Buggana Rajendranath Reddy
-
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే ఎందుకు పరిమితమైంది?: బుగ్గన
కర్నూలు (టౌన్): పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కాదా అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన చేతగానితనం, పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతోందన్నది నిజం కాదా అని నిలదీశారు. 2025–26 కేంద్ర బడ్జెట్ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిoచాల్సి ఉంది. ఆ విధంగా నిరి్మస్తేనే పోలవరం ద్వారా 200 టీఎంసీల నీరు లభిస్తుంది. దీనివల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, విశాఖ నగరానికి, 600 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలు చేకూరాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. అయితే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు. దీనిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి తెలీకుండానే కేంద్రం పోలవరం ఎత్తును 41.15 అడుగులకు ఖరారు చేస్తుందా? నిజానికి.. 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే దానిని సరిదిద్దుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిన విషయం నిజం కాదా? ఇక రూ.12,500 కోట్లు సాధించామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించింది కాదా!? ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వచేస్తామని చెప్పాం కదా.. తర్వాత రెండేళ్లలో నీటినిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి ప్రాజెక్టు ఎత్తున 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. ఇది ప్రాజెక్టు మాన్యువల్లోనూ ఉందా లేదా!? కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేస్తామని బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. బడ్జెట్ కాపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ‘నిర్మాణం’ అన్న పదానికి బదులు ప్రాజెక్టు పూర్తి (కంప్లీషన్)కి అని ఎందుకు పేర్కొన్నారు? దీని వెనకున్న మతలబు ఏంటి? ఇకపోతే.. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికీ ఎందుకు నిధులు కోరలేదు? 16 మంది టీడీపీ ఎంపీలున్నా బాబు ఎందుకు విఫలమయ్యారు? ఇక ఎన్డీఏ కూటమిలో 16 మంది టీడీపీ ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో.. నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? ఈ విషయంలో ఆయన ఏమాత్రం చొరవ చూపలేదన్నది నిజం కాదా? వాస్తవానికి.. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది కదా! అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి చంద్రబాబు ఎందుకు నిధులు సాధించలేకపోయారు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారా లేదా? ఇక గతంలో వైఎస్సార్సీపీకి 23 మంది ఎంపీలున్నారని, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పదేపదే విమర్శించారు కదా! నిజానికి.. అప్పుడు కేంద్రానికి వైఎస్సార్సీపీ మద్దతు అవసరంలేదు. కానీ, ప్రస్తుతం టీడీపీ మద్దతుపై కేంద్రం ఆధారపడి ఉంది. దీనిని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్దఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నా ఇప్పుడాయన ఎందుకు విఫలమయ్యారు? అదే కేవలం 12 మంది ఎంపీలతోనే బిహార్ రాష్ట్రం ఎక్కువ నిధులు సాధించి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఎలా దక్కించుకుంది? ఇటీవల నీతి ఆయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తలసరి ఆదాయంపై ఆయన విశ్లేషణను చూసి ఒక ఎన్ఆర్ఐ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తిచూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23లో రూ.2.20 లక్షలకు చేరింది. చంద్రబాబు హయాం కంటే జగన్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది నిజమా కాదా? సీఎంగా ఉన్న వ్యక్తే తప్పుడు లెక్కలు చెబితే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారా? వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూఇక వైఎస్ జగన్ హయాంలో అమలుచేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరిస్తోంది. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ రాబోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుచేసి బ్రాడ్బాండ్ సర్విస్ అందించాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశాం. టీడీపీ, ఎల్లో మీడియా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాబోయే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది కదా.. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు కదా.. ఆనాడు మెడికల్ సీట్ల ఆవశ్యకతను మాజీ సీఎం జగన్ గుర్తించి రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి గత ఏడాది ఐదింటిని ప్రారంభించారు. దీనివల్ల 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయా లేదా? అన్ని కళాశాలలు పూర్తయితే 2,450 సీట్లు దక్కేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ సీట్ల సాధనలో ఎందుకు చొరవ చూపట్లేదు? రాష్ట్ర విద్యార్థులకు ఎందుకు ఇంతలా నష్టం చేకూరుస్తున్నారు?. -
బడ్జెట్లో అన్యాయం.. ఏపీకి చంద్రబాబు ఏం తీసుకొచ్చారు?: బుగ్గన
సాక్షి, కర్నూలు: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిల్చారని గుర్తు చేశారు. చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవం ప్రాజెక్టు ఎత్తుపైనా సీఎం రాజీపడుతున్నారని, దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన బుగ్గన ధ్వజమెత్తారు.బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:చంద్రబాబు దారుణ వైఫల్యం:ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆయన ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు. ఫలితంగా ఈ బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి దాదాపు మొండిచేయి చూపింది. నిజానికి టీడీపీ మద్దతులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది. అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి ఏ మాత్రం నిధులు దక్కించుకుందని చూస్తే తీవ్ర నిరాశే కనిపిస్తోంది.నాడు వైఎస్సార్సీపీపై నిందలు:గతంలో కేంద్ర బడ్జెట్ సందర్భాల్లో.. వైయస్సార్సీపీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పలుసార్లు పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే అప్పుడు కేంద్రానికి మా సీట్లతో, మా మద్దతుతో ఏ మాత్రం అవసరం లేని పరిస్థితి ఉంది. కానీ నేడు కేంద్రానికి ఎపీకి చెందిన ఎంపీల మద్దతు చాలా కీలకం. దీన్ని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో టీడీపీ ఉంది. కేవలం 12 మంది ఎంపీలు ఉన్న జేడీయూ బీహార్ రాష్ట్రానికి ఎన్నో సాధించగలిగితే, 16 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకెంత సాధించాలి? కానీ ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు.పోలవరం ప్రాజెక్టుకూ నష్టం:పోలవరం ప్రాజెక్ట్ను 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్ను 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉంది. అలా నిర్మిస్తేనే పోలవరం ద్వారా 200 టిఎంసీల నీరు లభిస్తుంది. ఈ నీటి వల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ నగరానికి తాగునీరు, 600 గ్రామాలకు నీరు అందుతుంది.ఇన్ని ఉపయోగాలు అందాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అంగీకరిస్తోందా? కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే పోలవరం ఎత్తు 41.15 అడుగులే అని కేంద్రం ఎలా ఖరారు చేస్తుంది? నాడు 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే, దాన్ని సరిదిద్దేందుకు మా ప్రభుత్వానికి నాలుగేళ్ళు పట్టింది. ఈరోజు గొప్పగా రూ.12,500 కోట్లు కేంద్రం ద్వారా వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మా ప్రభుత్వం సాధించినదే. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేస్తాం, తరువాత రెండేళ్లలో నీటి నిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేసుకుంటూ పోయి, ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. అంటే పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది.అది ప్రాజెక్టు మాన్యువల్లోనూ ఉంది. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్ను 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం పూర్తి కోసం అంటూ బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్కు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి కూడా నిధులు కోరలేదు? ఈ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు.బీహార్కు అత్యధిక ప్రాధాన్యం:టీడీపీ కంటే తక్కువగా 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్న జేడీయూ, తమ రాష్ట్రం బీహార్కు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం దక్కించుకుంది. బీహార్లో మఖనా బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, పాత పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ, మిథులాంచల్కు చెందిన కోషీ కెనాల్ అభివృద్ధి, పాట్నా ఐఐటీ అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీహార్కు సంబంధించి గత బడ్జెట్లో పూర్వోదయ ప్రాంతంలోని గయలో అమృత్సర్–కోల్కత్తా పారిశ్రామికవాడ, పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్వే, బక్సర్–బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, బోద్ గయా–రాజ్ ఘీర్–వైశాలీ–దర్భాంగ, బక్సర్లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో రెండు లైన్ల వంతెన సాధించుకున్నారు. అలాగే 2400 మెగావాట్ల పీర్ పాంటీ పవర్ ప్రాజెక్ట్స్కు రూ.21,400 కోట్లు సాధించుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు, ఎయిర్ పోర్ట్స్, బీహార్లో శాశ్వతమైన నిర్మాణ పనులకు క్యాపిటల్ వ్యయం కోసం కేంద్రం నుంచి సాయం దక్కించుకున్నారు. టీడీపీ మాదిరిగా జేడీయూ కూడా ఎన్డీఏలో భాగస్వామి. టీడీపీ కంటే ఆ పార్టీకి తక్కువ మంది ఎంపీలు. అయినా బడ్జెట్లో అధిక శాతం నిధులు దక్కించుకుంది.తలసరి ఆదాయంపైనా చంద్రబాబు తప్పుడు లెక్కలు:ఇటీవల నీతి అయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తలసరి ఆదాయంపై చెప్పిన విశ్లేషణను విన్న ఒక ఎన్ఆర్ఐ.. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తి చూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23 నాటికి రూ.2.20 లక్షలు అయ్యింది. అంటే చంద్రబాబు హయాం కంటే వైయస్ జగన్ గారి హయాంలో తలసరి ఆదాయం పెరిగింది.సీఎంగా ఉన్న వ్యక్తే ఇలా తప్పుడు లెక్కలు చెబితే, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా వస్తారా? నీతి అయోగ్ నివేదికను చూస్తే 2014–19 వరకు చంద్రబాబు ప్రభుత్వ పాలన, 2019–24 వైయస్ జగన్ పాలనను పోల్చడం అనేది హేతుబద్దంగా ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం తన పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని, జగన్ గారి పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని వాటిని పోల్చడం చూస్తుంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వారు ఇలా కూడా చేస్తారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూ..:వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరించబోతోంది. బడ్జెట్ కేటాయింపులు, విధానాలు చూస్తే అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశీ భాగస్వామ్యంతో దేశంలో 5 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేసి, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అందించాం. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్లు పంపిణీ చేశాం. దాన్ని నాడు టీడీపీతో పాటు, ఎల్లో మీడియా తీవ్రంగా తప్పు పట్టాయి, ట్యాబ్ల వల్ల విద్యార్థులు చెడిపోతున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చింది. ఇప్పుడు సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అవే విధానాలు అమలు చేస్తోంది. విద్యార్ధులకు బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి తెస్తున్నారు. మరి దీన్ని కూటమి పార్టీలు ఎలా చూస్తున్నాయి? ఇది కూడా తప్పేనని ఇప్పుడు విమర్శించగలరా?మెడికల్ కాలేజీలు.. సీట్లు:రాబోయే 5 ఏళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర బడ్జెట్లో వెల్లడించారు. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఆవశ్యకత గుర్తించిన నాటి సీఎం శ్రీ వైయస్ జగన్, ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత విద్యా సంవత్సరంలోనే పూర్తి చేశారు. వాటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రాగా, అన్ని కాలేజీలు పూరై్త ఉంటే, మొత్తం 2450 మెడికల్ సీట్లు రాష్ట్రానికి దక్కేవి.అయితే ఆ కాలేజీల నిర్మాణం పూరై్తతే జగన్గారికి మంచి పేరొస్తుందని కుట్ర చేసిన చంద్రబాబు, ఇప్పుడు వాటన్నింటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. గత విద్యా సంవత్సరంలో పులివెందుల మెడికల్ కాలేజీలో అనుమతి ఇచ్చిన సీట్లు కూడా వద్దని చెప్పడంతో పాటు, కొత్త కాలేజీలకు అనుమతి కోరుతూ, ఈ ఏడాది జాతీయ వైద్య మండలికి లేఖ రాయొద్దని నిర్ణయించారు. ఆ వి«ధంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, సీట్లకు కేంద్రం ఒకవైపు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇవే కాలేజీలను పూర్తి చేసుకుంటూ పోతే కేంద్రం ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 10 వేల సీట్లలో నాలుగో భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరేవి.ఆదాయపన్నుతో మధ్య తరగతికి ఊరట:మధ్యతరగతి వారికి మేలు చేసేలా పన్ను విధానాలను తీసుకువచ్చారు. ఆదాయపన్నుకు సంబంధించి గత ఏడాది రూ.3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. ఈ ఏడాది రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.12 లక్షల ఆదాయం వరకు రిబేట్ రూపంలో ఆదాయపన్ను నుంచి ఉపశమనం లభించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వేతన జీవులకు, మధ్యతరగతి వారికి మేలు జరుగుతుంది.కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూస్తే..:దేశంలో తొలిసారి రూ.50,65,365 కోట్లు కేంద్ర బడ్జెట్ దాటింది. దీనిలో రెవెన్యూ రిసీట్స్ రూ.34,20,409 కోట్లు కాగా, క్యాపిటల్ రిసీట్స్ రూ.16,44,936 కోట్లు. రెవెన్యూ రాబడి, అప్పు రెండూ కలిపితే రూ.50 లక్షల కోట్లు దాటింది. దీనిలో క్యాపిటల్ వ్యయం రూ.11,21,090 కోట్లుగా చూపించారు. రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకుంటే రూ.15,48,282 కోట్లు. అదే గత ఏడాది రివైజ్డ్ అంచనాలను చూస్తే ఖర్చు రూ.47,16,487 కోట్లుగా ఉంది. మరోవైపు రెవెన్యూ రాబడి రూ.30,00,087 కోట్లుగా చూపించారు. అప్పు మాత్రం దాదాపు రూ.16,28,527 కోట్లు ఉంది. అంటే అప్పులు య«థాతథంగా కొనసాగిస్తున్నారు. వాస్తవాలు చూస్తే కేంద్ర బడ్జెట్లో అప్పులు పెద్దగా పెరగలేదు. ఇది మంచి పరిణామం.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాబడి, ఖర్చులు మాత్రం దాదాపు మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.10.18,000 కోట్లు అయితే, ఈ ఏడాది రూ.11,21,090 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు లక్ష కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నారు. అలాగే రాష్ట్రాలకు సహయం అందించే దాన్ని కూడా కలుపుకుంటే ఈ బడ్జెట్లో గత ఏడాదితో పోలిస్తే మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది ఆ మొత్తం రూ.15,69,527 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.15,68,000 కోట్లుగా ఉంది. అంటే ద్రవ్యలోటు, స్థూల ఉత్పత్తిని నిష్పత్తిగా చూస్తూ.. గత ఏడాది అది 4.8 ఉంటే ఈ ఏడాది 4.4 గా బడ్జెట్లో ప్రతిపాదించడం మంచి పరిణామం. కోవిడ్ నుంచి ఇది తగ్గుతూ వచ్చింది.బడ్జెట్లో నాలుగు విభాగాలకు ప్రాధాన్యత:కేంద్ర బడ్జెట్ లో నాలుగు భాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఇ, పెట్టుబడి, ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ పరంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త స్కీం ప్రారంభించబోతున్నారు. 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని అమలు చేయబోతున్నారు. స్వల్పకాలిక రుణాలను రూ.5 లక్షలకు పెంచనున్నారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి క్రెడిట్కార్డును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నారు.తొలిసారిగా పరిశ్రమను పెట్టే వారికి దీర్ఘకాలిక అప్పుగా టర్మ్లోన్ను రూ.2 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. గ్యారెంటీ లేకుండా ఇచ్చే అప్పును ఎంఎస్ఎంఈ లకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచారు. స్టార్టప్లకు కూడా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు. ఇది మంచి నిర్ణయం. ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేసే పరిమితిని కూడా పెంచబోతున్నారు. భారతీయ భాషా పుస్తక్ స్కీం కింద ఇంగ్లిష్ నుంచి వారి స్థానిక భాషల్లో అర్థం చేసుకునే విధంగా ఒక పథకం అమలు చేయబోతున్నారు.దేశంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల కోసం స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్రాలకు రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేయడం మంచిది. రాబోయే 10 ఏళ్లలో కొత్తగా 120 విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. భారత ట్రేడ్నెట్ కింద ఎగుమతిదార్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇంకా36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కు పన్ను మినహాయింపు ఇవ్వడం సంతోషకరమని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. -
మీది విజన్.. మాది యాక్షన్.. కూటమిపై బుగ్గన కామెంట్స్
-
ఆరు నెలలు అయ్యింది.. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది
-
చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: అప్పుడు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు 1998లో కూడా విజన్-2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా?. మన మేనిఫెస్టోనే మన విజన్. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి నీకు 15వేలు, నీకు 18వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. ఆరు నెలలు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది?.పథకాల అమలేదీ..యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా.. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు.. అది కూడా ఇవ్వడం లేదు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు.. అది ఏమైంది?. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ.12,450 కోట్లు అవసరం. కానీ, కేవలం రూ.5,386కోట్లు కేటాయించారు. అంటే, తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి రూ.3,955 కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ.895 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి రూ.37,313 కోట్లు అవసరం.. కానీ, కేటాయింపులు మాత్రం సున్నా. దీంతో, అది కూడా లేనట్టే.ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ?కూటమిలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు.. కాన్నీ, ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్లిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటకు తెస్తామన్నారు. అలాగే, బెల్టు షాపులు రద్దు అన్నారు.. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా?.అప్పుల్లో బాబుదే రికార్డ్..2014-19 మధ్యలో కాపులకు ఐదేళ్లలో 5వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు. ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నాడు.. ఇచ్చాడా?. హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్ డ్యాకుమెంట్ రిలీజ్ చేస్తున్నాడు. జూన్లో రూ.6వేల కోట్ల అప్పు. జూలైలో రూ.10వేల కోట్లు, ఆగస్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబర్లో రూ.4వేల కోట్లు, అక్టోబర్లో రూ.6వేల కోట్లు, నవంబర్లో రూ.4వేల కోట్లు, డిసెంబర్లో రూ.9వేల కోట్లు అప్పులు చేశారు. ఒకేసారి రూ.5వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు. వైఎస్సార్సీపీ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు.. మీరు ఏకంగా 22.6 శాతం అప్పులు చేశారు’ అని చెప్పారు. -
ఆంధ్రప్రదేవ్ అప్పులపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు.. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థికమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డు అవుతుందని, నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, కాగ్ పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని బాబు ప్రభుత్వం కూడా ఇదే చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.అలాగే, పయ్యావుల చెప్పింది నిజమా? లేక సీఎం చంద్రబాబు చెప్పింది నిజమా లేదా టీడీపీ మాజీ ఆర్థికమంత్రి యనమల చెప్పింది నిజమా.. అనేది ఒకసారి ముగ్గురు ఒకచోట కూర్చుని ఒక అంకెకు వస్తే మంచిదని బుగ్గన ఎద్దేవా చేశారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లంటూ అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనని ఆయనన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా.. ఇదేమైనా గండికోట రహస్యమా.. అని ప్రశి్నంచారు. ‘స్కాములన్నీ మీరే చేశారు. తండ్రీ కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారు.. బడ్జెట్లో సూపర్–6, సూపర్–7 పథకాలకు కేటాయింపులు ఎక్కడ..’ అని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. స్కీములన్నింటికీ రికార్డులున్నాయివైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం సున్నా అని, స్కీములన్నీ స్కాములేనంటూ చంద్రబాబు బాధ్యతలేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కీములన్నీ డీబీటీ ద్వారానే అమలుచేసింది. వీటన్నింటికీ రికార్డులున్నాయి. మరి స్కాములెక్కడుంటాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం లైసెన్సులు, ఇసుక టెండర్లలో యథేచ్ఛగా దోపిడీ సాగించారు. తండ్రి కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకున్నారు. మైనింగ్ కాంట్రాక్టులు కూడా దోపిడీయే. ఏ స్కాములో చూసినా మీరే కనిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందిగత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.42,188 కోట్లు బకాయిలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటితో ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుంది? వాటినీ పరిగణనలోకి తీసుకున్నా బాబు హయాం కన్నా మేమే తక్కువ అప్పులుచేశాం. బాబు అప్పుల పెరుగుదల 22.63 శాతమైతే మాది 13.57 శాతమేఇక గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక సగటు అప్పుల పెరుగుదల 22.63 శాతం కాగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అది 13.57 శాతమే. దీన్నిబట్టి చూస్తే ఎవరెక్కువ అప్పులు చేశారో తెలుస్తుంది? అలాగే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి రూ.16,400 కోట్లు అప్పులుచేసింది. ఈ అప్పును వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం మినహాయించింది. మరోవైపు.. మూలధన వ్యయం సున్నా అని బాబు, సింగిల్ డిజిట్ అని యనమల చెప్పారు.. కానీ, మొన్నటి బడ్జెట్ డాక్యుమెంట్లోనే మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా చూపెట్టారు. ఇది సున్నా, సింగిల్ డిజిట్ ఎలా అవుతుందో చెప్పాలి. ‘విద్యుత్’పై ఆరోపణల్లోనూ నిజంలేదువిద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్లు నష్టంచేసినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణల్లోనూ నిజంలేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు రూ.6,625 కోట్లు ఉండగా చంద్రబాబు హయాంలో అవి రూ.28,715 కోట్లకు పెరిగాయి. అదే వైఎస్సార్సీపీ హయాంలో 2022–23 నాటికి అవి రూ.29,110 కోట్లే. రూ.395 కోట్లే పెరిగింది.ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి నేతలు... ఇప్పుడు 6 నెలల్లోనే రూ.6,072 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారు. మరో రూ.12,000 కోట్లు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. తలసరి ఆదాయం 2018–19 నాటికి రూ.1,54,031లతో దేశంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే.. 2022–23 నాటికి రూ.2,19,881లతో 15వ స్థానానికి చేరింది. యనమల ఆరోపణలు విచిత్రం.. విడ్డూరంఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల అయితే.. అప్పులపై చాలా అన్యాయంగా అవాస్తవాలు చెప్పారు. నిజానికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లే. ఇక వేస్ అండ్ మీన్స్, ఓవర్డ్రాఫ్ట్ అనేది అన్ని ప్రభుత్వాలు చేసేవే. వాటిని అవసరమైన రోజులు తీసుకోవడం ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తీర్చేయడం జరుగుతుంది. ఇలా తీర్చేసిన అప్పులను కూడా యనమల అప్పులుగా పేర్కొనడం.. విడ్డూరంగాను, విచిత్రంగాను ఉంది. అలాగే, ఆర్థిక విధ్వంసం, అరాచకం జరిగిందని ఆర్థికమంత్రి కేశవ్ అన్నారుగానీ, ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో చూపించలేకపోయారు? చిక్కీలపై బకాయి పెట్టామన్నారు. మరి వాళ్లు కోడిగుడ్లపై బకాయి పెట్టలేదా? రన్నింగ్ బిల్లులు పెండింగ్లో ఉండటం సహజం. ఆదాయం తగ్గలేదు, పెరిగిందిఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 1999–2004 మధ్య బాబు పెంచిన ఆదాయం 12.4 శాతమైతే.. 2004–2009 మధ్య వైఎస్సార్ 21.6 శాతం పెంచారు. తిరిగి 2014–19 మధ్య బాబు ఆరు శాతం పెంచితే 2019–2024 మధ్య జగన్ 16% పెంచారు. సూపర్ సిక్స్లో పావు దీపం తప్ప మిగతా ఏవీ అమలుచేయలేదు. ఎన్నికల ముందు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉండగా అవాస్తవాలు చెబుతూ తప్పులుచేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రతీసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కారు. ఈ వయస్సులో అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పడం చంద్రబాబుకు తగదు. -
ఏపీ అప్పులపై మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన క్లారిటీ
-
అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘లెక్క ఇది.. గుంజీలు ఎవరు తీయాలో ఆలోచించుకో బాబూ?’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. డీబీటీ ద్వారా అబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కాం ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై గతంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. అబద్దాన్ని నిజం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 9.56 లక్షల కోట్లు అప్పులున్నాయని.. తవ్వితే ఇంకెన్ని ఉన్నాయో అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. తవ్వడానికి ఏముంది? ప్రతి కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది ఆడిట్ జరుగుతాయి కదా?. గుంజీలు ఎవరు తీయాలో మీరే ఆలోచించుకోండి’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.‘‘2014-15లో ఓపెన్ మార్కెట్లో ఎక్కువ వడ్డీ పెట్టీ అప్పు తెచ్చుకున్నారు చంద్రబాబు. మాపై అప్పులు ఎక్కువ అయ్యాయని, ఎక్కువ వడ్డీ తో అప్పులు తీసుకున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మాజీ, ప్రస్తుత ఆర్ధిక మంత్రికి లెక్కలు అర్థం కావా?’’ అంటూ బుగ్గన ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!‘‘2014-19లో ట్రూ అప్ చార్జీలు రూ.6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగింది. మా ప్రభుత్వ హయాంలో 2,300 కోట్ల మాత్రమే వినియోగదారులపై భారం వేశాం. తాజాగా 5 నెలల్లోనే రూ.6,770 కోట్లు వినియోగదారులపై భారం మోపారు. ఇంకా రూ.12 వేల కోట్ల ట్రూ అప్ చార్జీల భారం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.’’ అని బుగ్గన నిప్పులు చెరిగారు. -
వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్
-
Buggana: అప్పులతో అమరావతి సాధ్యమా?
-
AP: ఈ బడ్జెట్ అగమ్యగోచరం: బుగ్గన
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా, రూ.41 వేల కోట్లు పెంచుతూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రనౌట్ అయ్యిందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. తాము 2019 మే 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలన్నరలోనే జూలై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కోవిడ్ వంటి ఇబ్బందులున్నప్పటికీ వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చామన్నారు. కానీ.. అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టడానికి ఐదు నెలల సమయం తీసుకున్నారంటూ దెప్పి పొడిచారు.బడ్జెట్ ప్రసంగంలో 21 సార్లు గత ప్రభుత్వమంటూ ప్రస్తావించారని ఎత్తిచూపారు. తీరా బడ్జెట్ చూస్తే అగమ్యగోచరం అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపాలు, లొసుగులను ఎత్తిచూపారు. ‘ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రచారం చేశారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ ప్రచారం చేసి ప్రజలకు ఆశ కల్పించారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాటి ఊసే లేదు’ అని కడిగి పారేశారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? ⇒ 2024–25 వార్షిక బడ్జెట్ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన అంచనాల మేరకు బడ్జెట్ రూ.2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్ మినహా, సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15 వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకం. ⇒ పన్ను రాబడి రూ.24 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. వాస్తవానికి ఆదాయం తగ్గింది. కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పన్నుల ఆదాయంలో దాదాపు 11 శాతం పెరుగుదల నమోదు కాగా, మేలో –2.8 శాతం, జూన్ లో –8.9 శాతం, జూలైలో –5.3 శాతం, ఆగస్టులో –1.9 శాతం, సెప్టెంబర్ లో –4.5 శాతం.. అలా మొత్తం మీద మైనస్ 2 శాతం ఆదాయం నమోదైంది. ఈ నేపథ్యంలో పన్ను రాబడి ఏకంగా రూ.24 వేల కోట్లు ఎలా పెరుగుతుంది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ⇒ జీఎస్టీ ఆదాయంలో రూ.16 వేల కోట్ల నుంచి రూ.21,500 కోట్ల పెరుగుదల ఎలా సా««ధ్యం? స్టాంప్స్–రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.4 వేల కోట్ల నుంచి రూ.9,500 కోట్లు, సేల్స్ ట్యాక్స్ పన్ను రూ.8,500 కోట్ల నుంచి రూ.16 వేల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.8 వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు, ఇతర పన్నులు రూ.2400 కోట్ల నుంచి రూ.5700 కోట్లు వస్తాయని ఎలా అంచనా వేస్తున్నారు? ⇒ తొలి ఆరు నెలల్లో రాబడి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78 వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? నెట్ పబ్లిక్ అకౌంట్.. అంటే ప్రభుత్వం వద్ద ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బును రూ.16 వేల కోట్ల నుంచి రూ.1,800 కోట్లకు తగ్గిస్తాం అంటున్నారు. ఆ ప్రకారం ఉద్యోగులకు పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి అన్నీ కట్టేయాలి. మరి ఈ ఐదు నెలల్లో ఆ పని చేశారా? సూపర్ సిక్స్ పేరుతో మోసం ⇒ యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ⇒తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో స్పష్టంగా కేటాయింపులు లేవు. బీసీ సంక్షేమంలో రూ.2,400 కోట్లు, ఎకనమిక్ వీకర్ సెక్షన్లో రూ.1160 కోట్లు.. ఇలా అన్ని కలిపి చూపినా తల్లికి వందనం పథకానికి రూ.5,300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుంది? ⇒ అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి చెప్పిన ప్రకారం ఆ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. మిగతా రూ.3500 కోట్లు పీఎం కిసాన్ నుంచి వచ్చేది. నిజానికి ఈ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,706 కోట్లు కావాలి. ⇒ దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుంది. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన మిగతా వారందరికీ ఇవ్వరా? వాస్తవాలు ఇలా ఉంటే.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి అన్ని పథకాలు అమలు చేసినట్లు ఎలా చెబుతారు? ⇒ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 2,07,30,000 మందికి ఇవ్వాలి. దీని ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. ⇒ 2014 ఎన్నికల్లో కూడా వ్యవసాయ రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులు, చేనేతలకు సాయం, నిరుద్యోగ భృతి.. ఇలా అన్ని హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. బాబు తీరు మొదటి నుంచీ ఇంతే. (బాబు తీరుపై వైఎస్సార్, రోశయ్యలు మాట్లాడిన వీడియో ప్రదర్శించి చూపారు).మంచి చేస్తే అభాండాలా? ⇒ విద్యుత్ రంగానికి మా హయాంలో 2019–20లో రూ.11,600 కోట్లు, 2020–21లో కోవిడ్ ఇబ్బందుల్లో కూడా రూ.6,110 కోట్లు, 2021–22లో రూ.11,500 కోట్లు, 2022–23లో రూ.18,250 కోట్లు, 2023–24లో ఇంచుమించు రూ.15,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.8,100 కోట్లు మాత్రమే ఇచ్చింది. ⇒ 2014–15 నుంచి 2018–19 వరకు ప్రభుత్వం డిస్కంలకు రూ.31,800 కోట్లకు గాను కేవలం రూ.20,165 కోట్లే కట్టింది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.68 వేల కోట్లకుగాను రూ.62 వేల కోట్లు కట్టింది. ఈ లెక్కన ఎవరికి చిత్తశుద్ధి లేదు? ⇒ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు. పథకాల అమలుపై క్యాలెండర్ ప్రకటించి, పక్కాగా అమలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క జగనన్న అమ్మ ఒడికి రూ.26,067 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.34,378 కోట్లు, చేయూతకు రూ.19,189 కోట్లు, వైఎస్సార్ ఆసరాకు రూ.25,570 కోట్లు అందించాం. ఇలా ప్రతిదీ పక్కాగా అమలు చేశాం.బడ్జెట్ సాక్షిగా అప్పులపై దు్రష్పచారం బట్టబయలు ⇒ 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రాష్ట్ర అప్పులపై అదే పనిగా తీవ్ర దుష్ప్రచారం చేశాయి. రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లని, రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధాలు అచ్చేస్తే.. వాటిని పట్టుకుని శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమోనని చంద్రబాబు దు్రష్ఫచారం చేశారు. అప్పులు అడుక్కోవడానికేనా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు అని 2023 అక్టోబర్ 25న చెప్పిన పురంధేశ్వరి.. 2024 ఏప్రిల్ 7న రాష్ట్ర అప్పులు రూ.12,50,000 కోట్లని ప్రకటించారు. అంటే 5 నెలల్లోనే లక్షన్నర కోట్లు పెంచుతారా? ⇒ అయితే వాస్తవం ఏమిటన్నది బడ్జెట్లో బయట పడింది. రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. 2024 మార్చి 31 నాటికి రూ.4.91 లక్షల కోట్లు, గ్యారంటీ కింద తెచ్చిన అప్పు రూ.1,54,797 కోట్లు.. రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. మరి ఆనాడు ప్రచారం చేసినట్లు రూ.14 లక్షల కోట్ల అప్పు ఏది? అంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడతారా? కార్పొరేషన్ల అప్పులతో ప్రభుత్వానికి ఏం సంబంధం? డిస్కంల అప్పులతో ప్రభుత్వానికి ఎలా సంబంధం? పౌర సరఫరాలు, విద్యుత్ రంగం.. రూ.34 వేల కోట్లు డబుల్ ఎంట్రీ చేశారు. ఔట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్స్, స్కీమ్స్.. ఎవరికో కట్టవలసినవి రూ.1,13,000 కోట్లు. మరి ఇవన్నీ బడ్జెట్లో ఎందుకు చూపలేదు? అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సబబు? చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ⇒ 2023–24 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.4,83,000 కోట్లుగా మేం చూపాం. ఇప్పడు కూటమి ప్రభుత్వ బడ్జెట్లో ఆ అప్పును రూ.4,91,000 కోట్లుగా చూపారు. మరి అలాంటప్పుడు ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు అని ఎలా దు్రష్పచారం చేశారు? వారం కింద కూడా బడ్జెట్ ప్రిపేర్ అవుతుందని తెలిసీ.. చంద్రబాబు ఏపీ అప్పుల గురించి దారుణంగా అబద్ధాలు చెప్పారు. ఇందుకు చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ⇒ 2019–2024 వరకు మేము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో లేకపోయినా, కష్టపడి తిరిగి ఎన్నో సాధించాం. చంద్రబాబు కేంద్రంలో భాగస్వాములై ఏం సాధించారు? అసలు అప్పులు పెంచింది 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. 2014లో రూ.1,32,000 కోట్లుగా ఉన్న అప్పు.. 2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయేటప్పటికి రూ.3,31,000 కోట్లు అయింది. అంటే ఐదేళ్లలో ఏటా సగటున 20 శాతం పెరిగింది. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు రూ.3,31,000 కోట్లు కాగా, మేము 2024లో దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు 14.9 శాతమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలోనే తక్కువ అప్పులు చేశాం. -
చంద్రబాబు, పచ్చ మీడియా ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
-
AP Budget: కూటమి ప్రభుత్వ బడ్జెట్లో అంతా మోసమే
-
Buggana: బడ్జెట్ పెట్టడానికి ఐదు నెలలు ఎందుకు పట్టింది?
-
బడ్జెట్లో పథకాలకు నిధులు సున్నా: బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
సాక్షి,తాడేపల్లి: పథకాలకు కేటాయింపులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్ను రూ.41వేల కోట్లు పెంచిందని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు.కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్పై సోమవారం(నవంబర్ 11)తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటో అప్పో చెప్పలేదు. మైనస్లో ఉన్న మీరు ఆరు నెలల్లో రూ.24 వేల కోట్ల ఆదాయం ఎలా పెంచుతారు. అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి ఇస్తారో చెప్పలేదు. దీనికి బడ్జెట్లో పెట్టింది. కేవలం రూ.1000కోట్లు. ఈ పథకం అమలు చేయాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఊసే లేదు. పథకాలకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గించారు’అని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ప్రెస్మీట్లో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదు నెలలపాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు బడ్జెట్ పెట్టలేదు?ఐదు నెలలపాటు బడ్జెట్ పెట్టకపోవడం గండికోట రహస్యంగా మారింది.గత ప్రభుత్వం" అనే మాటని 21 సార్లు ఉపయోగించారు.మేనిఫెస్టో అమలు చేస్తారని భావించిన వారికి నిరాశ కలిగేలా బడ్జెట్ ఉంది.గత ప్రభుత్వం కంటే రూ.41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఎలాంటి పథకాలు అమలు చేయకుండానే ఇంత ఖర్చు ఎందుకో అర్థం కావడం లేదు.అమరావతి కోసం పెట్టే రూ.15 వేల కోట్ల ఖర్చు అప్పా? గ్రాంటా? ఆ లెక్కలకు క్లారిటీ ఇవ్వలేదు.మా హయాంలో ఆదాయం పెరిగితే చంద్రబాబు హయాంలో మైనస్ వచ్చింది.తల్లికివందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు.ఎవరికీ ఈ పథకాన్ని అమలు చేయకుండానే చేసినట్టు మాట్లాడారు.ఇంతకంటే అన్యాయం ఉంటుందా?రూ.10,706 వేల కోట్లకుపైగా అన్నదాత సుఖీభవకు ఇవ్వాల్సి ఉండగా వెయ్యి కోట్లు మాత్రమే ఇవ్వడమేంటి?మహిళలకు ఉచితబస్సు గురించి ప్రస్తావనే లేదు.కరెంటు సంస్థలకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొడితే మా ప్రభుత్వం చెల్లించింది.కానీ మా ప్రభుత్వం వల్ల కరెంటు సంస్థలకు నష్టాలు వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.గతంలో కూడా రూ. 87వేల కోట్లు రైతురుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.15 వేల కోట్లు చేశారు.డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీలు 21వేల కోట్లు చెల్లించకుండా మోసం చేశారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గొట్టారు.మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి గెలిచారు.2009,2014,2019,2024 లో వరుసగా అవే హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తూ వచ్చారు.అమరావతి ఏ రకంగా గొప్ప నగరమో తెలియదు.ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకుని కడతామంటున్నారు.మా హయాంలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తామో వివరంగా జనానికి తెలిపాం.ఎన్నికల సమయంలో ఆసరా డబ్బు ఇవ్వనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఎల్లోమీడియాలో తెగ వార్తలు రాశారు.మరి ఇప్పటి అప్పులు కనపడటం లేదా?రూ.14లక్షల కోట్ల అప్పులు చేసినట్టు గతంలో మాపైఆరోపణలు చేశారు.కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే రూ. 4 లక్షల కోట్లుగా అప్పు చేసినట్టు లెక్కలు చూపెట్టారు.మాపై తప్పుడు సమాచారం ప్రచురించిన మీడియా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.2014-19 మధ్య చంద్రబాబు చేసిన అప్పులకంటే మా హయాంలో చాలా తక్కువగా అప్పులు చేశాం.ప్రజలంతా పరిస్థితులను గమనించాలి.మోసపూరిత మాటలు ఎవరు చెప్తున్నారో? ప్రజలకోసం ఎవరు చేస్తున్నారో చూడాలిఇదీ చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు -
మీ డబ్జా మీరు కొట్టుకోవడం కాదు: Buggana
-
కోవిడ్ టైంలో కూడా పోలవరం ఆగలేదు..
-
పోలవరంపై ఇంకెన్ని అబద్దాలు చెప్తావ్ బాబూ..
-
పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం పోలవరం బాధ్యతలు తీసుకుంది. పోలవరం పూర్తైతే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది. పోలవరం ఆపేసి చంద్రబాబు పట్టిసీమ ఎందుకు కట్టారు?. ..ఆనాడు కేంద్రంతో టీడీపీ చేసుకున్న ఒప్పందంతో ఎన్నో ఇబ్బందులున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. మా ప్రభుత్వ హయాంలో పోలవరం ముఖ్యమైన పనులు పూర్తిచేశాం. వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కాలంలోనూ పోలవలం పనులు చేశాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ..పోలవరం ఎత్తు తగ్గింపు మా హయాంలోనే జరిగిందని టీడీపీ తప్పడు ప్రచారం చేస్తోంది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు తప్పడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. కోవిడ్ సంక్షోభం లేకుంటే మిగిలిన పనలు పూర్తి చేసేవాళ్లం. స్పిల్ వే కట్టిన తర్వాత అప్పర్ కాఫర్, లోయర్ కాఫర్ డ్యాం కట్టాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రంవాల్ కట్టాలి. ప్రతీ సోమవారం పోలవరం అని చంద్రబాబు భ్రష్టుపట్టించారు’’ అని అన్నారు.హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన రియాక్షన్..‘‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?. పవన్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా?. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంకా ప్రశ్నించడమేనా? మీరు ఉపముఖ్య మంత్రి కూడా. మీరు కూటమికి కారణం కూడా. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈరోజు మళ్లీ హోమ్ మినిస్టర్ను ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు మిమ్మల్ని మీరే ప్రశ్నిచుకుంటున్నారా?. మీ ప్రభుత్వం వచ్చాక క్రైం జరుగుతున్నా.. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్ధం కావట్లేదు. మీరు అధికారంలో ఉండికూడా ప్రశ్నిచడం ఏమిటి?. సమాధానం చెప్పాల్సిన మీరు హోమ్ మినిస్టర్ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు పాలనాపైన ఓరియెంటేషన్ అవసరం ఉంది. అదృశ్యమైన 30 వేల మంది ఆడపిల్లల జాడేదీ?. ’’అని అన్నారు. -
బుగ్గన వస్తున్నారని తెలిసి... ఇదేం చిల్లర రాజకీయం
-
పార్క్ కు తాళం వేసిన మున్సిపల్ కమిషనర్.. ఎందుకంటే !
-
డోన్లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేశారు. వాకింగ్ పార్క్లో బుగ్గనను సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు.మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్ పార్కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. -
మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప.. ప్రభుత్వం చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: వంద రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో సోమవారం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దీనస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, సూపర్ సిక్స్ అమలు గురించి మహిళలు, వృద్ధులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో పారీ్టల పేరుతో దాడులు చేయడానికే సమయాన్ని వృథా చేసిందన్నారు. పచ్చ మీడియా పక్షపాతం ఏపీ అప్పుల విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పక్షపాత కథనాలు ఇస్తున్నాయని బుగ్గన ధ్వజమెత్తారు. వంద రోజుల్లో చేసిన అప్పులను ఎందుకు రాయడం లేదని ప్రశి్నంచారు. పోలవరానికి రూ.12,500 కోట్ల అదనపు నిధులు రావడానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేక విధాల కృషి చేసిందని, ఈ ఫలితాలను కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా చెప్పుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును 2016 వరకూ నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. 2014 నాటి ధరలకు ఒప్పుకున్నారని, కొత్త భూసేకరణ చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాసం గురించే ఆలోచించలేదని, కేవలం సాగు, తాగునీటి కోసం లెక్కలు వేసి, కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం వల్లే పోలవరం నిర్మాణానికి ఇబ్బందులు వచ్చాయని బుగ్గన తెలిపారు. రూ.55 వేల కోట్ల అవసరం ఉంటే.. రూ.20 వేల కోట్లకే పోలవరం చేపడతామని కేంద్రంతో అప్పటి చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుందన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ హయాంలో జరిగిన కృషిని బుగ్గన ఈ దిగువ విధంగా వివరించారు.వైఎస్ జగన్ పోలవరానికి చేసింది ఇదీ⇒ పోలవరం ప్రాజెక్టుకు ముందు రాష్ట్రం డబ్బులు పెడితే, కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఈ లెక్కలు పోలవరం అధారిటీకి వెళ్లేవి. అథారిటీ పరిశీలించి, జలశక్తికి పంపాలి. అక్కడి నుంచి ఆరి్థక శాఖకు, ఆర్బీఐకి వెళ్లి.. తిరిగి రాష్ట్రానికి నిధులు రావడానికి కొన్ని నెలలు పట్టేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్ ద్వారా నేరుగా నిధులు రావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. ⇒ పోలవరానికి సాగు, తాగునీరు రెండు కాంపొనెంట్లు ఇవ్వాలని 12–6–2021, 16–7–2021, 20–7–2021 తేదీల్లో కేంద్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఈ కారణంగానే రూ.7 వేల కోట్లు కేంద్రం ఇవ్వబోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒత్తిడివల్లే పోలవరం అనుమతులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వ గొప్పతనమేమీ కాదు. ⇒ 11.5.2022లోనే సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయి. 10–4–2023 జలశక్తిలోనే పోలవరం అదనపు ఖర్చు గురించి వివరాలు ఇవ్వమని కోరింది. 36 గ్రామాల పునరావాస వివరాలను 4–5–2023న జగన్ సర్కారు పంపింది. వరద వల్ల జరిగిన నష్టంతోపాటు అదనంగా కావల్సిన రూ.12,911 కోట్లకు కేబినెట్ నోట్ పంపమని కేంద్రం 5–6–2023లోనే జగన్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల వల్ల ఆగిపోయిన కేబినెట్ నోట్ ఇప్పుడు అమలులోకి వస్తే ఈ ఘనత తమదేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం. -
గత ప్రభుత్వంపై కూటమి సర్కార్ విషం చల్లుతోంది: బుగ్గన
-
వంద రోజులు దాటినా.. ఇంకా విషం చల్లడమేనా?: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి దానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతోందని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిపోయింది. ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ప్రతిదానికీ గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. ప్రజలు సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎదురుచూస్తున్నారు. మహిళలకు,వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. నెగెటివ్ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లో పార్టీల పేరుతో దాడులు చేశారు. పోలవరం ఇపుడే నిర్మాణం జరుగుతుందనే భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు...నాలుగు నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఎక్కడ రాయలేదు. ప్రజాశక్తి పత్రికలో గత ప్రభుత్వ హయంలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని రాసింది. కూటమి ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్లను గత ప్రభుత్వం అప్పు తెచ్చామని ప్రచారం చేస్తున్నారు. 2005లో మొదలుపెట్టిన పోలవరం పనులు ప్రారంభం కాగా.. ఇప్పుడు చంద్రబాబుతోనే ప్రారంభించినట్లు ప్రచారం చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. 2016సెప్టెంబర్ 8 వరకు పోలవరం పనులు చేయలేదు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలవరానికి 55 వేల కోట్లు అవసరం ఉండగా.. 20 వేల కోట్లకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పుకొని రావడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగలేదు...పోలవరం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులను మేమే చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ చేసిన పొరపాట్లను 2019లో అధికారంలో వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. పోలవరానికి 31 వేల 600 కోట్ల రూపాయలకు పెంచడానికి వైఎస్సార్సీపీ కృషి చేసింది. ఈ రోజు 12 వేల 500 కోట్ల రూపాయలు మంజూరు కావడం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనత. ఆ రోజు ప్రధాని, ఆర్థిక మంత్రి సహకారం, వైఎస్ జగన్ కృషి కారణంగానే పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగు నెలల్లో టీడీపీ ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదు’’ అని అన్నారు. చదవండి: బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే: విజయసాయిరెడ్డి -
ఆర్డినెన్స్ పేరుతో నాటకం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడంతో పాటు రాష్ట్ర అప్పుపై చేసిన దు్రష్ఫచారం బండారం బట్టబయలవుతుందనే భయంతోనే 2024–25 సంవత్సరం పూర్తి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని ఆ ర్థి క శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసి నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019–20కి సంబంధించి రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండ్రోజుల ముందు అంటే జూన్ 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని.. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చి చెబుతూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎత్తిచూపారు. కోవిడ్ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా, నిధుల విషయంలో అస్పష్టత లేకపోయినప్పటికీ పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు జూన్ 21.. రెండో సమావేశాలు జూలై 22–27 వరకు నిర్వహించారని, ఆ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా.. ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచి్చందో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.అబద్ధాలు బయట పడకూడదనే.. » పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నిధులు లేవనే సాకు చూపి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సమరి్థంచుకోవడం. మరొకటి రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లంటూ ఎన్నికల్లో చెప్పిన అబద్ధాల బండారం బయట పడకుండా చూసుకోవడం. » పూర్తి బడ్జెట్ను ప్రవేశ పెట్టకపోవడం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తామని ఇచి్చన హామీకి మంగళం పాడినట్టేనా? » దీపం పథకం కింద ఒక్కో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయనట్లేనా? » మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచి్చన హామీని అటకెక్కించినట్లేనా? » తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా మోసం చేయడం కాదా? » 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పెన్షన్ ఇస్తామని ఇచి్చన హామీని అమ లు చేయకుండా తప్పించుకోవడానికేనా? » రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సహాయం అందిస్తామని ఇచి్చన హామీని అమలుచేయకుండా మోసం చేస్తారా? » 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా వారికి ద్రోహం చేస్తారా? » రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లుందని ఎన్నికల్లో దు్రష్ఫచారం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,74,556 కోట్లని తప్పుడు లెక్కలు చెప్పారు. వాస్తవానికి అన్ని రకాల అప్పులు కలిపి రాష్ట్రానికి ఉన్నది రూ.7 లక్షల కోట్లే. -
సూపర్ సిక్స్ మొదట్లోనే డకౌట్: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, సిటీ బ్యూరో: చంద్రబాబు ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలు ఆరంభానికి ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కుంటి సాకులతో అన్నీ అసత్యాలు వల్లించారని, ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు లెక్కలు చూపించారని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు అసలు శ్వేతపత్రానికే అర్థం మార్చాడని, రాష్ట్రాభివృద్ధి కోసం తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. కేవలం గత ప్రభుత్వంపై నిందలు, అన్నింటికీ బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే వల్లించే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకొని, ఇప్పుడు తమ సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పించారని విమర్శించారు. రాష్ట్ర పరిపాలన కోసం రూ.2 లక్షల 50 వేల కోట్లు అవసరం ఉంటే ఆదాయం రూ.2 లక్షల 40 వేల కోట్లని.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని, ఏం చేయాలని ప్రజలను ప్రశి్నస్తే ఏలా అని నిలదీశారు. అలాంటప్పుడు ఏటా దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను ఎలా ప్రకటించారని దుయ్యబట్టారు.వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి.. శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే.. సంపద సృష్టి ఒట్టి మాటే ⇒ చంద్రబాబు సంపద సృష్టి అంతా ఒట్టి మాటే. 2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.1,14,671 కోట్లు. ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగింది. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయం ఏటా 16.7 శాతం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చాక 2019 జూలైలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరెందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు? అలా చేస్తే మీ బండారం బయట పడుతుందనే కదా! ⇒ నిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయి. ఇతరత్రా అన్నీ కలుపుకున్నా కూడా మొత్తం అప్పులు రూ.7 లక్షల కోట్లు మాత్రమే. మా ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, మేము ఏకంగా రూ.47,800 కోట్లు ఇచ్చాం. మేము తీసుకొచి్చన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్)ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వైఎస్సార్సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా?⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసింది. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారు. 2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, మా హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే. ఇది ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? వైఎస్సార్సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా? ⇒ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయి. అంటే టీడీపీ హయాంలో 21.63 శాతం పెరిగాయి. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5.18 లక్షల కోట్లు. అంటే 12.9 శాతం పెరుగుదల మాత్రమే. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పారీ్టలకు అనుబంధంగా ఉన్న ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి పత్రికలు ఎన్నడూ ఇలా వన్ సైడ్ తప్పుడు కథనాలు ప్రచురించలేదు. ఆ రెండు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) పత్రికలు మాత్రం ఏకపక్షంగా తప్పుడు రాతలు రాస్తున్నాయి.‘‘పేదల పథకాలకు సంబంధించి ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం కష్టమని మేము తొలి ఏడాది ఓ సమావేశం (అంతర్గత)లో చెబితే..‘ఇది నేను ఇచి్చన మాట. మేనిఫెస్టోలో పెట్టాం. ఇది పేద వారికి సంబంధించిన వాగ్దానం. మాట తప్పేందుకు కుదరదు. ఒకవేళ తప్పాల్సి వస్తే నేనే దిగిపోతాను’ అన్నారు. మేమంతా షాక్ అయ్యాం. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము, మా అధికారులందరం కోవిడ్ను సైతం లెక్కచేయకుండా తిరిగాం. అలా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కమిట్మెంట్తో హామీలు అమలు చేశారు’’ అని బుగ్గన వివరించారు.అన్నీ తప్పుడు లెక్కలు⇒ టీడీపీ హయాంలో 2014–19 మ«ధ్య స్థూల ఉత్పత్తి బ్రహా్మండంగా పెంచామని చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకోవడం సరికాదు. కోవిడ్ పీరియడ్.. కోవిడ్ లేని కాలంతో పోలికా? టీడీపీ పాలన కంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో వృద్ధి సాధించాం. 2014 నుంచి 2019 వరకు దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82గా నమోదైంది. పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014– 2019 మధ్య 2.98 శాతం కాగా, 2019–2024 మధ్య 4 శాతం. అయినా పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేయడం విడ్డూరం. ⇒ వైఎస్ జగన్ పాలనలో స్థూల ఉత్పత్తితో పాటు తలసరి ఆదాయం కూడా మెరుగు పడింది. టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం. వైఎస్సార్సీపీ పాలనలో చివరి ఏడాది 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతానికి పెరిగింది. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరింది. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం నంబర్ వన్గా నిలిచింది. మా పాలనలో మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. -
జగన్ గురించి సంచలన నిజం బయటపెట్టిన బుగ్గన..!
-
చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంపై బుగ్గన కౌంటర్
-
సూపర్ సిక్స్ కాస్త డకౌట్ అయ్యింది: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్ధం మార్చిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తూ.. వైట్పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు.ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలుకు ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.అది హాస్యాస్పదంరాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకున్నారన్న బుగ్గన.. అదే చంద్రబాబు ఇప్పుడు తమ సూపర్సిక్స్ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు.ఎలా ప్రకటించారు?రాష్ట్ర ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు కాగా.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు, ఇతర పరిపాలన అవసరాల కోసమే రూ.2.50 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న ఆయన.. ఆ అవసరల కోసమే ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. మరి అలాంటప్పుడు ఏటా, దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను చంద్రబాబు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. వాటిని అమలు చేయలేరన్న విషయం తెలుసు కాబట్టే.. ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.వీటి కోసం ఎదురుచూస్తున్నారుతల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో తల్లికి వందనం అమలు కావాల్సి ఉందని గుర్తు చేశారు.తప్పుడు లెక్కలుతమ హయాంలో 2014–19 మ«ధ్య, స్ధూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు వైట్పేపర్లో చెప్పుకోవడాన్ని తప్పు పట్టిన బుగ్గన, కోవిడ్ పీరియడ్.. అది లేని కాలంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే.. టీడీపీ పాలన కంటే, తమ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో కాస్త వృద్ధి సాధించామన్న ఆయన.. 2014 నుంచి 2019 వరకు దేశ స్ధూల ఉత్పత్తిలో రాష్ట్ర స్ధూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82 గా నమోదైందని చెప్పారు. అది 0.4 శాతం ఎక్కువని వివరించారు.అసత్య ప్రచారాలుఅదే విధంగా పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి, దేశ జీడీజీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014 నుంచి 2019 వరకు 2.98 శాతం కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4 శాతమని గుర్తు చేసిన ఆయన, తమ హయాంలో 1.1 శాతం పెరిగిందని.. అయినా తమ పాలనలో ఇక్కడికి పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేశారని ఆక్షేపించారు.తలసరి ఆదాయంరాష్ట్రంలో టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం అని చెప్పారు. అదే తమ ప్రభుత్వ పాలనలో చివరి ఏడాది.. 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతం పెరుగుదల అని వెల్లడించారు. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరిందని చెప్పారు. అంతేకాక, సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం వరసగా నెంబర్ వన్గా నిల్చిందన్న బుగ్గన, ఇది అభివృద్ధి కాక, మరేమిటని ప్రశ్నించారు.మద్యాన్ని నియంత్రించాంటీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మద్యం విక్రయాలు ప్రైవేటు వారి చేతిలో ఉండేవని, దాంతో వారంతా సిండికేట్గా ఏర్పడి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మారని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. అంతే కాకుండా, ప్రతి షాప్కు ఒక పర్మిట్రూమ్, ఊరూరా బెల్టు షాప్లు.. మొత్తం 43 వేల బెల్టు షాప్లు ఉండేవని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే, వైన్ షాప్లను 33 శాతం తగ్గించడంతో పాటు, అన్ని పర్మిట్రూమ్లు, బెల్టు షాప్లను రద్దు చేశామని తెలిపారు. షాప్లను పూర్తిగా ప్రభుత్వమే నడపడం, మద్యం విక్రయ వేళలు తగ్గించడం, మరోవైపు ధరలు పెంచడం వల్ల, మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు.అలా ఎలా ఆపాదిస్తారు?అన్నింటి కంటే ఎక్కువగా జీత భత్యాలకే రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్న ఆయన, జీత భత్యాల వ్యయం ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ వల్ల వ్యయం పెరిగిందని చెప్పారు. మరోవైపు సామాజిక పెన్షన్ల వ్యయం రూ.33 వేల కోట్లు కాగా.. దాన్ని కూడా ఇతరులకు ఎలా ఆపాదిస్తారని నిలదీశారు.ఇది పట్టదా?నాడు, రాష్ట్రావసరాల కోసం అప్పు చేస్తే.. అప్పులతోనే నెట్టుకొస్తున్నామంటూ నిత్యం దుయ్యబట్టిన ఎల్లో మీడియా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే పని చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.ఇవీ ఈ ప్రభుత్వ అప్పులుటీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయదని ప్రశ్నించిన ఆయన.. ‘మరి మేం చేస్తే అప్పు, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తే నిప్పా’ అని కడిగి పారేశారు. అంతకు ముందు హయాంలో ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసినా, ఎల్లో మీడియా రాయలేదని ఆక్షేపించారు.గతంలోనూ వారివే ఎక్కువ2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, తమ హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే అని మాజీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన తరవాత, ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి, అంటే టీడీపీ ప్రభుత్వం గద్దె దిగేనాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయని.. అంటే టీడీపీ హయాంలో అప్పులు 21.63 శాతం పెరిగాయని చెప్పారు. అదే తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.5.18 లక్షల కోట్లు కాగా, అది 2019–24 మధ్య కేవలం 12.9 శాతం పెరుగుదల మాత్రమే అని తెలిపారు. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.సంపద సృష్టి ఒట్టి మాటే..సంపద సృష్టిలో తాము స్పెషలిస్టులమని చంద్రబాబు చెప్పుకుంటారని.. కానీ అది పూర్తిగా అవాస్తవమని బుగ్గన వెల్లడించారు.2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు కాగా, 2019లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ మొత్తం కేవలం రూ.1,14,671 కోట్లు మాత్రమే అన్న ఆయన, ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగిందన్నారు. అదే తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం 16.7 శాతం పెరిగిందన్న ఆయన, ఆ గణాంకాలు చెబుతూ.. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరిందని వివరించారు.ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన తరవాత, 2019 జూలైలో అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆయన, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్కు పోవడాన్ని ప్రశ్నించారు.వాస్తవాలు బయటపడతాయనే..పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. పథకాలకు కేటాయింపులు, రాష్ట్ర అప్పులతో సహా, అన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంటుందని.. టీడీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో గొప్పగా ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని.. అందుకే ఓట్ ఆన్ ఎక్కౌంట్కు వెళ్తున్నారని ఆక్షేపించారు.అంతే కాకుండా, మా హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశామని, అదేపనిగా దుష్ప్రచారం చేశారని.. ఇష్టానుసారం అంకె చెప్పి, తాము 14 లక్షల కోట్ల అప్పులు చేశామని కూడా ఆరోపించారని గుర్తు చేశారు.నిజానికి తాము అంత అప్పు చేయలేదని, రాష్ట్ర అప్పు ఎంత అన్నది.. ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మరోవైపు సీఏజీ, ఆర్బీఐ రిపోర్టుల్లో ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ బయట పడతాయన్న భయంతోనే, ఈ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్కు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.ఇవీ వాస్తవ అప్పులునిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు అన్న బుగ్గన, పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయని తెలిపారు. కార్పొరేషన్ రుణాలు రూ.2.18 లక్షల కోట్లు కాగా, అవి రూ.2.48 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.90 వేల కోట్లు, ఇంకా అప్లోడ్ చేయలేదన్న ఆయన, వాటిని రుణాలుగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. ఇంకా ఉద్యోగుల బకాయిలు కూడా కలుపుకున్నా, మొత్తం అప్పులు దాదాపు రూ.7 లక్షల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.ప్రాధాన్య రంగాలకు ఎక్కువ తమ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశామని మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, కీలక మౌలిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, తాము అంతకు మూడు రెట్లకు పైగా ఎక్కువ రూ.47,800 కోట్లు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రి ఉదహరించారు.ఇంకా, తాము తీసుకొచ్చిన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్) ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. -
వేట కొడవళ్లతో దాడి చేస్తారా?.. ప్రభుత్వం ఏం చేస్తోంది: మాజీ మంత్రి బుగ్గన
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. పచ్చ నేతల దాడులను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ క్రమంలో కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మాజీ మంత్రి బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్యాపిలి మండలం పోదొడ్డిలో నడుస్తున్న కంకర క్వారీ నాది కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్వీపై స్థానిక టీడీపీ గూండాలు దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న వేట కొడవళ్లలో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారు. ఈ ఘటనలతో ఆ గ్రామంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది.గ్రామంలో ఉన్న మరో వర్గం ఈ అరాచకాలను ప్రశ్నించింది. అంతేకాకుండా నాపై తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ క్వారీ సక్రమమా? లేక అక్రమమా? అనేది తేల్చాసింది ప్రభుత్వం.. అంతేకానీ స్థానికంగా ఉండే టీడీపీ నేతలు కాదు. వారి పార్టీకి చెందిన గూండాలు కూడా కాదు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
-
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
సాక్షి, నంద్యాల: టీడీపీ అధినేత చంద్రబాబు తన హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులు తానే కడతారా అని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎన్నికల నామినేషన్ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, బుగ్గన నంద్యాలలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?. 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించాం. అప్లికేషన్లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. ఇదే సమయంలో కోట్లకు చురకలంటించారు. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? అని ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
-
సామజిక సాధికారత చూసి అన్ని వర్గాలవారు పార్టీలో చేరుతున్నారు
-
సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి బుగ్గన
-
కౌలు రైతులకు మరింత చేయూతనివ్వండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాల్లో రైతులకు కూడా తగిన రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డెయిరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడ్ గవర్నెన్స్లో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన ఈ–క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడ్ గవర్నెన్స్లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ 2023–24 వార్షిక రుణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ నాటికే రూ.4,77,234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. దీనిలో ప్రాధాన్యత రంగం కింద రూ.3.23 లక్షల కోట్లు అందించాల్సి ఉండగా రూ.2.88 లక్షల కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే రూ.2.31 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం కాగా రూ.2.08 లక్షల కోట్లు అందించామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.69 వేల కోట్లకు గాను రూ.71,113 కోట్లు అందజేశామని వెల్లడించారు. అలాగే ప్రాధాన్యేతర రంగంలో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.1,88,557 కోట్లు ఇచ్చామన్నారు. అలాగే బ్యాంకు లింకేజ్ కింద 35 వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31,699 సంఘాలకు సాయం అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్టాండ్ అప్ ఇండియా కింద 13,078 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిసెంబరు నెలాఖరు నాటికి 12,768 మందికి సాయమందించామని తెలిపారు. పీఎం ముద్రా యోజన కింద రూ.13 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.14,860 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతేడాది డిసెంబర్ వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం రవీంద్రబాబు వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాల్లో మంచి ప్రగతి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాలు అందించడంలో మంచి ప్రగతిని సాధించారన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏపీ ఇన్చార్జి రాజేష్ కె.మహానా, యూబీఏ జీఎం గుణనాధ్ గమి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్ బాబు, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు. -
యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్య
సాక్షి, విశాఖపట్నం: అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ అవకాశాలు సృష్టిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 పేరుతో నేషనల్ స్కిల్ కాంక్లేవ్–2024 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో పర్యటించామన్నారు. గత 30–40 ఏళ్లలో నైపుణ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యువతలో ఏయే విభాగాల్లో నైపుణ్య కొరత ఉందో.. ఎందులో ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని దానికనుగుణంగా కార్యాచరణ చేపట్టామని వివరించారు. స్థానిక పరిశ్రమల అవసరాలను బట్టి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. సన్షైన్ ఏపీ కోసం 26 నైపుణ్య అకాడమీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు కూడా ఉన్నాయన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వీరిలో 50 శాతం మందిని స్థానిక పరిశ్రమల అవసరాల కోసం ఉపయోగించుకోవాలని అన్ని సంస్థలకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. రాష్ట్ర యువత.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా.. నైపుణ్య శిక్షణ అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీ పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పలు సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు.. సదస్సులో భాగంగా.. ఏపీఎస్ఎస్డీసీతో వివిధ సంస్థలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నైపుణ్య శిక్షణకు సంబంధించి 100 మిలియన్ లెర్నర్స్ (అరిజోనా స్టేట్ యూనివర్సిటీ), ట్రస్టెడ్ జాబ్స్, తాత్విక్ బ్యూటీ–వెల్నెస్, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్ఏఐ), ఎక్సెల్ఐఆర్, జీయూవీఐ, హెచ్ఈఆర్ఈ టెక్నాలజీస్, రబ్బర్, కెమికల్, పెట్రో కెమికల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొదలైన సంస్థలతో 6 ఎంవోయూలను ఏపీఎస్ఎస్డీసీ కుదుర్చుకుంది. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం గత ఐదేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన వీడియో ప్రదర్శనకు దేశ, విదేశాల ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీ ‘న్యూస్కిల్’ న్యూస్ లెటర్ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. ఏపీఎస్ఎస్డీసీకి సహకారం అందిస్తూ ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగయ్యేలా చేస్తున్న బెస్ట్ ప్లేస్మెంట్, సీఎస్ఆర్ పార్టనర్లగా కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్, లలితా జ్యుయెలర్స్ తదితర 13 సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్లీ, సెంట్రల్ ఎంఎస్ఎంఈ బోర్డు సీఈవో సేతు మాధవన్, సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేశ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ నవ్య, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాల కల్పనలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, హబ్లు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తోంది. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్వన్కి చేరుకునే అవకాశాలున్నాయి. – డా. వినోద్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఏపీ విధానాలు భేష్ నైపుణ్య శిక్షణ కోసం ఏపీలోనూ అవలంబిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఐదు ప్రధాన విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2.7 లక్షల మందికి ఏడాది కాలంలో ఉద్యోగాలు ఇవ్వగలిగాం. – డా. అపూర్వ పాల్కర్, మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ వీసీ చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుగ్గన చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. టీడీపీకి ఒక అజెండా, విధానం అంటూ ఏమీ లేవని విమర్శించారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వీటితో ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ తోక పార్టీ జనసేన సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాలు, పేదల సంక్షేమమే వైఎస్సార్సీపీ అజెండా అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని వెల్లడించారు. బీజేపీ, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వైఎస్సార్సీపీ నెరవేరుస్తోందన్నారు. -
రాష్ట్రంలో యువతకు నాణ్యమైన శిక్షణ: బుగ్గన
-
ఏపీ అప్పులపై అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఛాలెంజ్
-
అప్పులు తగ్గించి సంపద పెంచాం
సాక్షి, అమరావతి: తమకు మీడియా బలం ఉందనే అహంకారంతో విపక్షాలు పదేపదే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గత సర్కారు కంటే తక్కువ అప్పులు చేసినా అనునిత్యం బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ 2014లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా ఇప్పుడు కొత్తవి ప్రకటిస్తుంటే బీజేపీ, వామపక్షాలు లాంటి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన గురువారం గణాంకాలతో సమాధానమిచ్చారు. ఐదేళ్లుగా బడ్జెట్ సమర్పించే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ 2024–25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించాల్సిందిగా సభ్యులను కోరారు. టీడీపీ కంటే అప్పుల వృద్ధి తక్కువే వాస్తవ లెక్కలకు, బడ్జెట్కు వ్యతాసం ఉందని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించటాన్ని బుగ్గన ఖండించారు. 2019–20లో టీడీపీ రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టగా వాస్తవంగా ఖర్చు చేసింది రూ.1.64 లక్షల కోట్లు మాత్రమేనని, బడ్జెట్ లెక్కల కంటే రూ.27,000 కోట్లు తక్కువ వ్యయం చేసిందని గుర్తు చేశారు. 2023–24 బడ్జెట్లో రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే సవరించిన అంచనాల ప్రకారం వ్యయం రూ.2.75 లక్షల కోట్లుగా ఉందని, తుది లెక్కలు కూడా ఇంచుమించి ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధిరేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మీడియా బలం ఉందన్న అహంకారంతో పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ కేంద్ర అప్పులు 2014–19లో 59.75 శాతం పెరగగా 2019–24లో 86 శాతం పెరిగాయి. కేంద్ర అప్పులు 2014–19లో 9.82 శాతం, 2019–24లో 13.25 శాతం చొప్పున పెరిగాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 126 శాతం పెరిగితే 2019–24 మధ్య అప్పుల్లో వృద్ధి 95 శాతంగా ఉంది. అంటే సగటున టీడీపీ హయాంలో 18 శాతం అప్పులు పెరిగితే మా ప్రభుత్వం వచ్చాక 14 శాతం మేర మాత్రమే పెరిగాయి. కేంద్రం, టీడీపీ సర్కారు రెట్టింపు స్థాయిలో అప్పులు చేస్తే మాట్లాడని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మాపై బురద జల్లడం వెనుక మీడీయా ఉందన్న అహకారం స్పష్టంగా కనిపిస్తోంది. ♦ 2014లో పలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత మేనిఫెస్టోను మాయం చేసింది. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటివి ఎగ్గొట్టింది. మా ప్రభుత్వం మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ తు.చ. తప్పకుండా అమలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. వామపక్ష పార్టీలు ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా మేనిఫెస్టోను మా ప్రభుత్వం అమలు చేసిందని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ♦ గత సర్కారు పెట్టిన బకాయిలను తీర్చడంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలకు సంబంధించిన అకౌంట్స్ను మా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం చేసిన అప్పులు బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో జమ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయాయో వెల్లడించాలి. ♦ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఖజానాలో ఏమీ లేదని, హామీలు నెరవేర్చలేరంటూ టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు వల్ల కాని హామీలను ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు విస్తుపోతున్నారు. తమ నాయకుడు ఎన్నికల ముందు హామీలను గుప్పించి ఆ తర్వాత గాలికి వదిలేస్తారని రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కలిసినప్పుడు అసలు విషయం చెబుతున్నారు. సంపద సృష్టించి హామీలను అమలు చేస్తానంటున్న చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే వాస్తవాలు బోధపడతాయి. ♦ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రెవెన్యూ వృద్ధి రేటు 6 శాతం ఉంటే ఇప్పుడు 16 శాతానికి పెరిగింది. దీనిబట్టి ఎవరి హయాంలో సంపద పెరిగిందో తెలుసుకోవచ్చు. 2018–19లో 11% స్థూల ఉత్పత్తి రేటుతో ఏపీ 14వ స్థానంలో ఉండగా 2023 నాటికి 16.2 శాతానికి పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో 4వ స్థానానికి పురోగమించింది. 2018–19లో మన వ్యవసాయ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా ఈ రోజు 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి ఎగబాకింది. 2023–24కి సంబంధించి కేంద్ర జీడీపీలో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేయగా అది మన రాష్ట్రంలో 7.35 శాతంగా ఉంటుంది. ఇది ప్రజా బడ్జెట్ ఇది సప్త రంగాలకు పెద్దపీట వేసిన ప్రజా బడ్జెట్ ఇది. గత ప్రభుత్వం మాదిరిగా గాలిలో మేడలు కట్టలేదు. గ్రాఫిక్స్ బొమ్మలు చూపించలేదు. మా నాయకుడు సుదీర్ఘ పాదయాత్రలో పేదల గుండెలు తడిమి ప్రతి ఒక్కరి బతుకులు మార్చేలా తీసుకొచ్చిన బడ్జెట్ ఇది. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి.. ఆ దిశగా మానవ జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ రూపొందించారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా, విద్య మిథ్యగా మారిపోయింది. ఇప్పుడు ఎందరో పేదలకు ఉచిత వైద్యంతో ఊపిరిపోస్తూ.. ఎందరో పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి చదువులు అందిస్తోంది మా ప్రభుత్వం. సీఎం జగన్ గొప్ప సంకల్పమే జీపీపీతోపాటు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను దేశానికే మార్గదర్శకంగా నిలబెట్టింది. ఉత్తరాంధ్రలో సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారులకు జగనన్న వచ్చిన తర్వాతే కదా జీవిత భరోసా దక్కింది. వేట నిషేధ సమయంలో రూ.10వేలు అందుకుని కడుపు నింపుకుంటున్నారు. టీడీపీ హయాంలో కేవలం 4లక్షల ఇళ్లు ఇస్తే.. మా ప్రభుత్వం 32లక్షలకు పైగా ఇళ్ల స్థలాలతో కొత్త ఊర్లను నిర్మిస్తోంది. కొత్త పారిశ్రామిక పాలసీ ఏపీ ముఖచిత్రాన్ని మార్చేసింది. మా ప్రభుత్వం డీబీటీ, నాన్–డీబీటీ కింద ఇచ్చినవే చెబుతోంది. అవి కాకుండా గ్రామాల్లో చేసిన అభివృద్ధిని కూడా కలిపితే ఏకంగా ఐదేళ్లలో రూ.5.30లక్షల కోట్లకుపైగా సంక్షేమాభివృద్ధిని చేసి చూపించాం. దీనితోపాటు ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ అభివృద్ధికి మరింత నిధులు కేటాయించాలి. – కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే విద్య, వైద్యానికి పెద్దపీట సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టి మన పిల్లల భవితకు బంగారు బాటలు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు గోరుముద్ద పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వం నాలుగు రెట్లు అధికంగా బడ్జెట్ను ఖర్చు చేస్తోంది. సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసింది. ఏకంగా 4 లక్షల ఉద్యోగాలను కలి్పంచింది. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో సాయం అందించింది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ప్రస్తుతం రాష్ట్రం నంబర్వన్ స్థానంలో కొనసాగుతోంది. – హఫీజ్ ఖాన్, కర్నూల్ ఎమ్మెల్యే రేపటి తరాల అభివృద్ధికి పునాదులు రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీల అభ్యున్నతికి సీఎం జగన్ కంకణబద్దుడై ఉన్నారు. ఈ క్రమంలో ముస్లింలకు మేలు చేస్తూ ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేశారు. నిరుపేదలకు లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రేపటి తరాల అభివృద్ధికి పునాదులు వేశారు. విద్యా, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పులు తెచ్చారు. నవరత్నాల పథకాల అమలు ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారు. సర్పంచ్ల దగ్గర నుంచి నాలాంటి సామాన్యూలు ఎందరికో సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. – ముస్తఫా, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే -
బడ్జెట్ పై ప్రతిపక్షం, విపక్షాల కామెంట్స్ పై బుగ్గన చురకలు
-
హామీలు నెరవేర్చని బాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సభలో చర్చ
-
మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం : బుగ్గన
-
ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్ మెంట్ బిల్లుకు ఆమోదం
-
మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ ల్యాండ్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు. రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల అనుసంధానం భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్ట్ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వైద్య విద్య బలోపేతం ♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. అత్యున్నత విద్యాలయాలు ♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో సెంట్రల్ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్ కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ కర్నూలులో క్లస్టర్ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. పోలవరం పురోగమనం ♦ 2019మే నాటికి 42 శాతం హెడ్ వర్క్లు 70 శాతానికి చేరిక ♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్ గేట్ల ఏర్పాటు. ♦ గతేడాది నవంబర్ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్ ప్రారంభం. ♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్ త్వరలో పూర్తి. ♦ గతేడాది సెపె్టంబర్ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రారంభం. ♦ 2022 సెపె్టంబర్ 6వ తేదీన గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం. ♦ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతి. పారిశ్రామిక పరుగులు ♦ 2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు ♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు ♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్íÙప్ల ఏర్పాటు ♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం -
ఇదిగో.. సామర్థ్య ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో బడ్జెన్ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం. –సాక్షి, అమరావతి ‘విద్య’యీ భవ పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్ సరి్టఫికేషన్ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందిస్తోంది. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్లు, బ్యాగ్లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. రెడీ టు వర్క్ విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్లు, క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్లను అభివృద్ధి చేసింది. ఉన్నతంగా విద్య జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది. ఇంటర్న్షిప్ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది. ప్రొసీజర్స్ను పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది. కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం. గోరుముద్దతో ఆరోగ్యం.. ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. సామర్ధ్యాంధ్ర కేటాయింపులు రూ. 53,508.04 కోట్లు సాధారణ విద్య రూ.33,898.04 కోట్లు వైద్య రంగంరూ.17,916.67 కోట్లు సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు -
చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది. – సాక్షి, అమరావతి మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మహిళా సాధికారత కోసం.. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్ – చైల్డ్ బేస్డ్ బడ్జెట్లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది. సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్ యాప్, దిశ పెట్రోల్ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
భూ హక్కులకు భద్రత
సాక్షి, అమరావతి: భద్రమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఐదేళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డుల్లో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాలవల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కారు సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడుల్ని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ♦ నూతన పింఛను పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయ పింఛను పథకంగా ఇది ఉంది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించింది. ♦ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన (రీసర్వే) చేయడం కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్ స్టేషన్ల (సీఓఆర్ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీ సర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది. ♦ ఇప్పటివరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ♦ 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్పడ్డాయి. 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమిలేని దళితుల భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధిపొందారు. భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. ♦మా ప్రభుత్వం ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్డీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటుచేశాం. ♦ 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం. ♦ ఆశ్కా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాల్టీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, మెప్మాకు చెందిన రీసోర్స్ పర్సన్లు, హోమ్గార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది. -
ఏపీ బడ్జెట్ ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సు
‘రోటి, కపడా, ఔర్ మకాన్’ ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత. ఇవి అందుబాటులో ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపక్రమిస్తుంది. వీటిని విస్మరించి, గ్రాఫిక్స్తో ఎన్ని మేడలు కట్టినా అవి నీటి మూటలేనని చరిత్ర చెబుతోంది. ప్రజల ఆనందాన్ని, వారి బాగోగులను చూసి ఆనందించే వాడే అసలైన పాలకుడని కూడా చరిత్ర వెల్లడిస్తోంది. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినప్పుడే ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో చేయూత అందిస్తే చాలు, ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తారని విశ్వ వ్యాప్తంగా విఖ్యాత ఆర్థిక నిపుణులు నొక్కి వక్కాణిస్తుండటం తరచూ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభ్యున్నతికే ఎన్నో దేశాలు, రాష్ట్రాలు సతమతం అవుతున్న వేళ.. ఇంతకు మించిన సంక్షేమాభివృద్ధిని సాకారం చేస్తూ మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. నవరత్నాల పథకాలు, సప్త స్వరాల్లాంటి థీమ్ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించాలనే తపన, తాపత్రయం.. బడ్జెట్లో కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024 – 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు ప్రయత్నం చేసిన ఆర్థిక మంత్రి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు ద్వారా గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సంక్షేమాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగలిగిందన్నారు. ఎన్నికల నేపధ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. భారీ అంచనాలకు వెళ్లకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలకే పరిమితమయ్యారు. ఎప్పటిలాగానే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ► 2024–25 ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ను రూ.2,86,389.27 కోట్లు గా బుగ్గన ప్రతిపాదించారు. మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు ఉంటుందని, ద్రవ్య లోటు రూ.55.817.50 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యలోటు జీఎస్డీపీలో దాదాపు 3.51% ఉంటుందని, రెవెన్యూ లోటు జీఎస్డీపీలో దాదాపు 1.56 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2023–24 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 2.19 శాతం, ద్రవ్య లోటు జీఎస్డీపీలో 4.18 శాతం ఉంటుందని తెలిపారు. ► సాధారణ విద్యకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద పీట వేశారు. సాధారణ విద్యా రంగానికి రూ.33,898 కోట్లు కేటాయించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలకు తగినన్ని నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,816 కోట్లు, పట్టణాభివృద్దికి రూ.9546 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.17,916 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.14,236 కోట్లు, సాగునీటి రంగానికి రూ.12,038 కోట్లు, మొత్తం సంక్షేమ రంగానికి రూ.44,668 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.6,595 కోట్లు, రవాణా రంగానికి రూ.10,334 కోట్లు కేటాయింపులు చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రూ.3,940 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో ‘సుపరిపాలిత ఆంధ్ర’గా.. 2019.. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయింది. విభజన గాయాలు మానేందుకు, సాంత్వన చర్యలు తీసుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా.. పరిస్థితిని పెనం మీంచి పొయ్యలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పునరి్నర్మించుకోవడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ సమస్యలను అధిగమించాలంటే మూస పద్ధతిలో కాకుండా సరికొత్త విధానంలో మాత్రమే అభివృద్ధి సాధించగలమని ఆయన తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా బలంగా విశ్వసించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ముఖ్యంగా సుపరిపాలనలో భాగంగా పాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు సీఎం జగన్ తీసుకెళ్లారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరిచారు. విస్తృతస్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించి సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారత అందించి రాష్ట్రాన్ని ‘సుపరిపాలిత ఆంధ్ర’గా తీర్చిదిద్దారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం ‘సుపరిపాలిత ఆంధ్ర’గా ఎలా రూపాంతరం చెందిందో స్పష్టంగా వివరించారు. పాలనా వికేంద్రీకరణ.. ప్రజలు సాధికారిత, వికేంద్రీకరణ, సుపరిపాలన అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం, సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతనందించింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. అలాగే.. ► దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. వీటిల్లో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. తద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలకు తోడు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందిస్తోంది. ► అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచి పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా చేసింది. ► నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి. ► ఇక పౌరుల రక్షణ, భద్రతను పెంపొందించడానికి అవసరమైన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీసు సబ్–డివిజన్లు ఏర్పాటుచేసింది. ► ప్రతి జిల్లాలో దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడమే కాక రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీసుస్టేషన్లు ప్రారంభమయ్యాయి. ► భద్రతా మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజాభద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం.. ► ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో భాగంగా 58,288 పనులను రూ.2,356 కోట్ల అంచనాతో మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.729 కోట్లతో 17,239 పనులు పూర్తయ్యాయి. ► రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది. వివక్షకు దూరంగా.. గత ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమని వదిలేయకుండా కుప్పంను రెవిన్యూ డివిజన్గా ప్రకటించడంతోపాటు పౌరుల రక్షణ, భద్రత కోసం కొత్త పోలీసు సబ్ డివిజన్, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందనేందుకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. సంక్షేమ ఫలాలను వివరిస్తూ కొందరు లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాన్ని బుగ్గన వీడియో ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయన్నారు. ► తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వడ్డే రాజేశ్వరి పొదుపు సంఘాల రుణాల మాఫీ, పింఛన్, ఆసరా కింద లభించిన సాయంతో గొర్రెలను కొనుగోలు చేశారు. తనను కష్టాల నుంచి ఈ ప్రభుత్వం గట్టెక్కించిందని ఆమె సంతోషంగా చెబుతోంది. ► విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంకు చెందిన పల్లా కృష్ణవేణి చేయూత కింద అందిన మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మ ఒడి సాయం కూడా అందుతోంది. కుట్టు మిషన్ ఉంది. రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తున్నానని, కిరాణా దుకాణంతో తమ బతుకులు మారాయని సగర్వంగా చెబుతోంది. ► విశాఖపట్నం ఆరో వార్డు మధురవాడకు చెందిన వాండ్రాసి అన్నపూర్ణ తాము టీడీపీ మద్దతుదారులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇతర పథకాలనూ అందిస్తోందని ధన్యవాదాలు తెలియచేస్తోంది. ► నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన వృద్ధురాలు కవుజు బేబీ అనే మహిళకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్, ఇతర పథకాలను ఇంటి వద్దే అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం తనను ఎంతో ఆదుకుంటోందని కృతజ్ఞతలు తెలిపింది. ► విశాఖకు చెందిన రోబంకి చిరంజీవులు అనే వృద్ధ దంపతులకు వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా కాలికి ఆపరేషన్ నిర్వహించడంతోపాటు ఆసరా, పెన్షన్ అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం కన్న కొడుకులా ఆదుకుంటోందంటూ సంతోషంగా చెబుతున్నారు. ► ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపడంతో ఒంటరిగా ఉన్న తాను దేవాలయాల వద్ద యాచిస్తూ జీవనం సాగించానని, ఈ ప్రభుత్వం వచ్చాక రూ.3,000 పెన్షన్ ప్రతీ నెలా ఇస్తుండటంతో భిక్షాటన మానుకుని గౌరవంగా బతుకుతున్నానంటూ విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన బత్తిన అప్పమ్మ చెబుతోంది. -
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడుతున్న దృశ్యాలు
-
మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంలా భావించారు
-
ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది: బుగ్గన
-
53 లక్షల 53 వేల రైతులకు 33 వేల 300 కోట్లు..
-
53 లక్షల 53 వేల రైతులకు 33 వేల 300 కోట్లు..
-
3250 వ్యాధులకు చికిత్స..ఆరోగ్య శ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం
-
43 లక్షల 61 వేల మహిళలకు 26, 067 కోట్లు..
-
మేము టీడీపీ..అయినా సాయం చేశారు..జగన్ ఫిదా..
-
Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
5 సంవత్సరాల తర్వాత ఏం సాధించాం ?..అసెంబ్లీలో వివరించిన ఆర్థిక మంత్రి
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్..మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
-
ఏపీ బడ్జెట్ 2024-25 పై మంత్రి బుగ్గన "కీ" కామెంట్స్..
-
AP Budget: ఏపీ బడ్జెట్ ప్రసంగం ఇదే..
Updates.. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.. ►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. ►శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ►శాసన మండలి రేపటికి వాయిదా. ►అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు. మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు. రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత గ్రంధంగా భావించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసింది. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర సుపరిపాలన.. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు. 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు ప్రతీ జిల్లాలో దిశ పీఎస్లను ఏర్పాటు చేశాం. భద్రత, మౌళిక సదుపాయాలను పెంచాం. 13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం, వినూత్న పద్దతుల ద్వారా విద్యాబోధన సులభతరం. రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక 47లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు అందించాం. జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్టు ఇది ఎక్కువ సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్బిణులకు మేలు. ఉచితంగా విద్యార్థులకు 9.52,925 ట్యాబ్స్ 34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం. రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింపు. విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ధి. ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు. నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు. ఆరోగ్యశ్రీ వ్యాధులను 3257కు పెంచాం. 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి. కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియామకం,. ఏపీలో 192 స్కిల్ హబ్లు, 27 స్కిల్ కాలేజీలు నైపుణ్య శిక్షణ ద్వారా 95 శాతం మందికి ఉద్యోగాలు. విద్యార్థుల శిక్షణ కోసం వర్చువల్ ల్యాబ్లు 201 పాఠశాలల్లో వర్చువల్ ల్యాబ్స్ అమ్మఒడి ద్వారా 43.61లక్షల మహిళలను మహరాణులను చేశాం. అమ్మఒడి కింద రూ.26,067కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు ఖర్చు. వ్యవసాయం రంగం.. జగనన్న పాలవెల్లువ కింద రూ.2697కోట్లు. 29 దిశా పోలీసు స్టేష్లను ఏర్పాటు. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద 53.53 లక్షలు రైతులకు సాయం. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ రూ.33,300 కోట్లు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13500 సాయం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు. ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు. సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు. రైతులకే నేరుగా సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37374 కోట్ల సబ్సిడీ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1277 కోట్లు అందించాం. వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు యంత్ర సేవల పథకం కింద రైతులకు యంత్రాలు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4363 కోట్లు అందించాం. 2356 మంది ఉద్యానవన సహాయకులు నియామకం. 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు. ఆక్వా రంగం.. వైఎస్సార్ మత్య్సకార భరోసా 2లక్షల 43వేల కుటుంబాలకు మేలు. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4వేల నుంచి 10వేలకు పెంపు. అంతర్జాతీయ ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్లు. ఆక్వాకల్చర్ కింద 12వేల హెక్టార్ల విస్తీర్ణం. 16లక్షల 5వేల మందికి జీవనోపాధి. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం ఐదేళ్లలో 30.65లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఐదేళ్లలో 2.53లక్షల కోట్ల నగదు బదిలీ. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం. వైఎస్సార్ పెన్షన్ను మూడు వేలకు పెంచాం. 66.35లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లకు ఐదేళ్లలో 84731 కోట్లు ఖర్చు చేశాం. 9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిస్తున్నాం. వైఎస్సార్ బీమా కింద రూ.650 కోట్లు ఖర్చు. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ. ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు పంపిణీ కాపునేస్తం కింద రూ.39,247 కోట్లు పంపిణీ. నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు. జగనన్న తోడు కింద రూ.3374 కోట్లు జగనన్న చేదోడు కింద రూ.1268 కోట్లు. వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5కోట్లు. బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చు. పోర్టులు, పరిశ్రమలు... ఏపీ పారిశ్రామిక విధానం 2019-27ను తీసుకొచ్చాం. ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం. పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి. రూ.3800 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఫైబర్ గ్రిడ్తో ప్రతీ గ్రామం అనుసంధానం. 55వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం. అవుకు రెండో టన్నెల్ పూర్తి. 1079కోట్లతో మూడో టన్నెల్. 77చెరువులతో అనుసంధాన ప్రాజెక్ట్ను ప్రారంభించాం వర్షాలపై ఆధారపడిన రైతులకు ఎంతో మేలు. ప్రాధన్య ప్రాజెక్ట్ల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.10137 కోట్లతో తొమ్మిది త్రాగునీటి పథకాలు మంజూరు. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం. రాష్ట్ర స్థాల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం. జాతీయ ఆహార భద్రతలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరకు బంగారు బహుమతి. చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి మూడో స్థానం. 311కుపైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు. మెగా పరిశ్రమల ద్వారా 1.30లక్షల మందికి ఉపాధి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా రూ.5995 కోట్ల పెట్టుబడి. పెట్టుబడులు.. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం. వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి ఆరో స్థానానికి. రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన ప్రభుత్వం మనదే. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి. 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 14 ఎలక్ట్రానిక్ కంపెనీల స్థాపన ద్వారా 34,750 మందికి ఉపాధి. 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు. 12042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రూ.19,345 కోట్ల మేర ఒప్పందాలు. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు. తిరుపతిలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాం. పురోగతిలో 13 న్యాయ భవన నిర్మాణాలు. 10893 గ్రామ పంచాయతీ భవనాలు. 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు. 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. ఆడుదాం ఆంధ్ర.. ఐదు అంచెల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. విజేతలకు 12కోట్ల 21లక్షల విలువైన బహుమతులు. 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతిలో 65 క్రీడా వికాస కేంద్రాలు జగనన్న పచ్చతోరణం కింద ఐదుకోట్ల 11లక్షల మొక్కలు నాటాం. నగరతోరణం కింద పట్టణ, శివార్లలో పచ్చదనం. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలను ప్రారంభించాం. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం. 17లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు. నాలుగు లక్షల 80వేల మ్యుటేషన్లలకు పరిష్కారం. ఉద్యోగాలు.. ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 213662 శాశ్వత నియామకాలు. 10వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. పోలీసు వ్యవస్థలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు. గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజలకు బదిలీ. డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం. నాన్ డీబీజీ ద్వారా రూ.1.68 కోట్లు అందించాం. కేబినెట్ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.. ►2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి. ►నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం. ►డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల. ►నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ►ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల. ►ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి. ►అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్. ► టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. ►మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►ప్రజాసమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు: బుగ్గన సభను అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు వచ్చారు. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ►అసెంబ్లీలో మళ్లీ గందరగోళం ►తీరుమార్చుకోని టీడీపీ సభ్యులు ►ఈరోజు కూడా స్పీకర్ తమ్మినేని వెల్లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు. ►సభా మర్యాదలు పాటించని టీడీపీ సభ్యులు. ►రెడ్లైన్ దాటి స్పీకర్ వెల్లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు. ►ఈరోజు కూడా పేపర్లు చింపి స్పీకర్పై వేసిన టీడీపీ సభ్యులు. ►సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యుల తీరు. ►స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం ►బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ►తొలిమూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ►సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం ►సెక్రటేరియట్కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కేబినెట్ సమావేశానికి హాజరు బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశాం ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత గత ఐదేళ్ల బడ్జెట్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం. ►మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు ►సెక్రటేరియట్కు చేరుకున్న మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు. ►సెక్రటేరియట్కు బయల్దేరిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు ►మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధికశాఖ అధికారులు ►మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్కు బయల్దేరనున్న మంత్రి బుగ్గన, అధికారులు ►అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు ►ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్ధిక శాఖ అధికారులు ►ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. ►రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ►ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ►అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను చదువుతారు. ►అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది -
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. ఉదయం 8గం. సమయంలో సచివాలయం ఫస్ట్ బ్లాక్లో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అనంతరం.. ఉదయం 9గం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 11గం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు బుగ్గన రాజేంద్రనాథ్. -
చెప్పింది చేయకపోవడం బాబు నైజం
డోన్: ఇచ్చిన మాట తూ.చ తప్పకుండా పాటించడం సీఎం జగన్ నైజమైతే, చెప్పిందేదీ చేయకపోవడమే చంద్రబాబు నైజమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆదివారం సుమారు రూ. 102 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెద్ద అబద్దాల పుట్ట అని విమర్శించారు. సంపద సృష్టించడమంటే తాత్కాలిక, గ్రాఫిక్స్ కట్టడాలు కాదని, ఉన్నచోటనే పారిశ్రామిక, వ్యవసాయ, ఉపాధి రంగాలలో అభివృద్ధి సాధించడమని మంత్రి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారన్నారు. ఉద్యోగులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు, జర్నలిస్టులకు ఆర్టీసీ చార్జీలో రాయితీలు ఇవ్వడం ద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని నాడు మనుసులో మాట అనే పుస్తకంలో రాసిన చంద్రబాబు.. నేడు సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీలంటూ చేతులెత్తేసిన మాయగాడు, నేడు అదే రైతులకు రెట్టింపు మొత్తం ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు మాయమాటలకు ప్రజలు మోసపోరని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి స్పష్టంచేశారు. జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాను న్యాయ రాజధాని చేయడం, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాల్లో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీఎంకు చేదోడుగా ఉన్నారన్నారు. సభలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజే‹Ù, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నకేశవయ్యగౌడ్ తదితరులు ప్రసంగించారు. -
చంద్రబాబుపై మంత్రి బుగ్గన అదిరిపోయే సెటైర్లు
-
డోన్ చరిత్రలో చెరగని ముద్రవేశాము: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
ప్యాపిలి: డోన్ నియోజకవర్గంలో దాదాపు రూ. 2,700 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ చరిత్రలో చెరగని ముద్ర వేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని హుసేనాపురం గ్రామంలో రూ. 18.77 కోట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, బాలుర, బాలికల వసతి గృహాలు, గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం తదితర భవనాలను ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులతో కలసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లలో డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికై న నాయకులు చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. ఐదేళ్లకోసారి ఎన్నికల ముందు కంబగిరి స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లే నాయకులు కనీసం ఆ దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయారని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డోన్ నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్యాపిలి మండలంలో మారుమూల గ్రామమైన వంకమెట్టుపల్లికి సైతం ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే తన ధ్యేయం అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని భావించి హుసేనాపురంలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు. పశుసంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాకపోవడానికి కారణం వెటర్నరీ విభాగంలో ఉన్నత చదువులు స్థానికంగా అందుబాటులో లేవని తాను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణం చేతనే హుసేనాపురంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశానని తెలిపారు. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వెంటనే సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో గొర్రెల పెంపకం ద్వారా సంపద సృష్టించుకున్న గొర్రెల పెంపకందార్లు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని మంత్రి తెలిపారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో షెప్పర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గొర్రెల పెంపకందార్లకు ఈ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. హామీలతో మభ్య పెడతారు జాగ్రత్త.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చి ఉచిత హామీలు గుప్పిస్తారని ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్ విమర్శించారు. మహిళలకు కిలో బంగారం, ఇంటికో కారు కూడా ఇస్తామని హామీ ఇస్తారని..అటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న దూరదృష్టి గల వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం డోన్ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. డోన్ అందరికీ ఆదర్శం డోన్ నియోజకవర్గ అభివృద్ధి అందరికీ ఆదర్శమని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు డోన్ నియోజకవర్గాన్ని చూసి అభివృద్ధి విషయంలో మంత్రిని ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు. తాను కొద్ది రోజులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంట పర్యటిస్తూ అభివృద్ధి కార్యాక్రమాలు చూస్తేంటే మంత్రి చొరవ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్, శ్రీవేంకటేశ్వర వెటర్నరి యూనివర్సిటి డీన్ వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ రవి, డైరీ డీన్ సురేశ్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమేంద్రకుమార్, ఏడీ సింహాచలం, నోడల్ ఆఫీసర్ లావణ్యలక్ష్మి, జేడీ రామచంద్రయ్య, డీఏహెచ్ఓ గోవిందనాయక్, డీడీలు శాంతయ్య, రామమూర్తి, ప్రిన్సిపాల్ మాధవి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లికార్జునరెడ్డి, హుసేనాపురం, కొమ్మేమర్రి సర్పంచులు మహేశ్వర్ రెడ్డి, దస్తగిరమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్యాంరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబే’
సాక్షి, అమరావతి: అప్పులపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. పార్లమెంట్లో పలు సార్లు కేంద్ర ఆర్దిక మంత్రి,తో పాటు ఆర్బీఐ, కాగ్ అప్పులపై గణాంకాలను వెల్లడించినా సరే ఆ గణాంకాలను కాదని లేని అప్పులున్నట్లు ఏ ప్రాతిపదికన, ఏ ఆధారాలతో చంద్రబాబు, ఎల్లో మీడియా చెపుతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎల్లో మీడియా వాస్తవాల గురించి వివరణలు తీసుకోకుండా అన్యాయంగా తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర అప్పులతో పాటు అన్ని అనర్దాలకు చంద్రబాబే కారణమని ఆయన స్పష్టం చేశారు. మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగులకు, సబ్సిడీలకు వ్యతిరేకంగా రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఇస్తానంటూ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘మోసం నేర్చెన్’.... అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదనే పాటలా బాబు వ్యవహారం ఉందని ఆర్దిక మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. అప్పులపైన గణాంకాలతో పాటు, చంద్రబాబు గత నిర్వాకాలను ఆధారాలతో సహా గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్దిక మంత్రి బుగ్గన వివరించారు. ఆయన మాటల్లోనే.. అప్పులపై నిరాధార ఆరోపణలు: రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల అప్పు చేసిందని ఒకరు.. రూ. 8 లక్షల అప్పు చేసిందని మరొకరు ఇష్టానుసారం ఆరోపిస్తున్నారు. నిజానికి మీరంతా (టీడీపీ నేతలు) గతంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ఇలా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు? ‘రుణకంఠుడు’ అంటూ.. సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెచ్చిన అప్పులు రూ. 7.34 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ ఆధారాలతో చంద్రబాబు, మా ప్రభుత్వం రూ. 13 లక్షల అప్పు చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదే మాట మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంటున్నారు. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగాల్సిన స్థాయిలో పెరగలేదని గతంలో నేను స్పష్టంగా చెప్పాను. అందు కోసం కేంద్రం ఇచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు కూడా చూపాను. పార్లమెంటులో కొందరు సభ్యులు వేసిన ప్రశ్నలకు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా, స్పష్టంగా సమాధానం చెప్పింది. అయినా ఇక్కడ మీడియా దారుణంగా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కడా వాస్తవాలు రాయడం లేదు. ఇది చాలా అన్యాయం. రాజకీయంగా ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే.. అందులో వాస్తవాలను మీడియా బేరీజు వేసుకోవాలి కదా? అప్పటి కంటే ఇప్పుడు బెటర్ చంద్రబాబు పాలన కంటే మా ప్రభుత్వం ఎన్నో విధాలుగా బెటర్. ఎందుకంటే అప్పటి కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. అప్పు శాతం కూడా వారి కంటే తక్కువే చేశాం. అయితే రావాల్సినంత ఆదాయం కోవిడ్ వల్ల రాలేదు. అలాగే ఖర్చు కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. వాస్తవాలు మర్చి నిందలు: ప్రభుత్వం ఏకంగా రూ. 10 లక్షల అప్పు చేసిందని ఆరోపించారు. రుణకంఠుడు సీఎం అంటూ రాసిన స్టోరీలో ఆ ఫిగర్ వేశారు. కానీ ఆ స్టోరీలో రాసిన మొత్తం అప్పు చూస్తే.. అ మొత్తం కేవలం రూ. 7,68,641 కోట్లు మాత్రమే. మరి రూ. 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇంకా పెండింగ్ బిల్లులు రూ. 1.70 లక్షల కోట్లు ఉన్నాయని రాశారు. ఆ లెక్కలు మీకు ఎవరు చెప్పారు? ఏ ఆధారాలతో మీరు అది రాశారు? ఇంకా డిపాజిట్లు, ఇతర మొత్తాలు కలిపి రూ. 28,286 కోట్లు అని రాశారు. అది ఎవరు చెప్పారు? ఇలా అన్నీ చూపుతూ.. తప్పుడు ఫిగర్ చెబుతున్నారు. ఆ అప్పుల్లో మీరు చేసినవే ఎక్కువ: మీ ప్రకారం లెక్క వేసుకున్నా.. మీరన్నట్లు రూ. 3.76 లక్షల కోట్లు బహిరంగ రుణాలు ఉంటే.. అందులో పాత రుణం రూ. 2,64,451 కోట్లు ఉన్నాయి కదా? 2019, మే నాటికే ఆ అప్పు ఉంది కదా? అదే విధంగా ఉదయ్ బాండ్స్. రూ. 8,256 కోట్లు అన్నారు. అది తీసుకుంది 2016లో కదా? ఇంకా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 33,118 కోట్ల రుణం. పాత ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుల కింద అందులో రుణం తీసుకుంది కదా? నాన్ గ్యారెంటీ లోన్ çపవర్ సెక్టర్లో రూ. 95 వేల కోట్ల రుణం అన్నారు. అందులో రూ. 69,596 కోట్ల రుణం.. పాత ప్రభుత్వం తీసుకున్నదే కదా? అ రుణం 2019, మే నాటికే ఉంది. సీఆర్డీఏ బాండ్స్ రూ. 1500 కోట్లు. ఆ అప్పు చేసింది మీరు కాదా? పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ. 50 వేల కోట్ల అప్పు అంటున్నారు. కానీ నిజానికి అందులో రూ. 22 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణమే. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 50 వేల కోట్ల రుణం తీసుకున్నారని రాశారు. కానీ నిజానికి ఆ రుణ మొత్తం రూ. 36 వేల కోట్లు మాత్రమే. ఇతర కార్పొరేషన్ల ద్వారా రూ. 1.45 లక్షల కోట్ల అప్పు అని రాశారు. ఆ మొత్తంలో పవర్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ. 95 వేల కోట్లు కూడా ఉంది. మరోవైపు ఆ రుణాన్ని కూడా వేరుగా చూపారు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 95 వేల కోట్లలో కూడా దాదాపు రూ. 70 వేల కోట్ల అప్పు గత ప్రభుత్వ హయాంలో చేసిందే. నిజానికి రాష్ట్రానికి ఉన్న అప్పు రూ. 7 లక్షలకు అటు ఇటుగా ఉంటే.. దాన్ని దారుణంగా పెంచి రూ. 10 లక్షల కోట్లు అని రాయడం అంత కంటే తప్పు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో కూడా దాదాపు రూ. 4 లక్షల కోట్లు గత ప్రభుత్వ హయాంలో చేసినవే. అయినా అన్నీ కప్పి పుచ్చి, మొత్తం అప్పును ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. రుణకంఠుడు సీఎం అంటూ రాయడం చాలా దారుణం. కనీసం జర్నలిజం విలువలు పాటించాలి కదా? ఎంత అన్యాయం? రాష్ట్ర అప్పు అప్పటికి రూ.4.28 లక్షల కోట్లు: గతంలో చాలాసార్లు చెప్పాం. మళ్లీ చెబుతున్నాం. ‘ఎ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్’ అని చెప్పి 15 ఏళ్ల డేటాతో ఆర్బీఐ ఒక్కోసారి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ)తో పాటు, వివిధ కేంద్ర రంగ సంస్థల నుంచి తీసుకున్న వివరాల (డేటా) ఆధారంగా ఆర్బీఐ ఆ డాక్యుమెంట్ (బుక్) రిలీజ్ చేస్తుంది. ఆ బుక్లో 15 ఏళ్ల డేటా ఉంటుంది. ఆ బుక్లో ఉన్న వివరాల ప్రకారం.. 2023 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పు రూ. 4,28,715 కోట్లు. ఆ బుక్లో ఉన్న వివరాల ప్రకారం 2019, మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,64,512 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం ఏర్పడే నాటికి.. అంటే మార్చి 2019 తర్వాత రెండు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 7,346 కోట్లు. అంటే గత ప్రభుత్వం దిగి పోయే నాటికి.. అంటే 2019, మే చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 2,71,797 కోట్లు. మరి 2023, మార్చి 31 నాటికి ఉన్న ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 4,28,715 కోట్లలో.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ. 2,71,797 కోట్లు తీసేయాలి కదా? బాబు హయాంలోనే ఎక్కువ అప్పులు వాస్తవాలు ఇలా ఉంటే.. మొత్తం అప్పులను ఈ ప్రభుత్వానికి ఆపాదించి రాయడం అత్యంత దారుణం. ఇక గత ప్రభుత్వ హయాంలో.. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ అప్పు ఎలా పెరిగింది? ఆ తర్వాత 2019 నుంచి నాలుగేళ్లలో ఎంతెంత పెరిగిందని చూస్తే.. -2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న ప్రభుత్వ అప్పు రూ. 1,53,346 కోట్లు కాగా.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 మే చివరి నాటికి ఆ రుణం రూ. 4,12,288 కోట్లకు చేరింది. అదే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో ప్రభుత్వ అప్పు రూ. 6,38,217 కోట్లు అంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ప్రభుత్వ వార్షిక అప్పు 21.8 శాతం పెరగ్గా.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా పెరిగిన అప్పు కేవలం 12 శాతమే. అది కూడా కోవిడ్ వంటి మహమ్మారి ఉన్నా కూడా.. చేసిన అప్పు తక్కువే. ప్రతి దానికి లెక్క. అన్నీ డాక్యుమెంట్లలో..: మా ప్రభుత్వంలో కార్పొరేషన్ల పేరుతో చెప్పకుండా రుణాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది. ప్రతి దానికి అక్కౌంట్స్, చెకింగ్స్ ఉంటాయి. బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రభుత్వ అప్పులను ఫారమ్ డీ-4లో చూపుతాం. అది పబ్లిక్ డాక్యుమెంట్. మరోవైపు 5వ వాల్యూమ్లో అప్పుల గురించి పూర్తి వివరాలు చెబుతాము. ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో ఒక భాగం. ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అప్పు తీసుకునేది ఆర్థిక సంస్థల నుంచే కదా? అది ఆటోమేటిక్గా బ్యాంక్ బుక్స్లో కూడా ఉంటుంది. పీఏసీ బుక్స్లో కూడా ఉంటాయి. ఇంకా డిబెంచర్ల రూపంలో రుణాలు సేకరించాలంటే.. బహిరంగంగానే చేయాలి. ఇందులో ఎక్కడా గోప్యత ఉండదు. ఏదీ రహస్యం కాదు. అప్పులో గోప్యత అసాధ్యం నిజానికి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగితే.. కేంద్ర ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అయినా దాన్ని రాయరు. చెప్పరు. ఆర్బీఐకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, సీఏజీకి తెలియకుండా, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా ఎక్కడైనా అప్పు చేయడం సా«ధ్యమేనా? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు కోసం ప్రత్యేకంగా చట్టం కూడా చేశాం. ఆ అప్పును ఎలా వినియోగిస్తామో కూడా అందులో స్పష్టంగా చెప్పాం. మహిళలు, రైతులకు సంబంధించిన నాలుగు పథకాల కోసం అని చెప్పడం జరిగింది. జీడీపీతో పోల్చినా.. అప్పుడే ఎక్కువ అప్పులు -ఇక మన స్థూల ఉత్పత్తి (రాష్ట్ర జీడీపీ)తో పోల్చి గత ప్రభుత్వ హయాంలో చేసిన, పెరిగిన అప్పు చూస్తే..గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఆ 5 ఏళ్లలో చేసిన అప్పు రూ. 2.59 లక్షల కోట్లు. అది రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే 7.45 శాతం . అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు దాదాపు రూ. 2.26 లక్షల కోట్లు. దాన్ని రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే అది కేవలం 5.2 శాతం మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే.. దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ బాండ్లు చాలా గొప్పవని చెబుతారు. అవి ఒకటిన్నర శాతం ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయంటారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బెవరేజెస్ బాండ్స్ 4.5 శాతం ఓవర్ సబ్స్క్రైబ్ అయినా.. దాని గురించి రాయరు. చెప్పరు. అనుమతి లేకుండానే నిధుల వినియోగం టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా రూ. 1,10,599 కోట్లు ఖర్చు చేసిందా అని ఆయన అడిగితే.. కేంద్రం ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాసనసభ అనుమతి లేకుండా రూ. 1.62 లక్షల కోట్లు ఖర్చు చేశారని సమాధానం చెప్పారు. అయినా దాని గురించి రాయరు. నోటికి ఏది వస్తే..అదే మాట్లాడతారా? మరో ఎంపీ రాష్ట్ర అప్పుల గురించి సభలో అడిగితే కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం.. 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం.. ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లు అని చెప్పారు. అదే 2022 రివైజ్డ్ ఎస్టిమేషన్నే తీసుకుంటే, అప్పు రూ. 3,93,718 కోట్లు మాత్రమే. ఆ మేరకు 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినా, ప్రభుత్వ అప్పు కేవలం రూ. 4.42 లక్షల కోట్లు మాత్రమే అయినా.. ప్రభుత్వ అప్పు రూ. 10 లక్షల కోట్లు అని, రూ. 13 లక్షల కోట్లు అని.. నోటికి ఎంత వస్తే అంత మొత్తం చెబుతున్నారు. ఎంత దారుణం ఇది? -చంద్రబాబు తన పరిపాలన బ్రహ్మాండం అంటారు. ఆయన పరిపాలన హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు రూ. 6.95 లక్షల కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలో సగటు స్థూల ఉత్పత్తి రూ. 10.84 లక్షల కోట్లు. రెండింటి మధ్య తేడా చూడండి. స్థూల ఉత్పత్తి పెరిగితే రెవెన్యూ కూడా పెరగాలి అంటారు కదా?. దానికి సమాధానం. రెవెన్యూ రాబడి-వాస్తవాలు చంద్రబాబు గతంలో మంత్రిగా, సీఎంగా పని చేశారు. 1999 నుంచి 2004 వరకు చూస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూ రాబడి 12.4 శాతం పెరిగింది. అదే 2004 నుంచి 2009 వరకు వైయస్సార్గారి హయాంలో 21.6 శాతం.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14.4 శాతం పెరగ్గా.. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే మన ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది. ఇవన్నీ లెక్కల్లో స్పష్టంగా ఉంటాయి కదా? ప్రభుత్వానికి ఎలా ఏ రూపంలో ఆదాయం వచ్చిందనేది ఉంటుంది కదా? చంద్రబాబు పాలన బాగుంటే, రెవెన్యూ రాబడి ఎందుకు పెరగలేదు? ఇప్పుడు ఉద్యోగులు పెరిగారు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు.ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే.. 2018-19లో 44.86 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటే.. 2022-23 నాటికి ఆ సంఖ్య ఏకంగా 60.75 లక్షలకు పెరిగింది. అంటే ఉద్యోగుల సంఖ్య పెరిగితేనే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు పెరుగుతాయి కదా? చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు దాదాపు 20 లక్షల ఉద్యోగులు పెరిగినట్లే కదా? రాష్ట్రంలో నిరుద్యోగులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో 2018-19లో నిరుద్యోగ శాతం 5.3 ఉంటే.. అది 2022-23 నాటికి అది 4.1 శాతానికి తగ్గిందని. అంటే చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. ఇవన్నీ పార్లమెంటులో భూపేందర్సింగ్ హుడా, కపిల్ సిబల్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు. బాబు మాటలు-నీటి మూటలు 2014లో సీఎం అయిన చంద్రబాబు, ప్రజలను మభ్య పెట్టేందుకు కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు.. స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఔకులో పారిశ్రామిక వాడ, బెంగళూరు పారిశ్రామిక వాడ, టెక్నాలజీ క్లస్టర్, కోయిలకుంట్లలో సిమెంట్ పరిశ్రమ, న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్, సోలార్ అండ్ విండ్ పవర్ స్టేషన్లు.. విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల పరిశ్రమ.. వీటిలో ఒక్కటైనా ఏర్పాటు చేశారా? ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ తప్ప. ఎందుకంటే వ్యవసాయానికి తగిన భూములు లేవు కాబట్టి. అది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పంప్డ్ స్టోరేజీ కింద అంత కంటే బాగా చేశాం. విమానాశ్రయాన్ని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవుకులో రామ్కో సిమెంట్ కంపెనీ ఇటీవలే ఏర్పాటైంది కదా? ఇప్పుడు మేము కదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. అంటే, ఆనాడు మీరు ఏమీ చేయకపోగా.. ఇంకా ఏం చెప్పారు. ఆలూరులో జింకల పార్కు. శ్రీశైలంలో పులుల పార్క్.అవి కూడా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు తన విధానాలు, ఆయన అనైతిక రాజకీయాల వల్ల ఇష్టానుసారం అప్పులు చేశారు. అందుకోసం ఏమేమో చేస్తామని చెప్పారు. బాబు దిగజారుడు మాటలు: ఇప్పుడు ఏవేవో పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యేలకు ఒక్కో పేరు పెడుతున్నారు. మరి మేము కూడా ఆ పని చేయలేమా? నీకు, నీ కుమారుడికి కూడా పేరు పెట్టలేమా? కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే మేము నీలా దిగజారి మాట్లాడం. నీతి లేని నాయకుడు చంద్రబాబు చంద్రబాబు రాజకీయ జీవితం చూస్తే.. ఎక్కడైనా విలువలకు కట్టుబడి ఉన్నాడా? ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు దగ్గరయ్యాడు కదా? 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్పేయి వేవ్లో గెల్చాడు. 2001లో మోదీని గుజరాత్ సీఎంగా దింపాలన్నాడు. 2004 వచ్చే సరికి మళ్లీ యూటర్న్. బీజేపీతో కలిసి ఎన్నికల్లో నిలబడి, ఓడిపోయిన తర్వాత ఓడిపోవడంతో.. తనది హిస్టారికల్ మిస్టేక్ అన్నాడు. మళ్లీ 2009 వచ్చే సరికి మరోసారి యూటర్న్. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో మహాకూటమి. ఎన్నికల్లో పోటీ. అప్పుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై నిశిత విమర్శలు చేశాడు. దానిపై ఆయన సోదరుడు పవన్కళ్యాణ్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. 2014 వచ్చే సరికి మళ్లా బ్యాక్. బీజేపీ, జనసేన. కాంగ్రెస్పై నిశిత విమర్శలు. మన్మోహన్సింగ్ను ఏకంగా సోనియాగాంధీ పెంపుడు కుక్క అన్నాడు. 2016 వచ్చే సరికి డీమోనిటైజేషన్. తానే మోదీకి సలహా ఇచ్చానని అన్నాడు. అది బూమరాంగ్ కావడంతో.. అది చరిత్రాత్మక తప్పిదం అన్నాడు. 2018 వచ్చే సరికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో జత కట్టాడు. 2019 ఎన్నికలు వచ్చే సరికి మోదీకో హఠావో.. దేశ్కో బచావో అన్నాడు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో.. మోదీ వంటి నేత దేశానికి అవసరం అన్నాడు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం ఒక్క వైయస్సార్ కాంగ్రెస్తో తప్ప.. అన్ని పార్టీలతో రాయబారాలు జరుపుతున్నాడు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్తో కూడా మాట్లాడుతున్నాడు. బాబు ఊసరవెల్లి రాజకీయాలపై పాట చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై రూపొందించిన ఒక పాట వీడియో ప్రదర్శించి చూపారు.‘మోసం నేర్చెను.. అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదు’.. అన్న పాట. బాబు మనసులో మాట ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక బుక్ రాశాడు. ‘అది మనసులో మాట’. ఆ బుక్లో పేజీ నెం.117లో ఏముందంటే.. మనం అవసరానికి మించి ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. 119వ పేజీ. ఎన్టీఆర్ కిలో బియ్యం రూ. 2 చేశారు. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్లీ రూ. 3.50 చేశాను. సబ్సిడీ ఇవ్వడం అంటే పులి మీద స్వారీ మాదిరిగానే. సబ్సిడీ ఇచ్చినా ఎన్టీ రామారావు, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఓడిపోయింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న అకాళీదల్ ఎన్నికల్లో ఓడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉద్యోగుల యొక్క, ఉద్యోగుల చేత, ఉద్యోగుల కోసం అన్నట్లుగా మారాయి. పేజీ నెం.124. విద్యుత్ మాత్రమే కాక, ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో ఎక్కువ భాగం తింటున్నాయి. పేదలకు సబ్సిడీ ఇళ్లు. ఖరీదైన పథకం. కొన్ని వర్గాలకు ఉచిత ప్రయాణం సరికాదు. మరి అదే ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అంటున్నాడు. ఇలా ప్రతిదీ ఫ్లిప్ఫ్లాప్. పేజీ నెం.62. ఉద్యోగుల్లో అవినీతి పెరిగింది. వివిధ శాఖల్లో అవినీతి పరులైన ఉద్యోగులు చాలా మంది పెరిగారు ఉద్యోగులు, వారి జీతభత్యాలు. పెన్షన్లు పెరుగుతున్నాయి. దాని కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక విష వలయం. స్వార్థ రాజకీయాలు: చంద్రబాబు రాజకీయ పొత్తులు చూస్తుంటే.. హాలీవుడ్ యాక్టర్ ఎలిజబెత్ టేలర్ గుర్తుకు వస్తుంది. ఆమె ఏడుసార్లు పెళ్లి చేసుకుంది. అందులో ఒకరిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. చంద్రబాబు రాజకీయ పొత్తులు కూడా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్. ఆ తర్వాత బీజేపీ. మళ్లీ కాంగ్రెస్. మళ్లీ బీజేపీ. జనసేన. ఇంకా వామపక్షాలు. నిజానికి ఆ పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వేరు. కానీ చంద్రబాబు మాత్రం అందరితో చర్చలు. విభజనలోనూ చంద్రబాబు అనైతిక రాజకీయాలు: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ. దీనికి చంద్రబాబు కూడా కారణం కాదా? 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశాడు. ఆ తర్వాత 2011లో శ్రీకృష్ణ కమిటి నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. 2012లో మరో లేఖ రాసి, తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాడు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పాడు. రాష్ట్రం విడిపోతే, తమ పార్టీ జాతీయ పార్టీ అవుతుందని అన్నాడు. అటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాడు. ఇటు తెలంగాణ ఏర్పాటు చేయాలని కూడా కోరాడు. ఇన్నిసార్లు ఐడియాలజీ మార్చుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఏనాడైనా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాడా? రాష్ట్ర అప్పులకు ఆయన కాదా కారణం. ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతానన్నా, తామే కడతామని తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానన్నాడు. కంప్యూటర్ కనిపెట్టానని చెప్పాడు. రాష్ట్ర విభజన సమయంలో ఉచిత సలహాలు కూడా ఇచ్చారు కదా? విభజన తర్వాత మనకు అన్యాయం జరిగింది. స్థూల ఉత్పత్తిలో సేవా రంగం (సర్వీస్ సెక్టర్) 45 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగం 33 నుంచి 38 శాతానికి పెరిగింది. హైదరాబాద్ మనకు లేకుండా పోవడం వల్ల మనకు దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల ఆదాయం పోయింది. అవన్నీ మీకు తెలియదా? మీరు నిపుణులు కాదా? అప్పులనేమో జనాభా ప్రాతిపదికన చేశారు. కానీ ఆస్తులను లొకేషన్ ప్రకారం విభజించారు. దాని వల్ల హైదరాబాద్ పోయింది. ఇక్కడ జనాభా ఎక్కువ కావడం వల్ల అప్పులు పెరిగాయి. విద్యుత్ రంగానికి వచ్చే సరికి, వినియోగం ఆధారంగా విభజించారు. దాని వల్ల తెలంగాణకు 54 శాతం, ఆ«ంధ్రప్రదేశ్కు 46 శాతం ఇచ్చారు. అంత అన్యాయంగా విభజన చేశారు. మీరు, కాంగ్రెస్ కలిసి చేశారు. రాష్ట్రానికి నష్టం, అన్యాయం చేశారు. మీ లక్ష్యం ఒక్కటే. జగన్గారిని ఇబ్బంది పెట్టాలి. విభజన తర్వాతా బాబు అన్యాయమే..: విభజన తర్వాత కూడా మీరు రాష్ట్రానికి అన్యాయం చేశారు. హోదా వద్దన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చుకోలేకపోయారు. వెనకబడిన ప్రాంతాల నిధి కూడా జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున సాధించలేకపోయారు. 2014-17 మధ్య రెండేళ్లు ఆ నిధి తెచ్చుకోలేకపోయారు. ఆ నిధిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించుకుంది. పోలవరం ప్రాజెక్టును 2014-15 నాటి ధరలకు అనుగుణంగా ఎలా పూర్తి చేస్తామని తెచ్చుకున్నారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తోంది. మీరు ప్రాజెక్టును ప్రొటోకాల్ ప్రకారం చేయలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం స్పిల్వే పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్లు కట్టారు. మధ్యలో గ్యాప్ ఇచ్చారు. దాని వల్ల పనులన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. రెవెన్యూ లోటు. దాన్ని కూడా మీరు సాధించలేదు. కానీ మేము రూ. 12 వేల కోట్లు తెచ్చుకున్నాం. మేము వచ్చాకనే రామాయపట్నం, కడప స్టీల్ ప్లాంట్ కడుతున్నాం కదా? పౌరసరఫరాల శాఖ అప్పుల్లో తెలంగాణ తన వాటా రూ.600 కోట్లు కట్టకపోతే.. ఎస్బీఐ కొంపల్లి శాఖలో ఖాతా ఫ్రీజ్ అయితే, మేము వచ్చాక ఆ డబ్బులు కట్టించి, మన వాటా తెచ్చుకున్నాం. ఇది వాస్తవమా? కాదా? ఇప్పుడు వచ్చి ఏదేదో చేస్తామంటున్నారు. మేము కేంద్రంతో మాట్లాడి అన్నీ సాధిస్తే.. కుమ్మక్కు అయ్యామంటారు. మీరు చేయలేదు. మేము చేస్తే.. విమర్శలు. ఇన్ని అనర్థాలకు కారణం బాబే..: ఈరోజు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అంటే.. ప్రధాన కారకుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబు.. ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఆయన చర్యలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు. అన్నీ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించేవే. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. ఉద్యోగుల భవిష్యత్తు కోసమే..: ఉద్యోగులకు సంబంధించి రాబోయే 30 ఏళ్లలో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిర్ణయాలు తీసుకున్నాం. ఓపీఎస్ గురించి నిర్ణయం తీసుకుంటే.. భవిష్యత్తులో అది మరింత భారమై, ఉద్యోగులకే నష్టం చేస్తుంది. ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే జీపీఎస్ అమలు చేస్తున్నాం. దాన్ని కేంద్రం కూడా ఆమోదిస్తోంది. మేము వచ్చాకే కొత్త ఉద్యోగాలు: మా ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య ఆరోగ్య శాఖలో ఎందరిని భర్తీ చేశాం. సచివాలయాల ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియడం లేదా? చంద్రబాబు మనసులో మాట పుస్తకం ద్వారా ఉద్యోగులపై తన మాట చెప్పాడు. ఇప్పుడు ఆయనే మళ్లీ ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు. అందుకే చంద్రబాబు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతారు. మీ లీడర్ చెబితే చేయాలంటారు,..మా లీడర్ చెప్పడమే తప్ప చేయడం ఉండదని టీడీపీ నేతలే అన్నారు. -
చంద్రబాబు మనసులో మాట.. ఉద్యోగులు కచ్చతంగా చూడాల్సిన వీడియో
-
ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి?
-
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి బుగ్గన
-
అన్ని తప్పుడు లెక్కలు.. మంత్రి బుగ్గన ఫైర్
-
చంద్రబాబు.. లోకేశ్కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి? అని ప్రశ్నించారు. అప్పులపై ఎల్లో మీడియా రాసేవన్నీ తప్పేనని స్పష్టం చేశారు. కాగా, మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22 శాతం పెరిగింది. టీడీపీ హాయంలో రూ,2,71,797 కోట్ల అప్పులు చేశారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే అప్పులు జరిగాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు?. చంద్రబాబు హయాంలో రెవెన్యూ ఆరు శాతం కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 16.7 శాతం రెవెన్యూ రాబడి వచ్చింది. కర్నూలుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు ప్రతీ ఊరికి వెళ్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు. లోకేశ్కు మేము పేరు పెట్టలేమా?. రాష్ట్రంలో అన్ని పార్టీలతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో బాబు దోస్తీ. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనేక సార్లు మాట మార్చారు. రాష్ట్ర అప్పులకు చంద్రబాబు కారణం కాదా?. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా?. ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీకి చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర విభజన చేశాయి. ప్రత్యేక హోదా వదిలేశారు, ప్యాకేజీ రాబట్టలేకపోయారు. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం. పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుండి మన వాటా నిధులు మేము సాధిస్తున్నాం. రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరింత సులభంగా జీఎస్టీ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సులభతరం చేస్తూ ప్రభుత్వం జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సరళీకృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 సేవా కేంద్రాలను ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ టాక్స్ విజన్, మిషన్ వాల్యూస్, ’జీఎస్టీ మిత్ర’ లోగోను ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 195 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులకు అనుకూల వాతావరణాన్ని కలి్పంచేలా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సేవా కేంద్రాల ద్వారా వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఉత్తమ సేవలు అందుతాయని, జీఎస్టీ ఎగవేతలను అరికట్టవచ్చని చెప్పారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతకు పాల్పడటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని తెలిపారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టు ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. పన్ను చెల్లించే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో టాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్సైట్ ను తీర్చిదిద్దారని తెలిపారు. పన్ను చెల్లింపుల వ్యవహారంలో ఇతర దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ కస్టమ్స్ అండ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ రాబడిలో మొదటి స్థానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో వాణిజ్య పన్నుల శాఖలో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించేలా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా పన్నులు కట్టే వారిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. నవంబర్ నెలలో జీఎస్టీ పన్నుల వసూళ్లలో 31 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు (20%), కేరళ (20%), తెలంగాణ (18%), కర్ణాటక (17%), ఒడిశా (3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్నాటికి రూ.21,180.57 కోట్ల జీఎస్టీ వసూలు ద్వారా 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 17.14 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. -
రాష్ట్రంలో పన్నుల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియ మరింత సులభం చేస్తూ పన్ను చెల్లింపు దారులకు, వ్యాపారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నూతన ఆవిష్కరణలు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్ విజన్, మిషన్ వ్యాల్యూస్, 'జీఎస్టీ మిత్ర' లోగోను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. జీఎస్టీ నెట్ వర్క్, మొబైల్ నంబర్ నమోదుతో పన్నుదారులకు ఓటీపీ ఆధారంగా మరింత సులువుగా సేవలు అందించడంతో పాటు పన్ను చెల్లింపులు, ఆర్థిక సంవత్సరాల నివేదికలు సహా ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయని పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి వాణిజ్య శాఖలో వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. నిజాయితీగా పన్నులు కట్టే వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాలకు సంబంధించిన భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము అవలంభిస్తున్న విధానాలతో గతేడాది నెలతో పోలిస్తే 31 శాతం గణనీయమైన వృద్ధితో పురోగతి సాధించామన్నారు. వృద్ధి రేటులో తమిళనాడు(20%), కేరళ(20%), తెలంగాణ(18%), కర్ణాటక(17%), ఒడిశా(3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందని మంత్రి వివరించారు. అంతేగాక నవంబర్, 2023 వరకు రూ.21,180.57 కోట్ల జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు చేసి 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. జీఎస్టీ వసూళ్లలో గతేడాది కన్నా 17.14 శాతం గణనీయమైన వృద్ధి సాధించామన్నారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టడంతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 12 జీఎస్టీ సేవాకేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకించి విజయవాడ నంబర్ 1 డివిజన్ లో మొదటి జీఎస్టీ సేవా కేంద్రం ప్రారంభించడం మైలురాయిగా భావిస్తున్నామన్నారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతలకు దొడ్డిదారులను ఎంచుకుంటున్నారని తద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని మంత్రి అన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని మంత్రి అన్నారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. భారత దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాలలో మాత్రమే ఉందని తెలిపారు. ట్యాక్స్ కట్టే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో ట్యాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ట్యాక్స్ కట్టే వారి వల్లే దేశం నడుస్తుందని అన్నారు. గతంలో మాదిరి పన్నులు ఎగ్గొట్టే వారిని పట్టుకోవడం కన్నా.. పన్ను వసూళ్లను సరళతరం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజన్ స్టేట్ మెంట్ ఉండటం ప్రతి వ్యవస్థకు అవసరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఆర్థిక శాఖకు సంబంధించి స్టేట్ ట్యాక్సెస్ కు ఒక విజన్ ఇచ్చిన రోజును తన జీవితంలో మరిచిపోలేనని మంత్రి చెప్పారు. పలువురు ఉన్నతాధికారులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలు అంశాలను అధ్యయనం చేశామన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీలు, పదుల సంఖ్యలో సమీక్షలు చేయడం ద్వారా ఇబ్బందులను పరిష్కరించి, సవాళ్లను అధిగమించామని చెప్పారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులకు 'శిక్షణ' ఆవశ్యకతను గుర్తించానన్నారు. గత కొన్నేళ్లలో నిర్వర్తించిన బాధ్యతలు సంతృప్తికరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్ సైట్ ను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. ఇతర దేశాల్లో మాదిరి పన్ను చెల్లింపుల వ్యవహారంలో మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. పన్ను చెల్లింపుదారులే లేకపోతే వాణిజ్య పన్నుల శాఖ లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తెలిపారు. వాణిజ్య పన్నులు, వసూళ్ల సరళతరం కోసం ఎన్నో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. పన్నుల వసూళ్లలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో పాత విధానాలకు స్వస్తి పలికి..సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికామన్నారు. పన్ను చెల్లించే వారికి ఏ ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండు మూడేళ్లలో మరిన్ని కీలక మార్పులతో ముందుకు వెళ్తామన్నారు. వాణిజ్య పన్నులు, జీఎస్టీలో సాంకేతిక పరిజ్ఞానం అమలులో ఏపీ ముందడుగు వేసిందని జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి అన్నారు. గొప్ప ఆవిష్కరణలు, సంస్కరణలకు వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. అర్ధశాస్త్రంలో పన్ను వసూలు గురించి కౌటిల్యుడు చెప్పిన 5 ప్రధాన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నామని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్ పేర్కొన్నారు. జీఎస్టీలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్ల వరకూ ఎదిగామని తెలిపారు. బోగస్ రిజిస్ట్రేషన్లు అరికట్టేలా వాణిజ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని అవి సత్ఫలితాలిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో పారదర్శక విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంస్కరణల వల్ల జీఎస్టీలో ఏపీ మెరుగైన ప్రతిభను కనబరుస్తుందన్నారు. రాష్ట్ర పన్నుల శాఖ స్థితిని, గతిని, దశను, దిశను ఉన్నత స్థాయికి పెంచి దేశస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను పలువురు అధికారులు కొనియాడారు. రాష్ట్ర పన్నుల శాఖలో సంస్కరణలు తేవాలని, ఈ శాఖను సేవా విభాగంగా చేయాలని, పారదర్శకతను పెంచాలని, టెక్నాలజీని అందిపుచ్చుకొని మెరుగైన సేవలను అందిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించాలని చెప్పి ఆచరణలో చూపించిన వ్యక్తి, అరుదైన ఆర్థిక నిపుణులు బుగ్గన రాజేంద్రనాథ్ అని పలువురు అధికారులు అభివర్ణించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, వాణిజ్యవేత్తలు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, ఆడిటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రుణానికి పూర్తి బాధ్యత మేఘాదే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడటం అంటే గజదొంగే దొంగా.. దొంగా అని అరిచినట్లుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణను ఆయన ఖండించారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని బుగ్గన గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం కొత్తగా వచ్చిన ఓ నాయకుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ.2,000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారని, అసలు గ్యారెంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేదన్నారు. ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ అనేది ముమ్మాటికీ అబద్ధమన్నారు. ఇది ప్రభుత్వమిచ్చిన గ్యారెంటీ కాదని, ప్రభుత్వం కేవలం ప్రైవేట్ సంస్థకు బకాయిలెన్ని ఉన్నాయి అని వివరాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదికూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినదని, పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్యాంకుకు కట్టవలసిన వడ్డీ ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని తెలిపారు. వడ్డీ, అసలు కట్టే విషయంలో ఎలాంటి ఆలస్యమైనా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. బ్యాంకులు ఆ ప్రైవేట్ సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్లు ఇస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం విషయంలో చేసిన తప్పులే ప్రస్తుత పరిస్థితులకు కారణమని బుగ్గన విమర్శించారు. మీరు పెట్టిన బకాయిలను మేం చెల్లించాం ఆరోగ్యశ్రీ బిల్లులకు గ్యారెంటీ ఇవ్వరా అని అడుగుతున్నారని, టీడీపీ పాలనలో రూ. 800 కోట్లు పైచిలుకు చివరి 8 నెలల కాలంలో పెండింగ్లో పెట్టినప్పుడు చంద్రబాబు గ్యారెంటీ ఇచ్చారా? అని బుగ్గన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలు చెల్లించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సామర్థ్యం పెంచి పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ. 5,177 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఈ నాలుగున్నరేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 9,514.84 కోట్లు వెచ్చించిందని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత టీడీపీకి ఎక్కడదని బుగ్గన అన్నారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉన్న రూ. 40,000 కోట్లు పెండింగ్ బిల్లులకు గ్యారెంటీ అడిగారా అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఇక ట్యాంకర్లతో అందించిన నీటికి బిల్లుల విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ. 80 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం రాగానే చెల్లించిందని చెప్పారు. -
మేఘాకు గ్యారెంటీ పచ్చి అబద్ధం: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: టీడీపీ.. దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమన్నారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే. ప్రభుత్వానికి సంబంధం లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తున్నారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారు. దోచుకోవడానికే ఇలా చేశారని వితండవాదం చేశారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదు’’ అంటూ మంత్రి బుగ్గన మండిపడ్డారు. ‘‘ఈ విషయం తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎందుకు మాట్లాడడం లేదు.?. ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో రూ.241 కోట్లు దోచుకుందెవరు?. రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు?. ఇన్నర్ రింగ్రోడ్డును మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు?. సామాన్య ప్రజలలో మా ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారు. అందుకే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లుతున్నారని ప్రజలకు అర్థం అయింది’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘జగనన్న గోరుముద్ద’కు జాతీయ పురస్కారం