Boeing
-
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
కొత్తగా మరో 2,835 విమానాలు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణానికి నానాటికీ పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి.. వచ్చే 20 ఏళ్లలో భారత్, దక్షిణాసియాలోని పౌర విమానయాన సంస్థలు కొత్తగా 2,835 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని యూఎస్కు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన కమర్షియల్ మార్కెట్ ఔట్లుక్ ప్రకారం.. భారత బలమైన ఆర్థిక వ్యవస్థ, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్ మద్దతు, 2043 నాటికి ఏటా 7 శాతం కంటే వార్షిక ట్రాఫిక్ వృద్ధి ఇందుకు దోహదం చేయనుంది. అలాగే మెరుగైన కనెక్టివిటీ, విమాన రంగానికి మద్దతు ఇచ్చే విధానాలు వృద్ధికి ఆజ్యం పోస్తాయి. భారత ట్రావెల్ మార్కెట్లో అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్గా దేశీయ విమాన ట్రాఫిక్ ఉంటుంది. లో–కాస్ట్ ఎయిర్లైన్స్ మరిన్ని కొత్త మార్గాలకు చేరుకోవడంతోపాటు, నూతన గమ్యస్థానాలను అనుసంధానిస్తాయి. అలాగే కార్గో విమానాల సంఖ్య అయిదింతలకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా సరఫరా విస్తరణ, తయారీ, ఈ–కామర్స్ రంగం జోరు ఇందుకు కారణం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. బలమైన ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వృద్ధి, పెరుగుతున్న గృహ ఆదాయాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో పెట్టుబడులు.. వెరశి భారత్, దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య విమానయాన మార్కెట్గా కొనసాగుతోందని బోయింగ్ భారత్, దక్షిణాసియా కమర్షియల్ మార్కెటింగ్ ఎండీ అశ్విన్ నాయుడు తెలిపారు. ‘ప్రజలకు విమాన ప్రయాణం ఎక్కువ అందుబాటులో వస్తుంది. రాబోయే రెండు దశాబ్దాలలో పెరిగిన డిమాండ్ను తీర్చడానికి ఈ ప్రాంతంలోని విమానయాన సంస్థలకు ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ఆధునిక విమానాల అవసరం. వీటిలో న్యారో బాడీ విభాగంలో 2,445, వైడ్ బాడీ సెగ్మెంట్లో 370 విమానాలకు డిమాండ్ ఉండొచ్చు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నీషియన్ల డిమాండ్ నాలుగు రెట్లు పెరిగి 1,29,000కి చేరుతుంది’ అని చెప్పారు. -
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. ఈ ఐదు ప్రధాన కారణాలు!
ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఒకేరోజులో(జనవరి 29)న అమెరికా, సూడాన్లో జరిగిన విమాన ప్రమాదాల కారణంగా ఏకంగా 84 మంది ప్రాణాలు కోల్పోవడం బాధితుల కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదాలకు పైలట్స్, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమాదాలకు మాత్రం ఐదు కారణాలే ముఖ్యంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.తాజాగా సౌత్ సూడాన్లో ఘోర విమాన భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్ సూడాన్, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.ఇక, భారత కాలమానం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, 2025 ఏడాది ప్రారంభంలోనే ఇలా ఒకే రోజున విమాన ప్రమాదాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంతో ప్రయాణీకులు వణికిపోతున్నారు.ఇదిలా ఉండగా.. 2000-2024 మధ్య 26 బోయింగ్ విమాన ప్రమాదాలు జరగ్గా అందుల్లో దాదాపు 10వేల మంది మరణించారు. ఒక్క 2024 ఏడాదిలో 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదాలకు ప్రధాన కారణంగా పైలట్లే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి పైలట్లు అనుభవిస్తున్న అలసటే కారణమని అంటున్నారు. ఇక, 20 శాతం ప్రమాదాలకు విమాన సాంకేతిక లోపాలే కారణమని అంటున్నారు. 2018 తర్వాత 2024లోనే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.ఐదు కారణాలు ఇవే..పైలట్ల లోపాలు.. 50 శాతంసాంకేతిక లోపాలు.. 20 శాతంపిడుగులు, తుఫాన్లు, బ్యాడ్ వెదర్.. 15 శాతంటెర్రరిజం, మిస్సైల్ దాడులు.. 5 శాతం ఇతర ప్రమాదాలు.. 10 శాతందీనికి సంబంధించిన పలు కారణాలు విశ్లేషణతో ఈ వీడియోలో.. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
17,000 మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే చాలా మందికి పింక్ స్లిప్పులు పంపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి పొందిన వారు రెండు నెలలపాటు అంటే జనవరి వరకు నోటీస్ పీడియడ్లో ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది.కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉండడమే ఈ లేఆఫ్లకు కారణమని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం వర్క్ఫోర్స్ను తగ్గించుకుంటామని చెప్పారు. ఇటీవల సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులకుపైగా సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ ఎయిర్క్రాఫ్ట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని గతంలో కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. సంస్థ తొలగించే ఉద్యోగుల్లో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తున్నారనే స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.ఇదీ చదవండి: దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఇటీవల బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వివిధ విమానయాన సంస్థలకు అందించే 777 జెట్ ఎయిర్క్రాఫ్ట్ల డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ 2026లో డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని అంచనా. దీనివల్ల సంస్థ షేర్స్ భారీగా క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరమని అధికారులు తెలిపారు. -
సమ్మె ఎఫెక్ట్.. 17వేల ఉద్యోగాల కోత
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి సన్నద్ధమైంది. సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ ప్రకారం.. ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది.ప్రస్తుతం బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. బోయింగ్ తొలగించనున్న ఉద్యోగులలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగించనున్నారు అనే వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.ఇదీ చదవండి: గూగుల్లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 777ఎక్స్ జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ డెలివరీలు 2026లో జరగాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి. దీనివల్ల సంస్థ షేర్స్ కూడా 1.1 శాతం క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరం. -
32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు
వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన ప్రముఖ ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ ఉద్యోగులతో యాజమాన్యం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27న ఈమేరకు కార్మికుల యూనియన్తో చర్చించనుంది. ఉద్యోగుల సమ్మె కారణంగా తయారీ కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితం చెందనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంపెనీకి భారీ ఆర్డర్లున్న 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు చెప్పారు.బోయింగ్ ఉద్యోగులు 2008 తర్వాత చేస్తున్న ఈ సమ్మెలో పలు డిమాండ్లను లేవనెత్తారు. యూనియన్లోని దాదాపు 32,000 మంది సభ్యులు 40 శాతం వేతనం పెంచాలంటున్నారు. దాంతోపాటు ఉద్యోగుల పెన్షన్ స్లాబ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం 30 శాతం వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. కానీ సంస్థ ఆఫర్కు యూనియన్ సిద్ధంగా లేదని ఉద్యోగులు లేచ్చి చెప్పారు. తప్పకుండా 40 శాతం వేతన పెంపు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల బోయింగ్ యాజమాన్యం యూనియన్తో చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. వచ్చే నాలుగేళ్లలో 25 శాతం వేతన పెంపు చేస్తామని కంపెనీ ఇప్పటికే హామీ ఇచ్చింది. అయితే ఆ ప్రతిపాదనను ఉద్యోగులు తోసిపుచ్చారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా వేతనాల పెరుగుదలపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాగైనా తమ డిమాండ్ను భర్తీ చేయాలని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై 27న మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..ఉద్యోగుల నిరసనలో భాగంగా సీటెల్, పోర్ట్ల్యాండ్, ఒరెగాన్లో విమానాల తయారీ నిలిచిపోయింది. సెప్టెంబర్ 13 నుంచి కొనసాగుతున్న ఈ సమ్మె వల్ల ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. బోయింగ్ అత్యధికంగా అమ్ముతున్న 737 మ్యాక్స్ మోడల్ ఎయిర్క్రాఫ్ట్ల ఉత్పత్తిని సైతం నిలిపేసినట్లు చెప్పారు. -
అంబానీ కొత్త విమానం.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ.. 'బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం' కొనుగోలు చేశారు. ఈ అల్ట్రా-లాంగ్-రేంజ్ బిజినెస్ ఫ్లైట్ విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఇప్పటి వరకు మనదేశంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇంత ఖరీదైన ఫ్లైట్ కొనుగోలు చేయలేదని సమాచారం.ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధీనంలో తొమ్మిది ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అయితే అంబానీ కొనుగోలు చేసిన ఈ బోయింగ్ 737 మ్యాక్స్ 9 ఫ్లైట్ అనేక మార్పులను పొందినట్లు సమాచారం. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విమానం ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి చేరనుంది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు.. వీటికే ఎక్కువ డిమాండ్బోయింగ్ 737 మ్యాక్స్ 9 స్పెసిఫికేషన్స్బోయింగ్ 737 మ్యాక్స్ 9 రెండు CFMI LEAP-1B ఇంజిన్లను పొందుతుంది. ఈ విమానం ఒకసారికి 11,770 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. దీనిని పూర్తిగా స్విట్జర్లాండ్లో అనుకూలీకరించి ఇండియాకు తీసుకురావడం జరిగింది. ఇది విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. -
Butch Wilmore and Sunita Williams: ఐఎస్ఎస్లో ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్టీ–100 స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో ఈ ఏడాది జూన్లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్లైనర్లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుంచి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్లైనర్లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు. అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్మోర్ వెల్లడించారు. -
అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతావిలియమ్స్,బుచ్విల్మోర్తెలిపారు. అంతరిక్షంనుంచిసునీత,విల్మోర్ శుక్రవారం(సెప్టెంబర్13)మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నా. ఐఎస్ఎస్లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.నాకే కాదు ఇది నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు’అని సునీత అన్నారు.మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు చెప్పారు.జూన్5న బోయింగ్ స్టార్లైనర్లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత, విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం భూమికి తిరిగి రాలేకపోయారు.వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ మాత్రం సెప్టెంబర్ 6న భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువస్తుందని నాసా వర్గాలు చెబుతున్నాయి.ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం ఆబ్సెంటీ ఓటింగ్తో పాటు ఓట్ బై మెయిల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో అర్హత కలిగిన ఓటర్లు బ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ బై మెయిల్ విధానం అందుబాటులో ఉంది. ఈ విధానంలో రిజిస్టర్ ఓటర్లందరికీ ఎన్నికల మందే మెయిల్ పంపుతారు. దీని ద్వారా పౌరులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోలింగ్ తేదీ కంటే ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇదీ చదవండి.. అంతరిక్షం నుంచి ఐక్య గీతం -
విమానంలో భారీ కుదుపులు.. ఏడుగురికి గాయాలు
బీజింగ్: సింగపూర్ నుంచి చైనాలోని గంగ్జూ పట్టణానికి వెళుతున్న స్కూట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం భారీ కుదుపులకు గురైంది. కదుపుల కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒక వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించాల్సి వచ్చింది.గంగ్జూ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం భారీ కుదుపులకు గురైనట్లు సిబ్బంది తెలిపారు. ఫ్లైట్ రాడార్ వివరాల ప్రకారం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 25వేల అడుగులకు వచ్చేసింది. వేగం కూడా ఒక్కసారిగా 500 నాట్స్ నుంచి 262 నాట్స్కు తగ్గింది. తర్వాత మళ్లీ 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి 500 నాట్స్ వేగంతో ప్రయాణించింది. -
నింగిలోనే వ్యోమగాములు.. భూమిపైకి ‘స్టార్లైనర్’
అంతరిక్షానికి వ్యోమగాములను మోసుకెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ అర్ధంతరంగా భూమికి తిరిగివచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్విల్మోర్ను తీసుకు రాకుండానే భూమికి వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన ఆరు గంటల తర్వాత శుక్రవారం(సెప్టెంబర్ 6) రాత్రి స్టార్లైనర్ వ్యోమనౌక న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో భూమిపై దిగింది.అసలు స్టార్లైనర్కు ఏమైంది..?బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ ఏడాది జూన్లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే స్టార్లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఒక దశలో స్టార్లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న ప్రచారం జరిగింది. నాసా ఎందుకు ఒప్పుకోలేదు..?హీలియం లీకేజీ సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాములు భూమికి తిరిగిరావడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరిగా స్టార్లైనర్లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ సంస్థ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమే అని ప్రకటించింది. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాసా అందుకు అంగీకరించలేదు.వ్యోమగాముల తిరిగి రాక ఎలా..వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి నాసా ఒప్పుకోకపోవడంతో స్టార్లైనర్ ఖాళీగా భూమికి రావాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఇలాన్మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు వ్యోమగాములు సునీతా, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత వచ్చేది అప్పుడేనా..స్పేక్స్ ఎక్స్కు చెందిన క్రూ-9 మిషన్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను నాసా ఐఎస్ఎస్కు పంపే ఛాన్సుంది. సెప్టెంబరులోనే ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రూ డ్రాగన్లో సునీత, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా యోచిస్తోంది. -
నేడు ఖాళీగా స్టార్లైనర్ తిరుగుప్రయాణం
కేప్కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్లైనర్లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్కు వీలుగా శుక్రవారం స్టార్లైనర్ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్తో టచ్లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్ను తన మైక్రోఫోన్కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్లైనర్ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
ఐఎస్ఎస్ నుంచి త్వరలో సునీత రాక!
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపయనంపై ఆశలు ఇంకాస్త చిగురించాయి. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేర్చాక స్టార్లైనర్లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం విదితమే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్ల తిరుగుప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టడం తెల్సిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచి్చతత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్ఎస్ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు. -
స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
కేప్కనవెరాల్: బోయింగ్ అంతరిక్ష నౌక ‘స్టార్ లైనర్’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తెలిపారు. స్టార్ లైనర్ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్ 5న సునీత, విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్లో సమస్యల వల్ల ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్ఎస్ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్ఎస్లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్ విలేకరులతో అన్నారు. -
నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ‘737 మ్యాక్స్’ ఎయిర్క్రాఫ్ట్లు కుప్పకూలిన విషయంలో నేరాన్ని అంగీకరించింది. దాంతోపాటు బాధితులకు జరిమానా కింద రూ.243.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2 వేలకోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. ఈమేరకు అమెరికా న్యాయ సంస్థతో కేసు పరిష్కార షరతులపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా బోయింగ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..‘2018-19 మధ్యకాలంలో ఇండోనేషియా, ఇథియోపియాలో 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్లు రెండు నేలకూలాయి. ఈ ఘటనల్లో 346 మంది మరణించారు. ఎయిర్క్రాఫ్ట్ల్లోని కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయి. అందుకు పరిహారంగా బాధిత కుటుంబాలకు రూ.2 వేలకోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అమెరికా న్యాయ సంస్థతో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాం. దీనిపై న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది’ అని చెప్పారు.ప్రమాదాలు జరిగిన వెంటనే బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. బోయింగ్ను చట్టపరంగా శిక్షించడంతోపాటు ఆ సంస్థపై ఆర్థికపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో 2021లో కేసు పరిష్కార ఒప్పందంలో భాగంగా సుమారు రూ.2,000 కోట్లు జరిమానా చెల్లించేందుకు బోయింగ్ అంగీకరించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు న్యాయ స్థానం గుర్తించింది. దాంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల బోయింగ్ నేరాన్ని అంగీకరించడంతోపాటు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 వేలకోట్లు జరిమానా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా జరిమానాతోపాటు రక్షణ చర్యల నిమిత్తం వచ్చే మూడేళ్లలో కనీసం రూ.3,700 కోట్లు బోయింగ్ వెచ్చించాల్సి ఉంటుంది. ఆయా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబీకులను బోయింగ్ బోర్డు కలవాలి. ఒప్పంద షరతులను బోయింగ్ పాటిస్తుందా? లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిని కూడా నియమించాలి.ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?ఇదిలాఉండగా, నేర అంగీకారం వల్ల అమెరికా రక్షణ విభాగం, నాసా లాంటి ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులు పొందే విషయంలో బోయింగ్ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
బోయింగ్ భారీ డీల్.. స్పిరిట్ ఏరోసిస్టమ్స్ కొనుగోలుకు సిద్ధం
స్పిరిట్ ఏరోసిస్టమ్స్ను.. బోయింగ్ సంస్థ సుమారు రూ.39 వేలకోట్లకు కొనుగోలు చేయనుంది. దీనికోసం సంస్థ నెల రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ముగిసిన తరువాత.. రెండు కంపెనీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో బోయింగ్ సంస్థ స్పిరిట్ ఏరోసిస్టమ్స్ కొనుగోలును ధ్రువీకరించింది.బోయింగ్ సంస్థ కొనుగోలు చేసిన ఈక్విటీ వాల్యూ 4.7 బిలియన్ డాలర్లు కాగా.. ఒక్కో షేరుకు 37.25 డాలర్లు. డీల్ మొత్తం విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇందులో ఇందులో స్పిరిట్ చివరిగా నివేదించిన నికర రుణం కూడా ఉందని ఏరోస్పేస్ పేర్కొంది. షేర్ వాల్యూ అనేది డీల్ ముగిసే ముందు షేర్ ధర సగటుపై ఆధారపడి ఉంటుంది.కొనసాగుతున్న భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బోయింగ్ స్పిరిట్ ఏరోసిస్టమ్స్ను కొనుగోలు చేయడానికి సన్నద్దమైందని తెలుస్తోంది. కాన్సాస్లోని విచితాలో ఉన్న స్పిరిట్, బోయింగ్ విమానాలకు సంబంధించిన కీలక భాగాలను తయారు చేస్తుంది. రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం మా ఎయిర్లైన్ కస్టమర్లకు, స్పిరిట్, బోయింగ్ ఉద్యోగులకు, మా షేర్హోల్డర్లకు, దేశానికి ఉపయోగకరంగా ఉంటుందని బోయింగ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేవ్ కాల్హౌన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
సునీతా విలియమ్స్ రాక ఎప్పుడు..? ‘మస్క్’ వైపు ‘నాసా’ చూపు
కాలిఫోర్నియా: ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్కు మరో ఎదురు దెబ్బ తగిలిందా.. ఏవియేషన్, స్పేస్టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్య ఎదుర్కొంటోందా..? స్పేస్ టెక్నాలజీ రంగంలో ఈలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్ను ఛాలెంజ్ చేస్తోందా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.ఇటీవలే భారత సంతతికి చెందినవ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్తో మరో వ్యోమగామని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్తో పాటు ఆమెతో వెళ్లిన మరో వ్యోమగామి భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్తో పాటు నాసా గుర్తించాయి. ఈ కారణంగా స్టార్లైనర్లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.దీంతో ఈలాన్ మస్క్కు స్పేస్ ఎక్స్కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్లో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది.దీనిలో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమ్మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. స్టార్లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్లోనే సునీత తిరిగి రావొచ్చు. ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లేనని చెబుతున్నారు. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్లైనర్ ఎయిర్క్రాఫ్ట్లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్లైన్ స్పేస్క్రాఫ్ట్లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్లైనర్ ఎయిర్క్రాఫ్ట్లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్కు సునీతా ఫైలట్గా, విల్మోర్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్మిల్పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్కు చెందిన స్టార్లైనర్ క్యాప్సూల్లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్డౌన్ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
సముద్రం అంచున విమానం ఇల్లు.. అదిరిపోయే ఫొటోలు
-
పాతబడేకొద్దీ మరింత ప్రమాదం
బోయింగ్ విమానాలు పాతపడే కొద్దీ అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయని ఆ కంపెనీలో 10 ఏళ్లకుపైగా ఇంజినీర్గా పనిచేసిన సామ్ సలేహ్పార్ తెలిపారు. ఇటీవల కాలంలో బోయింగ్ మోడళ్లలో లోపాలు తలెత్తడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్స్ట్రేషన్ (ఎఫ్ఏఏ) రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. తాజాగా బోయింగ్ సంస్థపై సామ్ చేసిన ఆరోపణలను సైతం పరిశీలిస్తున్నట్లు ఎఫ్ఏఏ విచారణ అధికారులు తెలిపారు. సామ్ ఎఫ్ఏఏకు చేసిన ఫిర్యాదులో ‘బోయింగ్ 777, 787 డ్రీమ్లైనర్లలో లోపాలున్నాయి. బోయింగ్ విమానాల తయారీ సమయంలో సంస్థ షార్ట్కట్లను వాడుతోంది. దాంతో అవి పాతబడేకొద్దీ ఈ లోపాలు ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో తయారైన విడిభాగాలను అనుసంధానం చేసే క్రమంలో సరైన విధానాలను పాటించడం లేదు. 2019లో సౌత్ కరోలినాలోని చార్లెస్టన్లోని ప్లాంట్లో బోయింగ్ 787 తయారు చేస్తున్న సమయంలో పని త్వరగా పూర్తి చేయాలని కార్మికులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. ఈ విషయాలు పబ్లిక్డొమైన్లో పెట్టడంతో కంపెనీ ప్రతీకారచర్యలకు సైతం దిగుతుంది’ అంటూ వివరించాడు. సామ్ తరపు న్యాయవాది డెబ్రా ఎస్కాట్జ్ మాట్లాడుతూ ‘సామ్ చేసిన ఆరోపణల ఫలితంగా కంపెనీ తనను 787 ప్రాజెక్టు నుంచి తప్పించి 777 ప్రాజెక్ట్కు బదిలీ చేసింది. చివరికి అక్కడ కూడా సామ్ లోపాలు గుర్తించాడు’ అని అన్నారు. ఇటీవల సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. గతంలోనూ అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు ఇటీవల జపాన్లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
విమానంలో 135 మంది ప్రయాణికులు.. గాల్లోనే ఊడిన ఇంజిన్ కవర్
విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ఇంజిన్ కవర్ ఊడిపోయిన సంఘటన ఇటీవల అమెరికాలోని డెన్వర్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. అలా ఊడిన కవర్ విమానం కుడివైపు రెక్కలపై ఉన్న ఫ్లాప్స్లో చిక్కుకుంది. విమాన సిబ్బంది, పైలట్లు సమస్యను వెంటనే గుర్తించి అప్పటికే గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి, కిందకు దించారు. డెన్వర్ ఎయిర్పోర్ట్లోని గ్రౌండ్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో హోస్టన్కు తరలించారు. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! గతంలోనూ అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల జపాన్లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
విమాన ప్రయాణికులకు ఆధునిక వినోద వ్యవస్థ
రోడ్లపై ప్రయాణాల్లో అలసటగా అనిపించినా, బోర్ కొట్టినా కాసేపు వాహనాన్ని ఆపి సేదతీరుతారు. కానీ విమాన ప్రయాణాల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఒకసారి గాల్లోకి ఎగిరాక తిరిగి దిగేవరకు ప్రయాణం ఎలా ఉన్నా భరించాల్సిందే. పైగా విమాన ప్రయాణాలంటేనే గంటల తరబడి ఉంటాయి. గాల్లో ప్రయాణించేవారికి కాసింత వినోదాన్ని పంచేందుకు థేల్స్ సంస్థ సిద్ధమయింది. ఇప్పటికే ఫ్లైట్ సీట్ ముందు డివైజ్ను అమర్చి ప్రయాణికులను కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తున్న సంస్థ ఆ వ్యవస్థను ఆధునికీకరించనుంది. ఎయిరిండియా తమ వద్ద ఉన్న 40 బోయింగ్ 777, 787 విమానాలను, థేల్స్కు చెందిన ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. థేల్స్ ‘అవాంట్ అప్’ వ్యవస్థను ఎయిరిండియా విమానాల లోపల అమర్చే పనులు వచ్చే ఏడాది వరకు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది. 2025లో ఎయిరిండియాకు కొత్తగా డెలివరీ అయ్యే 11 కొత్త ఎయిర్బస్, బోయింగ్ విమానాల్లోనూ థేల్స్ తన కొత్త వ్యవస్థలను పొందుపరచనుంది. ఇదీ చదవండి: యాప్ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. థేల్స్ 3డీ మ్యాప్, ఇమ్మర్సివ్ రూట్-బేస్డ్ ప్రోగ్రామింగ్, 4K QLED HDR డిస్ప్లేలను ఇన్స్టాల్ చేయనుంది. ఇందులో హై-స్పీడ్ ఛార్జింగ్ పోర్ట్లు, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏరోనాటిక్స్-స్పేస్, డిజిటల్ ఐడెంటిటీ-సెక్యూరిటీ, డిఫెన్స్-సెక్యూరిటీ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న కంపెనీగా థేల్స్ పేరొందింది. -
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
గాల్లో ఉండగానే కాక్పిట్ అద్దంలో పగుళ్లు!
అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానానికి ఇటీవలే పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. దాంతో బోయింగ్ 737 మ్యాక్స్లను అన్ని దేశాలు పక్కన పెట్టేశాయి. కానీ, ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ‘సపోరో-న్యూ చిటోస్ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్ 1182 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే నాలుగు లేయర్లు కలిగిన కాక్పిట్ అద్దంలో పగుళ్లు వెలుగు చూశాయి. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితోపాటు 59 మంది ప్రయాణికులు ఉన్నారు’ అని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో చెప్పింది. ఇదీ చదవండి: కీలక టారిఫ్లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్? అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. తాజాగా వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు తెలిపింది. మరిన్ని భద్రతా పరీక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. భారత్లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టి పెట్టింది. అత్యవసర ద్వారాలను తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ ఎయిర్లైన్స్ సంస్థలకు గతవారం మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఆకాశ ఎయిర్లైన్స్ సంచలన నిర్ణయం
దేశీయ విమానయాన రంగం సంస్థ అయిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో విమానాలు నడపనుంది. అందుకు అనువుగా ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ వినయ్దూబే తెలిపారు. సంస్థ ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాకేశ్ ఝన్ఝన్వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్దం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్కు 20 విమానాలు ఉన్నాయి. -
కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్' - ఫోటోలు చూశారా?
ముంబై విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో టాటా యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త బోయింగ్ బి737-8 విమానాన్ని 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్'గా ఆవిష్కరించారు. బోయింగ్ 737 మునుపటి డిజైన్కు భిన్నంగా కొత్త లోగో, ఎయిర్క్రాఫ్ట్ లివరీ పొందుతుంది. ఈ రిఫ్రెష్ బ్రాండింగ్ను చైర్ పర్సన్ 'అలోకే సింగ్' (Aloke Singh), సీఈఓ 'కాంప్బెల్ విల్సన్' (Campbell Wilson) ఆవిష్కరించారు. ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదని తామెవరో, విజన్ ఏంటో.. ఈ మార్పులలో చెప్పదలచుకున్నట్లు సీఈఓ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్ ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్లైన్స్గా నిలుస్తుందన్నారు. రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, లోగోలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు. Dear Guests, Fasten your seatbelts for the moment we've all been waiting for. We're thrilled to unveil the new X factor in Indian aviation - the new livery of Air India Express. #FlyAsYouAre #TailsOfIndia pic.twitter.com/Vif5GDQJlH — Air India Express (@AirIndiaX) October 18, 2023 -
సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!
ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు. గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ, స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి.. ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ - ఐఐఎస్సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్. -
విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ బడ్జెట్ ధరల ఆకాశ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ వార్షికోత్స సేల్స్ ద్వారా విమాన టికెట్లపై 15 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్ వెబ్సైట్, యాప్లోకి వెళ్లి వార్షికోత్సవం ఆఫర్ కింద 15 శాతం తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ ఆకాశ ఎయిర్ సేవల్, ఫ్లెక్సీ ఫేర్ టికెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆకాశ ఎయిర్ వెబ్సైట్లో AKASA1 కోడ్ ఉపయోగించడం ద్వారా ఆఫర్ పొందవచ్చు. అలాగే ఆకాశ ఎయిర్ లైన్స్ యాప్లో APPLOVE కోడ్ ఉపయోగించి ఆఫర్ అందుకోవచ్చు. దేశీయంగా 16 రూట్లలో ప్రయాణానికి ఈ మెగా సేల్ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. కంపెనీ యాప్లో ప్రత్యేకంగా బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్ ఫీజు పొందే అవకాశం కూడా ఉంది. తద్వారా ప్రతి బుకింగ్పై అదనంగా రూ. 350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎయిర్లైన్ నిబద్ధతలో భాగంగా అందిస్తున్న పరిమిత-కాల ఆఫర్అని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే క్రమంలో ఆగస్ట్ 1న, అకాశఎయిర్ 20వ ఎయిర్క్రాఫ్ట్ 737 MAX ను తన ఖాతాలో చేర్చుకున్నట్లు ప్రకటించింది. 12 నెలల్లోపు సున్నా నుండి 20 విమానాలకు వెళ్లడం కేవలం ఆకాసా రికార్డు మాత్రమే కాదు రికార్డు" అని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే పేర్కొన్నారు. కాగా ప్రముఖ స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ఝన్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ లైన్ 2022, ఆగస్టులో తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 35 మార్గాల్లో వారానికి 900 విమానాలను నడుపుతోంది. ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణే, లఖ్నవూ, గోవా, హైదరాబాద్, వారణాసి, భువనేశ్వర్, కోల్కతాలకు విమాన సేవలు అందిస్తోంది. Coming soon: Long Weekend. Have you booked yet? Get up to 15% off on over 900 weekly flights across India. Use promo code: AKASA1 Valid till: 7th Aug, 2023 Book NOW: https://t.co/aYCnmVC8ip#ItsYourSky #AkasaAir #flightoffer #longweekend #weekend #flights pic.twitter.com/W4Q1GR6DAi — Akasa Air (@AkasaAir) August 2, 2023 Thank you for being a part of our journey, @BoeingAirplanes! https://t.co/PbUIEgBmf5 — Akasa Air (@AkasaAir) August 2, 2023 -
ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ చైనా పర్యటనలో భాగంగా తన అధికారిక బృందంతో కలిసి రెండు విమానాల్లో బయలుదేరి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ మిత్రదేశమైన చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తన ప్రతినిధుల బృందంతో కలిసి బయలుదేరారు. అయితే వారంతా ఒక బోయింగ్ 757 విమానంలో వెళుతుండగా వెనుక మరో విమానాన్ని కూడా తమ వెంట తీసుకుని వెళ్లారు. అది ప్రస్తుతం ఫిలిపీన్స్ లోని మనీలా వరకు వారితో పాటు వెళ్ళింది. ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయిన చైనాతో జరగబోయే చర్చలు ప్రయోజనకరంగా సాగాలని దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఒక వేళ ఒక విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయంగా రెండో విమానం ఉపయోగపడుతుందని ఈ విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ బోయింగ్ 757 విమానాలు 30 ఏళ్ల నాటివి. వాటి సర్వీసు ముగింపు దశకు వచ్చింది. 2028 లేదా 2030లో వాటిని మార్చే అవకాశముందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నాయకులు న్యూజిలాండ్ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదేదో ఒక ఫోన్ చార్జర్ పని చేయకపోతే ఇంకో చార్జర్ వెంట తీసుకుని వెళ్ళినట్టుందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే.. -
31 వేల మంది పైలట్లు కావాలి..
ముంబై: వచ్చే 20 ఏళ్లలో భారత్లో 31,000 మంది పైలట్లు అలాగే 26,000 మంది మెకానిక్లు అవసరం కావచ్చని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. దేశీ ఎయిర్లైన్స్ భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడం ఇందుకు దోహదపడనుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇదీ చదవండి: గోపీనాథన్ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! టాటా గ్రూప్లో భాగమైన ఎయిరిండియా గత నెల బోయింగ్, ఎయిర్బస్లకు 470 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా చూస్తే రాబోయే 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతంలో విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందనుందని గుప్తే వివరించారు. భారత్లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతున్నందున మౌలిక సదుపాయాలు.. అలాగే పైలట్లు తదితర వనరులను సమకూర్చు కోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ కరోనా మహమ్మారి తర్వాత విమాన ప్రయాణాలకు డిమాండ్ ఆశ్చర్యపర్చే విధంగా రికవరీ అయ్యిందని గుప్తే తెలిపారు. ఎయిర్ ట్రావెల్ వృద్ధిపై ఆర్థిక సంక్షోభ ప్రభావాలేమీ పడే అవకాశాలు కనిపించడం లేదన్నారు. బోయింగ్కి ఉన్న ఆర్డర్లపరంగా చూస్తే భారత్లో చిన్న విమానాలకు డిమాండ్ నెలకొందని గుప్తే చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు 90 శాతం మార్కెట్ వీటిదే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్కు జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎయిర్బస్, బోయింగ్ 470 విమానాలు కోనుగోలు తరువాత 2 లక్షలకు పైగ ఉద్యోగావకాశాలు లభించ నున్నాయంటూ ఇప్పటికే పలువురు నిపుణులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో నియామకాల జోష్ కని పిస్తోంది. కంపెనీ వెబ్సైట్లోని ఓపెనింగ్స్ ప్రకటన మేరకు పైలట్లకు ఏడాదికి రూ.2 కోట్ల వరకు చెల్లించనుంది. బోయింగ్, ఎయిర్బస్ విమానలు డెలివరీకి సిద్ధంగాఉన్న నేపథ్యంలో నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఎయిరిండియాలో ఎయిర్లైన్ 'B777 కెప్టెన్ల' కోసం వెతుకుతోందని, వీరికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుందని బిజినెస్ టుడే నివేదించింది. "B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎయిరిండియా వెబ్సైట్లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులకు నెలవారీగా 21 వేల డాలర్లు వేతనం. అంటే వార్షిక ప్రాతిపదికన, రూ.2,08,69,416 పైమాటే. దీంతోపాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సహా అనేక ఓపెనింగ్లను ప్రకటించింది. నిపుణులైన పైలట్లు లేకపోవడం వల్ల ఈ పాత్ర చాలా ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్లైన్ కన్సల్టింగ్ సంస్థ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ వాదించారు. ప్రపంచవ్యాప్తంగా పైలట్ కొరత ఉందనీ, నిర్దిష్ట విమానంలో కనీసం 5000 నుండి 7000 గంటల పాటు క్వాలిఫైడ్ పైలట్లకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అభిప్రాయం ప్రకారం ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు అవసరం, వారి షిఫ్ట్ మారుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ప్రతి విమానానికి 50 కంటే తక్కువ క్యాబిన్ సిబ్బంది అవసరం. వీరితోపాటు చెక్అవుట్ కౌంటర్లో, బ్యాగేజీ హ్యాండ్లర్లు, మెయింటెనెన్స్ ఇంజనీర్లు మొదలైన సిబ్బంది కూడా అవసరమే. -
ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు
సాక్షి,ముంబై: ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్న టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా మెగా డీల్ భారీ ఉద్యోగాల కల్పనకు దారి తీయనుంది. ఇటీవల బోయింగ్, ఎయిర్బస్ మధ్య తాజా మెగా ఒప్పందం భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 140 విమానాల సముదాయాన్ని కలిగి ఉన్న ఎయిరిండియా, బోయింగ్ ఎయిర్బస్ నుంచి భారగా విమానాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాలు నడిపేందుకు, క్రూ, ఇతర ప్రత్యక్ష పరోక్ష సిబ్బంది అవసరం కాబట్టి భవిష్యత్తులో భారీగా ఉద్యోగాల కల్పిను అవకాశం లభిస్తుందని అంచనా.నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్ కోసం మొత్తం ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు దాదాపు 400. వైడ్ బాడీ ప్లేన్ కోసం, 600-700మంది అవసరమంని తెలుస్తోంది. "డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో నేరుగా విమానయాన సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్న వారు ఉంటారు, ఉదాహరణకు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నికల్, నాన్-టెక్నికల్ సిబ్బంది. ఇది నారో బాడీ విమానానికి దాదాపు 175. ఇంకా విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ట్రావెల్ సేల్స్ ఏజెన్సీ, సర్వీస్ ప్రొవైడర్లు ఇవన్నీ కలిసి విమానానికి 400 ఉద్యోగులు అవసమరని ఏవియేషన్ రంగ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ బిజినెస్ టుడేతో చెప్పారు. ఈ విధంగా మొత్తంగా లెక్కిస్తే దాదాపు 2 లక్షల నుంచి 2 లక్షల 9వేల వరకు ఉంటాయని ఉద్యోగాలొస్తాయని ఆయన చెప్పారు. దీనికి తోడు ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ఉద్యోగాలొస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఈ బిల్పై స్పందించారు. ఇది చారిత్రాత్మక ఒప్పందమనీ, అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని కొనియాడారు. అంతేకాదు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారు, ఎందుకంటే ఇది వారికి కీలకమైనది. -
ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్ హాల్ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్లైన్స్లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. -
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఎయిర్ ఇండియా.. జో బైడెన్ ప్రశంసలు
ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ 'బోయింగ్' నుండి ఏకంగా రెండు వందలకు పైగా విమానాలను కొనుగోలు చేయాలనే ఎయిర్ ఇండియా నిర్ణయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ 'జో బైడెన్' మంగళవారం ప్రశంసించారు. ఈ నిర్ణయంతో తమ దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన అమెరికా-ఇండియా ఆర్థిక భాగస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యం యొక్క బలాన్ని ప్రతిబింబిస్తుందని జో బైడెన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి భారత్ - అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాను ఎదురు చూస్తున్నట్లు కూడా తెలిపారు. ఎయిర్ ఇండియా బోయింగ్ నుండి 34 బిలియన్ అమెరికన్ డాలర్లకు 220 విమానాలను కొనుగోలు చేయనుంది. మొత్తం మీద ఇది టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్స్, బోయింగ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎయిర్ ఇండియా ఆర్డర్ డాలర్ విలువలో బోయింగ్కి మూడవ అతిపెద్ద విక్రయం మాత్రమే కాకుండా, విమానాల సంఖ్య పరంగా రెండవదిగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో భారత్ - అమెరికా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. -
బోయింగ్కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ప్లాంటులో తయారు చేసిన తొలి ’వర్టికల్ ఫిన్’ భాగాన్ని అమెరికాలోని బోయింగ్ విమానాల తయారీ కేంద్రానికి పంపించినట్లు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏ) వెల్లడించింది. దీన్ని అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న బోయింగ్ ప్లాంటుకు డెలివరీ చేస్తారు. అక్కడ బోయింగ్ 737 విమానానికి అమరుస్తారు. నిట్టనిలువుగా ఉండే వర్టికల్ ఫిన్ భాగాన్ని విమానానికి స్థిరత్వాన్నిచ్చేలా ఎయిర్క్రాఫ్ట్ తోకపై ఏర్పాటు చేస్తారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, బోయింగ్ కలిసి టీబీఏను జాయింట్ వెంచర్ సంస్థగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన వర్టి కల్ ఫిన్ భాగాల తయారీ కోసం టీబీఏ గతేడాదే కొత్త లైన్ను ప్రారంభించింది. 14,000 చ.మీ. విస్తీర్ణంలోని టీబీఏ ప్లాంటులో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్టర్లకు కావాల్సిన ఏరో–స్ట్రక్చర్స్ మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. (ఇదీ చదవండి: డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...) -
‘ఎయిరిండియా’కు 470 కొత్త విమానాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరింపజేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ నుంచి, అమెరికాలోని బోయింగ్ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఆర్డర్ కూడా ఇదే. ‘‘40 ఎయిర్బస్ ఏ350 విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777–9 విమానాలు, 210 ఎయిర్బస్ ఏ320/321 నియో విమానాలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కొంటున్నాం’’ అని ఎయిర్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మొదటి విమానం ఈ ఏడాది ఆఖర్లో సర్వీసులో చేరుతుందని పేర్కొంది. 2025 జూలై నుంచి విమానాలు తమకు అందుతాయని తెలియజేసింది. లీజుకు తీసుకున్న 11 బీ777, 25 ఏ320 విమానాల డెలివరీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేసింది. రెండు ఒప్పందాల విలువ ఏకంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.4 లక్షల కోట్లు) అని అంచనా! సుదీర్ఘ ప్రయాణాలకు వైడ్–బాడీ విమానాలు ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశామని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం చెప్పారు. ఎయిర్బస్ నుంచి 210 నారో–బాడీ విమానాలు, 40 వైడ్–బాడీ విమానాలు కొంటున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తదితరులు వర్చువల్గా పాల్గొన్న కార్యక్రమంలో చంద్రశేఖరన్ మాట్లాడారు. ఎక్కువ సమయం(అల్ట్రా–లాంగ్ హాల్) సాగే ప్రయాణాల కోసం వైడ్–బాడీ విమానాలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే విమానాన్ని అల్ట్రా–లాంగ్ హాల్ ఫ్లైట్ అంటారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎయిరిండియాను 2022లో టాటా గ్రూప్ దక్కించుకోవడం తెలిసిందే. ఎయిర్ ఇండియా చివరిసారిగా 2005లో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో బోయింగ్ సంస్థ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది. 2005లో ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు. ఒప్పందాల పట్ల ప్రధాని మోదీ హర్షం ఎయిర్బస్, బోయింగ్తో ఎయిరిండియా ఒప్పందాలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇవి మైలురాయి లాంటి ఒప్పందాలన్నారు. భారత్లో విమానయాన రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 15 ఏళ్లలో 2,000కు పైగా విమానాలు అవసరమని చెప్పారు. మన పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. దేశంలో గత ఎనిమిదేళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుంచి 147కు చేరిందని గుర్తుచేశారు. ‘ఉడాన్’ పథకం కింద మారూమూల ప్రాంతాలను సైతం విమానాల ద్వారా అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా అవతరించబోతోందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఉక్రెయిన్–రష్యా సమస్యను పరిష్కరించే సత్తా మోదీ నాయకత్వంలోని భారత్కుందని ప్రశంసించారు. భారత జి–20 సారథ్యం విజయవంతం కావడానికి సహకరిస్తున్నామని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఎయిరిండియా–బోయింగ్ ఒప్పందంతోపాటు పలు అంశాలపై నేతలు చర్చించుకున్నారని వెల్లడించింది. చరిత్రాత్మక ఒప్పందం: జో బైడెన్ 34 బిలియన్ డాలర్లతో బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందాన్ని చరిత్రాత్మకంగా బైడెన్ అభివర్ణించారు. ‘‘అవసరాన్ని బట్టి మరో 70 విమానాలు కొనేలా ఒప్పందం కుదిరింది. అలా మొత్తం ఒప్పందం విలువ 45.9 బిలియన్ డాలర్లు. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నాం’’ అన్నారు. వైట్హౌస్ ప్రకటన మేరకు బోయింగ్తో ఒప్పందంలో 50 బోయింగ్ 737మ్యాక్స్, 20 బోయింగ్ 787 ఫ్లైట్లు ఉన్నాయి. ఎయిరిండియా ఇచ్చిన ఆర్డర్ బోయింగ్ చరిత్రలో డాలర్ విలువలో మూడో అతిపెద్ద సేల్, విమానాల సంఖ్యలో రెండో అతి పెద్దది! కీలక ఘట్టం: రిషి లండన్: ఎయిరిండియాకు 250 కొత్త విమానాలు విక్రయించడానికి ‘ఎయిర్బస్–రోల్స్ రాయిస్’ ఒప్పందానికి రావడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హర్షం బెలిబుచ్చారు. బ్రిటన్ ఏరోస్పేస్ రంగంలో ఇదో కీలక ఘట్టమన్నారు. ‘‘భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. బ్రిటన్లో విమానయాన రంగ అభివృద్ధికి ఆకాశమే హద్దు అనేందుకు ఈ ఒప్పందమే తార్కాణం’’ అన్నారు. ఈ ఒప్పదంతో బ్రిటన్లోని వేల్స్, డెర్బీషైర్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఎగుమతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఎయిరిండియా కొనుగోలు చేసే 250 విమానాల తయారీ ప్రక్రియ చాలావరకు యూకేలోనే పూర్తి కానున్నట్లు తెలియజేసింది. -
భారత్లో బోయింగ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ భారత్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా గ్లోబల్ సపోర్ట్ సెంటర్ (జీఎస్సీ) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే లాజిస్టిక్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ ఎయిర్లైన్ కస్టమర్లు, పౌర విమానయాన నియంత్రణ సంస్థలు, ఇతరత్రా పరిశ్రమ వర్గాలకు నిర్వహణపరమైన సామర్థ్యాలు.. భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన సేవలను జీఎస్సీ అందిస్తుంది. జీఎస్సీ, లాజిస్టిక్స్ కేంద్రంపై ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం సంస్థ వెల్లడించలేదు. దేశీ విమానయాన సంస్థలు 150 పైచిలుకు బోయింగ్ విమానాలను నడుపుతున్నాయి. తమ రిపేర్ డెవలప్మెంట్ అండ్ సస్టెయిన్మెంట్ హబ్ ప్రోగ్రాం ద్వారా బోయింగ్ ప్రస్తుతం స్థానిక కస్టమర్లకు వివిధ సర్వీసులను అందిస్తోంది. దేశీయంగా విమాన ప్రయాణాలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో వినూత్న అవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు, ఏవియేషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. -
ఎయిరిండియా విస్తరణ ప్లాన్స్, చర్చనీయాంశంగా టాటా భారీ డీల్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్బస్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చేవారం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. దాదాపు 250 విమానాల కోసం ఎయిర్బస్తో ఒప్పందం ఖరారైందని త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. అలాగే ఇప్పటికే సుమారు 200 విమానాల కోసం బోయింగ్తో ఎయిర్లైన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. వచ్చేవారమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. కొత్త విమానాల కోసం ఎయిర్లైన్ చారిత్రాత్మక ఆర్డర్ను ఖరారు చేయనున్నట్టు ఎయిరిండియా చీఫ్ క్యాప్ బెల్ విల్సన్ ఇటీవల (జనవరి 27న) వ్యాఖ్యానించారు. దీంతో కొనుగోలు వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాన కాని నేపథ్యంలోఎయిరిండియా అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. కాగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియా 16 సంవత్సరాల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2005 వరకు ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8బిలియన్ డాలర్ల భారీ డీల్ ను కదుర్చుకుంది ఎయిరిండియా. -
Layoffs: ఏవియేషన్ దిగ్గజం ఉద్యోగాల కోత; టీసీఎస్లో ఆ ఉద్యోగులకు ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు సమా పలు కంపెనీలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ కూడా వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది ఫైనాన్స్, హెచ్ఆర్ వర్టికల్స్లో 2,000 ఉద్యోగాలను తొలగించనుంది. వీరిలో ఎక్కువగా టీసీఎస్ అవుట్ సోర్స్ ద్యోగులు ప్రభావితం కానున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మొత్తం 5,800 కంపెనీల నుండి ఫైనాన్స్లో దాదాపు 1,500, హెచ్ఆర్లో 400 ఉద్యోగులను తొలగించనుంది. ఫైనాన్స్ , హెచ్ఆర్ సపోర్ట్ సేవలను తగ్గించిన నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బోయింగ్లో కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ మైక్ ఫ్రైడ్మాన్ ఉటంకిస్తూ సీటెల్ టైమ్స్ నివేదించింది. అయితే కంపెనీ వాటిలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టీసీఎస్కి అవుట్సోర్స్ చేసిందని మీడియా నివేదించింది. ఇండియాలో బోయింగ్లో ఇప్పుడుదాదాపు 3,500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే టీసీఎస్ సహా ఇతర సంస్థలకు సంబంధించి మరో 7వేల మంది ఉద్యోగులున్నారు. కాగా రానున్న కాలంలో వ్యయాలను తగ్గించుకునే క్రమంలో మరింత మందిని తొలగించాలని బోయింగ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షలను సిద్ధం చేయడానికి మేనేజర్లను కోరింది. అంచనాలను అందుకోవడంలో విఫలమైన సిబ్బందిలో 10 శాతం మందిని వర్గీకరించాలని కోరింది. -
ఎయిర్ ఇండియా మరో భారీ కొనుగోళ్లు..200 బోయింగ్ విమానాలకు ఆర్డర్?
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా..అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి 200 విమానాలు కొనుగోలు చేసేలా ఆర్డర్ పెట్టినట్లు సమాచారం. వాటిలో బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య కొనుగోలు చర్చలు జరుగుతుండగా..త్వరలో వాటికి ముగింపు పలకునున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎయిర్ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్ ఎయిరిండియా ప్రతినిధులు స్పందించలేదు. కాగా, అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్కు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
రతన్ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు!
ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్లైన్గా తీర్చిదిద్దేందుకు మాతృ సంస్థ టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి పదివేల బిలియన్ల డాలర్ల విలువైన 500 ప్యాసింజర్ విమానాలు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి విలువ సుమారు రూ.80వేల కోట్లు ఉండనుందని అంచనా. ఆర్డర్ ఇచ్చిన వాటిలో 400 నారో బాడీ జెట్లు, 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్లు ఉండగా.. డజన్ల కొద్దీ ఎయిర్బస్ ఏ350లు, బోయింగ్ 787లు, బోయింగ్ 777లు ఉన్నాయి. అదే జరిగితే బిలియన్ డాలర్ల విమానాల కొనుగోలుతో 10 ఏళ్ల క్రితం అమెరికన్ ఎయిర్ లైన్ కొనుగోళ్లను టాటా అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్ధం క్రితం అమెరికన్ ఎయిర్లైన్స్ 460 ఎయిర్బస్, బోయింగ్ జెట్ల ఆర్డర్ పెట్టింది. నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్, వైడ్ బాడీ విమానాల మధ్య వ్యత్యాసం ట్యూబ్ షేప్లో విమానంలోని ప్యాసింజర్లకు కూర్చునే(మెయిన్ బాడీ), వెడల్పు పెద్దగా ఉండి..రో’ (అడ్డం)లో ఎక్కువ సీట్లు ఉంటే వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఉదాహారణకు ఈ వైడ్ బాడీ విమానం రౌండ్గా 5 నుంచి 6 మీటర్లు ఉండి..అడ్డంగా 9 సీట్లు ఉంటే ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు కాళీ ప్రదేశం ఉంటుంది. అలా 9 సీట్ల మధ్యలో ప్రయాణికులు నడించేందుకు రెండు దార్లు ఉంటాయి. ప్రతి మూడు ఈ విమానంలో 10..10 సీట్ల మధ్య ఖాళీగా ఉంటుంది. అదే నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్ బాడీ రౌండ్గా 3 నుంచి 4 మీటర్లు ఉండి.. అడ్డంగా 3 నుంచి 6 సీట్లు ఉంటాయి. ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు ఒక్క దారి మాత్రమే ఉంటుంది. -
బోయింగ్కు ఆజాద్ ఎన్ఏఎస్ విడిభాగాలు
హైదరాబాద్: విమానాల తయారీ దిగ్గజం బోయింగ్కు తొలి విడిభాగాల కన్సైన్మెంట్ను అందించినట్లు ఆజాద్ ఇంజినీరింగ్ తెలిపింది. జాతీయ ఏరోస్పేస్ ప్రమాణాలకు (ఎన్ఏఎస్) అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేసినట్లు వివరించింది. వివిధ బోయింగ్ విమానాలకు అవసరమైన కీలక ఏరోస్పేస్ భాగాలు వీటిలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రాకేష్ చాప్దర్ తెలిపారు. ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర భారత్ నినాదంలో భాగంగా హైదరాబాద్లో అదనంగా మరో యూనిట్ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఆజాద్ ఇంజినీరింగ్ తయారు చేస్తోంది. -
మిధానితో బోయింగ్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో వినియోగించే పరికరాలకు అవసరమైన ముడి వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేసే అంశంపై మిశ్ర ధాతు నిగమ్ (మిధాని)తో కలిసి పనిచేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బోయింగ్ ఇండియా వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేకమైన మెటీరియల్స్, మిశ్రమ లోహాల లభ్యత కీలకమని పేర్కొంది. భారత్లోని తమ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. అధునాతన టెక్నాలజీ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే సామర్థ్యాలను పెంచుకునేందుకు బహుళ జాతి సంస్థలతో కలిసి పనిచేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉండగలదని మిధాని సీఎండీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
రాకేశ్ఝున్ఝున్వాలా.. ఆకాశ.. మ్యాక్స్ 737
న్యూఢిల్లీ: మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాల నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్లైన్స్ కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఆకాశ ఎయిర్ ఖాతాలో బోయింగ్ 737 మ్యాక్స్ వచ్చి చేరింది. 2021 నవంబర్లో ఆకాశ ఎయిర్, బోయింగ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బోయింగ్ నుంచి మ్యాక్స్ రకం 72 విమానాలను ఆకాశ కొనుగోలు చేయనుంది. తొలి విమానం గురువారం డెలివరీ అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2023 మార్చి నాటికి 18 విమానాలు సంస్థకు చేరనున్నాయి. మిగిలినవి తదుపరి నాలుగేళ్లలో అడుగుపెడతాయి. చదవండి: విమాన చార్జీలను 15% పెంచాలి -
రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ ఇదే: 'ఆకాశ'..ఫస్ట్ లుక్!
సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు. తాజాగా ఆ సంస్థకు చెందిన విమానాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుటి వరకు ఆకాశ ఎయిర్ విమానాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి కోడ్ ఏంటనే విషయాలో వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్ తన సంస్థకు చెందిన విమాన రూపు రేఖల్ని ప్రజలకు పరిచయం చేసింది. విమానం ఆకారం, కలర్స్తో పాటు కోడ్లను వివరిస్తూ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేసింది. విమానాలకు కోడ్ ఏంటీ! దేశాన్ని బట్టి ఆయా సంస్థలకు చెందిన విమానాలకు కొన్ని కోడ్లు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్లైన్కు 'క్యూపీ', ఇండిగో కోడ్ '6ఈ',గో ఫస్ట్ 'జీ8',ఎయిర్ ఇండియాకు 'ఏఐ' అని ఉంది. ఆకాశ ఎయిర్ సైతం తమ విమానాల కోడ్ ఏంటనేదీ రివిల్ చేసింది. కాంట్ కీప్ క్లైమ్! సే టూ హాయ్ అంటూ ఆకాశ ఎయిర్ విమానం కోడ్ 'క్యూపీ- పీఐఈ'! ట్వీట్లో పేర్కొంది. Coming soon to Your Sky! ✈️#AvGeek pic.twitter.com/nPpR3FMpvg — Akasa Air (@AkasaAir) May 23, 2022 ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తాము ముందుగా ప్రకటించిన సమయానికే ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. జున్ 2022కంటే ముందుగా ఫస్ట్ ఎయిర్ క్రాప్ట్ డెలివరీ అవుతుంది. జులై 2022 నాటికి ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఆపరేషన్ను ప్రారంభింస్తామని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తెలిపారు. బోయింగ్తో ఒప్పందం రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ విమానాల్ని తయారు చేసేందుకు అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఝున్ఝున్ వాలా గతేడాది నవంబర్ 26,2021న బోయింగ్ సంస్థతో 72 మ్యాక్స్ విమానాల్ని కొనుగోలు చేశారు. వీటితో పాటు 72బోయింగ్ 737మ్యాక్స్ ఎయిర్ క్రాప్ట్లు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మొత్తం విమానాల్ని తయారు చేసి ఆకాశ ఎయిర్కు అప్పగించనుంది. ఇందులో భాగంగా బోయింగ్ కంపెనీ తొలి ఎయిర్ క్రాప్ట్ ను ఏ ఏడాది జున్ నాటికి ఆకాశ ఎయిర్కు అందించనుంది. Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV — Akasa Air (@AkasaAir) May 23, 2022 సాధ్యమేనా! కాంపిటీషన్, ఫ్లైట్ల నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల గడిచిన 10ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఆయా విమాన సంస్థలు తమ సర్వీసుల్ని పూర్తిగా రద్దు చేశాయి. పదుల సంఖ్యలో విమానాలు ప్రభుత్వం ఆధీనంలో సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా సైతం నష్టాలకు తట్టుకోలేక టాటా కంపెనీకి అమ్మేసింది. రతన్ టాటా ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడంతో కష్టాల నుంచి గట్టెక్కితే మిగిలిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కార్యకాలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో వాయిదూత్ ఎయిర్ లైన్స్, సహార ఎయిర్ లైన్స్, ఎండీఎల్ ఆర్ ఎయిర్లైన్స్, డక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్, దర్బంగా ఏవియేషన్, దమానియా ఎయిర్ వేస్, గుజరాత్ ఎయిర్ వేస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ మంత్రా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్లు ఉన్నాయి. సుమారు రూ.66వేల కోట్లు ఈ క్రమంలో రాకేష్ ఝున్ఝున్వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉంది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అప్పుల్లో కూరుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ఏవియేషన్ సంస్థలు సర్వీసుల్ని నిలిపివేస్తే..ఇప్పుడు ఆకాశ ఎయిర్తో కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించడం కత్తి మీద సామేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
చైనా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు.. పైలెట్లు కావాలనే అలా...
బీజింగ్: చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసింది. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిని బట్టి కాక్పిట్లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోయింగ్ గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ 737 మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. చదవండి👇 మీరొస్తానంటే.. నేనొద్దంటా! చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
బోయింగ్, ఎయిర్బస్లతో టాటా కీలక చర్చలు.. కారణం ఇదే
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా. ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులు చేపడుతోంది.ఈ మేరకు ఈ రంగంలో దిగ్గజ కంపెనీలైన ఎయిర్బస్, బోయింగ్ సంస్థలతో టాటా గ్రూపు చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా ఇటీవల దక్కించుకుంది. ఈ క్రమంలో చిన్నా పెద్దా అంతా కలిసి 150 విమానాలు ఎయిరిండియాకు ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు విమానాలు పాతవై పోయాయి. వీటి మెయింటనెన్స్ అండ్ మోడిఫికేషన్కి రూ. 7,500 వరకు ఖర్చు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ పనిని పరిమితంగా చేపట్టి.. ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త విమానాల కొనుగోలకు టాటా ఆసక్తి చూపుతుందంటూ బ్లూబెర్గ్ కథనం ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా విమానాల తయారీలో బోయింగ్, ఎయిర్బస్ సంస్థలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా బోయింగ్ సంస్థ భారీ విమానాలకు పర్యాయపదంగా ఉంది. దీంతో కొత్త విమానల తయారీ, తమ అవసరాలు తదితర అంశాలపై టాటా ప్రతినిధులు ఈ రెండు కంపెనీలతో చర్చలు చేపడుతున్నారు. ఇవి సఫలమైతే టాటా నుంచి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. -
Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
Rakesh Jhunjhunwala Akasa Air Ties Up With Boeing: భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్ఝున్వాలా స్టార్టప్ ఎయిర్లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. కిందటి నెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆకాశ నుంచి బోయింగ్కు రూ.75,000 కోట్ల ఆర్డరు వెళ్లిందని సమాచారం. అతిత్వరలోనే 70 నుంచి 80 దాకా 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుకోనుందని వార్తాసంస్థ బ్లూమ్బర్గ్ పేర్కొంది. ఈనెల 14న మొదలయ్యే ‘దుబాయ్ ఎయిర్షో’లో అమెరికాకు(చికాగో) చెందిన బోయింగ్తో కుదుర్చుకునే ఒప్పందం గురించి ఆకాశ ప్రకటించే అవకాశం ఉందని ఆ వార్తా సంస్థ చెబుతోంది. అయితే ఆకాశ మాత్రం ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ప్రస్తుత ధరల ప్రకారం.. ఈ ఒప్పంద విలువ 10 బిలియన్ డాలర్ల (రూ.75,000 కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా. తక్కువ ధరతో సామాన్యుడికి విమాన ప్రయాణం అందించాలన్న బిగ్బుల్(ఝున్ఝున్వాలా) ప్రయత్నం ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి. అయితే ఒక వేళ బోయింగ్ ఈ ఆర్డరును పొందితే కనుక భారత్లో ఎయిర్బస్ సంస్థకు ఉన్న ఆధిపత్యాన్ని గండి పడినట్లే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికల్లా కార్యకలాపాలను మొదలుపెట్టాలని ఆకాశ ఎయిర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. కానీ బిలియనీర్ అయ్యాడు -
భయపెట్టే బోయింగ్కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఫాంగ్ స్టాక్స్ దన్ను- మూడో రోజూ రికార్డ్స్
వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,444 వద్ద నిలవగా.. నాస్డాక్ 87 పాయింట్లు(0.76 శాతం) ఎగసి 11,466 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ మాత్రం 60 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,249 వద్ద స్థిరపడింది. ఫాంగ్ స్టాక్స్ మరోసారి లాభపడటంతో నాస్డాక్ 2020లో 38వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు ప్రారంభంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గురువారం జాక్సన్హోల్ వద్ద ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. యాపిల్ డీలా షేర్ల విభజన తదుపరి డోజోన్స్లో యాపిల్ ఇంక్ వెయిటేజీ నీరసించగా.. ఇండెక్స్లో చేపట్టిన ఇతర మార్పులు ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. డోజోన్స్లో ఎక్సాన్ మొబిల్ స్థానే సేల్స్ఫోర్స్.కామ్కు చోటు లభిస్తుండగా.. హనీవెల్ ఇంటర్నేషనల్ రాకతో రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోనుంది. ఈ బాటలో ఫైజర్ ఇంక్ను తోసిరాజని యామ్జెన్ ఇంక్ డోజోన్స్కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. బోయింగ్ ఇంక్ 2 శాతం, యాపిల్ 1 శాతం చొప్పున క్షీణించడంతో డోజోన్స్ వెనకడుగు వేసింది. అయితే ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ 3-1 శాతం మధ్య లాభపడటంతో ఎస్అండ్పీ, నాస్డాక్ రికార్డులు కొనసాగినట్లు నిపుణులు పేర్కొన్నారు. బెస్ట్ బయ్ వీక్ ప్రభుత్వం పేరోల్ ప్యాకేజీని పొడిగించకుంటే అక్టోబర్లో 19,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించడంతో అమెరికన్ ఎయిర్లైన్స్ కౌంటర్ 2.2 శాతం డీలా పడింది. ఎలక్ట్రానిక్స్ చైన్ బెస్ట్ బయ్ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా క్యూ3లో అమ్మకాలు క్షీణించవచ్చని అంచనా వేసింది. దీంతో ఈ షేరు 4 శాతం పతనమైంది. ఇక క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో మెడ్ట్రానిక్స్ షేరు 2.5 శాతం ఎగసింది. -
వ్యాక్సిన్ హోప్- రెండో రోజూ రికార్డ్స్
వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 34 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,431 వద్ద నిలవగా.. నాస్డాక్ 68 పాయింట్లు(0.6 శాతం) ఎగసి 11,380 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎస్అండ్పీ తొలిసారి 3,400 మార్క్ను అధిగమించింది. ఇక డోజోన్స్ 378 పాయింట్లు(1.4 శాతం) జంప్చేసి 28,308 వద్ద స్థిరపడింది. తద్వారా ఆరు నెలల తదుపరి తిరిగి 28,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఫిబ్రవరి 12న సాధించిన చరిత్రాత్మక గరిష్టానికి 4.2 శాతం దూరంలో నిలిచింది. గత వారం 2.7 శాతం లాభపడటం ద్వారా నాస్డాక్ 2020లో 36వ సారి సరికొత్త రికార్డును సాధించిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్కు వాషింగ్టన్ ప్రభుత్వం త్వరితగతిన అనుమతివ్వనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నవంబర్లో ప్రారంభంకానున్న అధ్యక్ష ఎన్నికలలోపే కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల వ్యాక్సిన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ప్లాస్మా చికిత్సను యూఎస్ఎఫ్డీఏ తాజాగా అనుమతించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. యాపిల్ భళా వ్యాక్సిన్ అనుమతులపై అంచనాలతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం ఎగసింది. దీంతో ఎయిర్లైన్స్, క్రూయిజర్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి యునైటెడ్, డెల్టా ఎయిర్లైన్స్ 9 శాతం చొప్పున దూసుకెళ్లగా.. కార్నివాల్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్, రాయల్ కరిబియన్ 10-5 శాతం మధ్య జంప్చేశాయి. ఈ బాటలో బోయింగ్ 6.5 శాతం జంప్చేసింది. ఇక ఫాంగ్ స్టాక్స్లో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్ 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తొలిసారి 503 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2 శాతం క్షీణించింది. ఆసియా లాభాల్లో యూఎస్ ఇండెక్సుల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ 1.8-0.5 శాతం మధ్య జంప్ చేశాయి. ఇతర మార్కెట్లలో థాయ్లాండ్, చైనా 0.5-0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
కుప్పకూలిన యూఎస్ మార్కెట్లు
పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు షాక్ తగిలింది. వెరసి గురువారం యూఎస్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్ 1862 పాయింట్లు(7 శాతం) కుప్పకూలి 25,128 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 188 పాయింట్లు(6 శాతం) పడిపోయి 3,002 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 528 పాయింట్లు(5.3 శాతం) క్షీణించి 9,493 వద్ద స్థిరపడింది. తద్వారా మార్కెట్లు ఏప్రిల్ 16 తదుపరి ఒకే రోజులో అత్యధిక నష్టాలు చవిచూశాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లు సైతం గురువారం 4.5 శాతం స్థాయిలో పతనంకావడం గమనార్హం! మరోసారి లాక్డవున్ ఇప్పటికే 20 లక్షల మందికిపైగా సోకిన కరోనా వైరస్ మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇటీవల తలెత్తుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా మరోసారి లాక్డవున్ విధించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నట్లు తెలియజేశారు. దీనికితోడు అమెరికా జీడీపీ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు వివరించారు. కోవిడ్-19 కారణంగా సెప్టెంబర్కల్లా మరణాల సంఖ్య 2 లక్షలను దాటవచ్చన్న అంచనాలు సైతం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. బోయింగ్ పతనం వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ ఇంక్ షేరు దాదాపు 17 శాతం కుప్పకూలగా.. క్రూయిజర్, ఎయిర్లైన్ కంపెనీల కౌంటర్లలో గురువారం మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. రాయల్ కరిబ్బియన్, ఎస్పీ కామెయిర్ 14 శాతం చొప్పున పతనంకాగా.. నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 16.5 శాతం పడిపోయింది. ఇతర బ్లూచిప్స్లో డోఇంక్, ఐబీఎం, గోల్డ్మన్ శాక్స్, కేటర్పిల్లర్, ఎక్సాన్ మొబిల్, జేపీ మోర్గాన్, సిస్కో, ఫైజర్, వాల్ట్డిస్నీ, అమెరికన్ ఎక్స్ప్రెస్, నైక్, ఇంటెల్, కోక కోలా, మెర్క్, మైక్రోసాఫ్ట్, యాపిల్, జాన్సన్ అండ్ జాన్సన్ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. -
12 వేల మందిని తొలగించనున్న బోయింగ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది. రాబోయే కొద్ది నెలల్లో అనేక వేల ఉద్యోగాలను తొలగించనున్నామని బోయింగ్ ప్రతినిధి బుధవారం తెలిపారు. అయితే ఎంతమంది అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కోవిడ్-19 మహమ్మారి వైమానిక పరిశ్రమను ఘోరంగా దెబ్బతీసిందని, దీంతో రాబోయే కొన్నేళ్లలో వాణిజ్య జెట్ల తయారీని బాగా తగ్గించనున్నామని బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ ఉద్యోగులకు అందించిన సమాచారంలో తెలిపారు. 6770 అమెరికా ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తామనీ, మరో 5,520 మంది స్వచ్ఛందంగా సంస్థను వీడడానికి అంగీకరించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకుంటామని డేవిడ్ చెప్పారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు) మరోవైపు ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే విమాన ప్రయాణీకుల సంఖ్య 89 శాతం తగ్గిందని ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం వెల్లడించింది. కాగా లాక్డౌన్ కఠిన ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు స్థంబించిపోయాయి. ప్రస్తుతం కాస్త పుంజుకున్నప్పటికీ, అమెరికాలో విమానయాన రంగ ఆదాయం ఏప్రిల్ మధ్య కాలంలో 96 శాతం పడిపోయింది. -
రాష్ట్రంలో ‘బోయింగ్’ కార్యకలాపాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్ ఇంటర్నేషనల్’భవిష్యత్తులో రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉన్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆ సంస్థ అధ్యక్షుడు మైఖేల్ ఆర్థర్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలిల్ గుప్తే, ఎండీ సురేంద్ర అహుజా, డైరెక్టర్ అశ్వినీ భార్గవ తదితరులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సోమవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ప్రత్యేకతలతో పాటు, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బోయింగ్ ఇంటర్నేషనల్ బృందంతో కేటీఆర్ చర్చించారు. గత ఐదేళ్లలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. బోయింగ్ సంస్థకు చెందిన టెక్నాలజీ, ఇంజనీరింగ్ డివిజన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ హైదరాబాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇందులో బోయింగ్ సంస్థ కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
బోయింగ్ సీఈవో డెనిస్కు ఉద్వాసన
న్యూయార్క్: మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ల వివాదం కారణంగా ప్రతిష్ట మసకబారడంతో .. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డెనిస్ ములెన్బర్గ్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం బోర్డ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న డేవిడ్ కాలోన్కు సీఈవో, ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. నియంత్రణ సంస్థలు, కస్టమర్లు, ఇతర వర్గాలతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు, వారి విశ్వాసం చూరగొనేందుకు ఈ మార్పులు అవసరమని బోయింగ్ పేర్కొంది. పూర్తి పారదర్శకంగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం డెనిస్ ములెన్బర్గ్ తక్షణమే పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న కాలొన్ కొత్త బాధ్యతలు చేపడతారని బోయింగ్ తెలిపింది. ఈలోగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గ్రెగ్ స్మిత్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని వివరించింది. 737 మ్యాక్స్ రకానికి చెందిన రెండు విమానాలు కుప్పకూలడంతో ఈ విమానాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
నేలకు దిగిన బోయింగ్ ఆశలు!
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్ కంపెనీ స్టార్లైనర్ క్రూ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌక ఆదివారం న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది. అయితే అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే వెనుదిరిగి రావడంతో వచ్చే ఏడాది వ్యోమగాములతో చేయాల్సిన ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్లు తెరుచుకోవడంతోపాటు ఎయిర్బ్యాగులు కూడా సరిగా పనిచేయడం వల్ల సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. వారం రోజులకు పైగా అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన నౌక.. కేవలం ప్రయోగించిన రెండు రోజులకే వెనుదిరగాల్సి వచ్చింది. సురక్షిత ల్యాండింగ్ కావడం కొంతమేర సానుకూల అంశం. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్లైనర్ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ప్రయోగించారు. అట్లాస్–5 రాకెట్తో నింగిలోకి ఎగిరిన స్టార్లైనర్ 15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్ ట్వీట్ చేసింది. దాన్ని సరైన కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో తాము నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్లైనర్ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో తాజా వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కానుంది. వచ్చే ఏడాది స్టార్లైనర్ కాప్సూ్యల్లో ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు బోయింగ్ సన్నాహాలు చేస్తోంది. -
వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం
న్యూఢిల్లీ: పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ దృష్యా వచ్చే 20 ఏళ్లలో భారత్కు 2,400 నూతన ఎయిర్క్రాఫ్ట్స్ అవసరం ఉందని గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ అంచనా వేసింది. వీటిలో 85–90 శాతం వరకు నారో–బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ (737 సైజ్, సింగిల్–ఏసిల్ విమానాలు) వినియోగం ఉండనుందని సంస్థ మార్కెటింగ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హల్ట్స్ అన్నారు. వ్యాపార అభివృద్ధి, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి ఆధారంగా ఈ అంచనాను వెల్లడించినట్లు చెప్పారు. ఇక ప్రస్తుత భారత విమానయానంలో 600 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. -
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
-
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్ చేరాయి. పఠాన్కోట్ ఎయిర్బేస్లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్ యూనిట్ ’గ్లాడియేటర్స్’ ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ పరిశీలించారు. అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్తో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్ భారత్కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్ కోట్ ఎయిర్బేస్లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది. -
‘ఎయిర్ట్రాఫిక్’పై ఏఏఐ, బోయింగ్ జట్టు
న్యూఢిల్లీ: భారత్లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)తో కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు బోయింగ్ తెలియజేసింది. ఈ రోడ్మ్యాప్ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ) నిధులతో దీన్ని చేపట్టనున్నామని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏఏఐ నేతృత్వంలో 125 విమానాశ్రయాలను కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా, స్థానికంగా ఉన్న అత్యుత్తమ ప్రమాణాలకు లోబడి జాతీయ ఎయిర్స్పేస్ వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ రోడ్మ్యాప్ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఎయిర్స్పేస్ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకునేలా, కమ్యూనికేషన్స్ను పెంచడం, నిఘా, విమానాల రద్దీ నియంత్రణలోనూ ఈ రోడ్మ్యాప్ ఉపకరిస్తుందని బోయింగ్ పేర్కొంది. ఈ విషయంలో డీజీసీఏతోనూ కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆధునిక టెక్నాలజీలు, అంతర్జాతీయ విధానాలను అమలు చేయడం ద్వారా భారత్ తన గగనతల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోగలదని ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ మొహపాత్రా పేర్కొన్నారు. -
బోయింగ్కి చైనా షాక్
-
భారత్కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు మొదటి దఫా అందాల్సిన నాలుగు చినూక్ సైనిక హెలికాప్టర్లు భారత్కు చేరాయి. గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి ఆదివారం చేరిన నాలుగు సీహెచ్47ఎఫ్(ఐ) రకం హెలికాప్టర్లను త్వరలోనే చండీగఢ్ ఐఏఎఫ్ స్థావరానికి తరలిస్తామని బోయింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బలగాలను, సైనిక సామగ్రిని, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఇవి ఎంతో అనుకూలమైనవి. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్ హెలికాప్టర్లను భారత్కు బోయింగ్ సమకూర్చాల్సి ఉంది. -
ఎగిరే కారు వచ్చేస్తోంది!
చికాగో: ఇటీవల శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా ఎగిరే కార్ల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం రోడ్లపై కార్లు ఏ విధంగానైతే పరుగులు పెడుతున్నాయో ఇంకొన్నేళ్లలోనే గాల్లో ఎగిరే కార్లనూ చూడనున్నామనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేసే దిశగా తొలి అడుగు పడింది. ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్.. గాల్లో ఎగిరే కారును తొలిసారి తయారుచేసింది. అంతేకాదు, బోయింగ్ ప్రోటోటైప్ అనే ఈ ఎగిరే కారును విజయవంతంగా పరీక్షించింది కూడా. దీంతో ఇకపై పట్టణాల్లో రవాణా, డెలివరీ సేవలు మరింత వేగమవుతాయని బోయింగ్ ప్రతినిధులు చెబుతున్నారు. -
నాసా టీమ్లో సునీతా విలియమ్స్
హూస్టన్: అగ్రరాజ్యం అమెరికా దాదాపు ఏడేళ్ల తర్వాత 2019లో మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టనుంది. ఇందులో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా 9 మంది ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ప్రైవేటు కంపెనీ బోయింగ్ రూపొందించిన సీఎస్టీ–100 స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వీరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి వచ్చే ఏడాది ఆరంభంలో చేర్చనున్నారు. ఈ రెండు కంపెనీలు నాసా సహకారంతో ఈ అంతరిక్ష నౌకల్ని అభివృద్ధి చేశాయి. ఈ వివరాలను శుక్రవారం నాడిక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు వ్యోమగాముల్ని, ఆహారపదార్థాలను చేరవేయనున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేముందు బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు తమ నౌకల్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. అలాగే ప్రమాద సమయంలో వ్యోమగాములు రాకెట్ నుంచి సురక్షితంగా బయటపడేసే అబార్ట్ వ్యవస్థ సమర్థతను కూడా ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. 1972, జనవరి 5న మొదలైన స్పేస్ షటిల్ కార్యక్రమం 2011 నాటికి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా సరికొత్త అంతరిక్ష వాహక నౌకల అభివృద్ధిపై దృష్టి సారించింది. -
న్యూలుక్లో ఎయిర్ఫోర్స్ వన్..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటన విమానం ఎయిర్ఫోర్స్ వన్ సరికొత్త రూపంలో దర్శనమివ్వనుంది. ఈమేరకు అమెరికా రక్షణా విభాగం ప్రఖ్యాత ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్తో 3.9 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీబీఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుల కోసం రెండు కొత్త ఎయిర్ ఫోర్స్ వన్లను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిని బోయింగ్ రూపొందించనున్నట్లు తెలిపారు. ‘కొత్తగా రూపొందించే ఎయిర్ఫోర్స్ వన్ చాలా అసామాన్యమైనది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది. ఇకపై ఎరుపు, తెలుపు, నీలం రంగుల కలయికతో దర్శనమివ్వబోతుందంటూ’ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ప్రయాణాల నిమిత్తం రూపొందించిన ఎయిర్ ఫోర్స్ వన్లో సకల సౌకర్యాలు కలిగి ఉండి అత్యాధునిక సాంకేతికతో అనుసంధానం చేయబడి ఉంటుంది. అత్యంత పటిష్టమైన ఈ విమానంలో అధ్యక్షుడితో అతికొద్ది మంది ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంటుంది. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కాలం నుంచి తెలుపు, నీలం రంగుల కలయికలో ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ను రూపాన్ని మార్చనున్నానమని శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. 2024 డిసెంబర్లోపు రెండు విమానాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపాయి. -
భారత్కు ఫైటర్లు : ముందంజలో బోయింగ్
న్యూయార్క్ : పెద్ద మొత్తంలో యుద్ద విమానాల కొనుగోలుకై భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీల్ కావడంతో.. దీనిని దక్కించుకోవడానికి అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా ఈ ప్రాజెక్టును తామే సొంతం చేసుకుంటామని ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ సీనియర్ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలోనే తాము భారత్కు కావాల్సిన యుద్ద విమానాలను అందిస్తామని పేర్కొన్నారు. బోయింగ్ డిఫెన్స్ సెల్స్ ఉపాధ్యక్షుడు జీన్ కన్నింగ్హమ్ కూడా భారత వైమానిక దళానికి 110 ఫైటర్ జెట్స్ అందించేందుకు జరుగుతున్న టెండర్ ప్రక్రియలో తాము ముందు వరుసలో ఉన్నట్టు పేర్కొన్నారు. సింగపూర్లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ఆయన.. తమకు భారత మార్కెట్పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పటికే భారత నావికా దళానికి 57 ఫైటర్ జెట్స్ను సరఫరా చేసేందుకు నిర్వహించిన ప్రక్రియలో తమ సంస్థ తుది జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు. భారత్ ప్రతిపాదించిన 110 యుద్ధ విమానాల తయారీ అంచనా వ్యయం 15 బిలియన్ డాలర్లు. ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ ఫైటర్ల తయారీకి దేశీయ సంస్థలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్తో కలసి పనిచేస్తామని గత ఏప్రిల్లోనే బోయింగ్ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు బోయింగ్, స్వీడన్కు చెందిన సాబ్తోపాటు ఇతర సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. -
టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలోని వైమానిక సెజ్లో టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెని గురువారం ప్రారంభమైంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కంపెనీని తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, ఎంపీలు కొండావిశ్వేశ్వర్రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్లో హెలికాప్టర్లకు, ఎస్ ఆర్మీ యుద్ధ హెలికాప్టర్ల విడిభాగాలు ఇక్కడ తయారుకానున్నాయి. ముఖ్యంగా బోయింగ్ ఏహెచ్ 64 విమానాల విడిభాగాలకు తోడు అపాచీ హెలికాప్టర్లను కూడా తయారుచేయనున్నారు. తద్వారా 350 మందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. కాగా విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బోయింగ్ సంస్థలు కలిసి టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేశాయి. -
నేడు ‘టాటా బోయింగ్’ ప్రారంభం
ఇబ్రహీంపట్నం రూరల్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో రూ. 400 కోట్లతో నెలకొల్పిన టాటా బోయింగ్ ఎయిరోస్పేస్ విమానాల తయారీ పరిశ్రమను గురువారం కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతోపాటే ఏహెచ్–64 బోయింగ్ విమానాలు, హెలికాప్టర్లకు ప్యూస్లేజ్ (ప్రధాన భాగాల)ను తయారు చేసే యూనిట్ కూడా ప్రారంభం కానుంది. ఈ పరిశ్రమకు 2016 జూన్ 19న నాటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఆదిబట్ల ఎయిరోస్పేస్ సెజ్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, టాటా లాకిడ్ మార్టిన్, టాటా సికోర్స్కై లాంటి సంస్థలు ఉన్నాయి. -
బోయింగ్ విమానం... హైపర్ స్పీడ్!
బోయింగ్ ఓ కొత్త విమానాన్ని అభివృద్ధి చేసింది. విమానాల కంపెనీ అవి కాకుండా ఇంకేం తయారు చేస్తుంది! అని ప్రశ్నిస్తున్నారా... కొంచెం ఆగండి.. ఈ కొత్త విమానం వివరాలు తెలిస్తే.. మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఈ కొత్త విమానం ప్రయాణించే వేగం అక్షరాలా గంటకు 3836 మైళ్లు! కిలోమీటర్లలో చెప్పాలంటే ఇది ఒక్క గంట ఎగిరితే హైదరాబాద్ నుంచి యూరప్లోని ఫ్రాంక్ఫర్ట్కు వెళ్లిపోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ విమానం మూడంటే మూడు గంటల్లో భూమిని చుట్టేయగలదు. అతివేగం ప్రమాదకరం కాదా? అంటే.. అబ్బే! ఇది ప్రయాణికుల కోసం కాదులెండి... అంటోంది బోయింగ్. భూమి మీద ఏ మూల నుంచైనా ముప్పు ఉందన్న అనుమానం వస్తే నిమిషాల్లో వాలిపోయేందుకు, జవాబు చెప్పేందుకు మిలటరీ వర్గాలకు ఇలాంటి విమానం అవసరం అంటోంది. ‘సన్ ఆఫ్ బ్లాక్ బర్డ్’ అని పిలుస్తున్న బోయింగ్ కొత్త విమానం ఇప్పటివరకూ ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించేదిగా పేరు పొందిన కంకార్డ్ కంటే రెట్టింపు వేగంతో వెళుతుంది. బోయింగ్కు పోటీగా లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ కూడా ఇలాంటి సూపర్ స్పీడ్ విహంగాల తయారీకి ప్రయత్నిస్తోంది. -
భారతీయ నేవీకి ఎఫ్/ఏ-18 హార్నెట్ జెట్లు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్/ఏ-18 హార్నెట్ జెట్లను భారత్కు అమ్మేందుకు విమాన తయారీ సంస్థ బోయింగ్ నేవీ అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే, సాంకేతిక అంశాలపై ఇంకా చర్చ జరగాల్సివుందని బోయింగ్ ఉపాధ్యక్షుడు సింగపూర్ ఎయిర్ షోలో పేర్కొన్నారు. హార్నెట్ జెట్తో పాటు కేసీ-46 మల్టీరోల్ ట్యాంకర్ విమానాలను కూడా భారత్కు విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు. గతేడాది భారతీయ నేవీ 57 ఫైటర్ జెట్లు, భారతీయ వాయుసేన 100 ఫైటర్ జెట్ల కొనుగోలు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయింగ్, సాబ్ ఏబీ జెట్ల తయారీ సంస్థలు భారత్కు ఫైటర్లను అమ్మేందుకు ఆసక్తిని చూపాయి. ఈ రెండు సంస్థలతో కొనుగోలు ఒప్పందం కుదిరితే ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఫైటర్ జెట్ల కొనుగోలు ఆర్డర్ అవుతుంది. -
38 వేల అడుగుల ఎత్తు నుంచి ఫొటోలు
సాక్షి, వెబ్ డెస్క్ : ఒక్క చిత్రంతో వంద మాటలను పలికించొచ్చని అంటారు. 38 వేల అడుగుల ఎత్తు నుంచి భూమి, ఆకాశ అందాల చిత్రాలను కెమెరాలో బంధించి అబ్బా అనిపించారు ప్రముఖ ఫొటోగ్రాఫర్ క్రిస్టియన్. బోయింగ్ 747-8 విమానంలో పైలట్తో పాటు కాక్పిట్లో కూర్చొని ప్రయాణించిన క్రిస్టియన్ కళ్లు మిరుమిట్లు గొలిపే చిత్రాలను తీశారు. ఆ తీసిన ఫొటోలు బాగా పాపులర్ అయ్యాయి. మరి వాటిపై ఓ లుక్కేయండి. అలస్కాలో సూర్యాస్తమయ సమయంలో తీసిన చిత్రమిది మంగోలియాలో సూర్యస్తమయ సమయంలో తీసిన పర్వతాల ఫొటో ఇది. చంద్రుని కాంతిలో మిరుమిట్లు గొలుపుతున్న మంగోలియా ఉత్తర ధ్రువం నుంచి వస్తున్న అద్భుత వెలుగును క్రిస్టియన్ తన కెమెరాలో ఇలా బంధించారు. -
బోయింగ్ ఇండియాలో ఉద్యోగాలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ దేశంలో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఏరోస్పేస్ పరిశ్రమలో పెరుగుతున్న వృద్ధిపై కన్నేసిన సంస్థ దేశంలో మరింతగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా నియామకాలకు తెరతీసింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరో స్పేస్ పరిశ్రమలో మరింత విస్తరించడానికి విమానాలు , ఇతర సంబంధిత సామగ్రి తయారీ అమెరికా కంపెనీ బోయింగ్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రాబోయే రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 800 మంది డైరెక్ట్ ఉద్యోగులను నియమించుకోనున్నామని బోయింగ్ సీనియర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. టాప్ ఇంజనీర్లనుంచి ఫాక్టరీ కార్మికులతో పాటు హెచ్ ఆర్ లాంటి ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ప్రస్తుతం బోయింగ్ ఇండియా కంపెనీలో భారతదేశంలోని భాగస్వాముల సంస్థల ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారు 7వేలమంది ఉన్నారు. వీరిలో 1,200 మంది ప్రత్యక్ష ఉద్యోగులు . అయితే ఈ ఏడాది చివరినాటికి వీరి సంఖ్య 15వందలకు పెరగవచ్చని తెలిపింది. అలాగే భాగస్వామ్య సంస్థల సంఖ్యకూడా పెంచుకోనున్నామనీ... తద్వారా ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. అంతరిక్షంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలకు ఇండియాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్టోబర్లో ప్రచురించబడిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) నివేదిక ప్రకారం, ఊహించిన దాని కంటే ఎక్కువగా 2025 నాటికి మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా నిలవనుంది -
స్పైస్జెట్తో బోయింగ్ ఒప్పందం
♦ 40 విమానాల తయారీ కోసం ఎంవోయూ ♦ 4.7 బిలియన్ డాలర్ల విలువ ముంబై: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్జెట్ తాజాగా విమానాల తయారీ దిగ్గజం బోయింగ్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్పైస్జెట్.. ’737 మ్యాక్స్ 10’ విమానాలు నలభై కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధరల ప్రకారం ఈ డీల్ విలువ సుమారు 4.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 30వేల కోట్లు) ఉండనుంది. సోమవారం ప్రారంభమైన ప్యారిస్ ఎయిర్షో సందర్భంగా కుదిరిన ఎంవోయూ ప్రకారం.. రెండు ఆర్డర్ల కింద ఈ విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. 737 శ్రేణిలో కొత్త వెర్షన్ను ఆర్డరు చేసిన తొలి భారతీయ సంస్థ తమదేనని స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. వ్యయాలు తగ్గించుకునేందుకు, ఆదాయాలు మెరుగుపర్చుకునేందుకు ఈ విమానాలు ఉపయోగపడగలవని వివరించారు. వచ్చే ఏడాది కొత్త 737 విమానాల రాకతో తమ నెట్వర్క్ను మరింతగా విస్తరించగలమన్నారు. బోయింగ్ నుంచి సుమారు 22 బిలియన్ డాలర్ల విలువ చేసే కొత్త ఎయిర్క్రాఫ్ట్లు 205 దాకా (2014లో ఇచ్చిన 55 విమానాల ఆర్డరుతో సహా) కొనుగోలు చేయనున్నట్లు స్పైస్జెట్ ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం స్పైస్జెట్కి 55 విమానాలు ఉన్నాయి. -
స్పైస్ జెట్ మెగా ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మధ్య కాలంలో భారీ విస్తరణకు శ్రీకారంచుట్టిన ఎయిర్ లైన్స్ 205 బోయింగ్ విమానాల కొనుగోలుకు సుమారు 23బిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకునట్టు శుక్రవారం వెల్లడించింది. దేశీయ విమానయాన రంగాన్ని మరో మెట్టెక్కించేలా దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలతో ఈ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపింది. సంస్థ చైర్మన్, అండ్ ఎండీ, అజయ్ సింగ్ ఈ ఒప్పంద వివరాలను స్వయంగా ప్రకటించారు. ఈ డీల్ లో భాగంగా ముఖ్యంగా 155 బోయింగ్ 737-8 మ్యాక్స్, 50 డ్రీమ్ లైనర్, బీ-737ఎస్ విమానాలను దశలవారీగా అందుకోనున్నామని అజయ్ సింగ్ తెలిపారు. గడచిన ఏడు త్రైమాసికాలుగా స్పైస్ జెట్ లాభాల్లో నడుస్తోందని, 20 నెలలుగా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్ తో సాగుతున్నామని వివరించారు. మరోవైపు ఈడీల్ ను దేశంలోనే ఎయిర్ లైన్స్ సంస్థలు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ గా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే గో ఎయిర్ , ఇండిగో లాంటి సంస్థలతో కొనుగోలు ఒప్పందాలుచేసుకున్న బోయింగ్ సంస్థకు భారత్ లో మంచి జోష్ నిస్తుందని భావిస్తున్నారు. కాగా, బోయింగ్ కు పోటీగా ఉన్న సంస్థ ఎయిర్ బస్ కు భారత అతిపెద్ద బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోతో పాటు, గో ఎయిర్ నుంచి ఇప్పటికే భారీ డీల్స్ వెళ్లిన నేపథ్యంలో ఈ డీల్ తాము ఇండియాలో మరింతగా విస్తరించేందుకు ఉపకరిస్తుందని బోయింగ్ భావిస్తోంది. ముడిచమురు ధరల పతనం కారణంగా, విమాన ఇంధన ధరలు, ఆపై ప్రయాణ టికెట్ ధరలు తగ్గడంతో సాలీనా ప్రయాణికుల వృద్ధి 20 శాతంగా ఉంది. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే.