Chanchalguda Central Prison
-
చంచల్గూడ జైలు నుంచి తిరుపతన్న విడుదల
సాక్షి,హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో పదినెలల తర్వాత తిరుపతన్న బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. -
కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్ సాధించిందేమిటి?
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్కు కారణమా? అల్లూ అర్జున్ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్ అరెస్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్లో చంచల్గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే, శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్నే అరెస్ట్ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ ప్రభుత్వం అర్జున్ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అర్జున్ అరెస్ట్ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్గా చెబుతున్నారు. పోలీసులు అర్జున్ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది తప్ప మిగిలిన సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్ స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్కు వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన రోజున రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
జైలు ముందు ఆత్మహత్యా యత్నం చేసిన అభిమాని
సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చినా సరే రాత్రంతా చంచల్గూడ జైలులోనే ఉంచారు. తమ అభిమాన హీరోని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బన్నీ అభిమాని ఒకరు.. జైలు బయట వీరంగం సృష్టించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు సకాలంలో స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.(ఇదీ చదవండి:కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)శుక్రవారం ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్కి.. 4 వారాల మధ్యంతర బెయిల్ లభించింది. దీంతో శనివారం ఉదయం 6:45 చంచల్గూడ జైలు నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉండి ఇంటికెళ్లాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. కేసు కోర్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం తానే మాట్లాడనని చెప్పాడు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు.తాను బాగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ చెప్పాడు. మరణించిన రేవతి కుటుంబానికి నా సానుభూతి, అనుకోకుండా జరిగిన సంఘటన ఇదని, నిజంగా అలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. బన్నీ ఇంటికొచ్చేసిన నేపథ్యంలో సుకుమార్, నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, హీరో విజయ్ దేవరకొండ తదితరులు వచ్చి పలకరించారు.(ఇదీ చదవండి: అరెస్ట్ వెనకున్నోళ్లు సర్వనాశనం అయిపోతారు: రైటర్ చిన్నికృష్ణ) -
హీరో అల్లు అర్జున్ విడుదల
-
అల్లు అర్జున్ రిలీజ్ పై ఉత్కంఠ
-
జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
సాక్షి, హైదరాబాద్: చంచల్గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదల సందర్బంగా సెక్యూరిటీ కారణాల రీత్యా.. అల్లు అర్జున్ వెనుక జైలు వేనుక గేటు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి కాసేపట్లో తన ఇంటికి బయలుదేరనున్నారు. మరోవైపు.. అల్లు అర్జున్ ఇంటి వద్దకు సినీ ప్రముఖ్యులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విడుదల సమయంలో లాయర్లతో పాటుగా అల్లు అరవింద్ కూడా జైలుకు వెళ్లారు. దగ్గరుండి అల్లు అర్జున్ను తన వెంట తీసుకొచ్చారు. ఇక, శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం సభ్యులు కూడా విడుదలయ్యారు. A1, A2తో పాటు A11.. ముగ్గురు బెయిల్పై విడుదలయ్యారు.Vachestunnadu 🥺🙏pic.twitter.com/GbSVWaXVT6— Allu Arjun Taruvate Evadina (@AATEofficial) December 14, 2024 అంతకుముందు జరిగింది ఇదీ..పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అల్లు అర్జున్ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది.రిమాండ్ ఖైదీ నంబర్ 7697తో.. అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు సరి్టఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు.రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్లోని క్లాస్–1 రూమ్కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు.ఎప్పుడేం జరిగిందీ..ఉదయం 11.45: అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్కు చెప్పిన పోలీసులు 12.20: జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు 12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు 1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్తో చేరుకున్న పోలీసులు 1.10: పోలీసుస్టేషన్ వద్దకు అల్లు శిరీష్, అరవింద్ 1.15: రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి 2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు 2.19: అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు 2.30: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ 2.45: అల్లు అర్జున్కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి 3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.. లాయర్ల వాదనలు 5.00: అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు 5.28: చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు 5.40: అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 7.15: బెయిల్ పేపర్లతో చంచల్గూడ జైలుకు చేరుకున్న లాయర్లు 7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్ని 10.00: జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్కు అల్లు అర్జున్ -
బెయిల్పై భానుకిరణ్ విడుదల
చంచల్గూడ (హైదరాబాద్): హైదరాబాద్లో 2011 జరిగిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుడు భానుకిరణ్ బుధవారం బెయిల్పై చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ హత్య కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తెలిసిందే. చర్లపల్లి జైల్లో ఉన్న భానుని 2016లో చంచల్గూడ జైలుకు తరలించారు. బెయిల్పై విడుదలైన భానును.. అత్యంత పటిష్ట భద్రత మధ్య అతని అనుచరులు మరో చోటికి తరలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడేందుకు భాను నిరాకరించాడు. అతని అనుచరుడు మన్మోహన్ ఏడేళ్ల శిక్ష పూర్తి చేసుకుని 2018లో విడుదలయ్యాడు. -
జానీ భార్య అయేషా అరెస్ట్కు రంగం సిద్ధం?
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ బాషాకు కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జానీ బాషాను చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు. ఇక, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు.జానీ బాషా లైంగిక వేధింపులకు పాల్పడిన విషయంలో తన నేరాన్ని ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అలాగే, దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్గా చేర్చుకున్నాడు. 2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్లో తెలిపారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది.షూటింగ్ సమయంలో కూడా వ్యాన్లోనే ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అందుకు ఆమె నిరాకరిస్తే జుట్టు పట్టుకుని బాధితురాలి తలను అద్దానికేసి కొట్టాడు. మత మార్పిడి సైతం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్య సుమలత(అలియాస్ ఆయేషా)పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంగా సుమలతపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: అభయ్ నోటిదురుసు వల్ల అందరికీ నష్టం.. అర్ధరాత్రి బిగ్బాస్ వార్నింగ్ -
రాధాకిషన్ రావును కరిచిన ‘పిల్లి’.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ టాస్కో ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ‘పిల్లి’కరిచింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్త్రావమైంది. సమాచారం అందుకున్న జైలు అధికారులు అత్యవసర చికిత్స కోసం రాధాకిషన్ రావును నారాయణ గూడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
బిగ్బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్తో పాటు సోదరుడు మనోహర్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తానని పేర్కొన్నారు.ఎందుకు అకారణంగా తనను రోజుల తరబడి హౌజ్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. బోనులో పెట్టినా పులి..పులే.. నేను రాజశేఖర్రెడ్డి బిడ్డనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరాచకాలు ఇంక ఎంతకాలం సహించాలని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు బెదిరించారని.. తన ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేసినట్లు పేర్కొన్నారు. ఎవరిమీద చేయి చేసుకోలేదని అన్నారు. పోలీసులు ఏ అధికారం ఉందని తనను హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిట్ ఆఫీస్కు సామాన్యుడికి పోయే పరిస్థితి లేదా? అని నిలదీశారు. ఇక్కడున్నది రాజశేఖర్రెడ్డి బిడ్డ.. భయపడటం తెలీదన్నారు. ‘రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే నా మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఏం సాధించారు. కేసీఆర్కు పరిపాలన చేతనైందా. అవినీతి చేయడం చేతనైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్కు చేతనైంది. కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్కు వెళ్లారా? కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కొడుకు రియల్ ఎస్టేట్, కుమార్తె లిక్కర్స్కాం, చేయడం సాధ్యమైంది. వేలకోట్ల అవినీతి సొమ్ము సంపాదించడమే తెలిసింది. తాలిబన్లలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇది అప్ఘనిస్తాన్ అనకపోతే ఏమనాలి. వైఎస్సార్టీపీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసులకు తెలియదా? పోలీసులు నాపై పడి దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. నాపై మళ్లీ దాడి చేస్తారనే ఉద్ధేశంతోనే పోలీసులను తోసేశాను. పోలీసులు కేసీఆర్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నన్ను చూడటానికి అమ్మ వస్తే అది తప్పా? అమ్మతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.’ అని షర్మిల పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన! -
TSPSC పేపర్ లీక్ కేసులో ఇద్దరికి ఈడీ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి లభించింది. రెండు రోజులపాటు వాళ్లను కస్టడీకిలోకి తీసుకుని విచారించొచ్చని కోర్టు ఈడీ అధికారులకు తెలిపింది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్లను ఈడీ ప్రశ్నించేందుకు అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ మేరకు ఈ నెల 17, 18 తేదీల్లో.. అదీ చంచల్గూడ జైల్లోనే ఇద్దరిని ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతించాలంటూ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈడీ. ఈ మేరకు జైల్లోనే నిందితులను విచారించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. ఆ విజ్ఞప్తికి కోర్టు అనుకూలంగా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
చంచల్గూడ జైలుకు నిహారిక
సాక్షి, క్రైమ్: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్లను ఏ2, ఏ3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్గూడ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హాసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్ఫర్ కూడా చేసింది. నవీన్ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది. -
చంచల్గూడ జైలు నుంచి మోహిత్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
-
డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మోహిత్ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్గూడ జైలు నుంచి మోహిత్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. గోవా కింగ్ పిన్ ఎడ్విన్తో మోహిత్కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్పాండే భర్త అరెస్ట్ -
నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ (ఏ–1), నందకుమార్ (ఏ–2), సింహయాజీ స్వామి (ఏ–3)లను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ వారు లొంగిపోని పక్షంలో పోలీసులు అరెస్టు చేయవచ్చని తెలిపింది. ఈ నెల 27వ తేదీన ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు. సరూర్నగర్లోని ఏసీబీ కోర్టు జడ్జి ఇంట్లో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్పై హైకోర్టు విచారణ.. ఈనెల 26న రాత్రి మొయినాబాద్ అజీజ్నగర్లోని ఫామ్హౌస్పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే భౌతికంగా నగదు పట్టుబడకపోవటంతో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును జడ్జి తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్పై జస్టిస్ సీహెచ్ సుమలత విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, నిందితుల తరఫున న్యాయమూర్తి ఇమ్మనేని రామారావు వాదనలు వినిపించారు. నిందితుల వెనుక పెద్దలెవరో నిగ్గు తేల్చాల్సి ఉంది: ఏజీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్ అవసరం. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు ఫామ్హౌస్లో సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన తర్వాత దాడి చేసి రెడ్హ్యాండెడ్గా వారిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది. కిందికోర్టు రిమాండ్కు తరలింపునకు ఉత్తర్వులు జారీ చేయకపోవడం చెల్లదు. నిందితులను రిమాండ్కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి, రోహిత్రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారనేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. నిందితుల ముగ్గురి వెనుక ఉన్న కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉంది. నిందితులను రిమాండ్కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది..’ అని ఏజీ నివేదించారు. సివిల్ పోలీసులకు దర్యాప్తు అధికారం లేదు.. రామారావు వాదనలు వినిపిస్తూ.. ‘ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారు. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్కు పంపడం చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పుల ప్రకారం 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిందే. అసలు అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఈ కేసు నమోదు, దర్యాప్తు చేసే అధికారం సివిల్ పోలీసులకు లేదు..’ అని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులను లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు లొంగిపోయినా, పోలీసులు అరెస్టు చేసినా జ్యుడీషియల్ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఆర్పీసీ సెక్షన్లు 50–ఏ, 51, 54,55, 56, 57లను పాటించాలని స్పష్టం చేశారు నందకుమార్ ఇంట్లో అరెస్టు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో షేక్పేటలోని ఆదిత్యా హిల్టాప్ అపార్ట్మెంట్లోని నందకుమార్ ఇంట్లో ముగ్గుర్నీ అరెస్టు చేసిన పోలీసులు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. కాసేపటి తర్వాత మెయినాబాద్ ఠాణాకు తరలించి, మరోసారి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇక్కడే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. నిందితులు ఇక్కడ ఉన్నంత వరకు పోలీసులు మీడియాతో పాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల తర్వాత తిరిగి మెయినాబాద్ పీఎస్కు తీసుకొచ్చారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగియడంతో సరూర్నగర్లోని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. నిందితుల ఆరోగ్యం దృష్ట్యా రిమాండ్కు అనుమతించొద్దని వారి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి, జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు అయ్యేందుకు వాహనం ఎక్కిన నిందితుల ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులకు సింహయాజి చెయ్యి ఊపుతూ టాటా చెప్పారు. మునుగోడు ఎన్నికల తర్వాతే కస్టడీ.. కేసు తదుపరి దర్యాప్తును మునుగోడు ఎన్నికల తర్వాతే చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని భావించిన సైబరాబాద్ పోలీసులకు బ్రేక్ పడినట్లయింది. నవంబర్ 4 తర్వాత కస్టడీ పిటిషన్ను సిద్ధం చేస్తామని, కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఫామ్హౌస్ సమావేశంపై శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్నగర్లోని డెక్కన్ కిచెన్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు నందకుమార్ ఏర్పాట్లు చేశారు. కానీ ఈలోగా హైకోర్టు అరెస్టు ఆదేశాలు ఇవ్వటంతో అది జరగలేదు. -
అంతా నిరుపేద కుటుంబాల వారే...
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం కేసులో అరెస్టు అయిన 45 మంది నిందితుల్లో దాదాపు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని జైలు అధికారులు చెప్తున్నారు. సోమవారం 28 మంది నిందితుల తల్లిదండ్రులు చంచల్గూడ జైలు వద్దకు వచ్చి ములాఖత్ ద్వారా తమ కుమారులను కలిశారు. నిందితుల్లో ఒకరు సింగరేణి ఉద్యోగి కుమారుడు కాగా, మరొకరు ఆర్టీసీ ఉద్యోగి కుమారుడని గుర్తించారు. ఈ ఇద్దరూ మినహా మిగిలిన 26 మంది నిందితులూ బెయిల్ కోసం న్యాయవాదుల ఖర్చులు కూడా భరించలేరని పేద కుటుంబాలకు చెందిన వారని అంటున్నారు. తమ కుమారులు ఇలాంటి ఆందోళన, విధ్వంసం చేయడానికి సికింద్రాబాద్ వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని, కోచింగ్ కోసం వెళ్తున్నట్లు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అమాయకులను అరెస్టు చేశారు శుక్రవారం గణేష్ ఎక్కడకు వెళ్లాడో మాకు తెలీదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రి 11 గంటలకు ఎస్సై ఫోన్ చేసి బాబు మా దగ్గర ఉన్నాడని, అతడి ఆధార్ నంబర్ పంపమని చెప్పారు. ఎక్కడ ఉన్నాడని అడిగితే సికింద్రాబాద్ కేసులో పట్టుకున్నామన్నారు. మా బాబు రైల్వేస్టేషన్ గోడ అవతలే ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు పట్టుకున్నారు. అసలు నిందితులు దొరక్కపోవడంతో వాళ్ల ఉద్యోగాల కోసం పోలీసులు అమాయకుల్ని అరెస్టు చేశారు. ములాఖత్లో కలిసినప్పుడు మా అబ్బా యి ఇదే చెప్తున్నాడు. మేము స్టేషన్లోకి వెళ్లలేదు... స్టేషన్ గోడ అవతలే పట్టుకుని అరెస్టు చేశారని ఏడుస్తున్నాడు. – అంజయ్య కసారాం, నిందితుడు గణేష్ తండ్రి, సంగారెడ్డి జిల్లా లాయర్ని మాట్లాడుకోవడానికి డబ్బుల్లేవ్ మా పిల్లలు చేయని నేరానికి జైలు పాలయ్యారు. లాయర్ని మాట్లాడుకోవడానికీ డబ్బులు లేవు. దయచేసి మా పిల్లల్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని చేతులెత్తి మొక్కుతున్నా. మా పిల్లలను కాపాడాలని కేసీఆర్, కేటీఆర్లకు విన్నవించుకుంటున్నా. ఇప్పటికే జైలు పాలైన వారి జీవితం నాశనమైంది. మహేందర్ అరెస్టు విషయం తెలిసి మూడు రోజుల క్రితం ఊరి నుంచి రూ.2 వేలు తెచ్చా. ఇప్పుడు ఖర్చులకూ డబ్బుల్లేవు. దీంతో బస్టాండులో పడుకుంటున్నా. ఆర్మీలో చేరాలనేది మా వాడి ఐదేళ్ల కల. ఇప్పుడు అది కలగానే మిగిలిపోయింది. విద్యార్థుల వల్లే వచ్చిన తెలంగాణలో వాళ్లే జైలు పాలవుతారని అనుకోలేదు. మా పిల్లలు ఆర్మీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్తున్నారు. – సాయప్ప, నిందితుడు మహేందర్ మామ, రాంపూర్ గ్రామం, తాండూరు -
తమ పిల్లలకు ఏ పాపం తెలియదంటూ కన్నీరుమున్నిరు
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
ఎట్టకేలకు ములాఖత్కు రాహుల్ గాంధీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు ఎట్టకేలకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి అనుమతి దొరికింది. ములాఖత్కు అనుమతించాలని మరోసారి విజ్క్షప్తి చేయండంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ ధృవీకరించారు. రాహుల్తో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. శనివారం మధ్యాహ్నాం సమయంలో జైల్లో ఉన్న పద్దెనిమిది మంది ఎన్ఎస్యూఐ నేతలను ముగ్గురు కీలక నేతలు పరామర్శిస్తారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నిరసనలు చేపట్టగా.. పోలీసులు వాళ్లందరినీ అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. -
రాహుల్ తెలంగాణ టూర్లో మరో షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టూర్కి మరో షాక్ తగిలింది. చంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్కు అనుమతి లభించలేదు. చంచల్గూడ జైలు సూపరిండెంట్ ఈ మేరకు రాహుల్గాంధీ ఎన్ఎస్ఐయూ నేతలతో ములాఖత్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ మీటింగ్కు వీసీ అనుమతి ఇవ్వని సంగతి ఇదివరకే తెలిసిందే. ఈ క్రమంలో.. కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వీళ్లతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్ గాంధీని అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. అయినా అధికారులు అంగీకరించలేదు. మరోవైపు వరంగల్లో జరిగే రైతుల సంఘర్షణ సభకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఓరుగల్లుకు తరలిపోతున్నాయి. ఇంకోపక్క నల్లగొండ నుంచి అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఈ సభకు డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ఏ ముఖం పెట్టుకుని ఓయూ వెళతారు? -
శిల్పా చౌదరికి బెయిల్.. చంచల్గూడ జైలు నుంచి విడుదల
సాక్షి, మణికొండ: సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు పిలిచి, అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని వారిని నమ్మించి కోట్లు దండుకున్న శిల్పాచౌదరికి ఎట్టకేలకు రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఆమెపై ఉన్న 3 కేసులలోను బెయిలు మంజూరవడంతో శుక్రవారం విడుదలయ్యారు. శిల్పాచౌదరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10వేల రూపాయల చొప్పున ష్యూర్టీలు సమర్పించాలని చెప్పింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని .. నిబంధన విధించింది. ఎవరితోనూ ఫోన్లో కానీ, డైరెక్ట్గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని సాక్షులను బెదిరించరాదని కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతీ శనివారం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తెలిపింది. కాగా గతనెల 13న ఆమెపై దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 25వ తేదీన శిల్పను అరెస్టు చేసి 26న రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం 3 సార్లు కస్టడీకి తీసుకుని విచారించినా మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేసిందో మాత్రం నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్నగర్లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణల్లో పేర్కొంది. చదవండి: పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం? -
శిల్పా చౌదరికి రూ.11కోట్లు ఇచ్చిన ఆ బాధితురాలెవరు..?
సాక్షి, హైదరాబాద్: తన పేరు మీద గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్లో విల్లా నంబర్–17 మాత్రమే ఉందని కిట్టీ పార్టీలతో సంపన్న వర్గాల మహిళల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన తెల్ల శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్టుబడులు, అధిక వడ్డీల రూపంలో పలువురు బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును మరో మహిళకు ఇచ్చానని, ఆమె మోసం చేయడంతోనే ఈ ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. నగదు తీసుకున్న మహిళ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ల స్థిర, చరాస్తులపై విచారణాధికారులు, నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రెండ్రోజులు ఆరా తీసినట్టు తెలిసింది. వందల సంఖ్యలో బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలతో బినామీ పేర్లతో స్థలాలు కొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ కొన్నారు.. ఆస్తులు ఎవరి పేర్ల మీదు ఉన్నాయో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శిల్ప కస్టడీ శనివారం మధ్యాహ్నంతో ముగియడంతో ఆమెను తిరిగి చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. రూ.11 కోట్లు ఇచ్చిందెవరు? దివానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసిన శిల్ప.. హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో నెలలో రెండు సార్లు కిట్టీ పార్టీలు నిర్వహించేది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ. కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఒక్క బాధితురాలు మాత్రం రూ.11 కోట్లు ఇచ్చినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదన్నారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) బాధితులు వేలల్లో.. ఫిర్యాదులు మూడే! శిల్పా చౌదరి కాల్ డేటా ఆధారంగా ఆమె బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు మహిళా బాధితులే నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుప్పాలగూడలోని మహిళ వ్యాపారవేత్త దివ్యారెడ్డి (రూ.1.05 కోట్లు) ఫిర్యాదుతో శిల్ప బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సూపర్స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిణి (రూ.2.9 కోట్లు) ఫిర్యాదు చేసింది. మూడో బాధితురాలు నార్సింగికి చెందిన వ్యాపారవేత్త రోహిణి (రూ.3.1 కోట్లు) కేసు నమోదు చేసింది. వీళ్ల ముగ్గురు శిల్పకు ఇచ్చిన సొమ్ము రూ.7.05 కోట్లు. శిల్ప చెప్పేదంతా అవాస్తవం తాను వసూలు చేసిన మొత్తంలో రూ.6 కోట్లు జన్వాడకు చెందిన టంగుటూరి రాధికా రెడ్డికి ఇచ్చానని పోలీసులకు శిల్ప చెప్పినట్టు తెలిసింది. ఆమెను పోలీసులు విచారిచంగా శిల్ప చెప్పేదంతా అవాస్తవమని, ఆమెనే తన దగ్గర డబ్బులు తీసుకుందని రాధిక ఆరోపించింది. శిల్ప ఇచ్చిన చెక్కులు, ఇతర పత్రాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. -
శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్ను వైట్ చేసేందుకే ఇచ్చారా?
మణికొండ: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు గుంజిన శిల్పా చౌదరిని పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఆమెను 2 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఉప్పర్పల్లి కోర్టు అనుమతించడంతో శుక్రవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని పోలీసు స్టేషన్కు తీసుకొచ్చింది. తొలుత విచారణలో ఆమె పెద్దగా సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణాధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అయితే ఆమె ఫోన్ కాల్డాటా, వాట్సాప్ చాటింగ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లపై ప్రశ్నించడంతో విలపించినట్లు సమాచారం. చాలా మంది బ్లాక్మనీని వైట్ చేసేందుకు పెట్టుబడి రూపంలో ఇచ్చారని, మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారని పోలీసులకు వివరించినట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టినది, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమాధానం దాటవేసినట్లు తెలిసింది. సంపన్నుల డబ్బును ఎగ్గొట్టే ఎత్తుగడను శిల్పాచౌదరి అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. శనివారం కూడా ఆమె విచారణ సాగనుంది. -
చంచల్ గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైన తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: ‘క్యూ న్యూస్’ ఛానల్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్కు సోమవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న బెయిల్పై విడుదలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ జ్యోతిష్యుడు కొద్ది రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Q News Mallanna: తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా? బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కాగా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు అయ్యియి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా.. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
నాగశౌర్య ఫామ్హౌస్ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు
హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్హౌస్ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్ చౌదరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్ హౌజ్దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్హౌజ్ కేసు: బర్త్డే పార్టీ ముసుగులో పేకాట -
తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: క్యూ నూస్ చానెల్ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి( ఆగస్టు 27న) మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా శనివారం మల్లన్నను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో భాగంగా తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్ 306,సెక్షన్ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అడిగింది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తామని తెలిపిన కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం మల్లన్నను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇక మల్లన్న కేసు విషయానికి వస్తే.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నకు రెండుసార్లు నోటీసులు అందించారు. అయితే నోటీసులపై మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! ఓటుకు కోట్లు కేసు: రేవంత్ రెడ్డికి సమన్లు -
సీబీఐ ఎదుట బొల్లినేని మౌనవ్రతం
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ సీబీఐకి సహకరించడం లేదు. మే 1 నుంచి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సోమవారం కూడా బొల్లినేనిని అధికారులు చంచల్గూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎన్ని విధాలా ప్రశ్నించినా.. తనకు అనారోగ్యం ఉందని సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అదే విధంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన విధానం, వాటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నలు సంధించినా నోరు తెరవలేదని తెలిసింది. చివరి రోజు అయిన మంగళవారం కస్టడీ ముగియనుంది. ఆఖరు రోజైనా సమాధానాలు రాబట్టాలన్న పట్టుదలతో ఉన్నారు సీబీఐ అధికారులు. విచారణ అనంతరం బొల్లినేని తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
నోరు మెదపని బొల్లినేని శ్రీనివాసగాంధీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ నోరు విప్పలేదని సమాచారం. మే 1 నుంచి 4వ తేదీ వర కు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి బొల్లినేనిని తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు వేసి విచారణకు తీసుకురావడం గమనార్హం. ఈ సందర్భంగా తొలిరోజు విచారణలో సీబీఐ అధికారులకు గాంధీ ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2019 జూలైలో బొల్లినేనిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా సహకరించకపోవడంతో నాటకీయ పరిణామాల మధ్య ఏప్రిల్ 20న ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ రోజు కూడా అనేక అనారోగ్య కారణాలు చూపి అరెస్టు తప్పించుకుందామనుకున్న గాంధీని సీబీఐ ఎట్టకేలకు అరెస్టు చేసింది. శనివారం సీబీఐ అధికారుల ప్రశ్నలకు బొల్లినేని ఎలాంటి సమాధానాలు చెప్పలేదని సమాచారం. గతంలో ఇలాంటి కేసులు ఎన్నో విచారించిన బొల్లినేని ప్రస్తుతం తానే ముద్దాయి కావడంతో కావాలనే సమాధానం చెప్పడం లేదని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్ కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉంటున్న ఆమెకు బెయిల్ లంభించడంతో శనివారం బయటకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆమె 18 రోజులుగా జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టుల్లో అనేక సార్లు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే అఖిలప్రియకు బెయిల్ మంజూరు కావడంతో బెయిల్ ఆర్డర్ కాపీలను ఆమె తరుఫు న్యాయవాదులు జైలుకు తీసుకువచ్చారు. అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అఖిల ప్రియ విడుదలతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. (మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్పవర్’!) మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
జైలు వంటలు లేనట్లేనా..?
సాక్షి, చంచల్గూడ: తెలంగాణ జైళ్ల శాఖ చంచల్గూడలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మై నేషన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్కోర్టు మూతపడింది. వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈ కేంద్రంలో నియమించారు. ప్రజలకు రుచికరమైన భోజనం అందించారు. మీల్స్, టిఫిన్స్తో పాటు చికెన్ బిర్యానీ విక్రయించారు. బహిరంగ మార్కెట్లో చికెన్ బిర్యానీ రూ.180 నుంచి రూ.220 వరకు లభించగా.. ఈ ఔట్లెట్లో కేవలం రూ.90లకే విక్రయించేవారు. ధర తక్కువగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లేవారు బిర్యానీ రుచి చూసి వెళ్లేవారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి మూతపడింది. సిటీ మార్కెట్లోకి ఎపిస్ కుంకుమ పువ్వు చలికాలంలో కేసర్ లేదా కుంకుమపువ్వు వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎఫ్ఎమ్జీజీ బ్రాండ్.. ‘ఎపిస్’ సాఫ్రాన్(కుంకుమ పువ్వు)ని సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కుంకుమ పువ్వుని విభిన్న రూపాల్లో వినియోగించడం ద్వారా సాధారణ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందని భారతీయ వైద్య విధానం చెబుతోందని వీరు వివరించారు. నగరంలోని హైపర్ స్టోర్స్తో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్స్ మీద వన్ గ్రామ్ ఎపిస్ సాఫ్రాన్ ప్యాక్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. -
ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది?
అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పట్టుబడగా.. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య! నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్గా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జైలు సిబ్బందిని విచారించారు. చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు నాగరాజును విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న విషయాల్లో దర్యాప్తు సాగుతోంది. చదండి: కీసర నాగరాజా మజాకా! -
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
చంచల్గూడ: సంచలనం సృష్టించిన రూ.కోటీ పది లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. కీసర మండలం తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఇటీవ ల రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీంతో అతనిపై కేసు నమో దు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతన్ని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నాగరాజు కిటికీకి టవల్తో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో అప్పటికప్పుడు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారని జైలు అధికారులు తెలిపారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. అఫ్జల్గంజ్/అల్వాల్: నాగరాజు మృతదేహాని కి ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణుడు దేవరాజ్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం జరిపింది. అనంతరం మృతదేహాన్ని బంధువుల కు అప్పగించారు. కాగా బుధవారం రాత్రి నాగరాజు మృతదేహాన్ని అల్వాల్లోని నివాసానికి తీసుకొచ్చారు. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు వెల్లడించారు. -
కీసర మాజీ తాహసీల్దార్ ఆత్మహత్య
-
కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) నాగరాజుపై ఏసీబీ ప్రశ్నల వర్షం నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని అడిగారు. దీనికితోడు అదే ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు కాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ పనిచేస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్గూడ జైల్లో గురువారం జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి డీజీపీ మహేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రిసనర్స్ స్పోర్ట్స్మీట్ను డీజీపీ, జైళ్లశాఖ డీజీ రాజీవ్త్రివేది ప్రారంభించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి అని ప్రశంసించారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ను తీర్చిదిద్దడంలో రాజీవ్ త్రివేది పాత్ర మరువలేనిదన్నారు. రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో జైళ్లశాఖ మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. అలాగే తన సహచరుడు రాజీవ్ త్రివేది డీజీగా ఉండటం.. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో గుర్తుండిపోయే విషయమన్నారు. రాజీవ్ త్రివేది మంచి క్రీడా వ్యక్తి అని.. క్రీడలు మంచి లక్షణాలను నేర్పిస్తాయన్నారు. క్రీడా స్ఫూర్తితో అందరూ సమిష్టిగా రాణించాలని జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది సూచించారు. తెలంగాణ జైళ్లశాఖను ఉన్నతమైన స్థానంలో తీర్చిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, వరంగల్, చర్లపల్లి, సెంట్రల్ హైదరాబాద్ రెంజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
-
సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్లో రవిప్రకాశ్
-
చంచలగూడ జైలులో తొలిరోజు రవిప్రకాశ్..
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్లో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. రవిప్రకాశ్కు జైలు అధికారులు అండర్ ట్రయిల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించి... కృష్ణా బ్యారక్లో ఉంచారు. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న ఆయన రాత్రంతా సరిగా నిద్రపోలేదని సమాచారం. ఉదయం రవిప్రకాశ్కు జైలు సిబ్బంది అల్పాహారంగా కిచిడీ ఇవ్వగా, సగం తిని వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన బెయిల్ పిటిషన్పై ఈ నెల 9న వాదనలు జరగనున్నాయి. కాగా రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారంటూ ప్రస్తుత టీవీ9 సీఈవో గొట్టిపాటి సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, రవిప్రకాశ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. చదవండి: రవిప్రకాశ్ అరెస్ట్... -
ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్య తేజకు రిమాండ్
హైదరాబాద్: టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు మద్దాల సూర్య తేజ (30)ని మంగళవారం పంజగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వివాహం చేసుకుంటానని నమ్మక ద్రోహం చేయడం 306, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. తన సర్వస్వం సూర్యనే అనుకున్న ఝాన్సీ తన ప్రాణమైన నటనకు కూడా దూరమైంది. సూర్య మాత్రం ఆమెపై అనుమానం వ్యక్తం చే స్తూ తరచూ గొడవలు పెట్టుకునేవాడని విచారణలో తెలిసింది. ఆమె ఫోన్ను బ్లాక్లిస్టులో పెట్టడంతోపాటు సూర్య ఇంట్లో వేరే సంబంధాలు చూడటంతో నాగ ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురయినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఝాన్సీ ఫోన్ చేస్తే అతను స్పందించనట్లు తెలిసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ... గత ఏప్రిల్లో ఇద్దరికీ పరిచయం కాగా, జూన్లో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలో వివాహం చేసుకుంటామని జూలైలో ఝాన్సీ ఇంట్లో కూడా చెప్పారని తెలిపారు. ఆ తర్వాత సూర్య ఇంటికి వెళ్లి ఝాన్సీ వారం రోజులు అక్కడే ఉందన్నారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్లో ఝాన్సీ కొంత డబ్బు అతనికి ఇచ్చిందని, దాంతో బైక్ కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి వరకు బాగానే ఉండగా అనంతరం ఇద్దరి మధ్యా చిన్న గొడవలు ప్రారంభమయ్యాయన్నారు. ఝాన్సీ నటించడం, వేరేవారితో మాట్లాడటం సూర్యకు నచ్చేది కాదని, దీంతో ఆమె నటన కూడా మానేసిందని తెలిపారు. ఈ క్రమంలో జనవరి నుంచి సూర్యకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారని తెలియడంతో ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల ముందు నుంచి సూర్యతో మాట్లాడలేదని, కాని ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్ చేయగా అతను స్పందించలేదన్నారు. మెసేజ్లు పెట్టినా అప్పుడు సూర్య ఫోన్లో నెట్ ఆఫ్ చేసి ఉండటంతో అతను అవి చూసుకోలేదని, తర్వాత నెట్ ఆన్ చేసినా ఝాన్సీ ఆ మెసేజ్లను డెలీట్ చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత సూర్య పలు మెసేజ్లు పెట్టినా ఆమె నుంచి స్పందన రాలేదని వివరించారు. -
చెంచులక్ష్మికి పెట్రోల్ బంక్లో ఉద్యోగం
చంచల్గూడ: 18 చోరీ కేసుల్లో మూడు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఘరనా దొంగ చెంచు లక్ష్మీ శుక్రవారం చంచల్గూడ మహిళా జైలు నుంచి విడుదలైంది.తరువాత ఆమెకు చంచల్గూడలోని మహిళ పెట్రోల్ బంకుల్లో ఉద్యోగమించ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోరి కేసుల్లో చెంచు లక్ష్మీ (34) నిందితురాలుగా ఉంది. కాగా పలు కేసుల్లో ఆమె దోషిగా తేలడంతో కోర్టు ఆమె శిక్షలు విధించింది. ఎట్టకేలకు ఆమె జైలు శిక్ష పూర్తి కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలైంది. కాగా పోలీసులే తనను దొంగగా మార్చారని పలు సందర్భాల్లో ఆమె పోలీసు శాఖపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై జైలు అధికారులతో ఆమె మొరపెట్టుకోగా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోఅధికారులు చెంచు లక్ష్మీకి చంచల్గూడలోని మహిళ పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించడంతో ఇల్లు ఏర్పాటు చేసి కొంత డబ్బు కూడా చెల్లించినట్లు జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. -
జైలులో జగ్గారెడ్డిని కలిసిన కుటుంబ సభ్యులు
-
కేసీఆర్, హరీష్ను అరెస్ట్ చేయాలి : జగ్గారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : నకిలీ పాస్పోర్టు కుంభకోణం కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీష్ రావులను వదిలేసి తన భర్తను అక్రమంగా ఇరికించారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి ఆరోపించారు. బుధవారం చంచల్గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని ఆయన కుటుంబసభ్యులు ములాఖత్లో కలిశారు. జైలు అధికారులు మాత్రం కేవలం జాలీ ములాఖత్కు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం నిర్మలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని ఆయన మచ్చలేని మనిషి అని పేర్కొన్నారు. అధికార దాహంతోనే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేసీఆర్, హరీష్రావులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అధికారులు సాధారణ ములాఖత్ ఇచ్చారని, జాలీ మధ్యలోనుంచి మాటలు స్పష్టంగా వినిపించటంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయం
చంచల్గూడ: హెల్మెట్ ధరించని వినియోగదారులకు పెట్రోల్ విక్రయించమని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్కుమార్సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా నేరాలను అదుపు చేయడంలో జైళ్ల శాఖ కీలకపాత్రం పోషించిందని, అదే విధంగా విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించిందన్నారు. ఇటీవలకాలంలో రోడ్డు ప్రమాదాల బారినపడిన వారు అత్యధికంగా హెల్మెట్ ధరించకపోవడంతో మరణిస్తున్నట్లు దినపత్రికల ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. దీంతో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 13 పెట్రోల్ బంకులు, నూతనంగా నిర్మించబోయే మరో 8 పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించని వినియోగదారులకు విక్రయాలు జరపకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జైళ్ల శాఖ సరఫరా చేస్తున్న నాణ్యమైన పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రైవేటు పెట్రోల్ బంకుల యజమానులు కూడా ఇలాంటి నిర్ణయం తీసు కుంటే మరణాలు తగ్గే అవకాశం ఉందని తెలిపా రు. బంకుల ద్వారా లాభార్జనే కాకుండా మంచి లక్ష్యాల కోసం జైళ్ల శాఖ పనిచేస్తుందన్నారు. -
మూడు గంటలు.. ముచ్చెమటలు!
కుషాయిగూడ: కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయిన ఓ జీవితఖైదీ హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి మూడు గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనపై అక్రమ కేసు బనాయించి, జైలుపాలు చేసిన శంకర్పల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు స్తంభమెక్కాడు. దీంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది సహకారంతో అతడిని సురక్షితంగా కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, శేర్గూడానికి చెందిన యండీ ఖాజాపాషా భార్యపై అనుమానంతో 2012లో బానూరు వద్ద ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు 2013లో అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో సత్పప్రవర్తనతో మెలగడంతో ఖాజాపాషాను 2017లో జైల్ పెట్రోల్బంకు విధుల నిర్వహణకు కేటాయించారు. గత డిసెంబర్లో పెరోల్పై నెలరోజుల పాటు ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. అయితే ఈ నెల 7న హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖారారు చేస్తు తీర్పునివ్వడంతో మానసికంగా కుంగిపోయిన ఖాజాపాషా జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్బంకు ఆవరణలో కరెంటు పోల్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలి నా భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై అక్రమంగా కేసు బనాయించి, తన పిల్లలకు దూరం చేసిన అప్పటి శంకర్పల్లి ఎస్సై నాగరాజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు పోలెక్కడంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది, కుషాయిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారులు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పై నుంచి మాటలు వినిపించక పోవడంతో మరో ఖైదీని పోల్ పైకి పంపి సెల్ఫోన్ను అందజేసి పలుమార్లు సంభాషించారు. అతని డిమాండ్లను అంగీకరిస్తూ, సదరు ఎస్సైపై చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి, జైల్ సూపరింటెండెంట్ భాస్కర్ హామీ ఇచ్చినా అతను కిందకు దిగిరాలేదు. ‘‘బతకాలని అనిపించడం లేదని, నేను చనిపోతాను’’ అంటూ ఫోన్ కట్చేశాడు. దాదాపు మూడు గంటల పాటు అధికారులు, సహచర ఖైదీలు ఫోన్లో మాట్లాడుతూ సర్ధిజెప్పే ప్రయత్నం చేసినా అతని నిర్ణయంలో మార్పురాలేదు. దీంతో అధికారులు రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న చర్లపల్లి ఫైర్ సిబ్బంది తమ వద్ద ఉన్న మ్యాట్లతో ప్రాథమికంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఆఫీసర్ శైఖర్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి 54 ఫీట్ల స్కై లిఫ్ట్ను రప్పించారు. కిందపడినా ప్రమాదం జరగకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు డిప్యూటీ జైలర్ శోభన్బాబు కూడా లిఫ్ట్లో పైకి వెళ్లి అతడికి నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చాడు. జైళ్లశాఖ డీఐజీ సైదయ్య, చర్లపల్లి ఫైర్ ఆఫీసర్ శేఖర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికారుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించిన ఖాజాపాషాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అందుకుగాను కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖాజాపాషాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా తమకు జైలు అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
బెయిల్పై గజల్ శ్రీనివాస్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ గాయకుడు శ్రీనివాస్ బుధవారం రాత్రి బెయిల్పై విడుదల అయ్యాడు. తన సంస్థలోని ఉద్యోగినిపై లైగింక వేధింపులకు పాల్పడిన కేస్లో గత మూడు వారాలుగా శ్రీనివాస్ చంచల్గూడ జైల్లో వున్న విషయం విదితమే. కోర్టు శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో జైల్ నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన కేసు విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడేమీ మాట్లాడలేనన్నారు. తాను నిర్దోషిగా బయటికి వస్తానన్నారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్లో వెంట ఉండి ప్రోత్సహించిన మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పరుగెత్తి కారులో వెళ్లిపోయారు. -
మందకృష్ణకు షరతులతో కూడిన బెయిల్
-
దొరలకో చట్టం.. దళితులకో చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు ఒక చట్టం.. దొరలకు మరో చట్టం నడు స్తోందని ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. 21 రోజులుగా చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న మంద కష్ణకు మంగళవారం సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి 9 గంటలకు విడుదలయ్యారు. దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వక పోయినా ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద మంద కృష్ణ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు ఆయనను ఈనెల 2న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ లభించడంతో బయటకు వచ్చా రు. ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న అన్ని పార్టీలతో అఖిల పక్షం సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాల మేరకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
ఖైదీ ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంచల్గూడ జైలు ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా యాంకీ గ్రామానికి చెందిన కుమ్మరి సత్యం (38) కూలిపనులకోసం భార్యతో కలసి కొన్నేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణెకు వలస వెళ్లాడు. ఇంటిగొడవల కారణంగా భార్యను హత్య చేసిన కేసులో పుణె కోర్టు 2017లో అతడికి జీవితఖైదు విధించింది. అప్పట్నుంచి చంచల్గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కొంతకాలంగా అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ఈ నెల 9న అతడిని ఆస్పత్రిలో చేర్పించగా శుక్రవారం ఉదయం 12.30 గంటల సమయంలో బాత్రూమ్లో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. సిబ్బంది నుంచి ఈ సమాచారం అందుకున్న ఆస్పత్రి ఆర్ఎంఓ మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పంచనామా తర్వాత మృతదేహాన్ని జైలు అధికారులకు అప్పగిస్తామని ఎస్సై మహేందర్ చెప్పారు. -
దేశవ్యాప్తంగా వర్గీకరణ ఉద్యమం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని గుజరాత్ స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. తెలంగాణలో వెంటనే వర్గీకరణ చేపట్టాలని కోరారు. చంచల్గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఆయన బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత హక్కుల కోసం కృష్ణమాదిగ కష్టపడుతున్నారని అన్నారు. దళితులు ఏకమై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై మంద కృష్ణతో చర్చించినట్లు తెలిపారు. నిరుపేద దళితులకు 3 నుంచి 5 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ దృష్టికి తీసుకెళ్తారా.. అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. -
మందకృష్ణకు జిగ్నేష్, కత్తి మహేష్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ బుధవారం చంచల్గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నా అంతరాత్మ ప్రభోదానుసారం మందకృష్ణను కలిశా. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి. హక్కులకై పోరాడుతున్న మందకృష్ణను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దళితుల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళతాం. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలి. ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా చేయాలి. అలాగే తెలంగాణలో దళితులకు అయిదు ఎకరాల భూమి ఇవ్వాలి. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన తెలంగాణలో తీవ్రస్థాయికి చేరుకుంది. రోహిత్ వేముల బతికుంటే నాతో కలిసి వచ్చేవారు’ అని అన్నారు. మందకృష్ణను కలిసిన కత్తి మహేష్ మరోవైపు మందకృష్ణను కత్తి మహేష్ కూడా కలిశారు. చంచల్గూడకు వెళ్లి...మందకృష్ణను పరామర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపడుతున్న పోరాటానికి కత్తి మహేష్ మద్దతు తెలిపారు. కాగా ట్యాంక్బండ్ వద్ద అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహించారంటూ మందకృష్ణ మాదిగపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెండురోజుల క్రితం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా మందకృష్ణను కలిశారు. -
‘తెలంగాణలో నిర్బంధ, నియంతృత్వ పాలన’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధ, నియంతృత్వ పాలన సాగుతోందని.. ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు లేకుండా పోయాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. చంచల్గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగను తమ పార్టీ నేతలతో పాటు ఆయన కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారతి అనే మహిళ సంస్మరణ సభ జరిపినందుకు మందకృష్ణను అరెస్ట్ చేశారని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోతామని సీఎం కేసీఆర్ హామీయిచ్చారని గుర్తు చేశారు. అదే ముఖ్యమంత్రి.. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేసి రెండు వారాలు జైల్లో పెట్టించారని ధ్వజమెత్తారు. ఇంత దారుణంగా పాలన సాగుతోందని, అణగారిన వర్గాలకు హక్కులు లేకుండా పోయాయని వాపోయారు. నెరేళ్లలో దళితులను ఇసుక మాఫియా అండతో పోలీసులు వేధింపులకు గురిచేశారని, ఖమ్మంలో మద్దతుధర కోసం డిమాండ్ చేసినందుకు రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టారని తెలిపారు. ఇపుడు మంద కృష్ణను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. కేసీఆర్పై గజ్వేల్లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్రెడ్డిపై కూడా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించినందుకు ఆయనను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
తాత్కాలిక బెయిల్పై మంద కృష్ణ విడుదల
హైదరాబాద్: చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం బెయిల్పై విడుదలయ్యారు. మంద కృష్ణ బావ మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది. అంత్యక్రియలకు హాజరై తిరిగి మంగళవారం ఆయన జైలుకు రానున్నారు. -
చంచల్గూడ జైలుకు కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం చంచల్గూడ జైలుకు వెళ్ళారు. జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కోదండరామ్ కలిశారు. ట్యాంకుబండ్ వద్ద ధర్నాకు ఉపక్రమించారన్న కారణంతో మంద కృష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను కోదండరామ్ పరామర్శించారు. -
చంచల్గూడ జైల్లో భద్రతా లోపాలు
-
జైలు వార్డర్పై ఉగ్రవాద ఖైదీల దాడి
-
జైలు వార్డర్పై ఉగ్రవాద ఖైదీల దాడి
సాక్షి, హైదరాబాద్ : చంచల్గూడ జైలులో వార్డర్పై ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు శనివారం మధ్యాహ్నం దాడి చేశారు. మొహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, ఇల్లియాస్ యజ్దానీ, మహ్మద్ అతాఉల్లాహ్ రహమాన్ అలియాస్ గౌస్లు ఈ దాడికి పాల్పడ్డారు. తమ బంధువులతో ములాఖత్ సమయంలో ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇతర నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు వికెట్ గేటు(రెండో మెయిన్ గేటు)ను వార్డర్ భరత్కుమార్ తెరిచారు. ఆ సమయంలో ములాఖత్ కోరిన తమ వారి కోసం వేచి ఉన్న హై సెక్యూరిటీ కలిగిన ఈ ముగ్గురు ఖైదీలు ఇదే అదనుగా వార్డర్ను తోసుకుని మెయిన్ గేటు వైపు వెళ్లారు. బిగ్గరగా అరుస్తూ జైలు సిబ్బందిని, అధికారులను పరుష పదజాలంతో దూషించడమేగాక మరో వార్డర్ సంపత్ను కంటి దగ్గర గాయపరిచారు. ఇతర సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై డబీర్పురా పోలీసు స్టేషన్లో జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. -
చంచల్గూడ జైలులో అల్లు శిరీష్!
నిజమే... అక్షరం పొల్లు పోకుండా మీరు చదివిందంతా నిజమే! యువ హీరో అల్లు శిరీష్ ఓ రోజంతా చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయన జైలుకు వెళ్లొచ్చి వారమైంది. కానీ, ఈ మేటర్ బయటకు రాలేదు. గుట్టు చప్పుడు కాకుండా అల్లు శిరీష్ జైలుకు వెళ్లొచ్చారు. టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్... డ్రగ్స్ రాకెట్ కేసుతో అల్లు వారబ్బాయికి ఏం సంబంధం లేదు. ఆయనపై ఇతరత్రా కేసులు ఏవీ లేవు. మరి, జైలుకు ఎందుకు వెళ్లారు? అంటే... సిన్మా షూటింగ్ కోసం! ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య రెండు మూడు రోజులు చంచల్గూడ జైలులో షూటింగ్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల రిక్వెస్ట్ మేరకు అల్లు శిరీష్ ఖైదీలకు మంచి మాటలు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. సురభి, సీరత్కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర చేస్తున్నారు. -
చంచల్గూడ జైల్లో టాలీవుడ్ హీరో
హైదరాబాద్: టాలీవుడ్ నూతన దర్శకుడు వీఐ ఆనంద్ డైరెక్షన్లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్, సురభి జంటగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ కొత్త సినిమా షూటింగ్ శనివారం చంచల్గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో జైలు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. శిరీష్, అవసరాల శ్రీనివాస్, ప్రవీణ్లపై జైలు బయట, లోపల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం మహాపరివర్తన్లో భాగంగా అల్లు శిరీష్ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. తెలిసి, తెలియక చేసిన తప్పులకు జైలు శిక్ష అను భవిస్తున్న ఖైదీలు తప్పులను సరిదిద్దుకొవాలని ఆయన సూచించారు. చంచల్గూడ జైల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, జైలర్లు విజయ్కుమార్, వెంకటేశం ఉన్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేగంగా జరుగుతోంది. సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్తగా ఉన్నారు. -
విందు భోజనానికి నోచుకోని ఖైదీలు
హైదరాబాద్: రంజాన్ను పురస్కరించుకొని ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఆశపడ్డ చంచల్గూడ ఖైదీలకు నిరాశే మిగిలింది. సాధారణ భోజనంతో పాటు ఒక లడ్డూ మాత్రమే జైలు అధికారులు వడ్డించడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. చంచల్ గూడ పురుషుల జైల్లో దాదాపు 350 మంది ముస్లిం ఖైదీలు నెల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు పాటించారు. ప్రార్థనలకు ప్రత్యేకంగా జైల్లో ఓ బ్యారెక్ కూడా అధికారులు కేటా యించారు. అయితే రంజాన్ రోజు ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఊహించిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. ఖైదీల సంక్షేమం, సంస్కరణలు కోసం కృషి చేస్తున్నామని ప్రచారం చేసుకునే ఉన్నతాధికారులకు పం డుగపూట ఖైదీలకు విందు భోజనం వడ్డిం చాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టక రమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
శిరీష మరణం వెనక మిస్టరీ లేదు
- పోలీసు ఉన్నతాధికారుల పునరుద్ఘాటన - సందేహాలను ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణం వెనుక మరే మిస్టరీ లేదని పోలీస్ ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేశారు. కటుంబసభ్యుల సందేహాలను శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఆమెది హత్య అని నిర్ధారించేందుకు ఎవరు, ఏ ఆధారం సమర్పించినా పరిగణనలోకి తీసుకోనున్నారు. శిరీష ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉందని, అంత బరువును సీలింగ్ ఫ్యాన్ రాడ్ ఎలా ఆపుతుందన్న బంధువుల సందేహంపై అధికారులు స్పందిస్తూ.. శిరీష 5.6 అడుగుల ఎత్తు, 65–70 కిలోల బరువు ఉంటుందని, చనిపోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె ఫ్యాన్కు ఉరి వేసుకుని కాళ్లను ముడుచుకుందని, సీలింగ్ ఫ్యాన్ వంద కిలోల బరువునైనా ఆపగలదని నిర్ధారించారు. కుకునూరుపల్లి నుండి తిరిగివచ్చే సమయంలో అరవడం.. కారు నుండి దూకే ప్రయత్నం చేయడంతో కారులో రాజీవ్, శ్రవణ్ ఆమెపై పలుమార్లు దాడి చేయటం వల్లే ఒంటిపై గాయాల య్యాయని పేర్కొన్నారు. బయటే హత్య చేసి తీసుకువచ్చారన్న ఆరోపణపై స్పందిస్తూ.. ఫిల్మ్నగర్లోని స్టూడియోకు చేరుకున్నాక శిరీష స్వయంగా 3.47 గంటల సమయంలో తన వేలిముద్ర(బయోమెట్రిక్)ను ఉపయోగించి డోర్ తెరిచిందని, తిరిగి 3.54 గం టలకు తన ఫోన్తో రాజీవ్కు వీడియోకాల్ చేసిన ఆధారాలను చూపు తున్నారు. శిరీష ఆత్మ హత్య చేసుకున్న ప్రవేశాన్ని ఐదుగురు ఫోరెన్సిక్ నిపు ణులు సందర్శించి, అన్ని కోణాల్లో పరిశీలించారని తెలిపారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా బంజారాహిల్స్ ఎస్సై హరీందర్కు 9 మార్లు కాల్ చేసి వాకబు చేశారన్నారు. చంచల్గూడ జైలుకు రాజీవ్, శ్రవణ్ కాగా, శిరీష కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్ను కోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. శని వారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీ క్షల అనంతరం రాజీవ్, శ్రవణ్లను బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరి చారు. వీరిద్దరికి న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. శ్రవణ్, రాజీవ్లను కస్టడీకి కోరుతూ బంజారా హిల్స్ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. శిరీషపై ప్రభాకర్రెడ్డి అత్యాచారయత్నం చేశాడని నింది తులు ఇచ్చిన సమాచారం మేరకు శిరీష లోదుస్తుల తోపాటు ఆ రోజు ఆమె ధరించిన డ్రెస్సును, ప్రభాకర్రెడ్డి లోదుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. -
జైళ్ల శాఖ ‘ఆదాయాల’ బంకు
సాక్షి, చంచల్గూడ: తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీల సంస్కరణలో విభిన్న ప్రయోగాలు చేసింది. చేస్తూనే ఉంది. తెలిసీతెలియక క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే వారిని నేరస్తులుగా పరిగణించకుండా వారిలో మార్పులు తెచ్చేందుకు వివిధ రకాల వ్యాపారాలను మొదలు పెట్టి అందులో ఖైదీలను భాగస్వామ్యం చేసింది. ఇందులో భాగంగానే జైళ్ల శాక ప్రయోగాత్మకంగా ఆయిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర జైళ్ల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పాతబస్తీలోని చంచల్గూడ ప్రాంతంలో సుధార్ పేరుతో నెలకొల్పిన పెట్రోల్ బంకు విజయవంతంగా వ్యాపారం కొనసాగిస్తుంది. ప్రతి రోజు రూ. 30 లక్షలు అమ్మకాలు జరుపుతుంది. 2013 జూన్లో ఈ బంకును ప్రారంభించారు. ప్రభుత్వ బంకు కావడంతో స్వచ్ఛత, తూనికలుకోలతల్లో అవకతవకలకు ఆస్కారం లేకపోవడంతో ప్రజలు ఈ బంకును ఆశ్రయిస్తూ అదిరిస్తున్నారు. ఖైదీలే ఉద్యోగులు.. సాధారణంగా ఖైదీలను జైళ్లలోనే చూస్తుంటాము. ఇక శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు బయట ప్రపంచంతో అసలు సంబంధాలు ఉండవు. కోర్టులకో, ఆసుపత్రులకో తరలిస్తే తప్ప వారికి బయట ప్రపంచం చూసే అవకాశమే ఉండదు. అలాంటిది జైళ్ల శాఖ నేరుగా వారిని ప్రజల మధ్యకు తెచ్చి సహసం చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని వివిధ జైళ్లలోని సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, చంచల్గూడ జైళ్లకు తరలించి వారికి పెట్రోల్ పంపు నిర్వహణకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఖైదీలను ప్రజాసేవాలో భాగస్వామ్యం చేశారు. బంకు ప్రారంభమైన మొదట్లో ఖైదీలకు రోజువారి వేతనం రూ. 70 అందజేశారు. అమ్మకాలు పెరగడంతో ఇటీవల వారి రోజువారి వేతనాన్ని రూ. 110 పెంచారు. బంకు 24 గంటలు పనిచేస్తుంది. షిఫ్ట్కు 20 మంది చొప్పున మొత్తం 61 మంది ఖైదీలు మూడు షిఫ్ట్ల వారిగా విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఇతర బంకులు బందు పాటించినా ఈ బంకుకు వర్తించదు. యేడాదికి రూ. 4 కోట్ల ఆదాయం.. నగరంలోని ఇతర పెట్రోల్ బంకులతో పోల్చితే అమ్మకాలు అధికంగా ఉన్నాయి. జైళ్ల శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్థాయికి అభివృద్ధి చెందింది. మొదటి సంత్సరంలోనే రూ. 50 కోట్ల టర్నోవర్ సాధించి సూమారు కోటి రూపాయల ఆదాయం గడించింది. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 100 నుంచి 120 కోట్ల టర్నోవర్తో వ్యాపారం కొనసాగిస్తూ రూ. 4 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటుంది. పెట్రోల్ అమ్మకాల్లో దేశంలో ఈ బంకు 8వ స్థానం, తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. ఉపాధి కల్పనలో మేటి... ఆదాయం గడించడమే కాకుండా ఉపాధి కల్పనలో కూడా ముందుంది ఈ బంకు. ఈ బంకులో శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీలకు నెలకు రూ. 12 వేల వేతనం చొప్పున 16 మందికి ఉద్యోగం కల్పించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బంకులు నెలకొల్పి ఖైదీలకు ఉపాధి కల్పించేందకు కృషి చేస్తున్నారు జైళ్ల అధికారులు. వేతనం పెంచే యోచనలో... ప్రస్తుతం బంకుల్లో పనిచేస్తున్న శిక్ష ఖైదీలకు రోజుకి రూ. 110 వేతనం ఇస్తున్నారు. ఈ శ్రమ దోపిడిపై ‘సాక్షి’ ప్రతినిధి ఆ శాఖ సమావేశాల్లో పలుమార్లు రాష్ట్ర హోంమంత్రి, జైళ్ల శాఖ డీజీతో ప్రస్తావించగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఖైదీలకు రూ. 250 వేతనం పెంచే ప్రతిపాదనను ఆ శాఖ డీజీ ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల్లో మార్పు తేవడమే లక్ష్యం : ఖైదీల్లో మార్పు తేవడమే మా ప్రధాన లక్ష్యం. ఆ దిశగా మా శాఖ ఎంతో కృషి చేస్తుంది. ఖైదీల్లో మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసేందుకు విభిన్న కార్యక్రమాలు చేపట్టాము. పెట్రోల్ బంకు నిర్వహణ ఎంతో సంతృప్తినిచ్చింది. మా బంకులో ఆయిల్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన ఆయిల్ విక్రయించి నమ్మకాన్ని చూరగొన్నాము. - బచ్చు సైదయ్య, సూపరింటెండెంట్ చంచల్గూడ జైలు నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుంది: బంకు ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడే పెట్రోల్ పోయించుకుంటున్నాను. నగరంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుంది. బండి మైలేజీ కూడా పెరిగింది. ఖైదీల సేవాలు, జైళ్ల శాక ప్రయత్నం అభినందనీయం. - దర్శనం పవన్, వినియోగదారుడు -
చంచల్గూడలో మహిళా పెట్రోల్ బంక్
ప్రారంభించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఏర్పాట్లు హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా మహిళా ఖైదీలతో నిర్వహించే పెట్రోల్ బంక్ను చంచల్గూడలో ప్రారంభించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఖైదీల సంస్కరణల్లో భాగంగా చంచల్గూడ మహిళా జైలులో శిక్ష అనుభవించి విడుదలైన 30 మంది మహిళలకు ఈ బంక్లో జీవనోపాధి కల్పించనున్నారు. వీరికి నెలకు రూ.12 వేల వేతనం ఇవ్వనున్నారు. మరో 20 రోజుల్లో ఈ బంక్ వినియోగంలోకి రానుంది. ఖైదీలకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్రోల్ బంక్ నెలకొల్పుతున్నామని మహిళా జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం పేర్కొన్నారు. -
చంచల్గూడ జైలుకు నటుడు ప్రదీప్
చంచల్గూడ: చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్న బుల్లి తెర నటుడు ప్రదీప్ని నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం చంచల్గూడ జైలుకు తరలించారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఎర్ర మంజిల్ కోర్టు ప్రదీప్పై వారెంట్ జారీ చేయగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు చంచల్గూడ జైల్కు తరలించారు. అనంతరం అదే రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో గంటల వ్యవధిలో ప్రదీప్ జైలు నుంచి విడుదలయ్యాడు. -
ఈ–ములాఖత్తో సమయం ఆదా
⇒ ఖైదీల కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరం ⇒ ‘చంచల్గూడ’లో ఈ–ములాఖత్ ప్రారంభంలో హోం మంత్రి నాయిని హైదరాబాద్: జైళ్లలోని ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటుంబ సభ్యులకు ఈ–ములాఖత్ ఎంతగానో ఉపయోగపడుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఆయన చంచల్గూడ జైల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–ములాఖత్ సౌకర్యాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ–ములాఖత్ పనితీరును జైళ్ల శాఖ డీజీ వినయ్కుమార్సింగ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ.. గతంలో ములాఖత్ కోసం వచ్చే వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, ఈ–ములాఖత్ ద్వారా ఆన్లైన్లో ఇంట్లోనే కూర్చుని ములాఖత్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జెళ్ల శాఖ నిర్వస్తున్న పెట్రోల్ బంక్ల ద్వారా ఏటా రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంద న్నారు. జైళ్లలో అవినీతిని రుజువు చేస్తే రూ. 5 వేల నగదు బహుమానం ఇస్తామని డీజీ వినయ్కుమార్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఐజీ నర్సింహ, సూపరింటెండెంట్లు బచ్చు సైదయ్య, బషీరాబేగం తదితరులు పాల్గొన్నారు. ఈ–ములాఖత్ నమోదు ఇలా.. ఖైదీలను ములాఖత్లో కలవాలం టే జైలు వద్ద ఉన్న ములాఖత్ నమోదు కేంద్రానికి వచ్చి ఆధార్ జిరాక్స్ అందజేస్తే ములాఖత్కు వచ్చే వారితో పాటు జైల్లో ఉన్న వ్యక్తి వివరాలు నమోదు చేసుకుని టోకెన్ నంబర్ ఇస్తారు. సూపరింటెండెంట్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ములాఖత్ ఫారమ్ను పరిశీలించి అనుమతి ఇస్తారు. దీనికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. సమయం వృథా కాకుండా ఉండేందుకు జైళ్ల శాఖ ఈ–ములాఖత్ ను ప్రవేశపెట్టింది. eprisons. nic. inలో new visit registration ఆప్షన్లో ఆధార్ నంబర్తో పాటు ములాఖత్కు వచ్చే వారి, ఖైదీ వివరాలు నమోదు చేయాలి. తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. రెండు మూడు గంటల వ్యవధిలో ములాఖత్ అనుమతించబడిందా లేక తిరస్కరించబడిందా తెలిసిపోతుంది. అనుమతించబడిన ములాఖత్ పాస్ ప్రింట్ తీసుకుని జైల్లోని ములాఖత్ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది. -
చంచల్గూడ జైల్లో యంగ్ హీరో!
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు వెళ్లారు. హీరో ఏంటీ.. జైలుకు వెళ్లడం ఏంటని కంగారు అక్కర్లేదండీ. ఎందుకంటే ఓ మూవీ షూటింగ్లో భాగంగా నితిన్ చంచల్గూడ జైలులో కొన్ని గంటలు గడిపాడు. 14 రీల్స్ బ్యానర్పై హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ గురువారం చంచల్గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో ఒక్కసారిగా జైలు ప్రాంగణంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. నటులు పృధ్వీ, బ్రహ్మాజీ, హీరో నితిన్లపై జైలు లోపల కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అ..ఆ.. సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో చేరిన నితిన్ కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ మూవీ షూటింగ్ గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఇప్పటివరకూ జైలులో కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఇంకా కొన్ని సీన్లు తీయాల్సి వస్తే మరోసారి ఈ లెటెస్ట్ మూవీ యూనిట్ చంచల్గూడలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఓల్డ్ సిటీ కుర్రాడిగా కనిపించేందుకు భారీగా గడ్డం పెంచేసి రఫ్ లుక్లో కనిపిస్తున్నాడు నితిన్. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో సీనియర్ నటుడు అర్జున్ స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. -
చంచల్గూడలో నితిన్
హైదరాబాద్: చంచల్గూడ జైలు వద్ద సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హీరో నితిన్ నటిస్తున్న సినిమాకు సంబంధించి గురువారం జైలు లోపల కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. నటులు పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. -
బంకులో ‘చిల్లర’ గొడవ
- ఖైదీ, జైలు సిబ్బందిపై వినియోగదారులు దాడికి యత్నం - చంచల్గూడ జైలు పెట్రోల్ బంకులో ఘటన హైదరాబాద్: చిల్లర లేదన్నందుకు కొందరు వినియోగదారులు ఖైదీ, సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన శుక్రవారం చంచల్గూడ జైలు పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది. సిబ్బంది, ఖైదీల వివరాల ప్రకారం పెట్రోల్ పోరుుంచుకున్న కొందరు వినియోగదారులు రూ. 2 వేలు నోటు ఇవ్వగా చిల్లర లేదన్న ఖైదీని దూషించడమే కాకుండా అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయబోయారు. కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వీరిపై వినియోగదారులు ఒక్కసారిగా దాడి చేయబోయారు. దీంతో సిబ్బంది డబీర్పురా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఖైదీలు, సిబ్బందితో గొడవకు దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య తెలిపారు. -
చంచల్గూడ జైల్లో వైద్య శిబిరం
హైదరాబాద్ : ఆసుపత్రుల యాజమాన్యాలు జైళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని చంచల్గూడ పురుషుల జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య అన్నారు. నగరానికి చెందిన ఓ డెంటల్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సైదయ్య ప్రారంభించారు. ఈ శిబిరంలో 165 మంది ఖైదీలు దంత సమస్యలపై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఖైదీలను భారీ సంఖ్యలో ఆసుపత్రులకు తరలించడంతో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఈ వైద్య శిబిరాలతో ఆ సమస్య కొంత వరకు తీరిందన్నారు. -
సుశృత మామ జైల్లో గుండెపోటుతో మృతి
హైదరాబాద్: వారం రోజుల క్రితం నగరంలో సంచలనం రేపిన వివాహిత సుశృత ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మామ శంకర్ రావు ఆదివారం ఉదయం హార్ట్ఎటాక్తో మృతిచెందాడు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. నగరంలోని సైదాబాద్ పూసలబస్తీకి చెందిన సుశృతను వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందనే నెపంతో వారం రోజుల క్రితం ఆమె భర్త తీవ్రంగా కొట్టాడు. చదవండి: హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు! బాత్రూంలో ఉన్న ఆమెను వివస్త్రగా ఉండగానే కుటుంబసభ్యుల ఎదుట తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు వాట్సప్లో తన తండ్రికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు మామ శంకర్రావును అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం శంకర్రావు గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
చంచల్గూడకు భానుకిరణ్
హైదరాబాద్: మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్ను చర్లపల్లి జైలు నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు. సూరి హత్య కేసులో అరెస్ట్ అయిన తరువాత భానుకిరణ్ నాలుగేళ్ళుగా చర్లపల్లి జైలులోనే ఉంటున్నాడు. అయితే జైలు కేంద్రంగా భాను పలు అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో ఈ రోజు మధ్యాహ్నం భానుకిరణ్ ను చంచల్ గూడకు తరలించారు. మరో వైపు భానుకు ప్రాణహాని ఉండటంతో ప్రత్యేక బ్యారక్ ను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. -
చర్లపల్లి జైలును సందర్శించిన హైపవర్ కమిటీ బృందం
నగరం నడిబొడ్డున ఉన్న చంచల్గూడ జైలు తరలింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్రావులతో కూడిన హైపర్ కమిటీ బృందం గురువారం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించింది. చంచల్గూడ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ క్రమంలో చర్లపల్లిలో ఉన్న వసతులను పరిశీలనలో భాగంగానే వారు జైలును సందర్శించి అధికారులతో చర్చించారు. ఓపెన్ ఎయిర్ జైలును ప్రత్యామ్నాయంగా ఎక్కడకు మార్చాలన్న పలు అంశాలపై సమీక్షించి వెళ్లారు. వారితో పాటుగా జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, డీఐజీ నరసింహ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు కొలను వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్లు ఉన్నారు. -
ఖైదీ నంబర్ 150!
చిరంజీవి ఇప్పుడు ఖైదీ. ఆశ్చర్యంగా ఉందా? రీల్ కోసం ఖైదీగా మారారాయన. చిరంజీవి తాజా చిత్రం షూటింగ్ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మంగళవారం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో చిత్రీకరించారు. ఖైదీ వేషధారణలో ఉన్న చిరంజీవి పాల్గొనగా సీన్స్ తీశారు. జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు తీశారని సమాచారం. చిరు వేసుకున్న చొక్కాపై 150 అనే అంకెలు కనిపిస్తున్నాయి. బహుశా ఇది చిరంజీవికి 150వ చిత్రం కాబట్టి.. ఖైదీ నంబర్ 150 అని కేటాయించి ఉంటారేమో! -
నకిలీబాబా శివ రిమాండ్
లైఫ్స్టైల్ మధుసూదన్రెడ్డిని మోసం చేసిన కేసు హైదరాబాద్: పూజల పేరుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి లైఫ్స్టైల్ మధుసూదన్రెడ్డిని మోసం చేసి రూ.1.33 కోట్లతో ఉడాయించి అరెస్ట్ అయిన నకిలీ బాబా బుడ్డప్పగారి శివ(34)ను బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. శివకు సహకరించిన మరో ఇద్దరు నిందితులు ఈగ దామోదర్(44), గడప శ్రీనివాస్రెడ్డి(41)లను కూడా రిమాండ్కు తరలించారు. వీరందరినీ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి చంచల్గూడ జైలుకు తరలించారు. నింది తులు ఈ నెల 15న బంజారాహిల్స్ రోడ్నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే ప్రముఖ వ్యాపారి గజ్జెల మధుసూదన్రెడ్డి అలియాస్ లైఫ్స్టైల్ మధుసూదన్రెడ్డి నివాసంలో లక్ష్మీపూజ చేస్తే రెట్టింపు డబ్బులవుతాయంటూ పూజల్లో రూ.1.33 కోట్ల నగదు కట్టలు పెట్టించి.. ఆయన కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించారు. 17న టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడు, అతడికి సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేశారు. బెంగళూరు శివారుల్లో ‘విల్లా’ కోసమే! సాక్షి, హైదరాబాద్: బెంగళూరు శివారు ప్రాంతంలో ఓ పెద్ద విల్లాను కొనుగోలు చేయడమే లక్ష్యంగా బుడ్డప్పగారి శివ భారీ మోసాలకు తెర తీశాడని పోలీసు విచారణలో వెల్లడైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామానికి చెందిన శివ...తన ఊరికి దగ్గర్లో ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరు నగర శివారుల్లో భారీ విల్లాను కొనుగోలు చేసి సెటిల్ అవుదామనుకుని గత ఏడేళ్లలో రూ.4.25 కోట్లకుపైగా మోసాలు చేసిన శివ.. లైఫ్స్టైల్ మధుసూదన్రెడ్డి ఉదంతంలో పోలీసులకు దొరికిపోవడంతో ఆ కోరికకు బ్రేక్ పడినట్టైంది. నిందితుడు ప్రస్తుతం కుటుంబంతో బెంగళూరు శివారు సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లే అవుట్లో ఓ అద్దె గదిలో ఉంటున్నట్టు పోలీసు విచారణలో వెల్లడించాడు. అయితే తాను అనుకున్న ప్రకారం మధుసూదన్ రెడ్డి ఇంట్లో పూజ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదును తీసుకుని దేవాలయాల చుట్టూ కారులో తిప్పేందుకు ఓకే అనడంతో పెద్ద ముప్పే తప్పినట్టైంది. లేకపోతే మత్తుమందు ఎక్కువ డోస్లో ఇచ్చి చంపాలనుకుని ప్లాన్ చేసినట్టు సమాచారం. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సోమవారం జరగనుంది. -
రంగారెడ్డి జిల్లాకు చంచల్గూడ జైలు
* 500.21 ఎకరాల భూమి గుర్తింపు * ప్రభుత్వానికి ప్రతిపాదనలు * శాంతిభద్రతల దృష్ట్యా తరలింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చంచల్గూడ జైలును నగరానికి దూరంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నడిబొడ్డున కేంద్ర కారాగారం ఉండడం.. ఖైదీల తరలింపు, వీఐపీ ఖైదీల తాకిడి నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని అంచనా వేసిన సర్కారు.. ఈ జైలును రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో యాచారం మండలం మొండిగౌరెల్లి, షాబాద్ మండలం చందన్వెల్లి, వికారాబాద్ మండలం సిద్దలూరు, మం చాల మండలం తాళ్లపల్లిగూడలో అనువైన భూము ల జాబితాను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. కనిష్టంగా 500 ఎకరాల విస్తీర్ణం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, ఒకేచోట అంత భూ లభ్యత లేకపోవడంతో ఒకే రెవెన్యూ పరిధిలో వేర్వేరు పార్శిళ్లలో భూములను అన్వేషిస్తోంది. సిద్దలూరులో సర్వే నంబర్ 176, 263, 217లలోని 500.21 ఎకరాలు, మొండిగౌరెల్లిలో సర్వేనం. 19, 68, 127లలో వేయి ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించింది. తాళ్లపల్లిగూడ సర్వే నంబర్ 84లో 472 ఎకరాలు, చందన్వెల్లి సర్వే 190లో 500 ఎకరాలు ఎంపిక చేసి ప్రతిపాదనలను సర్కార్కి పంపింది. జైలు స్థానంలో రెసిడె న్షియల్ స్కూళ్లు చంచల్గూడ జైలులోని ఖైదీలను విచారణ నిమిత్తం జైలు నుంచి కోర్టుకు.. అక్కడి నుంచి తిరిగి జైలుకు తీసుకురావడం ఇబ్బందిగా పరిణమించింది. ఈ నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఇది సురక్షితం కాదని ప్రభుత్వం.. దీన్ని రంగారెడ్డి జిల్లాకు తరలించాలని భావించింది. దీనికి సీఎం కేసీఆర్ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కాగా, జైలు స్థానంలో మైనార్టీ బాల, బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మొండిగౌరెల్లికి చంచల్గూడ జైలు
యాచారం: ఉస్మానియా ఆస్పత్రి, ఛాతీ వ్యాధుల వైద్యశాల, సెక్రటేరియట్ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా లిస్టులో చంచల్గూడ జైలు కూడా చేరింది. తాజాగా చంచల్ గూడ జైలు మార్చేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు అధికారులు. ఇందుకోసం రంగారెడ్డి యాచారం మండలం మొండిగౌరెల్లిని ఎంచుకోనున్నట్లు సమాచారం. అధికారులు నాగార్జున సాగర్- హైదరాబాద్ రహదారికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండిగౌరెల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను పరిశీలించారు. చంచల్గూడ జైలు నగరం మధ్యన ఉండడం, వివిధ కేసుల్లో జైలుకు వచ్చే వీవీఐపీలు, తీవ్రవాదులను జైలు నుంచి కోర్టులకు తీసుకెళ్లడం భద్రత సిబ్బందికి కష్టతరంగా మారింది. ఇంతేకాకుండా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని నగర శివారు, ఔటర్రింగు రోడ్డుకు అతి సమీపంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఎంపికపై దృష్టి పెట్టారు. మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూర్ మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను పరిశీలించినా మొండిగౌరెల్లినే ఎంపిక చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. -
ఆ కి‘లేడీ’ పై 15 కేసులు
జియాగూడ(హైదరాబాద్ సిటీ): మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ విధించి చంచల్గూడ మహిళా జైలుకు తరలించినట్లు కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ ఖాలీజ్ఖాన్ దర్గా ప్రాంతానికి చెందిన చల్లా నర్సమ్మ(40) కొన్ని నెలలుగా మాయమాటలు చెప్పి ప్రజల వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీ చేస్తోంది. ఈమెపై సుమారు 15 వరకు కేసులు పలు పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. కాగా కుల్సుంపురా పోలీస్స్టేషన్లో ఓ కేసులో నిందితురాలు కావడంతో నర్సమ్మను పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ విధించి చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. -
చంచల్గూడ జైలులో ఖైదీ మృతి
హైదరాబాద్: చంచల్గూడ కారాగారంలో ఒక రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 17వ తేదీన జరిగిన దొంగతనం ఘటనపై డబీర్పురా పోలీసులు శ్రీనివాస్(35)ను అదుపులోకి తీసుకుని రిమాండ్లో ఉంచారు. జైలులో ఉండగానే ఇతడు ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతని మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.