Cyber security
-
సైబర్ నేరాలకు అమాయకులే మోసపోతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఇటీవల మా స్నేహితుడి నంబరు హ్యాక్ అయ్యింది. రూ.లక్ష కావాలని ఇప్పుడే అడుగుతున్నారు. ఆ వ్యక్తికి సుమారు రూ.వెయ్యి లక్షలు ఉంటాయి. రూ.లక్ష అడగడం ఏంటని అనుమానం వచ్చింది. చెక్ చేస్తే సైబర్ నేరగాళ్ల పనిగా తేలింది’అని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన షీల్డ్ సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ 2025 ముగింపు సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జితేందర్ మాట్లా డుతూ.. ‘ప్రతిరోజూ రాష్త్రంలో వందల సంఖ్యలో, దేశంలో వేల సంఖ్యలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది అమాయక ప్రజలు మోసపోతున్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయం. ప్రజల భద్రత మా డ్యూటీ. సైబర్ నేరగాళ్లు డిజిటల్ మీడియాలో కొత్త ఆవిష్కరణలతో వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. మేము కూడా అదే స్థాయిలో బాధ్యత కలిగి ఉండాలి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశంలో అగ్రగామిగా ఉంది. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రతినిత్యం కొత్త పద్ధతుల్లో ఆలోచించాలి. కచ్చితంగా దీనిపై పరిశోధనలు కొనసాగిస్తాం. అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, అధునాతన ఫోరెన్సిక్ నైపు ణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. సమ ర్థవంతమైన, సురక్షితమైన డిజిటల్ వాతావర ణాన్ని సృష్టించడం దీని ముఖ్య ఉద్దేశం’అని పేర్కొన్నారు. షీల్డ్ 2025 నిర్వహించిన ప్రధాన ఉద్దేశం విజయవంతమైందని చెప్పారు. అంతకు ముందు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లా డుతూ గడిచిన రెండు రోజులుగా నడుస్తున్న సమా వేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపు చ్చుకోవడం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం, కార్యాచరణకు ఒక బలమైన వేదికగా నిలిచిందన్నా రు. దీనికోసం మేం రెండు నెలలు కష్టపడ్డామని, విజయవంతంగా ముగించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ దశాబ్దకాలం క్రితం ప్రధాని డిజిటల్ ఇండియా ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. భౌతికయుద్ధాలు ఉండవని, రక్తం చిందించకుండా సైబర్ దాడులే ఉంటాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు అద్భుతమైన ఖ్యాతిని గడించారంటూ సైబర్ సెక్యూరిటీ బృందాన్ని అభినందించారు. అంతకు ముందు పలుఅంశాలపై బృంద చర్చలు జరి గాయి. ఏఐ పనితీరుపై వర్క్షాప్ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆక ట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, పోలీసు అధికారులు జోయెల్ డేవిడ్, హర్షవర్ధన్, దేవేందర్సింగ్ పాల్గొన్నారు. -
గేమింగ్ యాప్ల యాక్సెస్ ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమింగ్ యాప్లకు తెలంగాణలో యాక్సెస్ లేకుండా చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఆ సంస్థల నిర్వాహకులను కోరింది. రాష్ట్రంలో ఆన్ లైన్ గేమింగ్ వ్యసనంతో అప్పులై ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత వివరాలతో బుధవారం ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్(ఏఐజీఎఫ్), ఫెడరే షన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్, ప్రధాన గేమింగ్ ప్లాట్ఫాం వ్యవ స్థాపకులు, సీఈవోలతో టీజీసీఎస్బీ కీలక సమావేశం నిర్వహించింది. తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి చర్యలను అన్వేషిస్తున్నట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్ స్పష్టం చేశారు. రాష్ట్రం తీసుకొచ్చిన గేమింగ్ చట్టం, చట్టపరమైన నిబంధనలు, గేమింగ్ కార్యకలాపాలకు వర్తింపచేసే అంశంపై నొక్కి చెప్పారు. ఈవారంలో తెలంగాణలో నమోదైన కేసులకు సంబంధించిన గేమింగ్ ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో వారి ప్లాట్ఫారమ్లను నిలిపివేయాలని ఆదేశించినట్టు శిఖాగోయెల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జియోఫెన్సింగ్, కఠిన కేవైసీ నిబంధనలు పాటించని, స్థానిక చట్టాలను ఉల్లంఘించే గేమింగ్ ప్లాట్ఫారమ్లపై నియంత్రణ చర్యలు, అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. భారతీయ, ఆఫ్షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లను పర్యవేక్షించడానికి, రాష్ట్ర నిర్దిష్ట చట్టాల నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖకు అధికారికంగా నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు శిఖాగోయెల్ తెలిపారు. -
సైబర్.. సైరన్..!
పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు(Cyber Crime) సైతం పెచ్చుమీరుతున్నాయి. రోజుకొక మోసంతో కేటుగాళ్లు కోట్లలో కొళ్లగొడుతున్నారు. ఒకరికి ఒకరు కనిపించకుండా, ముఖ పరిచయం లేకపోయినా లింక్ సిస్టమ్లా వీళ్లు పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్న వర్గాలు, యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయక ప్రజలంతా వీరి బాధితులే. సెల్లో లింకే కదా అని క్లిక్ చేస్తే మిమ్మల్ని బుక్ చేస్తారు. ఇలాంటి మోసాలతో రూ.లక్షలు పోగొట్టుకుని పరువు సమస్యతో పోలీసులకు ఫిర్యాదులివ్వలేక అనేకమంది సతమతం అవుతున్నారు. ఈ సైబర్ నేరాలపై అవగాహనకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్అందమైన వల.. చిక్కారో విలవిలమనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పద్ధతి ఎక్స్టార్సన్. అలాగే అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు దోచుకోవడం సెక్స్టార్సన్. వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ (డేటింగ్ యాప్), ఇన్స్ట్రాగామ్ (Instagram) వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా మనలో ఉండే బలహీనతలను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు సెక్స్టార్సన్ పద్ధతిలో మోసాలు చేస్తుంటారు. వీరు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల నుంచి నెట్వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతుండటం విశేషం. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు.ఎలా చేస్తారంటే.. సైబర్ కేటుగాళ్లు అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ (ఇతర యాప్స్) ఐడీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్.. అలా నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఆ తర్వాత వాట్సాప్లో వ్యక్తిగత సమాచారం (వ్యక్తిది) తెలుసుకుని అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునేవరకు కథ తీసుకెళ్తారు. అనంతరం చాట్ నుంచి వీడియో కాల్స్లోకి లాగి అవతలివైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్చాట్లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్లో పెడతామని బెదిరిస్తారు.అప్రమత్తతే ఆయుధం » సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్లో తక్షణమే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలి. » www.cybercrime.gov.in పోర్టల్లో ఆన్లైన్ ఫిర్యాదివ్వాలి. సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి ఖాతాలను ఫ్రీజ్ చేయించాలి. పరిధి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. » ఎవరైనా బ్యాంకులో మ్యూల్ ఖాతా తమకు తెలియకుండా వేరే వ్యక్తులు తెరవాలనుకుంటే వెంటనే 1930 సైబర్ సెల్కు ఫిర్యాదు చేయాలి. అంతేకాక ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కు బదిలీ చేస్తే ఖాతాదారులను అప్రమత్తం చేయాలి. ఈ మోసాలు పరిశీలిస్తే.. » శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి తనకున్న బలహీనతతో ఫేస్బుక్లో అమ్మా యి పరిచయం కాగానే మాటామాటా కలిపాడు. ఆమె కూడా వీడియో కాల్ మాట్లాడటం, న్యూడ్ గా కనిపించడంతో తనూ న్యూడ్గా మారి కొంతకాలం ఆనందం పొందాడు. అక్కడికి కొద్దిరో జులకు ఆ అమ్మాయి న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ భయపెట్టి రూ.5 లక్షలు కావా లని బ్లాక్ మెయిల్ చేసింది. బయట తెలిస్తే పరు వు పోతుందని చేసేదేమీలేక డబ్బులు వేసేశాడు. » జిల్లాలోని ఒక ప్రముఖ వైద్యుడు తెలియని లింక్ క్లిక్ చేయడంతో హాయ్ అని ఓ అమ్మాయి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. రిప్లయ్ ఇవ్వడంతో న్యూడ్ వీడియో కాల్స్ తరచూ చేసేది. అక్కడికి కొద్దిరోజులకు వీడియోలు బయటపెడతామంటూ, డిజిటల్ అరెస్టు అవుతావంటూ ఢిల్లీ పోలీస్ సెటప్తో కొందరు వ్యక్తులు స్కైప్కాల్లో దర్శనమవ్వడంతో వాళ్లడిగిన రూ.18.50 లక్షలు చదివించేశారు. » శ్రీకాకుళం రూరల్ మండలంలో సంపన్న వర్గానికి చెందిన ఓ వృద్ధుడు అశ్లీల వీడియోలు చూసే అలవాటుండడంతో అందులో ఓ మెసేజ్ రావడంతో ఆన్సర్ చేశాడు. ఓ ఇద్దరు యువతుల ముఖాలతో ఉన్న పురుషులు వీడియో కాల్లో కనిపించి వృద్ధునికి మత్తెక్కే మాటలతో మైమరిపించగా వృద్ధుడు న్యూడ్గా మారాడు. తక్షణమే ఆ వీడియోలు వృద్ధునికి పంపించి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా. రూ.6 లక్షల వరకు సమర్పించేశాడు. » ఇదే తరహాలో ఏఐ సాయంతో జిల్లాలో ఓ మహిళా అధికారికి మోసం చేసే క్రమంలో ఆమె అప్రమత్తం అవ్వడంతో త్రుటిలో సైబర్ ఉచ్చునుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండాలి ఏ బ్యాంకు కూడా ఆన్లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింక్లు ఓపెన్ చేయరాదు. వాళ్లు మన ఫోన్ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత మాయం చేస్తారు. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. ఎప్పటికప్పుడు మన ఖాతాను పరిశీలిస్తుండాలి. సెక్స్టార్షన్కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడి పరువు సమస్యతో ఫిర్యాదు చేయకపోతే సైబర్ నేరగాళ్లకు మీరే బలమైన ఆయుధాన్ని ఇచ్చిన వారవుతారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే ఆపద నుంచి బయటపడవచ్చు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా -
తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్పే, జీపే వంటి థర్డ్పార్టీ మోబైల్ యాప్ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్పే, జీపే, పేటీఎం వంటి థర్డ్పార్టీ పేమెంట్ యాప్ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చాట్జీపీటీ సేవల్లో అంతరాయంఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్లను, లింక్లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు. -
ఆన్లైన్ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు!
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్లైన్ మోసాలకు బలయ్యాడు. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.11 వేల కోట్ల రూపాయలు నష్టంప్రతిఏటా వేల కోట్ల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్సీఐ) హెచ్చరించింది.డిజిటల్ అరెస్ట్.. లేటెస్ట్ ట్రెండ్మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.30 లక్షల ఫిర్యాదులుఅమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు. 2023లో 11,31,221 కేసులు నమోదు కాగా, 2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్లైన్ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. చదవండి: సైబర్ స్కామర్స్తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..అప్రమత్తతే రక్షణ కవచంసైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్, వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
టెలికం సంస్థలకు సైబర్ సెక్యూరిటీ నిబంధనలు
న్యూఢిల్లీ: దేశ కమ్యూనికేషన్ నెట్వర్క్లు, సర్వీసులకు భద్రత కల్పించే దిశగా టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. సైబర్ సెక్యూరిటీకి భంగం కలగకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు, ఒకవేళ ఉల్లంఘన ఉదంతాలేమైనా తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు మొదలైనవి వీటిలో ఉన్నాయి.వీటి ప్రకారం ప్రతి టెలికం సంస్థ సైబర్ సెక్యూరిటీ పాలసీని (భద్రత చర్యలు, రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు, శిక్షణ, ఉత్తమ విధానాలు.. టెక్నాలజీలను వినియోగించడం మొదలైనవి) అమలు చేయాల్సి ఉంటుంది. చీఫ్ టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ని నియమించుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఉల్లంఘన జరిగితే ఆరు గంటల్లోగా ప్రభావిత సిస్టం వివరాలను కేంద్రానికి తెలియజేయాలి. 24 గంటల వ్యవధిలో ఏ ప్రాంతంలో, ఎంత మంది యూజర్లపై, ఎంత సేపు ప్రభావం పడింది, తీసుకున్న దిద్దుబాటు చర్యలేమిటి తదితర వివరాలను ఇవ్వాలి.అలాగే, మొబైల్ పరికరాల తయారీ సంస్థలు ఆయా ఉత్పత్తులను విక్రయించడానికి ముందే, వాటి ఐఎంఈఐ నంబరును ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీని మెరుగుపర్చే దిశగా టెలికం సంస్థల నుంచి ట్రాఫిక్ డేటా, ఇతరత్రా వివరాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. -
హైదరాబాద్లో ‘హాక్ 2.0’కు కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరినీ సైబర్ వారియర్స్గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్స్ను మరోసారి నిర్వహించాలని సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. గత ఏడాది ఆయన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా ఉండగా తొలి హాక్–2023 సమ్మిట్ నిర్వహించారు. తాజాగా మరోసారి హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024కు (హాక్ 2.0) సన్నాహాలు చేస్తున్నారు.నగర పోలీసు విభాగం, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తంగా నిర్వహించే ఈ సమ్మిట్ వచ్చే నెల 6న నగరంలోని ది పార్క్ హోటల్లో జరుగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతి ఏడాదీ ఇలాంటి సమ్మిట్స్ నిర్వహించాలని, సైబర్తో పాటు ట్రాఫిక్, నార్కోటిక్స్, ఉమెన్ సేఫ్టీ విభాగాలకు వీటిని విస్తరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే నిర్ణయించారు.యువత... ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న చేపట్టబోయే సైబర్ సమ్మిట్లో కొన్ని విద్యా సంస్థలకు చెందిన సైబర్ స్వ్కాడ్స్ను ఆవిష్కరించే అవకాశం ఉంది. వీళ్లు వారి పాఠశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ముప్పులు పుట్టుకువస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికీ సైబర్ సెక్యూరిటీ అన్నది అత్యంత కీలకాంశంగా మారింది. దీనికోసమే సిటీ పోలీసులు, హెచ్సీఎస్సీ కలిసి పనిచేస్తూ ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి.చదవండి: సైబర్ స్కామర్స్తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి.. -
రాజస్థాన్ లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల భారీ ఆపరేషన్
-
అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్.. 27 మందిపై 2023 కేసులు
సాక్షి, హైదరాబాద్: తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్ను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వీరిని పట్టుకొవాడినికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, రాజస్థాన్లో నాలుగు బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పారు. రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్లలో ఈ ఆపరేషన్ నిర్వహించామని. 15 రోజుల అపరేషన్లో భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అందరూ విద్యావంతులేననని, మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారని తెలిపారు.ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా 2023 కేసులో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్స్, 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్లను స్వాధీనం చేసుకున్నామని ెప్పారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు. 11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందన్నారు.‘సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేశాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు అందర్నీ పట్టుకోగలిగాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్పాచ్ అయ్యి నిందితులను అరెస్ట్ చేశారు. మా బృందాలు ఎప్పటికపుడు నేరస్తుల కదలికలు, లోకేషన్లపై నిఘా పెట్టీ అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కమిషన్ కోసం ఉద్దేశ పూర్వకంగానే మ్యూల్ అకౌంట్ లను నేరస్తులకు ఇస్తున్నారునేరస్తులకు క్రిమినల్ కార్యకలాపాల కోసం అకౌంట్స్ ఇవ్వవద్దు. తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులో నిందితులు రూ. 9 కోట్లు కొల్ల గొట్టారు. నిందితులను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసుల సహకరించారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇది లాస్ట్ ఆపరేషన్ కాదు. మొదటిది. నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తాం. నేరగాళ్లు సిటీలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల కొల్లగొట్టిన రూ. 114 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి ఇచ్చాం. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలి. మ్యూల్ అకౌంట్లను ఓపెన్ చేసేముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలిపారు. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా లింక్లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
అయోధ్య ప్రసాదం.. వీఐపీ దర్శనం!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య రామమందిరం పేరును సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ) హెచ్చరించింది. అయోధ్య ప్రసాదం పంపిణీ పేరిట, విరాళాల సేకరణ పేరిట, వీఐపీ దర్శనం టికెట్ల విక్రయం పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్లలో సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంది. అయోధ్య రామమందిరం పేరుతో సైబర్ నేరస్తులు పంపే క్యూఆర్ కోడ్లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ (ఏపీకే) ఫైల్స్ను నమ్మి మోసపోవద్దని టీఎస్సీఎస్బీ డైరెక్టర్ షికా గోయల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రామమందిరం పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చి నట్లు చెప్పారు. డబ్బు పంపాలంటూ వాట్సాప్ సందేశాల్లో నకిలీ లింక్లు పంపుతున్నారని, ఆ లింక్లు క్లిక్ చేసిన వారి నుంచి బ్యాంకుల వివరాలు, ఫోన్నంబర్లను సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసి ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారని, అలా చేస్తే ఫోన్ల పనితీరు సైబర్ నేరగాళ్ల అ«దీనంలోకి వెళ్తుందని హెచ్చరించారు. ఈ డిజిటల్ ముప్పును ఎదుర్కోవడానికి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని షికా గోయల్ సూచించారు. ఈ తరహా మెసేజ్లు వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అదేవిధంగా www. cybercrime. gov. in ద్వారా లేదా వాట్సాప్లో సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్ 87126 72222కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాత నాణేలిస్తే లక్షలిస్తామని బురిడీ పాత నాణేలు తమకు ఇస్తే బదులుగా రూ. లక్షలు చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని... ఇందిరా గాంధీ, భారతదేశ మ్యాప్ చిత్రాలున్న పాత రూ. 2 లేదా రూ. 5 నాణేలు పంపిస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుందని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కే అమాయకులకు డబ్బు చెల్లిస్తామని... అందుకోసం ముందుగా టీడీఎస్, సర్విస్ చార్జీలు చెల్లించాలంటూ కేటుగాళ్లు డబ్బు దండుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాలపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు.. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి. 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది. దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి. 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి. టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది. ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ.. రిస్క్ మేనేజ్మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది. -
స్ట్రిప్డ్ ఫ్లై మాల్వేర్తో జాగ్రత్త
ఫుకెట్ (థాయిల్యాండ్): సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ.. స్ట్రిప్డ్ ఫ్లై అనే మాల్వేర్ విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడినట్టు తెలిపింది. ఆరంభంలో ఇది క్రిప్టోకరెన్సీ మాదిరిగా నటించి, ఆ తర్వాత మొండి మాల్వేర్గా మారిపోయినట్టు పేర్కొంది. ఈ మాల్వేర్ బహుళ మాడ్యూల్ను కలిగి ఉండడం, క్రిప్టో మైనర్గా, రామ్సమ్వేర్ సమూహంగా వ్యవహరించి.. ఆర్థిక లాభం నుంచి గూఢచర్యం వరకు కార్యకలాపాలు విస్తరించగలదని కాస్పర్స్కీ హెచ్చరించింది. బాధితులపై విస్తృతంగా నిఘా పెట్టే సామర్థ్యాలను ఈ మాల్వేర్ వెనుకనున్న వ్యక్తులు సంపాదించినట్టుగా తెలిపింది. యూజర్కు తెలియకుండానే, వారి స్మార్ట్ఫోన్ స్క్రీన్ షాట్లు ఈ మాల్వేర్ తీసుకోగలదని, స్మార్ట్ఫోన్పై గణనీయమైన నియంత్రణ పొందగలదని వివరించింది. స్టిప్డ్ ఫ్లై మాల్వేర్ బారిన పడకుండా కొన్ని చర్యలు సాయపడతాయని తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసుకోవడం, అప్లికేషన్లు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అనుమానిత లింక్లపై క్లిక్ చేసే ముందు, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే ముందు పంపించిన వారి ఐడెంటిటీని పరిశీలించాలని పేర్కొంది. -
పటిష్ఠతే పరమావధి!
అనుమానం పెనుభూతం! ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమమైన మన ‘ఆధార్’ విశ్వసనీయతపై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. భారత సర్కార్ ఎప్పటికప్పుడు ఆ అనుమానాల్నీ, ఆరోపణల్నీ కొట్టిపారేస్తున్నా అవి మాత్రం ఆగడం లేదు. ప్రపంచశ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యతలపై లేవనెత్తిన ప్రశ్నలతో ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధా రాలూ పేర్కొనకుండా, అర్థం లేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను కొట్టిపారేసింది. అయితే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద శ్రామికులకు జరిపే చెల్లింపులు సహా సమస్తం ఇకపై ఆధార్తోనే జరపాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్ని స్తున్న వేళ మూడీస్ నివేదికలోని మాటలు కొంత ఆందోళన రేపుతున్నాయి. సత్వరమే ఆ అనుమా నాల్ని నివృత్తి చేసి, ఆధార్ సందేహాతీతమైనదని మరోసారి చాటాల్సిన అవసరం ఏర్పడింది. న్యూయార్క్ కేంద్రంగా నడిచే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం విడుదల చేసిన పరిశోధనా నివేదిక ఆ మధ్య కొత్తగా రంగప్రవేశం చేసిన ‘వరల్డ్ కాయిన్’తో మన ఆధార్ను పోల్చింది. విస్తృత పరిమాణం, సృజనాత్మక ఆలోచన రీత్యా రెండూ ప్రత్యేకంగా నిలిచాయని ప్రశంసించింది. అయితే, భద్రత, గోప్యతలే అసలు సమస్యలంటూ కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలు వేసింది. ఉష్ణోగ్రత, ఉక్క పోత ఎక్కువగా ఉండే చోట ఆధార్ లాంటి బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్నది సదరు నివేదిక అనుమానం. ఆధార్ ధ్రువీకరణలో ఇబ్బందుల వల్ల పలుమార్లు సేవలు అందడం లేదనేది దాని వాదన. అన్నిటి కన్నా ముఖ్యంగా, ఆధార్ వ్యవస్థ సురక్షితమేనా, అందులోని వ్యక్తిగత సమాచారం గోప్యమేనా అన్నది మూడీ సంధిస్తున్న ప్రశ్న. దేశంలో 120 కోట్లమందికి పైగా బయోమెట్రిక్, జనసంఖ్యా సంబంధ వివరాలను ఈ ఆధార్ బృహత్ యజ్ఞంలో నమోదు చేశారు. ఎవరికి వారికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, వన్టైమ్ పాస్వర్డ్ లాంటì పద్ధతుల్లో వ్యక్తులు తమ గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను అందుకొనే వీలు కల్పించారు. మొదట కొంత తటపటాయింపు ఉన్నా, క్రమంగా ఆధార్ నమోదు, దాని వినియోగం విస్తరించింది. బలహీనవర్గా లకు అందించే ప్రభుత్వ సహాయాలకే కాదు... చివరకు బ్యాంకు ఖాతాల ఆరంభం, మొబైల్ కనెక్షన్, పన్నుల చెల్లింపు సహా అనేక రోజువారీ పనులకు సైతం ఆ నంబర్ తప్పనిసరైంది. దళారుల బాధ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సంక్షేమ పథకాల సాయం అందేలా ఆధార్ బాట వేసింది. ఆధార్ వ్యవహారాలన్నీ చూసే కేంద్ర సంస్థగా ‘భారత యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ’ (యూఐడీఎఐ) వ్యవహరిస్తోంది. చిత్రం ఏమిటంటే, సదరు సంస్థకు నాలుగేళ్ళుగా నాధుడు లేడు. ఎట్టకేలకు గత నెలలో ప్రభుత్వం ఓ తాత్కాలిక ఛీఫ్ను నియమించింది. ఇలాంటి చర్యలు ఆధార్ నిర్వహణ పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాగే, ఈ సంస్థపై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక సైతం ఆధార్ నమోదు ప్రక్రియలో లోపాలు, తప్పుడు బయోమెట్రిక్ లాంటి అనేక అంశాలను ఎత్తిచూపడం గమనార్హం. ఆధార్లో నమోదైన సమాచారపు భద్రత, వ్యక్తిగత గోప్యత గాలికి పోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. ఇవాళ్టి మూడీస్ నివేదిక కన్నా చాలా ముందే మన ‘కాగ్’ వ్యక్తం చేసిన ఈ భయాలపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నదీ సమాచారం లేదు. కేంద్రంలో గడచిన ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో ఆరంభమైన ప్పటి నుంచి ఆధార్పై భిన్న వాదనలు వస్తూనే ఉన్నాయి. ఆధార్కు అనేక సానుకూలతలు ఉన్నప్ప టికీ ఈ ప్రక్రియ, వినియోగం నిర్దుష్టమైనదేమీ కాదని సర్కార్ నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుసు. ఇవాళ్టికీ గ్రామీణ భారతావనిలో డిజిటల్ గుర్తింపు చూపలేనివారికి రేషన్ అంద ట్లేదనీ, కొన్ని ఆకలి చావులకు అదీ ఒక కారణమనీ వార్తలొచ్చాయి. ఆధార్ లోపానికీ, ఆ చావులకూ కారణం లేదన్న ఖండనలూ విన్నాం. అయితే, అతిగా టెక్నాలజీపై ఆధారపడి, సాయం పొందా ల్సినవారిని తృణీకరించడం, అసలు లక్ష్యాన్ని విస్మరించడం అమానవీయతే! రోజూ పనిపాటలతో శ్రమించే వారి చేతిరేఖలు చెరిగిపోతే అది వారి పాపమా? కంటిపాపల స్కానింగ్, వన్టైమ్ పాస్వర్డ్ లాంటివి కూడా ఉన్నా నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వాటి మీద పూర్తిగా ఆధారపడలేం. అలాగే, అంచెలంచెల సైబర్ భద్రత ఉందని సర్కారు చెబుతున్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఆధార్ సమాచారం గంపగుత్తగా లీకవడం చూశాం. ఈ సమాచార నిధి సైబర్ దొంగల చేతిలో పడితే పర్యవసానాలూ తీవ్రమే! అందుకే, లోపాలను ప్రస్తావించినవారిని నిందించే కన్నా, వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కేంద్రీకృత విధానం బదులు సమాచార గోప్యత, రక్షణ కోసం మూడీస్ సూచించినట్లుగా ఆధార్కు వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించడం మంచిదేమో చూడాలి. తద్వారా ఒక అంచెలో ఉల్లంఘన జరిగినప్పటికీ, అక్కడితో నష్టనివారణ చేయగలమని గుర్తించాలి. ఇటీవల జీ–20లోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)లో అద్భుతమంటూ మనం చెప్పుకున్న ఆధార్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరపాలి. పూర్తి లోపరహితంగా మార్చే పని మొదలుపెట్టాలి. ఓటర్ల జాబితా సహా సమస్తానికీ ఆధారంగా అనుసంధానించాలని అనుకుంటున్న వేళ అది మరింత అవసరం. -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్షాట్కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్లలోని లింక్లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్లను నమ్మవద్దు. -
నాగ్పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నాగ్పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్లను వివిధ రకాల పాస్వర్డ్లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
సైబర్ సేఫ్టీకి 5 S సూత్రం.. పాస్వర్డ్ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్లలోనే సగం సమయం గడిచిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ వాడకం మొదలు ఆన్లైన్ ఆర్డర్లు, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల వరకు పని ఏదైనా ఫోన్, ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. టెక్నాలజీ వాడకంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అంతేస్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే సైబర్ జమానాలో సేఫ్గా ఉండేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది. 5ఎస్ సూత్రాన్ని పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని పేర్కొంది. ఏమిటి ఆ 5ఎస్? స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్, సెక్యూర్ నెట్వర్క్, సెక్యూర్ వెబ్సైట్స్ లేదా యాప్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సస్పీషియస్ లింక్ అలర్ట్...కలిపి 5 ఎస్లుగా పోలీసులు సూత్రీకరించారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సోషల్ మీడియా ఖాతాలకు, ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు, ఈ–మెయిల్స్కు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవడం ఉత్తమం. ఒకటే పాస్వర్డ్ను అన్నింటికీ పెట్టడం రిస్క్ అని గుర్తించాలి. పాస్వర్డ్లో వీలైనంత వరకు మన పేరు, బర్త్డే తేదీలు, పిల్లల పేర్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పాస్వర్డ్ను అంకెలు, క్యారెక్టర్లు, పెద్ద, చిన్న అక్షరాల మిళితంగా పెట్టుకోవాలి. పాస్వర్డ్లను ఇతరులకు షేర్ చేయవద్దు. సెక్యూర్ వెబ్సైట్స్, యాప్స్, సెక్యూర్ నెట్వర్క్.. మనం వాడే వెబ్సైట్లు, డౌన్లోడ్ చేసుకొనే యాప్స్ సరైనవేనా అన్నది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. యాప్లను డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ రేటింగ్ పరిశీలించాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్.. మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్తో అప్డేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల సైబర్ దాడుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వినియోగించుకోవాలి. సస్పీషియస్ లింక్ అలర్ట్... మనకు మెసేజ్లు, వాట్సాప్ సందేశాలు, ఈ–మెయిల్స్ రూపంలో వచ్చే మెసేజ్లలోని అనుమానాస్పద లింక్లపై ఎట్టిపరిస్థతుల్లోనూ క్లిక్ చేయవద్దు. చాలా తక్కువ అక్షరాలతో ఉండే లింక్లు చాలా వరకు అనుమానాస్పదమైనవని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్షర దోషాలు ఉన్న లింక్లు సైతం అనుమానాస్పదమైనవని తెలుసుకోవాలి. -
భారత్కు మాల్వేర్ ముప్పు.. సైబర్సెక్యూరిటీ సంస్థ నివేదికలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే భారత్కు మాల్వేర్పరమైన ముప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో ఇవి ఏకంగా 31 శాతం ఎగిశాయి. అలాగే రాన్సమ్వేర్ దాడులు 53 శాతం పెరిగాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ సోనిక్వాల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్ వంటి దేశాల్లో సైబర్ నేరగాళ్లు తమ దాడుల పరిధిని మరింతగా పెంచుకుంటున్నారని, కొత్త టార్గెట్లను ఎంచుకోవడం, కొంగొత్త విధానాలు అమలు చేస్తున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేబాశీష్ ముఖర్జీ తెలిపారు. వారు అవకాశాల కోసం నిరంతరం అన్వేషిస్తూ, ఒకసారి విజయవంతమైతే మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని వివరించారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సైబర్ నేరగాళ్ల వ్యూహాలను ఆకళింపు చేసుకుని, వారి దాడులను ఎదుర్కొనగలిగే నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2022లో 173.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 8.9 శాతం వృద్ధి చెందుతూ 2027 నాటికి 266.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనాలు ఉన్నాయి. సోనిక్వాల్ సర్వీసులు అందించే క్లయింట్లలో 55 శాతం పెద్ద సంస్థలు ఉండగా, 45 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. ఇదీ చదవండి: టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం! -
సైబర్ వార్ఫేర్ను ఎదుర్కొనేలా మన ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం. అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది. సైబర్ దాడులు దేశ విద్యుత్ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎస్ఐఆర్ టీమ్ ఏర్పాటు సైబర్ సెక్యూరిటీలో భాగంగా పవర్ ఐలాండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కింద సెంట్రల్ గ్రిడ్కు అనుసంధానించారు. ఈ గ్రిడ్లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గ్రిడ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్కో జీఐఎస్ మోడల్ను తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. -
మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్: సైబర్ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ
ప్రపంచంలోనే అతి పెద్దఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మహిళలకు శుభవార్త అందించింది. లక్షమందికి సైబర్ సెక్యూరిటీ శిక్షణను అందించేందుకు ముందుకొచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు భర్తీ కావచ్చన్న అంచనాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా Ready4Cybersecurity ప్రోగ్రామ్, దాని గ్లోబల్ సైబర్సెక్యూరిటీ స్కిల్లింగ్ ఇనిషియేటివ్లో ఈ శిక్షణను ఇవ్వనుంది. రానున్న ఎనిమిదేళ్లలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ 350 శాతం పెరగనుంది. దీంతో యువతుల్లో సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది మైక్రోసాఫ్ట్. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేయనుంది. సైబర్ సెక్యూరిటీలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నైపుణ్య విషయంలో అంతరాల్ని పూరించడం, విభిన్న సైబర్ సెక్యూరిటీ వర్క్ఫోర్స్ను నిర్మించడమే తమ లక్క్ష్యమని సంస్థ పేర్కొంది. (ఇదీ చదవండి: నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) మైక్రోసాఫ్ట్ డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ ప్రకారం, 2022లో పాస్వర్డ్ ఎటాక్ ఘటనలు ప్రతి సెకనుకు 921కు పెరిగింది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఇది 74శాతం పెరిగింది. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న సైబర్ దాడులనష్టం 4.35 మిలియన్ల డాలర్లుగా ఉంది. మరోవైపు గ్లోబల్గా సైబర్ సెక్యూరిటీ వర్క్ఫోర్స్లో మహిళలు కేవలం 25 శాతం మాత్రమే ఉన్నందున, వీరిని ప్రోత్సహించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) -
‘అజ్ఞాత’ శత్రువు.. దడపుట్టిస్తున్న ‘అనానిమస్ సూడాన్’
ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు... ఏ ప్రతిఫలం ఆశించట్లేదు... కేవలం ఉనికి చాటుకోవడానికే దాడులు చేస్తున్నారు! ఏ రోజు, ఎక్కడ, ఎవరిపై దాడి చేసేది ట్విట్టర్ ద్వారా ముందే ప్రకటించి మరీ దెబ్బతీస్తున్నారు!! ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ యుద్ధం చేస్తున్నారు!! గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘అనానిమస్ సూడాన్’వ్యవహారమిది. ఈ దాడులకు గురైన వాటిలో హైదరాబాద్కు చెందిన అనేక సంస్థలు సైతం ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ సంస్థ రెడ్వేర్ సేకరించిన ఆధారాల ప్రకారం సూడాన్కు చెందిన కొందరు హ్యాకర్లు ‘అనానిమస్ సూడాన్’గ్రూప్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాము ఈ–ఎటాక్స్ చేస్తున్నామని ఈ గ్యాంగ్ ప్రచారం చేసుకుంటోంది. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, యావత్ ప్రపంచానికి సైబర్ సవాల్ విసరడానికే తమ ‘ఆపరేషన్స్’అని చెప్పుకుంటోంది. గత నెల నుంచే ఎటాక్స్ మొదలుపెట్టిన ఈ హ్యాకర్లు... తొలుత ఫ్రాన్స్ను టార్గెట్ చేశారు. అక్కడి ఆస్పత్రు లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాల వెబ్సైట్లపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ రంగంలో వారి పేరు మారుమోగిపోయింది. ట్విట్టర్ ద్వారా ప్రకటించి మరీ... అనానిమస్ సూడాన్ గ్యాంగ్ తాము ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నెల 6న తమ ట్విట్టర్ ఖాతా హ్యష్ట్యాగ్ అనానిమస్ సూడాన్లో ‘ఆఫ్టర్ ఫ్రైడే.. ఇండియా విల్ బీ ది నెక్ట్స్ టార్గెట్’(శుక్రవారం తర్వాత భారతదేశమే మా లక్ష్యం) అంటూ ప్రకటించారు. ఆ తర్వాతి రోజే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్సైట్పై సైబర్ దాడి జరిగింది. అప్పటి నుంచి వరుసబెట్టి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్లలోని విమానాశ్రయాలు, ఆస్పత్రుల వెబ్సైట్లపై ఈ–ఎటాక్స్ జరిగాయి. అయితే ఈ–దాడులు పోలీసు, సైబర్క్రైమ్ అధికారుల రికార్డుల్లోకి వెళ్లకపోయినా ఈ బాధిత సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో డిమాండ్స్... కేవలం సవాళ్లే సాధారణంగా సైబర్ ఎటాక్స్ చేసే హ్యాకర్లు అనేక డిమాండ్లు చేస్తారు. వీలైనంత మేర బిట్కాయిన్ల రూపంలో సొమ్ము చేజిక్కించుకోవాలని, డేటా తస్కరించాలని చూస్తుంటారు. సంస్థలు, వ్యవస్థల్ని హడలెత్తిస్తున్న ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ తీరుతెన్నులే దీనికి ఉదాహరణ. అయితే అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ మాత్రం ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. చివరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఎటాక్ చేయడానికి సిద్ధమైన ఈ హ్యాకర్లు... కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం కోసమే వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత కాలంలో హాస్పిటల్స్, వాటి రికార్డులు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అనానిమస్ సూడాన్ హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. డాక్స్ ఎటాక్స్తో సర్వర్లు క్రాష్ ఇతర మాల్వేర్స్, హాకర్ల ఎటాక్స్కు భిన్నంగా అనానిమస్ సూడాన్ ఎటాక్స్ ఉంటున్నాయి. డీ డాక్స్గా పిలిచే డి్రస్టిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో వారు దాడి చేస్తుంటారు. ప్రతి సంస్థకు చెందిన వెబ్సైట్కు దాని సర్వర్ను బట్టి సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి ట్రాఫిక్ను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అంతకు మించిన హిట్స్ వస్తే కుప్పకూలిపోతుంది. పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయా బోర్డులకు చెందిన వెబ్సైట్లు మొరాయించడానికి ఇదే కారణం. అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ దీన్నే ఆధారంగా చేసుకున్నారు. టార్గెట్ చేసిన వెబ్సైట్లకు ప్రత్యేక ప్రొగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్, క్వెర్రీస్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ ట్రాఫిక్ను తట్టుకోలేని సర్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. ఈ కారణంగా నిజమైన వినియోగదారులు ఆ వెబ్సైట్ను సాంకేతిక నిపుణులు మళ్లీ సరిచేసే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’తోనూ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ‘అనానిమస్ సూడాన్’ఎటాక్స్ ఓవైపు కలకలం సృష్టిస్తుంటే మరోవైపు ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా అనే హాకర్ల గ్రూప్ సైతం దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తాజాగా ప్రకటించింది. ఐ4సీ పరిధిలోని సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ వింగ్ హాకర్ల కుట్రను బయటపెట్టింది. డినైయెల్ ఆఫ్ సర్వీస్ (డీఓఎస్), డిస్ట్రిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ (డీ–డాక్స్) విధానాల్లో ఈ హ్యాకర్లు ఆయా వెబ్సైట్స్ సర్వర్లు కుప్పకూలేలా చేయనున్నారని అప్రమత్తం చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లు వారి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాది ఢిల్లీ ఎయిమ్స్ జరిగిన సైబర్ దాడి ఈ తరహాకు చెందినదే అని, దేశంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్గా ఈ గ్రూప్ మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు సైబర్ దాడులు, హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వెబ్సైట్లను సైబర్ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలో కీలక సూచనలు చేసింది. ఉమ్మడిగా పని చేస్తే కట్టడి అనానిమస్ సూడాన్ ఎటాక్స్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వల్ల నష్టం తగ్గించడానికి పోలీసులతోపాటు సైబర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. హ్యాకర్ల టార్గెట్లో ఉన్న సంస్థలను అప్రమత్తం చేయడం, అవసరమైన స్థాయిలో ఫైర్ వాల్స్ అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థకూ పూర్తిస్థాయిలో సైబర్ భద్రత ఉండదు. అయితే కొత్త సవాళ్లకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి. – రాజేంద్రకుమార్, సైబర్ నిపుణుడు -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా?
జైపూర్: ఒకవైపు సైబర్ దాడులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలు దేశంలో చాలా కంపెనీలకు లేవన్న విషయాన్ని సైబర్ సెక్యూరిటీపై సిస్కో నిర్వహించిన సర్వేలో తెలిసింది. అధునాతన సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యాలు కేవలం 24 శాతం కంపెనీలకే ఉన్నట్టు సిస్కో ప్రకటించింది. ఇదీ చదవండి: స్టార్బక్స్ సీఈవోగా నరసింహన్.. బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు వచ్చే మూడేళ్లలో భారత్లో ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. వచ్చే 12–24 నెలల్లో తమ వ్యాపారాలకు విఘాతం కలిగించే సైబర్ దాడులు జరగొచ్చని భావిస్తున్నట్టు సిస్కో సర్వేలో 90 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ సన్నద్ధత సగటున కేవలం 15 శాతంగానే ఉందని, ఈ విధంగా చూస్తే భారత్ మెరుగ్గా ఉన్నట్టు సిస్కో తెలిపింది. భారత్లోని 38 శాతం కంపెనీలు ఆరంభ, ఏర్పాటు స్థాయిలో ఉన్నవేనని పేర్కొంది. స్వతంత్ర థర్డ్ పార్టీతో సిస్కో ఈ సర్వే చేయించింది. 27 మార్కెట్ల నుంచి 6,700 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు సర్వేలో పాల్గొన్నారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి సొల్యూషన్లను కంపెనీలు ఏర్పాటు చేశాయి, అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇదీ చదవండి: గోపీనాథన్ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! చిన్న కంపెనీలకు ముప్పు అధికం.. ఇందులో ఆరంభ, స్టార్టప్, పురోగతి, పూర్తి స్థాయి కంపెనీలు అని సిస్కో సర్వే వర్గీకరించింది. ఆరంభ దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను ఏర్పాటు చేసే దశలో ఉన్నాయి. వీటికి 10 కంటే తక్కువే స్కోర్ లభించింది. ఏర్పాటు దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అమలు చేసే దశలో ఉన్నాయి. వీటికి స్కోర్ 11–44 మధ్య ఉంది. సైబర్ భద్రతా సన్నద్ధత విషయంలో ఇవి సగటు కంటే తక్కువ పనితీరు చూపిన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. పురోగతి దశలోని కంపెనీలు సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా సగటు కంటే ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయికి చేరిన కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లలో చాలా ముందంజలో ఉండడమే కాకుండా, రిస్క్లను ఎదుర్కొనే సామర్థ్యాలతో ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో తాము సైబర్ దాడిని ఎదుర్కొన్నామని, వీటి కారణంగా తమకు రూ.4–5 కోట్ల స్థాయిలో నష్టం ఎదురైనట్టు 53 శాతం మంది సర్వేలో చెప్పారు. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ‘‘సైబర్ సెక్యూరిటీకి వ్యాపార సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అవి తమ డిజిటైజేషన్ ప్రయాణాన్ని కొనసాగించగలవు. హైబ్రిడ్ పని విధానం ప్రముఖంగా మారడం, సేవలు అప్లికేషన్ ఆధారితం కావడంతో.. సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా ఉన్న అంతరాలను తగ్గించుకోవడం కంపెనీలకు కీలకం’’ అని సిస్కో ఇండియా సెక్యూరిటీ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్ సమీర్ మిశ్రా తెలిపారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
భారత్లో సైబర్ భద్రత, గోప్యత బలహీనం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆవిష్కరణలు, వాటిని ఉపయోగించుకోవడంలో భారత్ ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ విడుదల చేసిన భారత డిజిటల్ ఎకనామీ నివేదిక తెలిపింది. కానీ, సైబర్ భ్రదత, గోప్యత విషయంలో భారత్ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా సైబర్ భద్రత చట్టం లేకపోవడం వల్ల, భారతీయులు ఆయా రంగాల నిబంధనలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. అసాధారణ స్థాయిలో డిజిటల్ పరివర్తన చూపిస్తున్న భారత్లో, సైబర్ భద్రత బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయడింది. భారత్లో ఆవిష్కరణలు, డిజిటల్ సేవల సామర్థ్యాలను వినియోగించుకునే తీరుపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. ఇంటరెŠన్ట్ను ఉపయోగించుకుని, వృద్ధి చెందడం, ఉపాధి కల్పన, పరిపానాల మెరుగుదల అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నది విశ్లేషించింది. ‘‘జీ20లోని తోటి దేశాలతో పోలిస్తే తక్కువ మధ్యాదాయం కలిగిన దేశం భారత్. కానీ, ఆవిష్కరణల్లో మాత్రం భారత్ ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. భారతీయులు త్వరితగతిన డిజిటల్ సేవలను వినియోగించుకోవడం తదుపరి వృద్ధిని వేగవంతం చేస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. సైబర్ నేరాలు, గోప్యతపై దాడి ఈ రెండు అంశాలపై భారత్ అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉందని సూచించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ద్వారా ఈ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపింది. సైబర్ దాడుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు భారత్ ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్లో డిజిటైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. సైబర్ భద్రత కవచాలు ఏర్పాటు చేసుకోవడంలో మోస్తరు పురోగతినే చూపించినట్టు స్పష్టం చేసింది. -
వచ్చేస్తున్నారు.. సైబర్ కమాండోలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు కమాండోలు అంటే మనకు తెలిసిందే. ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ పొంది రెప్పపాటులో శత్రు శ్రేణులపై దాడి చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో సైబర్ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. రోజుకో సవాల్ విసురుతున్న సైబర్ నేరస్తుల ఆటకట్టించేందుకు ఇప్పటికే శిక్షణ పొందారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు డివిజన్లు, 14 విభాగాలుగా ఏర్పాటైన ఈ బ్యూరో మరో రెండు నెలల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమైంది. కమిషనరేట్లో ఠాణా, జిల్లాలో సైబర్ సెల్స్.. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సైబర్ నేరాలను కూకటివేళ్లతో సహా పెకిలించేలా క్షేత్రస్థాయి నుంచే సైబర్ నేరాలను నివారించేందుకు ఈ బ్యూరో పనిచేయనుంది. ఈ బ్యూరోలో ప్రధానంగా మూడు డివిజన్లు, 14 విభాగాలుంటాయి. ప్రధాన కార్యాలయం సైబరా బాద్ కమిషనరేట్లో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో ప్రత్యేకంగా సైబర్ పోలీసుస్టేషన్ ఉంటుంది. మిగిలిన జిల్లాలలో సైబర్ కో–ఆర్డినేట్ సెల్స్ ఉంటాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైబర్ నేరాల నివారణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విధులు నిర్వర్తిస్తారు. అధికారులకు విధుల కేటాయింపు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 454 మంది అధికారులను కేటాయించింది. ఆయా పోలీసులు హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సైబర్ కమాండోలుగా సిద్ధమయ్యారు. 140 మంది వారియర్లు సైబరాబాద్ కమిషనరేట్లోని ప్రధాన కార్యాల యంలో, మిగిలిన 314 మంది ఇతర కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. సైబర్ సెక్యూరిటీబ్యూరో ప్రధాన విధులివే.. ►సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం ►బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేర గాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింప జేయడం. ►నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించి నియంత్రించడం. ►పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి పీడీ యాక్ట్లు నమోదు చేయడం. అంతర్రాష్ట్ర నిందితుల ఆటకట్టు రాజస్తాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సైబర్నేరాలకు అడ్డాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అంతర్రాష్ట్ర నేరస్తు లను పట్టుకొనేందుకు వెళ్లిన రాష్ట్ర పోలీసులకు అక్కడి పోలీసులు సహకరించకపోవడం, నేరస్తు లు పోలీసులపై కాల్పులు, దాడులు జరపడం కూడా జరిగాయి. ఈ తరహా ఆటంకాలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిష్కారమార్గాలను కను గొంది. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వంటి సంస్థల సమన్వయంతో ఈ బ్యూరో పనిచేయనుంది. -
కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు
సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేషన్లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోర్సును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించిన టీఎస్సీహెచ్ఈ... ఆ కోర్సు పాఠ్యాంశం, విధానాలు తదితరాల ఖరారు కోసం డీజీపీ కార్యాలయం, ఉస్మా ని యా, జేఎన్టీయూ, నల్సార్ యూనివర్సిటీల తో పాటు ఐఐటీ హైదరాబాద్లను ప్రతి పాది స్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గురువారం టీఎస్సీ హెచ్ఈ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సైబర్ సెక్యూరిటీ అండ్ సైన్స్ కోర్సు విధివిధానాలపై చర్చించారు. -
సైబర్ దాడుల సన్నద్ధతపై ‘అరెటే’ ఫోకస్
హైదరాబాద్: సైబర్ రిస్క్ నిర్వహణ కంపెనీ ‘అరెటే’.. సైబర్ దాడుల నిరోధానికి, ఒకవేళ సైబర్ దాడులు తలెత్తితే ఆ సమయంలో సన్నద్ధతకు సంబంధించి కొత్తగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం దీన్ని రూపొందించామని, సహజంగా ఈ సంస్థలే ఎక్కువగా దాడులకు గురవుతుంటాయని, పూర్తి స్థాయిలో వ్యవస్థల పునరుద్ధరణకు 6–8 రోజుల సమయం తీసుకుంటున్నట్టు అరెటే తెలిపింది. చిన్న, మధ్య తరహా సంస్థల సిస్టమ్స్లో అప్పటికే హానికాక సాఫ్ట్వేర్లు ఏవైనా ఉన్నాయా? కస్టమర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం లీక్ అయిందా గుర్తించడంతోపాటు.. పరిశ్రమలోనే అత్యుత్తమ విధానాలు, రిస్క్ నిర్వహణతో ఇది ఉంటుందని వివరించింది. సంస్థలకు మరింత రక్షణ కలి్పంచి, సైబర్ దాడుల రిస్క్ను తగ్గించడమే తమ లక్ష్యమని అరెటే ప్రకటించింది. -
8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. గత ఎనిమిది రోజులుగా పని చేయడం లేదు. సర్వర్ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తోంది. ఎనిమిది రోజులు గడిచినా పరిస్థితి అలాగే కొనసాగుతుండటంతో.. ఢిల్లీకి చెందిన ఇద్దరు విశ్లేకులను సస్పెండ్ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కింద మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ‘సర్వర్ హ్యాక్ అయిన క్రమంలో శానిటైజింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 50 సర్వర్లలో ఇంతకు ముందు 15 మాత్రమే శానిటైజింగ్ చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 25కు పెంచారు. అలాగే 400లకుపైగా ఎండ్పాయింట్ కంప్యూటర్లను స్కాన్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సైతం అప్లోడ్ చేస్తున్నారు.’ అని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. సర్వర్ డౌన్ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎయిమ్స్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. సర్వర్లలో ఈ-హాస్పిటల్ డేటా పునరుద్ధరణ చేసినట్లు పేర్కొంది. సేవలను పునరుద్ధరించే ముందు నెట్వర్క్ శానిటైజింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, సర్వర్లు, డేటా ఉండటం వల్ల ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఔట్పేషెంట్, ఇన్పేషెంట్, ల్యాబ్లు వంటి అన్ని సేవలు మాన్యువల్గా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసు, ఇంటలిజెన్స్ బ్యూరో, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), కేంద్ర హోంశాఖలు దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తు సంస్థల సూచలన మేరకు ఢిల్లీ ఎయిమ్స్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇదీ చదవండి: షాకింగ్:హైస్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్, గర్భనిరోధకాలు..! -
బాబోయ్.. 90 లక్షల క్రెడిట్ కార్డుల డేటా లీక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. వారి పరిశోధనలో.. రష్యాకు చెందిన డార్క్ వెబ్ సైబర్ క్రైమ్ ఫోరమ్లో 1.2 మిలియన్ కార్డ్ల డేటాబేస్ను ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తేలింది. వీటితో పాటు 7.9 మిలియన్ కార్డ్ హోల్డర్ డేటా BidenCash వెబ్సైట్లో ఉన్నట్లు కనుగోన్నారు. గతంలో మాదిరి కాకుండా, ఈసారి, హ్యాకర్లు SSN, కార్డ్ వివరాలు, CVV వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేశారని బృందం వెల్లడించింది. వీటితో పాటు కార్డ్ వివరాలతో అనుసంధానించిన చాలా వ్యక్తిగత ఇమెయిల్లు కూడా బయటపడ్డాయి. BidenCash ద్వారా గతంలో సాఫ్ట్బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సింగపూర్తో అనుబంధించబడిన అధికారిక ఇమెయిల్ల రికార్డులు కూడా లీక్ అయ్యాయి. "స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిసర్వ్ సొల్యూషన్స్ LLC, అమెరికన్ ఎక్స్ప్రెస్లతో పాటు కొన్ని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థల కస్టమర్ల డేటా కూడా లీక్ అయ్యింది. మాస్టర్కార్డ్, వీసా నెట్వర్క్లకు సంబంధించిన 414,000 రికార్డులతో సుమారు 508,000 డెబిట్ కార్డ్ల వివరాలు కూడా బహిర్గతమైంది." అని భద్రతా పరిశోధకులు దేశాయ్ తెలిపారు. ఈ కార్డుల సమాచారం లీక్ వల్ల అక్రమ కొనుగోళ్ళు, కార్డ్ క్లోనింగ్, అనధికారిక లావాదేవీలు జరుగుతాయని దేశాయ్ అన్నారు. BidenCash వెబ్ సైట్ తన సైట్ కు ట్రాఫిక్ను పెంచుకోవడం కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతూ ఉంటుందని తెలిపారు. చదవండి: ఎఫ్బీలో జుకర్బర్గ్కు భారీ షాక్, కష్టాల్లో మెటా -
Cyber Talk: పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? డిజిటల్ రాక్షసులుగా మారకుండా..
Cyber Security Tips In Telugu: దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని వివిధ రూపాలలో కొలుస్తుంటాం. ఈ పూజలన్నీ మనచుట్టూ, మనలోనూ ఉన్న చెడును సంహరించి, జీవితాలను బాధ్యతగా మలచుకోమని సూచన ఇస్తున్నట్టుగా ఉంటాయి. ఇదే విషయాన్ని టెక్నాలజీ విషయంలో తీసుకుంటే... పిల్లలు డిజిటల్ రాక్షసులుగా మారకుండా, అలాంటి రాక్షసుల నుంచి ఎలా కాపాడుకోవాలో ఇంట్లో అమ్మలూ, స్కూల్లో టీచర్లూ పిల్లలకు సూచనలు ఇస్తే .. ఎన్నో సమస్యలకు అడ్డుకట్ట వేయచ్చు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్లు రాకముందు, స్మార్ట్ఫోన్లపై అంతగా చర్చ లేదు. పాఠశాలల్లో సాంకేతికత అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయింది. ఆన్ లైన్ ప్లాట్ఫారమ్ల ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ విద్యార్థుల డేటాను సురక్షితంగా ఉంచడానికి, డిజిటల్ టెక్నాలజీతో వారి సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలో, తమను తాము రక్షించుకోవడం ఎలాగో నేర్పడానికి ఉపాధ్యాయులూ సిద్ధంగా ఉండాలి. ప్రమాదాలు పలు విధాలు... స్కూల్లో... (ఎ) సైబర్–సేఫ్ క్లాస్రూమ్ని ఏర్పాటు చేయాలి, విద్యార్థుల ప్రైవేట్ డేటాను రక్షించడంలో ఫస్ట్ లెవల్ రక్షణ వ్యూహాలను కలిగి ఉండాలి (బి) విద్యార్థులకు ఆన్ లైన్ గోప్యత భద్రతలో తీసుకోవాల్సిన ప్రాథమికాంశాలను బోధించాలి (సి) తరగతిలో, ఇంట్లో టెక్నాలజీని వాడటం ప్రయోజనకరంగా ఉండాలే తప్ప, అన్నింటిని దూరం చేసేలా ఉండకూడదు. (డి) టెక్నాలజీని మితిమీరి ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి, అది సంబంధాలు, భవిష్యత్తు కెరీర్లు, వ్యక్తిగత జీవితాలను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేయాలి టీచర్లు పిల్లల తల్లిదండ్రుల అంగీకార పత్రాన్ని తీసుకోవాలి మీ పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగించే విషయం ఇంటర్నెట్లో కనిపిస్తే ఏమి చేయాలో వారితో మాట్లాడాలి. మీరు వారితో కలివిడిగా లేకపోతే, మీరు వారి సమీపంలోకి వెళ్లినప్పుడు వారు ల్యాప్టాప్ మూసివేస్తారు లేదా స్క్రీన్ను ఆఫ్ చేస్తారు. టీచర్లు తమ పిల్లలకు ఎంత స్క్రీన్ సమయం సరిపోతుందో పరిశీలించడానికి తల్లిదండ్రులతో తప్పనిసరిగా ఇంటరాక్ట్ కావాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు తెలిసుండాలి. అవి.. అన్ని అప్లికేషన్లు, గేమింగ్, బ్రౌజర్లు లోపలే కొన్ని నియంత్రణలను కలిగి ఉంటాయి, ఇవి మీ పిల్లలు ఆన్లైన్లో గడిపే సమయాన్ని పరిమితం చేయడానికి, పెద్దలు వాడే టెక్నాలజీలో పిల్లల జోక్యం పరిమితంగా ఉండాలి. అలాగే, పిల్లలు ఉపయోగించే షాపింగ్, చాటింగ్ వంటి ఫంక్షన్లను స్విచ్ ఆఫ్ చేయడానికి మీకు యాక్సెస్ ఉండాలి. అన్ని అప్లికేషన్లు, గేమింగ్, ఈ కామర్స్ సైట్లు తమ వినియోగదారులకు షాపింగ్, అదనపు పాయింట్లను కొనుగోలు చేయడం, ఇతర అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. పిల్లలు పెద్దలకు తెలియకుండానే సులభంగా కొనుగోళ్లు చేయవచ్చు. అందుకని, యాప్ కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలకు ఆన్లైన్ ప్రమాదాల గురించి తెలియదు. మీరు రోజులో కొంత సమయాన్ని పిల్లలతో గడుపుతారు కాబట్టి, ఆ సమయం లో భవిష్యత్తులో కెరీర్ను ప్రభావితం చేసే సైబర్ బెదిరింపు, గోప్యత, ఆన్లైన్ పరువు గురించి తెలియజేయాలి. ఆన్లైన్లో కొత్త గేమ్లు, వెబ్సైట్లకు సైన్ అప్ చేసేటప్పుడు మీ పిల్లలు ఉపయోగించగల సాధారణ ఇ మెయిల్ చిరునామాను సెటప్ చేయండి. (అనగా కుటుంబ సభ్యులందరికీ వారి ఇ మెయిల్ యూజర్నేమ్, పాస్వర్డ్ తెలుసుండాలి) మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ‘గూగుల్ సేఫ్ సెర్చ్’ని యాక్టివేట్ చేయడం ద్వారా సెర్చ్ ప్రశ్నలకు ప్రతిస్పందనగా అనుచితమైన కంటెంట్ను వదిలించుకోవడానికి లేదా పిల్లల కోసం https://www.kiddle.co వంటి సెర్చ్ ఇంజిన్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. యాంటీ ర్యాగింగ్, జెండర్ ఈక్వాలిటీ కౌన్సిల్ మాదిరిగానే ఈ రోజుల్లో డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్ తప్పనిసరి. ఈ కౌన్సిల్ పిల్లలకు మంచి డిజిటల్ పరిశుభ్రత, సైబర్ నైతికతను పెంపొందించడానికి సహాయపడుతుంది. తరాలు మారాయి. కొత్త కొత్త సాంకేతికత రూపుకడుతోంది. పిల్లల ఆలోచనా ధోరణి మారుతోంది. అవగాహనారాహిత్యంతో ఉన్న పిల్లల ఎదుగుదలను సరి చేయకపోతే భవిష్యత్తు సమాజం సమస్యాత్మకంగా మారనున్నది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పెద్దలే జాగ్రత్త వహించాలి. పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తారు... దాదాపుగా ప్రీ–టీన్స్, టీనేజ్ పిల్లల రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ భాగమైపోయింది. చాలా మంది యుక్త వయస్కులు స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్ని ఉపయోగిస్తారు. ఇంచుమించు అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది. అనేక రకాల సోషల్ నెట్వర్కింగ్, గేమింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. పిల్లలు ఇతరుల రహస్యాలను బయటపెట్టడం, లింక్ అప్లు, హుక్ అప్లు, ద్వేషం.. సర్వసాధారణం. వీరిలో మరొక చీకటి కోణం కూడా గమనించాలి. సాధారణంగా సామాజిక ప్లాట్ఫారమ్లలో కన్ఫెషన్ పేజీలు పెద్దవాళ్లు క్రియేట్ చేసినవి ఉంటాయి. దీనిని ఇప్పుడు పిల్లలు టీచర్లు, హెడ్మాస్టర్లపై ప్రేమ, సరస వ్యాఖ్యలను చేయడం చూస్తుంటే వారి భవిష్యత్తుపై ఆందోళన కలుగుతుంది. అందుకని, టీచర్లు – తల్లిదండ్రులు ఈ విషయాలపై మాట్లాడుకొని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వారి పిల్లల భవిష్యత్తు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో టీచర్లు తెలియజేయాలి. సమాచారం : (ఎ) పిల్లలు వాడే కమ్యూనికేషన్ సాధనాలేమున్నాయి, వాటి సమాచారాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాలి. (బి) మూలాన్ని తనిఖీ చేయాలి. (సి) ఇన్ఫర్మేషన్ నుంచి చెక్ చేయాలి (డి) సమాచారాన్ని ధ్రువీకరించాలి. (ఇ) సమాచారాన్ని నమ్మాలి. (ఎఫ్) సమాచారాన్ని పంచుకోవాలి. ప్రభావం : తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలి (ఎ) మీ పిల్లల డిజిటల్ కార్యకలాపాలు వారికి మంచి లేదా చెడుగా ఎలా అనిపిస్తాయి. (బి) బ్యాలెన్స్, క్రాస్ చెక్ ఉందా... అని చూడాలి. సూచన: వీటన్నింటి చివరలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాఠం మీ సొసైటీలో సాంకేతికంగా సురక్షితంగా ఉండాలంటే .. పిల్లలు ఇతరుల నుండి ఏ సూచనలను తీసుకుంటున్నారు, ఎవరు సూచనలు ఇస్తున్నారు... అనేది తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఏమరపాటుగా ఉంటే అది ప్రతి ఒక్కరి భద్రతకు భంగం కలిగించవచ్చు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్ఫారమ్లో.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. న్యూడ్ వీడియోలతో ఎర.. టీనేజర్లే టార్గెట్ -
ఇన్స్టాగ్రామ్లో లాగిన్ యాక్టివిటీ చెక్ చేసుకోవడం ఎలా?
భద్రతాపరమైన కోణంలో ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో లాగిన్ యాక్టివిటీ చెక్ చేసుకోవడం అవసరం. దీని కోసం... ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి బాటమ్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ను ట్యాప్ చేయాలి. టాప్ రైట్ కార్నర్లో 3–హారిజంటల్ లైన్స్ ట్యాప్ చేయాలి సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి సెక్యూరిటీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి లాగిన్ యాక్టివిటీ ఆప్షన్ను ట్యాప్ చేయాలి. ఇన్స్టాలో లాగిన్ యాక్టివిటీని డిలిట్ చేయడానికి... 1. సెట్టింగ్స్లోని ‘లాగిన్ యాక్టివిటీ’ను సెలెక్ట్ చేసుకోవాలి 2. 3–డాట్ బటన్ నొక్కాలి 3. లాగ్ ఔట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి: వాట్సాప్లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ -
ఆన్లైన్ ట్రేడింగ్: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు పాప్ అప్ అవుతూ ఉంటాయి. కానీ, అవి ఎలాంటి రిజిస్టర్ కాని వాణిజ్య పోర్టల్స్. ఎవరైనా నమ్మి వీటిలో మెంబర్స్గా చేరితే, అధిక మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గృహిణులను లక్ష్యం చేసుకునే ఈ మోసాలు జరుగుతుంటాయి. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసుండాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండగలం. ఇంటర్నెట్ ఆధారిత సమాచారం రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఫింగర్ టిప్స్ మీద లభిస్తుండటమే కారణం. అందుకే, స్కామర్లు కూడా ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి వేగవంతంగా కొత్త మార్గాలను అమలు చేస్తుంటారు. ► ఫ్యాన్సీ ప్రకటనలు చాలావరకు ఆన్లైన్ ప్రకటనలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల ద్వారా సమాచారం కోసం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కుప్పలు తెప్పలుగా ఆన్లైన్లోకి రావడం కూడా బ్రోకరేజీ రహితంగా ఉండటం, సులభమైన వాణిజ్య పోర్టల్, తక్షణ పరిష్కారాలు ఉండటం వల్లనే. వీటిలో చాలా ఏజెన్సీలు రిజిస్టర్ చేసి ఉండవు. కానీ ప్రముఖ అధికారిక కార్పొరేట్ ట్రేడింగ్ కంపెనీల కంటే మరింత శక్తిమంతమైన ఫ్యాన్సీ ప్రకటనలను ఉంచుతుంటారు. స్కామర్లు ఆకర్షణీయంగా ఉన్న ప్రకటనలను ఎర వేసి ఈ బోగస్ యాప్లు, వెబ్సైట్లలో తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్న వారికి మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించినట్లు చెప్పుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వీరు అనుసరిస్తారు. పాయింట్లకు బదులుగా వారు యాప్ వాలెట్లో డబ్బును డిపాజిట్ చేయమని అడుగుతారు, అది తర్వాత ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఉపయోగించే కొన్ని పథకాలు ► పోంజీ పథకం ఇది కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో చేసే మోసం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొంత మొత్తం చెల్లిస్తూ వారి ద్వారా మరిన్ని పెట్టుబడులను రాబట్టడం. ► పంప్, డంప్ స్కీమ్ ఇది ఒక పెట్టుబడి మోసం. ఇక్కడ సలహాదారులు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని అందించి, షేర్ల ధరను బంప్ చేయడానికి (పెంచడానికి) ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు సలహాదారులను నమ్మి తమ షేర్లను (అవి మంచి విలువ కలిగినప్పుడు) అమ్మేస్తారు. ► యాప్ ఆధారిత స్కీమ్లు పెట్టుబడిదారులకు మోసగాళ్లు తరచు వాలెట్ బ్యాలెన్స్ల నకిలీ చిత్రాలను చూపుతూ ఫిషింగ్ ఇ–మెయిల్స్ను పంపుతారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీలు స్టాక్లు లేదా ఈ కామర్స్ ఉత్పత్తులు.. వీటిలో భాగంగా ఉంటాయి. ► తప్పుదారి పట్టించడానికి.. పెట్టుబడి పోకడలు, పరిశోధన స్టాక్లపై సమాచారాన్ని సేకరించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వేగవంతంగా ఆదాయ అవకాశాలను చర్చించడానికి పెట్టుబడిదారులు ఫేస్బుక్, ట్విటర్, టీమ్ వ్యూవర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తారు. స్కామర్లు నకిలీ సిఫారసులు చేస్తారు. అయాచిత పెట్టుబడి చిట్కాలు ఇస్తారు. వీటిలో నకిలీ గుర్తింపు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ద్వారా పెట్టుబడిదారులను ఒప్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి. ► పెట్టుబడిని ఎరగా వేస్తారు చాలా మంది పెట్టుబడిదారులు మొదట్లో సంస్థ నుండి కొంత రాబడిని పొందుతారు. దీంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ విజయవంతమైందని స్కామర్లు అనుకుంటారు. స్కామర్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి శిష్యుడిని లేదా స్నేహితుడిని పరిచయం చేయడానికి మరింత ప్రోత్సహిస్తారు. డబ్బులు వస్తాయి కదా అని తమకు తెలిసినవారికి సదరు యాప్ లేదా వెబ్సైట్ వివరాలు ఇచ్చి వారిని కూడా చేరమని అంటారు. అయితే, చివరికి రిటర్న్లు ఆగిపోతాయి, కస్టమర్ ఖాతా సస్పెండ్ చేయబడుతుంది. డబ్బు వాలెట్లో ఇరుక్కుపోయి ఉంటుంది. సంస్థతో తదుపరి ఎలాంటి పరిచయం ఉండకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడిని ఎలా పొందాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. ► అవకాశాల కోసం 7 రకాల వలలు దశ 1: ముందుగా బాధితులను వాట్సాప్ / టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరమని అభ్యర్థిస్తారు. దశ 2: లింక్ల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయమని అడుగుతారు. ఈ కొత్త సభ్యులందరికీ మొదట్లో జాయినింగ్ బోనస్ లభిస్తుంది. అయితే అది వారి వాలెట్లో మాత్రమే కనిపిస్తుంది. దశ 3: ట్రేడింగ్ జరుగుతుంది (బాధితులు విధులు నిర్వర్తించమని అడుగుతారు), అంటే, షేర్ల అమ్మకం/కొనుగోలు, లేదా కొన్నిసార్లు బాధితులు ఇ–కామర్స్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని లేదా విక్రయించమని అడుగుతారు. దశ 4: బాధితులను సిస్టమ్కి కొత్త వ్యక్తులను పరిచయం చేయమని అడుగుతారు. ఇది నిజమని, తమకూ కొంత పెట్టుబడి చేరుతుందన్న ఆశతో మంచి పార్టీలను పరిచయం చేస్తారు. అలా పరిచయం చేసిన వ్యక్తి ద్వారా స్కామర్లు వారి వాలెట్కి డబ్బు చేరేలా చేస్తారు. దశ 5: చేసిన పనుల ఆధారంగా వాలెట్ డబ్బును కూడగట్టుకుంటుంది. దశ 6: బాధితుడు వారి వాలెట్ల నుండి తమ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీలుపడదు. ఒక్కోసారి వీలున్నా ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ రుసుము మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. దశ 7: కోరిన ఫీజు చెల్లించిన తర్వాత, యాప్లు పని చేయవు. అవి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని చూపుతాయి. కస్టమర్ సేవను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలూ ఫలించవు. మోసానికి మార్గాలు ► స్కామర్లు తాము విజయవంతమైన వ్యాపారులుగా, గ్యారెంటీ రిటర్న్ ఇస్తున్నట్టుగా, ట్రేడింగ్ సలహాలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటారు ∙ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ఫోనీ టెస్టిమోనియల్ యూట్యూబ్ వీడియోలను ఉపయోగిస్తారు ∙‘పంప్ అండ్ డంప్‘ కార్యకలాపాలను నిరోధించడానికి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు ∙నకిలీ సమాచారంతో ఆన్లైన్ పెట్టుబడి చిట్కాలు, నకిలీ ఎండార్స్మెంట్లను పంపుతుంటారు ∙స్టాక్ సిఫార్సులు లేదా పెట్టుబడి సలహాలకు బదులుగా సబ్స్క్రిప్షన్ రుసుమును సేకరించేందుకు ఉద్దేశించిన స్టాక్ పోర్ట్ ఫోలియో స్క్రీన్షాట్లను ప్రదర్శిస్తుంది ∙పెట్టుబడిదారులను టెక్నికల్ అనలిస్ట్లు లేదా ట్రేడింగ్ నిపుణులను చేస్తానని నమ్మబలికి స్కామర్లు వర్క్షాప్ల కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకుంటారు కానీ వారికి హోస్ట్ చేయరు. పెట్టుబడులకు డేంజర్ సిగ్నల్స్ బాధితుల ఆశను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభిన్న పద్ధతులతో మోసగాళ్లు వారి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవా లంటే.. ► అసాధారణంగా అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు, గమనించాలి. ► అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తారు. ► సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది. ► నష్టాలను తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. ► వెంటనే డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి చేయచ్చు. ► యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లలో లిస్ట్లో లేని యాప్లలో పెట్టుబడి పెట్టమని కోరతారు. ► అధిక రాబడిని పొందినట్లు పేర్కొంటూ సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మద్దతును కోరుతారు. ► స్కామర్ల కార్యాలయాలు మన దేశం లోపల ఉన్నాయా, వెబ్సైట్, యాప్లలో ఉండే చిరునామాలను చూపుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సైన్యంలో విద్రోహులు!
న్యూఢ్లిల్లీ: సైన్యంలో అతి పెద్ద సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కొందరు మిలటరీ అధికారులకు శత్రు దేశంతో అనుమానాస్పద సంబంధాలున్నట్టు వెల్లడైందని వెల్లడించాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా వారు సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలిందని చెప్పాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపాయి. ‘‘వారికి పొరుగు దేశంతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలితే వారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని నిఘా అధికారులు తెలిపారు. దీనిపై ఊహాగానాలు చేయొద్దని మీడియాను కోరారు. పాక్, చైనా గూఢచారులు మన దేశ భద్రతకు సంబంధించిన సమాచారం రాబట్టడానికి సైనికాధికారులపై వల పన్నుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా కొందరు అధికారులు వారి గాలానికి చిక్కినట్టు తెలుస్తోందని నిఘా వర్గాలు వివరించాయి. చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం) -
ఇ–వాణిజ్యంపై జాతీయ విధానం
సాక్షి, హైదరాబాద్: ఇ–కామర్స్పై జాతీయ విధానానికి రూపకల్పన చేయడంతో పాటు ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ చెల్లింపులు, ఉత్తమ ఇంటర్నెట్కు సంబంధించి కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పారిశ్రామిక ప్రోత్సాహకాలు, తీసుకునే విధానపరమైన నిర్ణయాలతోనే మేకిన్ ఇండియా నినాదం ఆచరణ సాధ్యమవుతుందని అన్నారు. వాణిజ్యం (కామర్స్)పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో సోమవారం కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సైబర్ నేరాల కట్టడికి చట్టం సాఫ్ట్వేర్తో పాటు ఇతర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను భారత్ అందిపుచ్చుకునేందుకు విధాన నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఇ–కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు అవకాశముందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడంపై దృష్టి సారించాలని, భారత్ నెట్తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్కు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు నల్సార్ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న ప్రత్యేక చట్టం తరహాలో జాతీయ స్థాయిలోనూ చట్టం అవసరమని పేర్కొన్నారు. తెలంగాణపై వివక్ష కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ౖతెలంగాణ అభివృద్ధి అంటే భారత్ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం అవుతుండటం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, విభజన హామీల అమలు, వివిధ పథకాల కింద అందాల్సిన సాయంపై కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఇండస్ట్రియల్, డిఫెన్స్ కారిడార్లు, హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులకు అవసరమైన ఆర్థిక సాయం ఇవ్వడంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయాలి దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయాలని, ఆదిలాబాద్లోని సీసీఐ యూనిట్ను పునరుద్ధరించాలని కేటీఆర్ కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ఎంపీలు సంతోష్కుమార్ గంగ్వార్, రూపా గంగూలీ, మంజులత మండల్, ప్రసూన్ బెనర్జీ, గౌతమ్ సింగమని పొన్, నామా నాగేశ్వర్రావుతో పాటు తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, వాణిజ్య సంఘాలు ఫిక్కి, డిక్కి ఫార్మా, ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహేష్ బ్యాంక్ కేసులో ‘ఖరీదైన దర్యాప్తు’
సాక్షి హైదరాబాద్: ఏపీ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లో చోటు చేసుకున్న సైబర్ నేరం రెండు రకాలుగా రికార్డు సృష్టించింది. ఈ స్కామ్లో సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.12,48,21,735 కాజేశారు. దీని దర్యాప్తు కోసం నగర పోలీసు విభాగం రూ.58 లక్షలు ఖర్చు చేసింది. ఇంత మొత్తం నగదుతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం, ఓ కేసు దర్యాప్తు కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం కూడా నగర కమిషనరేట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసును సవాల్గా తీసుకున్నామని, సైబర్ క్రైమ్, సీసీఎస్ విభాగాలకు చెందిన 100 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం నాటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెండు నెలల పాటు శ్రమించి, ఈ దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులకు ఆయన రివార్డులు అందించారు. ఆ మూడు ఖాతాలు సిద్ధం చేసినా... సైబర్ నేరగాళ్లు షానాజ్ బేగంతో పాటు శాన్విక ఎంటర్ప్రైజెస్, హిందుస్తాన్ ట్రేడర్స్, ఫార్మాహౌస్ ఖాతాలతో పాటు కటకం కోటేశ్వర్, ప్రియాంక ఎంటర్ ప్రైజెస్, ఫాతిమా మాత సెక్యూర్ వెల్డింగ్ సంస్థల ఖాతాలు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆఖరి మూడు ఖాతాల్లోకి నగదు పడలేదు. రెండు సంస్థల నిర్వాహకులను గుర్తించి, కొందరిని పట్టుకున్నారు. జగద్గిరిగుట్ట చిరునామాతో ఉన్న ఫాతిమా మాత సెక్యూర్ వెల్డింగ్ సంస్థ బోగస్గా తేలింది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రమాదంలో ఉంది ఈ నేరం చేయడానికి ప్రధాన హ్యాకర్లు వినియోగించిన ఐపీ అడ్రస్లు అమెరికా, కెనడా, లండన్, రోమేనియాలవిగా కనిపిస్తోంది. అ యితే వాళ్లు ఫ్రాక్సీ సర్వర్లు వాడటంతో ఇవి ఎంత వరకు వాస్తమే ఇప్పుడే చెప్పలేం. ఈ హ్యాకర్లే గతేడాది నగరంలోని తెలంగాణ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి రూ.1.98 కోట్లు కాజేసిందీ వీళ్లేనని అనుమానిస్తున్నాం. ఇతర నగరాలు, దేశాల్లోనూ ఇ లాంటి నేరాలు జరిగాయి... భవిష్యత్తులో మ రిన్ని జరిగే ప్రమాదమూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్ర మాదంలో ఉన్నట్లు గుర్తించాలి. బ్యాంకుల సైబర్ సెక్యూరిటీ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు సూచలను చేసినా వాటి అమలు పర్యవేక్షణ జరగట్లేదు. త్వరలోనే రిజ ర్వ్ బ్యాంక్ ద్వారా బ్యాంకుల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తాం. – సీవీ ఆనంద్, నగర కొత్వాల్ (చదవండి: విమానంలో చిక్కిన చైన్ స్నాచర్) -
సైబర్ నేరం జరిగితే వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బెంగళూరులో ఐబీఎం ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్ దాడుల ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఇండియా సీఈఆర్టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్ దాడుల పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సైబర్ దాడులు జరిగితే బయటకు వెల్లడించకుండా దాచడం కుదరదు. వీటిని వెల్లడించాల్సిన బాధ్యతను సంస్థలపై పెట్టనున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లో నూతన చట్టం గురించి ప్రకటన వింటారు’’అని మంత్రి ప్రకటించారు. ముప్పు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సైబర్ విభాగం సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తు చేశారు. ‘‘మనం పెద్ద ఎత్తున సామర్థ్యాల విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇంటర్నెట్ అన్నది సురక్షితంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా, విశ్వసనీయమైనదిగా ఉండాలి. ఇంటర్నెట్కు సంబంధించిన మధ్యవర్తులు వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని మంత్రి చెప్పారు. ఆసియా పసిఫిక్లో మొదటిది బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటిదిగా ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. సైబర్ భద్రత విషయంలో టెక్నిక్లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు. -
డిజిటల్ చెల్లింపులు.. అంత ఈజీనా?
ఈసారి కేంద్ర బడ్జెట్ డిజిటల్ మంత్రం జపించింది. అన్నింటా ఆధునికత ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిజిటల్ చెల్లింపులు, పేపర్ లెస్ పేమెంట్స్ ప్రక్రియ వేగవంతం చేసేలా పలు నిర్ణయాలు ప్రకటించింది. అయితే సరైన మౌలిక సదుపాయలు లేకుండా ప్రభుత్వం కంటోన్న డిజిటల్ కల నెరవేరుతుందా? డిజిటల్ ఇండియా లక్క్ష్యంగా చేసుకునే కేంద్రం బడ్జెట్ 2022-23ని ప్రవేశపెట్టిందనే విషయం ఇట్టే తెలిసిపోతోంది. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్కు మరింత ప్రోత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ భారత్లో భాగంగా మొదలైన కాంటాక్ట్ లెస్ చెల్లింపుల వ్యవహారం.. కరోనా టైంలో ‘నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి’ కారణంగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. 2016లో డిజిటల్ పేమెంట్స్ 61 బిలియన్ డాలర్లు ఉండగా 2021 నాటికి అది ఏకంగా 300 బిలియన్ డాలర్లకి చేరుకుంది. టీ కొట్టు నుంచి.. డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో స్టార్టప్లు కీలకంగా మారాయి. పేటీఎం, ఫోన్పే వంటి స్టార్టప్లు టీ స్టాల్, పాన్ డబ్బా నుంచి ఫైవ్స్టార్ హోటళ్ల వరకు చెల్లింపులు, కరెంటు బిల్లులు, ఫోన్ రీచార్జ్ ఆన్లైన్లో చేస్తూ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను బలోపేతం చేశాయి. డిజిటల్ పేమెంట్స్లో ప్రస్తుతం కొనసాగుతున్న బూమ్ 2026 నాటికి ఏకంగా వన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అయితే అప్పటికీ ఇండియాలో జరిగే పేపర్ లెస్ లావాదేవీల్లో ఈ వన్ ట్రిలియన్ వాటా కేవలం 30 శాతమే అని రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ చెబుతోంది. మందకొడిగా.. ప్రైవేటు సెక్టార్లో త్వరితగతిన డిజిటల్ పేమెంట్స్ జరుగుతుండగా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ, రైల్వేస్, రిజిస్ట్రేషన్లు, రేషన్ దుకాణాలు ఇలా చాలా సర్కారీ శాఖల్లో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇంకా ఊపందుకోలేదు. గ్రామీణ భారతంలో ఆర్థిక లావాదేవీలు ఇప్పటికీ నగదు నోట్ల రూపంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ పేపర్ లెస్ ట్రాన్జాక్షన్స్ లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. దీన్ని అధిగమించేందుకు డిజిటల్ మంత్రాన్ని కేంద్రం జపిస్తోంది. అందుకే ఈ బడ్జెట్లో పెద్ద పీట వేసింది. డిజిటల్ బడ్జెట్ డిజిటల్ యూనివర్సిటీతో పాటు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదన సైతం బడ్జెట్లో ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ కీలకమైన ఇంటర్నెట్ విస్తరణపైనా కేంద్రం దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాలు లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల కోసం భారత్నెట్ ప్రాజెక్టును చేపట్టింది. భారత్నెట్ ద్వారా 2025 నాటికి దేశమంతటా తక్కువ ధరకే బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తామని ప్రభుత్వం అంటోంది. ఏకంగా డిజిటల్ యూనివర్సిటీ కూడా నెలకొల్పుతామంది. ఆఖరికి వివాదాలు, విమర్శలు పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీకి కూడా సై అంది కేంద్రం. స్లో అయితే కష్టం అయితే ప్రభుత్వం లక్ష్యాలు అర్బన్, సెమీ అర్బన్ రీజియన్ల వరకు ఓకే. మరి రూరల్ భారత్ సంగతి ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన 5జీ, భారత్నెట్ ప్రాజెక్టులు ఇంకా లక్ష్యానికి దూరంగా ఉండి పోయాయి. ఇక రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వైన్స్ తదితర చోట్ల డిజిటల్ పేమెంట్స్ చేస్తే అదనపు చార్జీలను కస్టమర్ల మీద మోపుతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఎక్కడా అడ్డుకట్ట పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం జపిస్తున్న డిజిటల్ మంత్ర ఎంత వరకు సిద్ధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!) డబుల్ వేగం వేగవంతమైన ఇంటర్నెట్తో యాక్సెస్ వస్తే డిజిటల్ పేమెంట్స్ అందనంత వేగంతో దూసుకుపోతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2016లో ఉన్న అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లు 2021 సెప్టెంబరు నాటికి డిజిటల్ పేపెంట్స్ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటాయనుకున్నారు. అందరీ అంచనాలు తారుమారు చేస్తూ డిజిటల్ పేమెంట్స్ ఏకంగా రూ. 7 లక్షల కోట్లకు చేరాయి. చౌక ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగడంతో యాభైకి పైగా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. 250 బ్యాంకులు యూపీఐ పేమెంట్స్ని అంగీకరిస్తున్నాయి. సగటున ప్రతీ రోజు యూపీఐ ద్వారా రోజుకు 14 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల్లో యాభై శాతం రూ.200లోపువే కావడం గమనార్హం. (క్లిక్: అందుబాటులోకి డిజిటల్ రూపీ.. జారీ చేసేది అప్పటి నుంచే..) ఇక్కడ ఫోకస్ చేయాల్సిందే రూరల్ ఇండియా, పేద, మధ్య తరగతి ప్రజలు ముందస్తు అంచనాలు తలకిందులు చేస్తూ వేగంగా డిజిటల్ వైపు మళ్లగా భారీ లావాదేవీలు మాత్రం ఇప్పటికీ నగదుతోనే జరుగుతుంది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డుతో జరిగే లావాదేవీల మొత్తం కంటే యూపీఐ లావాదేవీల మొత్తమే ఎక్కువ. కాబట్టి భారీ డీల్స్ కూడా డిజిటల్ పద్దతిలో జరిగేలా ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. భారీ లావాదేవీలను కూడా డిజిటల్ పరిధిలోకి తీసుకువస్తే పారదర్శకత పెరిగి పన్ను వసూళ్లు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఆన్లైన్ మెసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సైబర్ సెక్యురిటీ, డేటా ప్రైవసీ విషయంలో ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన చర్యలు అవసరం. - సాక్షి, వెబ్ స్పెషల్ -
ఫ్రీగా కోవిడ్ కిట్సా.. జాగ్రత్తగా ఉండండి!!
కీర్తి (పేరు మార్చడమైనది)కి రెండు రోజులుగా జలుబు, దగ్గు, కాస్త జ్వరంగా ఉంది. ఇంట్లో వాళ్లు కోవిడ్ ఏమో టెస్ట్ చేయించుకుంటే మంచిది అని పోరుతున్నారు. దానికి టెస్టింగ్ సెంటర్ వరకు ఎందుకు కిట్ తెప్పించుకుంటే సరిపోతుంది కదా! అని ఆన్లైన్లో శోధించడం మొదలుపెట్టింది. ఒక లింక్లో రూ.100 కే కోవిడ్ టెస్ట్ కిట్ అని చూసింది. కిట్ సమయానికి రాకపోతే మనీ బ్యాక్ కూడా చేస్తాం డీటెయిల్స్ ఇస్తే అని ఉంటే.. తన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత తన అకౌంట్ నుంచి డబ్బులు వేరేగా ట్రాన్స్ఫర్ అవడం చూసి బ్యాంక్ను సంప్రదించి, తను మోసపోయానట్టుగా తెలుసుకుంది. ∙∙ కరోనా మహమ్మారి ఒక విధంగా ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే మరో వైపు సైబర్నేరగాళ్లు రకరకాల పద్ధతులు ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాతో పాటు ఖాతా నుంచి నగదు కూడా దొంగిలిస్తున్నారు. మొదటి, రెండో వేవ్లలో బ్యాంకుల మారటోరియం గురించి వివరాలు సేకరిస్తున్నాం అంటూ, చారిటీ ఆర్గనైజేషన్ నుంచి చేస్తున్నాం అంటూ, మాస్కులు ఫ్రీగా ఇస్తున్నాం అని, ఆక్సిజన్ సిలండర్లు తక్కువ ధరకే అంటూ.. రకరకాల లింక్లను ఆన్లైన్ వేదికగా సెండ్ చేశారు. వాటి ద్వారా మోసపోయినవారూ ఉన్నారు. ∙∙ కోవిడ్ బూస్టర్ డోసులు, కోవిడ్ టెస్టింగ్ కిట్, డాక్టర్ ఆన్ హెల్ప్.. ఈ మూడింటిపై ఎక్కువ ఫ్రాడ్ జరుగుతున్నాయి. మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే 24 గంటలు మీకు ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. అవసరమైతే మీకు మనిషిని కూడా ఏర్పాటు చేస్తాం, పేదలకు సాయం చేయండి అంటూ చారిటీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. రూ.100లకే కోవిడ్ టెస్టింగ్ కిట్, తక్కువ ధరలో పల్స్ ఆక్సిమీటర్, స్మార్ట్ పల్స్ వాచ్, పోస్టర్ కిట్ ఎట్ హోమ్... ఇలాంటివాటిని ఆధారంగా చేసుకొని రకరకాల మోసాలకు తెరలేపుతున్నారు సైబర్నేరగాళ్లు. (చదవండి: జెన్ జడ్... క్యాన్సిల్ కల్చర్.. యూత్ను పట్టేసింది!) మోసాల నుంచి జాగ్రత్త.. ► కోవిడ్ ఆధారిత వస్తువులను ఉచితంగా డెలివరీ చేస్తాం అనే ఎసెమ్మెస్, వాట్సప్ లింక్లు వస్తుంటాయి. వీటిని క్లిక్ చేయకుండా ఉండాలి. ► కోవిడ్–19ను ప్రస్తావిస్తూ వచ్చిన తెలియని ఇ–మెయిల్లను, లింక్లను, మ్యాప్లను క్లిక్ చేయరాదు. ► ఇ–మెయిల్, బ్యాంకింగ్ వాటికి విడివిడిగా రెండు ఫోన్ నెంబర్లను వాడటం మంచిది. ► మీ పాస్వర్డ్లను అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్వర్డ్లు సంక్లిష్టమైన వర్డ్స్తో ఉండేలా జాగ్రత్తపడండి. ► అక్షరదోషాలు, అదనపు పదాలు ఉన్న URLల పట్ల జాగ్రత్త వహించండి. ► విరాళం ఇచ్చే ముందు స్వచ్ఛంద సంస్థ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి. ► కోవిడ్–19 గురించిన తాజా సమాచారం కోసం చట్లబద్ధమైన, ప్రభుత్వ వెబ్సైట్లను ఉపయోగించండి. ► ఆన్లైన్ చాట్లు, సమావేశాలలో పాల్గొన్నప్పుడు మీరున్న నేపథ్య స్థానాన్ని బ్లర్ చేయడం, ఇతర చిత్రాలను ఉపయోగించడం మంచిది. - అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
స్థానికులకు ఉద్యోగాలిస్తే మరిన్ని ప్రోత్సాహకాలు
హఫీజ్పేట్: రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు అందించే పరిశ్రమలు, సంస్థలకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. ఐటీ సహా వివిధ వ్యాపార సంస్థలకు సైబర్ భద్రతా ఉత్పత్తులు, సేవలు అందించే కోటెలిజెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టెక్డెమోక్రసీ అనుబంధ సంస్థ) శుక్రవారం హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని స్కైవ్యూలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని కోటెలిజెంట్ ప్రతినిధులు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్తో కలసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 136 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో 50% మంది 27 ఏళ్ల కంటే తక్కువ వయసు వారేనన్నారు. అయితే అందరి కీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ప్రభుత్వాలకు ఉండదన్నారు. అందుకే కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని... ప్రభుత్వం అదే చేస్తోందని కేటీఆర్ తెలిపారు. నైపుణ్యం ఉంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు... హైదరాబాద్కు భారీగా పరిశ్రమలు వస్తున్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదంటూ పలువురు సోషల్ మీడియాలో పేర్కొంటున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిభగల వారు, ఫైర్ ఉన్న యువత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఆటోమెటిక్గా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతిభగల వారిని కంపెనీలు తీసుకుంటాయని, స్థానికులకు కూడా ప్రతిభ ఉంటే ఉద్యోగాలు సంపాదించవచ్చన్నారు. కోటెలిజెంట్ సంస్థ ద్వారా వందలాది మందికి ఉదోగ్యాలు కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఎదగడం కోటెలిజెంట్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకిరణ్ పాటిబండ్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఆమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసి హైదరాబాద్లో కోటెలిజెంట్ సంస్థను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. సైబర్క్రైంపై చట్టం తెస్తున్నాం.. పౌరులు, సంస్థల డేటా భద్రంగా ఉండాలంటే సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిందేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో సైబర్క్రైం పెరుగుతోందని... ప్రధాని ట్విట్టర్ ఖాతా కూడా తాజాగా హ్యాకింగ్కు గురైందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో సైబర్ యుద్ధాలే జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో కోటెలిజెంట్ సంస్థ సైబర్ వారియర్ అనే ప్రాజెక్టును కూడా ఏకకాలంలో ప్రారంభించడం మంచి విషయమన్నారు. నల్సార్ యూనివర్సిటీ సహకారంతో సైబర్ క్రైం కట్టడికి చట్టం తేవాలనుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ తరహా చట్టాన్ని తీసుకురానున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని కోటెలిజెంట్ ప్రతినిధులను కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి మంది సైబర్ వారియర్స్ను తయారు చేయడానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) మంత్రి కేటీఆర్ సమక్షంలో కోటెలిజెంట్ సంస్థ ఇచ్చిపుచ్చుకుంది. -
Spider Man Cyber Security Alert: సూపర్ హీరోస్ క్రేజ్.. పొంచి ఉన్న సైబర్ దాడులు..
Spider Man Cyber Security Alert: మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరోస్ సిరీస్లో తాజాగా విడుదలైన సినిమా స్పైడర్మ్యాన్: నో వే హోం. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ని ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక ఫిషింగ్ సైట్లు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్స్కై ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది. ప్రీమియర్తో ఎర స్పైడర్ మ్యాన్ సిరీస్లో లెటెస్ట్ మూవీ నో వే హోం సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతకు ముందు ఈ సినిమా ప్రీమియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్లో వల వేశారని క్యాస్పర్స్కై పేర్కొంది. స్పైడర్మ్యాన్ నో వే హోం ప్రీమియర్ అందిస్తున్నట్టుగా ఫిషింగ్ సైట్లను రూపొందించాయని.. వీటిని క్లిక్ చేసిన వారికి ప్రీమియర్ లింక్ పంపిస్తామని అంతకు ముందు గేట్వే ఫీజు చెల్లించాలంటూ క్రెడిట్ కార్డు, బ్యాంకు డిటెయిల్స్ అడిగినట్టు ఆ సంస్థ పేర్కొంది. బ్యాంకు వివరాలు అందించిన వారి ఖాతాల్లో సొమ్ము మాయమైనట్టు తాము గుర్తించామంది. క్రేజ్ను క్యాష్ చేసుకునేలా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలుకు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ముగ్గురు స్పైడర్మ్యాన్లను ఒకేసారి తెరమీద చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిపస్తున్నారు. ఈ సూపర్హీరోస్ ఎడ్వెంచర్స్ చూసేందుకు టీనేజర్లు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో వీరిని టార్గెట్ చేసుకుని మూవీ లింకుల పేరుతో ఫిషింగ్ సైట్లు పుట్టగొడుగుల్లా నెట్లో ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. మరిన్ని మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది బాధితులు ఉన్నారనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు. చదవండి: -
సైబర్ సెక్యూరిటీపై మీకు ఆసక్తా ? మైక్రోసాఫ్ట్ నుంచి మీకో ఆఫర్ !
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ సెక్యూరిటీను కెరియర్గా ఎంచుకునే వారికోసం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక శిక్షణా ప్రోగ్రాంను ఆవిష్కరించింది. క్లౌడ్హ్యాట్, కీనిగ్, ఆర్పీఎస్, సినర్జిటిక్స్ లెర్నింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందించనుంది. ఈ ప్రోగ్రాం కింద 2022 నాటికి లక్ష మందికి పైగా శిక్షణనివ్వాలని భావిస్తోంది. నైపుణ్యాల విషయంలో అన్ని స్థాయిల వారికి అనువుగా ఉండే విధంగా కోర్సు మాడ్యూల్స్ను రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంను తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. దీనికి సంబంధించిన అనుబంధ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఫండమెంటల్స్లో సర్టిఫికేషన్ను ఉచితంగా అందిం చనున్నట్లు పేర్కొన్నారు. -
12345, ఇవేం పాస్వర్డ్లురా నాయనా! మరీ ఇంత బద్ధకమా?
Most Common Passwords In India: నార్డ్పాస్ అనే గ్లోబల్ సంస్థ 50 దేశాల్లో పాస్వర్డ్ల తీరును, వాటిని ఛేదించడానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీనికోసం ఈ సంస్థ 4టీబీ సామర్థ్యమున్న డేటాబేస్ను విశ్లేషించింది. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భద్రతపరంగా సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సైబర్ భద్రత పరంగా మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. దేశంలో ఎక్కువ మంది తమ ఖాతాలకు పెట్టుకున్న పాస్వర్డ్ ఏంటంటే.. ‘PASSWORD’. పోలీసులు, భద్రతా సంస్థలు సులభంగా ఛేదించగలిగే పాస్వర్డ్లు పెట్టుకోకుండా సంక్లిష్లమైనవి పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. భారత్లో ‘PASSWORD’ తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్వర్డ్లు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty and abc 123 ఇవే అని ఆ అధ్యయనంలో తేలింది. వీటిలో india123 తప్ప మిగిలిన వాటిని ఒక సెకను కన్నా తక్కువ సమయంలోనే హ్యాక్ చేయొచ్చు. india123 పాస్వర్డ్ను కనుక్కునేందుకు మాత్రం 17 నిమిషాలు పట్టింది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు పెరిగిపోయాయి. బడి, గుడి మొదలుకొని అన్నింటా డిజిటల్ సేవలే. బ్యాంకింగ్, ఈ–కామర్స్ వంటి వాటిలో మరీ ఎక్కువ. కరెన్సీ నోట్ల వాడకం తగ్గింది... కార్డులు, ఫోన్ పేమెంట్లు, ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఆయా సేవలు పొందాలంటే మనకు ఆ సంబంధిత సంస్థ వెబ్సైట్లో అకౌంట్ ఉండాలి. దానికి ఒక పాస్వర్డ్ తప్పనిసరి. అయితే, పాస్వర్డ్ బలహీనంగా ఉంటే మన ఖాతాలు హ్యాక్కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ జీవితానికి గేట్వే ‘పాస్వర్డ్లు అనేవి మన డిజిటల్ జీవితాలకు గేట్వే లాంటివి. అదీగాక ఆన్లైన్లో మనం గడిపే సమయం క్రమక్రమంగా పెరిగిపోతోంది. అందువల్ల సైబర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం పాస్వర్డ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని అంటారు నార్డ్పాస్ సీఈఓ జొనాస్ కర్క్లీస్. దురదృష్టవశాత్తు చాలామంది బలహీనమైన పాస్వర్డ్లు పెట్టుకుంటున్నారని, వాటిని కూడా ‘ఆరోగ్యకరంగా’ పెట్టుకోవాలని చెబుతారాయన. ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో వరుససంఖ్యలు ఉన్నాయి. 50 దేశాల్లో 123456, 123456789, 12345 తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్వర్డ్లు qwerty, password అని పెట్టుకున్నట్లు గుర్తించారు. మన జీవితాల్లో కీలక పాత్ర పోషించే పాస్వర్డ్ను పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆ అధ్యయనం నొక్కిచెప్పింది. ఇది హ్యాకింగ్కు, ఇతరుల ఊహలకు అందకుండా ఉండాలి. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి కొత్త రూల్స్
Google two step Verification: సోషల్ మీడియా, క్లౌడ్ స్టోరేజీ, వర్చువల్ వరల్డ్ మన జీవితంలో భాగంగా మారిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఈ అకౌంట్లను రెగ్యులర్ టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయా అకౌంట్ల భద్రత ఎంతో ముఖ్యమైన వ్యవహరంగా మారింది. ఈ క్రమంలో తన యూజర్ల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం అ జాగ్రత్తగా ఉన్నా మోసాలు చేస్తున్నారు. సోషల్ మీడియా సైట్లు, బిజినెస్ మెయిల్స్లోకి దూరి వ్యక్తిగత సమాచారం లూటీ చేస్తున్నారు. దీంతో యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని గూగుల్ సంస్థ మరోసారి టూ స్టెప్ వెరిఫికేషన్ (2ఎఫ్ఏ, టూ ఫ్యాక్టర్ అథెంటీకేషన్)ను అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే కేవలం పాస్వర్డ్ ఒక్కటి ఎంటర్ చేస్తే సరిపోదు. దాంతో పాటు మరో అథెంటీకేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ ఉండాల్సిందే టూ స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి యూజర్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ తర్వాత మొబైల్ ఫోన్ని రెండో ప్రామాణీకంగా గూగుల్ తీసుకుంటోంది. దీంతో ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్తో పాటు ఫోన్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేయల్సి ఉంటుంది. కాబట్టి జీ మెయిల్ ఓపెన్ చేసేప్పుడు మీ ఫోన్ని పక్కనే ఉంచుకోవాలంటూ సూచన చేస్తోంది గూగుల్. మొదలైన ప్రక్రియ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియను జీ మెయిల్ వేగవంతం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీ మెయిల్ యూజర్లకు అలెర్ట్ మెసేజ్లు పంపిస్తోంది గూగుల్. తొలి దశలో 15 కోట్ల అకౌంట్లకు టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ను అమలు చేయనున్నారు. నవంబర్ 8 నుంచి ఎంపిక చేసిన యూజర్లను ఈ టూ స్టెప్ పరిధిలోకి తీసుకువస్తోంది గూగుల్. 2022 చివరికి గతంలో కూడా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను అమలు చేయాలని గూగుల్ ప్రయత్నించినా యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. అయితే ఈసారి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో కేవలం పది శాతం యూజర్లకే దీన్ని పరిమితం చేసింది. 2022 చివరి నాటికి యూజర్లందరికి వర్తింప చేయాలనే వ్యూహంతో ఉంది. చదవండి:గూగుల్ ప్లే స్టోర్లో అలజడి..! భారీగా నిషేధం..! -
టెక్నాలజీ దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: భారత్ను మరింత బలమైన టెక్నాలజీ దిగ్గజంగా రూపొందించేందుకు ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రధాని కొన్ని కీలకమైన ఆశయాలను నిర్దేశించుకున్నారని.. వీటి సాకారానికి గాను పోటీతత్వం, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలైన క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామి కానున్నట్టు తెలిపారు. సీఐఐ నిర్వహించిన టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలను డిజిటైజ్ చేసే దిశగా గడిచిన ఆరేళ్లలో కీలక అడుగులు పడ్డాయని చెప్పారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సమయంలో బలంగా నిలదొక్కొం దని అభిప్రాయపడ్డారు. -
సెక్యూరిటీ, డేటా ప్రైవసీకి కృషి చేయాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక సంస్థలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఇవాంటి’ కార్యకలాపాలను గురువారం ప్రారంభించిన ఆయన సాఫ్ట్వేర్ ఎగుమతిదారుల్లో హైదరాబాద్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రముఖ సాంకేతిక కంపెనీలకు గమ్యస్థానంగా నగరం మారుతోందన్న ఆయన, వాటి సరసన ‘ఇవాంటి’చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏడు వందల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించిన ‘ఇవాంటి’రాబోయే రోజుల్లో మూడు రెట్ల ఉద్యోగులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకోవడం హర్షణీయమన్నారు. భారత్ ఓ వైపు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నా, సైబర్ ముప్పు ద్వారా సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్పై భారీ జరిమానా
సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ తో సహా కేంద్ర బ్యాంకు జారీ చేసిన కొన్ని ఆదేశాల నిబంధనలను ఉల్లంఘించినందుకు యాక్సిస్ బ్యాంక్ పై ₹5 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపింది. స్పాన్సర్ బ్యాంకులు, ఎస్ సీబిలు/యుసీబిల మధ్య చెల్లింపు పర్యావరణ వ్యవస్థ నియంత్రణలను బలోపేతం చేయడంపై ఆర్బీఐ జారీ చేసిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక స్టేట్ మెంట్ లో తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (చట్టం) సెక్షన్ 46 (4) (ఐ), సెక్షన్ 47 ఎ (1) (సి) నిబంధనల కింద ఆర్బీఐ జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31, 2017(ఐఎస్ఈ 2017), మార్చి 31, 2018(ఐఎస్ఈ 2018), మార్చి 31, 2019 (ఐఎస్ఈ 2019) నాటికి యాక్సిస్ బ్యాంక్ నిర్వహించిన లావాదేవీలపై చట్టబద్దంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు తనిఖీల సమయంలో ఆర్బీఐ జారీ చేసిన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని సలహా ఇస్తూ సెంట్రల్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. తాము ఇచ్చిన నోటీసులకు బ్యాంకు సమాధానాలు, మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత ఆర్బీఐ ఆదేశాలను యాక్సిస్ బ్యాంక్ ఉల్లఘించినట్లు తేలడంతో జరిమానా విధించినట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. -
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్
న్యూఢిల్లీ: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్-200 టాప్-10 దేశాల్లో భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రూపొందించిన ఈ జాబితాలో భారత్ 10వ ర్యాంక్ను చేజిక్కించుకుంది. 37 స్థానాలు మెరుగుపడి ఈ ర్యాంక్ను దక్కించుకోవడం విశేషం. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్ ఈ అంశంలో తాజాగా తన ర్యాంకును మరింతగా మెరుగుపరుచుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంత పరంగా నాల్గవ ర్యాంక్ సాధించింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో చట్టపరమైన, సాంకేతిక, సంస్థాగత చర్యలు, సామర్థ్యం అభివృద్ధి, సహకారం ఆధారంగా ఇండెక్స్ రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్ పరంగా భారత్ టాప్ 10లో ఉంటే మన శత్రు దేశాలు చైనా 33వ స్థానంలో, పాకిస్తాన్ 79వ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు), గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఎజెండా(జీసీఏ) జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో యుకె ఉంది. "ఇది గొప్ప వార్త సీఈఆర్టీ(సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్)తో పాటు మేము తీసుకున్న చర్యలకు ఇది నిదర్శనం' అని భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్(ఎన్ సీఎస్సీ) రాజేష్ పంత్ అన్నారు. చదవండి: సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు -
బగ్ను కనిపెట్టి రూ. 22 లక్షలు గెలుచుకున్న 20 ఏళ్ల యువతి
ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ అదితి సింగ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అజ్యూర్లో బగ్ను గుర్తించినందుకు 30,000 డాలర్ల(సుమారు రూ.22 లక్షలు) రివార్డును గెలుచుకుంది. కేవలం రెండు నెలల క్రితం ఫేస్ బుక్ లో ఇలాంటి బగ్ ను కనుగొన్న అదితి 7500 డాలర్ల(సుమారు రూ.5.5 లక్షలకు పైగా) రివార్డు గెలుచుకుంది. రెండు కంపెనీలకు చెందిన రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్(ఆర్సీఈ)లో బగ్ ఉన్నట్లు కనుగొంది. ఇటువంటి బగ్స్ ద్వారా హ్యాకర్లు సులువుగా ఇంటర్నల్ సిస్టంలోకి ప్రవేశించి అందులోని సమాచారాన్ని పొందగలరని గుర్తించింది. ఇలాంటి బగ్స్ గుర్తించడం అంత సులభం కాదని, ఎథికల్ హ్యాకర్లు కొత్త బగ్స్ గురించి వారి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించడంపై దృష్టి సారించడం కంటే, మొదట ఎథికల్ హ్యాకింగ్ గురించి జ్ఞానం సంపాదించుకోవాలని సూచిస్తుంది. సైబర్ నేరగాళ్ల భారీ నుంచి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్డేట్ చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిలో కొన్ని లోపాలు ఉంటుంటాయి. అలాంటి వాటిని ముందుగా కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారికి కంపెనీలు నగదు బహుమతి అందజేస్తుంటాయి. ఈ బగ్ గురుంచి రెండు నెలల క్రితమే మైక్రోసాఫ్ట్ కు నివేదించినట్లు అదితి సింగ్ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్ దీనిపై వెంటనే స్పందిచలేదని బగ్ ఉన్న ప్రోగ్రాంను యూజర్స్ డౌన్లోడ్ చేసుకోలేదని నిర్థారించుకున్న తర్వాత లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది. బగ్ బౌంటీ కోసం ఎక్కువగా సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు లేదా భద్రతా పరిశోధకులు పోటీ పడుతుంటారు. వారు సదరు వెబ్ ను క్రాల్ చేస్తారు. హ్యాకర్లు చొరబడి కంపెనీలకు హానిచేయగల బగ్స్ ఉన్నాయా? లేదా అని మొత్తం కోడ్ ను స్కాన్ చేస్తారు. ఒకవేళ వారు ఏమైనా లోపాన్ని కనిపెడితే వారికి నగదు బహుమతిగా ఇవ్వబడుతుంది. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లో గుర్తించబడిన ఆర్సీఈ బగ్ గురించి అదితి మాట్లాడుతూ.. డెవలపర్లు మొదట ఎన్పీఏ (నోడ్ ప్యాకేజ్ మేనేజర్)ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కోడ్ రాయాలని సూచించింది. ఫేస్బుక్, టిక్టాక్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా, పేటీఎం, ఎథీరియమ్, హెచ్పీ వంటి దిగ్గజ కంపెనీల్లో సుమారు 40 వరకు బగ్లను కనుగొన్నట్లు తెలిపింది. మెడికల్ ఎంట్రన్స్లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్పై దృష్టి సారించినట్లు అదితి చెప్పుకొచ్చింది. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసా లేఖలను అందుకుంది. చదవండి: రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం -
భారతీయుల ‘ఫేస్బుక్’ వివరాలు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ఏకంగా 61 లక్షల మంది భారతీయుల ‘ఫేస్బుక్’ ఖాతా వివరాలు లీక్ అయ్యాయి. ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, పేర్లు ఆన్లైన్లో హ్యాకింగ్ వేదికల్లో అందుబాటులోకొచ్చాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అలోన్ గాల్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 53.3 కోట్ల ఫేస్బుక్ యూజర్ల వివరాలు హ్యాకింగ్ ఫోరమ్లలో ఉచితంగా లభిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఆన్లైన్లో లీక్ అయిన అకౌంట్లను దేశాలవారీగా చూస్తే 61 లక్షల మంది భారతీయుల అకౌంట్లు, 3.23 కోట్ల అమెరికన్ దేశీయుల అకౌంట్లు, బ్రిటన్కు చెందిన కోటీ 15 లక్షల ఖాతాలు, ఆస్ట్రేలియాకు చెందిన 73 లక్షల యూజర్ అకౌంట్లు ఉచితంగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లేనని ఆయన అంచనావేశారు. లీక్ అయిన డాటాలో కోట్లాది యూజర్ల ఫోన్ నంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, యూజర్ల పూర్తి పేర్లు ఉన్నాయి. వీటిని హ్యాకర్లు చేజిక్కించుకుని సోషల్ ఇంజనీరింగ్ స్కామింగ్, హ్యాకింగ్, మార్కెటింగ్కు పాల్పడే ప్రమాదముందని అలోన్ హెచ్చరించారు. -
ప్రభుత్వ డేటాకు మరింత భద్రత
సాక్షి, అమరావతి: సైబర్ సెక్యూరిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ–గవర్నెన్స్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.153.06 కోట్లతో ఏపీటీఎస్ రెండు చోట్ల ఎస్డీసీలను ఏర్పాటు చేస్తోంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.83.4 కోట్ల వ్యయంతో విశాఖలో ప్రైమరీ సైట్ను, దీనికి అనుబంధంగా కడపలో రూ.69.67 కోట్లతో డిజాస్టర్ రికవరీ సైట్ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశామని, ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏడాదిలోగా ఈ ఎస్డీసీని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వమే సొంతంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా డేటా భద్రతతో పాటు నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం డేటా నిర్వహణకు ప్రైవేటు సంస్థ నుంచి క్లౌడ్ సర్వీసులు వినియోగించుకుంటే ఐదేళ్ల కాలానికి రూ.795 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, అదే ఎస్డీసీ ద్వారా ఈ వ్యయాన్ని రూ.570 కోట్లకు పరిమితం చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చిలోగా ఎస్డీసీలోకి.. డేటా భద్రతకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న అప్లికేషన్లను ఏపీఎస్డీసీలోకి మార్చి 31లోగా బదలాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 32కు పైగా ప్రభుత్వ విభాగాలు ఈ గవర్నెన్స్లో భాగంగా బయట సంస్థలు అభివృద్ధి చేసిన అప్లికేషన్లు, హోస్టింగ్ డేటా వినియోగించుకుంటున్నట్లు ఏపీటీఎస్ గుర్తించింది. ఈ అప్లికేషన్లకు సంబంధించి సెక్యూరిటీ ఆడిటింగ్ చేసి, మార్చి 31లోగా ఎపీఎస్డీసీలోకి మార్చనున్నారు. అలాగే ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న ఐటీ అప్లికేషన్లు, వెబ్సైట్లు, యాప్ల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను కూడా జారీ చేసింది. -
పాస్వర్డ్ సింపులా.. ప్రమాదంలో ఉన్నట్లే
సైబర్ సెక్యూరిటీ.. ఇప్పుడు ఎక్కువగా దీనిపైనే చర్చ.. అందుకే ప్రతిదానికి ఓ రహస్య పాస్వర్డ్. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే.. మీ ఖాతా అంత సురక్షితం అన్నట్లు లెక్క. అయితే.. చాలామంది కామన్గా ఉండే పాస్ట్వర్డ్స్ వాడుతుంటారు.. ఐ లవ్ యూ అని.. 12345 అని ఇలా.. హ్యాకింగ్ చేయడానికి కొందరు ఏదో ఒకటి తగిలేదాకా.. కామన్గా ఉండే పాస్వర్డ్లను ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పాస్వర్డ్ పెట్టుకుంటే.. మన ఖాతా ప్రమాదంలో పడ్డట్లే. దీనికి సంబంధించి నార్డ్పాస్ ఏటా వరస్ట్ పాస్వర్డ్స్ జాబితా విడుదల చేస్తోంది. అంటే.. వాటిని ఈజీగా హ్యాక్ చేయొచ్చని అర్థం. ఇలాంటివి మొత్తం 200 పాస్వర్డ్ల వివరాలు.. వాటిని హ్యాక్ చేయడానికి పట్టే సమయం వంటివాటిని https://nordpass.com/most commonpasswordslistలోఉంచింది. మీరూ ఓసారి చెక్ చేసుకోండి.. ఒకవేళ మీ పాస్వర్డ్ కనుక ఇందులో ఉంటే.. వెంటనే మార్చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడైతే.. టాప్–8 జాబితా చూద్దాం.. -
విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త
న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త తెలిపింది. భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో స్వల్ప కాలనికి రెండు షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీపై రెండు స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. ఈ రెండు కోర్సులు 12వారాల పాటు కొనసాగుతాయి. వారంలోని ఐదు రోజులలో రోజుకి రెండు గంటల చొప్పున ఈ ఆన్లైన్ క్లాస్ నిర్వహించనున్నారు.(చదవండి: వాట్సాప్లో మరో కొత్త ఫీచర్) ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ కోర్సులలో ఏదైనా స్ట్రీమ్లో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష రుసుము ఉచితం కాగా, ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒక్కో కోర్సు ధరఖాస్తు కోసం అభ్యర్థులు 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల ప్రవేశ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ జనవరి 28 నుంచి అధికారిక వెబ్సైట్ https://onlinecourse.diat.ac.in/DIATPortal/ ద్వారా ప్రారంభమవుతుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజును ఫిబ్రవరి 26లోగా చెల్లించాల్సి ఉంటుంది. డీఆర్డీఓ ఆన్లైన్ కోర్సుల 2021: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జనవరి 28 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 15 ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20 సైబర్ సెక్యూరిటీ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 21 మూడు కోర్సుల ఫలితాలు విడుదల తేదీ: ఫిబ్రవరి 22 రుసుము చెల్లించాల్సిన చివరి తేదీ: ఫిబ్రవరి 26 ఆన్లైన్ క్లాస్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28 -
దివ్యాంగ జవాన్లు సైబర్ వారియర్స్
జవహర్నగర్(హైదరాబాద్): దేశ అంతర్గత భద్రతలో సైబర్ వార్ కూడా ప్రధానమైందని దివ్యాంగ జవాన్లను సైబర్ వారియర్స్గా తీర్చి దిద్దుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆటంకాలెన్ని ఎదురైనా ధృఢసంకల్పంతో లక్ష్యాన్ని ఛేదిస్తున్న సీఆర్పీఎఫ్ జనాన్ల సేవలు మరువలేనివన్నారు. గురువారం జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ క్యాంపస్లో దివ్యాంగ సైనికుల నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ‘దివ్యాంగ్ సాధికారత’కేంద్రాన్ని కిషన్రెడ్డి ప్రారంభించి జవానులు నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఆర్పీఎఫ్ జవాన్లు దేశ రక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుంటారని నక్సల్స్ ఏరివేతలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. దేశ రక్షణలో భాగంగా కొన్ని అనుకోని సంఘటనల్లో గాయపడ్డ జవాన్లకు కేంద్రం ఎల్లప్పుడూ సహాయంగా ఉంటుందన్నారు. సైనికుల శారీరక సామర్థ్యాన్ని, వివిధ రంగాల్లో వారి నైపుణ్యతను పెంచేలా ఈ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారిని పారా స్పోర్ట్స్లో శిక్షణనిచ్చి విదేశాలలో పారా గేమ్స్లో పోటీ చేయిస్తామన్నారు. సీఆర్పీఎఫ్లో దాదాపు 500పైగా జవాన్ల పిల్లలు దివ్యాంగులుగా ఉంటున్నారని వారందరికీ ఈ కేంద్రం దోహదపడుతుందని చెప్పారు. (చదవండి: పద్దెనిమిదేళ్ల తర్వాత పరిహారం) దివ్యాంగ జవాన్లతో కలిసి ఆటలాడిన కిషన్రెడ్డి అనంతరం కిషన్రెడ్డి దివ్యాంగ సైనికులకు అందుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇతర సదుపాయాలను పరిశీలించి సైనికులతో కలసి బ్యాడ్మింటన్ ఆడి వారిలో మరింత ఆత్మౖస్థైర్యాన్ని నింపారు. సమావేశంలో పద్మశ్రీ ఖేల్రత్న అవార్డు గ్రహీత దీపా మాలిక్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సౌత్సెక్టార్ ఐజీ సంజయ్ ఎ.లాత్కర్, సీఆర్పీఎఫ్ డీజీ డాక్టర్ ఎ.పి.మహేశ్వరీ, తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి, పద్మశ్రీ డాక్టర్ దీపా మాలిక్, బీఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, జవాన్లు పాల్గొన్నారు. -
43 చైనా యాప్లపై నిషేధం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా తో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్కి చెందిన ఈ కామర్స్ యాప్ అలీ ఎక్స్ప్రెస్ సహా కొన్ని డేటింగ్ యాప్లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ యాప్లు దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా ఉన్నందున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర హోంశాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్కు అందిన సమాచారాన్ని క్రోడీకరించి దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 యాప్లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఇప్పటివరకు మూడు దఫాలుగా చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. గల్వాన్ లోయలో భారత్తో ఘర్షణలకు దిగిన డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఏడాది జూన్ 29న తొలిసారిగా 59 యాప్లపై నిషేధం విధించింది. భారత పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం భారత్లో విస్తృతం ప్రాచుర్యం కలిగిన పబ్జి, టిక్టాక్ వంటి గేమింగ్ యాప్ల ఆటకట్టించింది. ఆ తర్వాత జూలై 27న ప్రజాదరణ పొందిన కామ్స్కానర్ వంటి మరో 47 యాప్లపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 2న మరో 118 యాప్లను నిషేధించింది. పబ్జి, టిక్టాక్ వంటి గేమింగ్ యాప్లను తొలి దశలో నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు కామర్స్, డేటింగ్ యాప్లపై కొరడా ఝళిపించింది. తాజాగా 43 యాప్లతో మొత్తం నిషేధం విధించిన యాప్ల సంఖ్య 267కి చేరుకుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం వాటిల్లితే ఎలాంటి చర్యలకైనా దిగుతామని కేంద్రం స్పష్టం చేసింది. -
ఆన్లైన్ ‘సెక్యూరిటీ’ కొద్ది మందికే!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ పెద్ద ఎత్తున అధికమైంది. ప్రధానంగా పండుగల సీజన్లో గణనీయంగా పెరిగింది. సైబర్ నేరస్తులు ఈ ట్రెండ్ను క్యాష్ చేసుకుంటున్నారని సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ మెకాఫీ మంగళవారం వెల్లడించింది. మెకాఫీ అడ్వాన్స్డ్ థ్రెట్ రిసర్చ్ టీమ్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతి నిముషానికి 419 సైబర్ నేరాలు నమోదయ్యాయి. జనవరి–మార్చితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేయడంతో కస్టమర్లు సైబర్ నేరస్తుల ఉచ్చులో పడుతున్నారు. నేరస్తుల చేతుల్లోకి కస్టమర్ల వ్యక్తిగత సమాచారం చేరుతోంది. ఆన్లైన్ కోనుగోలుదారుల్లో 27.5 శాతం మంది మాత్రమే సెక్యూరిటీ సొల్యూషన్స్ను వినియోగిస్తున్నారు. ఇది సైబర్ నేరస్తులకు వరంగా మారుతోందని మెకాఫీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకట్ కృష్ణపూర్ తెలిపారు. ఆన్లైన్ ముప్పుపట్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటున్నారు. చదవండి: లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన -
ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు
టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డేటా సైన్స్ నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ –సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్ను ప్రస్తుత డిమాండ్తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు: డేటాసైన్స్ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్లో బ్లాక్చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్చైన్టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్చైన్ డెవలపర్, బ్లాక్చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్చైన్ ఎస్ఐ పార్టనర్ డెవలప్మెంట్ మేనేజర్, బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్చైన్ ప్రిన్సిçపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వేతనాలు: బ్లాక్చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి. ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్వర్క్గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. బిజినెస్ అనలిటిక్స్ ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్కు బాగా డిమాండ్ ఏర్పడింది. పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్గా కెరీర్ను ప్రారంభించవచ్చు. వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది. బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్ మెంట్ను తయారు చేసేదే.. బయోమె డికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్గా విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్స్టాలెషన్ యూనిట్లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. -
‘ఎమర్జింగ్’పై దృష్టి
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతికత (ఎమర్జింగ్ టెక్నాలజీ)ను అందిపుచ్చు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యక లాపాల్లో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించు కోవాలని నిర్ణయించింది. ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు 2016లో విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీలో పలు ప్రతిపాదనలు చేసింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చెయిన్, డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగానికి ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విభిన్న రంగాల్లో కృత్రిమ మేధస్సు... 2020ని కృత్రిమ మేథో సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన పలు ప్రాజెక్టులను పాలన, పౌర సేవల్లో వినియోగిస్తోంది. మేడారం జాతరలో క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిజిస్ట్రేషన్ కార్యాలయం చిరునామా పౌరులు తెలుసుకునేందుకు ‘మేధ’ చాట్బోట్ వంటివి ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని చేనేత, వస్త్ర పరిశ్రమలోనూ ఉపయోగించి నేత కార్మికులు, వినియోగదారులకు మేలు చేసే దిశగా ఓ ప్రాజెక్టు రూపొందుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి రంగాల్లోనూ ఏఐ ఆధారంగా పలు ఆవిష్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రయత్నాలు చేస్తోంది. బ్లాక్ చెయిన్తో పౌర సేవల్లో పారదర్శకత ప్రభుత్వ, పౌర సేవల్లో పారదర్శకత, రక్షణ పెంపు లక్ష్యంగా బ్లాక్ చెయిన్ ఆధారిత ప్రాజెక్టులు సుమారు పది వరకు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా భూ రికార్డులు తారుమారు చేయకుండా ‘సీడాక్’ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు మంచి ఫలితాలు సాధించింది. చిట్ఫండ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రూపొందించిన ‘టీ చిట్స్’ జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించింది. విద్యార్హత సర్టిఫికెట్లు, ఔషధాల్లో నకిలీల నివారణ, ప్రజాపంపిణీ వ్యవస్థ, న్యాయ వ్యవహారాలు, రవాణా, భూ రికార్డుల్లో పారదర్శకత వంటి రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ ఆధారిత ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మరిన్ని రంగాలకు డ్రోన్ టెక్నాలజీ విస్తరణ డ్రోన్ల దిగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం నిర్మాణ, వ్యవసాయ, ఆరోగ్య, బీమా, సినిమాటోగ్రఫీ, పోలీసు తదితర రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అటవీ సంరక్షణ, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ పేరిట దేశంలోనే తొలి డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్టును చేపట్టింది. సైబర్ సెక్యూరిటీ.. ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక, బ్యాంకింగ్, రక్షణ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులతోపాటు నేర పరిశోధనలో సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీపై రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్సీఐ) భాగస్వామ్యంతో హైదరాబాద్లో రూ. 22 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటైంది. మరోవైపు ఈ–వేస్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉండటంతో ఈ రంగంలో ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, ఈ–వేస్ట్ నిర్వహణ తదితరాలకు సంబంధించి రూ. 36 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది. ఎమర్జింగ్ టెక్నాలజీకి తెలంగాణ కేంద్ర బిందువుగా మారుతుండటంతో భవిష్యత్తులో ఉద్యోగాలు అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. -
‘లాక్డౌన్లో సైబర్ సెక్యూరిటీ పెద్ద సవాల్’
ముంబై: లాక్డౌన్ సమయంలో సైబర్ సెక్యూరిటీ అతి పెద్ద సవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ఆయన ఓ సంస్థ ఏర్పాటు చేసిన విబెనార్(ఆన్లైన్)లో మాట్లాడుతూ.. ఇటీవల లాక్డౌన్ కారణంగా మాల్వేర్, ట్రోజన్ దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్, సాఫ్ట్వేర్ తదితర అంశాలలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకుని సైబర్ దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. గేములు, టీవీ కంటెంట్ ద్వారా కీలకమైన డేటా ఒకరి నుంచి మరొకరికి వెళ్లిందని ఆయన అన్నారు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ప్రజలు సైబర్ దాడుల పట్ల అప్రమత్తగా ఉండాలని గాంధీ వివరించారు. -
షట్లర్లకు ఐఓసీ పరీక్షలు
న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్లైన్లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్ సెక్యూరిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ తదితర కోర్సులు చదివి (ఆన్లైన్లో) అసెస్మెంట్ పరీక్షలు రాయాలని సూచించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల డబుల్స్ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్మెంట్ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్తో కసరత్తు, ఫిట్నెస్ కోసం వార్మప్ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్పై మాకు అవగాహన కల్పించేలా ఉంది. ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్లైన్ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. -
‘జూమ్’ సేఫ్ కాదు
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం గురువారం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్ఫామ్ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్ను వినియోగించే ప్రైవేటు సంస్థ లు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది. అవి.. 1. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాగానే, అడ్మినిస్ట్రేటర్ ‘లాక్ మీటింగ్’ఆప్షన్ను ఆన్ చేయాలి. 2. ప్రతీ మీటింగ్కు కొత్తగా యూజర్ ఐడీని, పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి. 3. అడ్మినిస్ట్రేటర్ అనుమతితోనే కొత్త సభ్యులు మీటింగ్లో పాల్గొనేలా ‘వెయిటింగ్ రూమ్’ఆప్షన్ను ఎనేబుల్ చేయాలి -
త్వరలో జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. సైబర్ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో నూతన సైబర్ సెక్యూరిటీ పాలసీను రూపొందిస్తున్నట్లు జాతీయ సైబర్ సెక్యూరిటీ కోఆర్డీనేటర్ రాజేష్ పంత్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ 2020లో రాజేష్ పంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడు నెలల్లో సైబర్ పాలసీకి చెందిన విధానాల రూపకల్పన పూర్తవుతుందని తెలిపారు. సైబర్ నేరాలు జరిగే అవకాశాలు ఉన్న దేశాలలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సైబర్ నేరాలు ఎక్కువయితే జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ప్రజలకు మెరుగైన సేవలందిస్తు సమాచారాన్ని భద్రపరచడం అంత సులువు కాదని రైల్వే ఉన్నతాధికారి విజయ్ దేవ్నాథ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రక్షణశాఖ సలహాదారు అమిత్ శర్మ పేర్కొన్నారు. -
ఫేస్/ఐరిస్తోనే ఇక మొబైల్ బ్యాంకింగ్!
సాక్షి, అమరావతి: మొబైల్ బ్యాంకింగ్ విధానంలో సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కేంద్రం నడుం బిగించింది. వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానానికి బదులు.. ఫేస్/ఐరిస్ గుర్తింపు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు సైబర్ భద్రత విధానాన్ని రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓటీపీ ఆధారంగా నిర్వహిస్తున్న మొబైల్ బ్యాంకింగ్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్లు, బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లోనే నగదును మరో ఖాతాకు బదిలీ చేస్తున్నారు. మొబైల్ బ్యాంకింగ్ ఖాతాదారులు ఈ విషయాన్ని గ్రహించే లోగానే అకౌంట్లలో నగదు మాయమైపోతోంది. త్వరలో జాతీయ సైబర్ భద్రత విధానం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్లో సైబర్ ఆర్థిక నేరాలను సత్వరం అరికట్టాల్సిన అవసరముందని సైబర్ పోలీస్, ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ బ్యాంకింగ్లో సైబర్ నేరాలను అరికట్టేందుకు కార్యాచరణకు సన్నద్ధమైంది. సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు ప్రధాన సాధనంగా చేసుకుంటున్న ఓటీపీ నంబర్ విధానాన్ని తొలగించాలని భావిస్తోంది. ఆ స్థానంలో ఖాతాదారుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్), ఐరిస్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. స్మార్ట్ఫోన్లో సంబంధిత ఖాతాదారుడి ముఖం/ఐరిస్ గుర్తింపును సరిచూశాకే ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగే విధానాన్ని అమలు చేయనున్నారు. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను ఇప్పటికే రూపొందించి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ విధానంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని సైబర్ పోలీసింగ్ నిపుణులు నిర్ధారించారు. దాంతో ఈ విధానాన్ని అధికారికంగా దేశమంతా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుతో చర్చించింది. మొబైల్ బ్యాంకింగ్ విధానంలో ఫేస్ /ఐరిస్ గుర్తింపు ప్రక్రియను సైబర్ భద్రత విధానంలో పొందుపరచాల్సి ఉంది. అందుకు అవసరమైన జాతీయ సైబర్ భద్రత విధానం–2020ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే రూపొందించింది. త్వరలోనే దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం బ్యాంకులతో సమావేశం నిర్వహించి ఫేస్/ఐరిస్ గుర్తింపుతోనే మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయిస్తారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఈ కొత్త విధానంతో మొబైల్ బ్యాంకింగ్కు సంబంధించిన సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టొచ్చని సైబర్ క్రైం పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆందోళనకర స్థాయిలో ఆర్థిక నేరాల పెరుగుదల గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాలు దాదాపు 300శాతం పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా 2016 నుంచి ఈ నేరాల తీవ్రత అమాంతంగా పెరుగుతోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, ప్రజలు మొబైల్ బ్యాంకింగ్ వైపు మొగ్గుచూపుతుండటంతో అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాల గణాంకాలిలా ఉన్నాయి.. -
వృత్తివిద్యా కోర్సుల్లో.. సీట్లకు గరిష్ట పరిమితి
సాక్షి, అమరావతి :ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తివిద్యా కోర్సులు నిర్వహించే కాలేజీల్లో గరిష్ట సీట్ల సంఖ్య ఇక నుంచి పరిమితం కానుంది. కోర్సుల వారీగా గరిష్ట సీట్ల సంఖ్యను నిర్ణయించిన జాతీయ సాంకేతిక విద్యా మండలి.. 2020–21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానుంది. ప్రొఫెషనల్ కాలేజీలు కొన్ని డిమాండ్ ఉన్న కోర్సుల్లో అత్యధిక సీట్లకు అనుమతులు తీసుకుంటున్నాయి. ల్యాబ్లు, ఇతర సదుపాయాలు పరిమితంగానే ఉన్నా అదనపు సెక్షన్లను కొనసాగిస్తూ విద్యార్థులకు బోధనను వాటితోనే సరిపెడుతున్నాయి. కానీ, మిగతా కాలేజీల్లో ల్యాబ్లు, ఇతర సదుపాయాలున్నా వాటిలోని సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులపై తప్ప ఇతర కోర్సులపై ఆయా కాలేజీల యాజమాన్యాలు కూడా పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. దీంతో కొన్ని కాలేజీల్లో సీట్లు 1,200 వరకు ఉండగా మరికొన్నిటిలో 200 నుంచి 300 వరకు మించి ఉండడంలేదు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీల్లో కోర్సుల వారీగా సీట్ల సంఖ్యను నిర్దిష్ట గరిష్ట పరిమితిని విధించి ఆ మేరకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన హేండ్బుక్–2020–21లో దీన్ని పొందుపరిచింది. కొత్త కోర్సులకు పెద్దపీట కాగా, విద్యార్థుల్లో నూతన సాంకేతిక అంశాలను పెంపొందించడానికి కొత్త కోర్సులను కూడా కాలేజీల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. నేటి అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో సామర్థ్యాలు సంప్రదాయ కోర్సులతో కన్నా కొత్త కోర్సుల ద్వారానే సాధ్యమని ఏఐసీటీఈ స్పష్టంచేసింది. ఈ కారణంగానే సంప్రదాయ కోర్సుల్లో అదనపు సీట్లను ఇక నుంచి కేటాయించరాదని నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త సాంకేతిక కోర్సుల వైపు విద్యా సంస్థలను మళ్లించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, మొబిలిటీ, అనలైటిక్స్, క్లౌడ్ వంటి అంశాలు అత్యధిక డిమాండ్తో పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే నాస్కామ్, ఫిక్కి, బీసీజీ అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. దీంతో యూజీ, పీజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థలు ముఖ్యంగా కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డాటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ 3డీ ప్రింటింగ్, డిజైన్, అగ్యుమెంటెడ్ రియాలిటీ, వరŠుచ్యవల్ రియాలిటీ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. -
సైబర్ రక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సేవలను అత్యధికంగా వినియో గిస్తున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత్ తరచూ సైబర్ దాడులకు గురవుతోంది. దేశ రక్షణ, ఆర్థిక సంస్థలతోపాటు ఇతర కీలక రంగాలకు చెందిన డేటా (సమాచారం) తస్కరణ, దుర్వినియోగమవుతోంది. దీంతో దేశ భద్రతతో పాటు ఆర్థిక పురోగతిపై తీవ్ర ప్రభావం చూపు తోంది. సైబర్ సెక్యూరిటీ ప్రమాదంలో ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాలు సైబర్ సెక్యూరిటీ సెల్స్, సైబర్ ఆపరేషన్ సెంటర్ల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మరోవైపు ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ రంగంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి నూతన సాంకేతికత వినియోగం పెరగ డంతోపాటు త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా అందుబాటులో వచ్చే ఐటీ సాంకేతికతలతో సైబర్ భద్రతకు మరింత ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన చెందుతు న్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ సెక్యూరిటీ దిశగా చర్యలు చేపడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఇతర రాష్ట్రాలకంటే ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇటీవల హైదరాబాద్లో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీసీఓఈ) ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటి సీసీఓఈ... సైబర్ సెక్యూరిటీకి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని దేశంలోనే మొట్టమొదటి సైబర్ సెక్యూ రిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీసీఓఈ)ను డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్సీఐ) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సైబర్ సెక్యూరిటీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉండే సీసీఓఈ... సైబర్ సెక్యూరిటీ, గోప్యతకు సంబంధించిన అనువైన వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సీసీఓఈలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఐటీ సంస్థలు, విద్య, పరిశోధన కేంద్రాలతోపాటు సంబంధిత రంగానికి చెందిన వారికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న ఇజ్రాయెల్ స్థాయికి రాష్ట్రాన్ని చేర్చేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. సైబర్ సెక్యూరిటీ పరిశోధనల్లో ఇప్పటికే రష్యా, యూకే, నెదర్లాండ్స్, కెనడా వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సీసీఓఈ... దేశీయంగా టీ–హబ్, ఫిక్కీ, సీఐఐ, ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సీసీఓఈ ఏర్పాటు ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డేటా భద్రత కోసం పీడీపీ బిల్లు... సైబర్ సెక్యూరిటీ కోసం ఇప్పటికే నేషనల్ టెక్నికల్ ఆర్గనైజేషన్తోపాటు హోం, ఐటీ, రక్షణ, మానవ వనరుల మంత్రిత్వ శాఖలు వేర్వేరు కార్యకలాపాలు చేపట్టాయి. అయతే డేటా భద్రత, గోప్యతపై ఆందోళన పెరుగుతుండటంతో ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్’బిల్లు తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్న ఈ బిల్లు... త్వరలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బిల్లు ప్రతిపాదనల ప్రకారం తొలుత చైర్మన్, నలుగురు శాశ్వత సభ్యులు ఉండే డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఏది సున్నిత సమాచారం, ఏది కీలక సమాచారం అనే అంశాలను ఈ అథారిటీ నిర్వచించడంతోపాటు దేశంలోనే ఉండాల్సిన డేటా, ఇతర దేశాలకు ఇవ్వాల్సిన డేటాపై స్పష్టత ఇస్తుంది. బిల్లును చట్టంగా మార్చి ఒకట్రెండేళ్లలో అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని నిర్ణయించింది. -
సైబర్ సెక్యూరిటీ అందరికీ అవసరమే
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాధానం అందిస్తున్నా సైబర్ నేరాలు తగ్గకపోవడంపై సైబరాబాద్ కమిషనర్ వి.కె.సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం ఐటీ సంస్థలకు చెందిన వ్యవహారమని అనుకోరాదని, స్మార్ట్ఫోన్లు ఉపయోగించే వారికీ హ్యాకర్ల నుంచి ముప్పు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన మరింత పెంచుకోవాలని ఆయన ప్రజలకు గురువారం సూచించారు. హైదరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఓ సదస్సుకు హాజరైన వి.కె.సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఐదేళ్లుగా ‘సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్’ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల పోలీసులతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థల అధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారని చెప్పారు. అధికాదాయం గల వ్యక్తులనూ లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు నేరాలకు పాల్పడుతున్నారని సజ్జనార్ వివరించారు. ఫేస్బుక్ ద్వారా శత్రుదేశాల గూఢచారులు దేశీ రక్షణదళాల సిబ్బందిని వలలో వేసుకోవడమూ సైబర్ నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేసిన ఆయన ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతీసారి సంబంధిత శాఖకు అప్రమత్తంగా ఉండాల్సిందిగా లేఖలు రాస్తున్నామని వివరించారు. విశాఖపట్నంలో ఇటీవల కొంతమంది నేవీ అధికారులను పాకిస్తాన్ గూఢచారులు హనీట్రాప్ చేసి సున్నితమైన సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. హైదరాబాద్లో సుమారుగా ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. వీరిలో చాలామంది తమ ఉద్యో గాలు చేసుకుంటూనే ట్రాఫిక్ నియంత్రణ, మహిళల అంశాల విషయంలో పోలీసులకు సహకరిస్తున్నారని, సైబర్ సెక్యూరిటీ విషయంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ సదస్సులో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) ఉన్నతాధికారి సంజయ్ భాల్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. -
సైబర్దాడులకు కృత్రిమ మేథతో చెక్..
న్యూఢిల్లీ: సైబర్దాడులను గుర్తించేందుకు, సమర్ధంగా ఎదుర్కొనేందుకు కంపెనీలు ఇకపై మరింతగా కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటివి ఉపయోగించనున్నాయి. అయితే, హ్యాకర్లు కూడా ఇదే సాంకేతికతతో మరింత వేగంగా, కచ్చితత్త్వంతో దాడులు చేసే ముప్పు కూడా పొంచి ఉంది. భారత మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ అంశంపై డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్సీఐ), కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. డేటా గోప్యత, భద్రత విషయంలో.. నియంత్రణ సంస్థలపరమైన ఆంక్షలు 2020లో తారస్థాయికి చేరుకోనున్నాయి. దీంతో దేశీ సంస్థలు అటు అంతర్జాతీయంగా నియంత్రణలతో పాటు దేశీయంగా వ్యక్తిగత డేటా భద్రత చట్టాలకు కూడా అనుగుణంగా పనిచేయాల్సి రానుంది. ఫలితంగా డేటా భద్రతకు సంబంధించిన వ్యవస్థలను మెరుగుపర్చుకునేందుకు దాదాపు అన్ని సంస్థలూ మరింత వెచ్చించనున్నాయి. -
అమ్మకానికి 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా..
న్యూఢిల్లీ : భారత బ్యాంక్ కస్టమర్లకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక డేటా డార్క్ వెబ్లో బహిరంగ అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీటి అమ్మకంతో సైబర్ క్రిమినల్స్ 130 మిలియన్ డాలర్లు సొమ్ము చేసుకునేందుకు లక్షలాది బ్యాంకు కస్టమర్ల కీలక డేటాను అమ్మకానికి పెట్టారు. జడ్డీనెట్ అందించిన వివరాల ప్రకారం దేశీ కస్టమర్లకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు జోకర్స్ స్టాష్లో అందుబాటులో ఉన్నాయి. డార్క్ వెబ్లోని పురాతన కార్డ్ షాపులలో ఒకటైన జోకర్స్స్టాష్ ప్రధాన హ్యాకర్లు కార్డ్ డంప్లను విక్రయించే ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. అనైతిక కార్యకలాపాలు సాగించేందుకు ఐపీ అడ్రస్ పసిగట్టకుండా వెబ్ మాఫియా డార్క్ వెబ్ను అడ్డాగా చేసుకుని చెలరేగుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డార్క్ వెబ్లో జోకర్స్ స్టాష్ ఇండియా మిక్స్ న్యూ-01 అనే శీర్షికతో ప్రకటన ఇస్తోందని సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీఏకు చెందిన పరిశోధకులు గుర్తించారు. భారత్కు చెందిన పలు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులను ఒక్కోటి రూ 100 డాలర్లకు అమ్మకానికి పెట్టారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద కార్డ్ డంప్గా సెక్యూరిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) సిస్టమ్స్ వద్ద ఏర్పాటు చేసిన స్కిమ్మింగ్ పరికరాలతో కార్డు వివరాలను హ్యాకర్లు రాబడుతున్నట్టు డేటా అనాలిసిస్ ద్వారా గుర్తించామని ఆ నివేదికలో పరిశోధకులు తెలిపారు. జోకర్స్ స్టాష్ నుంచి కార్డు వివరాలను కొనుగోలు చేసిన నేరగాళ్లు వాటి ఆ వివరాలతో క్లోనింగ్ ద్వారా సరైన కార్డులు రూపొందించి ఏటీఎంల నుంచి దర్జాగా నగదు విత్డ్రా చేస్తారు. ఫిబ్రవరిలో జోకర్స్ స్టాష్లో 25 లక్షల మంది అమెరికన్ల కార్డు వివరాలు అమ్మకానికి పెట్టారు. గత ఐదేళ్లుగా టార్గెట్, వాల్మార్ట్, లార్డ్ అండ్ టేలర్, బ్రిటిష్ ఎయిర్వేస్ వంటి కంపెనీల నుంచి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ దొంగిలించిన క్రెడిట్ కార్డుల డేటాను విక్రయిస్తూ ప్రముఖ అండర్గ్రౌండ్ క్రెడిట్ కార్డు షాప్గా పేరొందింది. దీనివద్ద 53 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు ఉన్నట్టు సైబర్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. -
సైబర్ సెక్యూరిటీలో మన ర్యాంకు..?
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీలో అధ్వాన్న స్థితిలో నిలిచిందని సెబర్ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్ బారిన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్డేటెడ్ చట్టాలు, మాలావేర్ ఎటాక్, సైబర్-దాడులకు సంసిద్ధత లాంటి అంశాలపై యూకేకు చెందిన టెక్నాలజీ పరిశోధనా సంస్థ కంపారిటెక్ 60దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా 46వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సైబర్-సురక్షిత దేశంగా జపాన్ నిలిచింది. కేవలం 1.34శాతం ఫోన్లు, 8 శాతం కంప్యూటర్లు మాత్రమే సెబర్ దాడులకు గురవుతున్నాయి సర్వే వెల్లడించింది. సైబర్ దాడులు నిరోధం, చట్టాలులాంటి అంశంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో మెరుగా వుందని తెలిపింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, కెనడా, డెన్మార్క్, అమెరికా తరువాతి స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్, చైనా రెండూ సైబర్-సెక్యూరిటీలో అధ్వాన్నంగా ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం స్కోరులో 39 శాతం సాధించిందని రిపోర్టు పేర్కొంది. సైబర్దాడులకు సంబంధించి ఈ జాబితాలో అల్జీరియా అట్టడుగున నిలిచింది. అలాగే సరైన చట్టాలు,రక్షణ చర్యలు లేని కారణంగా ఇండోనేషియా, వియత్నం, టాంజానియా, ఉజ్బెకిస్తాన్ ఎక్కువ దాడులకు గురవుతున్నాయని నివేదించింది. -
బాధ్యతతోనే ఆన్లైన్ భద్రత
ఆన్లైన్ వేదికల్లో చట్టవిరుద్ధమైన క్రియాశీలక అంశాలను నియంత్రించడమే ప్రధాన అంశం. ఇందుకు ఆయా అంశాల చట్టబద్ధతను గుర్తించే స్థితిలో మధ్యవర్తులు ఉండాలి. దీనిపై అవగాహన లేకుండా ఆయా అంశాలను సెన్సార్ చేయడం అసాధ్యం. అత్యాధునిక ఫిల్టరింగ్ సాంకేతికత కూడా చట్టసమ్మతమైన అంశాలను సెన్సార్ చేసి, చట్టవిరుద్ధమైనవాటిని వదిలేస్తూంటుంది. నియంత్రణ బాధ్యతను మధ్యవర్తులు స్వీకరించడం ప్రమాదకర స్థాయికి చేరుకుని మన ఆన్లైన్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్రిమినల్ చర్యలకు గురవుతామనే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వ అధికారిఅనే తేడాలేకుండా ఫిర్యాదు అందితే ఎటువంటి అంశాలనైనా తొలగించివేస్తున్నారు. వివిధఇంటర్నెట్ సంస్థలు,ఫేస్బుక్,ట్విట్టర్ వంటి సామాజికమాధ్యమాలతో ‘రహస్య సంప్రదింపులు’ జరిపి సమాచార సాంకేతిక(ఐటీ) చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా దాన్ని మరింత అస్పష్టతలోకి నెడుతోంది. టెలికాం సంస్థలు, ఆన్లైన్ వేదికలను ‘మధ్యవర్తులు’గా పేర్కొంటూ రూపొందిన ఐటీ చట్టం ఇప్పటికే సుదీర్ఘంగా, అస్పష్టతతో నిండి ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఐటీ శాఖ ముసాయిదా సవరణలు ఆమోదం పొందితే దేశంలో ప్రై వేటు సెన్సార్షిప్ మొదలవుతుంది. భావ ప్రకటనాస్వేచ్ఛపై ప్రై వేటు నిఘా పెరుగుతుంది. పైగా ఆన్లైన్ ప్రపంచం వాస్తవంగా ఎదుర్కొంటున్న అప్రజ్వామిక, అభద్రత సమస్యల జోలికి మాత్రం ఇది పోవడం లేదు. ఈ ముసాయిదాను వెనక్కు తీసుకోవడమేకాక ఆన్లైన్ వేదికల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడమని ప్రభుత్వాన్ని అందరూ కోరడం తక్షణావసరం. టెలికాం కంపెనీలవంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఆన్లైన్ వేదికలైన ఫేస్బుక్, ట్వీటర్వంటి ‘మధ్యవర్తుల’కు ఐటీ చట్టంలోని సెక్షన్ 79 రక్షణ కల్పిస్తోంది. కనుక ఈ సర్వీసుల్ని ఉపయోగించుకునే మూడో పక్షంవారు ఉపయోగించే పదాలకూ లేదా చర్యలకూ ఈ సంస్థలు నేరుగా బాధ్యులు కాకుండా ఆ నిబంధన కాపాడుతోంది. ఈ నిబంధనే లేకపోతే చట్టవిరుద్ధమైన అంశాల విషయంలో మధ్యవర్తి సంస్థలపై సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. దీని పర్యవసానమేమంటే అత్యంత నియంత్రిత ఇంటర్నెట్ వ్యవస్థ రూపొందుతుంది. ఆన్లైన్ వేదికలు, ఇతర సర్వీసులు విస్తతమైన సెన్సార్షిప్కు సిద్ధపడతాయి. ఆన్లైన్ వినియోగదారులు పోస్టు చేసే అంశాలపై నిఘా పెడతాయి. ఆ రకంగా ఒక ప్రై వేటు నిఘా వ్యవస్థ రూపొందుతుంది. ఎగ్జిక్యూటివ్ రూపొందించిన రూల్స్తో పోల్చి చూసి, చురుకుగా పరిశీలించి, వాస్తవాల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారాన్ని తొలగించినప్పుడే సెక్షన్ 79 మధ్యవర్తులకు రక్షణ కల్పిస్తుంది. మధవర్తులకు మార్గదర్శక సూత్రాలపేరిట 2011లో ఈ నిబంధనలను రూపొందించారు. ప్రమాదకరమైన, వేధింపులకు గురిచేసే, పరువు నష్టం కలిగించే, అశ్లీల, నగ్న, మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే, ద్వేషపూరితమైన, నైతిక విరుద్ధమైన, జూదాన్ని ప్రోత్సహించే లేదంటే మరేవిధంగానైనా చట్టవిరుద్ధమైన అంశాలు వేటినైనా తొలగించడానికి ఈ నిబంధనలు దోహదం చేస్తాయి. సెక్షన్ 79, 2011 నిబంధనల్లోని అస్పష్టత కారణంగా తాము ఎప్పుడు బాధ్యులమవుతామో తెలియక సెన్సార్ చేసే వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. క్రిమినల్ చర్యలకు గురవుతామనే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వ అధికారి అనే తేడా లేకుండా ఫిర్యాదు అందితే చాలు ఎటువంటి అంశాలనైనా తొలగించివేస్తున్నారు. అయితే, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు దీనిని తోసిపుచ్చింది. న్యాయ ఆదేశం లేదంటే తగిన ప్రభుత్వ నోటిఫికేషన్వంటి వాస్తవమైన ఆధారాలు సెక్షన్ 79 కింద అవసరమవుతాయని కోర్టు స్పష్టం చేసింది. గూగుల్, ఫేస్బుక్ వంటివి ఆయా అంశాల చట్టబద్ధతను నిర్ధారించడం, తమ వేదికలపై వాటిని వడబోయడంలో వుండే క్లిష్టతను, ప్రమాదాన్ని కోర్టు గుర్తించింది. ఇటీవలి అంశాలు మధ్యవర్తులను బాధ్యులను చేయడంపై భారత ప్రభుత్వం పునరాలోచించుకునేలా చేశాయి. ఫేస్బుక్లో కేంబ్రిడ్జ్ అనలైటికా ఎన్నికల వ్యవహారంలో వేలుపెట్టడం, వాట్సాప్ తప్పుడు సమాచారంవంటి అంశాలపై మాత్రమే ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. సుప్రీంకోర్టు చేతులు కట్టేయడంతో చట్టవ్యతిరేక ప్రసంగాలను మధ్యవర్తులు తగ్గించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది. మధ్యవర్తులు సాంకేతికతకమైన స్వయం నియంత్రిత సాధనాలు లేదా అందుకు తగినటువంటి విధానం, తగినటువంటి నియంత్రణల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారంగానీ, అంశాలను గానీ గుర్తించి, తొలగించడానికి నెలకొల్పాలని రూల్ 3(9)లో పేర్కొనడం జరిగింది. దీంతోపాటు సమాచారాన్ని ఇతరులు పొందే వీలులేకుండా వాట్సాప్ అనుసరిస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను దృష్టిలో పెట్టుకుని సమాచారం మూలాన్ని తెలుసుకునే అవకాశం మధ్యవర్తులకు కల్పించే విధంగా నిబంధనలను సడలించాల్సి ఉంది. సమాచారం మూలాన్ని తెలుసుకునే వెసులుబాటును వ్యతిరేకించేప్పుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69కింద ఇప్పటికే ఈ వెసులుబాటు మధ్యవర్తులకు కల్పించిన విషయాన్ని గుర్తించాలి. అయితే, సమాచారాన్ని డీక్రిప్ట్ చేయడంలో అస్పష్టత, సురక్షితం కాకపోవడం వంటి అంశాలు చాలా వరకు చట్టవిరుద్ధమైనవేగాక, ప్రాథమిక గోప్యతా హక్కుపై సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకమైనవి. చట్టవిరుద్ధమైన క్రియాశీలక అంశాలను నియంత్రించడమే ప్రధాన అంశం. ఇందుకు మొదట ఆయా అంశాల చట్టబద్ధతను గుర్తించే స్థితిలో మధ్యవర్తులు ఉండాలి. ఇది పూర్తిగా న్యాయపరిధిలోని అంశం. దీనిపై అవగాహన లేకుండా ఆయా అంశాలను సెన్సార్ చేయడం అసాధ్యం. అలాగే న్యాయపరమైన అవగాహన అవసరం లేని నిగ్రహంతో కూడిన అంశాల చట్టబద్ధతను నిర్ణయించడం కూడా ప్రైవేట్ సెన్సార్షిప్లో భాగంగా రాజ్యాంగ విరుద్ధమవుతుంది.అంతేగాక, స్వయం నియంత్రిత సాధనాలు కేవలం చట్టవిరుద్ధమైన అంశాలను మాత్రమే నియంత్రించగలవని విశ్వసిస్తాం. కానీ, వాస్తవం వేరుగా ఉంటుంది. అత్యాధునిక ఫిల్టరింగ్ సాంకేతికత కూడా చట్టసమ్మతమైన అంశాలను సెన్సార్ చేసి, చట్టవిరుద్ధమైనవాటిని వదిలేస్తూంటుంది. భారత్లో మధ్యవర్తులు బాధ్యతవహించాలనే అంశంపై రూపొందించిన నిబంధనలు కొంత ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ నిబంధనలపై అటు ప్రభుత్వం, ఇటు కోర్టులు పెనుగులాడుతున్నాయి. శ్రేయా సింఘాల్ కేసు అనంతరం కోర్టు ఆదేశాలతో మాత్రమే ఆయా అంశాలను తొలగించాల్సి ఉంది. అయితే సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ కారణంగా మధ్యవర్తులు తమ వేదికలపై నుంచి చట్టవిరుద్ధమైన అంశాలను తొలగించడంలో అలసత్వం చూపడంతో అవి వినియోగదారులపైకి వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ యాక్ట్లోని అంశాలను పక్కనబెట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆటో బ్లాకింగ్ను సుప్రీంకోర్టు అనుమతించింది. కొత్త ముసాయిదా నిబంధనల్లో ఉన్న ఈ అంశం ఇవే కారణాల వల్ల ప్రమాదకరమైనది. ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్లు తమను తాము నిష్పాక్షికమైన మధ్యవర్తులుగా చూపుకుంటున్నప్పటికీ ఆయా అంశాల సెన్సార్, వడబోత, ప్రాధాన్యత, తొలగింపు అనేవే వాటి ప్రాథమిక అంశాలు. ఈవిధంగా చట్టపరమైన నిబంధనలు అడ్డుపడకపోవడంతో వినియోగదారుల అంశాలను నియంత్రించే బాధ్యతను మధ్యవర్తులు స్వీకరించడం ప్రమాదకర స్థాయికి చేరుకుని మన ఆన్లైన్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాజకీయ ప్రకటనలతో తప్పుదారి పట్టించడానికి ఫేస్బుక్ ప్రాధాన్యతనిస్తుంటే, అట్టడుగు వర్గాలవారిపై జరుగుతున్న హింసపై స్పందించడంలో ట్విట్టర్ విఫలంకావడం ఆన్లైన్ వేదికలను మరింత ప్రజాస్వామికీకరించాల్సిన ఆవశ్యకతను, వాటిని బాధ్యులుగా చేయాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి. ఆన్లైన్ వేదికలను బాధ్యులను చేసే, పారదర్శకతను పెంచే విషయంలో ఐటీ రూల్స్ ముసాయిదా ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతోపాటు; పబ్లిక్ అంశాలపై వారి ప్రైవేట్ సెన్సార్షిప్ను మరింత బలోపేతం చేసే విధంగా ఉన్నాయి. మధ్యవర్తుల ప్రైవేట్ సెన్సార్పై చట్టపరమైన జోక్యమైనా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఆయా అంశాలను నియంత్రించడంపై వారు తీసుకుంటున్న చర్యలు మరింత పారదర్శకంగా వుండేలా, నివేదికలు వెల్లడించేలా చేయడానికి చట్టం జోక్యం చాలా అవసరం. తమ వేదికలపై ఆయా అంశాలను నియంత్రించడంలో వారిని బాధ్యులను చేయడం ద్వారా వారు ఒక విధానాన్ని అనుసరించేలా చేయొచ్చు. అసంబద్ధమైన, చట్టవిరుద్ధమైన ప్రవర్తన గురించి వినియోగదారులకు తెలియజేయడం, దాన్ని నియంత్రించడానికి తీసుకున్న చర్యలను వివరించడం వంటి ఒక విధానాన్ని వారు రూపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడే సురక్షితమైన, ప్రజాస్వామికమైన ఆన్లైన్ స్పేస్ వినియోగదారులకు లభిస్తుంది. అంతేగానీ, ప్రభుత్వమో, ఆన్లైన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లో ముందు నిలబడి చట్టవిరుద్ధమైన అంశాలను అడ్డుకోవడం వల్ల కాదు. ఈ విషయమై మీ అభిప్రాయాలను కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు ఈ నెల 15లోగా తెలియజేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సెన్సార్షిప్ను వ్యతిరేకిస్తూ సురక్షితమైన, ప్రజాస్వామికమైన ఆన్లైన్ కమ్యూనిటీని పొందవచ్చు. వ్యాసకర్త: దివిజ్ జోషి, రీసెర్చ్ ఫెలో, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, బెంగళూరు. -
సైబర్ భద్రతకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ భద్రతను పటిష్టపరిచేందుకు నాస్కామ్ ఆధ్వర్యంలోని డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్సీఐ) సంస్థ భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీ–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక నివేదికను ఆవిష్కరించేందుకు శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో డీఎస్సీఐతో రాష్ట్ర ఐటీ శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ను సైబర్ సెక్యూరిటీకి హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సులువుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూపొందించిన ‘టీ–వెబ్’ (httpr://tweb. telangana.gov.in)ను మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సమాచార భద్రత కోసం రూపొందించిన తెలంగాణ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(టీ–ఎస్వోసీ)ను కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా 34 ఎంబీపీఎస్, 12 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించేందుకు తెలంగాణ స్టేట్ వైడ్ నెట్వర్క్ (టీ–స్వాన్) 2.0 కార్యక్రమంతో పాటు.. ఆధార్తో అనుసంధానం ద్వారా హాజరు నమోదు కోసం రూపొందించిన ‘టీఎస్టీఎస్ అబాస్’ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయ అవసర సామగ్రిని మీ–సేవ కేంద్రాల ద్వారా రైతులకు ఇం టి వద్దే సరఫరా చేసేందుకు ఇఫ్కో బజార్తో ప్రభు త్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పలు ఐటీ కంపెనీలకు పురస్కారాలు ఐటీ రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పరిశ్రమలకు కేటీఆర్ తెలంగాణ ఆవిర్భావ దిన పురస్కారాలు అందించారు. రూ.10,889 కోట్ల ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్కు పెద్ద కంపెనీల విభాగంలో అత్యధిక సాఫ్ట్వేర్ ఎగుమతుల పురస్కారం లభించింది. సూక్ష్మ, మధ్యంతర పరిశ్రమల విభాగంలో వాల్యూ మొమెంటమ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీకి ఈ పురస్కారం వరించింది. అత్యధిక ఉద్యోగాల కల్పన పురస్కారం పెద్ద కంపెనీల విభాగంలో ఇన్ఫోసిస్కు, సూక్ష్మ, చిన్న కంపెనీల విభాగంలో ఆర్ఎంఎస్ఐ ప్రైవేటు లిమిటెడ్కు దక్కింది. ఐటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన కంపెనీగా ఆర్ఎంఎస్ఐ, విశేషంగా సీఎస్ఆర్ సేవలందించిన కంపెనీగా టెక్ మహీంద్రా, అత్యంత సృజనాత్మక స్టార్టప్గా చిట్మాంక్స్, మోస్ట్ ప్రామిసింగ్ యాడ్టెక్ స్టార్టప్గా అడాన్మో, మోస్ట్ ఇన్నోవేటివ్ స్మార్ట్ సిటీ స్టార్టప్గా అయాస్టాలకు పురస్కారాలు లభించాయి. ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పురస్కారం కాలిబర్ టెక్నాలజీస్కు, తూర్పు క్లస్టర్ ప్రోత్సాహక పురస్కారం ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్కు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ రంగ అభివృద్ధి పురస్కారం టెక్ మహీంద్రాకు, టాస్క్ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధికి విశేష కృషి చేసినందుకు ఇన్ఫోసిస్కు, సైబరాబాద్లో మహిళల భద్రతకు కృషి చేసినందుకు ఐపీఎస్ అధికారి జానకి షర్మిళకు పురస్కారాలు అందించారు. కంప్యూటర్ విద్యను మారు మూల ప్రాంతాల్లో అందించినందుకు పి.కోటేశ్వర్రావు, ఆర్.పావని, రాజేశ్, పుల్యాల రజని, వి.నాగరాణిలకు డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అం దించారు. టాస్క్ ద్వారా గ్రామీణ యువతకు సాధికారత కల్పించినందుకు దీపిక రెడ్డి, అత్యుత్తమ సేవలందించిన ఎన్జీవోగా తెలంగాణ ఐటీ అసోసియేష న్, ఐటీ కారిడార్లో చేనేత దుస్తుల ప్రోత్సాహానికి గాను ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్కు పురస్కారాలు అందించారు. ‘ఆరోగ్య హైదరాబాద్గా తీర్చిదిద్దుతాం’ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను అందమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని.. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటామని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రపంచ పర్యావరణోత్సవాల నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్తో కలసి నగర శివారులో అటవీశాఖ అభివృద్ధి చేసిన భాగ్యనగర్ నందనవనం అర్బన్ ఫారెస్ట్ పార్కును కేటీఆర్ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎరిక్ సోల్హెమ్ ప్రశంసించారు. అర్బన్ ఫారెస్టు పార్కు నిర్వహణ బాగుందని.. నగరాల్లో నివసించే ప్రజలకు మంచి వాతావరణాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా ఇలాంటి పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. పార్కు సందర్శన అనంతరం ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎరిక్కు వివరించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కులో ఉన్న మొక్కలు, పూల సమాచారంతో తయారు చేసిన ‘ది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ కేబీఆర్ నేషనల్ పార్క్’పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
అప్పుడు కత్తులు.. ఇప్పుడు ల్యాప్టాప్లు
సాక్షి, ఉండవల్లి : ఒకప్పుడు కత్తులు పట్టుకుని తిరిగిన నేరగాళ్లు ప్రస్తుతం ల్యాప్టాప్లు పట్టుకుని తిరుగుతాన్నరని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయితీల వరకూ ఈ- ఆఫీసులను ఉపయోగించడం ద్వారా త్వరితగతిన పనులు పూర్తవడానికి అవకాశం ఉంటుందన్నారు. సాంకేతిక వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డేటా చౌర్యం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 58 శాతం మేర ఐటీ ప్రోడక్టులు మాల్ వేర్కు గురవుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్లు వాడేవారు ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగించేటపుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు...లోకేశ్పై ప్రశంసలు కురిపించారు. లోకేశ్ ఐటీ డిగ్రీ పరిజ్ఞానం ఇప్పుడు తన మంత్రిత్వ శాఖకు ఉపయోగపడిందని అన్నారు. తాను సాంకేతికపరమైన వ్యక్తిని కాదని, లీడర్ను మాత్రమే అని ఆయన అన్నారు. -
సైబర్ నేరాలపై రాష్ట్రాలకు హోంశాఖ దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరాలని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు రోజురోజుకి తమ పరిధిని పెంచుకుంటుడడంతో సైబర్ నేరాలను అరికట్టడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ వైబ్సైట్ల నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించడం వల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్ర హోంశాఖ నివారణ చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించింది. నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీచేసింది. వీటికి అనుగుణంగా రాష్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయో హోంశాఖకు తెలియజేయాలని పేర్కొంది. హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలు: 1. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సైబర్ నేర నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి, దానికి సీనియర్ ఐజీ ర్యాంకు అధికారిని కో ఆర్డినేటర్గా నియమించాలి. జిల్లా పోలీస్ స్టేషన్ల స్థాయిలో సైబర్ నేరాలను విచారించడానికి తగిన సౌకర్యాలను కల్పించేలా ఈ విభాగం బాధ్యత తీసుకోవాలి. కేసు తీవ్రతను బట్టి సమాచారమార్పిడి జరిగేట్టు చూడాలి. వివిధ క్యాటగిరీ కలిగిన పోలీసు అధికారులతోపాటు, సైబర్ సెక్యూరిటీ నిపుణులను కూడా నియమించుకోవాలి. జిల్లాలో డీఎస్పీని గానీ, అడిషనల్ ఎస్పీని గానీ కో ఆర్డినేటర్గా నియమించాలి. జిల్లా సైబర్ సెల్ ఆ జిల్లా ఎస్పీతో పాటు, రాష్ట్ర సైబర్ సెల్కి రిపోర్ట్ చేయాలి. 2. ప్రపంచంలో ఎక్కడినుంచైనా సైబర్దాడులు జరిగే అవకాశం ఉన్నందున్న అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ పనిచేయాలి. పక్క రాష్ట్రాల్లో జరిగే నేరాలను పరిష్కరించేందుకు ఉమ్మడి బృందాలు ఏర్పాటు చేయడం, విదేశాలతో సంబంధం ఉండే నేరాల కోసం సీబీఐతో సంప్రదింపులు జరపాలి. 3. హోంశాఖ విడుదల చేసిన 82.8 కోట్ల రూపాయలతో రాష్ట్ర సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలి. సైబర్ సెల్లో పనిచేసే అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలి. వీటి ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు, నేరాలు జరిగితే త్వరితగతిన పరిష్కరించేందుకు సాధ్యపడుతుంది. అవసమైతే జిల్లా స్థాయిలో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. 4. సైబర్ సెల్లో పనిచేసే పోలీసులతో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి, జడ్జీలకు సైబర్ నేరాల జరిగే తీరుపై అవగాహన పెంపొందించాలి. బాధితులకు కూడా భరోసా కల్పించడం. కేసులను విచారించడానికి తగినంత సిబ్బందిని నియమించుకోవడం. అధికారుల కూడా నేరాలను పరిష్కరించడానికి గల సులువైన మార్గాల కోసం అన్లైన్లో ఉన్న వివిధ కోర్సులు నేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. 5. ఇప్పటికే వివిధ నేర నియంత్రణ విభాగాలు సైబర్ నేర నియంత్రణకై కృషి చేస్తున్నాయి. సైబర్ సెల్స్ ద్వారా మరింత లోతుగా దృష్టి సారించాలి. సోషల్ మీడియా, ఫెక్ అకౌంట్లపై నిరంతర నిఘా ఉంచాలి. అనుమనాస్పదంగా ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ, బ్లాక్మెలింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ను ఆరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. 6. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ సైబర్ నేరాలు నమోదు చేయడానికి cyberpolice.gov.in పేరుతో వెబ్సైట్ని సిద్ధం చేయనుంది. బాధితులు ఎవరైనా ఈ సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ద్వారా పోలీసు అధికారులు వెబ్సైట్లో లాగిన్ అవ్వొచ్చు. 7. అవగాహన లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నందు వల్ల కింది స్థాయి వరకు సైబర్ నేరాలపై కనీస పరిజ్ఞానాన్ని కల్పించాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్, ఎటీఎం, కెడ్రిట్ కార్డుల పిన్, వన్ టైం పాస్వర్డ్ వివరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తరచూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారం చేయాలి. -
సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్!
టెకాన్పూర్: పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం కారణంగా తలెత్తుతున్న సమస్యలు, సైబర్ నేరాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. వీటి పరిష్కారాన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించాలన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో జరుగుతున్న జాతీయ డీజీపీ, ఐజీపీల సదస్సు ముగింపు సందర్భంగా మోదీ మాట్లాడారు. అక్రమ ఆర్థిక వ్యవహారాల సమాచార మార్పిడిపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోందని.. దీంట్లో భారత్ కీలక భూమిక పోషించే అవకాశం ఉందన్నారు. అక్రమ ఆర్థిక లావాదేవీల విషయంలో రాష్ట్రపోలీసు ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాల పోలీసు అధికారులతో సమాచారాన్ని పంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ‘భారత్ సహజసిద్ధ సమాఖ్య’ అని ఆయన అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో సోషల్ మీడియా ప్రాముఖ్యతను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక భాషల్లో సందేశాలు పంపటం ప్రభావవంతంగా ఉంటుందని సూచించారు. యువత తీవ్రవాద భావాలవైపు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో సాంకేతికత ద్వారా సమస్యాత్మక అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర బలగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలపై ఏకాభిప్రాయం పెరుగుతున్న సమయంలో రాష్ట్రాల మధ్య భద్రత విషయంలో ఇలాంటి బంధాలు బలపడాలన్నారు. ప్రతీ రాష్ట్రం సమాచారాన్ని మార్పిడి చేసుకోవటం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. మార్పుకోసం ప్రయత్నిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల బాధ్యతల వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు పాత్ర మరింత క్రియాశీలకంగా మారిందన్నారు. దేశ భద్రత కోసం రూపొందించిన వివిధ కార్యక్రమాల అమలులో పరస్పర సహకారం అవసరాన్ని ఈ సదస్సులు గుర్తుచేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ సదస్సును మరింత ప్రభావశీలంగా మార్చేందుకు ఏడాది వ్యాప్తంగా నిర్ణయించుకున్న కార్యక్రమాల సమీక్ష జరగాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరొ (ఐబీ) అధికారులకు రాష్ట్రపతి పోలీసు మెడల్స్ను కూడా మోదీ అందించారు. -
ఫ్రీ వైఫై.. జాగ్రత్త సుమా!
వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరే అవకాశం ఎయిర్పోర్ట్.. రైల్వేస్టేషన్.. బస్టాండ్.. లాడ్జింగ్.. ఇలా ఎక్కడికెళ్లినా వెంటనే ఫ్రీ వైఫై కోసం వెతుకుతాం. వారు అడిగిన వివరాలు ఇచ్చి వెంటనే లాగిన్ అవుతాం. అయితే ఇలాంటి పబ్లిక్ వైఫైలతో చాలా సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోయే ప్రమాదముంది. అయినా సరే.. ఉచితంగా వస్తే చాలు.. ఇలాంటి రిస్క్ను భరించేందుకు సిద్ధమే అనే వినియోగదారులు ఎక్కువేనట. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీరిలో చాలామందికి ఇప్పటికీ సైబర్ సెక్యూరిటీ గురించి.. దాంతో వచ్చే సమస్యల గురించి తెలియకపోవడం. సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ఇటీవల పబ్లిక్ వైఫై వాడకం తీరుతెన్నులపై 15 దేశాల్లో విస్తృత సర్వే చేపట్టింది. పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చిన ఈ సర్వే వివరాలు.. జాగ్రత్త పడండి పబ్లిక్ వైఫై నెట్వర్క్ను ఉపయోగించేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని వారి చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్ సర్వే హెచ్చరిస్తోంది. సైమాంటిక్ అభివృద్ధి చేసిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘నార్టన్ వైఫై ప్రైవసీ’వంటివి వాడకం ద్వారా సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఆన్లైన్ సెక్యూరిటీ కోసం వెబ్సైట్ల యూఆర్ఎల్లలో హెచ్టీటీపీఎస్ ప్రొటోకాల్ ఉందో.. లేదో.. చూసుకోవాలి. అయితే నెట్వర్క్ సురక్షితంగా లేకపోతే హెచ్టీటీపీఎస్ ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. వైఫై నెట్వర్క్ ఆటోమేటిక్గా కనెక్టయ్యే ఆప్షన్స్ ఉంటే వాటిని వాడకపోవడమే మేలు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎడిట్ చేసేందుకూ అనుమతించే వారు 19% పబ్లిక్ వైఫై ద్వారా బ్యాంక్ అకౌంట్లు చూసుకోవడం, ఫొటోలు షేర్ చేసుకునే వారు 96% పబ్లిక్ వైఫై వాడినా తమ వివరాలకు వచ్చిన నష్టమేమీ లేదనుకునే భారతీయులు 74% కొత్త చోటికి వెళితే వైఫైలోకి ప్రవేశించేందుకు నిమిషమూ నిలవలేని వారు 51% వ్యక్తిగత ఈమెయిల్, కాంటాక్ట్స్ వివరాలు ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్న వారు 19% వైఫైతో పోలిస్తే సురక్షితమైన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్)ను వాడే వారు 48% పబ్లిక్ వైఫైతో అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు 31% -
సైబర్ భద్రతలో భారత్కు 23వ ర్యాంకు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) తెలిపింది. రెండో ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ)లో సింగపూర్ తొలిస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ సెక్రటరీ జనరల్ హౌలిన్ జహో తెలిపారు. -
సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సులు
హైదరాబాద్: సైబర్ నేరాల వల్ల యువత, ఎక్కువగా మహిళలు జీవితాన్ని కోల్పోతున్నారని, వాటి నుంచి రక్షించుకోవడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ‘ఇంటర్నేషనల్ ఉమెన్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఫౌండేషన్’ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఆయా ప్రభుత్వాల సహకారంతో ‘సైబర్ ఫోరెన్సిక్ సొల్యూషన్స్’ ద్వారా యువతకు ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు జ్యోత్సా్నరెడ్డి, శుభమంగళ చెప్పారు. ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పటికీ అతి తక్కువ సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని వారి సంఖ్య లక్షల్లో ఉందని తెలిపారు. ఇటువంటి వారి కోసం బంజరాహిల్స్లో ‘సైబర్ ఫోరెన్సిక్ సొల్యూషన్స్’ల్యాబ్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సదస్సుల్లో సైబర్ నేరాలు, ఇంటర్నెట్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. -
ప్రత్యేక సైబర్ భద్రత కేంద్రం!
జైపూర్: సైబర్ నేరాల నుంచి భద్రత కల్పించేందుకు, సాంకేతిక మౌలిక వసుతులను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక ఆర్థిక అత్యవసర సహాయ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దేశం పయనిస్తున్న తరుణంలో సైబర్ నేరాల గురించి ప్రజల్లో భయం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ పేర్కొన్నారు. జైపూర్లో జరుగుతున్న సాహిత్య వేడుకల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. -
డౌన్లోడ్లో మనమెంత స్లోనో తెలుసా?
ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్రం కలలు కంటోంది. హైస్పీడ్ ఇంటర్నెట్, అత్యున్నత సైబర్ భద్రత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ ఒకవైపు పెద్దనోట్ల రద్దు.. మరోవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలోనూ సైబర్ భద్రత విషయంలో దేశం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. తాజా అంతర్జాతీయ సర్వేలో డౌన్లోడ్ స్పీడ్ విషయంలో భారత్ 96వ స్థానంలో నిలువగా, బ్యాండ్విడ్త్ అందుబాటు విషయంలో మరీ దారుణంగా 105స్థానంలో ఉంది. ఇంటర్నెట్ భద్రత విషయంలోనూ దేశం చాలా వెనుకబడి ఉంది. డౌన్లోడ్ స్పీడ్ విషయంలో బంగ్లాదేశ్, నేపాల్ కంటే వెనుకబడి ఉన్న భారత్.. ’రాన్సమ్వేర్ అటాక్’ (సైబర్ దాడుల) విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకులు, రహస్య సమాచారం కలిగిన సంస్థలు లక్ష్యంగా ఇటీవలికాలంలో హ్యాకింగ్లు, సైబర్ దాడులు పెరిగిపోవడం గమనార్హం. దేశంలో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో, డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు సామాన్య ప్రజలు వెనుకాడుతున్నారని, తాము కూడా హ్యాకింగ్ బారిన పడి.. వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం కోల్పోయే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీలన్నింటికీ తగిన భద్రత కల్పించాలని, ఇందుకు అవసరమైన నిఘా, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ ఆరోస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక బ్యాండ్విడ్త్ అందుబాటు విషయంలో శ్రీలంక, చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేసియా మనకంటే ఎంతో ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఇంటర్నెట్ అందుబాటును మరింతగా పెంచడమే కాకుండా.. అటు సైబర్ భద్రతను మరింత పటిష్టపరచాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.