Anantapur Crime News
-
దడపుట్టిస్తున్న ‘పార్థీ గ్యాంగ్’.. సీమలో దొంగతనాలతో హల్చల్
పార్థీ గ్యాంగ్... చోరీల్లో ఆరితేరిన ముఠా. చోరీ చేయడంలోనూ...పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ దిట్టలు. చోరీ సమయంలో అడ్డొస్తే అంతమొందించేందుకూ వెనుకాడని క్రూరులు. ఈ కరుడు గట్టిన దొంగల పేరు చెబితే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. ఈ గ్యాంగ్ ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పార్థీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే సామాన్యులకు హడల్. వీరి కన్ను పడితే ఎలాంటి భద్రత ఉన్నా ఇళ్లయినా లూఠీ కావాల్సిందే. చోరీలు ఈ గ్యాంగ్కు వెన్నతో పెట్టిన విద్య. తప్పించుకోవడంలోనూ వీరు ఆరితేరిపోయారు. దురదృష్టం వెంటాడి పోలీసులకు చిక్కినా ఇసుమంతైనా సమాచారం ఇవ్వరు. చోరీ సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించే ఈ గ్యాంగ్ కదలికలు రాయలసీమలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. తాజాగా గుంతకల్లు దగ్గర జరిగిన రైలు దోపిడీలోనూ వీరి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్లోని పాసే పార్థీ తెగకు చెందిన వారు. బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థానికంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద గుడారాలు వేసుకుంటారు. అదును చూసి చోరీలకు తెగబడతారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలపైనే వీరి కన్ను. వ్యాపారుల అవతారమెత్తి రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడతారు. ఈ నెల 20న పార్థీ గ్యాంగ్ సభ్యుడితో పాటు అరెస్టయిన మరో ఇద్దరు దొంగలు అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, కదిరి, హిందూపురం ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో పూసలు, దుప్పట్లు, గృహాలంకరణకు వినియోగించే మట్టి బొమ్మలు అమ్మే వ్యాపారుల్లా పార్థీ గ్యాంగ్ సభ్యులు అవతారమెత్తుతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడతారు. అడ్డొస్తే ప్రాణాలను సైతం తీస్తారు. ఇంత క్రూపమైన పార్థీ గ్యాంగ్కు ఓ మహిళ డాన్గా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలో పార్థీ గ్యాంగ్కు సంబంధించిన ఓ ముఠా సభ్యులు పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఈ పార్థీ గ్యాంగ్ ఎక్కడ చోరీలకు పాల్పడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా వారి ఆనవాళ్లు లేకుండా చూసుకుంటుంది. సెల్ఫోన్లను సైతం నేర ప్రాంతానికి సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ గ్యాంగ్లు ఎక్కడ దోపిడీకి పాల్పడినా వారి గ్రామాలకు చేరుకోకమునుపే పోలీసులు పట్టుకోవాలి. లేదంటే దోచుకున్న సొత్తులో పైసా కూడా రికవరీ చేయలేరు. కారణం దోచుకున్న సొమ్మలో 30 శాతం ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం పెద్దలకు ఇస్తారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు వీరికి బాసటగా నిలుస్తారు. మధ్యప్రదేశ్లో స్థానిక రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దొంగలు, అనుమానితులు, తీవ్ర నేరాల్లో పాలుపంచుకున్న వారి వివరాలను పోలీసులు అప్పట్లో చేతి వేలి ముద్రలు, కాలి ముద్రలు తీసి ఉంచారు. ఈ ఆధారాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అనంతపురంలో పట్టుబడ్డ పార్థీ గ్యాంగ్ సభ్యుడు కూడా పాత పోలీసులు సేకరించిన చేతి వేలిముద్రల ఆధారంగానే దొరికాడు. వేలిముద్రలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ సాఫ్ట్వేర్లోకి తీసుకొచ్చాం. అనుమానితుల చేతి వేలిముద్రలు మొబైల్లో తీసుకుని, ఇంటిగ్రేట్ చేసిన వాటితో సరిపోల్చుతాం. పార్థీ గ్యాంగ్లు వేసవిలో ఎక్కువగా తిరుగుతుంటాయి. రైళ్లలో దోపిడీలు కూడా చేస్తుంటాయి. వీటిపైనా నిఘా ఉంచాం. లాక్ చేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడతాయి. ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళితే పోలీసులకు సమాచారమందిస్తే నిఘా పెడతాం. ఇప్పటికే రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలనూ అప్రమత్తం చేశారు. – ఎం.రవికృష్ణ, డీఐజీ, అనంతపురం రేంజ్ -
శ్రావణిని చంపేశారా!?
కదిరి అర్బన్: గత ఏడాది తప్పిపోయిన డిగ్రీ విద్యార్థిని శ్రావణిని హతమార్చారా? ప్రస్తుతం లభ్యమైన మానవ అవశేషాలు, పర్సు, సెల్ఫోన్ శ్రావణివేనా? తదితర ప్రశ్నలకు సమాధానం అవుననే సమాధానం వస్తోంది. తొమ్మిది నెలలుగా కొనసాగుతూ వచ్చిన పోలీసు దర్యాప్తు.. ప్రస్తుతం లభ్యమైన ఆధారాలతో వేగం పుంజుకోనుంది. వివరాల్లోకి వెళితే.. కదిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శ్రావణి 2019, అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయింది. కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబసభ్యులు పలు చోట్ల గాలించి, చివరకు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలలు గడుస్తున్నా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. పట్టణ సమీపంలోనే ఆధారాలు లభ్యం ఈ నెల 22న స్థానిక మున్సిపల్ పరిధిలోని సోమేష్ నగర్ సమీపంలో శ్రావణికి సంబంధించి ఆధారాలు ఓ గొర్రెల కాపరికి కంటపడ్డాయి. అనుమానం వచ్చిన ఆ కాపరి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్ లాల్ మహమ్మద్, సీఐ రామకృష్ణ, ఎస్ఐ మహమ్మద్ రఫీక్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పంట పొలాల్లో పడి ఉన్న పర్సులో శ్రావణి ఐడీ కార్డు, సెల్ఫోన్, ఏటీఎం కార్డు, చిన్న మొత్తంలో నగదు లభ్యమయ్యాయి. పర్సు పడి ఉన్న చోటుకు కొద్దిదూరంగా ఓ పుర్రె, రెండు ఎముకలను గుర్తించారు. ఇవి శ్రావణివేనా లేక మరెవరివైనా అనేది తేలాల్సి ఉంది. లభ్యమైన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు సీఐ తెలిపారు. కాగా, శ్రావణిపై అత్యాచారం జరిపి హతమార్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చావుకోరిన ప్రేమ
లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో.. వీడలేనంత దగ్గరయ్యాయి కన్నవాళ్లు.. కులం.. కట్టుబాట్లు.. అడ్డుతగిలాయి ఆ పసి మనసులు విలవిల్లాడిపోయాయి ఎడబాటును తట్టుకోలేకపోయాయి వీడిపోలేక.. వీడి ఉండలేక... చావులో ఒక్కటవుదామనుకున్నారు భవిష్యత్ తలచుకుని భయాందోళన చెందారు పురుగుల మందునే ప్రేమామృతంగా తాగారుఆస్పత్రికి తీసుకెళ్లినా ఒకరి తర్వాత మరొకరు తనువు చాలించారుశృతి తప్పిన ప్రేమ ప్రకాశించకపోగాకన్నవారికి కడుపుకోత మిగిలింది. బత్తలపల్లి: తమ వివాహానికి కులాలు అడ్డు వస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ధర్మవరం రూరల్ సీఐ వీసీ పెద్దయ్య తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన గొడ్డుమర్రి చిన్నపోతులయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు ఓంప్రకాష్(18), అదే గ్రామానికి చెందిన మనోహర్, సావిత్రి దంపతుల కుమార్తె శ్రుతి(18).. ధర్మవరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బుధవారం వేకువజామున 5.30 గంటలకు యువకుడి తోటలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరు గంటలకు యువకుడి సమీప బంధువులు తోటలో బెండకాయలు కోయడానికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఇరువైపుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముందు యువకుడు.. ఆ తర్వాత యువతి మృతి చెందారు. ఘటనపై ధర్మవరం రూరల్ సీఐ పెద్దయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పట్టుచీరల ముసుగులో మద్యం రవాణా
ధర్మవరం అర్బన్: పార్శిల్ సర్వీస్ ముసుగులో గుట్టుచప్పడు కాకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును సెబ్ పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్ ఎఎస్పీ రామ్మోహన్రావు వెల్లడించారు. హైదరాబాద్లోని కాచిగూడ నుంచి పట్టుచీరలు, చీరల పార్శిల్ బాక్స్లతో ఎస్బీఆర్ఎస్ కార్గో సర్వీస్కు చెందిన కేఏ07ఏ 2083 ఐచర్ వాహనం మంగళవారం రాత్రి బయలుదేరింది. 44వ జాతీయ రహదారి మీదుగా నేరుగా ధర్మవరానికి వస్తున్న ఆ వాహనాన్ని పలు చెక్పోస్టుల వద్ద సిబ్బంది ఆపి పరిశీలించారు. కార్గో పార్శిల్ సర్వీస్ వే బిల్లులు చూపుతూ.. పట్టుచీరలు, చీరలు తరలిస్తున్నట్లుగా అందులోని వ్యక్తులు చెబుతూ లైన్ క్లియరెన్స్ తీసుకుంటూ వచ్చారు. దీంతో ఎలాంటి అనుమానాలు ఆ వాహనాన్ని చెక్పోస్టుల వద్ద వదిలిపెడుతూ వచ్చారు. ముందస్తు సమాచారంతో.. హైదరాబాద్ నుంచి భారీగా మద్యం బాటిళ్లను అక్రమంగా ధర్మవరానికి తరలిస్తున్నట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఏఎస్పీ రామ్మోహన్రావుకు సమాచారం అందింది. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసిన ఆయన... బుధవారం తెల్లవారుజామున ధర్మవరం సమీపంలోని వేల్పుమడుగు వద్ద కాపు కాశారు. వేగంగా దూసుకువస్తున్న ఐచర్ వాహనాన్ని గుర్తించి సెబ్ సీఐలు జయనాథరెడ్డి, నరసానాయుడు, భీమలింగ, ఎస్ఐలు చాంద్బాషా సాదిక్ వలీ అడ్డుకున్నారు. ఆ సమయంలో వాహనంలో ఉన్నవారు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. ‘ఇది ఎస్బీఆర్ఎస్ పార్శిల్ వాహనమని, ఇందులో పట్టుచీరలు, చీరలు తప్ప మరేమీ లేవంటూ నమ్మబలికారు. అయితే తమకున్న పక్కా సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేసి తీరాల్సిందేనంటూ పోలీస్ అధికారులు పట్టుబట్టారు. నిందితులు వీరే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా దశల వారీగా మద్యనిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం అమ్మకాలపై పలు రకాలుగా నిషేధం విధిస్తూ వచ్చింది. దీనికి తోడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగంగా మద్యం ఎక్కడా లభ్యం కావడం లేదు. దీనిని సొమ్ము చేసుకోవాలని భావించిన పలువురు అక్రమ మార్గాల ద్వారా అధిక ధరలకు మద్యం విక్రయించి తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని భావించారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణానికి చెందిన చీరల వ్యాపారి కోనారెడ్డితోపాటు మరో ఆరుగురు సిండికేట్గా ఏర్పడి, హైదరాబాద్లో భారీగా మద్యం కొనుగోలు చేసి కార్గో పార్శిల్ సర్వీసు ద్వారా రాచమార్గంలో ధర్మవరానికి చేరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సెబ్ ఎఎస్పీ రామోహ్మన్రావు పథకం ప్రకారం ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో కోనారెడ్డితో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్లు సెబ్ ఏఎస్పీ పేర్కొన్నారు. మద్యం బాటిళ్లు, టోబాకో టిన్లతో పాటు ఐచర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. కాగా, మద్యం అక్రమ రవాణా గుట్టును రట్టు చేసిన సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్రెడ్డి, మారుతీప్రసాద్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రూ. లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు.. పోలీస్ అధికారుల ఒత్తిడికి వాహనం తలుపులు తీసి పట్లు చీరల బాక్స్లు చూపించారు. అయితే ఆ బాక్స్లు తెరవాలని పోలీసు అధికారులు ఆదేశించడంతో రాజీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా పోలీస్ అధికారులు వినలేదు. చివరకు పోలీస్ అధికారులే బాక్స్లను తెరవాల్సి వచ్చింది. బాక్స్లు తెరిచిన తర్వాత పోలీసులే అవాక్కయ్యారు. అదులో ఏకంగా రూ.1.61 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లు, పొగాకు డబ్బాలు బయటపడ్డాయి. -
లవ్ ఫెయిల్యూర్; టిక్టాక్ వీడియోలు చేసి..
-
లవ్ ఫెయిల్యూర్; టిక్టాక్ వీడియోలు చేసి..
సాక్షి, అనంతపురం : గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహ్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో కేఎమ్ రాము అనే విద్యార్థి బీఎస్సీ (డిగ్రీ) చదువుతున్నాడు. కొంత కాలంగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన రాము బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్టాక్ చేశాడు. ఈ వీడియోలను టిక్టాక్లో అప్లోడ్ చేసిన అనంతరం రైలు కిందపడి రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె ) -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించారు. అమ్మా, నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలియని పిల్లలు అమాయకంగా అటు ఇటు తిరుగుతుండటం చూపరులను కలచివేసింది. చిన్నవయసులోనే ఆ పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశావా దేవుడా అంటూ బంధువులు విలపించారు. అనంతపురం, వజ్రకరూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వజ్రకరూరు మండలం బోడిసానిపల్లి తండాకు చెందిన మూడ్ కేశవనాయక్(30)కు ఇదే మండలం ఎన్ఎన్పి తండాకు చెందిన వరలక్ష్మిబాయి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు యువరాజ్తోపాటు ఒకటిన్నర సంవత్సరం వయసు గల కూతురు నందిని ఉంది. వరలక్ష్మిబాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. కేశవనాయక్ అక్క ధనలక్ష్మికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంలో భార్య, కూతురితో కలిసి బళ్లారికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం బళ్లారి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పాల్తూరు క్రాస్ వద్ద గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందగా కేశవనాయక్ అనంతపురం ఆస్పత్రిలో అదే రోజు రాత్రి మృతి చెందాడు. కూతురు నందిని స్వల్ప గాయాలతో బయట పడింది. ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనంత ఫ్యాక్షన్.. నలుగురికి యావజ్జీవం
సాక్షి, అనంతపురం : తిప్పేపల్లి ఫ్యాక్షన్ హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కర్నూలు సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు పూర్వాపరాలు ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ధర్మవరం రూరల్ మండలం తిప్పేపల్లిలో దేవరపల్లి వర్గం, ముక్తాపురం వర్గం నడుమ దశాబ్దాల తరబడి ఫ్యాక్షన్ గొడవలున్నాయి. కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేవరపల్లి వర్గానికి దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి, ముక్తాపురం వర్గానికి ముక్తాపురం రామకృష్ణారెడ్డి (70) నాయకత్వం వహించేవారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం తిప్పేపల్లి కాగా అనంతపురంలో సంపూర్ణ లాడ్జి నడుపుతున్నాడు. వీరిద్దరి నడుమ వర్గపోరుతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ►తిప్పేపల్లి నుంచి సంగాలకు రోడ్డు మార్గం దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి తోటలోంచి వెళ్లే ప్రతిపాదన ఏడేళ్ల కిందట వచ్చింది. అయితే రోడ్డు వేయకుండా లక్ష్మినారాయణరెడ్డి జిల్లా కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకొచ్చేవాడు. ఇది ముక్తాపురం వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదను చూసి హత్యకు కుట్రపన్నారు. 2013 ఏప్రిల్ 12 నుంచి మొదలుపెట్టి పలు దఫాలు లక్ష్మినారాయణరెడ్డిని హత్య చేయటానికి పన్నాగం పన్నారు. లక్ష్మినారాయణరెడ్డి తోటలోనే మారణాయుధాలు దాచివుంచి అదను కోసం వేచి ఉన్నారు. చదవండి: జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్ ఎట్టకేలకు మే 5వ తేదీన లక్ష్మినారాయణరెడ్డి ఒంటరిగా బైక్ మీద వస్తున్న విషయం తెలిసి అతను ఇంకా బండి దిగకమునుపే దాడిచేసి హతమార్చారు. అటునుంచి మారణాయుధాలను వెంకటరెడ్డి పొలంలో పారవేసి శివలింగారెడ్డి ఇంటికి చేరారు. హత్యజరిగిన వెంటనే ప్రత్యక్షసాక్షిగా హతుడి భార్య దేవరపల్లి రామకృష్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం రూరల్ పోలీసులు తిప్పేపల్లికి చెందిన ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై కేసు నమోదు చేశారు. ►ఫ్యాక్షన్ కేసు కావటంతో సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురితో పాటు కసిరెడ్డి రాజారెడ్డి, తిప్పేపల్లికి చెంది, అనంతపురంలో సంపూర్ణలాడ్జి నడుపుతున్న ముక్తాపురం రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో స్థిరపడిన ముక్తాపురం అనిల్కుమార్రెడ్డి, బత్తలపల్లి మండలం సంగాలకు చెందిన కొడకండ్ల నరసింహారెడ్డి, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన గొర్ల వెంకటలింగారెడ్డి, గొర్ల రామలింగారెడ్డి, తాడిమర్రి మండలం ఆత్మకూరుకు చెందిన పొడెమల ఓబిరెడ్డి, వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఎగువ పల్లికి చెందిన శివలింగారెడ్డిలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తొలుత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై సాక్ష్యాధారాలు నిరూపణ కావటంతో ఆ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పు చెప్పారు. మిగిలినవారిపై నేరారోపణలు రుజువుకాక పోవటంతో నిర్దోషులుగా విడుదల చేశారు. దర్యాప్తు అధికారిగా సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ ఉపేంద్రబాబు వ్యవహరించగా, కోర్టులో సాకు‡్ష్యల హాజరుకు సహకరించిన కోర్టు కానిస్టేబుళ్లు బత్తలపల్లి పోలీసుస్టేషన్కు చెందిన రామాంజి, సీబీసీఐడీకి చెందిన జాఫర్షావలిని పోలీసు అధికారులు అభినందించారు. చదవండి: తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం -
అత్తా.. అమ్మమ్మా అంటూ నమ్మిస్తాడు.. ఆపై!
సాక్షి, అనంతపురం: అత్త.. అమ్మమ్మ అంటూ వరుసలు కలుపుతాడు.. నేను మీ బంధువును అంటూ నమ్మిస్తాడు.. అదును చూసి దోచేస్తాడు. ఈ మోస్ట్ వాంటెడ్ దొంగను సీసీఎస్, తాడిపత్రి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి రూ. 40 లక్షల విలువజేసే 101.4 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల మస్తాన్వలి అలియాస్ మస్తాన్ ఐటీఐ వరకు చదువుకుని ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. తాగుడు, పేకాట, బెట్టింగ్లకు అలవాటుపడి దొంగగా మారిన మస్తాన్ రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో గత మూడేళ్లలో ఏకంగా 26 నేరాలకు పాల్పడ్డాడు. మంచిగా, నేర్పుగా, అణకువగా మాట్లాడటం.. అత్త, అవ్వ, మామా అంటూ బంధుత్వాలు, వరుసలతో మాటలు కలపడమే పనిగా పెట్టుకున్నాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఇళ్లలో మగవాళ్లు లేని సమయం చూసి వృద్ధ మహిళలతొ మీకు దూరపు బంధువును అవుతానని నమ్మబలుకుతాడు. వారు నిజమేనని నమ్మి మర్యాదలు చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారు ధరించిన బంగారు ఆభరణాలు బాగున్నాయని కితాబిస్తూనే చాకచక్యంగా నగలను ఇవ్వాలని కోరుతాడు. ఇతని మాటలు నమ్మి వారు ఆభరణాలను ఇచ్చేస్తాడు. ఒక వేళ ఇవ్వని పక్షంలో లాక్కొనిపారిపోతాడు. అరెస్టయినా మస్తాన్ 26 కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. తాడిపత్రి రూరల్, పామిడి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, అనంతపురం, కర్నూలు జిలాలలో ప్యాపిలి, మద్దికెర, కడపలో రాజుపాళ్యం, ప్రకాశం ప్రాంతాల్లో 2017 నుంచి నేరాలకు పాల్పడ్డాడు. అంతకు మునుపు కూడా ఇతనిపై 14 నేరాలున్నాయి. గతంలో తిరుపతి, కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినా ఇతనిలో మార్పు రాలేదు. దొంగలపై నిఘా ఉంచిన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మస్తాన్ను సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ శ్యాంరావు, తాడిపత్రి రూరల్ ఎస్ఐ రాజశేఖర్, సీసీఎస్ ఎస్ఐలు చలపతి, చాంద్బాషా, సిబ్బంది శ్రీనివాసులు, భాస్కర్, కృష్ణానాయక్, జయచంద్రారెడ్డి, తిరుపతయ్య, ఫరూక్, అనిల్, మల్లి, సతీష్, మనోహర్, రంజిత్, దూద్వలీ అరెస్ట్ చేశారు. వీరిని ఎస్పీ సత్యయేసుబాబు అభినందించారు. రివార్డులతో సత్కరించారు. -
భర్త మందలించాడని..
అనంతపురం, ధర్మవరం అర్బన్: భర్త మందలించాడని క్షణికావేశంలో ఓ వివాహిత కత్తితో చేయికోసుకున్న ఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని శాంతినగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్కు చెందిన శివ, కవితలు మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. అయితే శివ మొదటి భార్య చనిపోవడంతో పెద్దల సూచనమేరకు కవితను పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటిలో బిడ్డకు కవిత అన్నం సరిగా తినిపించలేదని భర్త శివ మందలించాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఎదురు తిరగడంతో భార్య కవితపై శివ చేయిచేసుకున్నాడు. దీంతో క్షణికావేశంతో ఆమె ఇంటిలో ఉన్న కత్తితో చేతికి కోసుకుంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీనాథ్ ఏమయ్యాడు?
సోమందేపల్లి: పట్టణానికి చెందిన మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి డబ్బు ఎత్తుకెళ్లారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళితే.. శ్రీనాథ్ ఇటీవల ప్రభుత్వ షాపులో సూపర్వైజర్గా నియమితుడయ్యారు. తోటి సిబ్బందితో కలసి వ్యాపార లావాదేవీలు చూసుకునే వాడు. మద్యం షాపులో (సీఆర్ఓ నంబర్11146) రోజు వసూలైన కలెక్షన్ను బ్యాంకులో చెల్లించి సంబంధిత రశీదులను ఎక్సైజ్ అదికారులకు అప్పగించేవాడు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మద్యం షాపునకు సంబంధించిన డబ్బును తన వద్దే ఉంచుకున్న శ్రీనాథ్, సోమవారం షాపు తనిఖీ నిమిత్తం వచ్చిన ఎక్సైజ్ పోలీసులు తనిఖీ అనంతరం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల్లో కట్టి రశీదు అప్పగించాలని సూచించారు. దీంతో డబ్బు చెల్లించి రశీదు అప్పగించి వస్తానని చెప్పి షాపు నుంచి బయటకు వెళ్ళిపోయిన శ్రీనాథ్ అనంతరం కనిపించకుండా పోయాడు. సాయంత్రం వరకు ఎదురు చూసిన సిబ్బంది ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వగా పూర్తీ స్థాయిలో పరిశీలించి, కుటుంబసభ్యులతో విచారించి అనంతరం ఎక్సైజ్ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా? శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాలధారణలో వున్న వ్యక్తి గత 4 రోజుల క్రితం పెనుకొండ మండలానికి ఆనుకుని వున్న కొత్తచెరువు మండలంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్రీనాథ్ సైతం మాలధరించి ఉండడం వల్ల చనిపోయింది శ్రీనాథ్ అని, శవం కుళ్లిపోయి ఉండటంతో పోలీసులు ప్రాథమికంగా శ్రీనాథ్ అని నిర్ధారించినా డీఎన్ఏ రిపోర్టు కోసం నమూనాలు ల్యాబ్కు పంపారు. రిపోర్టు వచ్చే వరకు చనిపోయింది ఎవరన్నది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. బెట్టింగ్ ప్రభావమేనా? శ్రీనాథ్కు ఆన్లైన్ బెట్టింగే ఆడే అలవాటు ఉందని పలువురు సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న మద్యంషాపు డబ్బును ఆన్లైన్ బెట్టింగ్లో పొగొట్టుకుని బ్యాంకులో డబ్బు కట్టలేక, అధికారులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే శ్రీనాథ్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ లావాదేవీలు సెల్ఫోన్లోనే జరిపే వాడని,. ఈ క్రమంలో అతడి సెల్ఫోన్ సైతం మాయం కావడం అంతుబట్టని రహస్యంగా మారింది. అయితే సెల్పోన్లో జరిపిన లావాదేవీలు, అతడు ఫోన్లో అదృశ్యమయిన రోజు జరిపిన సంభాషణలను పోలీçసులు బయటకు తీయగలిగితే కొంత వరకు వాస్తవాలు బయటపడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పలువురు సన్నిహితుల సెల్ఫోన్లు పోలీసుల వద్ద వున్నాయి. వీటిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. బ్యాంక్లో కట్టమని చెప్పాం సోమవారం మద్యం షాపును తనిఖీ చేసిన అనంతరం 3 రోజులకు సంబంధించిన మొత్తం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులో చెల్లించి రశీదు ఇవ్వమని సూపర్ వైజర్ శ్రీనాథ్కు సూచించాం. అయినా ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. డబ్బుతో తమకు సంబంధం ఉండదు. సూపర్వైజర్లే బ్యాంకులో చెల్లించాలి. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసాం. విచారణ చేస్తున్నారు.– జబీవుల్లా, ఎక్సైజ్ ఎస్ఐ, పెనుకొండ లోతుగా విచారిస్తున్నాం మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యంపై పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. 4 రోజుల క్రితం కొత్తచెరువు పరిధిలో అయ్యప్ప మాలధారణలో వున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనాథ్ సైతం మాలధరించి వుండడంతో అతనేమైనా ఉండొచ్చు అనే కోణంలో విచారిస్తున్నాం. అదృశ్యమైన రోజు ఏ టవర్ల కింద ఫోన్ సంభాషణలు జరిపాడన్న విషయమై కాల్ డేటా సేకరిస్తున్నాం. – శ్రీహరి, సీఐ, పెనుకొండ -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నగరంలో అనంతసాగర్కాలనీకి చెందిన షికారి కోటయ్య, షికారి రామకృష్ణ, బుడ్డప్పనగర్కు చెందిన షికారి మెచిలి అలియాస్ నాగి, టీవీ టవర్కు చెందిన షికారి శీనా, షికారి శీను ఉన్నారు. వీరి నుంచి 62 తులాలు బంగారు, 18 తులాలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు. 2018లో నగరంలోని అరవింద్నగర్, హౌసింగ్బోర్డు 2019లో కక్కలపల్లి పంచాయతీ దండోరాకాలనీ, ఎల్ఐసీ కాలనీ, ఆకుతోటపల్లి, హౌసింగ్బోర్డు, తాటిచెర్ల, ఓబుళదేవరనగర్, ఎల్ఐజీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్కాలనీ, ఆకుతోటపల్లి, కళ్యాణదుర్గం రోడ్డులలో చోరీలు చేశారు. జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, కర్నూలు జిల్లాలో కూడా నేరాలకు పాల్పడ్డారు. ఐదుగురిలో షికారి శీనా మినహా మిగిలిన వారిపై కేసులున్నాయి. దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పక్కా సమాచారం అందుకొని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో అశ్వర్థనారాయణస్వామి కట్ట వద్ద ఐదుగురినీ అరెస్ట్ చేశారు. వీరిని పట్టుకోవడంలో రూరల్ సీఐ మురళీధర్రెడ్డి, టూటౌన్ సీఐ జాకిర్హుస్సేన్, వన్టౌన్ సీఐ ప్రతాప్రెడ్డి, ఎస్ఐలు రాఘవరెడ్డి, జయపాల్రెడ్డి, ఏఎస్ఐ రమేష్, సిబ్బంది జయరామ్, దాసు, రామకృష్ణ, ప్రవీణ్, గిరి, ఆసిఫ్ల బృందం కీలకంగా వ్యవహరించింది. ఎస్పీ సత్యయేసుబాబు రివార్డులతో సిబ్బందిని అభినందించారు. -
కీచకోపాధ్యాయుడు
తండ్రి తర్వాత తండ్రిలా వ్యవహరించాల్సిన ప్రధానోపాధ్యాయుడు గతి తప్పాడు.విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సమయంలో సహ ఉపాధ్యాయినిల పట్ల కీచకుడిగా మారాడు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో ఉన్న శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోనిది. ప్రధానోపాధ్యాయుడివైఖరితో విసుగు చెందిన బాధితులు వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. కీచకోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు.చివరకు సమస్యపై స్పందించిన సీఎం పేషీ.. తక్షణమేఆ కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులుజారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.నటరాజ్ వైఖరి వివాదస్పదంగా మారింది. వందల సంఖ్యలో ఇక్కడ బాల, బాలికలు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్థాయి నుంచి హెచ్ఎం వరకూ ఐదేళ్లుగా ఈ పాఠశాలలో పనిచేస్తూ వస్తున్న నటరాజ్.. తరగతి గదుల్లో పాఠాలు చెప్పకుండా అనుచిత ప్రవర్తనలతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అతని వెకిలి చేష్టలకు చిన్నారుల మనసులు గాయపడ్డాయి. విషయాన్ని తల్లిదండ్రులకు గాని, ఇతరులకు గాని చెబితే హాజరుపట్టిలో అబ్సెంట్ వేస్తానని బెదిరిస్తూ తన పబ్బం గడుపుకుంటూ వచ్చాడు. మాట కాదంటే పైశాచికం తన మాట వినలేదన్న అక్కసుతో గతంలో ఎనిమిదో తరగతి విద్యార్థి వెంకటరమణను నటరాజ్ తీవ్రంగా చితకబాదాడు. ఘటనలో వెంకటరమణ చెయ్యి విరిగింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రూ.30 వేలు చెల్లిస్తూ దుప్పటి పంచాయితీతో బయటపడ్డాడు. స్కూల్ అసిస్టెంట్గా ఉంటూ వచ్చిన నటరాజ్ ఈ ఏడాది జూన్ 19న ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ పొంది, తిరిగి ఇదే పాఠశాలలో బాధ్యతలు స్వీకరించాడు. హెచ్ఎం అన్న అహంకారంతో అతను మరింత రెచ్చిపోతూ.. ఈ సారి ఏకంగా ఉపాధ్యాయినులను టార్గెట్ చేస్తూ వచ్చాడు. అతని వెకిలి చేష్టలతో విసుగు చెందిన ఉపాధ్యాయినులు.. గ్రీవెన్స్లో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అతన్ని అప్పటి తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఉపాధ్యాయినుల పట్ల మరింత వేధింపులు మొదలయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో మహిళా టీచర్లు ఇబ్బంది పడుతూ వచ్చారు. తన మాట వినకపోతే కులం పేరుతో దూషిస్తున్నాడంటూ నటరాజ్పై ఇద్దరు మహిళా టీచర్లు ఈ నెల 9న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కానీ, నటరాజ్ అరెస్ట్ చూపలేకపోయారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటరాజ్ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఈ నెల 11న సీఎం పేషీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. విషయం తెలుసుకున్న నటరాజ్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. -
వివాహిత దారుణహత్య
అనంతపురం, పుట్లూరు: మడుగుపల్లి ఎస్సీ కాలనీలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో భర్తే ఆమెను కడతేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడుగుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి(30)కి ఎనిమిదేళ్ల కిందట నార్పల మండలం దుగుమర్రికి చెందిన వీరశేఖర్తో వివాహమైంది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఇటీవల భార్య ప్రవర్తనపై వీరశేఖర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. వేధింపులు పెరిగిపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆరేళ్ల కుమారుడు దేవాను తీసుకుని వెంకటలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. బంధువులు, ఇతర పెద్దలు పంచాయితీ చేసి నెల రోజుల క్రితం మెట్టినింటికి పంపారు. అయినా వీరశేఖర్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మళ్లీ 20 రోజుల క్రితం ఆమె మడుగుపల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వీరశేఖర్ మడుగుపల్లికి వచ్చాడు. సోమవారం ఉదయాన్నే తాను దుగుమర్రికి వెళ్తున్నానని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నడిపి బయన్న, లక్ష్మిదేవిలకు చెప్పి బయల్దేరాడు. అల్లుడు వెళ్లిపోయాక బయన్న, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం వేళ కుమారుడు సమీప ఇళ్ల వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. ఇక ఒంటరిగా ఉన్న వెంకటలక్ష్మి కాసేపటికే దారుణహత్యకు గురైంది. స్థానికుల సమాచారంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలంలో రుబ్బుడుగుండు, కొడవలి పడి ఉన్నాయి. హత్యాస్థలిని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ దేవేంద్రకుమార్ పరిశీలించారు. హత్యకు గల కారణాలపై మృతురాలి తల్లిదండ్రులను ఆరా తీశారు. భర్తే రుబ్బుడుగుండుతో మోది హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు
చిత్తూరు, పాకాల: ‘అమ్మా... నాన్నా ఇక ఇవే నాచివరి మాటలు. ఇక మీదట నేనుండను, నన్నుక్షమించండి. నేను చనిపోతున్నా’ అంటూ ఓ కన్న బిడ్డ తల్లిదండ్రులకు చివరిక్షణంలో మాట్లాడిన మాటలివి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. వివరాలు ఇలా ఉన్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో యువకుడు మృతి చెందాడని గుర్తించి పాకాల రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు చౌడేపల్లె పోలీసుల సహాయంతో సమాచారమిచ్చారు. చౌడేపల్లె మండలం కోటూరు గ్రామానికి చెందిన ఎస్. సయ్యద్ అహమ్మద్ కుమారుడు సైదుల్లా (23) కూలీ పనిచేసుకొంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం ఇంటి వద్ద నుంచి తల్లిదండ్రులతో గొడవపడి పాకాలకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ నుంచి తన స్నేహితులకు ఫోన్ చేసి నేను ఇక ఉండను, చనిపోతున్నానంటూ స్నేహితులకు చెప్పాడని, చివరిసారిగా తన అమ్మా .. నాన్నలతో మాట్లాడించాలని కోరగా వారు అతని సూచనల మేరకు ఫోన్లో తల్లితండ్రులకు మాట్లాడించినా ఫలితం లేకపోయింది. పాకాల సమీపంలోని రైల్వే ట్రాక్మీద విగతజీవిగా పడి ఉన్న తన బిడ్డను చూసిన తల్లితండ్రులు బోరున విలపించారు. కాగా అందరితో ఆప్యాయతతో మెలిగే సైదుల్లా ఇకలేరని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. -
లారీలు, బస్సులున్నాయి ఇంకా పెళ్లికాలేదని..
హిందూపురం: అమ్మాయిలకు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుంటున్న గోరంట్ల మండలం బుదిలివాండ్లపల్లికి చెందిన రంగప్ప (30) అనే మోసగాన్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహబూబ్బాష చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురంలోని ఓ యువతికి ఐదునెలల క్రితం ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మాటలు కలిసి తన వివరాలు తెలిపే క్రమంలో బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నానని, అనాథనని తనకు లారీలు, బస్సులున్నాయని నమ్మించాడు. ఇంకా పెళ్లికాలేదని చెప్పుకొచ్చాడు. అలా మాటలు కలిపి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ముగ్గులోకి దించాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానుకల కింద బంగారు నగలు, భారీగా నగదును ముట్టజెప్పారు. డబ్బుదస్కం అందినవెంటనే మోసగాడు ముఖం చాటేశాడు. ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. బయటపడిన బండారం అనుమానం వచ్చిన యువతి తల్లిదండ్రులు విచారించగా రంగప్ప మోసగాడని తెలింది. అతనికి ఇంతకు మునుపే ముగ్గురు, నలుగురు యువతులను ఇలాగే ప్రేమ, పెళ్లిళ్లు పేరిట మోసం చేసినట్లు తెలిసిందన్నారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగప్పను వన్టౌన్ పోలీసులు అరెస్టుచేసి విచారించారు. చిలమత్తూరు మండలంలోని పాతచామలపల్లిలో ఓ యువతితో పెళ్లిఅయ్యి ఇద్దరు సంతానం ఉన్నారని తెలిసింది. అలాగే బెంగళూరులో మరో యువతి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా రెండుచోట్ల వివాహాలపేరిట మోసం చేసినట్లు తెలిసింది. ఇతన్ని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చుతున్నామని డీఎస్పీ తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..
కర్ణాటక,బళ్లారి అర్బన్: బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చిన ఘటన చోటు చేసుకొంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొళగల్లు గ్రామానికి చెందిన కాగి సోమయ్య(34) అనే వ్యక్తి ఈనెల 20న తన భార్య యల్లమ్మతో కలిసి ద్విచక్ర వాహనంలో బళ్లారి–హొసపేటె రోడ్డులోని రామేశ్వరినగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వంతెన వద్దకు రాగానే పథకం ప్రకారం యల్లమ్మ తన ప్రియుడు, అదే గ్రామానికి గ్రామ పంచాయితీ సభ్యుడు సంజీవప్పను అక్కడకు పిలిపించింది. దీంతో సంజీవప్ప వారిని అటకాయించి సోమయ్యపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి హెచ్ఎల్సీ ప్రధాన కాలువలోకి మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి సోమయ్య ఆచూకీ లేకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి యల్లమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న సంజీవప్ప కోసం గాలింపు చేపట్టారు. కాగా సోమయ్య మృతదేహం మంగళవారం లభ్యమైంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హనుమంతప్ప దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం, గోరంట్ల: కమ్మలవాండ్లపల్లిలో బి.వాణిశ్రీ (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వాణిశ్రీ, నాగరాజు దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మద్యానికి బానిసైన నాగరాజు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. అదనపు కట్నం తీసుకురానందున మీ పుట్టింటి వారు ఇక్కడికి వచ్చినా, వారితో నీవు మాట్లాడినా తాను తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకుంటానంటూ నాగరాజు భార్యను హెచ్చరించాడు. అంతటితో ఆగక అలిగి కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి రచ్చబండ వైపు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన వాణిశ్రీ ఇంట్లోనే ఇనుపరాడ్కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త, స్థానికులు గమనించి ఉరికి వేలాడుతున్న వాణిశ్రీని కిందకు దించి గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే ఆమె ప్రాణం విడిచింది. మెట్టినింటి వారిపై ఆగ్రహం తమ కుమార్తె వాణిశ్రీ మృతికి మెట్టినింటి వారి కట్నం వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతురాలి తండ్రి వెంకటరామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదులో ఆలస్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బంధువులతో కలిసి మృతదేహంతో మంగళవారం ప్రభుత్వాస్పత్రి నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని తెలపడంతో వారు శాంతించారు. ఐదుగురిపై కేసు నమోదు ఫిర్యాదును పలుమార్లు మార్చి ఇవ్వడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని సీఐ జయనాయక్ స్పష్టం చేశారు. వాణిశ్రీ మృతికి ఆమె భర్త నాగరాజుతో పాటు అతని సోదరులు నాగేంద్ర, రవి, శ్రీనివాసులు, ఆడపడుచు రత్నమ్మ కారణమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఐదుగురిపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
బస్సు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
సాక్షి, మడకశిర(అనంతపురం) : తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం బస్సు లోయలో పడిన ప్రమాదంలో మడకశిరకు చెందిన ఇద్దరు మృతి చెందారు. పట్టణానికి చెందిన మేడా శ్రీనివాసులు(62), మేడా మధురాక్షమ్మ(56) ఈ ప్రమాదంలో మరణించారు. వీరు శుక్రవారం రాత్రి మడకశిర నుంచి ఓ ప్రైవేట్ మినీ బస్సులో అన్నవరం, భద్రాచలం తదితర ప్రాంతాల సందర్శనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చెళ్ళకెరకు వెళ్లారు. చెళ్ళకెరలోని బంధువులను కూడా ఆయా ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం భద్రాచలంలో పూజలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అన్నవరానికి వెళ్తుండగా మారేడుమిల్లి–చింతూరు మధ్య వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడగా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో మడకశిరకు చెందిన మేడా శ్రీనివాసులు, మేడా మధురాక్షమ్మ ఉన్నారు. ఈ దంపతులకు కుమారుడు కిశోర్, కుమార్తెలు ఆశ, నాగమణి సంతానం. కుమార్తెలిద్దరికీ వివాహం కాగా.. కుమారుడు కిశోర్ ఓ ప్రైవేట్ టెలికాం సంస్థలో పని చేస్తున్నాడు. మృతులు మడకశిరలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుమారుడు తన మిత్రులతో కలిసి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. మృతుల్లో కొందరి మూలాలు మడకశిరలోనే.. మృతుల్లో ఎక్కువమందికి మడకశిరతో సంబంధం ఉంది. ప్రస్తుతం చెళ్ళకెరలో నివాసం ఉంటున్న మేడా వెంకటాచలపతి(56), మేడా గాయత్రమ్మ(52), వీరి కుమార్తె మేడా శ్వేత(25) కూడా మృతుల్లో ఉన్నారు. వీరు మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలం ఇనగలూరుకు చెందిన వారు. ఈ కుటుంబం 25 ఏళ్ల పాటు ఇదే మండలంలోని దొక్కలపల్లిలో చిల్లర అంగడిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించారు. ఐదేళ్ల క్రితమే ఈ కుటుంబం అంతా చెళ్ళకెరకు వలస వెళ్లింది. ప్రమాదంలో ఈ కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడం బంధువులను విషాదంలోకి నెట్టింది. -
పిల్లల ఆకలి చూడలేక తల్లి ఆత్మహత్య
సాక్షి, కళ్యాణదుర్గం రూరల్(అనంతపురం) : పిల్లల పోషణ భారమై వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణం చౌడేశ్వరివీధిలో నివాసముంటున్న నాగరాజు, నాగమణి దంపతుల కుమార్తె బోయ రేణుక (26)కు కుందుర్పి మండలం గురువేపల్లికి చెందిన మూర్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు హర్షిత(8), ధరణి(3), మరో 4 నెలల పాప ఉన్నారు. మూర్తి మూడు ఎకరాల పొలంలో టమాట సాగు చేశాడు. పంట చేతికందకపోవడంతో నష్టం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో కొన్ని నెలలు పుట్టింటిలో ఉండాల్సిందిగా భార్య, పిల్లలను కళ్యాణదుర్గం పంపించాడు. అక్కడ కుమార్తెలను పోషించుకునే దారి తెలియక మదనపడేది. బతుకుదెరువు కనిపించకపోవడంతో పిల్లలను పస్తులుండటం చూడలేక మనస్తాపం చెందిన రేణుక సోమవారం ఉదయం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బంధువులు, స్థానికులు గమనించి ఆమెను కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేణుక ప్రాణం విడిచినట్టు డాక్టర్లు నిర్ధారించారు. భర్త మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను శిశు గృహానికి పంపించడానికి చర్యలు తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లల బాగుగోలు చూసుకునేందుకు అనంతపురంలోని శిశుగృహకు పంపించడానికి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సీడీపీఓ గీతాంజలి, సూపర్వైజర్ పద్మజ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని చిన్నారుల వివరాలను సేకరించారు. త్వరలోనే చిన్నారులను శిశుగృహకు అప్పగిస్తామని సీడీపీఓ చెప్పారు. -
ప్రియుడే చంపేశాడు
సాక్షి, అనంతపురం ,గుత్తి: ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందన్న నెపంతో ప్రియుడే మట్టుబెట్టాడు. వివరాల్లోకి వెళితే గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డు(షాలోన్ నగర్)లో నివాసముంటున్న ఓ డిగ్రీ విద్యార్థిని (మైనర్) శనివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా హంతకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జక్కల చెరువుకు చెందిన వాయల రంగస్వామి (ఇతడూ మైనరే) అనే వ్యక్తి నుంచి విద్యార్థినికి కాల్ వచ్చింది. దీంతో సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు ఇబ్రహీం, రాజేష్లు హత్య చేసింది ప్రియుడు వాయల రంగస్వామి అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే జక్కల చెరువు గ్రామానికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్కు తరలించి తమ దైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని రంగస్వామి అంగీకరించాడు. అయితే విచారణలో హంతకుడు పలు ఆసక్తికర విషయాలు చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వాయల రంగస్వామి, సదరు విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తి అయ్యాక డిగ్రీకి తలా ఒక కాలేజీలో చేరారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని మరో విద్యార్థితో చనువుగా ఉంటున్నట్లు తెలుసుకున్న రంగస్వామి ఆమెను పలుసార్లు హెచ్చరించాడు. ఆమె వినిపించుకోలేదని మట్టుబెట్టాలని పథక రచన చేశాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకు ఫోన్ చేసి మీ ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన ఆమెతో గొడవ పెట్టుకున్న రంగస్వామి తన వెంట తెచ్చుకున్న బైక్ క్లచ్ వైర్ను ఆమె గొంతుకు బిగించి ఆపై తలను గోడకు బాదాడు. అంతటితో ఆగకుండా చున్నీని మెడకు బిగించి ఇంటి కాంపౌండ్ వాల్ ఆవలకు పడేసి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. -
రిటైర్డ్ కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, తాడిపత్రి: పట్టణంలోని కాలువగడ్డ వీధిలో రిటైర్డ్ ఫైర్ కానిస్టేబుల్ లక్ష్మన్న (68) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న పుట్టపర్తిలో అగ్నిమాపకశాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఎనిమిదేళ్ల కింద పదవీ విరమణ పొందాడు. లక్ష్మన్నకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య, పెద్దకుమారుడు హరి అనంతపురంలో నివాసముంటుండగా, రెండవ కుమారుడు హరిక్రిష్ణ వైఎస్సార్ జిల్లా పులివెందులలో నివాసముంటున్నాడు. గతంలో లక్ష్మన్న తాడిపత్రి పట్టణంలోని టైలర్స్కాలనీలోని తన సొంత నివాసంలో ఉండేవాడు. ప్రస్తుతం కాలువగడ్డ వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి లక్ష్మన్న రక్తపుమడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ తేజమూర్తి, ఎస్ఐ ఖాజాహుసేన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మన్న మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడు లక్ష్మన్న, కుమారులకు ఆస్తి విషయంలో తగాదాలు ఉండేవని తరచూ లక్ష్మన్న కుమారులు తన తండ్రి వద్దకు వచ్చి గొడవ పడతూ వెలుతుండేవారని స్థానికులు పోలీసులకు వివరించనట్లు సమాచారం. దీంతో లక్ష్మన్న రెండవ కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి : కోరిక తీరిస్తేనే.. లేదంటే జీవితాంతం.. -
అత్తారింట్లో అల్లుడి అనుమానాస్పద మృతి
సాక్షి, చెన్నేకొత్తపల్లి(అనంతపురం): అత్తారింట్లో అల్లుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చెన్నే కొత్తపల్లి మండలం నామాల గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు... కూడేరుకు చెందిన వీరాంజనేయులు (32) మూడేళ్ల కిందట నామాల గ్రామానికి చెందిన తులసమ్మను వివాహం చేసుకున్నాడు. ఇటీవల వీరికి కూతురు జన్మించింది. పుట్టింటిలో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వీరాంజనేయులు వారం క్రితం నామాలకు వచ్చాడు. ఏమైందో తెలీదు కానీ ఆదివారం తెల్లవారుజామున గదిలో ఉరికి వేలాడుతుండటాన్ని బంధువులు గమనించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పదో తరగతి విద్యార్థి కిడ్నాప్కు యత్నం
అనంతపురం, కళ్యాణదుర్గం రూరల్: కిడ్నాప్కు గురైన పదో తరగతి విద్యార్థి మార్గమధ్యలో తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాలిలా.. నారాయణపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, అంజినప్పల కుమారుడు అజిత్ స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు అజిత్ను ఆపి మల్లాపురం గ్రామానికి దారి అడిగారు. దారి చూపి ముందుకెళుతుండగా వారు పాఠశాల వద్ద దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు. పాఠశాల వద్ద ఆపకుండా వెళ్తుండటంతో గట్టిగా అరవడం తో కళ్లకు, నోటికి గంతలు కట్టి కంబదూరుకు తీసుకెళ్లారు. అక్కడి మద్యం కోసం దుకాణం వద్ద కారు ఆపిన సమయంలో విద్యార్థి తప్పించుకున్నాడు. సమీపంలో ఉన్న ఇళ్లలోకి వెళ్లి జరిగిన విషయాన్ని వారి ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లో చేరవేశాడు. వారు అక్కడికి చేరుకొని బాలుడిని వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివశంకర్నాయక్ స్పందిస్తూ.. ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. -
కన్నకూతురిపైనే అఘాయిత్యం
సాక్షి, అనంతపురం: కనురెప్పే కాటేసిన చందాన కన్న కూతురిపై ఓ తండ్రి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలో ఓ కాలనీలో నివాసముంటున్న వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె(16)ను గత కొంతకాలంగా లైంగిక వేదింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయంపై బాధిత బాలిక 1098 చైల్డ్లైన్ను ఆశ్రయిచింది. దీంతో చైల్డ్లైన్ సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్కమిటీ ముందు హాజరుపరిచారు. జరిగిన విషయాన్ని తెలియజేయడంతో సీడబ్ల్యూసీ అధికారులు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. దీంతో వన్టౌన్ సీఐ ప్రతాప్రెడ్డి నిందితుడిపై ఫోక్సోయాక్టు కింద కేసు నమోదు చేశారు. నిందితున్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలియజేశారు. ఇది చదవండి : సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే.. -
పరిటాల సునీత వర్గీయుల దాష్టీకం
-
పరిటాల వర్గీయుల బరితెగింపు
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో పరిటాల వర్గీయులు బరితెగించారు. వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నసనకోట గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు పక్కనే వెంకటాపురం, గంగంపల్లి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే గొడవ నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పరిటాల వర్గీయులు, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో నసనకోట వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు బోయ సూర్యం తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చాకలి నాగభూషణ, నరసింహులు, సావిత్రమ్మ, ముత్యాలప్ప, నరేష్, ప్రతాప్, క్రిష్ణమ్మ గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీస్పికెట్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. -
మొబైల్ కొనివ్వలేదని అఘాయిత్యం
సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : మొబైల్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని గుల్జార్పేటలో నివాసముంటున్న హెచ్చెల్సీ ఉద్యోగి జయరామిరెడ్డి కుమారుడు యశ్వంత్ (20) బెంగుళూరులోని ఓ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. తండ్రి కొనిచ్చిన ఖరీదైన మొబైల్ ఫోన్ను ఇటీవల పోగొట్టుకున్నాడు. తనకు మరొక మొబైల్ కొనివ్వాలని యశ్వంత్ అడగ్గా.. కొద్దిరోజులు ఆగితే కొనిస్తానని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో యశ్వంత్ వినాయక చవితి పండుగకు తాడిపత్రిలోని తన చిన్నాన్న రామ్మోహన్రెడ్డి ఇంటికి వచ్చాడు. తండ్రి తనకు మొబైల్ కొనివ్వలేదన్న మనస్తాపంతో సోమవారం ఉదయం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు సుబ్బారెడ్డి, వరప్రసాద్, రాజశేఖర్రెడ్డిలు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇది చదవండి : రైలు నుంచి విద్యార్థి తోసివేత -
సాక్స్లో మొబైల్ ఫోన్ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..
సాక్షి, అనంతపురం : కణేకల్లు మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోనుతో వచ్చి మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన అభ్యర్ధిని డీబార్ చేయడంతో పాటు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. రాయదుర్గానికి చెందిన బి.నౌషాద్కు సచివాలయ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రం కణేకల్లు మోడల్ స్కూల్ పడింది. సెప్టెంబరు ఒకటో తేదీన ఉదయం సాక్స్లో సెల్ఫోన్ దాచుకుని పరీక్ష కేంద్రంలోకి వచ్చాడు. అయితే సిబ్బంది తనిఖీల్లో సెల్ఫోన్ను గుర్తించలేకపోయారు. పరీక్ష ముగియడానికి అరగంట ముందు మొబైల్ బయటకు తీసి గూగూల్లో సెర్చ్ చేసి ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాశాడు. చివరకు ఇన్విజిలేటర్ గుర్తించాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ పోలీస్ విచారణకు ఆదేశించడంతో నౌషాద్ తాను మొబైల్ తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యనారాయణ అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేశారు. సరైన పర్యవేక్షణ చేయనందుకు సంబంధిత ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్, సెక్యూరిటీ స్టాఫ్పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. -
కారు కోసమే హత్య
సాక్షి, బుక్కపట్నం(అనంతపురం) : బుక్కపట్నం మండలం సిద్దరాంపురం సమీపంలోని పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని శవాన్ని గొర్రెలు, పశువుల కాపర్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడిని చంపి.. తర్వాత గుర్తుపట్టకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పు పెట్టినట్లు నిర్ధారించారు. అయితే మృతదేహం వద్ద ఆనవాళ్లేవీ కనిపించకపోవడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు, కర్ణాటకలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని అన్నపూర్ణశ్వేరి నగర్ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన వారి వివరాలు సేకరించారు. జూలై 23న తన సోదరుడు కనబడుటలేదని నరసింహమూర్తి (23) సోదరి రమ్య ఫిర్యాదు చేసింది. రమ్య, మృతుడి కుటుంబ సభ్యులు బుక్కపట్నం పోలీస్ స్టేషన్కు వచ్చి సంఘటనా స్థలంలో లభించిన వస్తువులను చూసి అవి తమ సోదరుడు నరసింహమూర్తివేనని గుర్తుపట్టారు. హంతుకులకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించకపోయినప్పటికీ పుట్టపర్తి రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, బుక్కపట్నం ఎస్ఐ విజయ్కుమార్, సిబ్బంది ఆధునిక పరిజ్ఞానం సాయంతో నలుగురు నిందితులను గుర్తించారు. వీరిని శనివారం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద అరెస్ట్ చేశారు. కారు కోసం ఘాతుకం.. నరసింహమూర్తి వద్ద ఉన్న షిఫ్ట్ డిజైర్ కేఏ41–బీ–7966 కారు కోసమే హత్య చేసినట్లు నిందితులు పొదలి వంశీకృష్ణ, కృష్ణమూర్తి కార్తీక్, పూజారి బలరామ్, ప్రతాప్ తెలిపారు. జూలై 19న రాత్రి 10.30 గంటల సమయంలో బెంగుళూరులోని మెజిస్టిక్ బస్టాండ్ వద్ద బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి పోవాలని బాడుగకు మాట్లాడుకొని కారులో బయల్దేరారు. గ్రామ సమీపంలో పాడుబడ్డ బావి వద్దకు చేరుకున్నాక నలుగురిలో ఇద్దరు టవల్తో గొంతుకు బిగించి నరసింహమూర్తిని చంపారు. మొదట మృతదేహాన్ని కారులో చుట్టుపక్కల తిప్పి.. చివరకు చంపిన చోటుకే వచ్చారు. అక్కడ మృతదేహంపై కిరోసిన్ పోసి కాల్చారు. అనంతరం కారులో కర్ణాటకలోని యాదిగిరికి చేరుకుని, అక్కడ ఒక వ్యక్తి దగ్గర రూ.60 వేలకు కారును తాకట్టు పెట్టారు. కారు అమ్మిన తరువాత డబ్బులు చెలిస్తామని అక్కడి నుంచి వెళ్లారు. ఈ క్రమంలోనే గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద పట్టుబడ్డారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. -
కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి
సాక్షి, గుత్తి(అనంతపురం) : కానిస్టేబుల్ దంపతులపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గుత్తి మండలం బసినేపల్లి తండా సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసినేపల్లి తండాకు చెందిన ఎం.వెంకటేష్ నాయక్ ఓడీచెరువులో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఈయన తన భార్యతో కలిసి బుధవారం రాత్రి బైక్లో బసినేపల్లి తాండాకు బయలుదేరాడు. తండా సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద దుండగులు దారిలో కంప చెట్లు అడ్డం పెట్టారు. వెంకటేష్ నాయక్ ద్విచక్ర వాహనం దిగి కంప చెట్లను తొలగిస్తున్నాడు. ఇంతలో అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు దుండగులు ఒక్క ఉదుటున దంపతులపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి వద్దనున్న రెండు సెల్ఫోన్లు, కొంత డబ్బు లాక్కొని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ దంపతులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండావాసులు బ్రిడ్జి వద్దకు వచ్చి దుండగుల కోసం గాలించారు. అయితే అప్పటికే దుండగులు పారిపోయారు. -
తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్ అడిగితే..
సాక్షి, పెద్దపప్పూరు(అనంతపురం): లిఫ్ట్ అడిగిన మహిళను బైక్పై ఎక్కించుకున్న వ్యక్తి ఆమెను గమ్యస్థానం చేర్చకుండా మరోచోటుకు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తబ్జుల గ్రామానికి చెందిన ఓ మహిళ కృష్ణాష్టమి సందర్భంగా శింగనగుట్టపల్లిలో ఆలయానికి వెళ్లింది. దర్శన అనంతరం ఇంటికి తిరిగి వస్తోంది. తమ గ్రామానికే చెందిన చాకలి శ్రీరంగ బైక్పై వస్తుండటంతో ఆమె లిఫ్ట్ అడిగింది. సరేనని బైక్లో ఎక్కించుకున్న శ్రీరంగ.. గ్రామ సమీపంలో ఆపాలని ఆమె కోరినా ఆపకుండా మరోచోటుకు తీసుకెళ్లి ఆపాడు. ఒక్కసారిగా ఆమెపై లైంగికదాడికి యత్నించబోయాడు. ఆమె అతడి నుంచి తప్పించుకుని పరుగుపరుగున ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు, బంధువులకు విషయం చెప్పింది. శనివారం పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్తున్న ఆమెను శ్రీరంగ బెదిరించాడు. తనకూ పోలీసులు తెలుసని, ఫిర్యాదు చేయకుండా వెనక్కు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో ఆమె వెనక్కు వెళ్లిపోయింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఎస్ఐ మహమ్మద్ గౌస్ను కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీరంగపై ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
రైలు నుంచి విద్యార్థి తోసివేత
సాక్షి, గుత్తి(అనంతపురం) : రైల్లోంచి ఇంటర్ విద్యార్థిని గుర్తుతెలియని ప్రయాణికుడు కిందకు తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థి రెండు కాళ్లు కోల్పోయాడు. జక్కలచెరువు రైల్వే స్టేషన్లో సోమవారం ఈ ఘటన జరిగింది. జీఆర్పీ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మైన్స్ వ్యాపారి రాజేశ్వరరెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు నిరంజన్రెడ్డి విజయవాడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకడియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులను చూడాలని విజయవాడ ఎక్స్ప్రెస్ రైల్లో తాడిపత్రికి బయల్దేరాడు. గాఢ నిద్రలో ఉండటంతో తాడిపత్రిలో దిగలేదు. జక్కల చెరువు రైల్వే స్టేషన్లో రైలు వెళ్తున్న సమయంలో లేచి ఏ ఊరో తెలుసుకోవాలని డోర్ దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కిందకు తోసేశాడు. దీంతో నిరంజన్రెడ్డి రెండు కాళ్లు రైలు చక్రాల కింద పడ్డాయి. దీంతో రెండు కాళ్లు కట్ అయ్యాయి. సమీపంలోని వారు వెంటనే స్పందించి కట్ అయిన కాళ్లను ఓ సంచిలో వేసుకుని నిరంజన్రెడ్డిని 108 వాహనంలో హుటాహుటిన గుత్తి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ జిల్లా సీనియర్ నాయకులు పేరం నాగిరెడ్డి హుటాహుటిన గుత్తికి వచ్చి నిరంజన్రెడ్డిని పరామర్శించారు. కాళ్లు కోల్పోయిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుత్తి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు నాయక్, పీసీ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చందాకోసం ఐచర్ను ఆపబోతే..
సాక్షి, కళ్యాణదుర్గం (అనంతపురం) : వినాయక చవితి చందాల వసూళ్లు హద్దుమీరుతున్నాయి. యువకులు రోడ్లపైకి వచ్చి తాడు అడ్డు పెట్టి వాహనాలను ఆపి చందాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి సమీపంలో రోడ్డుపై దాదాపు 20 మంది యువకులు వారం రోజులుగా వినాయక చవితి చందాలు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కంబదూరు వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఆపబోయారు. అప్పటికే అడుగడుగునా ఇలాంటి చందాల బ్రేకప్లతో విసుగు చెందిన డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న యువకులవైపు దూసుకెళ్లాడు. వారిలో ముగ్గురిని ఢీకొట్టి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో యర్రంపల్లి గ్రామానికి చెందిన అరుణ్కుమార్, విష్ణు, వసంత్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి గాయపడిన వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సింగ్ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, అనంతపురం : బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం కళ్యాణదుర్గం రోడ్డులోని ఆదర్శ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.... అమరాపురం మండలం శివరాపురం గ్రామానికి చెందిన లింగరాజు కుమార్తె కావ్య (20) ఆదర్శ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కడుపు నొప్పిస్తోందని తరగతి గది నుంచి హాస్టల్ రూంకు వెళ్లింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. చదువులో వెనుకబడటమే కారణమా..? టూటౌన్ సీఐ జాకీర్హుస్సేన్, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలుగుమీడియం చదివిన కావ్య ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో చదువులో వెనుకబడిందని, మొదటి సంవత్సరంలో ఐదు సబ్జెక్టులు ఫెయిలైందని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని సీఐ జాకీర్హుస్సేన్ తెలిపారు. -
ప్రాణం బలిగొన్న జాలీ రైడ్
అనంతపురం , తాడిపత్రి అర్బన్/నార్పల: జాలీ రైడ్ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. అమ్మమ్మను చూసొస్తానంటూ తల్లిదండ్రులకు చెప్పి స్నేహితులతో కలిసి బైక్పై బయలుదేరిన విద్యార్థి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బూస మురళీకృష్ణ (16), మహమ్మద్ ఖాసీం, షాషావలీ స్నేహితులు. కళాశాలలో చేరిన తర్వాత వీరికి ప్రొద్దూటూరులో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం విద్యార్థి హాజీపీరాతో పరిచయమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం ద్విచక్ర వాహనాలపై జాలీ రైడ్కు స్నేహితులు సిద్ధమయ్యారు. ఈ విషయం ఇంటిలో వారికి తెలిస్తే పంపరనే భయంతో.. ధర్మవరానికి స్నేహితులు కారులో వెళుతున్నారని, తాను కూడా వారితో కలిసి వెళ్లి అక్కడున్న అమ్మమ్మను చూసి తిరిగి వస్తానంటూ మురళీ కృష్ణ తన తల్లిదండ్రులను నమ్మించి బయలుదేరాడు. అయితే కారులో కాకుండా రెండు ద్విచక్ర వాహనాల్లో స్నేహితులు గురువారం ఉదయం బయలుదేరారు. వేగాన్ని నియంత్రించుకోలేక.. జాతీయ రహదారిపై రయ్యిమంటూ బైక్లను దూకిస్తూ స్నేహితులు జాలీగా ముందుకు సాగారు. ముచ్చుకోట దాటిన తర్వాత నార్పల మండలం మద్దలపల్లి గ్రామ శివారులో మలుపు వద్దకు చేరుకోగానే వాహనాల వేగాన్ని వారు నియంత్రించుకోలేకపోయారు. దీంతో మురళీకృష్ణ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు డివైడర్ను ఢీకొని.. అదే వేగంతో పక్కనే ఉన్న స్నేహితుల మరో వాహనాన్ని ఢీకొంది. ఘటనలో కిందపడ్డ మురళీకృష్ణకు తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితికి చేరుకుని మృతిచెందాడు. హాజీపీరాకు కాలు విరిగింది. మహమ్మద్ ఖాసీం, షాషావలీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రలను 108 వాహనంలో జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. మురళీకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ఘటనపై నార్పలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కడే కుమారుడు.. తాడిపత్రిలో బియ్యం వ్యాపారం చేసుకుని జీవనం సాగించే రమేష్ మంజుల దంపతులకు మురళీకృష్ణ ఒక్కడే కుమారుడు, కారులో తన అమ్మమ్మను చూసి వస్తానంటూ ధర్మవరానికి ప్రయాణమై బయలుదేరాడని, అయితే ఇలా తిరిగి రాని లోకాలకు వెళతాడని తాము ఏనాడూ అనుకోలేదంటూ తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రి వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, మురళీకృష్ణ మృతిచెందినట్లు తెలుసుకున్న కళాశాల యాజమాన్యం గురువారం సెలవు ప్రకటించింది. దీంతో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని తమ మిత్రుడిని కడసారి చూసి, కన్నీటి నివాళులర్పించారు. -
ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య
సాక్షి, కళ్యాణదుర్గం(అనంతపురం) : కంబదూరు మండల కేంద్రంలో ఎరికల రవి హత్య మిస్టరీ వీడింది. వివాహితను ప్రేమ పేరుతో వేధించినందువల్లే బాధితురాలి సోదరుడు తన స్నేహితులతో కలిసి రవిని అంతమొందించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మల్లికార్జున తన కార్యాలయంలో రూరల్ సీఐ శివశంకర్ నాయక్తో కలిసి మీడియాకు వెల్లడించారు. కంబదూరుకు చెందిన ఎరికల రవి తండ్రి ఎరికల ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎరికల రవి ఆటో నడుపుకుంటూ కళ్యాణదుర్గం మండలం దాసంపల్లికి చెందిన వివాహితను ప్రేమ పేరుతో వేధించేవాడు. సదరు వివాహిత తనకు ఎదురవుతున్న వేధింపులను సోదరుడు బోయ సీతారాములకు చెప్పుకుని విలపించింది. ఈ విషయంలో సోదరునితో పాటు సోదరుని స్నేహితులు కలిసి ఎరికల రవిని పలుమార్లు హెచ్చరించి ప్రేమపేరుతో వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. తన సోదరికి ఎదురవుతున్న వేధింపుల గురించి సీతారాములు స్నేహితులైన దాసంపల్లి మొగలి రామాంజినేయులు, మాదిగ సురేష్ల వద్ద చెప్పుకుని బాధపడ్డాడు. పథకం ప్రకారం ముగ్గురు ఈ నెల 19న కంబదూరుకు వెళ్లి ఎరికల రవి బర్త్డే సందర్భంగా డిన్నర్ ఇవ్వాలని కోరారు. సదరు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంలో ఎరికుల రవిని ఎక్కించుకుని కంబదూరులోని వైఎన్హెచ్ కోట రోడ్డులో ఉన్న ఈడిగ గౌరమ్మ కల్లు దుకాణం వద్దకు వెళ్లి ఫూటుగా మద్యం తాగారు. రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఎరికల రవితో గొడవకు దిగారు. పథకం ప్రకారం తెచ్చుకున్న మచ్చు కొడవళ్లతో అక్కడే హతమార్చారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు సీతారాములు, మొగలి రామాంజనేయులు, మాదిగ సురేష్లను డీఎస్పీ ఆదేశాల మేరకు కంబదూరు మండలం నూతిమడుగు బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వీరివద్ద ఉన్న రెండు మచ్చుకొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
కాల్చిపారేస్తా.. ఏమనుకున్నావో!
అనంతపురం సెంట్రల్: ‘మా సమస్యలోకి తలదూరుస్తావా.. ఏమనుకున్నావ్.. కాల్చి పారేస్తా..’ అంటూ పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి ఓ కానిస్టేబుల్ బెదిరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు... వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ బీటెక్ రవి సోదరుడు భరత్రెడ్డికి గన్మన్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజారెడ్డి అనంతపురంలోని హమాలీకాలనీలో వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా భార్య సుహాసినితో రాజారెడ్డికి మనస్పర్థలు వచ్చాయి. ఈ సమయంలో పెద్దమనుషుల పంచాయితీలు జరిగాయి. స్థానికంగా ఉంటున్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు లక్ష్మిదేవి భార్యాభర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న గన్మన్ రాజారెడ్డి బుధవారం భార్య ఇంటిపై దాడి చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో ఇంటిపక్కనే ఉన్న లక్ష్మిదేవి కనిపించడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గన్మన్ ఏకంగా ఆమె తలకు రివాల్వర్పెట్టి బెదిరించాడు. దీంతో ఇంట్లోకి పరుగుతీసిన లక్ష్మిదేవి తలుపు వేసుకుంది. అయినప్పటికీ విడిచిపెట్టక బలవంతంగా తలుపు తీసి ఆమెను చంపేందుకు యత్నించాడు. గట్టిగా కేకలు వేయడంతో కాలనీ ప్రజలు గుమికూడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితురాలు లక్ష్మిదేవి పోలీసులను కోరారు. ఖండించిన మహిళా విభాగం నాయకులు ఓ మహిళను పాయింట్బ్లాంక్ రేంజ్లో రివాల్వర్ పెట్టి కానిస్టేబుల్ బెదిరించడం దారుణమని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి డిమాండ్ చేశారు. బాధితురాలితో కలిసి వన్టౌన్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాప్రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు. -
భర్త హత్యకు సుపారీ.. సొమ్ము కోసం ఇల్లు అమ్మకం
అనంతపురం, తాడిపత్రి: వేరు కాపురానికి ఒప్పుకోని భర్తను హత్య చేయించేందుకు ఓ భార్య చేసిన కుట్ర అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. మంగళవారం తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓఎస్డీ స్వామి, డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ఘటన వివరాలు మీడియాకు వెల్లడించారు. అనంతపురంలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న నిసారుద్దీన్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే పట్టణానికి చెందిన గౌసియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నిసారుద్దీన్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే పెళ్లయిన కొంత కాలానికే వేరు కాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేసినా ససేమిరా అన్నాడు. దీంతో 2016లో గౌసియా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె భర్త ఉద్యోగంతో పాటు, అతని పేరిట ఉన్న ఇన్సూరెన్స్పై కన్నేసింది. భర్తను హత్య చేయిస్తే కారుణ్య నియామకం కింద ఉద్యోగంతో పాటు బీమా సొమ్ము మొత్తం తనకే చెందుతుందనే దురుద్దేశంతో హత్యకు వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా అనంతపురంలోనే నివాసం ఉంటున్న అఖిల భారత ప్రగతి శీల మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్ను సంప్రదించింది. రూ.10 లక్షల సుపారీ తన భర్తను హత్య చేస్తే రూ.10 లక్షలు ఇస్తానని నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్తో గౌసియా ఒప్పందం చేసుకుంది. డబ్బు కోసం గౌసియా తన తల్లి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించింది. వచ్చిన డబ్బులో రూ. 2 లక్షలు అడ్వాన్స్గా నిర్మలమ్మకు చెల్లించింది. నిసారుద్దీన్ను హత్య చేసేందుకు నిర్మలమ్మ, కులశేఖర్ గార్లదిన్నెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణారెడ్డితో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్గా రూ.1.80 లక్షలు చెల్లించారు. రమణారెడ్డి ఈ బాధ్యతను తాడిపత్రి పోలీసుస్టేషన్లో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న కడపకు చెందిన మురళీకృష్ణారెడ్డికి అప్పగించాడు. ఇతనికి రూ. 50 వేలు అడ్వాన్స్గా ముట్టజెప్పాడు. మురళీకృష్ణారెడ్డి, నాగేంద్రుడు, మరో వ్యక్తి కలిసి నిసారుద్దీన్ ఇంటి వద్ద హత్యకు రెక్కీ నిర్వహించారు. అయితే వీరు తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేష్బాబు, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య కుట్ర బయటపడింది. ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉండగా.. నిర్మలమ్మ, కులశేఖర్, మురళీకృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. -
చెల్లెలిపై అన్న లైంగికదాడి
సాక్షి, ధర్మవరం(అనంతపురం) : మైనర్ చెల్లెలిపై అన్న లైంగికదాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ వెంకటరమణ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య, ఆమె కుమారుడు ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్నారు. రెండో భార్య, ఆమె కుమార్తె(మైనర్ బాలిక) కొత్తచెరువులో ఉంటున్నారు. కుటుంబ యజమాని తన రెండో భార్యను తీసుకుని బెంగళూరుకు వలస వెళ్లాడు. మైనర్ బాలిక ప్రతి రోజూ ధర్మవరం పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేసి రాత్రికి కొత్తచెరువుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం మొదటి భార్య కుమారుడు తన తల్లి ఊళ్లో లేకపోవడంతో బట్టల దుకాణం నుంచి కొత్తచెరువుకు వెళ్లేందుకు రహదారిపై ఉన్న చెల్లెలు(మైనర్ బాలిక)ను తన వెంట ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే రోజు రాత్రి బాధిత బాలిక పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతనికి ఇదివరకే వివాహం కాగా వ్యసనాల కారణంగా భార్య విడిపోయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. -
అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..
సాక్షి, కణేకల్లు(అనంతపురం) : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వివాహితపై టీడీపీ నాయకుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటన కణేకల్లు మండలం మాల్యంలో బుధవారం జరిగింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్యంలో ఓ వివాహిత తన భర్తతో కలిసి పుట్టింట్లో నివాసముంటోంది. తల్లి మూడు రోజుల క్రితం బళ్లారిలోని బంధువుల ఇంటికెళ్లింది. భర్త బుధవారం ఉదయం తన పనికోసం బయటికెళ్లాడు. వివాహిత మాత్రమే ఒంటరిగా ఉంది. సరిగ్గా ఉదయం 9.30 గంటల సమయంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుచరుడు, టీడీపీ నాయకుడు శరబన్నగౌడ్ ఆ ఇంట్లోకి దూరాడు. ‘ఏమ్మా.. కొత్త ఇల్లు బాగానే కట్టావ్.. ప్రారంభానికి కూడా పిలవలేదే!’ అంటూ మాట కలిపాడు. వయస్సులో పెద్దాయన కావడంతో ఆమె మర్యాదగా మాట్లాడింది. సరే ఇల్లైనా చూడనివ్వు అంటూ ఇంకాస్త లోనికి వచ్చాడు. అమ్మ ఎక్కడ..? కన్పించడం లేదే అని ప్రశ్నించడంతో ‘అమ్మ ఊరికెళ్లిందని’ ఆమె సమాధానం చెప్పింది. నీ ఫోన్ నంబర్ ఇస్తే అప్పుడప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పడంతో తన వద్ద ఎలాంటి ఫోనూ లేదని తెలిపి గదిలోకి వెళ్లబోయింది. ఇంతలో ఒక్కసారిగా శరబన్నగౌడ్ వివాహితపై లైంగికదాడికి ప్రయత్నించాడు. తనను వదిలేయాలని ప్రాధేయపడని వినకపోవడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
ఫేస్బుక్ రిలేషన్; వివాహితపై అత్యాచారం
పాలషాపులో పనిచేసే ఓ వ్యక్తి, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మరో ముగ్గురు ఓ వివాహితపై అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. ఏడాదిగా సాగిన వేధింపులతో మనస్తాపం చెందిన బాధితురాలు మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... నలుగురిపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అనంతపురం, రాయదుర్గం రూరల్ : తనను భయపెట్టి.. బెదిరించి నలుగురు యువకులు అత్యాచారం చేశారని ఓ వివాహిత మంగళవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ సీఐ రియాజ్ అహ్మద్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ వ్యక్తి నాలుగేళ్ల కిందట కర్ణాటకకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహిత ఏడాది కాలంగా రోజూ తెల్లవారుజామున సమీపంలోని షాప్కు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొచ్చేది. ఈ క్రమంలో షాపులో ఉండే మహేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇదే సమయంలో సెల్ఫోన్ ద్వారా ఫేస్బుక్ అకౌంట్ తెరిచిన వివాహితకు చాలామంది నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ వచ్చాయి. అందులో రాయదుర్గానికే చెందిన పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్ ఉన్నారు. వీరు ఫేస్బుక్ చాటింగ్ ద్వారా ఆమెను ముగ్గులోకి దింపారు. సెల్ నంబర్ కోసం ఒత్తిడి చేసి అతికష్టం మీద ఆ వివాహిత నుంచి తీసుకున్నారు. బెదిరించి లొంగదీసుకున్నారు.. ఫేస్బుక్ ద్వారా వివాహిత వ్యక్తిగత సమాచారం, కుటుంబ విషయాలను ముగ్గురు స్నేహితులు తెలుసుకున్నారు. సేకరించుకున్న సెల్నంబర్ ద్వారా అప్పుడప్పుడు కాల్ చేస్తూ మరింత పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెను ‘ఫేస్ బుక్ రిలేషన్’ను అడ్డు పెట్టుకుని వేధించడం మొదలు పెట్టారు. తమ కోరిక తీర్చకపోతే ఇంట్లోవారికి చెబుతామని, మీ సామాజిక వర్గం వారికి తెలుపుతామని, చివరకు యాసిడ్ దాడికి కూడా వెనుకాడబోమని బెదిరించారు. అప్పటికీ ఒప్పుకోకపోతే భర్త, కుమారుడిని చంపేస్తామని భయపెట్టి ఆమెను లొంగదీసుకున్నారు. వేధింపులు భరించలేక.. పాలషాపు మహేష్తో పాటు ఫేస్బుక్ ఫ్రెండ్స్ పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్ల నుంచి లైంగిక వేధింపులు రోజురోజుకూ హద్దు మీరుతుండటంతో భరించలేకపోయింది. ఇంట్లో వారికి చెప్పుకోలేక.. వారి ‘కోరిక’లు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త, అత్త గమనించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఆ నలుగురిపై కేసుల నమోదు తనను మహేష్, పవన్, చీటీ మల్లికార్జున, ఫారుక్లు బెదిరించి అత్యాచారం చేశారని బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పై నలుగురు యువకులపైనా 376, 370, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రియాజ్ అహ్మద్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ముగ్గురిపై పోక్సో, నిర్భయ కేసు బత్తలపల్లి : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిపైన పోక్సో యాక్ట్, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. తాడిమర్రి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బత్తలపల్లిలోని ఓ ప్రవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థిని పట్ల సమీప బంధువులు సదానంద, కిరణ్, దివాకర్ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు బత్తలపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపైనా కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వీరిని ధర్మవరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
కులాల మధ్య టీడీపీ చిచ్చు
కొత్తచెరువు: మండలంలోని నాగులకనుమ వద్ద చోటు చేసుకున్న గొడవలకు టీడీపీ నాయకులే కారణమంటూ వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఫణిశేఖర్, బాలాజీను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డి.ఎస్.కేశవరెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం స్థానిక ఆ పార్టీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తచెరువులో టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మరోసారి ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. దాడిలో గాయపడిన కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీలకతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకుంటున్న పండుగను కొందరు స్వార్థపరులు రాజకీయం చేయాలని చూశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ జెండాలను కట్టి పండుగ సంస్కృతిని మంటగలిపే ప్రయత్నం చేశారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కొత్తచెరువులో వైఎస్సార్ సీపీకి ఐదువేల పైచిలుకు మెజారిటీ రావడాన్ని జీర్ణించుకోలేక ఈ తరహా దాడులకు తెగబడడం సిగ్గుచేటన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునే నీచ సంస్కృతికి టీడీపీ నేత సాలక్కగారి శ్రీనివాసులు తెరలేపారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజలే టీడీపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు అంగడి సోమశేఖర్రెడ్డి, ఎల్లప్ప, వెంకటరాముడు, బుల్లెట్ మధు, నాగభూషణ, లక్ష్మీనారాయణ, షాన్షేట్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరిపోయిన అక్షర దీపం
‘ఆరేళ్ల’ ఆశయం అప్పుడే చెదిరిపోయింది.. అ, ఆ..లతో ఆరంభమై.. అచ్చులు, హల్లులతో ఆగకుండా దిద్దిన అక్షరమే దిద్దుతూ.. అడుగులో అడుగు వేస్తూ.. తరగతులు ఎన్నో మారుతూ .. తలరాతను మార్చుకుందామని ఎన్నో మెట్లు ఎక్కుతూ.. ఉన్నతంగా చదివి ఉన్నత శిఖరం వైపు అక్షర‘బాట’ పట్టిన ‘బాల’విజ్ఞాని ఎక్కాల్సిన మెట్లు కుప్పకూలి.. అప్పుడే వందేళ్లు నిండాయి.. మొదటి ‘గురువు’ నాన్నచేయి పట్టుకొని బడికెళ్తుంటే మృత్యుశకటం మీదకొచ్చి ఆశ..శ్వాసను కాలరాస్తే.. ఆ ఇంట విషాదం అలుముకుంది. పూలకుంట గ్రామ శోకసంద్రమైంది. సాక్షి, ఎస్కేయూ: పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి వెళ్తున్న తండ్రీ కొడుకును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన కాటప్పగారి నరసింహారెడ్డి (40), సంధ్యారాణి దంపతులు. సంధ్యారాణి తన పుట్టినిల్లు అయిన బుక్కపట్నం మండలం మారాలకు వెళ్లింది. ఇంటి వద్ద నరసింహారెడ్డి, కుమారుడు కార్తీక్రెడ్డి (6) ఉన్నారు. సోమవారం ఉదయం సమతాగ్రాంలోని రాధా స్కూల్లో ఒకటో తరగతిలో చేర్పించడానికి కుమారుడిని తీసుకుని నరసింహారెడ్డి బైక్లో బయల్దేరాడు. ఆకుతోటపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం వీరి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకుమారుడు నరసింహారెడ్డి, కార్తీక్రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఐచర్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదంజరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే పూలకుంట గ్రామస్తులు, ఎస్కేయూ విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ గ్రామస్తులు విలపించారు. నరసింహారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి ఏఎస్ఐ నాగన్న తెలిపారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో తండ్రీ కుమారుల మృతదేహాలను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సందర్శించి, నివాళులర్పించారు. అమ్మ ఊరికి వెళ్లకుంటే... పూలకుంటలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో స్కూల్లో అడ్మిషన్ కోసం నరసింహారెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డిని వెంట తీసుకెళ్లాడు. ‘అమ్మ ఊర్లో ఉండి ఉంటే బతికి ఉండేవాడివి కద బిడ్డా’ అంటూ బంధువులు రోదించిన తీరు కలచివేసింది. -
నిద్రలో ఉన్న భార్యను కడతేర్చిన భర్త
చెడు వ్యసనాలు అతడిని అప్పులపాలు చేశాయి. తాకట్టు పెట్టిన తన నగలను తెచ్చివ్వాలని కోరిన ఇల్లాలిపై కోపోద్రిక్తుడై కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న భార్యను కర్రతో బాది హత్య చేశాడు. ఆపై తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో యాటకల్లులో విషాదం అలుముకుంది. అనంతపురం ,శెట్టూరు: కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గొల్ల సరళమ్మ(30)కు శెట్టూరు మండలం యాటకల్లుకు చెందిన గొల్ల రామచంద్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు యోగానంద, గోవర్ధన్, కుమార్తె చైత్ర ఉన్నారు. చెడువ్యసనాలకు అలవాటుపడిన రామచంద్ర అందినకాడల్లా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య ఒంటిపై ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి నగదు తెచ్చుకుని జూదంలో కోల్పోయాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. శనివారం రాత్రి సరళమ్మ తన నగలు తనకు తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో రామచంద్ర ఆవేశంతో ఊగిపోయాడు. అలా కాసేపటి తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. అయితే తనను నిలదీసిందనే కోపంతో రగిలిపోతున్న రామచంద్రప్ప ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య సరళమ్మను కర్రతో తలపై మోదాడు. సమీపంలోనే నిద్రిస్తున్న రామచంద్ర తల్లి ఉలికిపడి లేచి చూసి గట్టిగా అరిచింది. చుట్టు పక్కల జనం వచ్చి సరళమ్మను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి భార్య చనిపోయిందని తెలిసిఆత్మహత్యాయత్నం భార్య చనిపోయిందని తెలుసుకున్న గొల్ల రామచంద్ర బహిర్భూమికని వెళ్తూ పురుగుమందు వెంట తీసుకెళ్లి.. అక్కడే తాగి పడిపోయాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను చూసి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐ రమనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హతురాలి తల్లి లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
అనంతపురం, పెనుకొండ రూరల్: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు పెనుకొండ సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,17,800 నగదు, ఒక ఎల్ఈడీ టీవీ, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మునిమడుగు గ్రామానికి చెందిన వెంకటరాముడు, తుపాకుల నరసింహ, గుట్టూరుకు చెందిన చిన్న ఆంజనేయులు, ఎరికల శివ, కురుబవాండ్లపల్లికి చెందిన లింగమయ్య, పెనుకొండకు చెందిన అబ్దుల్లా, లక్ష్మీనారాయణ, శ్రీనాథ్లు అందరూ కలసి ఐపీఎల్ మ్యాచ్లు జరిగే సమయంలో ఫోన్ల ద్వారా ప్రతి బాల్కు సిక్స్, ఫోర్, వికెట్ అంటూ పందెం కాస్తున్నారన్నారు. మ్యాచ్లో ఫలానా జట్టు గెలుస్తుంది, ఓడుతుందని బెట్టింగ్ ఆడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఒక వేళ ఎవరైనా బెట్టింగ్లో గెలిస్తే వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారన్నారు. తమకందిన సమాచారంతో డీఎస్పీ ఐ.రామకృష్ణ ద్వారా సర్చ్ వారంట్ తీసు కుని మ్యాచ్ జరుగుతున్న సమయంలో సదరు ఇంటిని సోదా చేశామన్నారు. ఆధారాలు లభించడంతో వారిని అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్సీ గంగాధర్, కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్, నాగేంద్రప్రసాద్, లక్ష్మి పాల్గొన్నారు. -
సీఎం సభకు వెళ్తూ ఒకరు మృతి
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు ఎన్నికల సభకు జనాలను తరలించే తరుణంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి. ఈ ఘటన బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా మబకశిర మండలం ఎగువ అచ్చంపల్లి దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యాయత్నం
పీసీ.చిన్నప్యాపిలి(వజ్రకరూరు): పిల్లలతో సహా తల్లి బావిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిన్నప్యాపిలి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సుమంగళికి కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన కిష్టప్పతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారులు చరణ్, విఘ్నేష్, కుమార్తె వేదిక ఉన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని సుమంగళి పిల్లలతో సహా పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావి వద్దకు పిల్లలతో సహా వెళ్లింది. అయితే పెద్ద కుమారుడు చరణ్ అక్కడి నుంచి తప్పించుకుని బయటకువచ్చాడు. అనంతరం సుమంగళి మిగిలిన ఇద్దరు పిల్లలతో సహా బావి లోకి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే బావిలో పడ్డ తల్లీపిల్లలను బయటకు తీశారు. అయితే అప్పటికే వేదిక(16 నెలలు) మృతి చెందింది. అస్వస్థతకు గురైన విఘ్నేష్ను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. సుమంగళి మానసిక స్థితి సరిగా లేక పోవడం వల్లే బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
వివాహితది హత్యా.. ఆత్మహత్యా..?
అనంతపురం సెంట్రల్: నగరంలోని ఆరోరోడ్డులో బుధవారం జరిగిన సౌమ్య (25) అనే వివాహిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. మెట్టినింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడిందని అత్తింటి వారు చెబుతున్నారు. పంటకు వాడే పురుగుమందు ఇంట్లోకి ఎలా వచ్చింది..? దానిని ఎవరు తీసుకొచ్చారు..? అనేది తెలియడం లేదు. అదనపు కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో అత్తమామలే అంతమొందించి ఉంటారని సౌమ్య బంధువులు ఆరోపిస్తున్నారు. సౌమ్య మృతి చెందిన రోజు నుంచి ఈరోజు వరకు అత్తింటి వారిని అదుపులోకి తీసుకోలేదని, విచారణా చేపట్టలేదన్నారు. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం, నల్లచెరువు: పల్లెవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ కుమార్తె వాణి (19) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన మేరకు... వాణి కదిరిలోని బ్లూమూన్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల నుంచి మౌనంగా ఉంటున్న వాణి సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిన కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
లక్కీడ్రా అంటూ ఫ్లిప్కార్ట్ పేరుతో టోకరా..
జనాల బలహీనతే వారి పెట్టుబడి.. ఆశ చూపి మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. గిఫ్ట్ తగిలిందని ఫలానా అకౌంట్లో డబ్బు జమ చేస్తే పంపుతామంటూ తియ్యటి మాటలతో మాయ చేస్తారు. వారు అనుకున్నట్టుగా డబ్బు పడగానే ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. ఇదీ ఆన్లైన్లో జరుగుతున్న మోసాల తంతు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా జనాల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా ఆన్లైన్ మాయగాళ్ల చేతిలో మోసపోతూ పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అనంతపురం, శింగనమల: ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువుకు రూ.15 లక్షలు బహుమతి తగిలిందని, తాము చెప్పిన మొత్తం అకౌంట్లో జమ చేస్తే రూ.15 లక్షల నగదు లేక రూ.15 లక్షల విలువజేసే కారు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు వాట్సప్లో కార్డు కూడా పంపారు. తీరా అకౌంట్లో డబ్బు వేశాక ఫోన్ ఎత్తకుండా మానేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే..మండలంలోని తరిమెల గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కరెంట్ కాంట్రాక్ట్ పని చేసేవాడు. మూడు నెలల క్రితం ఫ్లిప్కార్ట్లో రూ.459 పెట్టి బ్లూటూత్ కొనుగోలు చేశాడు. ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో 9870511627 నంబర్ నుంచి శ్వేతాశర్మ పేరుతో ఫోన్ వచ్చింది. జార్కండ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలుగులో మాట్లాడింది. ఫ్లిప్కార్ట్లో వస్తువులు కొనుగోలు చేసిన వారి ఐడీలతో సంస్థ లక్కీ డ్రా తీసిందని, ఇందులో మీకు రూ.15 లక్షలు తగిలిందని చెప్పుకొచ్చింది. రూ.15 లక్షల నగదు మీ ఖాతాలోకి వేయాలంటే ముందుగా రూ.15 వేలు తమ ఖాతాలోకి జమ చేయాలని సూచించింది. నగదు జమ అయిన అరగంటలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పింది. ఒకవేళ రూ.15 లక్షల నగదు వద్దనుకుంటే రూ.15 లక్షల విలువజేసే మహీంద్ర ఎక్స్యూవీ 500 కారు అందిస్తామని, ఇందుకు రూ.15,500 జమ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించిన కారు ఫొటో, లక్కీడ్రా ఎంపికైన పత్రాలను వాట్సప్ (7256812304) ద్వారా పంపింది. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన సురేష్ గూగుల్ పే ద్వారా రూ.15,000 ఆమె సూచించిన ఖాతాలో జమ చేశాడు. గంట పాటు ఎదురుచూసినా డబ్బు జమకాకపోవడంతో అతడు పై నంబర్కు ఫోన్ చేశాడు. ఫోన్ రింగవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, నిందితులు వాడిన ఫోన్ నంబర్ బిహార్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించినట్లు ఎస్ఐ ప్రసాద్బాబు తెలిపారు. -
బాలిక ఆత్మహత్యాయత్నం
అనంతపురం , బుక్కరాయసముద్రం : తమ్మున్ని గాయపరిచినందుకు తల్లిదండ్రులు తననెక్కడ కొడతారోనన్న భయంతో అక్క ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. పొడరాళ్ల గ్రామంలో బాబాఫకృద్దీన్, సాయినాల దంపతులకు కుమార్తె చాంద్బీ (17), కుమారుడు మౌలాలి ఉన్నారు. శుక్రవారం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో అక్కా తమ్ముడు మాత్రమే ఉన్నారు. సెల్ఫోన్ చార్జింగ్ పెట్టే విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో కత్తెరతో కొట్టడంతో తమ్ముడికి గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వస్తే తనను కొడతరాని భయపడ్డ అక్క చాంద్బీ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి బాలికను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరం 60 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
విద్యార్థుల మిస్సింగ్ కలకలం
ముగ్గురు విద్యార్థుల ‘మిస్సింగ్’రాయదుర్గంలో కలకలం రేపింది.పాఠశాల నుంచి హాస్టల్ వద్దకు వెళ్లిన విద్యార్థులు కనిపించకుండా పోయారనే విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలైంది.తమ బిడ్డలను ఎవరైనా ఎత్తుకెళ్లారా? ఎక్కడికైనా వెళ్లిపోయారా అనేఅనుమానాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరుసటి రోజు ఉదయానికి దొరికారనే ఫోన్ కాల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం, గుమ్మఘట్ట: గుమ్మఘట్ట మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన గోవర్ధనరెడ్డి (8వ తరగతి), శరత్రెడ్డి (5వ తరగతి), డీ హిరేహాళ్ మండలం కొత్తూరుకు చెందిన హరి (7వ తరగతి) రాయదుర్గంలోని సెయింట్పాల్స్ స్కూల్లో చదువుతున్నారు. బేలోడుకు చెందిన సమీప బంధువులు రాయదుర్గం ఇంట్లోనే చిన్న హాస్టల్స్ నిర్వహిస్తుండడంతో అక్కడ ఉంటూ స్కూలుకెళ్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం స్వగ్రామాలకు వెళ్లి యథావిధిగా సోమవారం ఇంట్లో ఖర్చుల కోసం డబ్బు తీసుకుని హాస్టల్కు వచ్చారు. లగేజీ అక్కడ ఉంచి పాఠశాలకు వెళ్లారు. పాఠశాల వదిలిన తర్వాత హాస్టల్కు చేరుకున్నారు. ట్యూషన్కు వెళ్తాతామని తోటి విద్యార్థులకు తెలిపి పుస్తకాలు బయట ఉంచి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. ముగ్గురూ రైలెక్కారు.. సమీపానున్న రైల్వేస్టేషన్కు చేరుకుని రాత్రి 7 గంటలపైన గుంతకల్లు నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయారు. ఎంత సేపైనా తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు స్కూల్ వద్దకెళ్లి విచారించారు. ట్యూషన్కే రాలేదని అక్కడ ఉపాధ్యాయులు చెప్పడంతో గందరగోళానికి గురయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. సోషల్ మీడియాలోహల్చల్ ఈ విషయం ఆనోట ఈ నోట పడటంతో పాటు వాట్సప్, ఫేస్బుక్ సోషియల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. కొత్తూరుకు చెందిన హరి బంధువులు బెంగళూరులో ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని గుర్తించారు. అనుమానం కలిగి వారు బెంగళూరు రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుని గస్తీ చేపట్టారు. మంగళవారం వేకువజామున ఐదు గంటలకు ప్యాసింజర్ రైలు నుంచి ముగ్గురు విద్యార్థులు దిగుతుండటం గమనించి పట్టుకున్నారు. అనుమానంతో అదుపులోకితీసుకున్న పోలీసులు బెంగళూరులో రైల్వే పోలీసులు అనుమానంతో హరి బంధువులను, పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ బిడ్డలు మీ వారో కాదో..? తామెలా నమ్మేది అంటూ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చైల్డ్ వెల్ఫేర్కు తరలించారు. జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా చేరవేయడంతో రాయదుర్గం ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ అక్కడి పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా విద్యార్థులను తల్లిదండ్రులకు చూపించారు. పిల్లల రాకకు మరో రెండు రోజులు అక్కడి నిబంధనల ప్రకారం సోమ, లేదా గురువారాల్లో మాత్రమే ఇలాంటి కేసులు విచారిస్తారు. గురువారం వరకు వదిలేది లేదని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఆధార్కార్డు, పిల్లల ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వస్తే తప్ప పంపేది లేదని చెప్పడంతో చెప్పడంతో నిరాశతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. బిడ్డల కోసం ఇంకా రెండు రోజులు ఎదురు చూడాల్సి వస్తోందని విలపించారు. విద్యార్థులు ఇలా ఎందుకు వెళ్లి పోయారో తెలియాల్సి ఉంది. -
యువకుడిపై యువతి కత్తితో దాడి..
తనకల్లు: యువకుడిపై యువతి కత్తితో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు యువతి చెబుతోంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం తనకల్లులోని ఇందిరానగర్కు చెందిన స్వప్న అనే యువతి సోమవారం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఒంటరిగా కూర్చుంది. అదే సమయంలో ఆలయ పూజారి బంధువు మంజునాథ్ లైట్లు వేసేందుకని స్విచ్బోర్డు దగ్గరకు వెళ్లబోయాడు. అతను దురుద్దేశంతో తనవద్దకే వస్తున్నాడని భావించిన స్వప్న తన దగ్గర ఉన్న కత్తితో అతడి తలపై దాడి చేసింది. గాయపడిన మంజునాథ్ను స్థానికులు, బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆత్మరక్షణకే అంటున్న అమ్మాయి తాను ఆత్మరక్షణలో భాగంగానే మంజునాథ్పై దాడి చేయాల్సి వచ్చినట్లు స్వప్న పోలీసులకు తెలిపింది. ఒంటరిగా కూర్చొని ఉన్న తన వద్దకు ఆతడు వేగంగా రాబోయాడని, తాను దగ్గరకు రావద్దని ఎంత వారించినా అతను అటే రావడంతో భయపడి తన వద్ద ఉన్న చిన్నపాటి కత్తితో దాడి చేసినట్లు పేర్కొంది. -
మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం
అనంతపురం,మడకశిర: పట్టణంలోని మధుగిరి సర్కిల్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో చికెన్ సెంటర్, ఉడ్వర్క్ షాపులు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన సర్పరాజ్ కొన్నేళ్ల నుంచి మధుగిరి సర్కిల్ సమీపంలో చికెన్సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చికెన్సెంటర్ పక్కనే పట్టణానికి చెందిన గంగరాజు ఉడ్వర్క్ షాపు నిర్వహించేవాడు. అర్ధరాత్రి సమయంలో ఉన్నఫళంగా మంటలు వ్యాపించి షాపులు రెండు దగ్ధమయ్యాయి. దీంతో చికెన్ సెంటర్లోని కోళ్లు, కోడిగుడ్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఉడ్వర్క్ షాపులో కూడా విలువైన వస్తువులు, కట్టెలు కాలి బూడిదయ్యాయి. ఘటనలో చికెన్ సెంటర్ నిర్వాహకుడికి రూ.3 లక్షలు, ఉడ్వర్క్షాపు నిర్వాహకుడికి రూ.15 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా క్షక్షగట్టి కావాలనే ఎవరైనా షాపులకు నిప్పు పెట్టారా? అనే విషయం సస్పెన్స్గా మారింది. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. ఆరు ఇళ్లల్లో చోరీ..
-
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
అనంతపురం, పుట్టపర్తి అర్బన్/ గుంతకల్లు: దొంగలు బరితెగించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. మూడు ప్రాంతాల్లోని పది ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లోని శివయ్య, వెంకటరాముడు, అరుణ, అనసూయమ్మ, వరలక్ష్మి ఇళ్లలో దొంగలు పడ్డారు. వరలక్ష్మి ఇంటిలో రూ.20 వేల నగదు, రెండు తులాలు విలువ చేసే కమ్మలు, శివయ్య ఇంటిలో 8 బంగారు ఉంగరాలు, జత కమ్మలు, కాలిపట్టీలు ఎత్తుకుపోయారు. మిగతా మూడు ఇళ్లల్లో విలువైన దుస్తులు అపహరించుకుపోయారు. బాధితులంతా చిరుద్యోగులు. ఆదివారం సెలవు కావడంతో శనివారమే ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఈ ఇళ్లకు కన్నం వేశారు. ప్రశాంతిగ్రామంలోనూ రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఏమేమి చోరీ అయ్యాయో బాధితులు ఫిర్యాదు చేయలేదని రూరల్ ఎస్ఐ శాంతిలాల్ తెలిపారు. గుంతకల్లులో మూడు ఇళ్లలో... పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపాన రైతు గోవిందరాజులు, లక్ష్మీదేవమ్మలు ఒకే భవనంలో అద్దెకు ఉంటున్నారు. రైతు గోవిందురాజులు సంక్రాంతి పండుగ కావడంతో భార్య కృష్ణవేణి పుట్టినిల్లు అయిన డొనేకల్లుకు వెళ్లారు. గోవిందురాజులు స్వగ్రామం బెల్డోనకు వెళ్లి అక్కడే ఉన్నారు. ఇదే ఇంట్లో పై అంతస్తులో నివాసముంటున్న లక్ష్మీదేవమ్మ కూడా తన స్వగ్రామం వెళ్లింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు శనివారం అర్ధరాత్రి తొలుత రైతు గోవిందురాజులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 30 తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.80వేల పైచిలుకు నగదు అపహరించుకుపోయారు. పై అంతస్తులో నివాసముంటున్న లక్ష్మీదేవమ్మ ఇంట్లో రూ.4వేల నగదు ఎత్తుకెళ్లారు. హౌసింగ్ బోర్డులోని తాళం వేసిన షబ్బీర్ ఇంట్లో కూడా దొంగతనం చేశారు. రూ.20వేల నగదు, జత బంగారు జుంకీలు చోరీ చేశారు. ఆదివారం ఉదయాన్నే తలుపులు పగులగొట్టి ఉండటం గమనించిన ఇరుగుపొరుగు వారు బాధిత కుటుంబ యజమానులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఖాసీంసాబ్, సీఐలు అనిల్కుమార్, సాయిప్రసాద్లు సంఘటన స్థలాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఊళ్లకు వెళితే... ఇంటికి తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారు పోలీసుస్టేషన్లలో సమాచారమివ్వాలని చెబుతున్నా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఊళ్లకు వెళ్లే ముందు పోలీసుస్టేషన్లో తెలిపితే ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) కెమెరాలు ఇంటికి అమర్చుతారు. ఈ కెమెరాలు పోలీసుస్టేషన్లోని మెయిన్ సీసీ కెమెరాల ఫుటేజ్కు అనుసంధానం చేసి ఉంటుంది. ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీసుస్టేషన్లో అలారం మోగుతుంది. పోలీసులు అప్రమత్తమై దొంగలను పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. -
క్షణికావేశం..ఓ ప్రాణం తీసింది!
అనంతపురం, నార్పల: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆస్తి విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ ఏకంగా ఓ తండ్రి ప్రాణాన్నే బలిగొంది. ఈసంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటలో నివాసముంటున్న తిరుపతయ్య(58)కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు రాజకుళ్లాయప్ప ఉన్నారు. గురువారం రాత్రి ఆస్తి విషయమై తిరుపతయ్యకు కుమారుడి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. మాటామాట పెరిగి కుమారుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న రాయిని తండ్రిపై విసిరాడు. రాయి నేరుగా తలను తాకడంతో తీవ్ర రక్తస్రావమై తిరుపతయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ పుల్లయ్య ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వ్యాసాపురంలో కలకలం
భార్యను హతమార్చి.. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అనంతపురం, ఉరవకొండ రూరల్: వ్యాసాపురంలో భార్య హత్య.. భర్త ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వ్యాసాపురం గ్రామానికి చెందిన మారెన్న (30), విశాలాక్షి (25)లకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు వంశీ, ఏడాది వయసు గల కుమార్తె హేమాంజలి ఉన్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవ పడుతుండేవారు. కుటుంబ సమస్యలపై వాదులాడుకుంటున్నారేమో అని అందరూ భావించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటాక.. నిద్రలో ఉన్న విశాలాక్షిపై భర్త మారెన్న గొడ్డలితో విరుచుకుపడ్డాడు. చెంపపైన, చేతిపైన నరికాడు. అలికిడికి ఇంటి పక్కనున్న కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మారెన్న ఉడాయించాడు. అయితే అప్పటికే విశాలాక్షి ప్రాణం విడిచింది. ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ గ్రామానికి వెళ్లి చూసి ప్రజలను విచారించారు. అనుమానంతో భార్యను హత్యచేసి.. తర్వాత తనూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. పాలకోసం తల్లడిల్లి.. పాల కోసం అమ్మ వద్దకు వెళ్తున్న హేమాంజలి (1)ని చూసి అందరూ చలించిపోయారు. ‘ఇంకెక్కడుందమ్మా.. మీ అమ్మ’ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలను హత్తుకుని.. చిన్న వయసులోనే మీకెంత కష్టం వచ్చిందే అంటూ రోదించారు. -
బీటెక్ విద్యార్థిని అదృశ్యం
అనంతపురం, మడకశిర/ కదిరి అర్బన్: మడకశిరలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న యోగేశ్వరి అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ గోపీయాదవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. కదిరి మండలం చవిటితండాకు చెందిన చంద్రానాయక్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె యోగేశ్వరీ మడకశిరలోని వ్యవసాయ కళాశాలలో బీటెక్ (అగ్రికల్చర్) ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రెండో కుమార్తె మానస ఎస్కే యూనివర్సిటీలో బీటెక్లో చేస్తోంది. కుమారుడు ఓడీసీలో పదో తరగతి చదువుతున్నాడు. యోగేశ్వరీ గత డిసెంబర్ 31న చవిటితండా నుంచి మడకశిరలోని కళాశాలకు వెళ్లింది. జనవరి నాలుగో తేదీన ఉదయం రూ.15 వేలు ఫీజు కట్టాలని తండ్రికి ఫోన్లో తెలిపింది. ఆదివారం తీసుకుని వస్తానని తండ్రి చెప్పాడు. అదే రోజు ఫస్ట్ ఇయర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. యోగేశ్వరి కొన్ని సబ్జెక్టులు ఫెయిలైంది. మనస్తాపానికి గురై ఆ రోజు మధ్నాహ్నం కళాశాలలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. విద్యార్థిని బయటకు వెళ్లేటపుడు కళాశాల అధికారులు సంతకం కూడా పెట్టించుకోలేదని తెలుస్తోంది. యోగీశ్వరి రోడ్డుపై నిలబడి ఉండగా తాము చూశామని తోటి విద్యార్థులు తెలిపారు. అదే రోజు రాత్రి 9 గంటలకు యోగేశ్వరి కనపడటం లేదని తల్లిదండ్రులకు కళాశాల నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన మడకశిరకు బయల్దేరి వెళ్లారు. శనివారం అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ గోపీయాదవ్ తెలిపారు. -
భర్తే కాలయముడు
అనంతపురం, బుక్కపట్నం: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. గర్భిణి అనే కనికరం కూడా లేకుండా ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బుక్కపట్నం ఎస్సీ కాలనీకి చెందిన నిండు గర్భిణి జయలక్ష్మి (23) డిసెంబర్ 25న నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని భర్త నరేష్కుమార్ అనంతపురం ఆస్పత్రిలో చేర్చాడు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. తన భర్త నిత్యం వేధించేవాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని, అనుమానం రాకుండా ఉండేందుకు తానే ఆత్మహత్యకు యత్నించినట్లు నమ్మబలికాడని జయలక్ష్మి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కిరాతక భర్తను కఠినంగా శిక్షించాలని జయలక్ష్మి బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అయ్యో.. ఎంత పని చేస్తివి దేవుడా!
అనంతపురం, నల్లచెరువు: ‘అయ్యో..ఎంత పని చేస్తివి దేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటిమే..ఇంతలోనే ఎంత పని చేస్తివయ్యా’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. మండలంలోని అల్లుగుండు సమీపాన మదరసా వద్ద జాతీయ రహదారిపై బైక్ బోల్తాపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లికి చెందిన గౌడుచెరువు శ్రీనివాసులురెడ్డి, చంద్రకళ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్ల్లల చదువు కోసం శ్రీనివాసులురెడ్డి బెంగళూరులోనే ఉంటూ ఫ్యాక్టరీలలో పని చేసేవారు. కుమారుడు శశివర్దన్రెడ్డి(19) బెంగళూరులో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. బుధవారం బెంగళూరు నుంచి ముత్యాచెరువులోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. అల్లుగుండు సమీపాన మదరసా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. శశివర్దన్రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న సాయికుమార్ స్పల్పగాయాలతో బయటపడ్డాడు. వెంటనే శశివర్దన్రెడ్డిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. -
గర్భిణిని తోసేసిన దుండగుడు అరెస్ట్
అనంతపురం టౌన్: కొడవీడు ఎక్స్ప్రెస్ రైల్లోంచి గర్భిణిని తోసివేసిన దుండగుడు రాజేంద్రన్ను అరెస్టు చేసినట్లు గుంతకల్ డివిజన్ రైల్వే ఎస్పీ సిద్ధార్థ్కౌశల్ తెలిపారు. బుధవారం నగరంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో గల కోదండరామ కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన వికర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నివాసముంటున్న వేలాయుధం రాజేంద్రన్ రైలులో దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు.. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే పలు రైలు దొంగతానాల్లో జైలు జీవితం గడిపాడు. అక్కడి పోలీసుల హిట్ లిస్టులోకి ఎక్కడంతో రాజేంద్రన్ తన మకాం ఏపీకి మార్చాడు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జరిగిన పలు కేసుల్లో రాజేంద్రన్ నిందితుడు.గత ఏడాది నవంబర్ 20న ధర్మవరం ఎక్స్ప్రెస్ రైల్లో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపాన విజయలక్ష్మీ అనే మహిళను రైలు నుంచి తోసివేస్తుండగా ఆమె సోదరుడు ప్రతిఘటించడంతో రాజేంద్రన్ తప్పించుకుని పారిపోయాడు. నవంబర్25న పెనుకొండ రైల్వేస్టేషన్ వద్ద కదులుతున్న కాచిగూడ ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి నిఖిత అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను తోసేశాడు. ఆమె దగ్గర ఎలాంటి బంగారు నగలు లేకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కుని ఉడాయించాడు. డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు జంగాలపల్లి రైల్వే స్టేషన్లో కదులుతుండగా బి–1 బోగీలో ప్రయాణం చేస్తున్న శిరీష అనే వివాహితను తోయడంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది రక్షించారు. అదే బోగిలో కుటుంబ సభ్యులతో ప్రయాణం సాగిస్తున్న దివ్యశ్రీ అనే ఏడు నెలల గర్భిణి ధర్మవరం రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో వాష్రూంకు రాగా.. అప్పటికే అక్కడ మాటువేసిన రాజేంద్రన్ గొల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో ఆమెను కిందకు తోసేశాడు. అనంతరం అతడూ రైలులోంచి దూకి.. దివ్యశ్రీ వద్దనున్న బంగారు నగలను దోచుకుని ఉడాయించాడు. దొంగలించిన బంగారు నగలను రాజేంద్రన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు ఉంచాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు, జీఆర్పీఎఫ్ అధికారులు గాలింపు ముమ్మరం చేసి 15 రోజుల్లోనే నిందితుడు రాజేంద్రన్ను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ మోహన్ప్రసాద్, హనుమంతు, రాజశేఖర్రెడ్డి, నజీరుద్దీన్, షణ్ముఖానంద, చంద్రశేఖర్తోపాటు పలువురిని రైల్వే ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జీఆర్పీ ఎస్పీ రమేష్బాబుతోపాటు పలువురు పాల్గొన్నారు. -
కంటి‘పాప’ను కాటేయబోయిన తండ్రి
కామంతో కళ్లు మూసుకుపోయిన భర్తను కడతేర్చిన భార్య ఉదంతమిది. వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా భార్య భరించింది. తాగొచ్చి హింసించినా సర్దుకుపోయింది. కుమార్తె అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడంతో సహనం కోల్పోయి దాడి చేయడంతో భర్త ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అనంతపురంలో గురువారం చోటు చేసుకుంది. అనంతపురం సెంట్రల్: కొత్తచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ సదాశివరెడ్డి హత్యకు గురయ్యాడు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసముంటున్న ఈయనకు పాతికేళ్ల కిందట శోభా అనే మహిళతో వివాహమైంది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత నుంచి తాగుడుకు బానిసయ్యాడు. దీనికి తోడు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. కళ్యాణదుర్గంలో పనిచేసే సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళను ఏకంగా అనంతపురం తీసుకొచ్చి రాంనగర్లో వేరు కాపురం పెట్టాడు. జీతం డబ్బులు తాగుడుకు, వివాహేతర సంబంధాలకు వెచ్చిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. వారానికి, రెండువారాలకోసారి ఇంటికి వచ్చి తాగిన మత్తులో భార్య, పిల్లలను కొడుతూ చిత్రవధకు గురి చేసేవాడు. అయినా వారు అలాగే భరిస్తూ వస్తున్నారు. బుధవారం రాత్రి పూటుగా తాగి ఇంటికి వచ్చి న సదాశివరెడ్డి భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా లేసి కూతురితో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించాడు. దీన్ని చూసి భరించలేని ఆయన భార్య రీపర్ కట్టెతో తలపై మోదింది. అంతే.. నిమిషాల్లో ఆయన ప్రాణం కోల్పోయాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగు చూసింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. -
కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్
అనంతపురం, కదిరి: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లిదండ్రులు కట్నం రూపంలో ఇస్తున్న బంగారం స్వచ్ఛమైనది కాదంటూ వరుడు పరారయ్యాడు. గురువారం కదిరి పట్టణంలో చోటుచోసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తనకల్లు మండలం బాలసముద్రం పంచాయతీ టీ సదుంకు చెందిన మహబూబ్బాషా ఒక్కగానొక్క కుమారుడు మహమ్మద్ రఫికి కదిరి మున్సిపల్ పరిధిలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు కదిరిలోని టైటానిక్ ఫంక్షన్ హాల్లో నిఖా(వివాహం) జరగాల్సి ఉంది. పెళ్లి హడావుడిలో ఎవరికి వారు నిమగ్నమై ఉన్నారు. ముహూర్తం సమయానికి పెళ్లి వరుడు కన్పించడం లేదని చెప్పడంతో వధువు తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముందురోజు రాత్రే (బుధవారం) తనకు కట్నం రూపంలో ఇస్తున్న 10 తులాలు స్వచ్ఛమైన బంగారం (కేడీఎం) కాదంటూ తమతో గొడవకు దిగారని, పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగిందని వధువు తరపు బంధువులు పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లతో పాటు పెళ్లి భోజనాల కోసం సుమారు రూ.లక్ష దాకా ఖర్చు అయిందని, బంగార ం కోసమే రూ.3లక్షలు దాకా ఖర్చు చేశామని, తీరా పెళ్లి సమయానికి వరుడు పరారై తమను అవమానం పాలు చేశారని వధువు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీడీ బంక్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడని, పెళ్లి కొడుకు మంచోడని కొందరు చెప్పడంతో ఈ సంబంధం కుదుర్చుకున్నామని, పెళ్లి కొడుకు ఇంత మోసగాడని ఇప్పుడే తెలుస్తోందని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ ఎదుట పోలీస్ స్టేషన్లో వాపోయారు. కట్నం ఇంకా రూ.50 వేలు ఎక్కువ ఇస్తామని వేరే వాళ్లు చెప్పడంతో పెళ్లి కొడుకు పరారై ఆ సంబంధం చేసుకోవడానికి సిద్ధమైనట్లు తమకు తెలిసిందని వారు ఆరోపించారు. పెళ్లి కుమార్తెకు మద్దతుగా నిజాంవలి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొని బాధిత యువతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రాణాలు తీసిన అనుమానం
వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు చోట్లా కర్రలతో బాది అంతమొందించారు. రెండింటి హత్యల వెనుక ఒకటే కారణం కనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారనే అనుమానంతోనే వారిని కడతేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు ఘటనలతో చుట్టుపక్క ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతపురం, కళ్యాణదుర్గం: బోరంపల్లిలో ఘోరం జరిగింది. వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేసి ఉంటారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన రామాంజినమ్మ కుమార్తె విమలకు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన వెంకటేశులుతో 2009లో వివాహం చేశారు. వీరికి కుమారుడు పూర్ణ, కుమార్తె రీనా ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 1.00 గంట సమయంలో విమల సోదరుడు నరసింహులుకు వెంకటేశులు ఫోన్ చేసి ‘మీ అక్క పురుగుల మందు తాగింది రండి’ అంటూ సమాచారం ఇచ్చాడు. ఈ సమయంలో విమల జోక్యం చేసుకుని అదేమీ లేదంటూ ఫోన్లో సమాధానం ఇచ్చింది. తిరిగి 1.50గంటలకు విమల సోదరుడు నరసింహులు తల్లి రామాంజినమ్మ వద్దకు వెళ్లి ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆటోలో పుట్టింటికి రమ్మని చెప్పాడు. అదేమీ లేదని విమల స్పష్టం చేసింది. తిరిగి మధ్యాహ్నం 2.24 గంటలకు మరోసారి వెంకటేశులు ఫోన్చేసి విమల మందు తాగిందని, తాను నిజమే చెబుతున్నానని పుట్టింటి వారికి చెప్పాడు. అనుమానంతో వారు హుటాహుటిన బోరంపల్లికి బయలుదేరి వచ్చారు. అప్పటికే విమల రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. రోకలి బండతో మోది హతమార్చినట్లు గుర్తించి బోరున విలపిస్తూ బయటకు వచ్చారు. ఘటన అనంతరం భర్త వెంకటేశులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. హత్య సంఘటనపై కుటుంబ సభ్యులు గ్రామంలోని రహదారిపై కొద్ది సేపు ఆందోళన చేపట్టారు. రూరల్ ఎస్ఐ నబీరసూల్ సర్దిచెప్పి వారిని శాంతింపచేశారు. ఇదిలా ఉండగా భార్య విమల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్తే హతమార్చి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతురాలి సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. శింగవరంలో మరొకరు.. యల్లనూరు: శింగవరంలో కమ్మర భారతి (36) మంగళవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్లితే... రెండవ భార్య అయిన భారతి వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో భర్త ఆశ్వర్థ ఆచారి, ఆయన మొదటి భార్య కుమారులు ప్రకాశం ఆచారి, మనోహర ఆచారిలు పథకం ప్రకారం నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై కర్రలతో మోది హత్య చేశారు. రక్తపు మరకలను తుడిచేసిన బట్టను కాల్చివేసేశారు. హతురాలి అక్క లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు భారతి భర్త, ఆయన మొదటి భార్య కుమారులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హారున్బాషా తెలిపారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
మిస్టరీ విప్పిన పెట్రోల్ క్యాన్
అనంతపురం, పామిడి: ‘ఎంత తెలివిగా హత్య చేసినా హంతకులు ఏదోక క్లూ వదిలేపోతారు’, ‘తీగ లాగితే డొంక కదులుతుంది’ మిస్టరీగా మారిన కేసులను ఛేదించే పోలీసులు వీటిని దృష్టిలో ఉంచుకునే దర్యాప్తు ప్రారంభిస్తారు. పెద్దవడుగూరు మండలం వీరెపల్లి శివార్లలో గత నెల 21న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు కూడా ఈ విధంగానే ఛేదించబడింది. హంతకులు తాము ఉపయోగించిన పెట్రోల్ క్యాన్ను వదిలేసిపోవడం, దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కేసును ఛేదించడం నెల తిరక్కముందే జరిగిపోయాయి. మృతుడు కర్నూలు జిల్లా ఆదోనిలోని రాజీవ్ కాలనీకి చెందిన బోయ ప్రదీప్(18) అని గుర్తించారు. నిందితులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్స్టేషన్లో ఏఎస్పీ చౌడేశ్వరి వెల్లడించారు. బోయ ప్రదీప్ తల్లి రోజా పదేళ్ల క్రితం భర్త పరంజ్యోతితో విడిపోయింది. డోన్ పట్టణానికి చెందిన నాగమద్దిలేటిని 2010 సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు విజయ్(12), ప్రదీప్(9). ఈ పెళ్లతో తలెత్తిన గొడవల కారణంగా నాగమద్దిలేటి, రోజా విజయ్ను, ప్రదీప్ను తీసుకుని ఆదోనికి వచ్చి కాపురం పెట్టారు. చిన్న కుమారుడు ప్రదీప్ 10 వతరగతి వరకూ చదివి జల్సాలకు, తాగుడుకు బానిసయ్యాడు. బుల్లెట్ బైకు కావాలంటూ తల్లి రోజాతో నిత్యం గొడవ పడేవాడు. నువ్వంటే అసహ్యమంటూ ఈసడించుకునేవాడు. దీనికితోడు వరుసకు అత్తయిన నాగమద్దిలేటి సొంత చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని గత నెల 19న ఇంటికి వెళ్లాడు. నాగమద్దిలేటికి ఆయన చిన్న చెల్లెలు ఈ విషయాన్ని తెలిపింది. అప్పటికే నాగమద్దిలేటి తన స్నేహితుడు గౌస్ఖాన్ ఇంట్లో మరో స్నేహితుడు సంపత్కుమార్తో కలిసి మద్యం సేవిస్తున్నాడు. స్నేహితులు ముగ్గురూ కలిసి ఎలాగైనా ప్రదీప్ను అంతమొందించాలనుకున్నారు. ప్రదీప్ను కొట్టి బలవంతంగా వారి బైకులో డోన్వైపు తీసుకెళ్లారు. డోన్కు కొద్దిదూరంలో గుత్తిరోడ్డు వైపు కంపచెట్లలోకి తీసుకెళ్లి రెండు చేతులూ వెనక్కు కట్టేసి బెల్టుతో గొంతు బిగించి చంపేశారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా వైపు తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చి ఆనవాలు లేకుండా చేయాలనుకున్నారు. ఇంటి సామాన్లు మార్చాలని చెప్పి కర్నూలుకు చెందిన మధు బొలెరో వాహనాన్ని అద్దెకు పిలిపించుకున్నారు. సామాన్లు లోడ్ చేసేసరికి కాసేపు నిద్రపో అని డ్రైవర్గా వచ్చిన వెంకటేష్కు చెప్పారు. అతను నిద్రపోగానే వారు ఆ వాహనాన్ని తీసుకుని వెళ్లారు. డోన్ వెలుపల తారకరామనగర్లోని రాజు పెట్రోలు బంకుకు వద్దకెళ్లి రూ.800లకు పెట్రోలును క్యాన్లో తీసుకుని, ప్రదీప్ మృతదేహాన్ని తీసుకుని వీరెపల్లికి తెచ్చారు. ఆ గ్రామ సమీపంలో ప్రదీప్ మృతదేహంపై పెట్రోలు పోసి అంటించారు. అయితే పెట్రోల్ క్యాన్ అక్కడే వదిలేశారు. తిరుగు ప్రయాణంలో గుత్తి బాటలో సుంకులమ్మ గుడికి వెళ్లారు. వాళ్లు వదిలేసిన పెట్రోలు క్యాన్ ఆధారంగా ఏఎస్పీ చౌడశ్వరి ఆధ్వర్యంలో, పామిడి రూరల్ సీఐ రాము సారథ్యంలో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారు పెట్రోలు బంకు, సుంకులమ్మ గుడిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. రెండుచోట్లా కనిపించింది వారే కావడంతో బొలెరో వాహనం నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో రోజా సైతం మృతి చెందింది తన కుమారుడు ప్రదీపేనని గుర్తించిం ది. ఈ నేపథ్యంలో నిందితులు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు. రివార్డుకు సిఫారసు చేశాం : ఏఎస్పీ ఎటువంటి ఆధారాలు లేకపోయినా మిస్టరీగా మారిన కేసును అనతికాలంలో ఛేదించడంలో సీఐ రాముతోపాటు ఎస్ఐ రమేష్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మాణిక్యం, రాజ్కుమార్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, చంద్ర, రవి, శ్రీనాథ్, వివేక్ చేసిన కృషిని ఆమె అభినందించారు. వారికి రివార్డు కోసం ప్రతిపాదించామన్నారు. -
బాలిక అనుమానాస్పద మృతి
అనంతపురం, లేపాక్షి: శిరివరం గ్రామానికి చెందిన మోనిష (16) బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తండ్రి కుమార్ తెలిపిన మేరకు... కర్ణాటకలోని హోసూరు ప్రాంతం జూజూవాడకు చెందిన కుమార్కు లేపాక్షి మండలం శిరివరం గ్రామానికి చెందిన రాధతో వివాహమైంది. 2003లో భర్తతో గొడవపడి రాధ తన పుట్టినిల్లు అయిన శిరివరం గ్రామానికి వచ్చేసింది. కుమార్తె మోనిష తండ్రి వద్ద ఉంటూ అత్తిబేలే వద్దవున్న శ్రీవెంకటేశ్వర స్కూలులో చదువుతోంది. 2017 జూన్లో పాఠశాలకు వెళ్లిన మోనిష కనిపించకుండా పోయింది. తండ్రి హోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అమ్మాయి శిరివరంలోని తన తల్లి వద్ద ఉంటోందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో కుమార్ లేపాక్షి పోలీస్స్టేషన్లో పంచాయితీ చేసి.. కుమార్తెను తల్లి వద్దే వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మోనిష గౌరిబిదనూరులోని పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి 2.45 గంటలకు కుమార్తె చనిపోయిందని సమాచారం అందడంతో కుమార్ హుటాహుటిన శిరివరం చేరుకున్నాడు. పాఠశాల నుంచి ఆలస్యంగా వస్తోందని మందలించినందుకు మనస్తాపం చెంది సంపులో పడి ఆత్మహత్య చేసుకుందని తల్లి చెబుతోంది. కుమార్తె మృతిపై అనుమానం ఉండటంతో భార్య రాధ, బంధువులు లలిత, వెంకటేష్, క్రిష్టప్పలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు. -
పెళ్లైన నెలకే భర్త అదృశ్యం
అనంతపురం, పుట్టపర్తి అర్బన్: పెళ్లైన నెల రోజులకే భర్త అదృశ్యమయ్యాడు. తన భర్త ఆంజనేయులు ఆచూకీ తెలపాలని వెంకటగారిపల్లికి చెందిన గంగమ్మ బుధవారం పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధనుంజయ పేర్కొన్నారు. నవంబర్ రెండో తేదీన ఓడీసీ మండలం సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లికి చెందిన గంగులప్ప వెంకటలక్ష్మమ్మ కుమారుడు ఆంజనేయులుతో గంగమ్మకు వివాహమైంది. నూతన దంపతులు గంగమ్మ చెల్లెలు రమణమ్మ గ్రామమైన గోరంట్ల మండలం బుగ్గపల్లికి నవంబర్ 22న వెళ్లారు. పది రోజులు అక్కడే సంతోషంగా గడిపారు. డిసెంబర్ మూడో తేదీ సాయంత్రం ఐదు గంటలకు బుగ్గపల్లి నుంచి వెళ్లిన ఆంజనేయులు తిరిగి రాలేదు. మొబైల్ ఫోన్ కూడా పని చేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లు పలు గ్రామాల్లో వెదికినా ఎక్కడా జాడ కనిపించలేదు. తన భర్త ఆచూకీ తెలపాలని గంగమ్మ పోలీసులను కోరారు. ఆచూకీ తెలిసిన వారు 95352 38979, 83099 75202 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
నకిలీ ప్లాటినం గుండ్ల విక్రయ ముఠా అరెస్ట్
అనంతపురం , హిందూపురం అర్బన్: ప్లాటినం గుండ్లని సీసం గుండ్లను విక్రయించాలని చూసిన ఏడుగురు సభ్యుల ముఠాను హిందూపురం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చిన్నగోవిందు ఆదివారం మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన ముఠాలో అనంతపురానికి చెందిన పార్వతమ్మ, సేవామందిర్ నాగభూషణరెడ్డి, హిందూపురం ఆర్టీసీ కాలనీ ఆర్.కె.శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్రం తుమకూరు డి.హెచ్.నాగరాజు, బెంగళూరుకు చెందిన శ్రీనివాసులు, గురుమూర్తి, పావగడ ప్రకాష్ ఉన్నారు. వీరు తమవద్ద ఉన్న ప్లాటినం గుండ్లు రూ.కోట్లు విలువ చేస్తాయని, మీకు కావాలంటే రూ.15లక్షలకు ఇస్తామని రామగిరికి చెందిన వీరేంద్రతో బేరం కుదుర్చుకుని, కొంత అడ్వాన్స్ తీసుకున్నారు. శనివారం రాత్రి గుడ్డం ఆలయం సమీపంలో పాట్లినం గుండ్లు ఇవ్వడానికి ముఠా సభ్యులందరూ చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ఐ మక్బుల్బాషా సిబ్బందితో దాడిచేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి ప్లాటినం గుండ్లుగా చెబుతున్న 1.7 కిలోల సీసం గుండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ప్లాటినం పేరు చెప్పి భారీగా డబ్బు దండుకోవాలని చూసినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారన్నారు. -
చిన్నారి కిడ్నాప్ యత్నం విఫలం
అనంతపురం, పామిడి : చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళ పోలీసులకు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన వివరాలను పామిడి సీఐ కె.శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన హనుమక్క ఓ రెండేళ్ల చిన్నారిని అపహరించింది. మంగళవారం రాత్రి పామిడిలోని 44వ నంబర్ జాతీయరహదారిపై హనుమాన్ లింకురోడ్డు సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తున్న సీఐ.. చిన్నారితో అనుమానాస్పదంగా కనిపించిన హనుమక్కను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను డోన్ మండలం ధర్మవరంలో దిగాల్సిందని, పొరపాటున అనంతపురం వైపు వచ్చానని, తిరిగి డోన్కు బయలుదేరుతున్నానని తెలిపింది. పాప ఎవరని అడిగితే బిత్తరపోయింది. పాప తల్లిదండ్రులు పండ్ల వ్యాపారులని, వారు తనకు బాగా తెలుసని, వారే తనకు పాపను అప్పగించారని, అయితే వారి పేరు, ఊరు తెలియదని పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె పాపను కిడ్నాప్ చేసేందుకు యత్నించిందని స్టేషన్కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
అనంతపురం, ఆత్మకూరు: ఆస్తి కోసం కన్నతండ్రిపైనే హత్యాయత్నం చేసిన కుమారులు, కూతురి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ పేరిట ఆస్తి రాసివ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణస్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె మేనక శనివారం అడిగారు. ఆస్తి పంచడానికి నిరాకరించిన నారాయణస్వామికి కళ్లల్లోకి కారం కొట్టి, గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి స్థానికుల సహాయంతో అదే రోజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి అనంతపురంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం, తాడిమర్రి: పెద్దకోట్ల లో ఓ మహిళ విష ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తలారి మండల శంకర్కు యల్లనూరుకు చెందిన పద్మావతి(28)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారులు కృష్ణఅవినాష్, అభినయ్ ఉన్నారు. శంకర్ గ్రామం సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చేపల వేటతో జీవనం సాగించేవాడు. పద్మావతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో నొప్పితాళలేక గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఆంజనేయులు, లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
పెద్దవడుగూరు: వీరేపల్లి సమీపాన మంగళవారం ఉదయం ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహం తగులబడి పోతుండటాన్ని అటుగా వచ్చిన గ్రామస్తులు గమనించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి దావానలంలా వ్యాపించింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందుకున్న పామిడి సీఐ శ్రీనివాసులు, పెద్దవడుగూరు ఎస్ఐ రమేష్రెడ్డిలు చేరుకుని సంఘటన జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దగ్గరే గులాబీ రంగులో ఉన్న ఒక దుప్పటి పడి ఉండటాన్ని పరిశీలించారు. ఎక్కడో యువకుడి చేతులు వెనుకకు కట్టేసి చంపి.. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో మోసం
అనంతపురం, తాడిపత్రి అర్బన్: పలువురి నుంచి చిట్టీలు కట్టించుకున్న సొమ్ముతో నిర్వాహకుడు ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటిలోని సామాన్లను తీసుకెళ్లేందుకు వచ్చిన నిర్వాహకుడి భార్యను బాధితులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాధితులు తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన రాజగోపాల్రెడ్డి దాదాపు పద్దెనిమిదేళ్ల నుంచి లగాన్ వ్యాపారం చేస్తున్నాడు. చిరువ్యాపారులు, ఆటో, కారు డ్రైవర్ల వద్ద చిట్టీల పేరుతో దాదాపు రూ.2 కోట్ల వరకు సేకరించాడ. చిట్టీల కంతులు పూర్తయిన వారికి డబ్బు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. నాలుగు నెలల కిందట కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. బాధితులు వాకబు చేయగా నెలన్నర కిందట తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి తాడిపత్రికి తీసుకొచ్చారు. ఒకరోజంతా బంధించి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రాజగోపాల్రెడ్డి వారి కళ్లుగప్పి ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాడిపత్రిలో ఉన్న తన ఇంటికి రాజగోపాల్ భార్య శ్రీదేవి వచ్చి సామాన్లు తరలిస్తున్న విషయం తెలుసుకున్న బాధితులు అక్కడకు చేరుకుని ఆమెను పోలీస్స్టేషన్లో అప్పగించారు. బాధితులు ఫిర్యాదు ఇస్తే తాము విచారణ చేపడతామని సీఐ నారాయణరెడ్డి బాధితులకు సూచించారు. శ్రీదేవిని కూడా ఇల్లు విడిచి వెళ్ళవద్దని, భర్త వస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు. ఆదివారం కూడా బాధితులు పోలీస్స్టేషన్కు చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే చిట్టీల నిర్వాహకుడిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు. -
తల్లిపై నిందలకు మనస్తాపం.. కుటుంబం ఆత్మహత్య
అనంతపురం, బత్తలపల్లి : ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కుమారుడి బలవన్మరణంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు కూతురుతో కలిసి పురుగుమందు తాగి అర్ధంతరంగా తనువుచాలించాలనుకున్నారు. వీరిలో తండ్రీ కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శిరీష దంపతులు. వీరికి కుమారుడు ఉమేష్చంద్ర (11), కూతురు కీర్తన ఉన్నారు. శ్రీనివాసులు వెలుగులో పని చేస్తూ శిక్షణ ఇచ్చేందు కోసం ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తుంటాడు. శిరీష ఆశా వర్కర్. కుమారుడు బత్తలపల్లిలోని ప్రయివేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కుమార్తె కీర్తన తనకల్లు రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. తల్లిపై నిందలకు మనస్తాపం.. ఆశావర్కర్ విధుల్లో భాగంగా శిరీష ఇంటింటికీ తిరుగుతుండటం వల్ల స్థానికులు మాట్లాడే మాటలకు కుమారుడు ఉమేష్చంద్ర మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉమేష్చంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీనివాసులు వెంటనే మధ్యప్రదేశ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కుమారుడి లేని జీవితం వద్దని.. గురువారం రాత్రి ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో శ్రీనివాసులు, శిరీష దంపతులతో పాటు కుమార్తె కీర్తన పురుగుమందు తాగారు. అంతకు ముందే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని శ్రీనివాసులు వెలుగు కార్యాలయం అధికారికి వాట్సప్ ద్వారా మెసేజ్ పంపాడు. వెంటనే ఆయన బత్తలపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎస్ఐ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ముగ్గురినీ ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శిరీషను అనంతపురం ఆస్పత్రికి పంపారు. శ్రీనివాసులు, కీర్తనల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ లేఖ ఏమైంది..? ఆత్మహత్యాయత్నానికి కారుకైలన వారి పేర్లను సూచిస్తూ శ్రీనివాసులు లేఖ రాసినట్లు బంధువులు తెలిపారు. అయితే ఆ లేఖ ఎవరి వద్ద ఉందనేది తెలియడం లేదు. పోలీసులు కూడా ఇంతవరకూ ఆ లేఖను స్వాధీనం చేసుకోలేదు. ఆ లేఖ దొరికితే ఎవరెవరి పేర్లు ఉన్నాయి.. ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనేది తెలిసే అవకాశం ఉంది. -
పిల్లలను బావిలోకి తోసి.. వివాహిత ఆత్మహత్య
అనంతపురం, గుడిబండ: హిరేతుర్పి సమీపంలో ఓ మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని బావిలోకి తోసినట్లు అనుమానం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శరత్చంద్ర వివరాల మేరకు..కర్ణాటక రాష్ట్రం కోట గ్రామానికి చెందిన లక్ష్మీ(26)కి పదేళ్ల క్రితం అదే రాష్ట్రం మధుగిరి తాలూకా శిడదరగల్లు గ్రామానికి చెందిన యశ్వంత్తో వివాహం జరిగింది. వీరికి వంశీ, చందు అనే ఇద్దరు కుమారులున్నారు. రెండు రోజుల కిందట లక్ష్మీ పుట్టింటికి వెళతానని భర్తతో చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు చెట్టుకు వేలాడుతున్న మహిళ మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిరేతుర్పిలో పూజారి పని చేసున్న అనిల్కుమార్ మృతదేహాన్ని తన సోదరి లక్ష్మీదిగా గుర్తించారు. ఘటన స్థలానికి సమీపంలో ఉన్న బావి గట్టున చిన్నారుల చెప్పులు ఉండడంతో వారిని ఆమె బావిలోకి తోసేసినట్లు అనుమానించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపేశారు. సీఐ దేవేంద్రకుమార్ సంఘట నాస్థలాన్ని పరిశీలించారు. -
మూగబోయిన తిమ్మాపురం
తిమ్మాపురం గొంతు మూగబోయింది. మిద్దె పైకప్పు కూలి భార్యా పిల్లలు మృతి చెందడం, యజమాని తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలవడం అందరినీ కలచివేస్తోంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితం ఇలా అర్ధంతరంగా ముగియడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అనంతపురం, కంబదూరు: కంబదూరు మండలం తిమ్మాపురానికి చెందిన వడ్డే సుబ్బరాయుడు, తిమ్మక్క (30) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు రవి (11) ఆరో తరగతి, కుమార్తె మహాలక్ష్మి (8) నాలుగో తరగతి చదువుతున్నారు. దంపతులు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకునేవారు. అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో మూడు నెలల కిందట ఇంట్లోకి కాకి దూరింది. ఇంటికి అరిష్టం జరిగిందని, ఇక్కడే ఉంటూ తమకూ ఏదో ఒకటి జరుగుతుందనే మూఢనమ్మకంతో సుబ్బరాయుడు కుటుంబం సొంతింటిని వదిలి గ్రామంలోని పాత మిద్దెలో అద్దెకు వెళ్లారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ పాత మిద్దెలో నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో మిద్దె దూలం విరిగా పడటంతో తిమ్మక్కతో పాటు కుమారుడు రవి, కుమార్తె మహాలక్ష్మి దుర్మరణం చెందారు. సుబ్బరాయుడు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. రెండు రోజుల్లో సొంతింటికి రంగు వేయించి వెళ్లాలనుకున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం కళ్యాణదుర్గం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. విషాదఛాయలు మిద్దె కూలి ఒకే ఇంటిలో ముగ్గురు మృతి చెందడంలో తిమ్మాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండడంతో బంధువులు, గ్రామస్తులందరూ ‘అయ్యోపాపం.. అప్పుడే నూరేళ్లు నిండాయా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లు మారకుండా ఉండి ఉంటే ప్రాణాలైనా దక్కేవని, మూఢనమ్మకాలు పట్టించుకోకుండా ఇల్లు శుభ్రం చేసుకుని ఉండి ఉంటే బాగుండేదని చర్చించుకున్నారు. ఎమ్మెల్యేపై స్థానికుల ఆగ్రహం మిద్దె కూలి ముగ్గురు మృతి చెందితే ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి చూసేందుకు కూడా రాకపోతే ఎలా అంటూ స్థానికులు ఆగ్రహించారు. తహసీల్దార్ మసూద్వలి ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకోవడంపై కూడా స్థానికులు మండిపడ్డారు. మూఢ నమ్మకాలతోనే ఇల్లు మార్చాడు కాకి దూరిన ఇంటిలో ఉండటం మంచిది కాదనే మూఢనమ్మకాలతోనే సుబ్బరాయుడు కుటుంబం సొంత ఇంటిని వదలి ఆద్దె ఇంటిలోకి కాపురాన్ని మార్చాడు. గతంలో కూడా గ్రామంలో కొంత మంది ఇళ్లలోకి కాకులు ప్రవేశించాయని, మూడు నెలల పాటు వేరే ఇళ్లలోకి కాపురాలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి పూర్వం నుంచి కొనసాగుతున్నాయి.–హరినాథ్, మాజీ సర్పంచ్ ఉద్విఘ్న క్షణాలు మిద్దె పైకప్పు కూలిన సమయంలో తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్న సుబ్బరాయుడును అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం కాస్త స్పృహలోకి వచ్చాక రాత్రి జరిగిన ప్రమాదం గుర్తొచ్చింది. భార్యా పిల్లలు ఏమయ్యారో తెలుసుకోవాలనుకున్నాడు. తన వద్ద ఉన్న బంధువులను ఆతృతగా అడిగాడు. వారు బాగున్నారని.. నీవు టెన్షన్ పడవద్దని ధైర్యం చెప్పారు. అయినప్పటికీ అతని ధ్యాస కుటుంబ సభ్యులపైనే ఉంది. వారిని చూస్తే కానీ నమ్మే పరిస్థితి లేకపోవడంతో బంధువులపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారు అతడి ఆరోగ్యం దృష్ట్యా అసలు విషయం చెప్పలేదు. ప్రమాదంలో మృతి చెందిన భార్యా, కుమారుడు, కుమార్తెల అంత్యక్రియలకు సాయంత్రం స్వగ్రామంలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సుబ్బరాయుడును ఆస్పత్రి నుంచి వాహనంలో తిమ్మాపురం తీసుకొచ్చారు. అప్పటికే జనం అంతా గుమికూడి ఉండటంతో ఏదో జరిగిందని భావించాడు. ఇక చివరికి భార్యా,పిల్లలు చనిపోయిన విషయాన్ని తెలిపారు. అంతే ఒక్కసారిగా సుబ్బరాయుడు భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా రోదిస్తుండటంతో కడసారి చూపు చూపించిన అనంతరం అతడిని తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
మూడేళ్లకే నూరేళ్లు!
నిండు నూరేళ్ల ఆయుష్షు.. మూడేళ్లకే ముగిసింది!చిన్న కుటుంబం..చింతల్లేని దాంపత్యం..రెక్కల కష్టమే వారి జీవనం ఒక్కగానొక్క మూడేళ్ల ముద్దుల ‘తేజం’ఆ ఇంట అడుగులో అడుగేస్తూ.. బుడిబుడి నడకలేస్తూ..పడుతూ లేస్తూ...కళ్లముందు తిరుగుతుంటే..తప్పటడుగులు పడతాయేమోనని తల్లిదండ్రుల తాపత్రయంవడివడిగా తనయుడిని అనుసరిస్తూ ఊతమయ్యేవారు!‘అమ్మ’ చేతి వేలు పట్టుకొని..అడుగులో అడుగేస్తుంటే.. మా ముద్దుల చిన్ని కృష్ణయ్య అంటూ మురిసిపోయారు!ఎప్పటిలాగే తీపి బిళ్లలేమో అనుకొని నోట్లో విషపుగుళికలు వేసుకున్నాడు.. అంతే...కొద్దిసేపటికి కళ్లు తేలేశాడు దీపావళి పండుగ నాడు కొడుకుచేయి పట్టుకొనికాకర పువ్వులు వెలుగులు నిండాల్సిన ఆ ఇంట..చీకట్లు కమ్ముకుని..కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.. అనంతపురం , ఉరవకొండ/ బొమ్మనహాల్ : పిప్పర్మింట్ బిల్ల అనుకుని టిమెట్ గుళికలను మింగిన చిన్నారి కొద్దిసేపటికే ప్రాణం కోల్పోయాడు. దీపావళి పండుగ వేళ ఆ ఇంట విషాదం నెలకొంది. బొమ్మనహాళ్ మండలం తారకాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తారకాపురం గ్రామానికి చెందిన చిరంజీవి, గీత దంపతులకు తేజ(3) ఒక్కగానొక్క కుమారుడు. చిరంజీవి దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. మంగళవారం ఎప్పటిలాగే ఇంట్లో తమ కుమారుడిని అవ్వ వద్ద పెట్టి పనులకు పోయారు. ఇంట్లో ఆడుకుంటున్న తేజ చేతికందే ఎత్తులో ఉంచిన టిమెట్ (విషపు) గుళికలు ఉండటం గమనించాడు. తాను రోజూ తినే పిప్పరమెంట్ అనుకుని చేతికి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న తేజను కొద్దిసేపటి తర్వాత అమ్మమ్మ గుర్తించి కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే తేజను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో తారకాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. -
రాయదుర్గంలో ఈవ్టీజింగ్
అనంతపురం, రాయదుర్గంటౌన్ : రాయదుర్గంలో ఈవ్టీజింగ్ అధికమవుతోంది. వారం వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమ వారం పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల గుమ్మఘట్ట మండలం వీరాపురం గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఈవ్టీజింగ్కు పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన విద్యార్థిని ఉదయం పాఠశాలకు వస్తున్న సమయంలో ఆ యువకుడు వెంటపడి వేధించసాగాడు. పాఠశాల సమీపంలో రద్దీ ప్రాంతంలోనే కోపంతో విద్యార్థిని చెంపపై కొట్టాడు. దీంతో విద్యార్థిని భయాందోళనకు గురై పాఠశాలకు పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గత నెల రోజుల నుంచి తనను వేధిస్తున్నట్లు విద్యార్థిని ఉపాధ్యాయులతో పేర్కొనట్లు సమాచారం. ఈ ఘటనతో పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా ఇలాంటి ఘటనే వారంరోజుల క్రితం ఇదే పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మరో అమ్మాయిని ప్రేమించకపోతే చేయి చేసుకుంటానని ఓ యువకుడు వేధించినట్లు ఆలస్యంగా తెలిసింది. రద్దీ ప్రాంతమైన జెడ్పీ బాలికోన్నత పాఠశాలలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తరచూ ఈవ్టీజింగ్ సమస్య ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఇటీవల మహిళా రక్షణ టీమ్లు ఏర్పాటు చేశాం. ఈ టీములు గ్రామాలు కూడా తిరుగుతుండడంతో వల్ల పట్టణంలో కాస్త పర్యవేక్షణ తగ్గింది. ఉన్నతాధికారులతో చర్చించి మహిళా రక్షణ టీమ్ను పట్టణంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటాం. కళాశాల, పాఠశాల రాకపోకల వేళల్లో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంచి ఈవ్టీజింగ్పై కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పాఠశాల వద్ద జరిగిన ఘటనపై యువకుడి బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తాం. – నాగేంద్రప్రసాద్, ఎస్ఐ -
యువతి కిడ్నాప్నకు యత్నం
అనంతపురం, తాడిపత్రి అర్బన్: ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు అడ్డుకున్న సంఘటన గురువారం తాడిపత్రి పట్టణంలోని జీడీఆర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... తాడిపత్రి పట్టణంలోని జీడీఆర్ నగర్లో నివాసముంటున్న లక్ష్మిదేవి, శ్రీధర్బాబుల కుమార్తె రజిత ఇంటివద్ద కూర్చుని ఉండగా గురువారం నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి వచ్చి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుపడ్డ తల్లి కళ్లలో కారం చల్లాడు. ఇది గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. వారి కళ్లల్లో కూడా కారం కొట్టబోయాడు. అయితే దారు నాగరాజును చాకచక్యంగా పట్టుకున్నారు. రజిత బంధువులు కొందరు అతడిని పట్టణ శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి కొట్టడంతో తీవ్రగాయాలయ్యయి. స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. నాగరాజు గతంలో కూడా రజితను తీసుకెళ్లినట్లు ఈ ఏడాది జూన్లో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజిత కర్నూలు జిల్లా మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న సమయంలో నాగరాజుతో చనువు ఏర్పడింది. ఇది తెలిసిన తల్లిదండ్రులు చదువు మానిపించి కుమార్తెను ఇంటివద్ద ఉంచుకున్నారు. ప్రస్తుతం రజిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మృగం మేల్కొంది.. మానవత్వం మట్టిగలిసింది!
-
మృగం మేల్కొంది.. మానవత్వం మట్టిగలిసింది!
కట్టుకున్న భర్త.. కనిపెంచిన పిల్లలు.. కంటికి రెప్పలా కాపాడుకునే కుటుంబ సభ్యులు.. వీళ్లందరి పరువు బజారుకీడుస్తూ ‘ఆమె’ తన జీవితాన్ని చేజేతులా కాలరాసుకుంటోంది. తాళికి విలువ లేకుండా పోతోంది. బంధం పలుచనవుతోంది. మానవత్వం మాయమైపోతోంది. ‘చీకటి’ నిర్ణయాలతో జీవితాల్లో అంధకారం అలుముకుంటోంది. క్షణికమైన ఆనందాలకు కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. వెనక్కు తిరిగి చూసుకుంటే.. నా అనే బంధం లేకుండా పోతోంది. ఈ కోవలో ఓ మహిళ వేసిన తప్పటడుగు ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఒకరికి మూడేళ్లు.. మరొకరికి ఆరు నెలలు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ప్రియుడు ఇద్దరు చిన్నారులను అర్ధరాత్రి నిద్రలోనే కర్కశంగాచంపి పాతిపెట్టిన ఘటన పుట్టపర్తిలో కలకలం రేపింది. అనంతపురం, పుట్టపర్తి టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడే ఆమె ఇద్దరు పిల్లలను హతమార్చిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టపర్తి అర్బన్ సీఐ ఆంజనేయులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు వివరాలివీ.. పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన ఓబుళేసు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న గణేష్తో ఆరు నెలల క్రితం పరిచయమైంది. గణేష్ భార్య నాగమ్మ కూడా అక్కడే హెల్పర్గా పనిచేస్తోంది. ఈ దంపతులకు దర్శిని(3), ఆరు నెలల కూతురు సంతానం. ఈ క్రమంలో నాగమ్మతో ఓబుళేసుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ పరిచయంతో ఓబుళేసు తాను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను సొంత గ్రామమైన వెంకటగారిపల్లికి తీసుకొచ్చాడు. మొదటి భార్య రాములమ్మకు ఆమెను పరిచయం చేసి రెండో వివాహం చేసుకోబుతున్నట్లు చెప్పాడు. హత్యకు గురైన దర్శిని ,హత్యకు గురైన ఆరు నెలల పాప(ఫైల్) అందుకు ఆమె ససేమిరా అన్నా వినిపించుకోలేదు. ఇంట్లో ఉంచేందుకు భార్య అంగీకరించకపోవడంతో ఐదు రోజుల క్రితం పుట్టపర్తిలోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని నాగమ్మ, ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు. గత నెల అక్టోబర్ 26న శుక్రవారం నాగమ్మ నిద్రపోతున్న సమయంలో ఓబులేసు ఇద్దరు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా చంపి సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చేశాడు. తెల్లవారుజామున నిద్రలేచిన ఆమె పిల్లలు ఎక్కడని ప్రశ్నించగా.. ఇక్కడ అడ్డు వస్తున్నారని బంధువుల ఇంట్లో వదిలి వచ్చినట్లు నమ్మించాడు. ఆ తర్వాత శనివారం తిరిగి యథావిధిగా ఇద్దరూ బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే పిల్లలు లేకుండా ఒక్కతే రావడంతో భర్త గణేష్తో పాటు బంధువులు నిలదీశారు. ఓబులేసు ఏమి చేశాడో తెలియదని చెప్పడంతో అందరూ కలిసి అతన్ని ప్రశ్నించగా చంపినట్లుగా అంగీకరించి పుట్టపర్తికి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓబులేసు పిల్లలు లేరు, ఏమి చేసుకుంటారో చేసుకోండని.. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్నీ చంపుతానని బెదిరించాడు. విధిలేని పరిస్థితుల్లో గణేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. ఆ మేరకు ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెల్లడించాడు. పిల్లలు ఇద్దరినీ తానే చంపినట్లు అంగీకరించాడు. కాగా గురువారం రాత్రి పొద్దుపోవడంతో శుక్రవారం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం చేయిస్తామని సీఐ తెలిపారు. -
తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధమే కారణం
అనంతపురం, గుంతకల్లు రూరల్: గుండాల గ్రామంలో ఈ నెల 25న జరిగిన గొర్రెల కాపరి ఎల్లిపాయల రాజు (32) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హతుడి తమ్ముడే నిందితుడని తేల్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందునే అన్నను కడతేర్చినట్లు తమ్ముడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను కసాపురం పోలీస్స్టేషన్లో రూరల్ సీఐ ప్రసాద్రావు, ఎస్ఐ రామాంజనేయులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఎల్లిపాయల రాజు మద్యానికి బానిసై బాధ్యత మరిచి తిరిగేవాడు. ఏడాది కిందట కట్టుకున్న భార్యనే మట్టుబెట్టాడు. ఈ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. ప్రస్తుతం తమ్ముడు శ్రీనివాసులుతో కలిసి రాజు గొర్రెలను మేపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మరదలితో రాజు సన్నిహితంగా ఉంటుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులు రగిలిపోయాడు. ఈ నెల 24న రాత్రి గ్రామ సమీపంలోని వంక వద్ద మద్యం తాగి బండపై పడుకుని ఉన్న రాజు వద్దకు వెళ్లాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అన్నతో గొడవపడ్డాడు. ఆగ్రహానికి గురైన శ్రీనివాసులు టవల్తో రాజు గొంతును బిగించి కిందపడేశాడు. అనంతరం గొంతుపై కాలితో నొక్కిపెడుతూ కొడవలితో నరికి, పక్కనే ఉన్న బండరాయితో తలపై మోది ప్రాణం తీశాడు. 25వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని వంక ప్రాంతంలో నిందితుడు శ్రీనివాసులు ఉన్నట్లు సమాచారం అందడంతో కసాపురం ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేశారని సీఐ తెలిపారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
అనంతపురం , ఆత్మకూరు: ఓవర్ టేక్ ఒక ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడింది. ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు ఆమెపై వెళ్లడంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. శరణమ్మ (43) అనే మహిళ తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంలో కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వైపు వస్తున్నారు. మండల కేంద్రం ఆత్మకూరు స్టేట్ బ్యాంకు వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్చేయబోయాడు. అయితే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బ్రేక్ వేశాడు. కుదుపునకు బైక్లో వెనుక కూర్చున్న శరణమ్మ ఎగిరి రోడ్డుపై పడింది. ఆమె కుమారుడు రోడ్డు పక్కన పడిపోయాడు. వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు శరణమ్మ ఛాతీభాగంపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో 108 వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే శరణమ్మ ప్రాణం విడిచింది. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డులో వివరాల ప్రకారం ఆమె అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి అని, బ్యాంకు పాస్పుస్తకంలో కంబదూరు మండలం కొత్తపల్లికి చెందినదిగా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. -
ఫోన్ పేరిట టోకరా
అనంతపురం, సోమందేపల్లి: అతి తక్కువ ధరకే ఫోన్ పంపుతామని చెప్పి స్వీట్బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రాన్ని పంపి అమాయకుడికి టోకరా వేసిన ఉదంతం వెలుగు చూసింది. సోమందేపల్లి మండల కేంద్రంలోని గీతానగర్కు చెందిన నరేష్ చేనేత కార్మికుడు. ఇతడికి ఎస్ఎస్ స్కై కంపెనీ తరఫున 96066 71368 నంబరు నుంచి ఫోన్ వచ్చింది. స్యామ్సంగ్ జే2 ఫోన్ రూ.1600కే ఆఫర్లో ఇస్తున్నామని చెప్పడంతో నరేష్ ఆర్డర్ చేశాడు. సోమవారం పోస్టుమ్యాన్ పార్సిల్ తీసుకురాగా పై మొత్తం చెల్లించి తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ను తెరవగా అందులో ఫోన్కు బదులు స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రం ఉంది. తనను కంపెనీ వారు మోసం చేశారని బాధితుడు లబోదిబోమన్నాడు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితుడు చెబుతున్నాడు. -
చోరీ సొమ్ము రికవర్రీ
అనంతపురం సెంట్రల్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు దొంగలను విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఏ తప్పూ చేయకున్నా పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గత రెండురోజులుగా త్రీటౌన్ పోలీసుస్టేషన్ వద్ద పెద్ద వివాదమే నడుస్తోంది. జిల్లాలో దొంగ– పోలీసు ఆట ప్రతిసారీ వివాదాస్పదమవుతోంది. దొంగలను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. వారి నుంచి రికవరీ చేయడం పోలీసులకు సవాల్గా మారుతోంది. సొమ్ములు ఎక్కడ విక్రయించారన్నది దొంగలు చెబుతున్నప్పటికీ రికవరీ మాత్రం కావడం లేదు. తమకు ఎలాంటి సబంధం లేకున్నా పోలీసులు కక్షకట్టి వసూలు చేస్తున్నారని సదరు వ్యక్తులు వాపోతున్నారు. పోలీసులు చెప్పినంత ఇవ్వకపోతే తమపై అక్రమకేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై నగరంలోని బంగారుషాపు నిర్వాహకులంతా ఏకమై పాతూరు నుంచి డీఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తొలుత తమ తప్పేమీ లేదంటున్నప్పటికీ తర్వాత కొంతమేర ముట్టుజెబుతుండడం నేరాలను ఒప్పుకున్నట్టు పరోక్షంగా అర్థమవుతోంది. పోలీసులు కూడా ఇలాంటి వారిపై తమకు రికవరీ రూపంలో నగదు, బంగారు ఇచ్చేస్తే చాలు కేసులేమీ అవసరం లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తరచూ వివాదాలే.. అనంతపురంలో దొంగలను పట్టుకొని పోలీసులు రికవరీ చూపిస్తున్న ప్రతి కేసులోనూ అంతకుముందు వివాదాలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం సీసీఎస్లో పనిచేసే ఓ ఎస్ఐ దొంగను వెంటబెట్టుకొని హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ వ్యక్తిని బెదిరించి రికవరీ చేసుకొని వచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ విషయంపై సదరు వ్యక్తి సైబరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తమిళనాడులో ఏకంగా ధర్మవరం పోలీసులపై దాడి జరిగినట్లు తెలిసింది. ఏడాది కాలంలో రెండు, మూడు దఫాలు పోలీసు వర్సెస్ స్వర్ణకారులు అన్న చందంగా ఆందోళనలు జరిగాయి. తాజాగా ప్రస్తుతం సీసీఎస్– త్రీటౌన్పోలీసులు అదుపులో ఉన్న దొంగల విషయంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెవిలో కమ్మలతో సహా తీసుకొచ్చారని కొంతమంది మహిళలు విలేకరుల ఎదుట వాపోయారు. తమ బంధువులకు ఎలాంటి సంబంధం లేకపోయినా... గతంలో ఒక్క కేసు కూడా లేకపోయినా తీసుకొచ్చారని గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు మాత్రం ఇలాంటివి సర్వసాధారణమేనని, తమ వద్ద అన్ని సాక్షాధారాలు ఉంటేనే తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు. -
ఎవరి కోసం బతకాలి దేవుడా?
ఆంజనేయులు, కొల్లమ్మ దంపతులకు మహేంద్ర ఒక్కగానొక్క సంతానం. ఎంతో గారాబంగా చూసుకుంటూ అనంతపురంలో డిగ్రీ చదివిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇక మేము ఎవరి కోసం బతకాలి దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ రోదించింది. అనంతపురం , ఆత్మకూరు: ఆత్మకూరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. ఆత్మకూరుకు చెందిన మహేంద్ర (18), రాజేష్ అనే యువకులు పంపనూరు సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో తిరుగుపయనమయ్యారు. మరికొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. ఎదురుగా పాల వ్యాను, ఎద్దుల బండి రావడంతో వాటిని ఎక్కడ ఢీకొంటామోనని ద్విచక్రవాహనాన్ని పక్కకు తిప్పడంతో అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులనూ 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేంద్ర మృతి చెందాడు. మరో యువకుడు రాజేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ సాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు పసికందులు మృతి
హిందూపురం అర్బన్: హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ముగ్గురు పసికందులు మృతి చెందటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 18న మడకశిర మండల పాపసానిపల్లికి చెందిన కవిత తన నాలుగు నెలల ఆడ శిశువుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యసేవలు పొందుతున్న పసిబిడ్డ బుధవారం ఉదయం చనిపోయింది. ప్రాణం పోస్తారని బిడ్డను తీసుకువస్తే బిడ్డ శవాన్ని చేతికిచ్చారని కవిత కన్నీరుమున్నీరైంది. ♦ ఇలా ఉండగానే గంట తర్వాత చౌళూరు గ్రామానికి చెందిన సుకన్య మూడునెలల ఆడశిశువుకు దగ్గు ఉందని, సరిగా పాలు తాగలేకపోతోందని ఆస్పత్రిలో చేర్చింది. చికిత్స పొందుతూ పాప 10 గంటల సమయంలో మృతి చెందింది. అక్కడి సిబ్బంది విషయం తెలిస్తే రచ్చ అవుతుందని భావించి పాప బతకదని ముందే చెప్పామని చెప్పి బాధితులను ఆటో ఎక్కించి పంపించేశారు. ♦ మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిసలమానేపల్లికి చెందిన శ్రావణి రెండు నెలల మగశిశువు ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యుల సూచన మేరకురక్త పరీక్షలు చేయించి తీసుకొచ్చిన కొద్దిసేపటికే బిడ్డ శీరీరం చల్లబడిపోయింది. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో తల్లి శ్రావణి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో లేపాక్షి పీహెచ్సీ ఆస్పత్రిలో చేర్పించారు. పేరుకే జిల్లా ప్రభుత్వాస్పత్రి హిందూపురంలో రూ.23 కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి ఏ మాత్రం తీసిపోని రీతిలో హంగు అర్భాటంతో ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, సదుపాయాలు కల్పించారు. అయితే ఇక్కడ వైద్యం అందించడానికి వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. పేరుకే జిల్లా ఆస్పత్రి. సేవల్లో పీహెచ్సీ కన్నా అధ్వానంగా మారిందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైద్యసేవలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెబితే ‘ఇక్కడ పదిమంది లేరు.. వచ్చి చూస్తారు.. కాస్త ఓపిక ఉండాలి’ అంటూ చీదరించుకుంటున్నారని తెలిపారు. వైద్యులు వచ్చి చూసేసరికి ఉన్న ప్రాణం పోయే పరిస్థితి నెలకొంటోందన్నారు. విచారణకు కలెక్టర్ ఆదేశం అనంతపురం న్యూసిటీ: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న పసికందుల మరణాలపై కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. జేసీ–2 సుబ్బరాజు, డీఎంఅండ్హెచ్ఓ అనీల్కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్తో కమిటీగా వేశారు. కమిటీ రెండు రోజుల్లోపు లోతుగా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని సూచించారు. చిన్నారుల మృతి పట్ల కల్టెకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నీ సహజ మరణాలే ఒకేరోజు ముగ్గురు పసికందులు చనిపోయారు. అన్నీ సహజ మరణాలే. పాపసానిపల్లి కవితకు మేనమామతో పెళ్లయ్యింది. మేనరికం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయింది. చౌళూరు సుకన్య బిడ్డ కుపోషణకు గురై చనిపోయింది. బిసలమానేపల్లి శ్రావణి బిడ్డకు రక్తం తక్కువగా ఉండటంతో మృతి చెందింది.– డాక్టర్ కేశవులు, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యసేవల్లో నిర్లక్ష్యం లేదు హిందూపురం ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న మరణాలపై వైద్యశాఖ నిర్లక్ష్యం లేదు. కేసులన్నీ చివరిలో ఆస్పత్రికి వచ్చాయి. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యమే అందించారు. –రమేశ్నాథ్, డీసీహెచ్ఎస్ -
ముసుగు దొంగ బీభత్సం
అనంతపురం, యాడికి: రాయలచెరువులో ముసుగు దొంగ పట్టపగలే బీభత్సం సృష్టించాడు. ఓ ఇంట్లోకి దూరి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు తాళిబొట్టు చైనును లాక్కెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రాయలచెరువు గ్రామంలోని శివాలయం వీధిలో రైల్వే ట్రాక్మన్ హరిబాబు నివాసం ఉంటున్నాడు. మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంకులో డబ్బు డ్రా చేసి ఇంటికి వచ్చి భద్రపరిచాడు. అనంతరం బయటకు వెళ్లాడు. కాసేపటి తర్వాత ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చి ‘నీ భర్త బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు ఇంట్లో ఉంచాడు. వెళ్లి తీసుకురా’ అంటూ హరిబాబు భార్య లక్ష్మిని గద్దించాడు. భయపడిపోయిన ఆమె ఊయల్లో పడుకున్న చంటిబిడ్డను కాపాడుకునేందుకని వెళ్తుండగా ఆ వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు తాళిబొట్టు చైనును లాక్కుని పరారయ్యాడు. దుండగుడి దాడిలో లక్ష్మి చేతులకు గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న హరిబాబు పరుగున ఇంటికి చేరుకున్నాడు. తనను ఎవరో బ్యాంకు నుంచే ఫాలో అయ్యారని, ఇంట్లో లేని సమయం చూసి కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడని విలేకరులకు తెలిపాడు. ఎస్ఐ ఫణీంద్రనాథరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. -
అమ్మా.. నాన్నేడీ..?
అనంతపురం, గుత్తి: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం చెందాడు. అమ్మా.. నాన్న ఏడీ అని అమాయకంగా అడుగుతున్న కుమారుడిని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. ‘చనిపోయిన మీ నాన్నను నేను ఎక్కడికి వెళ్లి తేవాలిరా’ అంటూ గుండెలకు హత్తుకుని విలపించింది. వివరాల్లోకెళ్తే.. లచ్చానపల్లికి చెందిన దానే గాదిలింగ (27) ఆటో డ్రైవర్. మంగళవారం గుత్తి ఆర్ఎస్ నుంచి ప్రయాణికులతో గుత్తికి బయల్దేరాడు. మార్గం మధ్యలో మేదర కాలనీ (కర్నూలు రోడ్డు) స్పీడ్ బ్రేకర్ వద్ద ఎదురుగా వెళ్తున్న బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి ఆటో బోల్తాపడింది. గాదిలింగ ఎగిరి తన ఆటో కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ప్రమాద వార్త విని భార్య మల్లేశ్వరి, కుమారుడు ధీరజ్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. అమ్మా.. నాన్న ఎక్కడ అంటూ ఆ మూడేళ్ల బాలుడు తల్లిని అడుగుతున్న దృశ్యం చూసి అక్కడున్న వారు కన్నీరు పెట్టారు. ‘మీ నాన్న మనలను వదిలి దేవుని దగ్గరకు వెళ్లాడు నాయనా. మీ నాన్న ఇక రాడు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మల్లేశ్వరి రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ యువరాజు పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
నవజంట ఉసురుతీసిన బస్సు
అనంతపురం, దొడ్డబళ్లాపురం: జీవితాంతం సుఖదుఃఖాల్లో తోడునీడగా కలిసుంటామని బాసలు చేసిన నవ దంపతులు మరణంలోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఓ బైక్ను గార్మెంట్స్ ఫ్యాక్టరీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో కొత్త జంట మరణించిన సంఘటన సోమవారం రాత్రి దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను ఆనంతపురం జిల్లా రొద్దం సమీపంలోని పీ కొత్తపల్లికి చెందిన ఉప్పర సుధాకర్ (26), ఆయన భార్య ఉప్పర అనసూయ(20)గా పోలీసులు గుర్తించారు. వీరు దొడ్డ–గౌరిబిదనూరు మార్గంలోని గుండంగెరె క్రాస్ వద్ద బైక్పై వస్తుండగా గార్మెంట్స్ బస్సు ఎదురుగా ఢీకొంది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా, వీరికి ఇటీవలే పెళ్లయింది. దొడ్డ తాలూకాలోని కమలూరు వద్ద ఉన్న కోళ్లఫారంలో పనిచేసేవారని సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
కలెక్టర్ అవుతావనుకుంటినే..
అమ్మా... మీ కష్టం వృథా కానివ్వను... కష్టపడి సివిల్స్ చదివి కలెక్టర్ అవుతా. మీ ఆశయాన్ని నెరవేరుస్తా అని చెప్పి మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా? నాన్నా’ అంటూ శివరాజ్కమార్ (19) తల్లి వరలక్ష్మీ గుండెలవిసెలా రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘దేవుడా ఎంత పని చేశావయ్యా! చెట్టంత కొడుకును తీసుకెళ్లి ఈ తల్లికి కడుపుకోత మిగిల్చావా? మేం ఏం పాపం చేశామని ఈ శిక్ష వేశావు’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కణేకల్లు (అనంతపురం): కణేకల్లులోని శ్రీ సిద్ధప్ప దేవాలయ సమీపాన నివాసముంటున్న మంగలి రామాంజినేయులు, వరలక్ష్మీ దంపతుల కుమారుడు శివరాజ్కుమార్ (19) హైదరాబాద్లోని షైన్ ఇండియా ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. దసరా పండుగకు సెలవులివ్వడంతో స్వగ్రామానికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు హెచ్చెల్సీకి వెళ్లాడు. చాలాసేపు ఈతకొట్టి సరదాగా గడిపాడు. చివరగా మరోసారి ఈత కొడదామని అందరూ నీళ్లలోకి దూకారు. అప్పటికే బాగా అలసిపోయిన శివరాజ్కుమార్ నీటి ఉధృతికి తట్టుకోలేకపోయాడు. నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హెచ్చెల్సీ వెంబడి రెండు రోజులపాటు గాలించినా జాడ కనిపించలేదు. ఎట్టకేలకు శనివారం ఉదయం బొమ్మనహాళ్ మండలం వన్నళ్లి వద్ద శవమై తేలాడు. లక్ష్యం చేరుకోక మునుపే తిరిగిరాని లోకాలకు.. కాలువలో లభించిన శవాన్ని కుటుంబ సభ్యులు నేరుగా కణేకల్లు ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తీసుకొచ్చారు. ఎప్పుడూ నవ్వుతూ కన్పించే శివరాజ్కుమార్ విగతజీవిగా కన్పించడంతో తల్లి భరించలేకపోయింది. భవిష్యత్తులో అండగా ఉంటానన్న కొడుకే లేకపోతే ఈ జీవితం తనకెందుకని, దేవుడా ఎందుకింత పెద్ద శిక్ష వేశావయ్యా అంటూ సొమ్మసిల్లిపడిపోయింది. ‘నాన్నా... నాకు సివిల్స్ అంటే ఇష్టం... హైద్రాబాద్లో ఐఏఎస్ అకాడమీలో చదువుకుంటానని చెబితే.. ‘సరే నాన్న చదువుకో అన్నానే. నీ లక్ష్యం నెరవేరకనే అందరినీ వీడి ఎలా వెళ్లిపోయావు కుమార్’ అంటూ రోదిస్తున్న తండ్రిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. శివరాజ్కుమార్ మృతితో కణేకల్లులో విషాదఛాయలు అలుముకొన్నాయి. నాయిబ్రహ్మణులుందరూ దగ్గరుండి పోస్టుమార్టం చేయించి అంత్యక్రియలు నిర్వహించారు. శివరాజ్కుమార్ మరణవార్త తెలుసుకుని ఐఏఎస్ అకాడమీలో చదువుతున్న అతని స్నేహితులు 20 మంది కణేకల్లుకు హుటాహూటిన వచ్చారు. పండుగకు వెళ్లి వస్తానని చెప్పి తమ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోవడం బాధగా ఉందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కణేకల్లు పోలీసులు శవాన్ని పోస్టుమార్టం చేయించి, కేసు నమోదు చేశారు. కొడుకు లక్ష్యం కోసం శ్రమించిన తండ్రి పట్టణంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్న మంగళి రామాంజినేయులు కుల వృత్తి చేసుకుంటూ భార్యా, పిల్లలను పోషిస్తున్నాడు. కూతురు అంకిత తొమ్మిదవ తరగతి చదువుతోంది. హిందూపురం సమీపంలో కొడిగెనహళ్లి ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసుకున్న కుమారుడు శివరాజ్కుమార్ తన జీవిత లక్ష్యం కలెక్టర్ అని, తనను హైదరాబాద్లోని ఐఏఎస్ అకాడమీలో చదివించాలని కోరడంతో తండ్రి సరేనన్నాడు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పిల్లల చదువు కోసం రామాంజినేయులు నిరంతరం కష్టపడ్డాడు. షైన్ ఇండియా ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివరాజ్కుమార్ దసరా పండుగ కోసం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి సరదా కోసం వెళ్లిన శివకుమార్ అనంత లోకాలకు వెళ్లి పోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. చదువులో తనకు ఇన్స్పిరేషన్గా ఉన్న అన్న అకస్మాత్తుగా మృతి చెందడంతో అంకిత బోరున విలపిస్తోంది. -
పండుగ వేళ విషాదం
పెద్దవడుగూరు: దసరా పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. పండుగ కోసం ఇంటికి బయల్దేరిన యజమానిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. క్రిష్టిపాడు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకెళ్తే.. గుత్తి మండలం గొందిపల్లికి చెందిన బాలరంగారెడ్డి(48) లారీ డ్రైవర్. గురువారం దసరా పండుగ కావడంతో దొందరగా ఇంటికెళ్లాలనే ఉద్దేశ్యంతో రాయలచెరువులో లారీ విధులు ముగించుకున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సొంత ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. క్రిష్టిపాడు జాతీయ రహదారి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలరంగారెడ్డిని స్థానికులు గమనించి 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ చేరుకునేలోపే బాలరంగారెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్రెడ్డి తెలిపారు. తాడిపత్రి అర్బన్: తాడిపత్రి మండలం బొడాయిపల్లెకు చెందిన శివశంకర్ (34) సద్దలదిన్నె వద్ద పాలిష్ బండల ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. శుక్రవారం ఉదయం పనిమీద ద్విచక్రవాహనంలో బొడాయిపల్లె నుంచి బయల్దేరిన శివశంకర్ సద్దలదిన్నె సమీపాన పోతులయ్య కట్ట రోడ్డుపై ఉన్న గుంత వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 ద్వారా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి భార్య ఆశాలత, కుమార్తెలు రక్షిత, తనూష, రజనీని ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అత్తామామలపై హత్యాయత్నం
అనంతపురం ధర్మవరం అర్బన్: భూ తగాదాల నేపథ్యంలో అత్తమామలపై మేనల్లుడు కొడవలితో హత్యాయత్నం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లిలో నివాసముంటున్న దాసరి నారాయణస్వామి, అలివేలమ్మ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణస్వామి తండ్రి యల్లప్పకు ప్రభుత్వం కుణుతూరు పొలంలో 3.15ఎకరాల భూమి మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నారాయణస్వామి తన అక్క కపాడం సాలమ్మ కుమారుడు కపాడం శివయ్యకు రూ.2.80 లక్షలకు అమ్మాడు. కాగా నారాయణస్వామి బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని, అది వర్తించాక భూమిని రిజిష్టర్ చేయిస్తానని చెప్పగా శివయ్య అందుకు అంగీకరించాడు. అనంతరం వారి మధ్య మనస్పర్థలు రావడంతో శివయ్యకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఈ భూమి విషయంపై పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం ఉదయం దాసరి నారాయణస్వామి, భార్య అలివేలమ్మ తోటలో పాలు పితుకుతుండగా కపాడం శివయ్య కొడవలితో వెళ్లి అత్త దాసరి అలివేలమ్మపై దాడి చేసి హత్యాయత్నం చేశాడు. గమనించిన నారాయణస్వామి అడ్డుపడగా అతనిపై కూడా దాడి చేశాడు. వారి కేకలు విన్న స్థానికులు అక్కడికి రాగానే శివయ్య పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి, అలివేలమ్మలను బంధువులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘దారి’తప్పిన ఆడపడుచులు.. గర్భిణి ఆత్మహత్యాయత్నం
‘దారి’ తప్పిన ఆడపడుచుల ప్రవర్తన ఆ ఇల్లాలి మనసును గాయపరిచింది. భర్త, అత్తల అండతో ఆడపడుచులు రెచ్చిపోయారు. ఇది మంచి పద్ధతి కాదని చెబితే ‘నువ్వు కూడా మాలాగే ఉండు’ అంటూ అసహ్యంగా మాట్లాడారు. అత్తింటివారి వింత ప్రవర్తన తీరుతో మనస్తాపం చెందిన ఆమె ఇటువంటి జీవితం తనకు వద్దనుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోయింది. అదే సమయంలో అక్కడున్న ఓ దంపతులు గమనించి ఆమెను కాపాడారు. ఈ ఘటన అనంతపురం రైల్వేస్టేషన్కు సమీపంలోని పీటీసీ ఫ్లై ఓవర్ కింద శుక్రవారం జరిగింది. అనంతపురం సెంట్రల్: గర్భిణి ఆత్మహత్యాయత్నం అనంతపురంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన మహిళకు బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లికి చెందిన యువకుడితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. వ్యవసాయంపై ఆధారపడి ఈ కుటుంబం జీవిస్తోంది. యువకుడికి ముగ్గురు తోబుట్టువులు. వీరు అనంతపురంలో నివాసముంటున్నారు. వివిధ కారణాల వలన వారు భర్తలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళలు వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్నారు. పోలీసుల కంటపడకుండా.. అనంతపురంలో పోలీసుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఆడపడుచులు కన్నేపల్లిలోని తమ్ముడు నివాసానికి విటులను తీసుకెళ్లేవారు. ఇది మంచిది కాదని, తమ ఇంటికి రావద్దని తమ్ముని భార్య హెచ్చరించింది. అయితే భర్త, అత్తల మద్దతు వల్ల ఇంట్లో ఆడపడుచులదే పెత్తనం సాగుతోంది. రోజురోజుకూ వారి చేష్టలు వికృతరూపం దాలుస్తుండటంతో భరించలేకపోయిన ఆమె తన భర్తతో వాగ్వాదానికి దిగింది. ఆయన మౌనం దాల్చగా.. అత్త మాత్రం ‘ఇష్టమైతే నువ్వు కూడా వారి మాదిరే నడుచుకో’ అంటూ సూచించింది. ఆ మాటతో ఆమె నిశ్చేష్టురాలైంది. పాడు జీవితం తనకు వద్దని.. ఆమె తనకు ఆరోగ్యం బాగలేదని డాక్టర్ వద్ద చూపించుకుని వస్తానని ఇంట్లో చెప్పి అనంతపురం వచ్చేసింది. టవర్క్లాక్ వద్ద బస్సు దిగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్పైకి చేరుకుంది. ఆడపడుచుల ప్రవర్తన, భర్త నిస్సహాయతను తలచుకుని, ఇలాంటి పాడు జీవితం తనకు వద్దని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అవ్వా.. నా కొడుకును బాగా చూసుకో.. ఇంతలో తన రెండు సంవత్సరాల కుమారుడు గుర్తుకు వచ్చాడు. అటువైపు వెళుతున్న ఓ వ్యక్తి వద్ద సెల్ఫోన్ ఇప్పించుకుని తన అవ్వకు ఫోన్ చేసింది. ‘అవ్వా.. నా కొడుకును బాగా చూసుకో’ అని చెప్పి ఫోన్పెట్టేసింది. ఈలోగా అనంతపురం రైల్వేస్టేషన్ వైపు నుంచి వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి చనివడానికి సిద్ధమైంది. రైలుకు ఎదురుగా వెళుతుండడంతో అటుగా వెళ్తున్న మూడోరోడ్డుకు చెందిన కిష్టప్ప, లక్ష్మిదేవి దంపతులు గమనించారు. తొలుత ట్రాక్ దాటుతోందని అనుకున్నారు. కానీ రైలు వస్తున్నా పక్కకు తప్పుకోకుండా వెళుతుండటంతో అనుమానం వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పక్కకు లాగారు. అనంతరం కారణాలు తెలుసుకొని మహిళా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్న డీఎస్పీ నాగసుబ్బన్న బాధిత మహిళను ఓఎస్డీ చౌడేశ్వరి వద్ద హాజరుపరిచారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దని, తక్షణమే చర్యలను తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. -
బంగారు కొండా.. నూరేళ్లు నిండాయా!
బంగారు కొండా.. నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా.. టై, బెల్ట్, బూట్లు వేసుకుని స్టడీ క్లాసులకు వెళ్లుతున్నానని చెప్పి... తిరిగిరాని లోకానికి వెళ్లితివే.. నేను ఎట్లా బతకాలి దేవుడా అంటూ ఆ తల్లి బోరున విలపించింది. కళ్లెదుట విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి ఆమె తల్లడిల్లిన తీరు చూపరులను కలచివేసింది. అనంతపురం, తాడిపత్రి టౌన్: పట్టణంలోని నంద్యాల రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు..సుంకులమ్మపాలెంలోని సంకులమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న రమణ, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు నవీన్ (12)నంద్యాల రోడ్డులోని రుషీవ్యాలీ స్కూలులో ఏడో తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిలుపై ఇంటి నుంచి స్కూలుకు వెళ్లేవాడు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్టడీ క్లాసుకు వెళ్లి 8 గంటలకు ఇంటికి బయలుదేరాడు. నంద్యాల రోడ్డులో కుడి వైపు నుంచి ఎడమ వైపునకు సైకిల్పై వస్తుండగా నంద్యాల వైపునకు వెళ్లుతున్న లారీ ఢీ కొంది. ఘటనలో విద్యార్థి తలకు తీవ్రగాయాల కావడంతో రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సైకిల్ కూడా దెబ్బతినింది. స్థానికులు వెంటనే పట్టణ పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్ఐ శ్రీధర్ ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నవీన్ మృతితో సుంకులమ్మపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెలలోమూడు ప్రమాదాలు నంద్యాల రోడ్డులో నెల రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడు లారీల కారణంగానే జరిగినవి కావడం గమనార్హం. అందులో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలబెడుతుండడంతో రోడ్డు దాటేవారికి రోడ్డుపై వచ్చే వాహనాలు కనపడక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనంతపురం, తాడిపత్రి: పట్టణంలోని సీబీ రోడ్డులో గురువారం అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. టైలర్స్కాలనీకి చెందిన షఫీ తన కుమార్తె షాను(24)ను నాలుగేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఇర్ఫాన్కు ఇచ్చి వివాహం చేశారు. ఇర్ఫాన్ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కలిగినా ఇద్దరు మృతి చెందారు. ఉదయం పొరుగున ఉన్న ఇంటిలో షాను ఫ్యానుకు ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని భర్తకు తెలియజేశారు. భర్త స్థానికుల సాయంతో ఫ్యాన్కు వేలాడుతున్న షాను మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబీకులు షాను మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి షఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాళ్లూచేతులు కట్టేసి.. కారుతో తొక్కించి
అనంతపురం, హిందూపురం అర్బన్: కొటిపి సమీపాన దారుణహత్య జరిగింది. ఓ వ్యక్తిని కాళ్లు, చేతులు కట్టేసి.. ఆ తర్వాత కారుతో తొక్కించి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత మృతదేహాన్ని డిక్కీలో వేసుకుని మరో ప్రదేశంలో పడేసేందుకు తీసుకెళుత్తూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని విచారణలో తేలింది. వివరాలిలా ఉన్నాయి. చెన్నకొత్తపల్లి మండలం దామాజిపల్లికి చెందిన రామాంజినప్ప(40), ఆదెమ్మ దంపతులు కొంతకాలం కిందట కూలిపనుల నిమిత్తం కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరుకు వలస వెళ్లారు. మిలటరీలో ఉద్యోగం మానేసి వచ్చిన లేపాక్షికి చెందిన నగేష్ కూడా గౌరీబిదనూరులోని తన సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆదెమ్మతో నగేష్కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిశాక రామాంజినప్ప తన భార్యను తీవ్రంగా మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. అడ్డు తొలగించుకున్నారిలా.. భర్త రామాంజినప్ప అడ్డుతొలగించుకుంటే.. తర్వాత తమ వివాహేతర సంబంధాన్ని సాఫీగా కొనసాగించవచ్చని ఆదెమ్మకు ప్రియుడు తెలిపాడు. అందుకు ఆమె కూడా సమ్మతించడంతో నగేష్ తన బంధువు అయిన కిష్టప్పతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. రామాంజినప్పను అవసరానికి డబ్బు ఇస్తామని చెప్పి మంగళవారం రాత్రి కారులో పిలుచుకెళ్లారు. పూటుగా మద్యం తాగిన తర్వాత హిందూపురం కొటిపి సమీపంలోని రైల్వేగేటు పక్కన మట్టిదారిలోకి తీసుకెళ్లారు. అక్కడ రామాంజినప్పకు కాళ్లు, చేతులు కట్టేసి కిందపడేశారు. అనంతరం కారుతో తొక్కించారు. అరుపులు, శబ్దాలు, కారు లైటును రైల్వేగేట్మన్ సతీష్ గమనించాడు. అక్కడ ఏదో జరుగుతోందని భావించి గ్రామస్తులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. అలాగే హిందూపురం రూరల్ పోలీసులకూ సమాచారం చేరవేశాడు. అడ్డంగా దొరికిపోయారు.. హత్య అనంతరం రామాంజినప్ప జుట్టును కత్తిరించారు. మృతదేహాన్ని మరొకచోట పడేయడం కోసం కారు డిక్కీలో వేసుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరేలోపు ఎక్స్ప్రెస్ రైలు వస్తుందని గేట్మన్ గేటు వేశాడు. కారు వచ్చి అక్కడ ఆగగానే గేట్మన్ జోక్యం చేసుకుని ‘మీరు ఎవరు’ అంటూ వారిని ప్రశ్నించసాగాడు. రైలు వెళ్లిపోయేలోపు కొటిపి గ్రామస్తులు చేరుకున్నారు. కారులో ఉన్న ఇద్దరినీ రోడ్డుపైనే కూర్చోబెట్టి వివరాలు ఆరా తీశారు. ఇంతలో రూరల్ ఎస్ఐ శేఖర్ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. ఇద్దరి (నగేష్, బంధువు కిష్టప్ప)ని అదుపులోకి తీసుకుని, డిక్కీలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రామాంజినప్పను అంతమొందించామని ఒప్పుకున్నారు. హత్యకు వినియోగించిన గొలుసులను విక్రయించిన హిందూపురంలోని దుకాణాన్ని బుధవారం ఉదయం సీఐ వెంకటేశులు, ఎస్ఐ శేఖర్ విచారణ చేశారు. -
భార్యను హత్య చేసిన భర్త
అనంతపురం, కృష్ణరాజపురం : అనుమానంతో భార్యను హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం కోణనకుంటె పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన కుమార్ స్థానికంగా అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తూ భార్య గీతాతో కలసి అక్కడే నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా భార్య గీత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న కుమార్ ఇదే విషయమై తరచూ గీతతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఇరువురి మధ్య ఇదే విషయమై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన కుమార్ కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలానికి చేరుకున్న కోణనకుంటె పోలీసులు కుమార్ను విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
మట్టిలో కలిసిపోయాడు!
అనంతపురం ,రొద్దం: మట్టి తిన్నెలు విరిగి మీదపడటంతో కూలీ దుర్మరణం చెందాడు. రొద్దం మండలం ఆర్ఎల్ కొత్తూరు చెరువులో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన మేరకు... కోగిర గ్రామానికి చెందిన రమేష్ ట్రాక్టర్ ద్వారా ఇసుక రవాణా చేస్తూ జీవనం సాగించేవాడు. సోమవారం ముగ్గురు కూలీలతో కలిసి ఆర్ఎల్ కొత్తూరు చెరువులో ఇసుక కోసం ట్రాక్టర్లో వెళ్లాడు. అక్కడ కూలీలు మట్టి కింది నుంచి ఇసుకను తవ్వి ట్రాక్టర్లోకి లోడ్ చేస్తున్నారు. అలా తవ్వుతున్న క్రమంలో మట్టితిన్నెలు విరిగిపడ్డాయి. ఇద్దరు కూలీలు నరసింహ, విజయ్లు సగం వరకు, మరొక కూలీ కోగిర గ్రామానికి చెందిన కురుబ రామాంజినప్ప (40) పూర్తిగా మట్టిలో ఇరుక్కుపోయారు. ఇద్దరు కూలీలు బయటకు వచ్చి.. పూర్తిగా కూరుకుపోయిన రామాంజినప్పను బయటకు తీసేలోపే అతడు ఊపిరాడక మృతి చెందాడు. మృతుడు రామాంజినప్పకు భార్య రామాంజినమ్మ, ఇంటర్ చదువుతున్న కుమారులు అనిల్, సురేంద్ర ఉన్నారు. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న రామాంజినప్ప మృతి చెందడంతో తమకు దిక్కెవరని భార్య బోరున విలపించింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్కుమార్, హెడ్కానిస్టేబుల్ నరసింహులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులను విచారించారు. పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనధికారికంగా ఇసుక రవాణా ఆర్ఎల్ కొత్తూరు చెరువులో అధికారుల అనుమతులు లేకుండానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు, పోలీసులకు సమాచారమందించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో చెరువులో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయన్నారు. చివరకు అదే మట్టి కిందివైపు నుంచి ఇసుక తవ్వుతూ ఒక కూలీ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. -
ఉపాధ్యాయుడి ఆత్మహత్య
అనంతపురం టౌన్: ఓ ఉపాధ్యాయుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని ద్వారకానగర్కు చెందిన మహేష్ (42) మొదటిరోడ్డులోని పొట్టిశ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం గార్లదిన్నెకు వెళ్లి.. అక్కడ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య సుప్రియ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహేష్ 2000 – డీఎస్సీలో మాథ్స్ సబ్జెక్ట్లో జిల్లా టాపర్గా నిలిచి రాజేంద్ర నగరపాలక సంస్థ పాఠశాలలో గణితం ఉపాధ్యాయునిగా చేరారు. పదేళ్ల క్రితం అక్కడి నుంచి బదిలీపై పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలకు వచ్చారు. కొద్ది రోజులుగా తోటి ఉపాధ్యాయులతో సైతం కలవకుండా ఒంటరిగా తనలో తానే మదనపడుతుండేవాడు. అలాంటి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటం తోటి ఉపాధ్యాయులను కలచివేసింది. -
ప్రైవేటు బస్సు బోల్తా
అనంతపురం రూరల్: మరో అర కిలోమీటరు వెళితే సురక్షితంగా ఇంటికి చేరుకునేవారు. అంతలోనే పెద్ద కుదుపు వచ్చింది. ఏం జరిగిందోనని తెలుసుకునే సరికి బస్సు రోడ్డుపై నుంచి కిందకు బోల్తా పడింది. 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు నెమ్మదిగా వెళుతుండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. మరో 50 అడుగుల దూరంలో రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గొయ్యి ఉంది. ఏమాత్రం వేగం పెరిగి ఉన్నా ప్రాణనష్టం భారీగా జరిగేది. అనంతపురం మండలం పూలకుంట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. వీఆర్ఆర్ఎస్ టౌన్ సర్వీసు బస్సు అనంతపురం – పూలకుంటకు రోజుకు ఐదుసార్లు తిరుగుతుంది. గ్రామస్తులు ఎక్కువగా ఈ బస్సుపైనే ఆధారపడి జిల్లా కేంద్రానికి వస్తుంటారు. మంగళవారం మధ్యాహ్నం 30 మంది ప్రయాణికులతో అనంతపురం నుంచి పూలకుంటకు బస్సు బయల్దేరింది. మరో అర కిలోమీటరు వెళ్లి ఉంటే అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకునేవారు. సరిగ్గా 1.50 గంటల సమయంలో స్టీరింగ్ చాకప్పిన్ విరగడంతో బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు బోల్తాపడింది. వేగం తక్కువగా ఉండటంతో ఒక పల్టీకే బస్సు ఆగిపోయింది. ప్రయాణం చేస్తున్న పూలకుంటకు చెందిన పుల్లమ్మ, నారాయణమ్మ, గోపాల్, సాయికుమార్రెడ్డి, ఎరికల నారాయణస్వామిలు తీవ్రంగాను, సుబ్బక్క, శివారెడ్డి, నాగభూషణం, పార్థసారథి, మీనాక్షి, మల్లయ్య, కదిరమ్మ, రమేష్, డ్రైవర్ అబ్దుల్ఖాదర్, కండక్టర్ షరీఫ్లు స్వల్పంగాను గాయపడ్డారు. వీరిని హుటాహుటిన 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తరలించారు. వైద్యులు సమ్మెలో ఉండటంతో సకాలంలో వైద్యం అందలేదు. దీంతో బాధితుల బంధువులు వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పరామర్శించిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పూలకుంట సమీపంలో బస్సు ప్రమాదం జరిగిందనే విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి హుటాహుటిన అనంత ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, యువజన విభాగం మండల కన్వీనర్ వరప్రసాద్రెడ్డి, పూలకుంట శివారెడ్డి, వడ్డే వెంకటనారాయణ, విద్యార్థి నాయకులు నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
గర్భిణి అనుమానాస్పద మృతి
మరికొన్ని రోజుల్లో సీమంతం జరుపుకోవాల్సి గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాత్రూంలో జారిపడి ప్రాణాలు కోల్పోయిందని మెట్టినింటి వారు చెబుతుండగా.. భర్త, అత్తమామలే హత్య చేసి.. ప్రమాదవశాత్తూ మరణించిందని చిత్రీకరిస్తున్నారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. అనంతపురం, ధర్మవరం అర్బన్ : గర్భిణి అనుమానాస్పద మృతి ధర్మవరంలో కలకలం రేపింది. మృతురాలి పుట్టింటి వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రామ్నగర్కు చెందిన లేట్ వెంకటాచలపతి, శాంతమ్మ దంపతుల నాల్గవ కుమార్తె రాజేశ్వరి(26)ని శాంతినగర్కు చెందిన కుంటుమల్ల సుజాత, లక్ష్మినారాయణ దంపతుల కుమారుడు నరేష్కి ఇచ్చి ఏడు నెలల క్రితం వివాహం చేశారు. నరేష్ శాంతినగర్లోనే ఉన్న జింకా రామాంజనేయులు మగ్లా బిల్డింగ్లో మగ్గం నేస్తూ అక్కడే తన భార్య, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. రాజేశ్వరి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. మూడు నెలలుగా ఆమెను అదనపు కట్నం కోసం భర్త, అత్త,మామలు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంటి పని విషయంలోనూ వంకలు పెడుతూ అత్త సూటిపోటి మాటలు అనేది. అత్తింటివారు తనను హింసిస్తున్నారని రాజేశ్వరి పుట్టింటి వారికి తెలిపేది. వారు సర్దిచెబుతుండేవారు. వచ్చే నెలలో సీమంతం చేయాలని పుట్టింటివారు నిర్ణయించారు. సీమంతానికి ముందే తిరిగిరాని లోకాలకు.. శుక్రవారం ఉదయం నరేష్ తన అత్త శాంతమ్మకు ఫోన్ చేసి మీ కూతురు బాత్రూమ్లో జారిపడి మృతి చెందిందని సమాచారం ఇచ్చాడు. పుట్టింటి వారు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అక్కడ విగతజీవిగా పడి ఉన్న రాజేశ్వరిని చూసి రోదించారు. ఆమె గొంతుకు బిగించినట్టు, వీపుపై కొట్టిన వాతలు తేలి ఉండటాన్ని గమనించి అనుమానం వ్యక్తం చేశారు. అత్తింటి వారిపై ఫిర్యాదు అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించి, చిత్రహింసలకు గురి చేశారని రాజేశ్వరి తల్లి శాంతమ్మ, అన్న మల్లికార్జున, అక్క శ్రీదేవి విలపించారు. వారే చంపేసి.. బాత్రూమ్లో జారిపడి మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు అత్తింటివారిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం భర్త నరేష్, అత్తమామలు సుజాత, లక్ష్మీనారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతు రాలి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సూర్యనారాయణ పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం రూ.10వేల ఆర్థికసాయం అందించారు. అనంత రం సీఐ హరినాథ్కు ఫోన్ చేసి మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
ఆన్లైన్ మట్కా గుట్టురట్టు
అనంతపురం సెంట్రల్: రాయలసీమలో ఆన్లైన్ ద్వారా గుట్టుగా సాగుతున్న మట్కా రాకెట్ను అనంతపురం పోలీసులు గుట్టురట్టు చేశారు. 20 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. బుధవారం పోలీసుకాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అచ్చుకట్ట సాధిక్ (తాడిపత్రి పట్టణం పడమటవీధి), హబీబ్ఖాన్ (గుత్తి) మట్కా ప్రధాన నిర్వాహకులు. మిగిలిన వారిలో దూదేకుల లాల్బాషా, షేక్ సిరాజుద్దీన్దౌలా, దూదేకుల ఇబ్రహీం, షేక్ ముల్లా జాఫర్ (కర్నూలు జిల్లా డోన్), అచ్చుకట్ల అబ్దుల్లా, అచ్చుకట్ల మహమ్మద్ఖాసీం, మాదిగ నారాయణ (తాడిపత్రి), కోవెలకుంట్ల జాఫర్, కోవెలకుంట్ల జలీల్, కార్మురి ఇంద్రశేఖర్, చౌడం సుబ్బరాయుడు (జమ్మలమడుగు), గోనుగుంట్ల రామయ్య (వైఎస్సార్ జిల్లా ఎర్రముక్కపల్లి), పన్నపు జయచంద్రారెడ్డి, పన్నపు రామచంద్రారెడ్డి (పెద్ద ముడియం మండలం గుళ్లకుంట), రెడ్డి బోయ విజయ్కుమార్, ఎల్లావుల గోపాల్ (గుత్తి) ఉన్నారు. వీరి నుంచి రూ. 47.12 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 7లక్షలు కంపెనీ బ్యాంక్ ఖాతాలో సీజ్ చేశారు. వీటితో పాటు ఒక కారు, రెండు ల్యాప్టాప్లు, 32 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, మట్కా పట్టీలు తదితర సామగ్రితో పాటు 3 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మిలాన్ మట్కా కంపెనీ పేరుతోప్రత్యేక వెబ్సైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మాట్కాను నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. మిలాన్ డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. రూ. 100కు రూ.8000 చెల్లిస్తామంటూ సామాన్య, పేద వర్గాల బతుకులను ఛిద్రం చేస్తున్నారు. ప్రధాన నిందితులైన అచ్చుకట్ల సాదిక్వలి బెంగుళూరు కేంద్రంగా చేసుకొని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో మట్కా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. రోజు వారి టర్నోవర్ మొత్తాలను కర్ణాటకలోని హుబ్లీ, మహారాష్ట్రలోని ముంబయి మట్కా కంపెనీలకు గుట్టు చప్పుడు కాకుండా పంపుతున్నాడు. కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. రెండవ ముఖ్యుడైన గుత్తి హబీబ్ఖాన్ కూడా బెంగుళూరు కేంద్రంగా చేసుకొని తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బత్తలపల్లి, కదిరి ప్రాంతాలతోపాటు కడప, కర్నూలు జిల్లాల్లో మట్కా నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో ఆరుగురు అచ్చుకట్ల సాదిక్వలికి సమీప బంధువులే. మిగతా 12 మంది వివిధ ప్రాంతాల్లో బీటర్లుగా మట్కా పట్టీలు రాస్తూ కంపెనీలకు చేరవేస్తూ ఉంటారు. రాయలసీమ జిల్లాలో యువతను లక్ష్యంగా చేసుకొని మట్కాతో పాటు గంజాయి కూడా సరఫరా చేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని తెలుసుకొని ప్రత్యేక నిఘా ఉంచి నిందుతులను పట్టుకున్నామన్నారు. జిల్లాలో మట్కాను శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మట్కా నిర్వాహకుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా అవసరమైన వారిపై జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని హెచ్చరించారు. ప్రశంస మట్కా నిర్వాహకులను పట్టుకోవడంతో పాటు భారీగా నగదు, మట్కా నిర్వహణకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు విజయభాస్కర్గౌడ్, హమీద్ఖాన్, శ్రీరామ్, ఏఎస్ఐ రాజశేఖర్, వెంకటకృష్ణ, హెడ్కానిస్టేబుల్లు రమేష్, అమర్, వెంకటేష్, శ్రీధర్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, జయరాం, శివ, ఆనంద్, గిరి, చంద్ర, రామకృష్ణ, నాగరాజు, విజయ్ హోంగార్డు కుళ్లాయప్పలను ఎస్పీ అభినందించి రివార్డులతో సత్కరించారు. -
మరొకరితో సహజీవనం.. వీడని జంట హత్యల మిస్టరీ
గుత్తి మండలం రజాపురం శివారులో శనివారం వెలుగుచూసిన జంట హత్యల (తల్లీ కుమారుడి) కేసు మిస్టరీ వీడలేదు. హతురాలు వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన లక్ష్మీ అలియాస్ బానుగా గుర్తించారు. పోలీసులు బద్వేలుకు వెళ్లి హతురాలి సోదరుడిని విచారించారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అతడిని గుత్తికి తీసుకువచ్చారు. బద్వేలు పోలీసులు హతురాలి తల్లిరమణమ్మ, హతురాలి మొదటి భర్త బాదుల్లా సోదురుడిని స్టేషన్కుతీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. అనంతపురం, గుత్తి రూరల్: బద్వేలు పట్టణంలోని మంగళి కాలనీకి చెందిన సుబ్బరాయుడు, రమణమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీదేవికి సుందరయ్య కాలనీకి చెందిన షేక్ మస్తాన్ బాషా, మైమూన్ దంపతుల పెద్ద కుమారుడు బాదుల్లాతో 2009లో ప్రేమ వివాహం జరిగింది. కొన్నేళ్లు వీరి కాపురం సాఫీగా సాగింది. అనంతరం భర్త తాగుడుకు బానిసై ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని నెలల తరువాత ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి తన ఇద్దరు కుమారులు మౌలాలి బాషా, మాబ్బాషాలను తీసుకెళ్లిపోయాడు. రెండు రోజులైనా రాకపోవడంతో మద్యం మత్తులో ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని తెలిసిన వాళ్లు, బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోయింది. కొన్ని నెలల తరువాత బాదుల్లా బాక్రాపేట వద్ద మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని తెలుసుకున్న భార్య లక్ష్మీ అతడిని ఇంటికి తెచ్చి పిల్లల గురించి ఆరా తీసింది. అయితే అతడు హైదరాబాదులో విడిచానని ఒకసారి, తిరుపతిలో వదిలేశానని మరోసారి పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. ఆ రెండు చోట్లకు వెళ్లి గాలించినా పిల్లలు దొరకలేదు. భర్త ఇద్దరినీ వదిలేసినా అప్పటికే వారికి షరీఫ్ అనే మూడు నెలల కొడుకు ఉన్నాడు. అనంతరం లక్ష్మీ తన కుమారుడిని ఎక్కడో వదిలేసింది. తర్వాత ఆమె కూడా మతిస్థిమితం లేనట్లుగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబ సభ్యులు మైదుకూరు సమీపంలోని ఖాజీపేటలో గల ఓ ఆలయంలో విడిచిపెట్టారు. మరొకరితో సహజీవనం.. ఖాజీపేటలో లక్ష్మీ మరో వ్యక్తితో సహజీవనం చేయసాగింది. ఈ క్రమంలో వారికి ఒక కుమారుడు జన్మించాడు. వారం రోజుల కిందట లక్ష్మీ తల్లి వద్దకు వెళ్లగా ఆమె వ్యవహారం తెలుసుకున్న తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో లక్ష్మి అక్కడి నుంచి ఆమె ఎటో వెళ్లిపోయింది. ఆ తర్వాత సహజీవనం చేస్తున్న వ్యక్తి బద్వేలులోని లక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమె గురించి ఆరా తీశాడు. అక్కడ ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో అతడు వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీ గుత్తి శివారులో కొడుకుతో కలిసి శవమై తేలింది. వీరిని ఎవరు చంపారనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం ఆంజనేయస్వామి ఆలయ దర్శనం కోసం శుక్రవారమే వచ్చినట్లు తెలుస్తోంది. మతిస్థిమితం సరిగాలేని లక్ష్మి వెంట ఎవరు వచ్చారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆలయంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదా గుత్తిలోని స్వస్థత శాలకు వచ్చినా అక్కడా సీసీ కెమెరాలను పరిశీలించినా లక్ష్మి వెంట ఎవరు వచ్చారో తెలిసే అవకాశం ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. -
వివాహిత దారుణహత్య
ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికని ఇంటి నుంచి బయల్దేరిన వివాహిత దారుణహత్యకు గురైంది. చున్నీతో గొంతుకు బిగించి.. ఆనక బండరాయితో తలపై మోది అంతమొందించారు. కూడేరు మండలం శివరాంపేట సమీపాన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం మిన్నంటింది. అనంతపురం, కూడేరు: బుక్కపట్నంకు చెందిన విజయలక్ష్మి(22)కి అనంతపురంలోని గణేష్ నగర్కు చెందిన బాలాజీతో మూడేళ్ల క్రితం వివాహమైంది. విజయలక్ష్మి అనంతపురంలోని విజయ పబ్లిక్ స్కూల్లో టీటీసీ కోర్సు చేస్తోంది. బాలాజీ ఏటీఎంలకు నగదును సరఫరా చేసే ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఈ నెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్కూల్లో ఫంక్షన్ ఉందని విజయలక్ష్మి ఏడు తులాల బంగారు ఆభరణాలు ధరించి ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరింది. 11 గంటలకు కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే తాను స్కూల్ వద్ద లేను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడం, సెల్ఫోన్ పని చేయకపోవడంతో ఆందోళనకు గురైన భర్త టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి.. కూడేరు మండలం శివరాంపేట వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుట్టలోకి ఓ వ్యక్తి బహిర్భూమికని వెళ్లాడు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో ఏమిటా అని చుట్టుపక్కల వెదికాడు. అక్కడ మహిళ తలపై బండరాయి వేసి ఉండడం గమనించి గ్రామస్తులకు తెలిపి.. పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్, సీఐ ప్రసాద్రావు, ఆత్మకూరు ఎస్ఐ సాగర్లు సిబ్బంది, డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలం చేçరుకుని పరిశీలించారు. మెడకు చున్నీ బిగించి ఉండడం, ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడం, పరిసరాల్లో ఎలాంటి రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించకపోవడం చూస్తే ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మిన్నంటిన రోదనలు విజయలక్ష్మి మృతదేహాన్ని చూసి భర్త, తల్లిదండ్రు లు, అత్తమామలు బోరున విలపించారు. తన తల్లి ఇక లేదన్న విషయం తెలియని రెండు సంవత్సరాల కుమారుడు అమాయకంగా చూస్తుండిపోవడం అం దరినీ కలచివేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపి వేసి ఉండవచ్చని మృతురాలి తండ్రి చిన్నకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
యువకునిపై క్రూరత్వం
ఓ యువకుడిని దుండగులు క్రూరంగా హింసించారు. రాత్రి నుంచి ఉదయం వరకూ తీవ్రగాయాలతో కల్వర్టు వద్ద పడి ఉన్న అతడిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా.. కుటుంబ కలహాల కారణంగా దారుణం చోటు చేసుకుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కళ్యాణదుర్గం: కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన సునీల్ అనే యువకుడు వ్యవసాయ పనులతోపాటు జీవాల వ్యాపారం చేసేవాడు. ఏడాది కిందట చెన్నంపల్లికి చెందిన నవితతో వివాహమైంది. వీరికి ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. సునీల్ శనివారం మధ్యాహ్నం కురాకులపల్లిలో అనంతపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి నరసింహప్పతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బెంగుళూరులో ఉన్న సోదరి విమలకు సమాచారం తెలియడంతో అదే రోజు సాయంత్రం 5.27 నిమిషాలకు సునీల్ సెల్ 95530 60686కు కాల్ చేసింది. ఫోన్ రింగైనా సమాధానం రాలేదు. తిరిగి రాత్రి 10.15 నిమిషాలకు మరోసారి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మరింత ఆందోళనకు గురయ్యారు. చిత్రహింసలకు గురిచేసి..కల్వర్టు వద్ద పడేసి.. చెన్నంపల్లి సమీపాన తన మామ తోట దగ్గరలోని పేరూరు కెనాల్ కల్వర్టు కింద సునీల్ పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ఉంది. శరీరమంతా గుండు సూదులతో గుచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి నొప్పులతో మూలుగుతున్న సునీల్ దొర్లుకుంటూ కల్వర్టు బయటకు చేరుకున్నాడు. ఆదివారం ఉదయం చెన్నంపల్లికి చెందిన నరసింహులు, అమర్లు అయ్యంపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చి.. అక్కడి నుంచి పేరూరుకు వెళ్లే సమయంలో సునీల్ను గమనించారు. కట్లు విప్పి.. మూతికి వేసిన ప్లాస్టర్ను తీసేశారు. అనంతరం అతడి మామకు సమాచారం అందించి.. కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడు సునీల్ను సీఐ శివప్రసాద్, రూరల్ ఎస్ఐ నబీరసూల్లు వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించినా అపస్మారకస్థితిలో ఉన్నందున ఫలితం లేకపోయింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై అనుమానాలు సునీల్పై జరిగిన దాడి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల వ్యాపార లావాదేవీల్లో విభేదాలు తలెత్తడం వల్ల ఈ విధంగా చేశారా..? నెల కిందటే పుట్టింటికి వెళ్లిపోయిన భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా దాడి జరిగిందా.. అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. తన బంధువైన ఓ వ్యక్తి ఆర్థికలావాదేవీల విషయంలో ఇలా చేశారంటూ స్పృహలోకి వచ్చిన తర్వాత సునీల్ చెప్పడంతో కంబదూరు ఎస్ఐ రాగిరి రామయ్య సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. విద్యారణ్యనగర్లో నివాసముం టున్న నాగరాజు సత్యసాయి వాటర్ వర్క్విభాగంలో హెల్పర్గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య లీలావతి (32) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్రూంలో చీరతో ఉరివేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింద ని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. లీలావతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు
నగరంలో రుద్రంపేటలో లోటస్గ్రాండ్ లాడ్జిలో ఈ నెల 17న పేకాట ఆడుతున్న 16 మందిని నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.78,300 స్వాధీనం చేసుకున్నారు. గతంలో నగరంలో త్రీస్టార్ హోటల్ మాసినేని గ్రాండ్ హోటల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్టౌన్ పోలీసులు దాడులు చేసి దాదాపు 20 మందిని అరెస్ట్ చేసి, రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే దారిలో పలు లాడ్జీలు ఎప్పటినుంచే వ్యభిచారానికి అడ్డాగా మారాయి. ఆ దారి వెంబడి కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్లాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. కొంతమంది మహిళలు రోడ్లపై నిల్చుని యువకులను కవ్విస్తూ కనిపిస్తుంటారు. అర్ధరాత్రి అయితే మరీ ఎక్కువ. వీరంతా లాడ్జీలనే కేరాఫ్గా మార్చుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అనంతపురం సెంట్రల్: అనంతపురంలో పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఆదాయమే పరమావధిగా పనిచేస్తున్న కొంతమంది లాడ్జి యజమానులు శాంతిభద్రతలతో పనిలేకుండా సంఘ విద్రోహకశక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దీంతో లాడ్జీలు పేకాట, మట్కా, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఒకప్పుడు 50లోపు లాడ్జీలు ఉండగా.. ప్రస్తుతం 70కు పైగా పెరిగాయి. ఎక్కువ శాతం లాడ్జీల యజమానులు నిబంధనలను పాటించడం లేదు. లాడ్జీలకు ఎవరు వచ్చి వెళుతున్నారనే విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నగరంలో అద్దెకు ఇళ్లు దొరకాలంటే గగనం. సవాలక్ష వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే ప్రజలు ఇళ్లు అద్దెకు ఇస్తున్నారు. కానీ లాడ్జీల్లో ఇవేమీ అక్కర్లేదు. వారు అడిగినంత డబ్బులిస్తే ఏం చేసుకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటకెక్కిన లాడ్జి మానిటరింగ్ సిస్టం యాప్ లాడ్జీల్లో వరుస నేరాలు జరగుతుండడంతో టెక్నాలజీ సహకారంతో పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ‘లాడ్జి మానిటరింగ్ సిస్టం’ యాప్ రూపొందించారు. లాడ్జిలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారనే విషయాలు ఆధార్కార్డు ఆధారంగా తప్పనిసరిగా ఈ యాప్లో నమోదు చేయాలి. దీని వలన నేరస్తులు స్థావరంగా మార్చుకుని ఉంటే సులభంగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక వేళ నేరం జరిగిపోయిన తర్వాత కూడా దర్యాప్తు చేయడానికి వీలుంటుంది. అయితే దీని వలన ఆదాయం కోల్పోతామనే దురుద్దేశంతో లాడ్జి యజమానులు యాప్ను అటకెక్కించారు. నామమాత్రంగా వివరాల నమోదు లాడ్జీల్లో నామమాత్రంగా మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఒక్కోలాడ్జిలో 20 నుంచి 30 మంది ఒక రూం అద్దెకు తీసుకుంటూ పేకాట ఆడుతున్నా పట్టించుకోకపోవడం. కొన్ని లాడ్జీలో ఆటకు ఇంత ఇవ్వాలనే బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కొన్ని లాడ్జీల్లో గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందుతున్నా వారి వివరాలు తేలడం లేదు. గత నెలలో శ్రీకంఠం సర్కిల్లోని ఓ లాడ్జిలో వ్యక్తి మృతి చెందితే ఇప్పటికీ సదరు వ్యక్తి ఎవరన్నది దర్యాప్తులో తేలలేదు. లాడ్జి మానిటరింగ్ యాప్ పక్కాగా అమలైతే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిఘా మరింత కట్టుదిట్టం లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు. నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తాం. ఇటీవల లాడ్జీల యజమానులతో సమావేశం నిర్వహించి గట్టిగా ఆదేశాలు జారీ చేశాం. లాడ్జి మానిటరింగ్ యాప్ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నాం. నేరాలను ప్రోత్సహిస్తే లాడ్జి యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం -
అమ్మ లేని లోకం శూన్యమనీ!
గుంతకల్లు రూరల్: తిరిగిరాని లోకాలకు వెళ్లిన అమ్మను తలచుకుంటూ తిండీ తిప్పలు మానేసిన కొడుకు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక సంఘటన గుంతకల్లులో జరిగింది. వివరాల్లోకెళితే... గుంతకల్లు పట్టణం సత్యనారాయణపేట కాలనీలో లక్ష్మణ్ణ, మల్లమ్మ పతులకు ముగ్గురు సంతానం. లక్ష్మణ్ణ కులవృత్తి (ఇస్త్రీ), మల్లమ్మ పాచిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతురు రామాంజినమ్మ, కుమారుడు రామాంజనేయులుకు వివాహాలు చేశారు. వివాహానంతరం పెద్ద కుమారుడు రామాంజనేయులు వేరు కాపురం పెట్టాడు. కొంత కాలం తర్వాత భార్య, చిన్నకుమారుడితో గొడవపడి లక్ష్మణ్ణ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి చిన్నకుమారుడు శ్రీనివాసులు (25) బాధ్యత తల్లి మల్లమ్మపై పడింది. బేల్దారిపనులు చేసుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్న శ్రీనివాసులు చెడు అలవాట్లకు, మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మల్లమ్మ కామెర్లబారిన పడింది. సరైన వైద్యం చేయించుకోకపోవడంతో 20 రోజుల కిందట మృతి చెందింది. తల్లి మృతితో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు తిండీ తిప్పలు మానేశాడు. మద్యం మత్తులో తూలుతూ ఇంటి వద్దే ఉండిపోయేవాడు. తల్లి లేని లోకంలో జీవించలేననుకున్న శ్రీనివాసులు సోమవారం రాత్రి తమ ఇల్లు, పొరుగిల్లు బాత్రూమ్ల మధ్య పొడవాటి చెక్కను ఉంచి.. దానికి నైలాన్ తాడు బిగించి ఉరి వేసుకున్నాడు. తన తల్లి ఫొటోను చేతిలో పట్టుకుని ఉరితాడుకు వేలాడుతున్న శ్రీనివాసులును మంగళవారం ఉదయం కాలనీవాసులు గుర్తించారు. కసాపురం ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమ్మతనంలో కమ్మదనం..అమ్మ చంటిబిడ్డకు వెచ్చదనం..అమ్మ ఆలనాలాలన చిలిపితనంలో..అమ్మ చిరునవ్వుకు చిరునామా..అమ్మ పుట్టుకకు మూలం..అమ్మ ప్రేమకు ప్రతిరూపం ..అమ్మ రూపానికి ప్రతిబింబం..అమ్మ మమకారంలో అమ్మ ముద్దూమురిపెంలో అమ్మ వెన్నలాంటి మంచి ‘మనిషి’లో.. అమ్మ రూపమేదైనా అమ్మే..అమ్మ ఎక్కడలేదు అమ్మ.. కల్మషంలేని అమ్మ అమ్మలో అసూయలేదు .. కోపంలో అయినా.. కరుణలో అయినా అడుగులో అయినా..ఆకలిలో అయినా.. ఆప్యాయతలో అయినా..ఆత్మీయతలో అయినా.. అన్నింటా కల్మషంలేనిది అమ్మ.. ఎన్ని జన్మలకైనా సాటిలేనిది అమ్మ ‘ప్రత్యామ్నాయం’దొరకనిది అమ్మ.. తనయుడిని కంటికి రెప్పలా పెంచిన తల్లి కన్ను ఆర్పింది. ‘అమ్మ’లేదని..అమ్మనుతలుచుకుంటూ ‘రూపం’..‘తల్లి’డిల్లింది. జీవితం ఇక వద్దు అని..‘జన్మ’చాలని తనువు చాలించింది. -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నరసింహమూర్తి (51) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. 1991 బ్యాచ్కు చెందిన ఈయన జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసుబృందం దాడులు నిర్వహించింది. పేకాటరాయుళ్లను పట్టుకునేందుకు పరుగెత్తే సమయంలో నరసింహమూర్తి గుండెపోటుకు గురయ్యాడు. కళ్యాణదుర్గంలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు అక్కడ ఆయన ప్రాణాలు వదిలారు. కానిస్టేబుల్ నరసింహమూర్తి మృతి చెందడంతో తోటి సిబ్బంది దిగ్బ్రాంతికి లోనయ్యారు. -
దృష్టి మళ్లిస్తారు.. దోచేస్తారు
అనంతపురం సెంట్రల్: ప్రజల దృష్టి మళ్లించి బ్యాగులు దొంగిలించే రెండు అంతర్రాష్ట్ర ముఠాలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 32 లక్షలు విలువైన 1.040 కిలోల (కిలో నాలుగు తులాలు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్కుమార్ సోమవారం పోలీసుకాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. అనంతపురం సీసీఎస్ఎస్ పోలీసులతో కలిసి కదిరి పోలీసులు, గుత్తి పోలీసులు వేర్వేరుగా వెళ్లి రెండు దొంగల ముఠాలను పట్టుకున్నారు. కదిరి పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అనంతపురం రూరల్ మండలం పెద్దింటి గొల్ల రమేష్, ధర్మవరం పట్టణంలోని శాంతినగర్కు చెందిన ఆవుల రత్నమ్మ, తుంకూరు జిల్లా ఉట్లగేరికి చెందిన బోవి గీత ఉన్నారు. వీరి నుంచి 64 తులాల బంగారు బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. గుత్తి పోలీసులు ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన దేవరకొండ వెంకటేష్, గిర్రాజు కాలనీకి సుబ్బరాయుడు, దర్శి ముత్యాలప్పలను అరెస్ట్ చేసి, వారి నుంచి 38 తులాలను స్వాధీనం చేసుకన్నారు. ఈ రెండు ముఠాల్లోని ఆరుగు సభ్యులు సమీప బంధువులు. వీరిలో దర్శి సుబ్బరాయుడు, దర్శి ముత్యాలప్పలు స్వయాన అన్నదమ్ములు. వీరంతా కలిసి బ్యాగ్ లిఫ్టింగ్.. ద్యాస మళ్ళించి నేరాలకు పాల్పడడం వృత్తిగా ఎంచుకున్నారు. తోటి ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కడం, ప్రయాణికుల నుంచి పర్సులు, బ్యాగులు ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. వీరంతా పాత నేరస్తులు. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలో వీరిపై కేసులున్నాయి. 2014లో త్రీటౌన్, తాడిపత్రి రూరల్ పోలీస్స్టేషన్ 10 కేసుల్లో వీరిని అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు ఇస్మాయిల్, కదిరి ఎస్ఐ హేమంత్కుమార్, గుత్తి ఎస్ఐ యువరాజు, వలీబాషు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. స్టేట్ బ్యాంకు దోపిడీ కేసునుచేధించిన పోలీసులకు ఎస్పీ అభినందన జిల్లాలో సంచలనం కలిగించిన జేఎన్టీయూ స్టేట్బ్యాంకు దోపిడీ కేసును రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ అభినందించారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీరామ్, లేపాక్షి ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది రాంబాబు, గిరిబాబు, కుళ్లాయప్ప, షాకీర్, శివకుమార్ తదితరులను సత్కరించారు. బ్యాంకర్లు కూడా కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం వలన నేరాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం బ్యాంకులు మూసేస్తే మళ్లీ సోమవారం వెళ్లి చూసుకుంటారన్నారు. పర్యవేక్షణ లోపిస్తే దొంగలు నేరాలకు పాల్పడే ఆస్కారం ఎక్కువగా ఉందన్నారు. త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. -
మోస్ట్ వాంటెడ్ చికెన్బాబా అరెస్ట్
అనంతపురం, హిందూపురం అర్బన్: మట్కా నిర్వాహణలో ఆరితేరి పోలీసుల రికార్డులో మోస్ట్వాంటెడ్గా ఉన్న చికెన్బాబాను బుధవారం అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హిందూపురం వన్టౌన్ సీఐ చిన్నగోవిందు మీడియాకు వెల్లడించారు. హిందూపురం, పరిసర ప్రాంతాల్లో అత్యధికగా మట్కా లావాదేవీలు కొనసాగించే చికెన్బాబాను అరెస్టు చేయడానికి హిందూపురం పోలీసులే కాకుండా కర్ణాటక పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎస్పీ ఇతన్ని జిల్లా బహిష్కరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే చికెన్బాబా పరారీ కావడం, తర్వాత ఎస్పీ, స్థానిక పోలీసు అధికారుల బదిలీలు కావడంతో ఆ ప్రణాళిక నిలిచిపోయింది. అయితే తన అనుచరులతో మట్కాను నిరాటంకంగా సాగిస్తున్న చికెన్బాబాను పోలీసులు మేళాపురం వద్ద అరెస్టు చేసి రూ.2.25 లక్షల నగదు, సెల్ఫోన్, ప్రింటర్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెల 28న బాబా ముఖ్య అనుచరుడైన మంజునాథ్ అలియాస్ బొట్టు మంజును అరెస్టు చేసి రూ.లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకోవడం, వారం తర్వాత ఇప్పడు చికెన్బాబా అరెస్టు కావడంతో అంతా నాటకీయంగా సాగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
ధర్మవరం అర్బన్/ ఉరవకొండ రూరల్: కుటుంబ కలహాలు రెండు ప్రాణాలను బలిగొన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వివాహితలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీలో నివాసముంటున్న చేనేత కార్మికుడు ధనుంజయ, జయలక్ష్మి (24) దంపతులు. భర్తకు చేదోడువాదోడుగా జయలక్ష్మి కూడా ఇంటి వద్దే ట్యూషన్ చెబుతుండేది. ఆదివారం కల్లూరు వద్దనున్న అమ్మవారి ఆలయానికి బంధువులతో కలిసి వెళ్లారు. అయితే తమ బంధువులను పిలవలేదని జయలక్ష్మి భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో బంధువులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సోమవారం సాయంత్రం భర్త కాలనీలోనే ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి జయలక్ష్మి చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ట్యూషన్కు వచ్చిన పిల్లలు తలుపు తట్టినా ఎంతకూ తీయకపోవడంతో కాలనీవాసులకు తెలిపారు. వారు వెంటనే ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ధనుంజయ వచ్చి తలుపులు తీయగా జయలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమిద్యాలలో మరొకరు.. ఉరవకొండ మండలం ఆమిద్యాలలో బెస్త కవిత (24) అనే వివాహిత సోమవారం ఆత్మహత్య చేసుకుంది. అత్తమామల వేధింపులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఈమె ఇదివరకే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. పెద్దమనుషులు పంచాయితీ చేసి సర్దిచెప్పారు. సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులకు గడియపెట్టి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లోంచి పొగలు వస్తుండటం గమనించిన ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి తలుపులు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసేలోపే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య
గుడిబండ: గుడిబండ మండలం తిమ్మళాపురంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ (32) హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోహన్ మోరుబాగల్ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతను స్వగ్రామంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. రెండు, మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మోహన్ ఇంటి బయట పడుకున్నాడు. సోమవారం ఉదయానికి ఇంటి వెనుక వీధిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే.. గొంతుకు తాడుతో బిగించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శరీరంపై డ్రాయర్ మాత్రమే ఉంది. ఇంటి బయట పడుకుని ఉన్న యువకుడిని దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లి, గొంతుకు తాడు బిగించి చంపి పడేసి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు డాగ్స్క్వాడ్ను పిలిపించి పరిశీలించారు. జాగిలాలు మృతుడి ఇంటి వద్ద నుంచి మరో ఇంటి వద్ద వరకు వెళ్లి ఆగాయి. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో హత్యకు గురయ్యాడా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శుభకుమార్, ఎస్ఐ శరత్చంద్ర తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య కేసులో సంచలన తీర్పు
గుత్తి: వివాహిత ఆత్మహత్యకు కారకులైన భర్తకు జీవిత ఖైదు, అత్తమామలకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుత్తి ఏడీజే కోర్టు జడ్జి కమలాదేవి బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి వన్టౌన్ ఎస్ఐ యు.వెంకటప్రసాద్, ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది మహేష్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు బెంచికొట్టాలకు చెందిన ఎం.కిరణ్కుమార్కు వికారాబాద్ రైల్వే ఉద్యోగి సుభాష్ కుమార్తె లక్ష్మీరాజ్యంతో 2010లో వివాహం జరిగింది. వరుడికి కట్నకానుకల కింద 15 తులాల బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదు, రూ. లక్ష విలువ చేసే ఇంటి సామగ్రిని అందజేశారు. పెళ్లి జరిగిన యేడాది నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. వీరి వేధింపులను భరించలేక 2016 మార్చి ఐదో తేదీన లక్ష్మీరాజ్యం గుంతకల్లు రైల్వేజంక్షన్లోని 5వ ఫ్లాట్ఫాంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ పోలీసులు కేసునమోదు చేసుకుని, దర్యాప్తు కోసం అదే ఏడాది ఏప్రిల్ 16న ఒన్టౌన్ పోలీసులకు కేసు బదిలీ చేశారు. అప్పటి డీఎస్పీ సీహెచ్.రవికుమార్ కేసును దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన గుత్తి ఆరవ అదనపు కోర్టు నేరం రుజువు కావడంతో కేసులో ఏ1గా ఉన్న భర్త కిరణ్కుమార్కు జీవితఖైదు, ఏ2, ఏ3లుగా ఉన్న అత్త,మామ రాధాబాయి, గోవిందరాజులుకు ఏడేళ్ల జైలు, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. = అత్త, మామలకు ఏడేళ్ల జైలుశిక్ష = -
ఆ బంధమే ఆయువు తీసింది!
కదిరి: వివాహేతర సంబంధం వృద్ధుడి ప్రాణం తీసింది. ప్రియురాలు, ఆమెతో సహజీవనం సాగిస్తున్న వ్యక్తి నిందితులని విచారణలో తేలింది. ఈ మేరకు ఇద్దరు నిందితులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీలక్ష్మీ మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి మండలం ముసలివేడుకు చెందిన మునిలక్ష్మీ అలియాస్ ధనలక్ష్మీ అలియాస్ లక్ష్మీ, నారాయణవనం మండలం కన్యకాపురానికి చెందిన టి.బాలాజి అలియాస్ బాలకృష్ణ సహజీవనం సాగిస్తున్నారు. వీరు నన్నారి వేర్లు అమ్ముకుంటూ సంచార జీవనం చేసేవారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తనకల్లు మండలం సున్నంపల్లి దగ్గర తాత్కాలికంగా కాపురం ఉంటున్నారు. మునిలక్ష్మీకి సున్నంపల్లికి చెందిన జెరిపిటి నారాయణప్ప (70)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. సహజీవనం చేస్తున్న బాలాజీకి ఈ విషయం తెలిసింది. దీంతో నారాయణప్పను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల కిందట మునిలక్ష్మీ ద్వారా నారాయణప్పను ఇద్దరూ కలిసి హత్య చేశారు. అనంతరం తమపై అనుమానం రాకుండా ఉండేందుకు కదిరి మండలం అలంపూర్ అడవుల్లోకి శవాన్ని తీసుకెళ్లి కాల్చేశారు. నిందితులను గుర్తించిందిలా.. అలంపూర్ అటవీ ప్రాంతంలో అస్తి పంజరం పడి ఉందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కదిరి రూరల్ పోలీసులు కేసు(క్రైంనెం45/2018) నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ శ్రీలక్ష్మీ సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తు బాధ్యతలను పట్టణ సీఐ గోరంట్ల మాధవ్కు అప్పగించారు. ఆయన కదిరి రూరల్ ఎస్ఐ వెంకటస్వామితో కలిసి విచారణ మొదలెట్టారు. మృతుడు నారాయణప్ప సెల్కు ఎవరి నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి.. చనిపోవటానికి ముందు ఎవరు ఫోన్ చేశారో ఆరా తీశారు. నారాయణప్ప హత్య కేసులో మునిలక్ష్మీ, బాలాజీలే నిందితులని విచారణలో తేలింది. వారిని పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న నిందితులిద్దరూ వెంటనే తహసీల్దార్ను కలిసి తామే నారాయణప్పను చంపామని ఒప్పుకున్నారు. పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు. -
జార్ఖండ్ ముఠా పనే!
జేఎన్టీయూ క్యాంపస్లోని ఎస్బీఐచోరీ కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. జార్ఖండ్కు చెందిన ముఠానే బ్యాంకును కొళ్లగొట్టారని పోలీసులు నిర్ధారణకువచ్చినట్లు తెలిసింది. ‘రాబరీగ్యాంగ్’కు సంబంధించి పూర్తి విషయాలను ఇప్పటికే సేకరించిన పోలీసులు దుండగులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని భావిస్తున్నారు. అప్పుడే రికవరీచేయగలమనే భావనలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎస్బీఐ రాబరీ ‘అనంత’లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులను కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. అందువల్లే ఈ కేసు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలను రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్యాంకులోని నగదును కొళ్లగొట్టింది మధ్యప్రదేశ్కు చెందిన గ్యాంగ్గా పోలీసులు తొలుత భావించారు. అయితే బ్యాంకు అకౌంట్ వివరాలు, చిరునామాలు పరిశీలించిన తర్వాత వారు జార్ఖండ్ గ్యాంగ్గా నిర్ధారించారు. పైగా ఈ నెల 11న మహారాష్ట్రలోని షోలాపూర్లో చోరీకి పాల్పడ్డ ముఠా, ‘అనంత’లో చోరీ చేసిన ముఠా ఒక్కటే అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ పోలీసులు సేకరించిన ఆధారాల ద్వారా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు సాగిస్తున్నాయి. ఫొటోలు, పేర్లు, చిరునామాలు తెలియడంతో ఇక దొంగలను పట్టుకోవడమే తరువాయి అని తెలుస్తోంది. దోపిడీల్లో ఉత్తరాది ముఠాలే ఎక్కువ రైళ్లలో దోపిడీలు చేయడం , బ్యాంకులు, ఏటీఎంలతో పాటు ధనవంతుల ఇళ్లలో చోరీ కేసుల్లో ఉత్తరాది ముఠాలే వెలుగులోకి వస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలోని షోలాపూర్, కొల్లాపూర్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో రాష్ట్రాలు కరువుకు చిరునామాగా మారాయి. అత్యంత వెనుకబడిన గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. వీరికి బతికేందుకు ఉపాధి ఉండదు. దీంతో జంతువులను వేటాడి వాటిని అమ్మి బతికేవాళ్లు! వీరిలో కొన్ని తెగలకు చెందిన వారు చోరీలకు అలవాటు పడ్డారు. చుట్టపక్కల ప్రాంతాల్లో దొంగతనాలు చేద్దామంటే వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అందువల్లే వారు పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో చోరీలు చేయడం మొదలెట్టారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం దొంగలను కాల్చేసేలా ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ ముఠాలు దక్షిణాదిపై విరుచుకుపడ్డాయి. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం వినియోగం ఎక్కువ కావడంతో తమిళనాడు, కర్ణాటక, ఏపీలో దొంగతనాలకు అలవాటుపడ్డారు. పరిసరాలను చూసి పరిస్థితి అంచనా.. ఉత్తరాది ముఠా సభ్యులు దుప్పట్లు, బొమ్మలు అమ్ముకునే వారిలాగా వచ్చి వీధుల్లో తిరుగుతారు. వీరు ఇళ్లవద్ద ఆరేసిన దుస్తులను బట్టి ఎంతమంది ఉన్నారు? పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎంతమంది? అని అంచనా వేస్తారు. ఇంటి చుట్టూ వాసనబట్టి వంటగది, పడకగది, స్టోర్ రూం గ్రహిస్తారు. ఎంచుకున్న ఇళ్ల వద్ద పక్కాగా రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడతారు. బ్యాంకు, ఏటీఎంలదీ కూడా ఇదే పరిస్థితి. దక్షిణాదిలోనూ రైళ్లు, భారీ దొంగతనాలకు ‘అనంత’ను ఎంచుకోవడానికీ కారణం ఉంది. మహారాష్ట్ర మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాలంటే అనంతపురం, గుంతకల్లు నుంచి రోజుకు ఆరుకుపైగా రైళ్లు ఉన్నాయి. కొన్ని రైళ్లలో షోలాపూర్ నుంచి అనంతకు 6–7 గంటల్లోనే చేరుకోవచ్చు. అందువల్లే దుండగులు ఎక్కువగా ‘అనంత’పైనే దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలన్నీ ఆర్గనైజింగ్ గ్యాంగ్లు. ఈ ముఠాలకు డాన్లు ఉంటారు. కేసుల్లో ఇరుక్కుంటే వారిని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు, డాన్లు చూసుకుంటారు. ఏది ఏమైనా వరుస రైల్వే దొంగతనాలు మరకముందే బ్యాంకు దోపిడీ జరగడం ‘అనంత’ వాసుల్లో తీవ్ర ఆందోళన రేకిత్తిస్తోంది. -
అక్క మొగుడే హంతకుడు..
అనంతపురం సెంట్రల్: అనంతపురం మండలం సోములదొడ్డి గ్రామంలో ఈ నెల 24న జరిగిన ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి అంజనప్రసాద్ (27) హత్య మిస్టరీ వీడింది. తమ కూతురును చేసుకోలేదని బావ (అక్క మొగుడు) బయన్న పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ వెంకట్రావ్ మీడియాకు వెల్లడించారు. హత్యకు కారణాలు ఇవి.. సోములదొడ్డిలో నివాసముంటున్న ఆంజనేయులుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెను నార్పల మండలం ఎం.తిమ్మపల్లికి చెందిన బయన్నకు ఇచ్చి వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితమే అత్తవారి ఇంటికి ఇల్లరికం వచ్చి స్థిరపడ్డారు. మూడునెలల క్రితం ఆంజనేయులు కుమారుడు అంజనప్రసాద్(27)కు కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన యువతితో వివాహమైంది. అంజనప్రసాద్ ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడంతో ఎలాగైనా తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి జరిపించాలని బయన్న గతంలో భావించాడు. రూ. 20 లక్షలైనా వరకట్నం ఇస్తా పెళ్లి చేసుకోవాలని పెద్దమనుషులతో ఒత్తిడి చేయించాడు. అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించానని, అందునా వయసు 12 సంవత్సరాలే ఉండడంతో పెళ్లికి నిరాకరించాడు. కొత్త జంటను చూసి ఈర్ష్య.. అంజనప్రసాద్కు మూడు నెలల క్రితం వివాహమైంది. నవదంపతులు ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా అన్యోన్యంగా ఉండేవారు. అంజనప్రసాద్ నగరంలో ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. నవ వధువు స్థానంలో తన కూతురు ఉంటే ఎంత బాగుండేదని, తన కూతురుకు అన్యాయం చేశాడని బయన్న ఈర‡్ష్య పెంచుకున్నాడు. దీంతో పాటు ఇంటి పక్కనే ఉండడంతో బయన్న రోజూ తాగి వచ్చి భార్యను కొడుతుండడంతో అంజనప్రసాద్ తీవ్రంగా మందలించాడు. తనపై దాడి చేసేకి వస్తావా అని కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. ఈ నెల 24 హత్యకు పథక రచన చేశాడు. హత్య చేశాడిలా.. ఈనెల 24న రాత్రి అంజనప్రసాద్ ఇంటికి మామిడికాయలు తీసుకొని వచ్చాడు. వీటిని కుటుంబసభ్యులందరూ కలిసి భోజనం చేసిన తర్వాత తిన్నారు. ఎవరిళ్లలో వారు నిద్రపోయారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బయన్న ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సెల్ఫోన్ అలారం పెట్టివ్వాలని అంజనప్రసాద్ను నిద్రలేపాడు. తలుపు తీయగానే పండ్లుకోసే కత్తితో గొంతుకోశాడు. తప్పించుకోవడానికి అంజనప్రసాద్ యత్నించిగా మచ్చుకత్తితో కోశాడు. ప్రాణం పోయిన తర్వాత నేరం నుంచి తప్పించుకోవడానికి చీరతో ఉరివేశాడు. అనంతరం రోజుమాదిరిగా హాస్టల్లో వంట చేసేందుకు వెళ్లిపోయాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎలాగైనా దొరికిపోతాననే ఉద్దేశంతో బయన్న వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాదీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకట్రావ్ వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ కృష్ణమోహన్, ఎస్ఐలు జగదీష్, రామ్ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
మానవతా మరణం
అనంతపురం కల్చరల్: పురిటి బిడ్డను కాలవ పాలు చేసిన ఘటన మరువక ముందే అనంతలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు నవజాత శిశువులు కుక్కలకు ఆహారంగా మారారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని విద్యుత్ నగర్ నుంచి శారదానగర్ను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న 80 అడుగుల రోడ్డు పక్కనే సోమవారం మధ్యాహ్నం ముళ్ల కంపల్లో ఓ నవజాత శిశువును అట్టపెట్టిలో పెట్టి పారిపోయారు. ఎవరూ గమనించకపోవడంతో వీధి కుక్కలు ఆ శిశువు శరీరంలోని చాలా భాగాలను తినేశాయి. కాగా, అట్టపెట్టెలో శిశువును పడేసి వెళుతున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న శివ, మరొకరు కరిముల్లా అని తేలింది. విచారణలో తమకు సెక్యూరిటీ ఆఫీసర్ జోషి రూ. 500 ఇచ్చి నవజాత శిశువును ఖననం చేయాలని సూచించినట్లు నిందితులు తెలిపారు. మరో ఘటనలో జేఎన్టీయూ సమీపంలో ఓ పసికందును పడేసి వెళ్లారు. సోమవారం ఉదయమే రెండు ఆటోల్లో వచ్చిన అమ్మాయిలు ఇందుకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, అధికారుల సూచన మేరకు మృతశిశువుల మృతదేహాలను సాయి సంస్థ అధ్యక్షుడు విజయసాయికుమార్ ఖననం చేశారు. -
క్లూ దొరికింది!
జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలోని ఎస్బీఐలో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు లాకర్ను కట్ చేసేందుకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ ఆధారంగా తీగలాగిన పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. వాటి సాయంతో దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : జేఎన్టీయూ క్యాంపస్ ఎస్బీఐలో శుక్రవారం రాత్రి రూ.39 లక్షల సొమ్మును దుండగులు అత్యంత పకడ్బందీగా చోరీ చేసినా...లాకర్ను కట్ చేసేందుకు ఉపయోగించిన గ్యాస్సిలిండర్ను అక్కడే వదిలిపోయారు. దీంతో పోలీసులు గ్యాస్ సిలిండర్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఓ దుకాణంలో రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి నిందితులు సిలిండర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. పైగా అక్కడ నగదు కాకుండా డెబిట్కార్డు వినియోగించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆ ఖాతా ద్వారా చేసిన లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో నమోదైన ఫోన్ నంబర్ ద్వారా నిందితుల కాల్డేటాను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. సిలిండర్ దుకాణంలోని సీసీ కెమెరాల ద్వారా నిందితుల ఫొటోలను సేకరించినట్లు సమాచారం. వ్యాపారితో వారు హిందీ మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. బ్యాంక్ అకౌంట్ ఆధారంగా వారు మధ్యప్రదేశ్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి చిరునామా కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు దుండగులు బెంగళూరు నుంచి వెర్నాకారులోవచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ అనంతరం తిరిగి బెంగళూరువైపు వెళ్లినట్లు స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లోనూ...అలాగే టోల్గేట్లలో రికార్డయిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. రంగంలో మూడు బృందాలు దొంగలను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ అశోక్కుమార్ మూడు బృందాలను రంగంలోకి దింపారు. బెంగళూరు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆచూకీ కనుక్కొనేందుకు ఓ బృందం, టోల్గేట్ల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు వెళ్లిన రూట్లలో మరో బృందం, పాత నేరస్తులను గుర్తించి ఫింగర్ప్రింట్స్ మ్యాచింగ్కు మరో బృందాన్ని నియమించారు. మొదటి బృందం మధ్యప్రదేశ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండో బృందం టోల్గేట్లలోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల వెళ్లిన రూట్లో వెళుతున్నట్లు తెలుస్తోంది. నిందితులు చోరీకి వినియోగించిన కారులోనే ఇంకా ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మ్యాచ్ కాని ఫింగర్ ప్రింట్స్ దొంగలకు అడ్డా అయిన షోలాపూర్లో ఈ నెల 11న ఓ బ్యాంక్ రాబరీ జరిగింది. అక్కడ, ఇక్కడ వేలిముద్రలు సేకరించిన పోలీసులు...వాటిని మ్యాచ్ చేసి పనిలో ఉన్నారు. గతేడాది మేనెలలో అనకాపల్లిలోని హైవే సమీపంలోని గ్రామీణ బ్యాంక్ను దుండగులు రెండుసార్లు కొళ్లగొట్టారు. అక్కడ గుర్తించిన వేలిముద్రలతో జేఎన్టీయూ ఎస్బీఐ బ్యాంకు వద్ద దొరికిన వేలిముద్రలను సరిపోల్చారు. అయితే మ్యాచ్ కాలేదు. అనకాపల్లి దొంగలు కర్ణాటకలోని రాయచూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. గంగాధర్ ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో షోలాపూర్ రాబరీలోని పాల్గొన్న వారి వేలిముద్రలతో సరిపోల్చేపనిలో ఉన్నారు. ఈరెండు మ్యాచ్ అయితే కేసులో మరింత పురోగతి సాధించినట్లే. ఇతర రాష్ట్రాల్లో జరిగిన బ్యాంక్ రాబరీలోని దొంగల వేలిముద్రలతో సరిపోల్చేందుకు ఓ బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది. బ్యాంక్ రాబరీ ముఠా పనే జేఎన్టీయూ ఎస్బీఐని చోరీ చేసిన ముఠా బ్యాంక్రాబరీలు, ఏటీఎంలు కొల్లగొట్టడంలో ఆరితేరినట్లు తెలుస్తోంది. ఇటీవలే జార్ఖండ్లో ఓ బ్యాంక్లో రాబరీ చేసేందుకు యత్నించారనీ... అయితే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేలోపు తప్పించుకుని వెళ్లిపోయినట్లు అనంత పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చిన ముఠా ‘అనంత’కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా రెక్కీ నిర్వహించారా? లేదా? అనే కోణంలో కూడా పోలీసులు నగరంలోని సీసీ కెమెరాలతో పాటు జేఎన్టీయూ క్యాంపస్లోని సీసీ కెమెరాల్లోని ఫీడ్ను పరిశీలించారు. దుండగులు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? ఎవరితో వచ్చారు? ‘అనంత’లోని లాడ్జీల్లో బస చేశారా? లేదంటే బెంగళూరు నుంచి నేరుగా వచ్చారా? అనే కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది ప్రమేయం లేదా? చోరీలో బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేదని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగలు చోరీకి పాల్పడిన లాకర్కు సమీపంలో బంగారానికి సంబంధించిన లాకర్లు ఉన్నాయి. అందులో రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల విలువైన బంగారం ఉంది. బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లయితే కచ్చితంగా బంగారం కొల్లగొట్టేవారు. అది కాకుండా రూ.39 లక్షల నగదును మాత్రమే దోపిడీ చేశారంటే తరచూ చోరీలకు పాల్పడే ముఠా వచ్చి లాకర్లను కట్ చేశారు. అందులో నగదు కన్పించడంతో దోచుకున్నారు. అది పూర్తయ్యేలోపే తెల్లవారుజామున 3.30 గంటలు అయినట్లు తెలుస్తోంది. ఒక వేళ బంగారం ఉన్న లాకర్ల వైపు వెళ్లి ఉంటే రూ.కోట్ల విలువైన బంగారం పోయేది. త్వరలోనే దొంగలనుపట్టుకుంటాం బ్యాంకు రాబరీ దొంగలను పట్టుకునేందుకు 3 బృందాలను నియమించాం. లోకల్ పోలీసులు కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కేసులో పురోగతి వచ్చింది. నార్త్ ఇండియాకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నాం. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. – అశోక్కుమార్, ఎస్పీ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అనంతపురం సెంట్రల్ : నగరంలోని జాతీయ రహదారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కృష్ణమూర్తి(20) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. జాతీయ రహదారిలో రుద్రంపేట, కళ్యాణదుర్గం రోడ్డు మధ్యలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రుద్రంపేటలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు కృష్ణమూర్తి మృతిచెందగా అతని స్నేహితుడు మహేష్, ఖాసీలకు తీవ్రగాయాలయ్యాయి. బొలోరో వాహనంను ఓవర్టెక్ చేస్తూ వచ్చిన ఖాసీ అనే వ్యక్తి కృష్ణమూర్తి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. రెండు బైకులు వేగంగా ఢీ కొనడంతో ఎగిరిపడ్డాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సవేరా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
చొక్కా చెప్పిన ఆచూకీ..
‘‘ఆడు మగాడురా బుజ్జీ. ఎవడైనా కోపంతో కొడతాడు. లేదా బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.’’ అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్ ఇదీ. ఇప్పుడు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న ‘వాంగ్మోడే’ నేర చరిత్ర చూస్తే.. అచ్చం ఇలాగే ఉంటుంది. రైల్వే చోరీల్లో ఆరితేరిన ఇతను తన ముఠాతో కలిసి రంగంలోకి దిగితే ఆ రైలు నిలువు దోపిడీకి గురవ్వాల్సిందే. ‘ఉయ్ డోంట్ వాంట్ ఫర్ఫెక్ట్ లైఫ్.. ఉయ్ వాంట్ హ్యాపీ లైఫ్’ ఫిలాసఫీతో చోరీలకు పాల్పడే ఈ ముఠా దోచుకున్న సొమ్మునంతా జల్సాలకే వెచ్చిస్తుండటం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: షోలాపూర్కు చెందిన పార్థి గ్యాంగ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నెల రోజుల్లో ఏడు రైళ్లను కొల్లగొట్టిన దొంగల ముఠాను పట్టుకోవడం పోలీసు శాఖకు సవాల్గా మారింది. ఈ చోరీల వ్యవహారం రాష్ట్రంతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖలోనూ కలకలం రేపింది. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో రైల్వే డీజీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చోరీల నియంత్రణ బాధ్యతను జిల్లా ఎస్పీ అశోక్కుమార్ తన భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే జీఆర్పీ, సివిల్ పోలీసులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి షోలాపూర్కు పంపించారు. రైల్వే దొంగతనాలకు పాల్పడిన ముఠా తీరుతెన్నులు, జీవనశైలి, అక్కడి రాజకీయ నేతల అండదండలు తదితర అంశాలను లోతుగా పరిశీలిస్తే ఆ గ్యాంగ్ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలేనని తెలుస్తోంది. జిల్లాలో గుత్తి–తాడిపత్రి’ మధ్య గత జూన్ 21 నుంచి జూలై 17వ తేదీ వరకు ఏడు చోట్ల చోటు చేసుకున్న వరుస రైల్వే చోరీల సందర్భంగా లభించిన ఆధారాలతో షోలాపూర్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ అశోక్కుమార్ ఈనెల 16న షోలాపూర్కు ప్రత్యేక బృందాలను పంపిన మరుసటి రోజు కూడా మరో రైలులో చోరీ జరిగింది. ఆ తర్వాత 18వ తేదీన మహారాష్ట్రలోని కురుద్వాడి వద్ద మరో రైలును కొల్లగొట్టడం గమనార్హం. తప్పించుకున్న వ్యక్తే కీలకం 2016లో గార్లదిన్నె, తాటిచెర్ల వద్ద సిగ్నల్ కట్ చేసిన దొంగలు రెండు రైళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల తనిఖీల్లో రైల్వేపట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. ఈ క్లూతో అప్పట్లో పోలీసులుషోలాపూర్లో దొంగల కోసం గాలించారు. కేసులో ఐదుగురిని చేర్చి నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు తప్పించుకున్నారని కేసు నమోదు చేశారు. పట్టుబడిన నలుగురూ మామూలు దొంగలు కాగా తప్పించుకున్న వ్యక్తే వాంగ్మోడే. ఇతను ఈ దొంగల ముఠాకు నాయకుడు. పోలీసులు అప్పట్లో ఈ కేసును సీరియస్గా తీసుకోకపోవడంతో ఇటీవల వరుస చోరీలకు కారణమైంది. ఎవరీ వాంగ్మోడే.. షోలాపూర్లోని నార్కెడ్ ఇతని స్వగ్రామం. పార్థి గ్యాంగ్ తరహా చోరీలకు పాల్పడే దన్గర్ తెగకు చెందిన వ్యక్తి. అనంతపురం జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఏడు రైళ్లను కొల్లగొట్టి చల్లగా జారుకున్నాడు. కర్ణాటకలో 2.. మహారాష్ట్రలో 2 చోట్ల కూడా రైళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చొక్కా చెప్పిన ఆచూకీ ఎంతటి చాకచక్యంగా చోరీలకు పాల్పడే దొంగలైనా.. ఎక్కడో ఒకచోట తప్పు చేయడం సహజం. 2016లో అనంతపురం జిల్లాలో రైల్వే చోరీలు చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంగా పోలీసులు తనిఖీలు చేపట్టగా ఒక చోట రైల్వే పట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. అలా ఈ వాంగ్మోడే వెలుగులోకి వచ్చాడు. 35–40 గ్రామాల్లో గాలించిన పోలీసులు షోలాపూర్కు వెళ్లిన బృందాలు అక్కడి పోలీసులను సంప్రదించారు. అక్కడి పోలీసులు, దొంగలకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఏపీ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులు సహకరించరని తెలుస్తోంది. అయితే మహారాష్ట్రలో కూడా దొంగతనాలు జరగడంతో అక్కడి పోలీసులపైనా ఒత్తిడి పెరిగింది. చివరకు ఇరు రాష్ట్రాల పోలీసులు వాంగ్మోడే పాత్రపై అనుమానించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసులు ఈనెల 16 నుంచి షోలాపూర్ జిల్లాలోని 35–40గ్రామాలను జల్లెడ పట్టారు. దొంగలకు అడ్డాగా ఉన్న మొహల్తో పాటు వాంగ్మోడే సొంత ప్రాంతమైన నార్కెడ్లో కలియతిరిగినా వాంగ్మోడే ఆచూకీ లేకపోయింది. పోలీసు వర్గాల్లో, గ్రామాల్లోని వ్యక్తులు పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు వాంగ్మోడేతో పాటు అక్కడి గ్యాంగ్కు అందిస్తుండటంతోనే ఆచూకీ లభించడం లేదని సమాచారం. ఇప్పటి వరకు 3–4 ముఠాలను గుర్తించినా.. షోలాపూర్ పోలీసులతో పాటు పూణేక్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో వేట కొనసాగిస్తున్నారు. చంపేందుకూ వెనుకాడని గ్యాంగ్: దొంగతనాల్లో అధికశాతం ‘పార్థిగ్యాంగ్’ హస్తమే ఉంటోంది. అయితే వాంగ్మోడే దన్గర్ తెగకు చెందిన వ్యక్తి. అవసరమైతే వీరు ఎంతకైనా తెగబడతారు. గతంలో మహారాష్ట్రలోని అక్లూజీ స్టేషన్ పరిధిలో ముగ్గురు దొంగలను పట్టుకునేందుకు వెళితే పోలీసులకు సమాచారం అందించిన ఇన్ఫార్మర్ను గొంతుకోసి చంపేశారు. మరో హెడ్కానిస్టేబుల్ పొట్టలో పొడిచారు. దీంతో వీరిపై అక్కడి ప్రభుత్వం మోకా యాక్టు(మహారాష్ట్ర ఆర్గనైజర్ క్రైమ్ యాక్టు)ను తీసుకొచ్చింది. ఇది ఆ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన చట్టం. కఠిన సెక్షన్లతో జైలుకు పంపడటంతో పాటు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వారు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. వీరికి రేషన్కార్డు, ఆధార్కార్డు ఉండవు. వీటి ఆధారంతో పోలీసులు పట్టుకుంటారని తీసుకోరు. ఇళ్లు కూడా ఉండవు. రేకులషెడ్లు వేసుకుని జీవిస్తుంటారు. మోకా యాక్టు పెడితే షెడ్డులో ఏమీ ఉండదు. అక్కడి రాజకీయ నేతలు కూడా వీరికి మద్దతు. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్కుమార్ షిండే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించేవారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు. చోరీ సొమ్మంతా జల్సాలకే.. దొంగలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణికుల నుంచి బంగారం చోరీ చేస్తారు. దీన్ని అక్కడి బంగారు దుకాణాల్లో అతి తక్కువ ధరకు విక్రయిస్తారు. ప్రస్తుతం తులం రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠాను పోలీసులు పట్టుకుని విక్రయించిన వ్యాపారుల వద్దకు వెళితే ఎంతో కొంత రికవరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత రిస్కు తీసుకున్నందుకు తులంపై రూ.10వేలు వ్యాపారి ఆశిస్తాడు. దీంతో తక్కువ ధరకే బంగారం విక్రయిస్తారు. ఈ డబ్బుతో విచ్చలవిడిగా మద్యం, ఆహారంతో పాటు పేకాట ఆడతారు. చోరీ చేసిన సొమ్ముతో జీవితాలను బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి చట్టాలపైనా వీరికి అవగాహన ఎక్కువే. నిఘా పెట్టాం..దొంగలను పట్టుకుంటాం రైల్వే దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. రెండు బృందాలను షోలాపూర్ పంపించాం. జీఆర్పీ, సివిల్, రైల్వే పోలీసులు సంయుక్తంగా ప్రణాళికతో వ్యవహరిస్తున్నాం. కొన్ని బృందాలపై అనుమానాలు ఉన్నాయి. పాతనేరస్తులను గుర్తించి వారిని విచారిస్తున్నాం. ప్రస్తుతం చోరీలను అరికట్టగలిగాం. తాటిచెర్ల, గార్లదిన్నె ఘటనలను కూడా ఈ దొంగతనాల కేసులో పరిగణనలోకి తీసుకుని ఆరా తీస్తున్నాం. – జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ -
ఎంతపని చేశావమ్మా.. ప్రేమా!
రెండు మనసులను కలుపుతుంది.. ప్రేమ. మనుషుల మధ్య దూరం చెరిపేస్తుంది.. ప్రేమ. కులమతాలకు అతీతం.. ప్రేమ. చంపే కొద్దీ పుట్టుకొస్తుంది.. ప్రేమ. ఇంతటి పవిత్రమైన ప్రేమ.. ఓ జంటను పొట్టనపెట్టుకుంది. ఇది హత్యా? ఆత్మహత్యా? అనంతపురం, ముదిగుబ్బ: ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ రైలు పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్నారు. కలిసి బతకలేమని భావించి తనువు చాలించారా.. లేక ఎవరైనా వీరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్నది తెలియడం లేదు. ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురంలో జరిగిన ఈ సంఘటన వివరాలు రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రంలోని రాఘవేంద్రకాలనీకి ఎరికల ఉమాదేవి (21), బోయ మధు (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఉమాదేవి తండ్రి గోపికి తెలిసింది. దీంతో ఆయన తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఉమాదేవి ప్రియునితో కలిసి ఇంటి నుంచి వచ్చేసింది. కులాంతర ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గురువారం రాత్రి ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురం సమీపానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అక్కడే రైలుపట్టాలపై ఉమాదేవి, మధు మృతదేహాలను ట్రాక్మెన్లు గుర్తించారు. మృతిపై అనుమానాలు రైలు పట్టాలపై ప్రేమజంట మృతదేహాలు పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయి ముఖం ఛిద్రం కాగా ఒంటిపై బట్టలు అలానే ఉన్నాయి. అబ్బాయి తల ఒక కాలు, రెండు చేతులు వేరుపడ్డాయి. తల నుజ్జునుజ్జవగా శరీరంపై ఎటువంటి దుస్తులూ లేవు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.