birthday celebration
-
సెట్లో 'దంగల్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'అమరన్' హీరో శివ కార్తీకేయన్ బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
నటుడు అంబటి అర్జున్ కూతురి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
కోట్ల మంది గుండె చప్పుడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, విజనరీ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారారని తెలిపారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచి్చన అభిమానుల కోలాహలంగా మధ్య జరిగిన ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ జగన్కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం భారీ కేక్ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు, ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.తాడేపల్లిలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీవైఎస్సార్సీపీ విద్యార్థి – యువజన – సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న.. ప్రజా సేవకా.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాడేపల్లి పురవీధుల్లో ర్యాలీ చేశారు.మేలును గుర్తుచేసుకున్న ప్రజలుగత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‘పేద ప్రజలకు సుపరిపాలన అందించిన ధీరుడు మా అన్న జగన్మోహనుడు.. పారిశ్రామిక ప్రగతిలో తనదైన ముద్ర వేశారు.. రాష్ట్రం ఎయిర్ కండీషన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ హబ్లకు వేదికైంది.. చదువుతోనే పేద బిడ్డల తల రాత మారుతుందని నమ్మిన ఏకైక నేత.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారందరికీ ప్రతీ పథకం ఇంటి వద్దనే అందించాలని తపనపడే మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు’ అని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. -
అంబానీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
బిజినెస్మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
రక్షణ రంగంలో సైంటిస్ట్ సూరి భగవంతం సేవలు అమోఘం
దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్లో లేహ్, తేజ్పూర్లో ప్రయోగశాలను, హైదరాబాద్లో డీఆర్డీఎ్ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్ఎస్టీఎల్లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. -
బ్యూటిఫుల్ ఐలాండ్లో సుకుమార్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇదేం మాస్ రా మావా..!
-
సీరియల్ యాక్టర్ సునంద మాల శెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పోలీస్ స్టేషన్ లో గల్లీ లీడర్ బర్త్ డే సెలబ్రేషన్స్..
-
Klin Kaara Photos: గ్రాండ్గా క్లీంకార ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మండి బిర్యానీ తిని తిరిగొస్తూ..
చాంద్రాయణగుట్ట: బైక్పై ట్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ వచ్చి అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక జయప్రకాష్ నగర్కు చెందిన అమర్సింగ్ కుమారుడు ఠాకూర్ రాధాకిషన్(24) ఏసీ మెకానిక్. స్నేహితుడి బర్త్డే వేడుకలకు వెళ్లేందుకు స్నేహితుడైన రోహన్ చౌకట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున బైక్ తీసుకున్నాడు.అనంతరం ఇదే ప్రాంతానికి చెందిన వైజనాథ్ ఇంగ్లే అలియాస్ సోను(30), మక్దూంపురాకు నిఖిల్(18)తో కలిసి బైక్పై త్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ చాంద్రాయణగుట్టలో మండి బిర్యానీ తినేందుకు వెళ్లారు. బిర్యానీ తిన్న తర్వాత తిరిగి వస్తుండగా రాధాకిషన్ బైక్ నడుపుతుండగా, మధ్యలో సోను, వెనుక భాగంలో నిఖిల్ కూర్చున్నారు. తెల్లవారుజామున 3.30 గంటలకు కందికల్ ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి)పై అతివేగంగా బైక్ నడపడంతో డివైడర్కు తాకుతూ, ఆపై స్తంభానికి ఢీకొట్టారు. ఈ ఘటనలో వైజనాథ్ ఇంగ్లే అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన రాధాకిషన్ను ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలతో నిఖిల్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు యువకుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఎవరి పుట్టిన రోజు లేదని, కేవలం బిర్యానీ తినేందుకు వెళ్లామని క్షతగాత్రుడు నిఖిల్ తెలిపాడని పోలీసులు వెల్లడించారు. -
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
గచ్చిబౌలి: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్తో పాటు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్హెచ్ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్పాత్ పై కేక్ కట్ చేయగా , మాదాపూర్ ఎస్హెచ్ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్సెక్టర్ సంజయ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్కుమార్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్గా పనిచేస్తూ నవీన్కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 70వ జన్మదిన వేడుకలను శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు కేటీఆర్ ఉదయమే తెలంగాణ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల జీవిత బీమా కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలు, పది మంది దివ్యాంగులకు వీల్ చైర్లను కేటీఆర్ పంపిణీ చేశారు. కేసీఆర్ 70వ పుట్టినరోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్ను ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్లతో కలసి కేటీఆర్ కట్ చేశారు. తర్వాత కేసీఆర్ రాజకీయ జీవితం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రూ పొందించిన ‘అతనే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అలాగే కేసీఆర్ ఉద్యమ ప్రస్తానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు బీఆర్ఎస్ సభ్యత్వం కలిగి.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కో ల్పోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు 70 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నాయకులు సోమా భరత్కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీలు రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, నేతలు అనిల్ కుమార్ కూర్మాచలం, వాసుదేవ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీశ్రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వేడుకలు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా అసెంబ్లీ లాబీల్లోని పార్టీ శాసనసభాపక్ష కార్యాల యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని సమర్థవంతగా ఎదుర్కొన్నారని హరీశ్రావును పార్టీ ఎమ్మె ల్యేలు అభినందించారు. -
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియో
-
Redin Kingsley-Sangeeta Birthday Photos: పెళ్లయ్యాక నటుడి తొలి బర్త్డే.. భార్య సర్ప్రైజ్ పార్టీ (ఫోటోలు)
-
8ఏళ్ల పిల్లాడు,జీవితంలో మొదటిసారి.. క్లాస్టీచర్ చేసిన పనికి ఎమోషనల్
జీవితంలో ప్రతి ఒక్కరికి తమ బర్త్డేను స్పెషల్గా జరుపుకోవాలని కోరిక ఉంటుంది. పుట్టినరోజు వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది. కానీ ఆ పిల్లాడి లైఫ్లో మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ పుట్టినరోజుని జరుపుకునే అదృష్టం రాలేదు. విషయం తెలిసి, క్లాస్ టీచర్ అందించిన సర్ప్రైజ్కి ఆ బాలుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ క్లాస్ టీచర్ ఏం చేసిందంటే.. కొలంబియాకు చెందిన ఏంజెల్ డేవిడ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు జీవితంలో ఇప్పటివరకు పుట్టినరోజును జరుపుకోలేదు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితుల రీత్యా అతని తల్లి డేవిడ్ బర్త్డే వేడుకలను ఇంత వరకు సెలబ్రేట్ చేయలేకపోయింది. తండ్రి లేకపోవడం, ఏంజెల్ డేవిడ్ సహా నలుగురు పిల్లల బాధ్యత ఆమె ఒంటరిగా చూసుకునేది. దీంతో పేదరికం కారణంగా డేవిడ్కు ఎనిమిదేళ్లు వచ్చినా ఇంతవరకు పుట్టినరోజును నిర్వహించలేకపోయింది. విషయం తెలిసిన డేవిడ్ క్లాస్ టీచర్ అతని బర్త్డేను పెద్ద వేడుకలా చేయాలని నిర్ణయించుకుంది. దీంతో కేక్, డెకరేషన్తో క్లాస్ రూమ్లోనే డేవిడ్కు తెలియకుండా సర్ప్రైజ్గా బర్త్డే వేడుకలను ఏర్పాటు చేసింది. క్లాస్లోకి డేవిడ్ అడుగుపెట్టగానే క్లాస్ టీచర్ సహా అతని క్లాస్మేట్స్ అందరూ హ్యాపీ బర్త్డే అంటూ సాంగ్స్ పాడుతూ అతన్ని క్లాస్రూంలోకి వెల్కమ్ చెప్పారు. ఊహించిన ఈ సర్ప్రైజ్తో డేవిడ్ ఆనందంతో ఏడ్చేశాడు. దీంతో పిల్లలంతా ఒక్కచోట చేరి డేవిడ్ను కౌగిలించుకొని బర్త్డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Hear Her Stories 📣 (@hearherstories) -
Sekhar Master Daughter Sahithi Birthday: శేఖర్ మాస్టర్ కూతురు బర్త్ డే.. ఫోటోలు వైరల్!!
-
'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్గా ల్యాప్ట్యాప్స్
ప్రముఖ సినీ దర్శకుడు పి.వాసు శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను చైన్నెలోని లైకా సంస్థ కార్యాలయంలో జరుపుకున్నారు. ఈయన గత 40 ఏళ్లుకు పైగా దర్శకుడిగా రాణిస్తున్నారు. వివిధ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన చిత్రం చంద్రముఖి –2. (ఇదీ చదవండి: ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ!) రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'చంద్రముఖి 2'.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో వడివేలు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు జన్మదిన వేడుకలను లైకా సంస్థ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో నటుడు రాఘవ లారెన్స్, లైకా సంస్థ ప్రధాన నిర్వాహకుడు జీకే ఎం తమిళ్ కుమరన్ పాల్గొని పి.వాసుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పి.వాసు తన అసిస్టెంట్ డైరెక్టర్స్కి ల్యాప్ట్యాప్లని కానుకగా అందించారు. (ఇదీ చదవండి: రైతుబిడ్డకి వార్నింగ్.. రతిక బిహేవియర్పై నాగ్ సీరియస్!) -
హ్యాపీ బర్త్డే పీచెస్
విశాఖపట్నం: ఇందిరా గాంధీ జూ పార్కులో పీచెస్ అనే ఆడ తెల్ల పులి పుట్టిన రోజు ఘనంగా జరిగింది. తెల్ల పులుల ఎన్క్లోజర్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీఈ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు పులి మాస్క్లు ధరించి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్యూరేటర్ నందనీ సలారియా కేకు కట్ చేసి సందర్శకులకు పంచిపెట్టారు. సీపీఈ కళాశాల యాజమాన్యం ఆ పులిని నెల రోజుల పాటు దత్తత తీసుకుంది. పీచెస్ పుట్టి ఐదేళ్లు పూర్తయిందని, ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించామని క్యూరేటర్ తెలిపారు. నెల రోజుల పాటు పీచెస్కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన సీపీఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చ మత్తులో జోగుతున్న ఈనాడు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టనిదే ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు వ్యక్తుల మధ్య ఆవేశకావేశాలతో జరిగిన ఘర్షణకు గంజాయే కారణమని, అది సర్కారు నిర్వాకమని వక్రీకరించింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్టు అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నంచింది. ‘గంజాయి రాజ్యంలో ముఠాల అరాచకం’ శీర్షికన గురువారం దుష్ప్రచారానికి పూనుకుంది. వాస్తవాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని దమ్మాలవీధికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కేశవ రాంబాబు ఈ నెల 23న రాత్రి 8.30 గంటలకు తన బైక్పై వెళుతూ మార్గం మధ్యలో కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. దిల్లేశ్వరరావు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫి క్కు అంతరాయం కలిగింది. దీనిపై తన బైక్కు దారి ఇవ్వమని రాంబాబు ఆ వేడుకల్లో ఉన్న యువకులను అడిగారు. దాంతో మాధవ్, దేవా, కార్తిక్ అనే యువకులతో రాంబాబుకు వా గ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దాంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇరువర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆ సామాజికవర్గ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ మేరకు రాంబాబు రాజీ లేఖను పోలీసులకు సమర్పంచారు. ఆ లేఖను న్యా యస్థానానికి నివేదించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఈనాడు వక్రీకరించి గంజాయి మత్తు లో ఘర్షణ జరిగిందంటూ దుష్ప్రచారం చేసి, చంద్రబాబుకు అనుకూల వాతావరణం సృష్టించా లని పచ్చపాతాన్ని ప్రదర్శించడం దారుణం. -
Lakshmi Manchu: ఘనంగా మంచు లక్ష్మీ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బర్త్ డే సెలెబ్రేషన్స్ చర్చనీయాంశం
-
అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి..
నల్గొండ: మరో పది రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఐశ్వర్యను అంతలోనే మృత్యువు కబలించింది. పుట్టిన రోజు వేడుక సన్నాహాల్లో భాగంగా షాపింగ్కు వెళ్లిన ఐశ్వర్య దుండగుడి తూటాలకు బలికావడం ఆమె కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఐశ్వర్య ఈ నెల 18న పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల నడుమ జరుపుకోవాలని భావించింది. అమెరికాలోని టెక్సాస్ లోని ఎలెన్ సూపర్ మార్కెట్కు షాపింగ్ కోసం వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చలాకీగా, సరదాగా ఉండే ఐశ్వర్య ఇక లేదని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆమె చదువు పూర్తి కాగానే అక్కడే ఫర్ఫెక్ట్ జనరల్ కాంటాక్టర్స్ కంపెనీలో మేనేజర్గా పని చేస్తోంది. ఇంకో నెల రోజుల్లో అదే కంపెనీకి సీఈవోగా నియమించేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఉద్యోగోన్నతి పొందకుండానే ఆమె కానరాని లోకాలకు వెళ్లిపో యింది. ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40 గంటలకు తల్లిదండ్రులు తాటికొండ నర్సిరెడ్డి–అరుణతో తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా షాపింగ్కు వెళ్తున్న విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. తల్లి దండ్రులతో అవే చివరి మాటలు. కాగా, ఐశ్వర్య భౌతికకాయం బుధవారం రాత్రికి హైదరాబాద్కు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేల పరామర్శ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దుండుగల తూటాలకు బలైన నేరేడుచర్ల మున్సిపాలిటీలోని పాత నేరేడుచర్లకు చెందిన ఐశ్వర్య కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని వారి నివాసంలో మంగళవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పరామర్శించారు. ఐశ్వర్య భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. -
రిషబ్ శెట్టి బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. కూతురి బర్త్డేలో కన్నడతారల సందడి (ఫొటోలు)
-
ఘనంగా సల్మాన్ ఖాన్ బర్త్డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
బడా హీరోలతో రెండు సినిమాలు తీస్తున్నా: ‘తీస్మార్ ఖాన్’ నిర్మాత
వచ్చే ఏడాదిలో రెండు భారీ చిత్రాలు నిర్మించబోతున్నట్లు ‘తీస్మార్ ఖాన్’ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ప్రకటించారు. నేడు(డిసెంబర్ 25) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాల విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా బ్యానర్లో ఇది వరకు వచ్చిన నాలుగు చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. వచ్చే ఏడాది రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తాం. ఆ రెండు చిత్రాల్లోనూ ప్రముఖ హీరోలు నటిస్తున్నారు. . త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాం’అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నాగం తిరుపతి రెడ్డి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది ఆయన నిర్మాణంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. -
ప్రజల్లో ఉండటం, సేవ చేయడంపైనే సీఎం జగన్ దృష్టి : సజ్జల
-
సీఎం బర్త్ డే తన నియోజకవర్గంలో జరగడం సంతోషమన్న మంత్రి
-
ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం అర్థం పర్థం లేని అంశం : సజ్జల
-
పోలీస్ స్టేషన్లో యువతి బర్త్ డే వేడుకలు.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జన్మదినం రోజు ఓ ఫిర్యాదురాలికి సుల్తాన్బజార్ పోలీసులు వినూత్న బహుమతి ఇచ్చారు. వివరాలు.. జియాగూడకు చెందిన జి.భార్గవి పుట్టిన రోజు సందర్భంగా బొగ్గులకుంటలోని రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసింది. టిఫిన్ చేసి బయటకు రావడంతో బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి సిబ్బందిని అలర్ట్ చేసి వెంటనే బైక్ను భార్గవికి అందజేశారు. దీంతో ఆమె పోలీస్స్టేషన్లో కేక్కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకొంది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. (క్లిక్ చేయండి: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం) -
పని మనిషి బర్త్డే.. ఓనరమ్మ సర్ప్రైజ్
ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని మధుర క్షణాలు పదిలంగా ఉండిపోతాయి. వాటి వెనుక చిన్న చిన్న చర్యలు కూడా ఉండొచ్చు!. తమ ఇంటి బండి నడిచేందుకు.. నాలుగు ఇళ్లలో పని చేసుకునే వాళ్లు ఎందరో. అలాంటి వాళ్లను గౌరవంగా చూసే ఓనర్లు ఎందరుంటారు?.. అయితే ఇక్కడ తమకు సాయంగా ఇంటి పనులు చేసే ఆమెను.. ఇంట్లో మనిషిగానే భావించింది ఆ ఓనరమ్మ. అందుకే.. ఆమె జీవితంలో ఏ పుట్టినరోజుకు అందుకోని సర్ప్రైజ్ ఇచ్చింది. వీళ్లకు విలువైన కానుకలు అక్కర్లేదు. ఇలాంటి ప్రత్యేక క్షణాల్లో ప్రేమ, ఆనందం పంచితే సరిపోతుంది. ఈ నగరంలో ఆమె భర్తతో ఒంటరిగా ఉంటోంది. అందుకే ఆమె పుట్టినరోజును ముఖంలో చిరునవ్వులు పూయించాలనుకున్నాం. మా మామగారు ఆమె కోసం కేక్ తెచ్చారు. అంతా కలిసి ఆమెను సర్ప్రైజ్ చేశాం. కొన్నిసార్లు ఎదుటివాళ్లను నవ్వించేందుకు.. మీరు చిన్న చిన్న పనులు మీతో ఎప్పటికీ నిలిచిపోతాయి అంటూ క్యాప్షన్ ఉంచింది సదరు ఓనరామె. అంతే మీ వల్లే మా ఇల్లు శుభ్రంగా, సొగసుగా ఉంటోందని.. హ్యపీయెస్ట్ బర్త్డే మౌషీ అంటూ క్యాష్షన్ ఉంచారామె. అంతేకాదు.. ఎప్పుడూ తన కోసం టీ పెట్టే ఆమె కోసం.. ఈసారి ఆ ఓనర్ ప్రత్యేకంగా టీ చేసి ఇచ్చింది. తన జీవితంలో ఇప్పటిదాకా పుట్టినరోజు జరుపుకోలేదని.. ఈ క్షణాలు తనకు ఎంతో భావోద్వేగాన్ని పంచాయంటూ కంటతడి పెట్టుకుందామె. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
భార్య బర్త్డేకి స్పెషల్ విషెస్...గోల్డెన్ టెంపుల్కి బన్నీ ఫ్యామిలీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’ సోషల్ మీడియా ద్వారా భార్యకు బర్త్డే విషెస్ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్ కట్ చేస్తున్న ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’అని పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. Happy Birthday Cutie 💖 pic.twitter.com/LL5nEaOmjg — Allu Arjun (@alluarjun) September 29, 2022 -
మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్ లో కొడాలి నాని
-
బాయ్ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేషన్!.. అడ్డంగా బుక్కైన స్టార్ హీరోయిన్
Kiara Advani Celebrate Her Birthday With Sidharth Malhotra In Dubai: హిందీ చిత్రపరిశ్రమలో పెళ్లిళ్లు, లవ్ ఎఫైర్లు, చెట్టాపట్టాలు వేసుకోని షికార్లు చేయడం సర్వసాధారణమే. అయితే ఈ విషయాలపై కొందరు సూటిగా సుత్తిలేకుండా వారి రిలేషన్షిప్ గురించి బయటపెడితే, మరికొందరు గుట్టుగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా బీటౌన్ బ్యూటీ కియారా అద్వాణీ తన బాయ్ఫ్రెండ్తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈరోజు (జులై 31) కియారా అద్వానీ పుట్టినరోజు. తన బర్త్డేను బాయ్ఫ్రెండ్తో ఫారిన్లో జరుపుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన 30వ పుట్టినరోజును దుబాయ్లో ప్రియుడు సిద్ధార్థ్తో కలిసి జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలోని పలు పోస్ట్లను చూస్తే అర్థమవుతోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తాజాగా ఫ్యాన్స్తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: చివరిగా మమతా మోహన్ దాస్ను ఎంపిక చేశాం: డైరెక్టర్ అయితే వీరిద్దరూ అభిమానులతో విడివిడిగా ఫొజులివ్వడం మనం చూడొచ్చు. ఈ ఫొటోల్లో సిద్ధార్థ్, కియారా విడిగా ఫోజులిచ్చిన.. వారితో దిగిన ఫ్యాన్స్ వేసుకున్న దుస్తులు ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు. దీంతో కియారా తన బర్త్డేను సిద్ధార్థ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమని తెలుస్తోంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ View this post on Instagram A post shared by SidKiara (@siara_vogue) కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్షా' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇటీవల కరణ్ జోహర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఎపిసోడ్లో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు అనన్య పాండే హింట్ కూడా ఇచ్చింది. కాగా మహేశ్ బాబు 'భరత్ అనే నేను' మూవీతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మెప్పించిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. -
అమెరికాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. డల్లాస్లో టీఆర్ఎస్ పార్టీ నేత అభిషేక్ కొత్తుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు కేక్ కటింగ్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిషేక్ కొత్తూర్ కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేటీఆర్ 2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారని, ఆ విజయాల పరపరం కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్కు అభిషేక్ జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. -
కైకాల జన్మదిన వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
బెడ్పైనే కైకాలతో కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్
సీనియర్ నటుడు కైకాల బర్త్డే నేడు. సోమవారం(జూలై 25న) ఆయన 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన జన్మదిన వేడుకను నిర్వహించారు. ఇందుకోసం స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్పైనే ఆయనతో కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ‘ఒక్క సినిమా కంటే ఎక్కువ చేస్తాననుకోలేదు.. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని’ ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. కాగా కైకాల ప్రస్తుతం వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెడ్పైనే చికిత్స పొందుతున్నారు. ఆయన కనీసం నిలబడి లేని, కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆయన బెడ్పైనే చికిత్స పొందుతున్నారు. పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i — Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022 -
సింగపూర్లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు
సింగపూర్లో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సింగపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు స్థానిక మారియమ్మన్ ఆలయం నందు అమ్మవారికి విశేష అభిషేకము, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా గతరెండేళ్లుగా వాసవి మాత జయంతి వేడుకుల్ని జూమ్లో నిర్వహించినట్లు తెలిపారు. కరోనా తగ్గడంతో భక్తుల మధ్య ప్రత్యక్షంగా అమ్మవారిని పూజించడం సంతోషంగా ఉందన్నారు. వాసవి క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. తాము గత పదేళ్లుగా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలతో పాటు మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మారియమ్మన్ ఆలయ జీర్ణోద్ధరణలో భక్తులు విరివిగా పాల్గొనాలని, ధర్మాన్ని విడనాడకుండా మరెన్నో సేవాకార్యక్రమాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
దత్త పీఠాధిపతి పుట్టిన రోజు వేడుకలకు సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ పుట్టిన రోజు వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎంను కలిసిన వారిలో దత్తపీఠం ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ హెచ్వీ ప్రసాద్, ట్రస్టీ రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులున్నారు. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? -
విద్యార్థుల బాహాబాహీ
సత్తుపల్లి: విద్యార్థులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని భయానక వాతావరణం సృష్టించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య శనివారం సాయంత్రం ఈ ఘర్షణ జరిగింది. కళాశాలకు చెందిన ఓ జూనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో అతడిపై కేక్ పూయడంతో మొదలైన వివాదం... మరో జూనియర్ విద్యార్థి సీనియర్ను సిగరెట్ అడగటంతో ముదిరింది. జూనియర్లు, సీనియర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపటి తర్వాత అందరూ తిరిగి కళాశాలకు వెళ్లిపోయారు. సాయంత్రం మళ్లీ మరో జూనియర్ విద్యార్థి తన స్నేహితులను వెంటబెట్టుకొచ్చి కర్రలతో దాడి చేయటంతో గొడవ తీవ్రమయ్యింది. కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు జాతీయ రహదారిపైనే కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం. -
టీమ్ మెంబర్కు అల్లు అర్జున్ సర్ప్రైజ్
స్టార్ హీరోల్లో కొంత మంది మాత్రమే సింపుల్గా ఉంటారు. హీరోని అనే ఫీలింగ్ లేకుండా సాదాసీదా ఉంటూ అందరితో కలిసిపోతుంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ ఒకరు. తన చుట్టూ ఉండే వ్యక్తులతో ఎప్పుడూ స్టార్ హీరోలాగా ప్రవర్తించరు. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులను సొంత మనుషుల్లా చూసుకుంటారు. తాజాగా ఈ ఐకాన్ హీరో.. తన కంటెంట్, డిజిటల్ హెడ్ అయిన శరత్ చంద్ర నాయుడు పుట్టిన రోజు వేడుకని ఘనంగా జరిపారు. డిజిటల్ హెడ్ పుట్టిన రోజు కావడంతో సడన్గా కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ చేశాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఆ కేక్ మీద హైలెట్ చేశారు. దీన్ని బట్టి తన టీమ్ ను ఆయన ఎంత స్పెషల్ గా చూసుకుంటారో అర్థమవుతుంది. తన స్టాఫ్ బర్త్డే వేడుకలను సెలబ్రేట్ చేయడం బన్నీకి ఇది మొదటిసారి మాత్రమే కాదు. చాలా సార్లు చాలా మంది బర్త్డేలను సెలబ్రేట్ చేశారు. స్పెషల్ అకేషన్స్ అన్ని అలానే చేస్తుంటాడు. పెళ్లిళ్లకు కూడా హాజరవుతుంటారు. అందుకే ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయిస్.. ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం అంటుంటారు. ఇక బన్నీ సినిమాల విషయానికిస్తే..‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్’ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత సంజయ్లీలా భన్సాలీతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలోనూ బన్నీ నటించబోతున్నట్లు టీటౌన్లో టాక్ వినిపిస్తోంది. Thank you so much @alluarjun sir for your wishes and for attending my party. You made me the happiest on my birthday. I am forever grateful for all the love and good wishes that I have been receiving from you. pic.twitter.com/CyCBepxDhm — Sarath Chandra Naidu (@imsarathchandra) March 17, 2022 -
కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం: పొంగులేటి
కల్లూరు రూరల్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తన స్వగ్రామమైన నారాయణపురంలో గురువారం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనగా, పొంగులేటి కేక్ కట్చేసి అనంతరం మాట్లాడారు. గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. -
కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు.. రంగనాయక సాగర్ జలాశయం ఉండేది కాదు.. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు సైతం వచ్చేవి కావు..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా రంగనాయక సాగర్ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను ఆయన విడుదల చేశారు. అనంతరం రంగనాయక సాగర్ కట్టపై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని హరీశ్ ఆకాంక్షించారు. గుక్కెడు నీళ్ల కోసం తపించిన రాష్ట్రాన్ని సమృద్ధిగా సాగు జలాలతో ఆకుపచ్చ తెలంగాణ, సస్యశ్యామల తెలంగాణ అయ్యేలా చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని కొనియాడారు. ఏడేళ్లలో తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారన్నారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతో రాష్ట్ర జీఎస్డీపీని రెట్టింపు చేశారని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్గా నిలిపారన్నారు. అనంతరం మంత్రి సిద్దిపేట పట్టణంలోని క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ జన్మ రాశి సూచిక ప్రకారం మోదుగ మొక్కను నాటారు. కార్యక్రమంలో ఈఎన్సీ హరే రామ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మలు పాల్గొన్నారు. -
అంతకు మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు: మహేశ్ భార్య నమ్రత
Namrata Shirodkar's 50th Birthday Celebration Photo: సూపర్ స్టార్ మహేశ్బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె.. మహేశ్తో వివాహం అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పి కుటుంబ బాధ్యలతను నిర్వర్తిస్తోంది. మహేశ్ సినిమా షూటింగ్స్తో బిజీగా ఉంటే.. అతని వ్యాపారాలతో పాటు పిల్లల బాధ్యతలను ఆమే చూసుకుంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్గా ఉంటుంది నమ్రత. తమ వ్యక్తిగత విషయాలతో పాటు మహేశ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పకప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల(జనవరి 22) నమ్రత పుట్టిన రోజు జరిగింది. తన బర్త్డేని కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది నమ్మత. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు’అంటూ నమ్రత కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మహేశ్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్తో ఓ సినిమా చేయనున్నాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
కువైట్లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కువైట్లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కువైట్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ అవినాష్ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. జననేత వైఎస్ జగన్ పేరుతో ప్రత్యేకంగా కేక్ను తయారు చేయించారు. ఏపీలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల జిలన్ బాషా, మాజ్, సురేష్, శ్యామల, సుబహన్ డేగ ఫిలిం, రైజ్ వన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
'హ్యాపియస్ట్ బర్త్డే మై లవ్': రోహిత్ శర్మ
టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రీహాబిటేషన్ పేరుతో ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు. కాగా డిసెంబర్ 21న రోహిత్ శర్మ భార్య రితిక సజ్దేహ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రోహిత్శర్మ తన ప్రియమైన భార్యకు ఇన్స్టాగ్రామ్కు సందేశాన్ని అందించాడు. ''ఇది హ్యాపియస్ట్ బర్త్డే మై లవ్. ఇప్పటివరకు ఎలా ఉన్నావు.. ఇప్పుడు అలాగే ఉండు. నీలో నన్ను బాగా ఆకట్టుకునేది అదే'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. చదవండి: IND vs SA: ఎవరికి అవకాశం ఇద్దాం!.. తల పట్టుకుంటున్న కోహ్లి, ద్రవిడ్ ఇక గాయపడ్డ రోహిత్ స్థానంలో ప్రియాంక్ పాంచల్ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా టెస్టు సిరీస్కు దూరంగా ఉండనున్న రోహిత్.. వన్డే సిరీస్కు మాత్రం అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరపున రోహిత్ శర్మ 43 టెస్టుల్లో 3047 పరుగులు, 227 వన్డేల్లో 9205 పరుగులు, 119 టి20ల్లో 3197 పరుగులు సాధించాడు. -
పంజాగుట్టలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
-
కేపీహెచ్బీలో దారుణం: ప్రాణం తీసిన ఆకలి
సాక్షి, కేపీహెచ్బీకాలనీ (హైదరాబాద్): ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి జరగడంతో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ కిషన్ కుమార్ వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (32), భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్లో ఉంటూ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లర్లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ పుట్టిన రోజు వేడుకలు సిబ్బందితో కలిసి చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వమంటూ రాజేశ్ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. దొంగగా పొరబడి వాళ్లంతా అతన్ని చితకబాది వెళ్లిపోయారు. రాత్రంతా అక్కడే స్పృహ లేకుండా పడిఉన్న రాజేష్ను.. గురువారం ఉదయం హోటల్ సిబ్బంది గుర్తించారు. ఒరిస్సాలోని రాజేష్ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలుపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్ మృతి చెందాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలిసింది. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
మధురస్వరాల మహారాణి
-
గురు శిష్యుల బంధం
-
కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా?
ముంబై: ఎవరి పుట్టినరోజు వేడుక వారికే ప్రత్యేకం. ఎవరికి వారు ఇతరులకు భిన్నంగా తమ పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని భావిస్తారు. అయితే కొందరు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో వైరలయి.. అందరిని ఆకట్టుకుంటాయి. ఈ కోవకు చెందిన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజు నాడు మహా అయితే 1,2 కేకులు కట్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు చూడబోయే వ్యక్తి మాత్రం ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన సౌర్య రాటూరి అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. అవి కూడా వేర్వేరు సైజుల్లో.. షేపులు, ఫ్లేవర్స్ ఉన్న కేక్లు కట్ చేశాడు. ఈ కేకులన్నింటిని.. ఓ పెద్ద టేబుల్ మీద పెట్టి.. వరుసగా వాటన్నింటిని కట్ చేసుకుంటూ వెళ్లాడు. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు సౌర్య చుట్టూ చేరి అతడిని ఎంకరేజ్ చేయసాగారు. (చదవండి: బైక్ను వెంబడించిన చిరుత; కేక్తో ప్రాణాలు కాపాడుకున్నారు) ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు కొందరు ప్రశంసిస్తుండగా.. చాలా మంది మాత్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఇంత అట్టహాసం అవసరమా.. పుట్టిన రోజు అంటే ఏదైనా పనికి వచ్చే పని చేయాలి కానీ.. ఇలాంటి పనులు ఎందుకు అని విమర్శిస్తున్నారు. చదవండి: ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..! -
మ్యాజిక్ రిపీట్ చేస్తాడా !
-
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
-
ఏ సినిమాతో చిరు ‘మెగాస్టార్’గా ఎదిగారో తెలుసా?
-
వేడుకల్లో తల్వార్లు,పిస్టల్స్ తో హంగామా
-
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొ న్నారు. టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీని వాస్ యాదవ్ పాల్గొని 44 కేజీల కేక్ కట్చేశారు. ‘లీడర్’టైటిల్తో కేటీఆర్పై రూపొందించిన సీడీని హోంమంత్రి మహమూద్ అలీ, ప్రత్యేక గీతాన్ని మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ఆవి ష్కరించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దివ్యాం గుడికి త్రిచక్ర స్కూటీ అందజేశారు. అసెంబ్లీ ఆవరణలో ‘ముక్కోటి వృక్షార్చన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చ నలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీని వాస్రెడ్డి, మండలి ప్రొటెమ్ చైర్మన్ వి.భూపా ల్రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. మాసాబ్ట్యాంక్లోని మహావీర్ హాస్పిటల్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో మండలి ప్రొటెమ్ చైర్మన్ కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ►కేటీఆర్ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేత లు మొక్కలు నాటడంతో పాటు పలు సామా జిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మన్, యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్ ట్విటర్ ద్వారా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. మొక్క నాటిన వనజీవి ఖమ్మం రూరల్: కేటీఆర్ జన్మదినం సంద ర్భంగా శనివారం పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మం మండలం రెడ్డిపల్లి గ్రామంలోని తన నివాసంలో మొక్కను నాటారు. -
పండగపూట విషాదం; కుమారుడి పుట్టినరోజు కేక్ కోసమని వెళ్లి
ఓ వైపు బక్రీద్ పర్వదినం.. మరో వైపు కుమారుడి పుట్టినరోజు వేడుక.. రెండు విశేషాలు ఒకే రోజు రావడంతో ఆ ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. తొలుత పర్విదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. సమీప బంధువుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. తదనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుక నిర్వహణకు కేక్ తెచ్చేందుకు సమీప బంధువుతో కలిసి వెళ్లిన తండ్రిని సిమెంట్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో పండుగ పూట ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. జుపెన్పహాడ్ : మండల కేంద్రానికి చెందిన షేక్ జమాల్(33)కు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం బక్రీద్ పర్వదినంతో పాటు కుమారుడి పుట్టినరోజు కూడా కలిసి రావడంతో సంతోషించాడు. వేడుకకు సమీపం బంధువులను కూడా ఆహ్వానించాడు. ఉదయం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ తెచ్చేందుకు వెళ్తుండగా.. మధ్యాహ్నం వరకు జమాల్ సంతోషంగా ఇంట్లోనే గడిపాడు. అనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు, అందుకు అవసరమైన కేక్ తదితర సామగ్రి తీసుకువచ్చేందుకు బంధువు లతీఫ్తో కలిసి బైక్పై సూర్యాపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెం గ్రామ శివారుకు చేరుకోగానే సూర్యాపేట నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో షేక్ జమాల్ అక్కడికక్కడే మృతిచెందగా షేక్ లతీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు పో లీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి యాకూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపారు. ఇనుప బోర్డును ఢీకొట్టి ఒకరు.. కోదాడ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దోరకుంట సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన షేక్ బషీర్ (35) బైక్పై కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చాడు. బక్రీదు పండుగ సందర్భంగా చికెన్ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో గ్రామశివారులోని పెట్రోలు బంకు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప బోర్డును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బషీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంషాద్ భేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వై.సైదులు తెలిపారు. -
బే ఏరియాలో వైఎస్సార్ జయంతి వేడుకలు
-
గంభీర్కు ధోనీ అంటే అసూయ.. అందుకే బర్త్డే రోజు అలా చేశాడు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్పై భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీ అంటే గంభీర్కు అసూయ అని, అతనికున్న క్రేజ్ను చూసి గంభీర్ ఓర్చుకోలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఇంతకీ ధోనీ అభిమానులు ఇంతాలా రెచ్చిపోవడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. నిన్న ధోనీ 40వ పుట్టిన రోజు(జులై 7, 2021) సందర్భంగా యావత్ క్రీడా ప్రపంచం అతనికి శుభాకాంక్షలు తెలిపింది. దిగ్గజ క్రికెటర్లు, బీసీసీఐ, ఐసీసీ, పలు ఇపీఎల్ ఫ్రాంఛైజీలు ధోనీకి విషెస్ చెప్పారు. Fans to u hi badnaam h asli aag to gambhir ne laga rakhi h😭 Changed his cover pic 43 minutes ago😭 pic.twitter.com/6rue80bavH — Sumit pandey 🚩 (@_kohlitastic_) July 7, 2021 అయితే, ఈ సందర్భంగా ధోనీ అభిమానులు ఒక విషయాన్ని నోటీస్ చేశారు. ధోనీ సహచరుడు మాజీ క్రికెటర్ గంభీర్.. తన ఫేస్బుక్ కవర్ పిక్చర్ను మార్చడాన్ని గుర్తించారు. ఓ పక్క యావత్ క్రీడా ప్రపంచం ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతుంటే, గంభీర్ మాత్రం 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ నాటి తన ఫోటోను ఫేస్బుక్ కవర్ పిక్గా అప్డేట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ధోనీ అవమానించడానికి గంభీర ప్రణాళికా బద్ధంగా ఇలా చేశాడని, ఇదేదో యాదృచ్చికంగా జరిగినది కాదని మండిపడుతున్నారు. గంభీర్కు మొదటి నుంచి ధోనీ అంటే అసూయ అని, 2011 వరల్డ్కప్ ఫైనల్లో 97 పరుగులు చేసినప్పటికీ తనకు దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదని కుమిలిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. Gambhir in his living room whenever Dhoni gets plaudits. pic.twitter.com/12q1HHyLmB — Maganlal (@Maganlal1303) July 7, 2021 శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ.. విన్నింగ్ షాట్ను సిక్సర్గా మలిచి భారతీయుల దృష్టిలో హీరో అయిపోవడాన్ని గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. ధోనీపై అక్కసుతోనే గంభీర్ ఇలా చేశాడని, ధోనీ సాధించిన అపురూప విజయాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవడం చూసి ఓర్వలేకే, ఇలా తన ద్వేశాన్ని వ్యక్తపరిచాడని ఆరోపించారు. మరోవైపు గంభీర్ అభిమానులు కూడా ధోనీ ఫ్యాన్స్పై ఎదురుదాడికి దిగుతున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్ సాధించిన పరుగుల వల్లే టీమిండియా రెండోసారి జగజ్జేతగా నిలిచిందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా, టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్లు కావడంలో ధోనీ సహా యువరాజ్, గంభీర్ కీలకపాత్ర పోశించిన విషయం తెలిసిందే. Shameful feeling only. I hoped that gambhir cover picture change is fake but went and checked FB. It is true — Karthik Raj (@kartcric) July 7, 2021 -
పీవీ స్వగ్రామం వంగరలో పీవీ జ్ఞాపకాలు పదిలం
-
పీవీ రాసిన డైరీలో... ఏముందో ?
సాక్షి, వెబ్డెస్క్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని పీవీ మార్గ్లోని పీవీ జ్ఞానభూమి వద్ద జూన్ 28న ప్రధాన కార్యక్రమం జరగనుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంతకంటే ముందు నెక్లెస్రోడ్లో పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వందేళ్లు 1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లిలో అమ్మమ్మ ఇంట పీవీ జన్మించారు. ఆ తర్వాత ఆయన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పెరిగారు. రాజకీయాల్లో ప్రవేశించిన పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఇండియా ప్రధానిగా విశేష సేవలు అందించారు. ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత గ్రామం వంగరతో పీవీకి ఎనలేని అనుబంధం ఉంది. ఇప్పటికీ పీవీ జ్ఙాపకాలు అనేకం అక్కడ పదిలంగా ఉన్నాయి. వాటిలో కొన్ని మీ కోసం సాక్షి ప్రత్యేకంగా అందిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : వినూత్న ప్రయత్నం: స్టాంపులపై సాహితీ ముద్ర -
కాజల్ సినీ ప్రయాణంపై స్పెషల్ వీడియో
-
ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించారు. బాలయ్య వీరాభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని మంచి సేవాతత్పరతతో నిర్వహించి శెభాష్ అనిపించుకుంది. బాలకృష్ణ జన్మదిన వేడుకలతో పాటు ఉచిత వ్యాక్సిన్ పంపకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, నార్నే శ్రీనివాసరావు పాల్గొన్నారు. వీరితో పాటు బాలకృష్ణ తర్వాతి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీస్ అధినేత యలమంచిలి రవి శంకర్, 14 రీల్స్ ప్లస్ అధినేత రామ్ ఆచంట హాజరయ్యారు. -
బర్త్డే కేక్ కట్ చేశాడు.. అందరూ కటకటాల పాలయ్యారు
చెన్నై: పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసినందుకు ఆరుగురు యువకులు కటకటాల పాలయ్యారు. ఈ వింత ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గత ఆదివారం రోజు సునిల్ అనే యువకుడి తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. చెన్నైలోని కన్నాగి నగర్ హౌజింగ్ బోర్డు క్వార్టర్స్లో ఈ సంబరాలు జరిగాయి. ఆ రోజు మిత్రులు కేక్ ఆర్డర్ చేసి తెప్పించారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ యువకుడు కేక్ను కట్ చేయడానికి సాధారణంగా పుట్టిన రోజు నాడు కట్చేసే చాక్, కత్తి లాంటిది కాకుండా ఓ పొడవాటి కత్తితో కేక్ను కట్ చేశాడు. అందులోను ఆ కత్తి చూడటానికి ప్రమాదకరమైన ఆయుధంలా ఉంది. వారు ఈ సంబరాలను వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువకులపై కేసు నమోదు అయ్యింది. అయితే ఓ ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు బుక్ చేశామని పోలీసులు తెలిపారు. ప్రమాదకరమైన ఆయుధం కలిగి ఉన్న కోణంలో యువకులపై కేసు ఫైల్ చేశామన్నారు. వాళ్లు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పెద్దగా మ్యూజిక్ వింటూ చుట్టు పక్కల ప్రజలకు న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలిపారు. చదవండి: కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ, కొడుకుకు తెలిసి.. -
‘నాన్న ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే తీశారు’ - డి. సురేష్బాబు
మస్కట్: డా॥ డి. రామానాయుడు 86వ జయంతి సందర్భంగా వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిమ్ న్యూస్, తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాల వేదికగా మస్కట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు ఐదు ఖండాలలోని ఇతర ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పించారు. నిర్మాత అనే పదానికి అసలు సిసలైన చిరునామా డా॥ డి. రామానాయుడు అని వక్తలు కొనియాడారు. ఆయన కుమారుడు, సినీ నిర్మాత డి. సురేష్బాబు మాట్లాడుతూ.. ‘నాన్న చాలా సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడూ విలువలతో కూడిన చిత్రాలే నిర్మించారు. పరిశ్రమకు ఏదైనా అవసరమైతే నాన్న ఎలాగైతే స్పందించారో అదే స్ఫూర్తితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాన’ని అన్నారు. నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ..‘సినిమా అనేది అద్భుతమైన మాధ్యమం. సినిమా నిర్మాత అవ్వాలంటే అన్ని విభాగాల మీద పూర్తి అవగాహన ఉండాలని చెప్పిన వ్యక్తి రామానాయుడుగారు’ అని కొనియాడారు. డా॥ వంశీ రామరాజు మాట్లాడుతూ..‘ప్రేమించు’ చిత్రం జయప్రదమైన సందర్భంలో దివ్యాంగుల ఆశ్రమాలకు చేయూతనిచ్చిన మానవతామూర్తి రామానాయుడుగారు’ అన్నారు. తెలుగు కళాసమితి ఓమాన్ కన్వీనర్ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ‘ఓడిపోతామనే ఆలోచనలో ఉన్నవారు రామానాయుడు జీవితాన్ని తెరచి చూస్తే ఆయనను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో పయనిస్తార’ని అన్నారు. కార్యక్రమాన్ని ప్రముఖ అంతర్జాతీయ గాయని శివశంకరి గీతాంజలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, మండలి బుద్ధప్రసాద్, దర్శకుడు బి. గోపాల్, మాధవపెద్ది సురేష్, బలభద్రపాత్రుని రమణి, భువనచంద్ర, చంద్రబోస్, కాశీ విశ్వనాథ్, వి.ఎన్. ఆదిత్య, రామకృష్ణ గౌడ్, రవి కొండబోలు, ముప్పలనేని శివ, ఉపేంద్ర చివుకుల, డా॥ ఎల్లాప్రగడ రామకృష్ణారావు, రత్నకుమార్ కవుటూరు, చింతగుంట ఉదయపద్మ, డా॥ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, లలితా రామ్, హరివేణుగోపాల్, రాజేష్ తోలేటి, సరోజా కొమరవోలు, శ్రీదేవి జాగర్లమూడి, సుబ్బు వి. పాలపర్తి, చింతలపూడి త్రినాథరావు, లయన్ ఎ. విజయకుమార్, చైతన్య సూరపనేని, దైవజ్ఞ శర్మ, శ్రీవాణి, రేలంగి నరసింహారావు పాల్గొని ప్రసంగించారు. చదవండి: న్యూజెర్సీలో ఎస్పీ బాలుకు స్వర నీరాజనం! -
నీ పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది: మ్యాక్స్వెల్
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ను ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వినూత్న రీతిలో కామెంట్ చేశాడు. ఏబీ తన నాన్న బర్త్డే సందర్భంగా పాడిన పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని ట్రోల్ చేశాడు. విషయంలోకి వెళితే.. మే 29న డివిలియర్స్ నాన్న 70వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన నాన్నకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని భావించిన ఏబీ తన భార్యతో కలిసి ఫెవరెట్ సాంగ్ను పాడాడు. పాప్ సింగర్ జాసన్ రాజ్ పాపులర్ సాంగ్ ' ఐ వోంట్ గివ్ అప్'ను నాన్నాకు అంకితం చేశాడు. ఈ సందర్భంగా ఏబీ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేస్తూ ఒక పోస్టును షేర్ చేశాడు. ''మా నాన్న 70వ బర్త్డే వేడుకలను చాలా ఆనందంగా జరుపుకున్నాం. నా ఆల్టైమ్ ఫెవరెట్ సాంగ్ ఐ వోంట్ గివ్ అప్ను నా భార్యతో కలిసి పాడాను. ఈ పాటలో ఎంత అర్థం ఉంటుందంటే.. ఏం ప్రమాదం జరిగినా మనకు దేవుడు అండగా ఉంటాడని నమ్మకం. ఇన్నేళ్లలో నాకు రోల్ మోడల్గా నిలిచిన మా నాన్నకు ఈ పాటను అంకితం చేయడం సంతోషంగా ఉన్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఏబీ పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమై స్పందన లభించింది. అయితే ఇదే పాటను ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 14వ సీజన్లో ఆడుతున్నప్పుడు మే1వ తేదీన పాడాడు. డివిలియర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీలోనే మ్యాక్స్వెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా డివిలియర్స్ పాడిన పాటను మ్యాక్స్వెల్ ట్రోల్ చేశాడు. ''ఏబీ.. నీ పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.. గతంలో పాడిన దానికంటే అద్భుతంగా ఉంది'' అంటూ కామెంట్ చేశాడు. ఇక డివిలియర్స్, మ్యాక్స్వెల్ తొలిసారి ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీ తరపున కలిసి ఆడారు. ఈ సీజన్లో ఈ ఇద్దరు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆర్సీబీ గెలిచిన మ్యాచ్ల్లో వీరి పాత్ర కీలకం అని చెప్పొచ్చు. 7 మ్యాచ్లాడిన మ్యాక్స్వెల్ 223 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్ 7 మ్యాచ్ల్లో 207 పరుగులు చేశాడు. కరోనా మహమ్మారి సెగతో బీసీసీఐ ఐపీఎల్ 14వ సీజన్ను మధ్యలోనే రద్దు చేసింది. కాగా టీ20 ప్రపంచకప్లో ఆడేందుకు దక్షిణాఫ్రికా తరపున ఏబీ డివిలియర్స్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఏబీ క్లారిటీ ఇస్తూ.. టీ20 ప్రపంచకప్ ఆడేది లేదని.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు. చదవండి: Veda Krishnamurthy: వాళ్లతోనే నా సర్వస్వం కోల్పోయా.. బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్ చేసిన రషీద్ View this post on Instagram A post shared by AB de Villiers (@abdevilliers17) -
సాయి పల్లవి పేరులో ‘సాయి’ ఎలా చేరిందో తెలుసా?
తన డాన్స్తో, నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం చిత్రం ‘ప్రేమమ్’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. ఈ రోజు(మే 9) ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు. నేటితో ఈ భామ 29వ పడిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి.. సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోటగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఎనిమిదో తరగతిలో ఉండగా ఈమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్మేట్గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో నటించింది. ఇలా వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. తండ్రి సలహా మేరకు జార్జియాకి వెళ్లి వైద్యవిద్యను అభ్యసించింది. సూపర్ హిట్తో టాలీవుడ్ ఎంట్రీ తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన 'ప్రేమమ్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో ‘ఫిదా’ సినిమా చేసింది. ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగులో సాయిపల్లవికి అవకాశాలు క్యూకట్టాయి. నానితో ఎంసీఏ చిత్రంలో నటించింది. అందులో కూడా సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా తెలుగులో దూసుకెళ్తూనే.. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన‘మారి-2’తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు కోలీవుడ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. మారి-2, దియా అనే తమిళ హార్రర్ మూవీతో పాటు సూర్యతో కలిసి నటించిన 'ఎన్జికే' చిత్రం కూడా భారీ ఫ్లాప్ని మూటగట్టుకున్నాయి. టాలీవుడ్లో మాత్రంలో ఒక్క ‘పడి పడి లేచే మనసు’ తప్ప అన్ని సినిమాలు సూపర్ హిట్టే. ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తుంది. రానా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రికార్డులన్నీ సాయిపల్లవికే సొంతం సాయిపల్లవి, ధనుష్ జంటగా నటించిన ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ యూట్యూబ్లో 1.14 బిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి రికార్డు సృష్టించింది. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించి సాంగ్గా ‘రౌడీ బేబీ’ రికార్డుకెక్కింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే' సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా లవ్స్టోరీ 'సారంగదరియా' సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్లో ఒక హీరోయిన్ పాటకు ఇంతటి ఆదరణ రావడం ఒక్క సాయి పల్లవికే సొంతం. -
హరిత స్ఫూర్తిని చాటుతూ..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా హరిత స్ఫూర్తిని చాటుతూ రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’లో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వ్యవధిలో కోటి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు తన వ్యవసాయ క్షేత్రంలో రుద్రాక్ష మొక్క నాటారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుటుంబసభ్యులతో కలసి ప్రగతిభవన్ ప్రాంగణంలో, ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో భర్త అనిల్తో కలసి మొక్కలు నాటారు. మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒకే గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాల్సి రావడంతో గ్రామ వన నర్సరీలు, ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు సేకరించేందుకు స్థానిక నేతలు భారీ కసరత్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన వారు కూడా ‘కోటి వృక్షార్చన’లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, తన పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలు తీసుకున్న రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్ను సీఎం అభినందించారు. సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు.. సీఎం 67వ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో కేటీఆర్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమతో పాటు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కె.దామోదర్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు తదితరులు మొక్కలు నాటారు. సీఎం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 22 శాతంగా ఉన్న గ్రీన్కవర్ 33 శాతానికి పెరుగుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో ‘హోప్ 4 స్పందన’ఆధ్వర్యంలో పోలియో బాధితులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అన్ని పారిశ్రామికవాడల్లో మొత్తం 1.62 లక్షల మొక్కలు నాటారు. బండ మాదారం సీడ్స్ ఆగ్రోపార్క్లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి మొక్కలు నాటారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జల విహార్లో జరిగిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పాల్గొన్నారు. కేసీఆర్ జీవన ప్రస్థానంపై రూపొందించిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. బల్కంపేట ఎల్లమ్మకు తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 కిలోల బంగారంతో తయారు చేసిన పట్టు చీర సమర్పించారు. సింగరేణి వృక్షోత్సవం పేరిట సింగరేణి భవన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రారంభించారు. సంస్థ పరిధిలోని 11 ప్రాంతాల్లో 2.35 లక్షల మొక్కలు నాటారు. కోటి వృక్షార్చనలో భాగంగా మలక్పేట వికలాంగుల సంక్షేమ భవన్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మొక్కలు నాటారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
మెల్బోర్న్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ నేత చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఎన్నారైలనుద్దేశించి పార్టీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్ వెంకట్ మేడపాటి తదితరులు జూమ్ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా విభాగం తీర్మానం చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా నాయకులు పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షల వెల్లువ) -
సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం జగన్ జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు. విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న సీఎం.. ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన విషయం తెలిసిందే. గుడివాడ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ బర్త్డే సందర్భంగా భారీ రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో రక్త అభిమానులు, కార్యకర్తలు వితరణ చేస్తున్నారు. శ్రీకాకుళం పలాసలో సీఎం జగన్ జన్మదినం సందర్భంగా మత్స్యశాఖ మంత్రి డా. సిదిరి అప్పలరాజు రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి: ఏలూరు రూరల్ వైఎస్సార్ కాలనీలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతపురం: సీఎం జగన్ జన్మదినం సందర్బంగా పెనుకొండ వైఎస్సార్ సర్కిల్లో మంత్రి శంకర్ నారాయణ కేక్ కట్ చేసిన అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు చందనా నాగేశ్వర్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొని రక్త దానం చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్సార్ కడప నగరంలోని అపూర్వ కళ్యాణమాండపంలో సీఎం జగన్ బర్త్డే సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా భారీ కేక్ కట్ చేసశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పెనుగొండ, ఆచంట మండలాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు పాల్గొన్నారు. పెనుగొండ గాంధీ బొమ్మల సెంటర్ లో కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానం కేక్ కట్ చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో మెగా రక్త దానం శిబిరాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు కావలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యకమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదినం సందర్భంగా శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బోనిగల వేణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ వడ్రాణం ప్రసాదరావు, మహిళా మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ద్రాక్షరామ భీమేశ్వర ఆలయంలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రపురంలో రక్తదాన శిబిరం చేపట్టారు. తిరుపతిలోని ఎస్వీయూ యూనివర్సిటీలో వైఎస్సార్సీపీ విద్యార్థి నేతలు సీఎం జగన్ పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి, భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. చిత్తూరు: జననేత సీఎం జగన్ జన్మదినోత్సవ వేడుక సందర్భంగా తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు మోహిత్ రెడ్డి రక్తదానం చేశారు. పలువురు కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు కల్లూరు మండలంలోని రావూరి గార్డెన్స్లో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అక్కిమి హనుమంతురెడ్డి, లక్ష్మీ కాంతరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. బర్త్ డే కేకును కట్ చేసి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు మాజేటి గురవయ్య హై స్కూల్లో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ జమ్మలమడుగులో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రంలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీరాల నియోజకవర్గ వైసిపి పార్టీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైస్కూల్లో ఆమంచి కృష్ణమోహన్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వైఎస్సార్: మైదుకూరులో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కేక్ కట్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వీట్లు పంచి పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా విజయవాడలోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ పాల్గొని, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. సీఎం జగన్కి జన్మదిన శుభాకాంక్షలు తలిపారు. అంబేద్కర్, పూలే, మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ప్రారంభించారు. రాజంపల్లి నుండి దర్శి గడియారం స్తంభం సెంటర్ వరకు అభిమానలు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలంలో సీఎం వైఎస్ జగన్ పుట్టిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఒక చోట రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ► భీమవరంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పంచారామ క్షేత్రంలో సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. రెడ్ క్రాస్ భవనంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లెప్రసి వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ► గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ► బుట్టాయిగూడెంలో ఎమ్మెల్యే తెల్లంబాలరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి, నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేపట్టారు. విశాఖపట్నం: జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున వేడకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ కన్వీనర్లు అక్రమాని విజయనిర్మల, మల్ల విజయప్రసాద్, కేకే రాజు, వైఎస్సార్సీపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, అభిమనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏపీకి ఓ పెద్ద శక్తి అని, ఆ శక్తి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారిందని కొనియాడారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని దార్శనికునిగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యం ఆకాంక్షతోనే సచివాలయ వ్యవస్థ రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. రాబోయే 25 సంవత్సరాలు సీఎంగా జగన్మోహన్రెడ్డి పాలన వుంటుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఓ వ్యక్తి ప్రభుత్వ పథకం లబ్ధి పొందేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా విశాఖ నగరం ఏపీలో రికార్డు సృష్టించనుందన్నారు. వైఎస్సార్ క్రికెట్ కప్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ► ఆంధ్రా యూనివర్సిటీలో సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని వైఎస్సార్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాంతారావు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థి సంఘాల నాయకులు క్రాంతి కిరణ్, మోహన్ బాబు, జోగరావు, ధీరజ్ పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులుకు బియ్యం పంపిణీ చేశారు. తాడేపల్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడకల్లో భాగంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ► సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం కార్యక్రమాలను వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు చేపట్టారు. కరోనా నేపథ్యంలో రక్తం యూనిట్ల కొరతను తీర్చేందుకు పెద్దఎత్తున అభిమానుల రక్తదానం చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగుళూరుల్లోనూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రక్తదానం చేస్తున్న సంఖ్యను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే సారి 10500 యూనిట్స్ రక్తదానం రికార్డ్గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నమోదుతో ఆ రికార్డ్ అధిగమించే అవకాశం కనిపిస్తోంది. రక్తదానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జననేత ప్రజా రంజక పాలన వల్ల ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని, కలకాలం ఈ పాలన కొనసాగాలని కాంక్షిస్తూ పూజలు చేశారు. అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరిలో సర్వమత ప్రార్థనలు తూర్పు గోదావరి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయినవిల్లి విగ్నేశ్వర స్వామి ఆలయంలో సీఎం వైఎస్ జగన్ పేరిట ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ►వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను రాజోలు కోఆర్డినేటర్ పెద్దపాటి అమ్మాజీ ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సీఎం జగన్కు మేలు జరగాలని కోరుతూ సర్వమత ప్రార్ధనలు చేశారు. పలు సాంస్కృతిక, సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనంతపురంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు.. అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన సందర్భంగా మడకశిర మసీదులో ముస్లింలు ప్రార్థన చేశారు. ఉరవకొండలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ► ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ శమంతకమణి కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పులివెందులతో సీఎం జగన్ జన్మదిన వేడుకలు.. వైఎస్సార్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను పులివెందులలో ఘనంగా నిర్వహించారు. భాకరపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో 48 కేజీల భారీ కేక్ను వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ అభిషేక్రెడ్డి కట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రారంభించారు. సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో పార్టీ నాయకుడు వెలుగోటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను నాయకులు కట్ చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎన్. శివప్రకాశ్ రెడ్డి 700 మంది డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ►పులివెందులలోని బీసీ బాలికల హాస్టల్లో సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రుక్మిణీ దేవి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. -
దిల్ రాజుతో టాప్ హీరోలు.. ఫోటోలు వైరల్
దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు 50వ పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 18). ఈ సందర్భంగా దిల్రాజ్కు సినీ ప్రముఖులను నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకొని ముందు రోజు రాత్రి టాలీవుడ్ ప్రముఖులకు దిల్రాజు గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు తనకు పరిచయం ఉన్న స్టార్స్ అందరిని పిలిచాడు. అందులో కన్నడ సూపర్ స్టార్ యశ్తో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు దిల్ రాజు పార్టీకి వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలాఉంటే దిల్రాజుతో మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, రామ్, విజయదేవరకొండ కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ర హీరోలందరిని ఒకే ఫ్రేమ్లో అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే రామ్ చరణ్, ప్రభాస్ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి అటు ప్రభాస్.. ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరు హీరోలతో దిల్ రాజు హిట్ సినిమాలు నిర్మించాడు. ప్రభాస్తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ అయింది. దాంతో పాటు చరణ్తో నిర్మించిన ఎవడు కమర్షియల్ సక్సెస్ సాధించింది.వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారడంతో ఈ పిక్ కు మరింత క్రేజ్ వచ్చింది. -
అల్లు అర్జున్ కూతురు బర్త్ డే సెలెబ్రేషన్స్
-
కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్లో మలైకా అరోరా
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ముద్దుల కొడుకు అర్హాన్ ఖాన్ 18వ ఏట అడుగుపెట్టాడు .ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సోమవారం తన కొడుక్కి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ 47 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ తన కొడుకు బర్త్డేకి సంబంధించిన డెకెరేషన్స్ ఫోటోలను సెలెబ్రేసన్స్కు ముందే పోస్టు చేసింది. ఈ ఫొటోలలో తన పెట్ అయిన కాస్పర్ ఫోటో పోస్ట్ చేసి 'ఆల్ సెట్ ఫర్ భయ్యా బర్త్డే' అని క్యాప్షన్ ఇచ్చింది. మలైకా అరోరా సోదరి అయిన అమ్రిత అరోరా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అర్హాన్కి బర్త్డే విషెష్ చెప్పింది. ఈ పోస్టులో అర్హాన్ ఖాన్ నవ్వుతున్న చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ, 'ఐ లవ్ యూ' అనే క్యాప్షన్ ఇచ్చింది. అర్హాన్ ఖాన్ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ తమ్ముడైన అర్బాజ్ఖాన్, మలైకా అరోరా సంతానం. ఈ జంట తమ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి 2017లో విడాకులతో ముగింపు పలికారు. అర్హాన్ తరుచుగా తన తల్లి అయిన మలైకా పోస్టుల్లో కనిపిస్తాడు. ఇటీవల సోహైల్ అలీఖాన్ కొడుకు నిర్వాన్, అర్హాన్ పాత ఫోటోలను మలైకా షేర్ చేస్తూ 'వాట్ ఆర్ యూ థింకింగ్ గాయ్స్........వర్ యూ గోయింగ్ ఫర్ బదాస్' అంటూ క్యాప్షన్ ఇస్తూ.. బంధన్ బ్రదర్స్, ఫ్యాషన్ ఫార్వర్్డ, లవ్ యూ బోత్' హ్యాష్ట్యాగ్లతో షేర్ చేసింది. -
‘త్వరలో బిగ్బాస్ 4 షూటింగ్లో పాల్గొంటా’
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున నేటితో 60 ఏళ్లు పూర్తిచేసుకుని 61వ పడిలోకి అడుగుపెట్టారు. నిన్నటినుంచే అభిమానులు, సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ ‘‘అంతులేని ప్రేమ, అభిమానం చూపిస్తున్న సీనియర్, జూనియర్ అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ మిత్రులతో పాటు ఇతర మిత్రులందరికీ నా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. (నాగార్జున ఏం తింటున్నారో: వర్మ) ట్విటర్లో ఓ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఆ వీడియోలో ‘‘ ఇవాళ నా 31వ పుట్టిన రోజు. నిన్నటి నుంచి చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమ, అభిమానంతో మెసేజ్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 5 నెలల తర్వాత పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో బిగ్బాస్ సీజన్ 4 షూటింగ్లో పాల్గొంటాను. బిగ్బాస్ సీజన్ 3ని విజయవంతం చేసినట్లే సీజన్ 4ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ నని అన్నారు. So much love, so many blessings🙏 I am overwhelmed!!thank you especially to all the senior Akkineni fans and the juniors, thank you to all the industry friends And of course thanks to all my friends!❤️ pic.twitter.com/O0gEPXgLaS — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 29, 2020 -
నాగ్ బర్త్డే : ఫ్యాన్స్కు సర్ప్రైజింగ్ గిఫ్ట్