమ్మ చెప్పొద్దంది.. సోమవారం రాత్రి డాడీ నిద్రపోతుండగా వెనక బ్యాగు వేసుకున్న గడ్డం అంకుల్ ఇంటికి వచ్చాడంటూ ఉదయం దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులకు మృతుడి కుమారుడు ఉదయ్ తెలిపాడు. అయితే ఈ విషయాన్ని తన తల్లి ఎవరికీ చెప్పొ ద్దని చెప్పిందని తెలిపాడు. దీనికితోడు ఇంటి యజమాని కూడా రాత్రి రెండు సార్లు గేటు దూకి ఓ వ్యక్తి వచ్చినట్లు అలికిడయ్యిందని.. దొంగలు వచ్చారంటూ మరో గదిలో అద్దెకుండే వారు చెప్పడంతో తాను కర్ర, కారంపొడి తీసుకొని వెళ్లినట్లు తెలిపాడు. ‘మృతుడు జగన్ అనుమానాలు, రాత్రిపూట ఓ వ్యక్తి వచ్చాడని కొడుకు చెప్పడం, ఇంటి యజమాని ఆరోపణలు, దేవిక తన ఇద్దరు పిల్లలను బాత్రూమ్లో వేసి గడియ పెట్టడం’ తదితర అంశాల నేపథ్యంలో మరో వ్యక్తి అండతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితురాలి ఫోన్ కాల్డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డొస్తున్నాడని మట్టుబెట్టారు
జిన్నారం(పటాన్చెరు) : అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను ఓ భార్య హత్య చేయించింది. హత్య జరిగిన ఏడు నెలల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిన్నారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రాపుం డీఎస్పీ సీతారాం వెల్లడించారు. గాజులరామారం గ్రామానికి చెందిన పరిమాళ్ల వెంకటేశ్(34)కు గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మల్లెపల్లి మహిమలతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మొదట్లో భార్యభర్తలు గాజులరామారంలో నివాసం ఉండేవారు. ఇదిలా ఉండగా, వెంకటేశ్ తరచూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండటంతో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న మహిమల ప్రోద్భలంతో దోమడుగు గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉంటున్న మద్ది మల్లారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో వీరు అద్దెకు దిగారు. మల్లారెడ్డి ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండగా.. వెంకటేశ్ కూడా అదే పరిశ్రమలో పనిలో చేరాడు. ఈక్రమంలో కొంతకాలంగా వెంకటేశ్తో స్నేహం పెంచుకున్న మల్లారెడ్డి తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. అక్రమంలో మహిమలతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. మల్లారెడ్డి తరచూ ఇంటికి రావడాన్ని తెలుసుకున్న వెంకటేశ్ తన భార్యను కట్టడి చేశాడు. ఈక్రమంలో మల్లారెడ్డికి చెప్పి భర్తను అంతమొందించాలని సూచించింది. దీంతో జనవరి 18న మల్లారెడ్డి తన స్నేహితుడైన మహేశ్తో కలిసి వెంకటేశ్కు మద్యం తాగించారు. కారులో వెంకటేశ్ను తీసుకెళ్లి నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట ఫారెస్ట్ ప్రాంతంలో వెంకటేశ్ను గుంతునులిమి..ఆపై ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అద్దె ఇంట్లో నివాసం వెంకటేశ్ను హత్య చేసిన అనంతరం మల్లారెడ్డి, మహిమల నర్సాపూర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇలా ఐదు నెలలు ఉన్నారు. ఇదిలా ఉండగా, నెల రోజులుగా మల్లారెడ్డి నర్సాపూర్ వెళ్లడం మానేశాడు. మహిమల ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ లేదు. దీంతో వెంకటేశ్ కనిపించడం లేదని అతని బాబాయ్కు మహిమల నెల రోజుల క్రితం ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో మృతుడి బాబాయ్ ఈనెల 3న గుమ్మడిదల పీఎస్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఎస్సై ప్రశాంత్కు మహిమల తీరుపై అనుమానం వచ్చింది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టడగా.. జనవరి 19న నారాయణఖేడ్ పీఎస్లో గుర్తుతెలియని వ్యక్తి హత్యపై కేసు నమోదై ఉంది. విషయం తెలుసుకున్న ఎస్సై మహిమలను విచారించగా తన భర్తను హత్య చేయించనట్టు ఒప్పుకుంది. దీంతో మహిమల, మల్లారెడ్డి, మహేశ్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లో కేసును ఛేదించిన గుమ్మడిదల ఎస్సై ప్రశాంత్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ శ్యామల వెంకటేశ్, ఎస్సైలు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
చున్నీతో గొంతు నొక్కి హత్య
తూర్పుగోదావరి, రంపచోడవరం: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే పాశవికంగా హత్య చేసిందో ఇల్లాలు. రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరం వద్ద జరిగిన ఈ హత్యను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. స్థానిక సీఐ బీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్సై జె.విజయబాబు బుధవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. వడ్డి ఇమ్మానియేల్, దేవి దంపతులు రాజమహేంద్రవరం సమీపంలోని హుకుంపేటలో నివాసం ఉండేవారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. ఇమ్మానియేల్ తాపీ పని చేస్తాడు. కొండ్రుతు శివ కూడా తాపీమేస్త్రీ. ఇద్దరూ కలిసి పనికి వెళ్లేవారు. దేవి పిల్లలను స్కూల్కు తీసుకువెళ్లే క్రమంలో ఆమెకు శివతో పరిచయం పెరిగింది. అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులుగా ఇమ్మానియేల్ దంపతుల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. తరచూ ప్రశ్నలతో వేధిస్తుండడంతో ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు శివకు చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి ఎలాగైనా ఇమ్మానియేల్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. అమలు చేసిందిలా.. జూలై 26న రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ సెంటర్కు రావాలని ఇమ్మానియేల్ను శివ కోరాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గోకవరం మీదుగా రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. గోకవరంలో కొనుగోలు చేసిన మద్యాన్ని తాగారు. తరువాత శివ గోకవరం వెళ్లి హతుడి భార్య దేవిని ఘటనా స్థలానికి తీసుకు వచ్చాడు. ‘నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్’ అంటూ ఇమ్మానియేల్ భార్యను ప్రశ్నించాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే ఇమ్మానియేల్ మద్యం మత్తులో ఉన్నాడు. దేవి, శివలు కలిసి ఇమ్మానియేల్ గొంతు నొక్కి చున్నీతో గట్టిగా చుట్టడంతో మృతి చెందాడు. తర్వాత నిందితులిద్దరూ నరసాపురం వద్ద కొనుగోలు చేసిన పెట్రోల్ పోసి శవాన్ని తగలబెట్టారు. హత్య కేసును ఛేదించింది ఇలా.. ఘటనా స్థలంలో దొరికిన హతుడి సెల్ఫోన్ హంతకులను పట్టించింది. ఆ ఫోన్లో సిమ్ కార్డు లేదు. సెండ్ ఐటమ్స్లో ఒక్క నెంబరు ఉండడంతో, ఆ నంబర్కు పోలీసులు ఫోన్ చేశారు. పశ్చిమ గోదావరి పోలవరం ప్రాజెక్ట్ వద్ద గుమాస్తాకు ఆ ఫోన్ వెళ్లడంతో పోలీసులు అతడికి విషయం చెప్పారు. ఆ గుమాస్తా హతుడి వివరాలను పోలీసులకు తెలిపారు. దీంతో బొమ్మూరు పోలీసుల సహాయంతో హత్యకు గురైన ఇమ్మానియేల్ ఇంటికి రంపచోడవరం పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో దొరికిన బ్రాందీ సీసాపై ఉన్న లేబుల్ను బట్టి ఎక్సైజ్ శాఖ సహకారంతో ఆ మద్యం బాటిల్ ఎక్కడ కొనుగోలు చేశారో పోలీసులు తెలుసుకున్నారు. గోకవరం బ్రాందీ షాపులో ఆ బాటిల్ కొన్నట్టు తెలియడంతో అక్కడి సీసీ టీవీ పుటేజీలను వారు పరిశీలించారు. నిందితుడు, హతుడు ఇద్దరూ కలిసి మద్యం కొనుగోలు చేసినట్టు తేలింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు బుధవారం శివను, దేవిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. తల్లిని చూడాలనడంతో... నిందితురాలైన దేవిని పోలీసులు అరెస్టు చేయడంతో పిల్లలు ఆమెపై బెంగ పెట్టుకున్నారు. దీంతో వారి పెద్దమ్మ పిల్లలను రంపచోడరవం పోలీస్ స్టేషన్కు బుధవారం తీసుకు వచ్చింది. -
భార్యను చంపిన భర్త
గొల్లప్రోలు (పిఠాపురం): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను భర్త కడతేర్చిన ఘటన చెందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన టైలర్ గౌస్ తన భార్య షేక్ రాజాబీబీ (30ను శుక్రవారం రాత్రి హత్య చేశాడు. ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన ఆమెతో అతనికి 18 ఏళ్ల క్రితం వివాహమైంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ తరచూ గొడవ పడుతున్నారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. ఆరు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం మరింత పెరిగింది. శుక్రవారం రాత్రి మాటామాటా పెరగడంతో భార్య పీకను తాడుతో బిగించి హత్య చేసి అతడు పరారయ్యాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షీలార్ను ఇటీవల కాకినాడలోని ప్రభుత్వ హాస్టల్లో 6వ తరగతిలో చేర్పించారు. చిన్న కుమారుడు నాగూర్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలాన్ని పిఠాపురం సీఐ అప్పారావు, ఎస్సై బి.శివకృష్ణ పరిశీలించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కూతురిని కావాలనే అల్లుడు అన్యాయంగా చంపేశాడని మృతురాలి తల్లి షీలార్ ఆరోపించింది. మొదటి నుంచి ఆమెను వేధిస్తున్నాడని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని విలపించింది. తల్లి షీలార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ అప్పారావు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. -
భర్తను హత్య చేయించిన భార్య
ఖమ్మంక్రైం/కూసుమంచి : ఆమె ఓ వివాహిత.. వేరొక వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదేం పద్ధతంటూ భర్త తనను మందలించడం ఆమె సహించలేకపోయింది. తన భర్తను చంపాలంటూ ప్రియుడిని పురమాయించింది. అతడు పక్కా పథకం వేసి.. గుట్టుగా ప్రాణం తీశాడు. ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో హత్యకు గురైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముత్తి తండా వాసి కావడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. గార్ల మండలం ముత్తితండాకు చెందిన భూక్యా రమేష్(30), కమల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ గార్లకు చెందిన ఆగడాల రామారావు వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. దీంతో రమేష్ ఇంటికి రామారావు తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే రమేష్ భార్య కమలతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి వ్యవహారం రమేష్ కంటపడింది. పద్ధతి మార్చుకోవాలంటూ తన భార్యను రమేష్ హెచ్చరించాడు. ఈ క్రమంలోనే అతడు ఈ నెల 12న ట్రాక్టర్కు మరమ్మతు చేయించేందుకు ఖమ్మం కాల్వొడ్డులోగల షోరూమ్ షెడ్డుకు వెళ్లాడు. రామారావు వద్ద గతంలో జేసీబీ డ్రైవర్గా పనిచేసిన సురేష్ రమేష్కు ఖమ్మంలో కనిపించడంతో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. జేసీబీ డ్రైవర్గా పని ఇప్పిస్తానని రమేష్తో సురేష్ చెప్పి వెళ్లిపోయాడు. సురేష్ వెళ్లిపోయిన తర్వాత రామారావుకు రమేష్ ఫోన్ చేసి తాను పని మానేస్తానని, సురేష్ దగ్గరికెళ్లి జేసీబీ డ్రైవర్గా చేస్తానని చెప్పాడు. రామారావు కమలకు ఫోన్ చేసి రమేష్ చెప్పినదంతా చెప్పాడు. వెంటనే ఖమ్మం వెళ్లి రమేష్ను చంపేయ్ అని ఆమె బదులిచ్చింది. దీంతో రామారావు తన వద్ద పనిచేస్తున్న మరో డ్రైవర్ గుండోజు కృష్ణమాచారికి డబ్బు ఆశ చూపి ఖమ్మం తీసుకెళ్లాడు. ఖమ్మంలో రమేష్ను బైక్పై ఎక్కించుకుని కూసుమంచిలో ఉన్న సురేష్ వద్దకు బయల్దేరారు. కూసుమంచిలో మద్యం తాగారు. తర్వాత ముగ్గురూ కలిసి సురేష్ స్వగ్రామం రాజుపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో పాలేరువాగు వద్ద మూత్ర విసర్జనకని బైక్ ఆపారు. బైక్ దిగి కొద్దిగా ముందుకెళ్లాక కృష్ణమాచారికి రామారావు సైగ చేశాడు. ఆ వెంటనే రమేష్ను కృష్ణమాచారి గట్టిగా పట్టుకోగానే రామారావు తన వద్దనున్న బ్లేడ్తో రమేష్ గొంతు కోయడంతో విలవిలలాడుతూ ప్రాణాలొదిలాడు. తర్వాత మృతదేహాన్ని వాగు వద్దనున్న తుప్పల్లో పడేశారు. అక్కడి నుంచే కమలకు రామారావు ఫోన్ చేశాడు. రమేష్ను హత్య చేసినట్టుగా చెప్పాడు. ఈ హత్యను సురేష్ చేసినట్టుగా మరో పథకం వేశారు. చిక్కారు ఇలా.. రమేష్ను హత్య చేసిన తర్వాత రామారావు, కృష్ణమాచారి కలిసి గార్ల వెళ్లారు. రెండు రోజుల తర్వాత, రమేష్ ఇంటికి కమల వెళ్లింది. ఖమ్మం వెళ్లిన రమేష్ తిరిగి రాలేదని అతడి తల్లిదండ్రులతో చెప్పింది. వారు అన్నిచోట్ల వెతికారు. ఆచూకీ తెలియలేదు. ఈ మధ్యలో సురేష్కు రామారావు ఫోన్ చేసి, ‘రమేష్ను నువ్వు కలిశావట. నీ వద్దకు వెళుతున్నానని నాకు చెప్పాడు’ అన్నాడు. తామిద్దరం కలిసింది నిజమేనని, రమేష్ ఏమయ్యాడో తనకు తెలియదని సురేష్ చెప్పాడు. ఈ నెల 21న రామారావు, కమల కలిసి ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి రమేష్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. తమకు సురేష్పై అనుమానం ఉందని రామారావు చెప్పాడు. త్రీటౌన్ సీఐ వెంకన్నబాబు ఆధ్వర్యంలో ఎస్సైలు శ్రీనివాస్, మహేష్ దర్యాప్తు చేపట్టారు. రామారావు, కమల సెల్ఫోన్ కాల్స్పై నిఘా పెట్టారు. కమలతో రోజూ రామారావు ఫోన్లో మాట్లాడడం, అదృశ్యమైన రోజున వారిద్దరి మధ్య ఎక్కువసార్లు ఫోన్ సంభాషణ జరగడం గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. మృతదేహాన్ని పడేసిన చోటికి పోలీసుల అధికారులను తీసుకెళ్లి చూపించారు. కుళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. హత్య చేసిన రామారావును, అతడికి సహకరించిన కమల, కృష్ణమాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్–కమల దంపతుల పిల్లలిద్దరు దిక్కులేని పక్షులయ్యారు. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
కట్టంగూర్(నకిరేకల్) : భార్య చేతిలో భర్త హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి వెంకన్న(40) ఈనెల 15న రాత్రి మృతిచెందాడు. బంధువులు సహజమర ణం అనుకుని గ్రామంలోని సబ్స్టేషన్ సమీపంలో 16న అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం గ్రామంలో చిన్నకర్మ జరిపేందుకు వచ్చిన మృతుడి బంధువులు అనుమానంతో వెంకన్న భార్య స్వర్ణను గట్టిగా నిలదీయడంతో తానే గొంతు పిసికి చంపానని ఒప్పుకుంది. దీంతో మృతుడి తమ్ముడు కొత్తపల్లి శ్రీను పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్హెచ్ఓ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. తహసీల్దార్ తిరందాసు వెంకటేశం, శాలిగౌరారం రూరల్ సీఐ క్యాస్ట్రోరెడ్డి, నకిరేకల్ ప్రభుత్వ వైద్యాధికారి శ్మశాన వాటిక వద్దకు వెళ్లి శవాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు. సీఐ స్వర్ణను విచారించగా తన భర్త నిత్యం మద్యం తాగివచ్చి ఇబ్బందులకు గురిచేసే వాడని, కుటుంబ పోషణ పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో విసిగెత్తి గొంతు నులిమి చంపినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి హత్య వెనక ఉన్నవారిని కూడా అరెస్ట్ చేస్తామని సీఐ పేర్కొన్నారు. -
అవును ప్రియుడి కోసం నేనే చంపాను..
ప్రకాశం , దర్శి: రెండు రోజుల్లో రంజాన్ పండుగ వస్తోంది.. కుటుంబంలో అంతా ఆనందంగా ఉండాల్సిన తరుణం.. ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పిల్లలు ఏమైపోతారోనన్న ఆలోచన ఆ కఠిన హృదయానికి కలగలేదు. ప్రియుడి కోసం భర్తను హత్య చేసింది. కన్నబిడ్డలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చీదరించుకునే పరిస్థితి కల్పించుకుని కటకటాల పాలవుతోంది. ప్రియుడితో కలిసి ఖాశింబీ అనే మహిళ భర్త పాణెం ఖాశీంవలి (40)ని నోట్లో గుడ్డలు కుక్కి గొంతుకు వైరుతో బిగించి చంపిన సంఘటన బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని జెండా చెట్టు వద్ద వెలుగు చూసింది. మృతుడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కాశింబీ, ఆమె ప్రియుడు కరువాది రమణయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ఎదుటే భర్తను చంపానని బిడియం లేకుండా ఖాశింబీ చెప్పిన తీరుకు స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. రమణయ్య అనే మామిడి కాయల వ్యాపారితో ఖాశింబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లారీ ఖాశింవలీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. గతంలో భర్త లేని సమయంలో రమణయ్య ఆమె తరుచూ వచ్చి వెళ్తుండేవాడు. విషయం తెలుసుకున్న భర్త పిల్లల కోసం సర్దుకుపోయాడు. మొదట్లో కఠినంగా వ్యవహరించక పోవడం.. భర్త మెతక వైఖరి చూసి ఖాశింబీ మరింత బరితెగించింది. వివాహేతర సంబంధం పెచ్చుమీరి భర్త, పిల్లలు ఉన్నప్పుడే రమణయ్య కూడా ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఇది చూస్తూ సహించని బంధువులు, స్థానికులు పలుమార్లు ఆమెకు చెప్పినా లెక్కచేయక పోగా వారిని కూడా దూషించడం ప్రారంభించింది. ఇంట్లో తరుచూ గొడవలు జరిగాయి. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం పగలు ఆరోగ్యం బాగా లేదని భర్త ఇంట్లోనే ఉన్నాడు. ఇదే అదను అనుకుని కుమార్తెను రాత్రి జాగారానికి మసీదుకు పంపింది. పార్థన అనంతరం ఇంటికి వచ్చిన కుమార్తెను బయటే ఉంచి నాన్నకు బాగాలేదని, ఇబ్బంది పెట్టొద్దని నమ్మబలికింది. బలవంతంగా ఎదురింట్లో పండుకోమని చెప్పి పంపింది. అర్ధరాత్రి ప్రియుడిని రమ్మని పిలిచి ఇద్దరూ కలిసి భర్తను వైరుతో గొంతు బిగించి చంపింది. ప్రియుడిని పంపించి తెల్లవారు జామున ఏమీ ఎరగనట్లు భర్త చనిపోయాడని కేకలు పెట్టింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రియుడితో కలసి నీవే చంపావని ఆమెను పోలీసుల ఎదుట కుటుంబ సభ్యులు నిలదీశారు. అవును నేనే చంపాను.. ఏం చేస్తారని ఎదురు తిరగడంతో అక్కడి వారంతా ముక్కున వేలేసుకున్నారు. పోలీసులు ఖాశీంబీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి మృతి చెంది తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దిక్కులేని వారయ్యారు. ఆమె పేరున ఉన్న ఆస్తిని పిల్లల పేరున రాయించి నమ్మకంగా ఉన్న వారిని గార్డియన్గా పేర్కొనాలని బంధువులు కోరుతున్నారు. ఆస్తి కోసం తల్లి పిల్లలనైనా చంపదని గ్యాంరంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల జోక్యం చేసుకుని పిల్లలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ ఎం.శ్రీనివాసరావు ప్రాథమికంగా హత్యగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి మోజులో..
గోనెగండ్ల: ప్రియుడి మోజులో పడి కట్టుకున్నోడినే ఓ వివాహిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేయించినట్లు హతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం మృతదేహంతో మండల కేంద్రంలోని కర్నూలు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వారి కథనం మేరకు.. గోనెగండ్లకు చెందిన భీమన్న కుమార్తె ముండాసి రామేశ్వరికి ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన చంటి(35)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొద్ది కాలంగా అదే గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త గుర్తించారు. దీంతో భర్త, అతడి కుటుంబసభ్యులు ఆమెను పుట్టింటికి పంపారు. విడాకులు ఇచ్చి తన కుమారుడిని తమకు అప్పగించాలంటూ భర్త తరచూ గోనెగండ్లకు వెళ్లి గొడవపడేవాడు. ఇందులో భాగంగా మంగళవారం అత్తారింటికి వెళ్లి రాత్రి అక్కడే నిద్రించాడు. చంటి గుండెనొప్పితో బాధపడుతున్నాడని, స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు భార్య, అతడి కుటుంబ సభ్యులు మృతుడి సోదరి భర్త రవికి చెప్పారు. తర్వాత కొద్దిసేపటికే మృతి చెందినట్లు సమాచారం ఇచ్చారు. అనంతరం చంటి మృతదేహంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కర్నూలు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. భార్య, ఆమె సోదరులు మునిస్వామి, రంగన్నలే చంటిని హతమార్చారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు కోడుమూరు సీఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోలీసుల అదుపులో నిందితులు మృతుడి సోదరుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పేర్కొన్నారు. -
ప్లాన్ ప్రకారమే హత్య
భీమారం వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని గౌతమ్నగర్లో వారంరోజుల క్రితం జరిగిన ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరి అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై సతీష్బాబు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతోనే హత్య చేసినట్లు చెప్పారు. పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసింహులపేట మండలం లాల్తండాకు చెందిన భూక్యా రవి(35) నగరంలో కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. పదేళ్ల క్రితం అతడికి గార్లబయ్యారం ఉప్పలప్పుడు గొళ్లగూడానికి చెందిన భూక్యా లక్ష్మి(36)తో పరిచయం ఏర్పడింది. ఈపరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్ల క్రితం విడిపోయారు.పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రవికి రూ.50వేలు జరిమానా విధించారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. లక్ష్మి ఎక్కడ ఉన్న అడ్రస్ కనుక్కొని వేధించేవాడు. లక్ష్మికి మరో వ్యక్తితో సంబంధం.. లక్ష్మి రవి నుంచి విడిపోయాక హన్మకొండకు చెందిన టైల్స్ మేస్త్రీ రఘుపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం రోజల క్రితం రవి గౌతమ్నగర్కు వచ్చి లక్ష్మిని వేధిస్తున్న విషయం తెలుసుకున్న రఘుపతి అక్కడికి చేరుకున్నాడు. తమ వివాహేతర సంబంధానికి రవి అడ్డువస్తున్నాడని భావించాడు. ప్లాన్ ప్రకారం హత్య చేయాలనుకున్నాడు. దీంతో రవిని రఘుపతి తన వాహనంపై జూలైవాడకు తీసుకెళ్లి చితకబాదాడు. కోన ఊపిరితో ఉన్న రవిని అక్కడి నుంచి గౌతమ్నగర్కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. రఘుపతి కొట్టిన దెబ్బలకు రవి మృతి చెందినట్లు ఎస్సై సతీష్బాబు వివరించారు. ఈ హత్యకు లక్ష్మి సహకరించినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం.. రవి చనిపోయిన సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లక్ష్మిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి లక్ష్మి రఘుపతి పరారీలో ఉన్నారు. కాగా జూలైవాడలోని ఓ ఇంట్లో పనిచేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి వారిద్దని అరెస్ట్ చేశారు సమావేశంలో ఎస్సైలు భీమేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
రెబ్బెన(ఆసిఫాబాద్) : వివాహేతర సంబంధా నికి అడ్డుగా ఉన్నాడని ఏడడుగులు నడిచిన భార్యే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నర్సయ్య(36) సోమవారం రాత్రి భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురయ్యాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 15 ఏళ్ల క్రితం నర్సయ్యకు జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కాపురం సజావుగా సాగుతుండగా ఆర్నెళ్ల క్రితం జ్యోతి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇటీవలే నర్సయ్యకు తెలిసింది. అప్పటి నుంచి భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి సైతం గొడవ జరిగింది. రాత్రి భోజనం అనంతరం నర్సయ్య ఇంటి ఎదుట నిద్రపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని జ్యోతి నర్సయ్య హతమార్చేందుకు ఇదే అదునుగా భావించింది. ప్రియుడు శ్రీనివాస్ను పిలిపించుకుంది. ఇద్దరు కలిసి నర్సయ్య గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం ఇంట్లో చీరతో ఊరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మతదేహాన్ని పరిశీలించారు. మతుడి గొంతుపై గాయాలను గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. జ్యోతి విచారించగా అసలు విషయం బయటపడింది. మతుడి తమ్ముడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపారు. -
మటన్ కర్రీ గొడవ.. భర్తను చంపేసిన భార్య
బనశంకరి: మద్యం మత్తులో ఉన్న భర్త మటన్ కూర చేసి పెట్టాలని హుకుం జారీ చేయడంతో పాటు దూషించడంతో కోపోద్రిక్తురాలైన భార్య అతన్ని అంతమొందించింది. ఈ ఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.... బనశంకరి సమీపంలోని ప్రగతిపురలో నివాసం ఉంటున్న గోపాల్(44)కు తమిళనాడు కు చెందిన రుద్రమ్మ(35)తో 15 ఏళ్లు క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మద్యానికి బానిసైన గోపాల్ పనులకు వెళ్లకుండా జులాయిగా తిరిగేవాడు. రుద్రమ్మ పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన గోపాల్ ఇంటికి చేరుకుని తనకు మటన్ కూర వండాలని భార్యకు సూచించాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కింది అంతస్తులో ఉంటున్న రుద్రమ్మ తల్లిదండ్రులు పైక ?చేరుకొని గోపాల్ కాళ్లు చేతులు కట్టివేసి బంధించారు. మద్యం మత్తులో ఉన్న గోపాల్ నిద్రలోకి జారుకున్నారు. అనంతరం రుద్రమ్మ తల్లిదండ్రులు వారి ఇంట్లోకి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో మెలుకువ వచ్చిన గోపాల్ భార్యను తీవ్రపరుషపదజాలంతో దూషించాడు. కోపోద్రిక్తురాలైన రుద్రమ్మ చీరతో గొంతుబిగించి భర్తను హత్య చేసింది. మరుసటిరోజు మృతదేహన్ని తమిళనాడు కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని పథకం పన్నింది. సాధ్యంకాక తన భర్త అనారోగ్యంతో మృతిచెందినట్లు నాటకమాడింది. ఈమేరకు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. అయితే మృతుడి గొంతుపై గాయం గుర్తు ఉండటంతో పోలీసులు రుద్రమ్మ, ఆమె తల్లిదండ్రులను తమదైనశైలిలో విచారణ చేపట్టారు. దీంతో తానే గోపాల్ను హత్యచేసినట్లు రుద్రమ్మ నోరువిప్పింది. కేసు దర్యాప్తులో ఉంది. -
వివాహబంధం మధ్యలోనే తెగిపోతోంది
భార్యాభర్తలంటే ఒకరికోసం ఒకరు జీవించాలి.. అయితే సమస్యలు, మనస్పర్దల కారణంగా ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. వివాహబంధం మధ్యలోనే తెగిపోతోంది. శుక్రవారం నగరంలో వేర్వేరుచోట్ల భార్యను భర్త, భర్తను భార్య హత్యచేశారు. మన్సూరాబాద్: ఓ మహిళ తన భర్త వేధింపులను భరించలేక చివరకు అతనిని హత్యచేసింది. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం వెలిజెర్ల గ్రామానికి చెందిన దేవలపల్లి వెంకటేష్ (45)కు సరూర్నగర్కు చెందిన దుర్గకళ అలియాస్ బుజ్జి సరూర్నగర్ భగత్సింగ్నగర్ కాలనీలో నివాసముంటూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన వెంకటేష్ ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలను వేధిస్తూ ఉండేవాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి రూ.500 తీసుకెళ్లి మద్యం తాగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి మరలా రూ.5 వేలు కావాలని గొడవపడ్డాడు. ఇప్పటికే బాగా ఆలస్యమైందని, ఉదయం డబ్బులు ఇస్తానని భార్య చెప్పినా వినకుండా గొడవపడ్డాడు. అడ్డు వచ్చిన పిల్లలను చంపేస్తానని కత్తిపీట తీసుకుని బెదిరించాడు. ఈ క్రమంలోదుర్గకళ సమీపంలో ఉన్న చపాతీ కర్రతో భర్త వెంకటేష్ను కొట్టి అతని చేతిలో ఉన్న కత్తి పీటను లాక్కుని తలపై బాదింది. దీంతో తల నుంచి రక్తస్రావమైంది. నైలాన్ తాడుతో గట్టిగా అతని మెడపైన అడ్డంగా కట్టి నులమడంతో తీవ్ర రక్తస్రావం జరిగి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి దాడికి ఉపయోగించిన కత్తిపీట, అట్లకర్ర, నైలాన్తాడును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృద్వీదర్రావు, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ రంగస్వామి, సిబ్బంది అర్జునయ్య, మన్మదకుమార్, మహేష్, రాజేష్, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. మలక్పేట: భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన మలక్పేట పోలీస్స్టేషన్ జరిగింది. ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం కామ్ జమాల్పురం గ్రామానికి చెందిన ఒగ్గు నర్సింహ, ముత్తమ్మ(32) దంపతులు గడ్డిఅన్నారంలోని పోచమ్మ బస్తీలో నివాసం వుంటున్నారు. నర్సింహ దిల్సుఖ్నగర్లో పండ్ల వ్యాపారం చేస్తుండగా ముత్తమ్మ రోటీ పాయింట్లో రొట్టెలు తయారు చేస్తుండేది. వీరికి సిద్దు(14), మహేశ్(11) ఇద్దరు సంతానం. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో క్రమంగా గొడవలు తలెత్తాయి. భార్య ముత్తమ్మపై అనుమానం పెంచుకున్న నర్సింహ ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. వారం క్రితం నగరంలోని జుమేరాత్ బజార్లో గొడ్డలి కొనుగోలు చేసి అదనుకోసం వేచిచూడసాగాడు. గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య తలపై గొడ్డలితో బలంగా మోదాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నర్సింహ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు. ఇన్స్పెక్టర్ నర్సింహను విచారించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
భర్తను హత్య చేసిన భార్య, కుమారుడు
బాన్సువాడ టౌన్: నిత్యం మద్యం సేవించి భార్యను వేధింపులకు గురి చేసిన భర్తను వాటి నుంచి విముక్తి కోసం కట్టుకున్న భర్యనే భర్తను కుమారుడి సహాయంతో హత్య చేసింది. ఇంటి పక్కనే ఉన్న పాత ఇంట్లో పూడ్చి పెట్టిన సంఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పిట్లం మండలం చిల్లెర్గి గ్రామానికి చెందిన మంగలి సాయిలు(50), దెగ్లూర్కు చెందిన ఎందోళ్ల సునంద దంపతులు. జీవనోపాధి కోసం 15 ఏళ్ల కిత్రం బాన్సువాడకు వచ్చారు. పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రోడ్డు–4లో ఉంటున్నారు. వీరికి కిరణ్, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులు. కిరణ్ హైదరాబాద్లో హోటల్లో పని చేస్తున్నాడు. శ్రీనివాస్ తల్లి దగ్గర ఉంటున్నాడు. బాన్సువాడలోని ఓ హెర్ కటింగ్ సెలూన్లో సాయిలు పని చేస్తున్నాడు. మద్యంకు బానిసై డబ్బుల కోసం నిత్యం భార్యను కొట్టి, చిత్ర హింసలకు గురిచేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి పెద్ద కుమారుడు కిరణ్ బాన్సువాడకు వచ్చాడు. ఇదే క్రమంలో ఈనెల 20న అర్ధరాత్రి సాయిలు భార్య సునంద, కుమారుడి కిరణ్తో గొడవ పడ్డాడు. ఇంట్లో ఉన్న రోకలి బండతో సాయిలు తలపై కిరణ్ బలంగా కొట్డాడు. చనిపోయాడో లేదోనని కరెంట్ షాక్ కూడా పెట్టారు. అర్ధరాత్రి దాటాక ఇంటి పక్కనున్న పాత ఇంట్లో గుంత తవ్వి సాయిలు మృతి దేహాన్ని పూడ్చిపెట్టారు. సోమవారం రెండు రోజులుగా సాయిలు కనిపించడంలేదని, మృతుడి బావ కిష్టాపూర్కు చెందిన మంగళి నాగయ్య వద్దకు వెళ్లి సునంద చెప్పింది. దీంతో మృతుడి బావ నాగయ్య, మృతుడి అన్న చిల్లెర్గి విఠల్ ఇద్దరు కలిసి సంగమేశ్వర కాలనీలో వాకబు చేశారు. మృతుడి భార్య, కుమారుడిపైనే అనుమానం ఉందని కాలనీవాసులు చెప్పడంతో నాగయ్య, విఠల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేశారు. మృతుడి భార్య సునందను, కుమారుడు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. సీఐ శేఖర్రెడ్డి మృత దేహం పాతిన ప్రదేశాన్ని, హత్యకుపయోగించిన రోకలి బండ, విద్యుత్ తీగలను పరిశీలించారు. తహసీల్దార్ సమక్షంలో నిందితులు చెప్పిన పాత ఇంట్లో ఉన్న మృతి దేహాన్ని వెలికి తీస్తామని సీఐ అన్నారు. ప్రస్తుతం అదృశ్యం కేసు నమోదు చేశామని, మంగళవారం మృత దేహం లభిస్తే హత్య కేసుగా నమోదు చేస్తామని ఆయన అన్నారు. -
రోకలి బండతో మోది భర్తపై హత్యాయత్నం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలోని మారుతినగర్లో నివాసముంటున్న మంద సత్తయ్య (52)పై భార్య విజయలక్ష్మి మంగళవారం రాత్రి రోకలి బండతో తలపై మోది హత్య చేసేందుకు యత్నించింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ మహేశ్ ఘటనా స్థలానికి చేరుకొని సత్తయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సత్తయ్య పరిస్థితి విషమంగా ఉంది. తన భర్త గత కొంత కాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తరుచూ మద్యం సేవించి వేధింపులకు గురి చేస్తున్నాడని విజయలక్ష్మి ఆరోపించింది. మంగళవారం రాత్రి సైతం వేధింపులకు గురి చేయడంతో భరించలేక హత్యాయత్నం చేసినట్లు తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
భర్త చేతిలో భార్య హత్య
ఉరవకొండరూరల్: లత్తవరం గ్రామానికి చెందిన మాణిక్యబాయి (40) తన భర్త చేతిలో దారుణహత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మాణిక్యబాయి, లక్ష్మానాయక్ దంపతులు. వీరు శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవపడ్డారు. శనివారం ఉదయం పొలానికి వెళ్లినపుడు కూడా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఆవేశానికి లోనైన భర్త బండరాయి తీసుకుని భార్య తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జనార్దన్నాయుడు తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను..
నాగోలు: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ పృథ్వీదర్రావు, సరూర్నగర్ సీఐ రంగస్వామితో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, సత్తి తండాకు చెందిన నేనావత్ రాజు నాయక్ (26)కు సంస్థాన్ నారాయణపురం మండలం, వావిళ్లపల్లి బండి తండాకు చెందిన కవితతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వీరు ఎల్బీనగర్ లింగోజిగూడ విజయపురికాలనీలో ఉంటున్నారు. రాజునాయక్ మాదన్నపేటలోని ఓ హోటల్లో ఉదయం మాస్టర్గా, సాయంత్రం సంతోష్నగర్లోని మిర్చి కొట్టులో పనిచేసేవాడు. రాజునాయక్ బంధువు మాదన్నపేట మార్కెట్లో పార్కింగ్ వద్ద ఉద్యోగం చేసే సుమన్ తరచూ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో అతడికి కవితతో సాన్నిహిత్యం ఏర్పడటంతో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. నాలుగు నెలల క్రితం దీనిని గుర్తించిన రాజునాయక్ భార్యను నిలదీయడంతో పాటు తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఇద్దరికీ సర్దిచెప్పారు. అయినా కవిత తన వైఖరి మార్చుకోకపోవడంతో రాజునాయక్ ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె ప్రియుడు సుమన్తో కలిసి అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నింది. గత నెల 31న రాత్రి రాజునాయక్ ఫుల్లుగా మద్యం తాగివచ్చి ఇంట్లో నిద్రిస్తుండగా సుమన్కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో సుమన్, తన బంధువైన మరో మైనర్ బాలుడు(16)తో కలిసి రాజునాయక్ ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాజునాయక్ కాళ్లు, చేతులను నైలాన్ తాళ్లతో కట్టివేసి చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అతడి బైక్పైనే బాలుడి సహాయంతో మధ్యలో కూర్చొబెట్టుకొని తీసుకెళ్లి గుర్రంగూడ అటవీ ప్రాంతంలో పారవేశారు. అనంతరం కవిత అత్త, మామలతో కలిసి ఏప్రిల్ 1న సరూర్నగర్ ఠాణాకు వెళ్లి తన భర్త బయటికి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 2న వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో రాజునాయక్ మృతదేహం లభ్యమవడంతో కేసును సరూర్నగర్కు బదిలీ చేశారు. కవిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రియుడు సుమన్తో కలిసి హత్య చేసి నట్లు అంగీకరించింది. వీరితో పాటు హత్యకు సహకరించిన బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కవిత, సుమన్లకు జ్యుడీషియల్ రిమాండ్కు, మైనర్ను జ్యువైనల్ హోంకు తరలించారు. వీరి నుంచి నైలాన్ తాళ్లు, చున్నీ, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
భర్తను చంపిన భార్య అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బుడిగజంగాల కాలనీకి చెందిన సిరిగిరి మల్లయ్య (70)ను హత్య చేసిన ఆయన భార్య సిరిగిరి ఎల్లవ్వను అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ ప్రకాశ్ తెలిపారు. ఈనెల 19న మల్లయ్యను ఆయన భార్య ఎల్లవ్వ మతిస్థిమితం సరిగ్గా లేక తలపై బండరాయితో బాది హత్యచేసి పారిపోయింది. గురువారం ఉదయం ఇంటికి చేరిన ఎల్లవ్వను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
భర్తను కడతేర్చిన భార్య
చిత్తూరు, పలమనేరు:వేధింపులు తాళలేక భార్య భర్తను హతమార్చింది. ఆపై శవాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఓ రక్తపు చుక్క నిందితురాలిని పట్టించింది. సంచలం సృష్టించిన ఈ సంఘటన పలమనేరు మండలం పెంగరగుంట సమీపంలోని చిన్నకుంటలో శుక్రవారం జరిగింది. పలమనేరు సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. పెంగరగుంట గ్రామానికి చెందిన క్రిష్ణప్ప(55) తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య శాంతమ్మ, కుమారుడు అనీల్కుమార్ ఉన్నారు. వీరు గ్రామ సమీపంలోని పొలం వద్ద నివాసం ఉంటున్నారు. క్రిష్ణప్ప మద్యానికి బానిసయ్యాడు. అతన్ని మార్చేందుకు భార్య, కుమారుడు ఎంతో ప్రయత్నించారు. ప్రయోజనం లేకపోవడంతో క్రిష్ణప్పను ఇంటికి రావద్దని చెప్పారు. అతను బయట ఉంటూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అతను పొలం సమీపంలోని మామిడితోపు వద్ద మద్యం సేవించాడు. ఆపై మనువరాలికి చెప్పి భార్యను రమ్మన్నాడు. ఆమె అక్కడికి వచ్చి మళ్లీ తాగొచ్చావా అంటూ వాగ్వాదానికి దిగింది. ఎంతచెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించింది. మత్తులో పడి ఉన్న అతనిపై బండరాయి వేసి హత మార్చింది. తర్వాత మృతదేహాన్ని సంచిలో మూటకట్టి గుడియాత్తం రోడ్డు వద్దకు ఈడ్చుకెళ్లింది. అక్కడ పడేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం ఆ దారిలో వెళ్లేవారు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెంది ఉంటాడని భావించారు. ఓ రక్తపు చుక్కతో శవానికి కాస్త దూరంలో పోలీసులకు ఓ రక్తపు చుక్క కనిపించింది. దాని ఆధారంగా కొంత దూరం పరిశీలించగా మట్టిలో రక్తపు చుక్కలు కనిపించాయి. ఎవరో హత్యచేసి లాక్కొచ్చి రోడ్డులో పడేశారని గుర్తించారు. మృతుని భార్యపై అనుమానంతో విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించింది. పోలీసులు ఆమెను అదపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన బండరాయి, శవాన్ని లాక్కెళ్లిన తాడును స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ఉంది. -
సొంత తమ్ముడితోనే వివాహేతర సంబంధం
కాకినాడ రూరల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే భార్య చంపిన సంఘటన శనివారం కాకినాడలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఐశ్వర్యా కాలనీలో నివాసముంటున్న ట్యాక్సీ డ్రైవర్ రాయుడు హరిప్రసాద్, భార్య హిమచందుకు ముగ్గురు ఆడ పిల్లలు. హిమచందు తండ్రి రెండో భార్య కొడుకు (సొంత తమ్ముడు) భానుప్రసాద్తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుం ది. ఈ విషయం హరిప్రసాద్కు తెలిసి అనేక సార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పూలేదు. దీంతో భా ర్యా భర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ను అడ్డు తొలగించుకోవాలని హిమచందు, భానుప్రసాద్ భావించారు. హత్య చేసేందుకు పథకం రూపొందించారు. శుక్రవారం రాత్రి హరిప్రసాద్ తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉండడంతో హరిప్రసాద్ను కొట్టి, ముఖంపై తలగడ పెట్టి నొక్కి చంపేశారు. భానుప్రసాద్ తన స్నేహితులతో కలిసి చనిపోయిన హరిప్రసాద్ను మోటార్ సైకిల్పై తీసుకెళ్లి రమణయ్యపేట కాలువ పక్కన ఉన్న డంపింగ్ యార్డులో టైర్లు, చెత్త వేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఉదయం హరిప్రసాద్ కోసం తండ్రి ఇంటికి వెళ్లగా హిమచందు బయటకు వెళ్లారని చెప్పింది. ఎంతకూ కన్పించకపోవడంతో హరిప్రసాద్ తమ్ముడు రాయుడు శ్రీను శనివారం ఉదయం సర్పవరం పో లీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోగా సగం కాలి ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సగం కాలిన మృతదేహం రాయుడు హరిప్రసాద్దేనని గుర్తించారు. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ భార్య హిమచందును, భానుప్రసాద్ను అతని తల్లిని, హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవివర్మ వివరించారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేయగా త్రీటౌన్ సీఐ దుర్గారావును దర్యాప్తునకు ఆదేశించినట్లు డీఎస్పీ రవివర్మ తెలిపారు. హరిప్రసాద్ను తగులబెట్టిన స్థలాన్ని డీఎస్పీ రవివర్మతో పాటు సర్పవరం సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై స్వామినాయుడు పరిశీలించారు. -
భర్తను హత్య చేసిన భార్య
ఆదిలాబాద్, జైపూర్(చెన్నూర్): కట్టుకున్న వాడినే కడతేర్చింది ఆ ఇల్లాలు. వేధింపులు తాళలేక రోకలిదుడ్డుతో తలపై బాది హత్యచేసింది. నిత్యం తాగుతూ భార్యను చిత్రహింసలకుక గురిచేసే భర్తను కానరాని లోకాలకు పంపేసింది. మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకోకపోగా డబ్బుల కోసం తరచూ గొడవకు దిగే భర్తపై దాడి చేసి చంపేసింది. ఏడడుగులతో కలకాలం తో డుంటానని చేసిన బాసలు మరిచి పతిని పరలోకానికి పంపింది. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మోర్ల శ్రీనివాస్(38)ని తన భార్య మోర్ల రాజేశ్వరి సోమవారం ఉదయం రోకలిదుడ్డుతో కొట్టి హత్యచేసింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే మోర్ల రాజేశ్వరి–శ్రీనివాస్లకు 2005లో వివాహం జరిగింది. శ్రీనివా స్ అత్తగారి ఇంటికి ఇల్లరికంగా వచ్చారు. ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. వీరికి కుమార్తెలు భూమిక(11), శ్రావణి(8), కుమారుడు శివకుమార్(6) ఉన్నా రు. సొంతంగా ఆటో నడుపుతూ శ్రీనివాస్ మద్యానికి బానిస అయ్యాడు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి భార్య రాజేశ్వరిని తరుచూ వే ధింపులకు గురిచేసేవాడు. రాజేశ్వరి తండ్రి కొట్రంగి లస్మయ్య సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కాగా ఇటీవల రూ.2లక్షలు సహార డబ్బులు రాగా బ్యాంకులో వేశా రు. అందులో నుంచి రూ.40 వేలు అప్పు తీర్చారు. బ్యాంకులో ఉన్న డబ్బులు తనకు ఇవ్వాలని కోరడంతో భార్యభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు ఆటోలు అమ్మిన శ్రీనివాస్ మళ్లీ కొత్త ఆటో కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వాలని మద్యం సేవించి భార్య రాజేశ్వరిని వేధించాడని ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అతిగా మద్యం సేవించి భార్య రాజేశ్వరితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం తాగి వచ్చిన శ్రీనివాస్ రాజేశ్వరితో గొడవకు దిగాడు. ఇద్దరూ తోసుకోగా విరక్తి చెందిన రాజేశ్వరి పక్కన ఉన్న రోకలిదుడ్డుతో శ్రీనివాస్ తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త వేధింపులు తాళలేక హత్య చేసినట్లు రాజేశ్వరి అంగీకరించింది. సంఘటన స్థలాన్ని ఏసీపీ సీతారాములు, శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్ పరిశీలించారు. నేరాన్ని అంగీకరించి రాజేశ్వరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించన్నుట్లు స్థానిక ఎస్సై ఆంజనేయలు తెలిపారు. -
కట్టుకథతో మృతదేహం తరలింపు
విజయవాడ: పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్త కట్టుకున్న భార్యను హతమార్చి, రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కట్టుకథ అల్లిన వైనం వెలుగు చూసింది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం రంగంపేటకు చెందిన బొంగు రవికుమార్కు అదే జిల్లా పిరిడి గ్రామానికి చెందిన సత్యవతితో 2006లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. రవికుమార్ తన భార్య సత్యవతిని (30) ఈ నెల 5వ తేదీన విజయవాడ మురళీనగర్లో హత్యచేసి గుట్టుచప్పుడు గాకుండా మృతదేహాన్ని విజయనగరం జిల్లాకు తరలించాడు. మృతురాలి రక్తబంధువులకు ఆలస్యంగా అందిన సమాచారంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది. విజయవాడ లబ్బీపేట కార్వే ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్న రవికుమార్, కానూరు మరళీనగర్ కృష్ణవేణి రెసిడెన్సీలో తన భార్య సత్యవతితో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ ఉదయం 6.30 గంటల సమయంలో సత్యవతి చనిపోయిందని హైదరాబాద్లో ఉంటున్న ఆమె సోదరికి, విజయనగరం జిల్లాలో ఉంటున్న తండ్రికి ఫోన్చేసి తెలిపాడు. పాలప్యాకెట్కు వెళ్లిన భార్య ఎంతకూ తిరిగి రాలేదని, తాను వెతుక్కుంటూ వెళ్లగా ఆమె పక్క వీధిలో రోడ్డుపక్కనే చనిపోయి ఉందని వివరించాడు. ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఆమె చనిపోయిందని కట్టుకథ అల్లాడు. ఫిర్యాదు నమోదు చేశాం: సీఐ సత్యవతి మృతిపై ఈ నెల 11న ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెనమలూరు సీఐ దామోదర్ సాక్షికి చెప్పారు. ఈ నెల 5వ తేదీన చనిపోతే కనీసం రోడ్డుప్రమాదంలో చనిపోయినట్లు కూడా ఫిర్యాదు రాలేదన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉందన్నారు. విజయనగరం జిల్లాలో మృతురాలికి అంత్యక్రియలు భర్త రవికుమార్ తన స్వస్థలమైన విజయనగరం జిల్లా సీతానగరం మండలం రంగంపేటకు ప్రైవేట్ అంబులెన్స్లో మృతదేహాన్ని తరలించాడు. ఈ నెల 6వ తేదీన ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపాడు. అంత్యక్రియలకు వెళ్లిన మృతురాలి బంధువులు సత్యవతి మృతి గురించి పూర్తి వివరాలు ఆమె భర్తను ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, పోలీసు సీఐతో చెప్పి కాగితాలు తీసుకుని అంబులెన్స్లో మృతదేహాన్ని తరలించానని నమ్మబలికాడు. సంబంధిత కాగితాలు అడగ్గా అనుమానాస్పదంగా మాట్లాడటంతో మృతురాలి సోదరి భూలక్ష్మి, ఇతర బంధువులు మురళీనగర్కు వచ్చి సత్యవతి మృతిపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం ఎవ్వరూ చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన భూలక్ష్మి ఈ నెల 11వ తేదీన పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రవికుమార్ 4వ తేదీ రాత్రి సత్యవతితో గొడవ పెట్టుకుని దాడిచేసి కొట్టాడని, ఆమె తలకు గాయమైందని భూలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సోదరి కొద్దిరోజుల కిందట ఫోన్ చేసి రవికుమార్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ తనను హింసిస్తున్నట్లు చెప్పిందని భూలక్ష్మి పేర్కొంది. తన సోదరి సత్యవతిని ఆమె భర్త హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని, ఈ కేసును సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె పోలీసు అధికారులను వేడుకుంది. -
రెండో భార్యే సూత్రధారి
నాగార్జునపేటతండాలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన ఉపసర్పంచ్ ధర్మానాయక్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో రెండో భార్యే ప్రియుడితో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం సాగర్ పోలీస్టేషన్లో మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. నల్లగొండ, నాగార్జునసాగర్ : తిరుమలగిరి మండలం చింతలపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నాగార్జునపేటతండాకు చెందిన దేపావత్ ధర్మానాయక్(45) చింతలపాలెం గ్రామ కాంగ్రెస్ ఉపసర్పంచ్. ఈయనకు ఇదే గ్రామపంచాయతీ పరిధిలోని జమ్మనకోటతండాకు చెందిన సావిత్రితో వివాహం జరిగింది. వివాహమై పదేళ్లయినా సంతానం కలగకపోవడంతో సావిత్రి చెల్లెలు శిరీషను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి సోని(7), లక్ష్మీనర్సింహ(6), ప్రియాంక(3) ఉన్నారు. ఇద్దరి మధ్య వయస్సులో చాలాతేడా ఉండడంతో శిరీషా ధర్మానాయక్తో కాపురం చేయడానికి అంతగా ఇష్టపడకపోయేది. ధర్మానాయక్ బావమరిది హనుమంతు(సావిత్రి, శిరీషల సొంత తమ్ముడు), నాగార్జునపేటతండాకు చెందిన అంగోతు రవి(19)లు కలిసి నాగార్జునసాగర్ హిల్కాలనీలో గల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుకున్నారు. హనుమంతు «బావ ధర్మ ఇంట్లోనే ఉండి కళాశాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో హనుమంతు చిన్నక్క శిరీషతో రవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ధర్మకు ఈ విషయం తెలిసి శిరీషను కొట్టగా రవి, శిరీష ఇద్దరు చిన్న కూతురుతో కలిసి తండానుంచి వెళ్లిపోయారు. వారిని మందలించి డిసెంబర్ 15న తిరిగి తల్లిగారింటికి తీసుకువచ్చారు. అనంతరం నాగార్జునపేటకు సంసారానికి వచ్చింది. రవి హాలియాలోని గిరిజన బాలుర వసతిగృహంలో ఉంటూ ఇంటిగ్రేటెడ్ పీజీ కోసం చదువుకుంటున్నాడు. సంసారానికి వెళ్లిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉండి, తమను ధర్మ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని శిరీష రవికి ఫోన్ ద్వారా తెలియజేసింది. రవి చిన్నమ్మ కమిలీ ఇల్లు ధర్మ ఇంటిముందే ఉండడంతో వీరి వివాహేతర సంబంధానికి ఆమె సహకరిస్తూ వచ్చింది. వీరి సంబంధానికి అడ్డంగా ధర్మ ఉండడం.. తరచూ భర్త మందలిస్తుండడంతో ధర్మను చంపాలని, అనంతరం సుఖంగా ఉండవచ్చని రవికి తెలిపింది. పదిరోజుల క్రితమే హత్యకు పథకం పది రోజుల క్రితమే ధర్మను అడ్డు తొలిగించుకునేందుకు ఇరువురు కలిసి పథకం వేశారు. చేపలను చంపి పట్టే పూసలు(బాంబులు) తె మ్మని వాటిని పేల్చడం నాకు తెలుసు, అవి నాయకునితండాలో దొరుకుతాయని తీసుకురావాలని రవికి చెప్పింది. తనతో పాటు కళాశాలలో చదువుకున్న జూనియర్ విద్యార్థి కొర్రపాండును చేపలను చంపి పట్టే పూసల గురించి విచారించాడు. మేరావత్ హతీరాం ఇంట్లో దొరుకుతాయని చెప్పడంతో అక్కడకు వెళ్లి అడిగాడు. చేపలు చంపి పట్టేందుకు పూసలు కావాలని అడగడంతో తన భర్త హతీరాం లేడు రేపు రమ్మని చెప్పింది. త మది నాగార్జునపేట తండా అని, చెప్పడంతో ఇక్కడి తం డానే అని చేపలు పట్టుకునేందు కుగా భావించి, రెండువందలు ఇస్తే రెండు పూసలు ఇచ్చింది. వాటి ని వేర్వేరు పేపర్లలో పొట్లం కట్టుకొని హాలియాకు వెళ్లి కంపచెట్లలో పెట్టి శిరీషకు ఫోన్చేశాడు. 11వ తేదీన ఆది వారం పైలాన్కు అంగడికి రమ్మని అక్కడికి తెచ్చి ఇస్తానని చెప్పాడు. తాను రావడం కుదరడంలేదని కమిలిని పంపిస్తున్నానని చెప్పింది. పైలాన్కు వచ్చిన కమిలికి పూసలు (బాంబులు)న్న రెండు పొట్లాలు ఇచ్చాడు. వాటిని ఆరోజు రాత్రే కమిలి శిరీషకు ఇచ్చింది. 13వ తేదీ రాత్రి 2గంటల సమయంలో రవి శిరీషకు ఫోన్ చేసి మీఇంట్లో ఎవరెవరున్నారని అడిగాడు. అందరు శనగచేను కావలికి వెళ్లారని ధర్మానాయక్ ఇంటి ముందు గల రేకులకింద మంచంలో పడుకొని ఉన్నాడని చెప్పింది. రవి ఇదే మంచి సమయం మంచంపై బాంబులు పెట్టి చంపేయమని ధైర్యంచెప్పాడు. ఉలిక్కిపడిన తండా ధైర్యం తెచ్చుకున్న శిరీష తన వద్దగల పూసలు(బాంబులు) మంచంపై పెట్టి కొవ్వొత్తి ముట్టిం చుకొని తెచ్చి వాటికి అంటించి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. శిరీష పెట్టిన (పూసలు)బాంబులు పేలితండాలో పెద్ద శబ్దం వచ్చింది. తండాఅంతా ఉలి క్కి పడింది. శిరీష బయటకు వచ్చి చూడగా పొగ కమ్ముకొని ఉంది. ధర్మపడుకున్న మంచంపై నుంచి కొంత దూరంలో ఎగిరి బోర్లాపడి ఛిద్రమై రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. శిరీష తనకేమి తెలియనట్లుగా ఏడ్చుకుంటూ తండావాళ్లయిన దూపావత్ సామిని, దూపావత్ మంగ్తలకు ధర్మను ఎవరో బాంబుపెట్టి చంపారని తెలిపింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ధర్మానాయక్ తల్లి దేపావత్ ద్వాళి తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ముందుగా హాలియాలోని గిరిజన హాస్టల్లో రవిని, అనంతరం తల్లిగారిల్లయిన జమ్మనకోటలో శిరీషను, వివాహేతర సంబంధానికి సహకరించిన అంగోతు కమిలిని, నాయకునితండాకు చెందిన హతీరాం గ్రామంలో లేకుండా మిర్యాలగూడ సమీపంలోని రాఘవాపురంలో ఆయన చెల్లెలు ఇంట్లో ఉండగా హతీరాంతో పాటు ఆయన భార్య సుజాతలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హతీరాం దగ్గర 01 జిలిటిన్ స్టిక్తో పాటు 22 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిలిటిన్ స్టిక్స్తో పాటు ధర్మానాయక్ను హతమార్చేందుకు వినియోగించిన సెల్ఫోన్, కొవ్వొత్తి, అగ్గిపెట్టెతో సహా సేకరించి వారినందరినీ రిమాండ్కు పంపుతున్నట్లుగా డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మేరావత్ హతీరాం పేలుడు పదార్థాలను గుంటూరు జిల్లా మాచర్లలో కొనుగోలు చేసినట్లు తెలపడంతో తదుపరి పూర్తి విచారణ జరిపి నేరస్తులందరిపై చార్జిషీట్ వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సాగర్ సీఐ రవీందర్, తిరుమలగిరి ఎస్ఐ కురుమయ్య, పెద్దవూర ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
మదనపల్లె క్రైం: ఈ నెల 9వ తేదీన జరిగిన రామ్నాథ్ కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హతమార్చినట్టు తేల్చారు. ఈ మేరకు భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ సురేష్కుమార్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె పంచాయ తీ తిమ్మయ్యగారిపల్లెకు చెందిన కందల నరసింహులు, నరసమ్మ కుమారుడు రామ్నాథ్ మదనపల్లె మున్సిపల్ ఇంజినీర్ వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట గరుగుపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెందిన ఏఎన్ఎం లక్ష్మితో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. కొంతకాలంగా ఇద్దరు గొడవ పడుతున్నారు. లక్ష్మి భర్తతో తాను పడుతున్న కష్టాలను కడప బుడ్డాయపల్లెకు చెందిన తన మాజీ ప్రియుడు వాకా రామాంజనేయులు(30)కు చెప్పింది. భర్త అడ్డు తొలగించుకుంటే రూ.లక్షల ఆస్తి దక్కుతుందని, ఇద్దరూ కలిసి దుబాయ్లో స్థిరపడవచ్చని పేర్కొం ది. పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ రాత్రి కడప నుంచి ప్రియున్ని సీసీ కెమెరాలకు చిక్కకుండా విజయనగర్కాలనీకి రప్పించింది. భర్త రామ్నాథ్ భోజనం చేసి నిద్రలోకి జారుకున్నాక రామాంజనేయులుతో కలిసి గొంతు నులిమి హతమార్చింది. అనంతరం 167 గ్రాముల బంగారు నగలు, కురవంకలోని ఆమె పేరున ఉన్న రెండు ప్లాట్ల పత్రాలు, ఓ కారు, కొంత నగదును ప్రియుడికి ఇచ్చి కడపకు పంపేసింది. దొంగలు రావడంతో గుండె ఆగిందని నాటకం భర్త హత్యపై అనుమానం రాకుండా ఉండేందుకు లక్ష్మి నాటకం ఆడింది. వేకువజామున 4:30 గంటల సమయంలో తన భర్త రామ్నాథ్ బాత్రూమ్కు వెళ్లేందుకు తలుపులు తెరవగా ఐదుగురు ముసుగు దొంగలు ఇంట్లో చొరబడి భయపెట్ట డంతో గుండె ఆగి చనిపోయాడని పేర్కొంది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ సురేష్కుమార్, ఎస్ఐ క్రిష్ణయ్య పరిశీలించారు. అక్కడి పరిస్థితిని బట్టి పథకం ప్రకారం జరిగిన హత్యగా గుర్తించారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి కడపలో రామాంజనేయులును, మదనపల్లెలో లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు లక్ష్మి అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 167 గ్రాముల బంగారు నగలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐలకు ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డులు అందజేయనున్నామని వివరించారు. -
నాలుగోసారీ ఆడపిల్లే పుట్టిందని...
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ మహిళ నాలుగో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆమెకు అత్తింటివారే నిప్పంటించి కాల్చి చంపిన అమానుష ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు భర్త సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర 24 పరగణ జిల్లాకు చెందిన ఫాతిమాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇటీవలే నాలుగో కాన్పులోనూ అమ్మాయే పుట్టింది. మగబిడ్డ పుట్టనందున ఎక్కువ కట్నం తేవాలని ఫాతిమాను అత్తింటివారు మొదటినుంచీ వేధించేవారు. మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో ఆమె కష్టాలు పెరిగాయి. అత్తింటివారే ఫాతిమా చేతులు వెనక్కు మడిచి కట్టేసి నిప్పంటించారని ఆమె బంధువులు చెప్పారు. -
మద్యంలో సైనెడ్ కలిపి భార్య ఘాతుకం
-
అక్క భర్తతో వివాహేతర సంబంధం
చిలకలూరిపేటరూరల్: వివాహేతర సంబంధం బయట పడకుండా భర్తను అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో సోదరి భర్తతో కలిసి వ్యూహాత్మకంగా హత్య చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట డీఎస్సీ కె.నాగేశ్వరరావు చెప్పారు. డీఎస్సీ, రూరల్ సీఐ యు.శోభన్బాబుతో కలిసి సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నల్లబోతు వీరయ్య కుమారుడు నరేంద్ర (27) ఆంధ్రాషుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో అదే గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె శ్రీవిద్యతో వివాహం అయింది. శ్రీవిద్యకు వివాహానికి ముందుగానే సోదరి భర్త అయిన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామానికి చెందిన గొట్టిపాటి వీరయ్య చౌదరి అలియాస్ వాసు, వీరాంజనేయులకు వివాహేతర సంబంధం ఉంది. వివాహానంతరం శ్రీవిద్య అక్రమ సంబంధం కలిగి ఉన్న అక్క భర్త అయిన వీరయ్య చౌదరితో మాట్లాడుకోవటానికి, కలుసుకునేందుకు ఆటంకంగా మారింది. శ్రీవిద్య తన భర్తను అడ్డుతొలగించుకునేందుకు అక్క భర్త అయిన వీరయ్య చౌదరి, ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన గుంజి బాలరాజు, ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పూజల చౌడయ్యలతో కలిసి ముందస్తుగా పథకం సిద్ధం చేశారన్నారు. గత డిసెంబర్ 19న కారులో శ్రీవిద్య భర్త అయిన నరేంద్రతో పాటు నిందుతులతో కలిసి ప్రయాణించారన్నారు. గుంటూరు – కర్నూలు రోడ్డులోని కొత్తపాలెం దాటిన అనంతరం మార్కాపురం రోడ్డులో సైనేడ్ కలిపిన మద్యం తాగించారన్నారు. మరణించిన అనంతరం మృతదేహాన్ని నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామ పరిధిలోని పొనుగుపాడు కాలువ గట్టుపై పడేసి వెళ్లారన్నారు. రూరల్ సీఐ యు.శోభన్బాబు దర్యాప్తు చేశారన్నారు. నిందితులు నరసరావుపేటలో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసులో మృతుడి భార్య శ్రీవిద్య అరెస్ట్ కావాల్సి ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీఐతోపాటు నాదెండ్ల ఎస్ఐ కె.చంద్రశేఖర్, పిఎస్ఐ ఎస్.రామాంజనేయులు, హెడ్కానిస్టేబుల్స్ బాబూరావు, ఇసాక్, కానిస్టేబుల్స్ తిరుపతిరావు,కోటేశ్వరరావు, వెంకట్రావు, శశికుమార్, బెనర్జీ, తిరుపతమ్మ, హాంగార్ఢులు ఇస్రాయేలు, చిన్నబ్బాయి, ఆలీ, ఆశీర్వాదం కృషి చేశారని వీరిని అభినందించారు. నిందితులను పట్టించిన చెప్పు.. బండి తాళాలు హత్య జరిగిన ప్రదేశంలో రూరల్ సీఐ పరిశీలించి సంఘటనా స్థలంలో మృతుడికి చెందిన ఒకటే చెప్పు ఉండటంతో పాటు ప్యాంటు జేబులో ద్విచక్ర వాహనం తాళం ఉన్నా సమీపంలో బండి కనిపించకపోవటంతో అనుమానాస్పద మృతిని, హత్యగా భావించి ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భర్తను భార్య ఆధ్వర్యంలోనే హత్య చేయించినట్లు నిర్ధారించారు. -
ప్రేమగా మందిచ్చి భార్య ఘాతుకం
సాక్షి, గుంటూరు : వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియులతో కలిసి భర్తలను హతమారుస్తున్న సంఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. మొన్న స్వాతి, నిన్న జ్యోతి సంఘటనలు సంచలనంగా మారగా తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. ఎవరికి అనుమానం రాకుండా మద్యంలో సైనెడ్ కలిపి తాగించింది. అనుమానం రాకుండా ఆత్మహత్య చిత్రించింది. అందుకుగాను అతడి డెడ్బాడీని తీసుకెళ్లి పునుగుపాడువద్ద ఉన్న కాలువలో పడేసింది. ఈ సంఘటన గత నెల డిసెంబర్ (2017) 19న చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రుల అనుమానం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవిద్య అతడి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం గొట్టిపాటి వీరయ్య చౌదరి, గుంజి బాలరాజు, పూజల చౌడయ్య అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టగా శ్రీవిద్య మాత్రం పరారీలో ఉంది. -
నాగరాజు మృతి కేసులో కొత్త మలుపు
-
ప్రాణం తీసిన ఆస్తి
శ్రీకాకుళం, పాతపట్నం: ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో భర్త మృతి చెందాడు. భార్య చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన పాతపట్నం మండలంలో కొరసవాడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. కొరసవాడ గ్రామంలో కర్ణం వీధిలో పూర్ణచంద్ర పాణిగ్రహీ(52), కుంతల పాణిగ్రహీ అలియాస్ సుహాసిని దంపతులు కొన్నేళ్లగా నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఆస్తి విషయంలో తగాదా రావడంతో ఆదివారం అర్ధరాత్రి సమయంలో భర్తపై భార్య క్షణికావేశంలో ఇనుప రాడ్తో దాడి చేసింది. భర్త పూర్ణచంద్ర పాణిగ్రహీ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. పూర్ణచంద్ర పాణిగ్రహీకి సంబంధించి నలుగురు అన్నదమ్ములు. ఇందులో ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. పూర్ణచంద్ర పాణిగ్రహీ, మరొ అన్నయ్య గ్రామంలోనే వేర్వేరుగా నివసిస్తున్నారు. ప్రస్తుతం పూర్ణచంద్ర పాణిగ్రహీ కుటుంబం ఉంటున్న ఇల్లు అన్నదమ్ముల మధ్య తగాదాలో ఉంది. ఈ ఇంటికి సంబంధించి పూర్ణచంద్ర పాణిగ్రహీ భార్యాభర్తల మధ్య గత రెండేళ్లగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇల్లు తన పేరున రాయమని కుంతల పాణిగ్రహీ గొడవ చేస్తుండేది. ఇదే విషయంపై గతంలో కూడా స్థానిక పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో ఒకే ఇంట్లో భార్య, భర్తలు వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. పూర్ణచంద్ర పాణిగ్రహీ ఒక్కడే రోజూ వంట చేసుకొని పనులకు వెళ్లేవాడు. సారకంద తేవడానికి బరంపురం ఆదివారం వెళతానని తోటివారికి చెప్పి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో భార్య సుహాసిని క్షణికావేశంలో ఇంట్లోని గ్యాస్ స్టౌ పక్కనే ఉన్న ఇనుప రాడ్ను తీసుకుని భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో కుమార్తె మాధురి పాణిగ్రహీ ఉంది. వెంటనే సుహాసిని తన తల్లి కుమారి పండాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. పక్క గ్రామం కాగువాడలో ఉన్న తల్లి, తమ్ముడు జగదీష్ పండా కొరసవాడ చేరుకొని కుంతల పాణిగ్రహీ ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న పూర్ణచంద్ర మృతదేహాన్ని చూసి ప్రైవేటు అంబులెన్స్కు ఫోన్ చేసి తెప్పించారు. దానిలో పూర్ణచంద్రను ఎక్కించుకొని గ్రామంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక తిరిగి ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు మృతదేహంపై కిరోసిన్పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సుహాసిని ప్రయత్నించింది. అయితే అప్పటికే ఇరుగుపొరుగు వారికి విషయం తెలియడంతో అందరూ చేరుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమయింది. ఇంట్లో రక్తపు మరకలు ఉండడంతో వాటిని కడిగేందుకు ప్రయత్నించింది. అయితే గోడలకు కూడా రక్తపు మరకలు ఉండడంతో చేసేదిలేక మిన్నకుండిపోయింది. సోమవారం ఉదయం గ్రామస్తులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. సంఘన స్థలానికి సీఐ బి.ఎస్.ఎస్.ప్రకాష్, ఎస్ఐ ఎం.హరికృష్ణ చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ఇరుగుపొరుగు వారిని, గ్రామస్తులను అడిగి వివరాలు తీలుసుకున్నారు. మృతుడు భార్య సుహాసినిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అంబులైన్స్లో పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి పంచనామా చేసి, పోర్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని మృతుడు అన్న బృందావన్ పాణిగ్రహాకి అందజేశారు. మృతుడు అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాతపట్నం సీఐ తెలిపారు. పూర్ణచంద్ర పాణిగ్రహీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. -
పథకం ప్రకారమే సుధాకర్ రెడ్డిని హతమార్చారు
-
ముఖం సరిగా కాలలేదని స్టౌపై పెట్టాడు..
నాగర్ కర్నూల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పోలీసులు.. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. డీఎస్పీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... పథకం ప్రకారమే సుధాకర్ రెడ్డిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రాజేశ్ ఏ1, స్వాతిని ఏ2గా చేర్చినట్లు తెలిపారు. ‘నలుగురు వ్యక్తులు వచ్చి సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి చేశారని కుటుంబ సభ్యులకు స్వాతి చెప్పింది. ఆ వెంటనే మహబూబ్నగర్కు అక్కడ నుంచి హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరు కలిసి సుధాకర్రెడ్డి ఇంట్లో హత్య చేసి అటవీ ప్రాంతంలో కాల్చేశారు. తన తండ్రి చనిపోవడంతో కొద్దిరోజులుగా నిద్ర పట్టడం లేదని రాజేశ్ తన స్నేహితుడు నరేష్ను కోరాడు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి పడుకున్న సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చితలపై మోది ఇద్దరు కలిసి హతమార్చారు. ఆ తర్వాత ఇంటికొచ్చాక రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. కానీ ...అనుకున్న మేరకు కాలకపోవడంతో ముఖాన్ని స్టౌపై పెట్టాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో రాజేశ్ను చేర్చించిన వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లను స్వాతి కోరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి కాదని కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో ఆ విషయాన్ని వారు మా దృష్టికి తెచ్చారు. మేం స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే హత్య విషయం తేలింది. స్వాతికి, రాజేశ్కు రెండేళ్లుగా సంబంధం ఉంది. కానీ ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియదు. అయితే ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని స్వాతిని రాజేశ్ అడిగాడు. కానీ పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రానని స్వాతి చెప్పింది. ఇద్దరం కలిసి ఉండాలంటే సుధాకర్ రెడ్డిని హత్య చేసి ఆ స్థానంలో నువ్వు రావాలని స్వాతి ఈ సందర్భంగా రాజేశ్కు చెప్పింది. దాంతో ఇద్దరు ఆలోచించి ప్లాన్ చేశారు’ అని తెలిపారు. అలాగే సుధాకర్ రెడ్డి శవాన్ని కాల్చిన సంఘటనా స్థలం నుంచి సిరెంజ్, ఐరన్ రాడ్, చున్నీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో విచారణ జరపాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడు రాజేశ్ మాట్లాడుతూ...‘మేమిద్దం కలిసే సుధాకర్ రెడ్డిని హత్య చేశాం. సుధాకర్ రెడ్డి తనను కొడుతున్నాడని, పట్టించుకోవడం లేదని స్వాతి తరచు నాకు చెప్పేది. హత్యకు పథకం పన్నాక ఒకసారి ఆలోచించమని స్వాతిని కోరా. హ్యాపీగా ఉండాలంటే ప్లాన్ను అమలు చేయాల్సిందేనని స్వాతి చెప్పింది.’ అని తెలిపాడు. కాగా ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతిని శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 29వ వరకూ రిమాండ్ పొడిగించింది. నాగర్ కర్నూల్లో సివిల్ కాంట్రాక్టర్సుధాకర్ రెడ్డిని భార్య స్వాతి హత్య చేసిన విషయం తెలిసిందే. -
స్వాతి ప్రోత్సాహంతోనే హత్య
సాక్షి, నాగర్కర్నూల్/నాగర్కర్నూల్ క్రైం: కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డితో తనకు పరిచయంగానీ, శత్రుత్వంగానీ ఏమీ లేదని హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ చెప్పాడు. కేవలం అతని భార్య స్వాతి ప్రోత్సాహంతోనే తాను హత్య చేసినట్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన సుధాకర్రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజేశ్ను గురువారం నాగర్కర్నూల్ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ కేసులో స్వాతిని రెండు రోజుల క్రితం రిమాండ్కు పంపిన విషయం విదితమే. రాజేశ్ను పోలీసులు రోజంతా విచారించారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి పలు వివరాలు రాబట్టినట్లు సమాచారం. పారిపోదామంటే.. స్వాతికి సుధాకర్ రెడ్డి అంటే ఇష్టం లేదని, ఆమె ఒత్తిడి, ప్రోద్బలంతోనే పథకం ప్రకారం అతడిని హతమార్చామని రాజేశ్ హైదరాబాద్లో మీడియా తో చెప్పాడు. పోలీసుల విచారణలో రాజేశ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం ఎక్కడికైనా పారిపోదామని స్వాతిని రాజేశ్ కోరగా పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రాలేనని చెప్పింది. గత నెల 26న స్వాతి, రాజేశ్ కలసి తిరగడాన్ని సుధాకర్రెడ్డి చూశాక వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అదేరోజు రాత్రి సుధాకర్రెడ్డిని చంపాలని స్వాతి పథకం పన్నింది. దీంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. 27న తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తలపై రాడ్తో బాది హత్య చేశారు. రాజేశ్ను డ్రైవర్గా ఇంటి యజమానికి స్వాతి పరిచయం చేసింది. తాము ఈ నేరం నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపై చర్చించారు. సుధాకర్రెడ్డి స్థానంలో రాజేశ్ ఉండేలా స్వాతి ప్లాస్టిక్ సర్జరీ ఆలోచన చెప్పగా.. ముఖానికి కొన్ని రసాయనాలు పూసుకుని స్వాతి చున్నీపై పెట్రోల్ వేసుకుని రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. మరో కారు అద్దెకు తీసుకుని హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో సుధాకర్రెడ్డిపై యాసిడ్ దాడి జరిగిందని స్వాతి బంధువులకు ఫోన్లో తెలిపింది. కాగా, హత్య కేసులో రాజేశ్ వాడిన రాడ్ను, మత్తు ఇంజక్షన్ల సిరంజీలను, రాజేశ్ తల వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మత్తు ఇంజక్షన్ సరఫరా చేసినట్లుగా భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్ను శుక్రవారం రిమాండ్కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాతి.. ఖైదీ నంబర్ 687 మహబూబ్నగర్ క్రైం: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డి హత్య కేసులో నిందితురాలైన ఆయన భార్య స్వాతికి జైలులో అధికారులు 687 నంబర్ కేటాయించారు. 13 మంది ఖైదీలతో పాటు లాకప్లో ఆమెను ఉంచారు. జైలులో ఎలాంటి ఆందోళన లేకుండా గడిపినట్లు సమాచారం. ఉదయం పూట యోగా చేసిన స్వాతి.. అనంతరం జైలులోని నిరక్షరాస్యులకు అక్షరాలు దిద్దించినట్లు తెలిసింది. -
భార్య చేతిలోనే కడతేరాడు
బుచ్చెయ్యపేట (చోడవరం): మండలంలోని చిట్టియ్యపాలెం గ్రామానికి చెందిన అర్రెపు నాగేష్(40) భార్య చేతిలోనే హత్యకు గురయ్యాడు. తాగొచ్చి తనపై గునపాంతో దాడి చేయగా, తప్పించుకుని అదే గునపంతో తలపై కొట్టడంతో చనిపోయాడంటూ భార్య పారపల్లి మాణిక్యం పోలీసులు ఎదుట ఒప్పుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిట్టియ్యపాలేనికి చెందిన నాగేష్తో రాజాం గ్రామానికి చెందిన పారపల్లి మాణిక్యంకు పదిహేనేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచీ రోజూ భర్త తాగొచ్చి వేధించడమే కాక అక్రమ సంబంధాలు అట్టకట్టేవాడని, కష్టపడి సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చుపెట్టగా ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేసేవాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ నేపథ్యంలో కూలి పనుల కోసం మద్రాసు వెళ్లిన నాగేష్ దీపావళి, చవితి పండగ కోసం ఇటీవలే చిట్టియ్యపాలెం వచ్చాడు. శనివారం రాత్రి వరకు అత్తారిల్లు రాజాంలో ఉన్నాడు. ఆ రాత్రి తాగొచ్చిన నాగేష్ను కూలి డబ్బులు ఇవ్వాలని భార్య మాణిక్యం అడగడంతో గొడవకు దిగాడు. తీరా ఆదివారం ఉదయానికి చిట్టియ్యపాలెంలో తన ఇంటి ముందు శవమై కనిపించాడు. స్థానికుల ఫిర్యాదుతో... నాగేష్ మృతదేహానికి ఉదయమే భార్య దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమవ్వగా స్థానికులు నాగేష్ ఒంటిపై గాయాలుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అనకాపల్లి డీఎస్పీ కె.వి. రమణ, చోడవరం సీఐ ఎం.శ్రీనివాసరావు, బుచ్చెయ్యపేట ఎస్ఐ బి, కృష్ణారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి మాణిక్యాన్ని నిలదీశారు. దీంతో జరిగిన సంఘటనను వివరించింది. శనివారం రాత్రి కూలి డబ్బులు ఇవ్వాలని తన భర్త నాగేష్ను అడగగా తాగొచ్చి గొడవకు దిగడమే కాక గునపంతో తనపై దాడి చేస్తుండగా తప్పించుకుని, కోపంలో అదే గునపంతో తన భర్త తలపై కొట్టగా మృతి చెందాడని చెప్పింది. తర్వాత అర్ధరాత్రి వేళ భర్త శవాన్ని చిట్టియ్యపాలెం తరలించినట్లు, తన తల్లి పారపల్లి ముసలమ్మ సహకరించినట్లు చెప్పింది. కాగా, మాణిక్యం, నాగేష్ దంపతులకు 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల కుమార్తె ఉంది. మృతుడు నాగేష్కు తల్లిదండ్రులు లేకపోవడంతో అతని చిన్నాన్న సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహానికి శవ పం చనామా జరిపించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మాణిక్యంతోపాటు, ఆమె తల్లి ముసలమ్మలను అదుపులోకి తీసికొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వివాహేతర సంబంధం వద్దన్నాడని..భర్త హతం
పాల్వంచ: ఖమ్మంలో దారుణం జరిగింది. చెడు తిరుగుళ్లు మానేయాలని మందలించిన భర్తపై కోపం పెంచుకున్న భార్య అతన్ని గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గోపాలకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య రాములమ్మ అదే కాలనీకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన గోపాలకృష్ణ తీరు మార్చుకోవాలని మందలించాడు. అయినా లాభం లేకపోయింది. దీంతో భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. దీనిపై రెండు రోజులుగా భార్య,భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతుండగా.. శుక్రవారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అదును చూసి గొడ్డలితో దాడి చేసి హతమార్చిన రాములమ్మ అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాములమ్మతో పాటు, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
భర్తను హత్యచేసిన భార్యకు జీవితఖైదు
అహ్మదాబాద్: శృంగారానికి నిరాకరించాడని భర్తను హతమార్చిన గుజరాత్ మహిళకు అహ్మదాబాద్ సిటీ కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన విమ్లా వాఘేలా(54)కు యావజ్జీవ కారాగారంతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి యుఎం భట్ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో 6 నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. 2013, నవంబర్ 2న నోబెల్ నగర్ లోని తనింట్లో భర్త నరసిన్హ్ తో గొడవపడి అతడిని హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. శృంగారానికి నిరాకరించడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె అనుమానించేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన ఆమె కర్రతో భర్తపై దాడి చేసి హత్య చేసింది. తర్వాత ఇంటికి తాళం వేసి సర్దార్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లి తన భర్త హత్యకు గురైనట్టు ఫిర్యాదు చేసింది. ఆమే హత్య చేసినట్టు పోలీసులు తర్వాత గుర్తించి అరెస్ట్ చేశారు. -
పడగవిప్పిన పాతకక్షలు
- మహిళను నరికి చంపిన యువకుడు - అడ్డుకోబోయిన భర్తకు తీవ్రగాయాలు సుల్తాన్బజార్: పాత కక్షలు మహిళ ఉసురు తీశాయి. ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో భార్య మృతి చెందగా...అడ్డుకున్న భర్తకూ తీవ్రగాయాలయ్యాయి. సుల్తాన్బజార్ ఠాణా పరిధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సుల్తాన్బజార్ ఇన్ స్పెక్టర్ శివశంకర్, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం.... కోఠి పుత్లిబౌలీ రంగ్మహాల్ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణంలో ఆనంద్దాస్, సోనిబాయి(34) దంపతులు ముగ్గురు కుమారులతో కలిసి ఉంటున్నారు. ఆనంద్దాస్ అదే గుడిలో పూజారి. ఇదిలా ఉండగా... గతంలో తన పెదనాన్న తులసీరామ్ యాదవ్ను సోనిబాయి హత్య చేసిందని మారేడుపల్లి వాల్మీకినగర్కు చెందిన లకన్యాదవ్(24) ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 7 గంటలకు లకన్ కత్తి వెంటబెట్టుకొని సోనిబాయిని హత్య చేసేందుకు రంగ్మహాల్ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ ఆలయానికి చేరుకున్నాడు. వాకిలి ఊడుస్తున్న సోనిబాయి మెడపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆమె అరుస్తూ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా పట్టుకొని మారీ చాతి, చేతులు, మెడ, కడుపు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. బాత్రూంలో స్నానం చేస్తున్న భర్త ఆనంద్దాస్ భార్య అరుపులు విని బయటకు వచ్చి లకన్ను అడ్డుకోబోగా.. అతడిపై కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. తల్లిదండ్రుల అరుపులు విని పక్కరూంలో నిద్రిస్తున్న వారి కుమారుడు కూల్దీప్, పక్కనే అద్దెకుండే ఆటో డ్రైవర్ సాయి పరుగెత్తుకు రావడంతో లకన్ కత్తితో అక్కడి నుంచి పరుగుతీశాడు. సాయి అతడిని వెంబడిస్తుండగా చూసిన పోలీసులు లకన్ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. సోనిబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు, తీవ్రంగా గాయపడ్డ ఆనంద్దాస్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్సపొందుతున్నాడు. సుల్తాన్బజార్ ఏసీపీ రావుల గిరిధర్, ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్ఐ బాల్రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్తి వివాదంలో గతంలో హత్య.. ఆస్తి వివాదం కారణంగా 2009లో లకన్యాదవ్ బాబాయి తుల్జారామ్ను అతని సోదరుడు కిషన్తో కలిసి దూరపుబంధువు (వరుసకు అత్త) అయిన సోనిబాయి హత్య చేసింది. మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి జడ్చర్ల ప్రాంతంలో పడేశారు. ఈ కేసులో సోనిబాయి, కిషన్ ప్రధాన నిందితులు. కిషన్ పరారీలో ఉండటంతో ఈ కేసు చాదర్ఘాట్ పోలీసుస్టేషన్లో పెండింగ్లో ఉంది. తన బాబాయిని హత్య చేసిన సోని బాయిని చంపాలని లకన్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. కన్నీరు మున్నీరైన కుమారులు.. తన కళ్లముందే తల్లిని విచక్షణారహితంగా పొడిచి చంపుతున్న దృశ్యాన్ని చూసిన కుమారుడు కుల్దీప్ షాక్కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకొని ఇసామియాబజార్లో ఉండే బంధువులకు సమాచారం అందించడంతో పాటు హాస్టల్లో ఉన్న తమ్ముళ్లను తీసుకొచ్చాడు. మృతదేహాన్ని చూసి సోనిబాయి కుమారులు రోదించిన తీరు అక్కడివారి హృదయాలను కలిచివేసింది. దర్జాగా తిరుగుతున్నారనే: లకన్ తుల్జారామ్ బాబాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆస్తి విషయంలో అత్త సోనిబాయి, బాబాయి కిషన్ కలిసి దారుణంగా చంపేసి దర్జాగా బయట తిరుగుతున్నారు. అందుకే సోనిబాయిని చంపేశా. ఆమె భర్త ఆనంద్దాస్,అతని కొడుకు కుల్దీప్పై నాకు ఎలాంటి పగలేదు. ఆనంద్దాస్ అడ్డం రావాడంతో అతడికి గాయాలయ్యాయి. -
భర్తను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన భార్య!
వడోదర: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్తను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిందో భార్య. నాలుగు రోజుల క్రితం గుజరాత్లోని నర్మదా జిల్లాలోని కెవాడియా పట్టణంలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ ముఖేశ్ ఎస్ బారియా, సంగీత భార్యా భర్తలు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ముఖేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య సంగీత ఎప్పుడూ అతనితో ఘర్షణ పడుతూ ఉండేది. ఈ క్రమంలోనే బుధవారం కూడా భర్తతో గొడవపడ్డ సంగీత క్రికెట్ బ్యాట్తో ముఖేశ్ను పలుమార్లు కొట్టింది. అయితే తన భర్త ఇంటి దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని తానే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ముఖేశ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. పోస్ట్మార్టం రిపోర్టులో హత్య అని తేలడంతో పోలీసులు సంగీతను అరెస్టు చేశారు. -
పట్టపగలే ‘పాప'౦
సొంతంగా ఎగరడానికి బలం చాలని లేతరెక్కలు.. తల్లిపక్షి తెచ్చి నోటపెడితే తప్ప మేత కూడా తినలేని కూనలు.. ఉన్నట్టుండి ఆ తల్లి వేటగాడి బాణానికి బలైతే.. ఆ వేటగాడు మరెవరో కాక జన్మనిచ్చిన తండ్రే అయితే.. ఆ చిరుహృదయాల్లో ఎంత దుఃఖపు దావాగ్ని రగులుకుంటుంది? తమను కంటిని రెప్పలా కాచుకునే తల్లిని పోగొట్టుకున్న వేళ.. ఆ పసికళ్లకు పట్టపగలే ఎంత కటిక చీకటి కమ్ముకున్నట్టు అనిపిస్తుంది? ‘అమ్మా!’ అంటూ ఆర్తిగా తాము మెడను వాటేసుకుంటే.. ‘అమ్మలూ’ అంటూ లాలించిన అమ్మే.. ఆ మెడ తెగి, అమ్మోరికి బలి ఇచ్చిన మేకలా నేలపై నిర్జీవంగా పడి ఉన్న వేళ.. ఆ బిడ్డల మనసులు పిడుగులు పడ్డ కొలనుల్లా ఎంత కల్లోలితమై ఉంటాయి? తమకు రక్తం పంచి ఇచ్చిన వాడే.. తమకు పాలిచ్చి పెంచిన తల్లిని కడతేర్చి.. నెత్తురోడే కత్తితో కనిపించిన వేళ.. ఆ చిగురుటాకులు ఎంత కంపించి ఉంటాయి? గురువారం రాజమండ్రి క్వారీ ఏరియాలో భార్యను వెంటాడి వెంటాడి నరికి చంపాడో అనుమానపు మగాడు. ఆ దారుణంతో.. గుండెల్లో ఏకకాలంలో సుడులు తిరిగే దుఃఖం, భీతి, నిస్సహాయత, విహ్వలతలు ముఖాల్లో ప్రతిఫలిస్తుండగా.. ఆ దంపతుల బిడ్డలు.. వైష్ణవి, అనిత ఇలా రోదిస్తుంటే.. చూసిన ప్రతి ఒక్కరికీ గుండె కలుక్కుమంది. కళ్లు జలజలా వర్షించాయి. కంబాలచెరువు, న్యూస్లైన్ :అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను విచక్షణారహితంగా నరికి చంపాడు. రాజమండ్రిలోని చెరుకూరి సుబ్బారావునగర్లో గురువారం పట్టపగలు ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్నగర్కు చెందిన గోవిందుకు సింహాచల్నగర్కు చెందిన పాప(30)కు ఐదే ళ్లక్రితం ప్రేమ వివాహమైంది. గోవిందు బీరువాల కంపెనీలో పనిచేస్తుంటాడు. వీరికి అనిత(4), వైష్ణవి(2) అనే కుమార్తెలున్నారు. ఇటీవల గోవిందు నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. దీంతో పాప సింహాచల్నగర్లోని అన్నవద్ద పిల్లలతో ఉంటోంది. అనంతరం పెద్దలు భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చి పాపను కాపురానికి పంపారు. అయినా గోవిందు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా పాప వేరే వ్యక్తితో మాట్లాడడం చూసిన గోవిందు అనుమానం పెంచుకున్నాడు. కత్తి పట్టుకుని గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఆమె పనిచేస్తున్న ఇంటికి వెళ్లాడు. అప్పడే పిల్లల కోసం అన్నం పట్టుకుని పాప బయటకు వచ్చింది. భర్తను చూసి వెంటనే లోపలకు పరిగెత్తింది. గోవిందు ఆమె జట్టు పట్టుకు ని బయటకు లాగి కత్తితో మెడపై నరికాడు. దీంతో పాప అక్కడికక్క డే మృతి చెందిం ది. అక్కడే రాళ్ల పనిచేసుకుంటున్న కొందరు భయంతో పరుగులు తీశారు. గోవిందు కత్తిని పక్కనే ఉన్న పొదల్లోకి విసిరి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. మూడో పట్టణ సీఐ రమేష్, ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పాప ఇద్దరు పిల్లలు అమ్మా అంటూ విలపించడం చూసి అందరి కళ్లు చమర్చాయి.