divya
-
దివ్య.. పరీక్ష రాస్తే విజయమే
తెలంగాణ పబ్లిక్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్–1, 2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సత్తాచాటారు. కొందరు అభ్యర్థులు ఇదివరకు గ్రూప్–4 (Group-4)ఫలితాల్లో ర్యాంకులు సాధించి ఆయా శాఖల్లో ఉద్యోగం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఉత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ – 2(Group-2) ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన మోటపల్లి దివ్య రాష్ట్రస్థాయిలో 169వ ర్యాంక్ సాధించారు. కాళేశ్వరం జోన్ మహిళా విభాగంలో రెండో ర్యాంక్ సాధించారు. బంగారు ఆభరణాల పనిచేసే మోటపల్లి తిరుపతి–భారతి దంపతుల కూతురు దివ్య(Divya ). బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. 2019లో వీఆర్వోతోపాటు గ్రూప్ – 4 ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్ష రాశారు.తొలుత వీఆర్వో ఉద్యోగానికి ఎంపికయ్యారు. జూలపల్లి మండలంలో పనిచేశారు. గ్రూప్– 4 పరీక్ష ఫలితాలు 2021లో ప్రకటించగా రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంక్ సాధించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. 317 జీవో కింద దివ్యను ధర్మారం తహసీల్దార్ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్గా బదిలీ చేశారు. గ్రూప్ – 1 లక్ష్యంగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టిన ఆమె.. రెండు నెలల వ్యవధిలోనే గ్రూప్ –2, గ్రూప్ –1 పరీక్షలు నిర్వహించగా రెండింటికి ప్రిపేరయ్యారు. మంగళవారం విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో సత్తా చాటారు. -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడి ముద్దుల కూతురు
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్(Sathyaraj ) కూతురు దివ్య సత్యరాజ్( Divya Sathyaraj) డీఎంకేలో చేరారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్( M K Stalin) సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వాన్ని ఆమె తీసుకున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ డీఎంకే అని, అందుకే తాను చేరినట్టు దివ్య పేర్కొన్నారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. దివ్య రాజకీయాల్లో రావాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె 2019 డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ను కలిసిన సందర్భంలోనే ఆపార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. ఇది మర్యాద పూర్వక భేటీ అని ఆమె స్పష్టం చేయడంతో రాజకీయ ప్రచారానికి తెర పడింది. ఆ తదుపరి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత పోస్టులు, పోషకాహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఫాస్ట్ఫుడ్ ప్రభావాల గురించి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. (ఇదీ చదవండి: ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి)ఈక్రమంలో సోషల్ మీడియా పోస్టులు అనేకం వివాదాస్పదమవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ను ఆమె కలిశారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో డీఎంకే కోశాధికారి టీఆర్బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రూ, చైన్నె తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శి శేఖర్బాబు ఆమెకు స్టాలిన్ ద్వారా సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం దివ్య మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ను కలవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పోషకాహార నిపుణురాలు అని పేర్కొంటూ, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకం, అల్పాహార పథకం , మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా మరెన్నో పథకాలకు ఆకర్షిస్తురాలైనట్లు వివరించారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ డీఎంకే అని, అందుకే ఈ పార్టీలో చేరానని పేర్కొన్నారు. తన తండ్రి, స్నేహితులు, అందరూ ఎల్లప్పుడు నా వెన్నంటి ఉంటారని వ్యాఖ్యానిస్తూ ఏ బాధ్యతను తనకు అప్పగించినా శ్రమిస్తానని, కష్ట పడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
Divya Arundati : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్పందించిన నటి!
డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
ప్రపంచ మూడో ర్యాంకర్గా అర్జున్
చెన్నై: చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలతో అదరగొట్టిన భారత గ్రాండ్మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) స్టాండర్డ్ ఫార్మాట్ ర్యాంకింగ్స్లోనూ ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో తెలంగాణకు చెందిన అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్కు చేరుకోగా... గుకేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్ను అందుకున్నాడు. అర్జున్ ఖాతాలో 2797 ఎలో రేటింగ్ పాయింట్లు, గుకేశ్ ఖాతాలో 2794 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2831 రేటింగ్ పాయింట్లతో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వరల్డ్ నంబర్వన్ ర్యాంకర్గా కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2802 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్–100లో భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది గ్రాండ్మాస్టర్లు ఉన్నారు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 12వ స్థానంలో ఉన్నారు. విదిత్ సంతోష్ గుజరాతి 22వ ర్యాంక్లో, అరవింద్ చిదంబరం 33వ ర్యాంక్లో, పెంటేల హరికృష్ణ 42వ ర్యాంక్లో, నిహాల్ సరీన్ 58వ ర్యాంక్లో, రౌనక్ సాధ్వాని 66వ ర్యాంక్లో, శ్రీనాథ్ నారాయణన్ 95వ ర్యాంక్లో, అభిమన్యు పురాణిక్ 98వ ర్యాంక్లో నిలిచారు. నంబర్వన్గా హంపి మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తన ఆరో ర్యాంక్ను నిలబెట్టుకొని భారత నంబర్వన్గా కొనసాగుతోంది. చెస్ ఒలింపియాడ్కు హంపి దూరంగా ఉన్నా ఆమె ర్యాంక్లో మార్పు రాలేదు. భారత రెండో ర్యాంకర్గా మహారాష్ట్రకు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ అవతరించింది. ఇన్నాళ్లు భారత రెండో ర్యాంకర్గా ద్రోణవల్లి హారిక కొనసాగింది. చెస్ ఒలింపియాడ్లో టీమ్ స్వర్ణ పతకంతోపాటు వ్యక్తిగత పసిడి పతకం నెగ్గిన దివ్య నాలుగు స్థానాలు పురోగతి సాధించి 11వ ర్యాంక్కు చేరుకుంది. హారిక 14వ ర్యాంక్లో, వైశాలి 15వ ర్యాంక్లో, తానియా సచ్దేవ్ 54వ ర్యాంక్లో, వంతిక అగరాŠవ్ల్ 58వ ర్యాంక్లో ఉన్నారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 76వ ర్యాంక్లో, భక్తి కులకర్ణి 82వ ర్యాంక్లో, సవితాశ్రీ 99వ ర్యాంక్లో నిలిచారు. -
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్మెంట్కు మారినప్పుడు బీచ్లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన నటి
ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేమంటారు. అలాగే బ్రేకప్, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎందుకు వస్తున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. హిందీ బిగ్బాస్ ఓటీటీ విన్నర్, నటి దివ్య అగర్వాల్ మనసు రెండేళ్లక్రితమే ముక్కలైంది. ప్రియుడు వరుణ్ సూద్తో నడిపిన నాలుగేళ్ల ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టింది. తాను కోరుకున్న విధంగా, సొంతంగా జీవించాలనుకుంటున్నా అని 2022 మార్చి 6న బ్రేకప్ వార్తను బయటపెట్టింది.పెళ్లయి మూడు నెలలు కాలేదుతర్వాత వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్తో ప్రేమలో పడింది. వీరిద్దరికీ 2022లో నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఓ షోలో కూడా తనను అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ పొంగిపోయింది నటి. కానీ అంతలోనే సడన్ షాకిచ్చింది. పెళ్లయిన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో నుంచి తీసేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నాం..మొన్నే పెళ్లయింది? అంతలోనే ఏంటీ ఘోరం? అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం మొన్నే కదా కలిసి నవ్వుతూ ఫోటోలకు పోజిచ్చారు.. ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు కదా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా? -
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
సినిమాల్లో శృంగార సన్నివేశాలు అనగానే.. హా ఏముంది ఈజీనే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ తెరపై చూసే దానికి తెరవెనక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు. ఇప్పుడు ఆ విషయాల్నే 'మంగళవారం' ఫేమ్ నటి దివ్య పిళ్లై బయటపెట్టింది. అసలు అవి ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అనే వాటి గురించి చాలా ఓపెన్గా చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవాల్ని షేర్ చేసుకుంది.'రొమాంటిక్ సీన్ అనగానే ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడమే కదా ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ సెట్స్లో అందరిముందు ఈ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే దాదాపు 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకు కనిపించే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మైండ్లో వేరే ఆలోచన ఏం ఉండదు' (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'అలానే ముద్దుని భలే ఎంజాయ్ చేయడం లాంటిది కూడా ఏం ఉండదు. దీనిబట్టి ఎంత కష్టం అనేది మీరే ఆలోచించండి. అలానే రొమాంటిక్ సీన్స్ కోసం చాలా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సహ నటుడితో కలిసి ముందు డిస్కస్ కూడా చేసుకోవాలి. సీన్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా సరే ముఖంలో ఆ ఫీలింగ్ చూపించకూడదు' అని దివ్య పిళ్లై చెప్పుకొచ్చింది.దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది. 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సహాయ పాత్రలు చేస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది సూపర్ హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. దీని తర్వాత 'తగ్గేదే లే' అని మరో మూవీ కూడా చేసింది. ప్రస్తుతం 'బజూకా' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) -
వివాహానికి హాజరై తిరిగొస్తుండగా..
శ్రీపొట్టి శ్రీరాములు: రోడ్డు ప్రమాదం పెళ్లింట అంతులేని విషాదాన్ని నింపింది. వివరాలు.. కందుకూరు పట్టణంలోని విప్ప గుంటలో నివాసముంటున్న రాయని అరుణ (50), రమణయ్య భార్యాభర్తలు. రమణయ్య సుమారు 20 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోవూరు రోడ్డులో టిఫిన్ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన ఇద్దరి పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో కుమార్తె స్రవంతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అశేష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పాల్వంచలోని వరుడి ఇంట్లో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అరుణతో పాటు కుమారుడు వేణుగోపాల్, మేనల్లుడు వినోద్, అతని భార్య తల్లపనేని దివ్య (30), వారి కుమారుడు మణి, మరో బంధువు గుళ్లాపల్లి శ్రావణి (22) కలిసి కారులో కందుకూరు బయల్దేరారు. వాహనాన్ని వేణుగోపాల్ నడిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూరారెడ్డిపాళెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో అరుణ, దివ్య, శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్, వినోద్, మణి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అంతలోనే.. అప్పటి వరకు పెళ్లిలో ఆనందంగా గడిపిన వారు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి, బంధువులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసి కొత్త పెళ్లి కూతురు స్రవంతి కన్నీరుమున్నీరయ్యారు. దివ్య భర్త వినోద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త, తన ఐదేళ్ల కుమారుడు మణితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. మేనత్త కుమార్తె వివాహం కావడంతో వినోద్ కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితమే కందుకూరొచ్చారు. అయితే ఊహించని ప్రమాదంలో దివ్య మృతి చెందారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. పెళ్లి కోసమే హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావణి మృతి చెందడం తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మికి మింగుడు పడని ఘటనగా మారింది. శ్రావణి కుటుంబం చాలా కాలంగా హైదరాబాద్లో ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. స్రవంతి పెళ్లి కోసమని శ్రావణి కందుకూరు వచ్చారు. ఇక స్రవంతి సొంత అన్న వేణుగోపాల్ కొద్దిరోజులుగా పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. విశ్రాంతి తీసుకోకుండా అర్ధరాత్రి కారు డ్రైవింగ్ చేస్తూ రావడం.. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అటు తల్లిని కోల్పోయి, ఇటు అన్న హాస్పిటల్ పాలవడంతో స్రవంతి రోదన వర్ణానాతీతంగా ఉంది. మృతదేహాలను గుర్రవారంపాళెం సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున బంధువులు చేరుకున్నారు. ఇవి చదవండి: కట్టేసి, కారం చల్లి.. -
Anny Divya: దివ్యమైన విజయం
స్త్రీల కలలు తరచు సామాజిక నిబంధనల మధ్య పరిమితం అవుతుంటాయి. అలాంటి ప్రపంచంలో అనీ దివ్య అసమానతలను ధిక్కరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో పుట్టి, విజయవాడలో పెరిగిన అనీ దివ్య... బోయింగ్ 777 ను నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్గా పేరు పొందింది. ‘మహిళా కమాండర్లలో అతి పిన్నవయస్కురాలిగా చేరాలని కలలు కనలేదు. కానీ, అభిరుచి, అంకితభావం ఆమె కలను సాకారం చేశాయి’ అని చెప్పే ముప్పై ఏడేళ్ల దివ్య... మహిళా శక్తి అంటే ఏమిటో తన విజయగాధ ద్వారా మనకు పరిచయం చేస్తుంది. ‘అమ్మాయిలు పెద్దగా కలలు కనడానికి వీలులేని ప్రదేశం నుండి వచ్చాను’ అని చెప్పే దివ్య 11వ తరగతి వరకు సాధారణ విద్యార్థిని. ఆమె తన కలను సాకారం చేసుకోవడానికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం తప్పనిసరి అని తెలుసుకుంది. అడ్డంకులను అధిగమించాలని నిశ్చయించుకుని, సవాల్ను ఎదుర్కొంది. అదే సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. దీంతో ఆమె కలలు స్పష్టంగా ఉన్నాయి అని కుటుంబ సభ్యులకూ అర్ధమైంది. కానీ, ముందుకు వెళ్లే మార్గం సులభంగా లేదు. అందుకు తగినంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. కానీ, ఆమె తండ్రి ఫ్లయింగ్ స్కూల్ ఫీజు కోసం రుణం తీసుకున్నాడు. దీంతో ఆమె అసలు ప్రయాణం మొదలైంది. 17 ఏళ్ల వయసులో ఉత్తర్ప్రదేశ్లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చేరింది. 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్గా నిలిచింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో కో–పైలట్గా చేరింది. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్ కోసం లండన్కు వెళ్లింది. అక్కడ ఆమె బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. పైలట్గానే కాదు కెప్టెన్ దివ్య మోటివేషనల్ స్పీకర్ కూడా. విమానయాన రంగంలో తన అనుభవాలు, సవాళ్లను వేదికలపై స్పీచ్లుగా ఇచ్చింది. ముంబై రిజ్వీ లా కాలేజీ నుండి ఎల్ఎల్బీ పట్టా కూడా పొందింది. ఎగతాళి చేసేవారు ‘‘నాన్న ఆర్మీలో ఉద్యోగి అవడంతో మా కుటుంబం పఠాన్కోట్లో ఉండేది. నేను అక్కడే పుట్టాను. నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు. అలా, నా స్కూల్ చదువు మొత్తం విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక ఉండేది. ఇది తెలిసి ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. పిల్లల్లో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కావా లనే అనుకునేవారు. అదృష్టవశాత్తు నా ఎంపికకు నా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. అయితే, పైలట్ కావాలనే నా నిర్ణయాన్ని బంధువులు, కుటుంబ స్నేహితులు వ్యతిరేకించేవారు. ఇది అమ్మాయిలకు తగిన వృత్తిగా అనుకునేవారు కాదు. సవాల్గా తీసుకున్నాను.. ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చు. కానీ, ఇంగ్లీషులో మాట్లాడటం అనేది సమస్యగా ఉండేది. దీంతో ట్రైనింగ్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ తోటి వారి హేళనకు గురయ్యాను. ఒక చిన్న పట్టణం నుండి వెళ్లడం, ఇంగ్లీషులో పట్టులేకపోవడంతో మొదటి రోజు నుండి సవాళ్లు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సీనియర్లు క్లాస్ బయటకు పిలిచి ర్యాగ్ చేసేవారు. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అందుకు సెలవుల్లో నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆంగ్లంలో మాట్లాడటానికి మంచి పట్టు సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి స్కాలర్షిప్ కూడా వచ్చింది. సాధించినప్పుడే మన శక్తి బయటకు తెలుస్తుంది ప్రపంచంలోనే బి777 మహిళా కమాండర్లలో అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. నడిచొచ్చిన దారిని చూసుకుంటే అన్నింటిని ఎలా అధిగమించాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఎవరి ప్రయాణమూ అంత సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మనలోని ఆత్మ విశ్వాసం బయటకు కనిపిస్తుంది. కలలు సామాజిక అంచనాలకు, ఆర్థిక పరిమితులకు పరిమితం కాదని ఆ శక్తి గుర్తు చేస్తుంది. ఒక చిన్న పట్టణం నుండి ఏవియేషన్ కమాండింగ్ ఎత్తుల వరకు ఎదగడంలో నా బలహీనతలపై చాలా పోరాటం చేశాను’’ అని వివరిస్తుంది కెప్టెన్ అనీ దివ్య. -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. ఆ విషయంలో నెటిజన్ల ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో నటి దివ్య అగర్వాల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్తో నటి ఏడడుగులు నడిచింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ముంబయిలోని చెంబూర్లో జరిగిన వివాహా వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. 2022లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి ముందు వేడుకలు కాక్టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. తర్వాత దివ్య అగర్వాల్ మెహందీ, హల్దీ వేడుక చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, నిక్కీ తంబోలి, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. కాగా.. హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్-2 తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు రియాలీటీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఏంటీవీ సీజన్- 10 రన్నరప్, ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్- 1, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచింది. ఆమె గతంలో వరుణ్ సూద్, ప్రియాంక్ శర్మతో రిలేషన్షిప్లో ఉంది. హల్దీ వేడుకపై ట్రోల్స్ దివ్య తన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వేడుకలో ఆమె లుక్ కంటే బ్యాక్గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వెనుక భాగంలో లేస్ చిప్స్ పాకెట్స్ దర్శనమిచ్చాయి. ఇది చూసిన కొందరు తక్కువ బడ్జెట్ డెకరేషన్ కోసం ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ రాస్తూ.. 'హల్దీ వేడుక కోసం చిప్స్తో అలంకరణ.. బడ్జెట్ అంత తక్కువగా ఉందా?' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
యజమాని వేధింపులు..శానిటైజర్ తాగిన యువతి
-
సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మీర్పేట్ టీచర్స్ కాలనీలోని గత కొంతకాలంగా సెలూన్లో పనిచేస్తున్న దివ్య అనే యువతి (18)పై యజమాని మురళి(35) లైంగిక దాడికి పాల్పడుతుండటంతో ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఓ సెలూన్ లో పని చేస్తున్న దివ్యను యజమాని మురళి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం. మంగళవారం 2024 జనవరి 30న మరళి సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్య(18)ను తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నం చేయగా.. దివ్య బయటికి వచ్చి అరవడంతో మురళి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో పలుమార్లు మురళి దివ్యను లైంగిక దాడి చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
Mangalavaaram: 'మంగళవారం' సినిమాలో ప్రెసిడెంట్ గారి పెళ్లాం ఫొటోలు చూశారా..దివ్యా పిళ్లైకి క్రేజ్ మామూలుగా లేదుగా!
-
మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే?
ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తనకు అచొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. పాయల్ రాజ్పుత్ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది. దివ్య ప్రస్థానం ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా.. దుబాయ్లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్లైన్స్.. అరబ్ ఎమిరేట్స్లో ఉద్యోగం వచ్చింది. కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి ఎయిర్లైన్ సిబ్బందిగా తన కెరీర్ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్, పలు షోలలో కనిపించింది. మంగళవారం కథేంటంటే? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. -
'నటితో అసభ్య ప్రవర్తన.. ఎయిర్పోర్ట్ అధికారులపై తీరుపై ఆగ్రహం'
ప్రస్తుత కాలంతో మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు సైతం బాధితులవుతున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి కొచ్చిన్ వెళ్తుండగా తన పక్కనే ఉన్న ప్రయాణికుడు వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 10న మంగళవారం జరగ్గా.. తాజాగా నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: ‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!) ఇన్స్టాలో దివ్య ప్రభ రాస్తూ.. 'ప్రియమైన మిత్రులారా.. నేను ముంబయి నుంచి కొచ్చికి ఎయిరిండియా ఫ్లైట్లో వచ్చా. ఈ ప్రయాణంలో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఫ్లైట్లో తోటి ప్రయాణీకుడు తాగిన మత్తులో నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్కు చెబితే.. టేకాఫ్కు ముందు నా సీటును మాత్రమే మార్చారు. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత సమస్యను ఎయిర్పోర్ట్ అధికారులకు వివరించాను. వారు నన్ను ఎయిర్పోర్ట్లోని పోలీసు సహాయ పోస్ట్కు వెళ్లమని సలహా మాత్రమే ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశా. ప్రయాణీకుల భద్రత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకుందాం. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిద్దాం. ఈ విషయంలో మీ సపోర్ట్ కావాలి' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్! ) ఈ వేధింపులకు సంబంధించి కంప్లైంట్తో పాటు ఎయిరిండియా ప్లైట్ టికెట్ను కూడా షేర్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని.. అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బంది, అధికారుల స్పందన తనను నిరాశకు గురిచేసిందని దివ్య ప్రస్తావించారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ దివ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. మలయాళ నటి అన్నా బెన్ దివ్యకు మద్దతుగా పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Divyaprabha (@divya_prabha__) -
రొటీన్కి భిన్నంగా..! ఆనంద్ మహీంద్రా కూతుళ్ల గురించి తెలుసా?
Anand Mahindra daughters: ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన పూర్తి పేరు ఆనంద్ గోపాల్ మహీంద్రా. ఎయిర్క్రాఫ్ట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, విడిభాగాలు , నిర్మాణ పరికరాలు, రక్షణ, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ తదితర అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. మహీంద్రా & మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా వారసుడు ఆనంద్ మహీంద్రా. ఫోర్బ్స్ 2023 నివేదిక ప్రకారం.. ఆయన నెట్వర్త్ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 21 వేల కోట్లకుపైనే). జర్నలిస్టు అనురాధను పెళ్లాడిన తర్వాత ఈ దంపతులకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినప్పటికీ పలు విభిన్న అంశాలపై స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఆయన కుమార్తెలు మాత్రం ప్రచారాలకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మందికి వీరి గురించి పెద్దగా తెలియదు. రొటీన్కి భిన్నంగా.. సాధారణంగా పారిశ్రామికవేత్త పిల్లలు తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాల్లో పాలుపంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆనంద్ మహీంద్రా కుమార్తెలు మాత్రం వారి తల్లికి చెందిన మ్యాగజైన్లో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సతీమణి అనురాధ వెర్వ్, మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్లకు ఎడిటర్గా ఉన్నారు. వివాహానికి ముందే ఆమె వెర్వ్ పత్రికను స్థాపించారు. వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివారు. 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె వివిధ సంస్థలలో ఫ్రీలాన్సర్గా, పార్ట్ టైమ్ ఉద్యోగిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో ఆమె వెర్వ్ మ్యాగజైన్లో ఆర్ట్ డైరెక్టర్గా చేరారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా వెర్వ్ మ్యాగజైన్లో ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్నారు. అల్లుళ్లిద్దరూ విదేశీయులే.. ఆనంద్ మహీంద్రా పెద్ద కుమార్తె దివ్య న్యూయార్క్లో మెక్సికన్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకున్నారు. అలాగే రెండవ కుమార్తె ఆలికా కూడా ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా పూర్తిగా భిన్నమైన సంస్కృతులలో జరిగిన వీరి వివాహాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. -
టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్స్ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్ముఖ్ చాంపియన్గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్ను ఖరారు చేసుకుంది. జు వెన్జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
రైలు నుంచి పడి ట్రాన్స్జెండర్ దుర్మరణం
జనగాం : రైలు నుంచి జారి పడి ఓ ట్రాన్స్జెండర్ దు ర్మరణం చెందిన సంఘటన రఘునాథపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగెం మండలం ఎల్గూరుస్టేషన్ తూర్పుతండాకు చెందిన ట్రాన్స్జెండర్ బాదావత్ అనిల్ అలియాస్ దివ్య (25) సికింద్రాబాద్ నుంచి శాతవాహన రైలులో కాజీపేటకు వస్తుంది. దివ్య రఘునాథపల్లి రైల్వేస్టేషన్ రెండోప్లాట్ఫాంపై చేరుకోగానే నెమ్మదిగా రైలు వెళ్తున్న క్రమంలో కిందికి దిగబో తూ ప్రమాదవశాత్తు కాలుజారి రై లు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే రైలులో ప్ర యాణిస్తున్న మృతుడి స్వగ్రామానికి చెందిన బాలు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్ని కోరిన నటి
కోలీవుడ్లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్లో సినీ ప్రముఖల లిస్ట్) -
నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి
తమిళ సీరియల్స్తో కన్నా వివాదాలతోనే బాగా ఫేమసయ్యాడు నటుడు అర్ణవ్. సహనటి దివ్య శ్రీధర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి అర్ణవ్పై సంచలన ఆరోపణలు చేసింది. అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు గుంచి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది. 10 ఏళ్ల క్రితమే ట్రాన్స్జెండర్తో పెళ్లి ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ ఆడియో క్లిప్పింగ్స్లో ఓ ట్రాన్స్జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి విషయం దాచిన నటి కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది. టీవీ సీరియల్స్లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్కు తెలిసింది. మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది. ఒకరిపై మరొకరు నిందారోపణలు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి దివ్య గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్ణవ్. అటు దివ్య కూడా తన భర్తకు వేరే నటితో సంబంధం ఉందని తెలిసి, షూటింగ్ స్పాట్కు వెళ్లి నిలదీస్తే కొట్టిందని, భర్త కూడా తనపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్పై బయటకు వచ్చాడు. చదవండి: వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు చూశారా? గ్లామర్కు నో చెప్పను, కానీ వల్గారిటీ మాత్రం.. -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్ని చిత్రయూనిట్కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
దివ్యమైన ఐడియా సుమీ!
అమెరికాలో నివసిస్తున్న దివ్య మయ్యా చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ ఇంటర్నెట్ మినీ సెలబ్రిటీగా మారింది. ‘స్కీయింగ్కు చీర ధరించడమే కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అది భారతీయతను ప్రతిఫలించే ప్రతీక మాత్రమే’ అంటుంది దివ్య. దివ్య వీడియోల పుణ్యమా అని ఎంతోమంది మహిళలు చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ, భారతీయతను చాటుకుంటూ ‘భేష్’ అనిపించుకున్నారు. చీరె ధరించి స్కీయింగ్ చేయడానికి సంబంధించిన సలహాలు దివ్యను అడుగుతుంటారు. తన ఛాయిస్ మాట ఎలా ఉన్నా... హెల్మెట్, గ్లోవ్స్లాంటి సేఫ్టీలను ధరించడం మాత్రం దివ్య మరవదు. చీర ధరించే కాదు లెహెంగా ధరించి కూడా స్కీయింగ్ చేయగలను అంటూ చేసిన వీడియో వైరల్ అయింది. -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
భర్తకు విడాకులు.. పాపకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్-దివ్యలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అర్ణవ్ను అరెస్ట్ చేయించింది దివ్య. గర్భంతో ఉండగా తన కడుపుపై తన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది. 'ఈ ఎదురుచూపులు ఎంతో ప్రత్యేకమైనవి. గతంలో ఏం జరిగిందనేదానికంటే ఇకమీదట ఎలా ఉండబోతుందనేది నాకు ముఖ్యం. నువ్వు నాకిచ్చిన ప్రేమ, బలం, సపోర్ట్.. అన్నీ అడగకముందే ఇచ్చావు. నాలో భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికీ నేను నీదాన్నేనని మాటిస్తున్నాను. ఎన్నటికీ నీవెంటే ఉంటాను. నా అందమైన చిట్టిత్లలి.. లవ్యూ డార్లింగ్. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. కాగా సెవ్వంధీ అనే తమిళ సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టింది దివ్య శ్రీధర్. తొలి సీరియల్తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందు 2012లోనే దివ్యకు పెళ్లై, పాప కూడా ఉంది. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సీరియల్స్లో నటిస్తున్న సమయంలో అర్ణవ్తో ప్రేమలో పడింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ గతేడాది జూన్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు గతంలో పెళ్లై, పాప కూడా ఉందన్న అర్ణవ్కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. మరోపక్క అర్ణవ్ సహనటితో సంబంధం వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు చేసింది దివ్య. ఇందుకు సంబంధించిన ఆడియోకాల్ కూడా లీకవగా అది సోషల్ మీడియాలో వైరలయింది. View this post on Instagram A post shared by Divya Shridhar (@divya_shridhar_1112) -
'నిద్రపోతుంటే నా నడుము తడిమాడు'.. బుల్లితెర నటి
తమిళ నటి దివ్య గణేశ్ టాలీవుడ్కు అంతగా పరిచయం లేదు. తమిళంలో బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆమె సన్ టీవీలో ప్రసారమైన కేలాడి కన్మణి అనే సీరియల్తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లక్ష్మీ వందచూ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించారు. కేవలం సీరియల్స్లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా ఆమె నటించారు. ప్రముఖ సీరియల్ సుమంగళిలో అను సంతోష్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె 2019లో విడుదలైన అట్టు అనే తమిళ చిత్రంలో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తనకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. దివ్య మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్లో బయలుదేరా. అప్పుడు విమానంలో ప్రయాణికులు కొద్దిమందే ఉన్నారు. నేను చివర్లో కూర్చుని నిద్రపోతూ ఉన్నా. ఆ సమయంలో నా నడుము దగ్గర ఏదో తగులుతున్నట్లు అనిపించింది. మొదట నేను దాని గురించి నేను పట్టించుకోలేదు. పదే పదే అలా అవుతుంటే ఏంటా అని చూశా. నా వెనకాలే కూర్చున్న వ్యక్తి నడుమును తడుముతూ ఉన్నాడు. మొదట నేను ఏదైనా పురుగేమో అనుకున్నా. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ తిన్నా. దీంతో వెంటనే పైకి లేచి అతడి చెంపపై చెల్లుమనిపించా.' అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే మహిళల పట్ల జరిగే వేధింపులకు అస్సలు భయపడకూడదన్నారు దివ్య గణేశ్. కాగా.. 2022లో దివ్య విజయ్ టీవీలో ప్రసారమయ్యే బాకియలక్ష్మి సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by divyaganesh (@divya_ganesh_official) -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్తో ఫ్లూయిడ్ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
ఉదయ్ కిరణ్ చిత్రంతో ఎంట్రీ.. తీవ్ర గాయాలపాలైన హీరోయిన్
టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ పేరు తెలియని వారు ఉండరు. అప్పట్లో యంగ్ హీరో తన సినిమాలతో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆయన తన కెరీర్ను ముగించారు. ఉదయ్ కిరణ్ కెరీర్లో 2004లో నటించిన చిత్రం 'లవ్ టుడే'. ఈ సినిమాలో ఉదయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా నటించింది. తన కెరీర్లో టాలీవుడ్ సినిమాతోనే సినీరంగంలో ప్రవేశించింది బాలీవుడ్ భామ. తీవ్ర గాయాల పాలైన నటి ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్లో నటిస్తోన్న బాలీవుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ మూవీ షూటింగ్లో పాల్గొన్న దివ్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇవీ చూసిన ఆమె అభిమానులు 'గెట్ వెల్ సూన్' అంటూ పోస్టులు పెడుతున్నారు. దివ్య ఖోస్లా ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేస్తూ..' నా రాబోయే చిత్రంలో ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు నా ముఖంపై తీవ్రమైన గాయమైంది. కానీ షూటింగ్ మాత్రం కొనసాగాలి. నేను త్వరగా కోలుకోవడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. ' అంటూ పోస్ట్ చేశారు. జాన్ అబ్రహంతో ప్రేమ పాట చిత్రీకరించినప్పుడు భర్త భూషణ్ కుమార్ సెట్లో ఉన్నారని దివ్య ఖోస్లా కుమార్ చెప్పారు. కాగా.. దివ్య ఖోస్లా తన తదుపరి చిత్రం యారియాన్ -2లో కనిపించనుంది. ఇది దివ్య ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన హిమాన్షు కోహ్లీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రానికి సీక్వెల్. మీజాన్ జాఫ్రీ, యష్ దాస్ గుప్తా ప్రధాన పాత్రలలో దివ్య నటించారు. వారినా హుస్సేన్, ప్రియా వారియర్, పెరల్ వి పూరి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) -
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
తగ్గేదే లే సినిమా హీరోయిన్ దివ్యా పిళ్లై (ఫోటోలు)
-
UP Board 12th Result 2022: ముందు అక్క, తర్వాత చెల్లి.. యూపీలో ఇంటర్ టాపర్లుగా కవలలు
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో. మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి. -
నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్జెండర్తో ప్రేమ, పెళ్లి
బుల్లితెర నటులు దివ్య, అర్నవ్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తనని మోసం చేశాడంటూ అర్నవ్పై దివ్య ఇటీవల ఆరోపణలు చేయగా.. తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా దివ్య కంటే ముందు అర్నవ్ తనని పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియదర్శిని అనే ట్రాన్స్జెండర్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: భర్త జయంతి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నటి మేఘన ఈ మేరకు ఆమె ఓ ఆడియో రికార్డ్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మలయాళంలో ఉన్న ఈ ఆడియోలో ప్రియాంక ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘నాకు, అర్నవ్తో టీ నగర్లో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల పాటు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఉన్నట్టుండి అర్నవ్లో సడెన్గా మార్పు వచ్చింది. తరచూ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడికి మరో మహిళతో పరిచయం వల్లే నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు. నన్ను తీవ్రంగా హింసించాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. అర్నవ్ ఓ సైకో’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు ఇక అతడి వేధింపులు తట్టుకోలేక తాను అర్నవ్ నుంచి విడిపోయానంటూ ప్రియదర్శిని తెలిపింది. ఇదిలా ఉంటే కేలాడి కన్మణి అనే సీరియల్ షూటింగ్లో సమయంలో నటి దివ్య, అర్నవ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2022 జూన్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భంగా దాల్చింది. ఇప్పుడు అర్నవ్ తనని వదిలేసి మరో నటితో క్లోజ్గా ఉంటున్నాడంటూ దివ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
దివ్య భర్తపై ముద్దుల వర్షం.. నటి అన్షిత ఆడియో కాల్ లీక్
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్- దివ్యల వివాదం మరింత ముదురుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ దివ్య శ్రీధర్.. అర్ణవ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఆడియో కాల్ వైరల్గా మారింది. 'చెల్లమ్మ' సీరియల్ నటి అన్షిత.. దివ్యపై ఫైర్ అయిన ఆడియో కాల్ నెట్టింట లీక్ అయింది. ఇందులో దివ్యను రెచ్చగొట్టేలా ఆమె అర్ణవ్కు ప్రపోజ్ చేస్తూ ముద్దులు పెట్టింది. ఆ ఆడియో కాల్లో అన్షిత మాట్లాడుతూ.. నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తా. మీ జీవితాల్లోకి నేను రావాలనుకుంటున్నావా? అని అడిగింది. అందుకు దివ్య.. నువ్వొక ఆడదానివేనా? ఇంకో ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అని ప్రశ్నించగా.. నిన్ను కొట్టి చంపాలన్నంత కోపం ఉందని బదులిచ్చింది అన్షిత. నీవల్ల నా భర్త జీవితం ఇబ్బందుల్లో పడుతుందని తెలిసినప్పుడు ఒక స్నేహితురాలిగానైనా అతడి లైఫ్ నుంచి పక్కకు తప్పుకోవచ్చు కదా అని కోరింది దివ్య. అలా ఇద్దరూ వాదులాడుకుంటున్న సమయంలో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న అర్ణవ్కు అన్షిత ఏకంగా ప్రపోజ్ చేసింది. అర్ణవ్, ఐ లవ్ యూ సో మచ్.. అంటూ అతడికి ఫోన్లోనే ముద్దుల వర్షం కురిపించింది. నీ ముందే నీ భర్తకు ముద్దు పెట్టా, ఇప్పుడేం చేస్తావ్? అని రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ ఆడియోకాల్ వైరల్గా మారింది. కాగా దివ్యకు 2012లోనే ఓ వ్యక్తితో పెళ్లై పాప కూడా ఉంది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె సీరియల్స్లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ ఈ ఏడాది జూన్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. ఆ సమయంలో ఆమెకు గతంలో పెళ్లై పాప కూడా ఉందన్న విషయం అర్ణవ్కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మరోవైపు అర్ణవ్ వేరే నటితో సంబంధం పెట్టుకున్నాడని దివ్య ఆరోపిస్తోంది. ఈ విషయంపై దివ్య అటు పోలీసులకు ఇటు కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసింది. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారం, హీరో అరెస్ట్ బిగ్బాస్ షో నుంచి అతన్ని తీసేయండి -
వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసే ప్రయత్నం చేసింది: అర్ణవ్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపై బుల్లితెర నటి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య (35) చెన్నైలో నివసిస్తోంది. ఈమెకు 2012లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. అయితే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. టీవీ సీరియళ్లలో నటిస్తున్న క్రమంలో సహనటుడు అర్ణవ్తో పరిచయం ఏర్పడింది. దివ్య ఇస్లాం మతం తీసుకుని ఈ ఏడాది జూన్లో ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లయిందని, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దివ్య తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. వాటిని డిలీట్ చేయమని అర్ణవ్ ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు దివ్య నిరాకరించడంతో ఆమెపై ఆవడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య తనకు తెలియకుండానే వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి దివ్య గురువారం రాత్రి చెన్నై కమిషనర్ కార్యాలయంలో తన భర్తపై ఫిర్యాదు చేసింది. అందులో తాము చట్ట ప్రకారం భార్యభర్తలుగా కాపురం చేస్తున్నామని అయితే తన భర్తకు వేరే నటితో సంబంధం ఉన్న విషయం తెలిసి తాను ఆమె నటిస్తున్న షూటింగ్ స్పాట్కి వెళ్లి నిలదీశానని, దీంతో ఆమె తనను వాటర్ బాటిల్తో కొట్టిందని పేర్కొంది. తన భర్త కూడా తనపై దాడిచేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. -
మరో నటితో భర్త వివాహేతర సంబంధం, పోలీసులను ఆశ్రయించిన నటి దివ్య
భర్త తనని మోసం చేశాడంటూ ప్రోలీసులను ఆశ్రయించింది బుల్లితెర నటి దివ్వ శ్రీధర్. మరో నటితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని కూడా తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సన్టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్ సెవ్వంధీతో దివ్వ శ్రీధర్ నటిగా గుర్తింపు పొందింది. చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు ఆ తర్వాత కేలడి కన్మణి సీరియల్లో తన సహానటుడైన ఆర్నవ్తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొద్ది రోజులు రిలేషన్షిప్ ఉన్న అనంతరం సీక్రెట్గా వివాహం చేసుకున్నారు. అయితే తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించవద్దని ఆర్నావ్ దివ్యను కోరిటన్లు ఆమె పోలీసులకు పేర్కొంది. అదే సమయంలో అతడు మరో నటితో ప్రేమలో ఉన్నాడని, దీంతో తాను భర్తను నిలదీసి అందరి సమక్షంలో తనని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్ ప్రస్తుతం తాను గర్భవతి అని, అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. తనతోపాటు పుట్టబోయే బిడ్డకు ఆర్నావ్ వల్ల ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అంతేకాదు ఆర్నవ్ బలవంతంగా తనకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. తనకి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. అంతేకాదు ఈ విషయమై ఆమె కమిషనర్ను కూడా ఆశ్రయించినట్లు చెప్పింది. -
సృజన: తెలుగింటి బార్బీ
పట్టులంగా, ఓణీ కట్టిన బొమ్మలు కాళ్లకు పారాణి, నుదుటన బాసికం కట్టిన బొమ్మలు, పసుపు కొట్టే బొమ్మలు.. పందిట్లో బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, అబ్బురపరిచే బొమ్మలు.. చిందేసే బొమ్మలు.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే బొమ్మలు ..,ఎవ్వరి చూపులనైనా కట్టిపడేసేలా ఉండే బొమ్మలేవీ అంటే.. అవి దివ్య తేజస్వి చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలై ఉంటాయి. వెస్ట్రన్ బార్బీ డాల్ను ఇండియన్ డాల్గా మార్చేసి, వాటిని మన సంప్రదాయ వేడుకలకు అనువుగా మార్చేసింది హైదరాబాద్ ఎఎస్రావు నగర్కు చెందిన దివ్య తేజస్వి. అమ్మాయి పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు ప్రతి వేడుకను బొమ్మల్లో అందంగానూ, అర్థవంతంగానూ చూపుతూ పది మందికి ఉపాధి కల్పిస్తోంది. భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్న దివ్య ఈ అందమైన బొమ్మల రూప కల్పన గురించి అడిగితే ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, పదిమందికి ఆదాయవనరుగా ఎలా మారిందో నవ్వుతూ వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘దసరా వచ్చిందంటే బొమ్మల కొలువు గురించి ఆలోచన చేయకుండా ఉండరు. అలాగే, ఒక బొమ్మనైనా ఇంటికి తెచ్చుకుంటారు. నేను ఇంట్లోనే బొమ్మల తయారీ మొదలుపెట్టాను. పాప ముచ్చట తీర్చిన బొమ్మ అమ్మానాన్నలది వెస్ట్ గోదావరి. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాం. బయోకెమిస్ట్రీ చేశాను. జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం చేసేదాన్ని. పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్లాను. అక్కడ టీచర్గా ఉద్యోగంలో చేరాను. మాకు ఓ పాప. హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అనుకున్న సమయంలో కరోనా మా జీవితాలను దెబ్బతీసింది. మా ఉద్యోగాలు పోయాయి. అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఓరోజు మా పాప తన బొమ్మకి డ్రెస్ వేసివ్వమంటే, నా చీర అంచుతో చీరకట్టి, అలంకరించి ఇచ్చాను. దాన్ని ఫొటో తీసి ఇన్స్టా పేజీలో పెట్టాను. ఆర్డర్లు తెచ్చిన బొమ్మలు నేను పెట్టిన బొమ్మ ఫొటో నచ్చి అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు. ‘నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. మా అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఉంది. వచ్చినవారికి రిటన్గిఫ్ట్ ఇవ్వాలి. నాకు అలాంటి బొమ్మలు ఒక పదిహేను కావాలి. చేసిస్తారా..’ అంది. నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. ఆ నెల రెంట్ ఇవ్వకుండా ఓనర్తో మాట్లాడి, ఆ డబ్బుతో బార్బీ బొమ్మలు, వాటికి కావల్సిన మెటీరియల్ తీసుకొచ్చాను. వ్యాపారం అనుకోలేదు. కానీ, ముందు గణేషుడి బొమ్మ తయారు చేశాను. ఆ ముద్దు వినాయకుడిని చూసి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక వెస్ట్రన్ కల్చర్తో ఉండే బార్బీ బొమ్మను తెలుగింటి సంప్రదాయం అద్దుకునేలా తయారు చేయడానికి చాలా ప్రయోగాలే చేయాల్సి వచ్చింది. జుట్టు రంగు, స్కిన్కలర్, కళ్లు.. వీటితో పాటు డ్రెస్సింగ్.. చాలా సమయమే తీసుకుంది. కానీ, ఒక్కో బొమ్మ తయారు చేసి, అనుకున్న సమయానికి పంపాను. ఆ ఆర్డర్ తర్వాత మరో ఆర్డర్ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాం. సందర్భానికి తగిన కానుకలు మా అమ్మనాన్నలకు నేను, చెల్లి సంతానం. మా చిన్నప్పుడు మేం ఆడుకోవడానికి మా అమ్మ క్లాత్తో బొమ్మలు కుట్టి, చీరలు కట్టి, వాటికి పూసలతో అలంకారం చేసేది. నాకు అదంతా గుర్తుకువచ్చింది. మన సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. వాటిని ఉదాహరిస్తూ బొమ్మలు తయారు చేసేదాన్ని. మొదట్లో అంతగా గుర్తింపు లేదు కానీ మెల్ల మెల్లగా గుర్తింపు రావడం మొదలైంది. పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు అమ్మాయి పుట్టిన నాటి నుంచి ప్రతీది వేడుకలాగే సాగుతుంది ఆమె జీవితం. ఒక ఆర్డర్ అయితే వాళ్లమ్మాయి మొదటి రోజు స్కూల్కి వెళుతోంది, ఆ రోజును పురస్కరించుకుని బొమ్మ కావాలని అడిగారు. ఉయ్యాల నుంచి విద్యాభ్యాసం, ఓణీ ఫంక్షన్, పెళ్లి, సీమంతం, గృహప్రవేశం, షష్టిపూర్తి ... వరకు ఇలా ప్రతి దశలోనూ జరిగే వేడుక సందర్భాన్ని తీసుకొని, దానికి అనుగుణంగా బొమ్మల సెట్స్ను తయారుచేయడం ప్రారంభించాను. ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాతోపాటు నాకు తెలిసిన స్నేహితులు జత కలిశారు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకరు డ్రెస్ కుడతారు, మరొకరు హెయిర్ బ్లాక్గా రావడానికి, ఇండియన్ స్కిన్ కలర్కి తేవడానికి, కళ్లు డిజైన్ చేయడానికి కష్టపడతారు. మొదట్లో నాకు ఒక్క బొమ్మ చేయడానికి రోజు మొత్తం పట్టేది. ఇప్పుడు 2–3 గంటలు పడుతుంది. నేను చేసిన విధానం నేర్పించి, నా పనిలోకి తీసుకున్నవారిలో కాలేజీ అమ్మాయిలు, గృహిణిలు ఉన్నారు. వాళ్ల ఇంటి వద్దే వర్క్ చేసిచ్చేవారున్నారు. హైదరాబాద్లో ఉన్న మా అమ్మ, చెల్లెలు కూడా ఈ బొమ్మల తయారీలో భాగమయ్యారు. మా అమ్మ, మా చెల్లెలు బొమ్మలకు జడలు, పువ్వులు కుట్టి, పంపుతారు. మా వారు షాపింగ్ చేసుకొస్తారు. ఆన్లైన్లో చూసి, నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలు అలంకరణలో మార్పులు చేర్పులు, ప్యాకింగ్లో సాయం చేస్తుంటారు. మా చెల్లెలు ‘లలిత డాల్స్’ అనే పేరుతో ఉన్న ఇన్స్టా పేజీలో ఫొటోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇలా కొందరి చేయూతతో నా బొమ్మలు మరింత అందంగా రూపుకడుతున్నాయి. బడ్జెట్కు తగినట్టు.. ఒక బొమ్మ రూ. 200 నుంచి ధర ఉంది. వెడ్డింగ్ సెట్ అయితే రూ. 15000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో సెట్ కావాలంటే అందుకు తగినట్టు కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. ఇది దసరా సమయం కాబట్టి, అమ్మవారి బొమ్మలు, బతుకమ్మ ఆడుతున్న మహిళల బొమ్మల సెట్.. తయారుచేశాను. హైదరాబాద్లోని ఎఎస్రావునగర్లో ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాం. అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో పాటు పౌరాణిక గాధలు కూడా ఈ బొమ్మల ద్వారా చూపుతున్నాను’’ అని వివరించింది ఈ కళాకారిణి. – నిర్మలారెడ్డి -
ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి
‘మా అమ్మ ముగ్గురు పిల్లలను పెంచింది. ముగ్గురం ఐఐటి చదివాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని ఉత్తమమైన సంతానంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేను తెలుసుకున్నవి మీకు చెబుతాను. పనికొస్తాయేమో చూడండి’ అంటూ ఉత్తర ప్రదేశ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ రాసిన ట్విట్టర్ పోస్టు వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె చెప్పిన పాఠాలు ఏమిటి? ‘మా అమ్మ నుంచి నేను పిల్లల పెంపకం నేర్చుకున్నాను. మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచింది. ముగ్గురం ఐ.ఐ.టికి వెళ్లాం. నేను ఐ.ఐ.ఎంలో కూడా చదివాను. ఆ తర్వాత 2013 కేడర్లో ఐ.ఏ.ఎస్ అయ్యాను. నా ఇద్దరు తోబుట్టువులు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఇదంతా మంచి పెంపకం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని నేను బాగా పెంచాలి. మా అమ్మ నుంచి నేర్చుకున్నవి, నాకు నేనై గ్రహించినవి మీకు చెప్తాను. ఉపయోగపడితే చూడండి’ అని ఉత్తరప్రదేశ్ ఐ.ఏ.ఎస్ అధికారి దివ్య మిట్టల్ రాసిన ట్విటర్ పోస్టు (వరుస) ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువ మంది మెచ్చిన పోస్ట్గా గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు కలెక్టర్గా ఉన్న దివ్య మిట్టల్ అప్పుడప్పుడు ట్విటర్ ద్వారా నలుగురికీ ఉపయోగపడే కిటుకులు, స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తుంటుంది. ఇటీవల ఆమె పేరెంటింగ్ గురించి రాసిన పోస్టు కూడా అలాంటిందే. ఆమె నమ్మి చెప్పిన విషయాలు చాలామందికి నచ్చాయి. అయితే వీటితో విభేదించేవాళ్లు ఉండొచ్చు. ఉంటారు కూడా. కాని ఎక్కువమంది ఇలాగే పెంచాలని భావిస్తారు కాబట్టి దివ్యను మెచ్చుకుంటూ పోస్ట్ను వైరల్ చేశారు. దివ్య చెప్పిన పెంపకం పాఠాలు ఇలా ఉన్నాయి. ఏదైనా చేయగలరు అని చెప్పండి: పిల్లలకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా చేయగలవు అనే భావన వారిలో కల్పించాలి. నిన్ను నువ్వు నమ్ము అని తల్లిదండ్రులు పిల్లలకు తరచూ చెప్పాలి. ఆత్మవిశ్వాసమే వారిని లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో చేరుకోవడంలో సాయం చేయగలదు. పడనివ్వండి పర్వాలేదు: పిల్లలకు చిన్న నొప్పి కూడా కలగకుండా పెంచాలని చూడొచ్చు. జీవితం పూలపాన్పు కాదు. పరిష్కార పత్రాలతో అది సమస్యలను తేదు. పడి లేచి అందరూ ముందుకెళ్లాల్సిందే. అందుకే పిల్లల్ని బాగా ఆడనివ్వండి. పడనివ్వండి. లేవనివ్వండి. వాళ్లు పడగానే పరిగెత్తి పోకండి. విఫలమైనప్పుడు లేవడం వారికి తెలియాలి. లేచాక సరే.. పద అని వారితో పాటు ముందుకు పదండి. పోటీ పడాలి: వాళ్లను రకరకాల పోటీలలో పాల్గొనేలా చేయండి. గెలవడానికి మాత్రమే కాదు. ఓటమితో తగినంత పరిచయం ఏర్పడటానికి, ఓటమి కూడా ఉంటుందని తెలియడానికి వారు పాల్గొనాలి. ఓటమి కంటే ఓడిపోతామనే భయం ఎక్కువ ప్రమాదకరమైనది. ఓడినా పర్వాలేదు... పోటీ పడాలి అనేది నేర్పించాలంటే ఈ పని తప్పనిసరి. రిస్క్ కూడా ముఖ్యమే: పిల్లలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి సమయాలలో తప్పనిసరి పర్యవేక్షణ చేయండి. అంతే తప్ప అసలు రిస్కే వద్దు అనేలా ఉండొద్దు. అడ్వంచర్ స్పోర్ట్స్ ఆడతానంటే ఆడనివ్వండి. చెట్టు ఎక్కుతానంటే దగ్గరుండి ఎక్కించండి. అలాంటి సమయాలలో ప్రమాదం ఉందనిపిస్తే పిల్లలు జాగ్రత్త పడతారు. ప్రమాదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ అనుభవం వారికి నేర్పుతుంది. బోలెడన్ని అవకాశాలు: మా చిన్నప్పుడు ఇంత పేదగా ఉన్నాం... అంత పేదగా ఉన్నాం... కాబట్టి నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి... ఇలా కొందరు తల్లిదండ్రులు చెబుతుంటారు. అలా చెప్పక్కర్లేదు. ఈ లోకం చాలా పెద్దది... ఎక్కడ చూసినా అవకాశాలు ఉంటాయి... బోలెడంత సంపద ఉంది... నేర్చుకున్న విద్యకు విలువ ఉంటుంది... ఏదో ఒకటి సాధించడం కష్టం కాదు. కాని ఆ సాధించేదేదో పెద్దదే సాధించు అనే విధాన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. మీరే ఆదర్శం: పిల్లలకు తల్లిదండ్రులకు మించి రోల్మోడల్స్ ఉండరు. వారికి మీరే ఆదర్శంగా ఉండండి. మీరు ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటే పిల్లలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియక బాధ పడతారు. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో మీరు వారి ఎదుట అలా ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందలించండి: పిల్లలు తప్పు చేస్తే మందలించండి. ఇది సరిౖయెన పని కాదు అని గట్టిగా చెప్పండి. తప్పు లేదు. మంచి నడవడిక అంటే ఏమిటో వారికి తెలియాలి. వారిని నమ్మండి: మీ అంచనాకు తగినట్టుగా పిల్లలు లేకపోతే నిరాశ చెందకండి. ‘నీ మీద నమ్మకం పోయింది’ అని పిల్లలతో పొరపాటున కూడా అనకండి. మీరే వారిపై నమ్మకం పోగొట్టుకుంటే ఇక వారిని నమ్మేదెవరు. పిల్లలు కుదేలైపోతారు. అందుకని వారికి అవకాశం ఇవ్వండి. ‘నిన్ను నమ్ముతున్నాం. నువ్వు చేయగలవు. పర్వాలేదు. మళ్లీ ప్రయత్నించు’ అని చెప్పండి. భిన్న అనుభవాలను ఇవ్వండి: మీ పిల్లలకు లోకం చూపించండి. ఊళ్లు, కొత్త ప్రదేశాలు, అనాథ గృహాలు, సైన్స్ ల్యాబ్లు, భిన్న రంగాల పెద్దలు ఇలా మీకు వీలైనచోటుకు తీసుకెళ్లి వీలైన వారితో పరిచయం చేయించండి. తిరిగొచ్చేప్పుడు వారితో ఆ విషయాలను మాట్లాడండి. మీ పనుల్లో మీరు ఉండకండి. వారు చెప్పేది వినండి: పిల్లలు ఏదైనా చెప్పడం మొదలెట్టగానే నోర్మూయ్ నీకేం తెలియదు అనకండి. వాళ్లు శుంఠలనే భావన తీసేయండి. ముందు వారు చెప్పేది పూర్తిగా వినండి. వెంటనే రియాక్ట్ కావద్దు. ఆలోచించి అప్పుడు మాట్లాడండి. తాము చెప్పేది తల్లిదండ్రులు వింటారు అనే నమ్మకం పోతే పిల్లలు చెప్పడం మానేస్తారు. పోల్చకండి: మీ పిల్లలను ఇతర ఏ పిల్లలతో పోల్చకండి. అలాగే వారి తోబుట్టువులతో కూడా పోల్చకండి. మీరు మీ పిల్లల్లో ఒకరిని గారాబం చేస్తే వారు లోకంలో అంతా ఇంతే సుఖంగా ఉంటుంది అనుకుంటారు. ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే వారు గుర్తింపు కోసం, అంగీకారం కోసం పాకులాడే స్థితికి వెళతారు. కాబట్టి రెండూ వద్దు. ఇవీ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ చెప్పిన పెంపకం పాఠాలు. ఇక నిర్ణయం మీదే. -
సివిల్స్ కోచింగ్ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఉన్నత లక్ష్యంతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారుల వైపు అడుగుల వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళాయి దివ్య(22) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్ కోచింగ్ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కోచింగ్కు వెళుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తొలుత స్నేహితులుగా వ్యవహరించిన వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వరరెడ్డి ఊర్లోని, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా కోచింగ్ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. అతని మాయమాటలు నమ్మిన దివ్య పూర్తిగా అతని ఊబిలో కూరుకుపోయింది. లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో కూతురిని ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్న తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను మోసగించింది. వివిధ అవసరాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేసింది. ‘మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ వెంకటేశ్వరరెడ్డి మరికొంత డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో దివ్య తన మేనమామకు ఫోన్ చేసి రూ.లక్ష కావాలని కోరింది. అయితే అతనికి అనుమానం రావడంతో ఎందుకూ.. అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉదయం విశాఖ వచ్చి ఇస్తానని బదులిచ్చారు. దీంతో అప్పటికే తల్లిదండ్రులు, బంధువుల వద్ద అప్పులు చేసిన దివ్య తన వ్యవహారం బయట పడుతుందేమోనని ఆందోళనకు గురైంది. బుధవారం ఉదయం తన మేనమామ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున 3 గంటలకే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో పాటు తనకు వెంకటేశ్వరరెడ్డితో ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా లెటర్లో రాసి సూసైడ్ చేసుకోనున్నట్లు వెల్లడించి తన కజిన్తో పాటు తల్లిదండ్రులకు వాట్సప్ సందేశం పంపించింది. ‘కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: (పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య) మిస్సింగ్ కేసుతో వెలుగులోకి.. దివ్య రాసిన సూసైడ్ నోట్తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గురువారం ఎంవీపీ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రుషికొండ తీరానికి ఓ గుర్తుతెలియని యువకుడి మృత దేహం కొట్టుకొచ్చిన అంశంపై దృష్టిసారించారు. దీనిపై గురువారం ఆరిలోవ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించడంతో పాటు దివ్యతో సాన్నిహిత్యం ఉన్న వెంకటేశ్వరరెడ్డిగా నిర్ధారించారు. దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గురువారం రాత్రి సాగరతీరంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పోలీసులు ఊహించినట్లుగానే దివ్య మృతదేహం శుక్రవారం ఉదయం భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. అయితే తొలి నుంచి వెంకటేశ్వరరెడ్డికి జల్సాలు అలవాటు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసిగిపోవడంతో పాటు అతని అప్పుల కారణంగా మూడెకరాలు పొలం కూడా అమ్మేసినట్లు తెలిపారు. దీంతో ఐదేళ్లుగా వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా ఘర్షణ జరిగి మత్స్యవాత పడ్డారా? అనే అనుమానం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్లో రజతం, 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్కు కంఠెవరం బాలిక
సాక్షి, తెనాలి: అనతికాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుని అందరి ప్రశంసలూ అందుకుంటుంది కంఠెవరం బాలిక నాగం జ్ఞాన దివ్య. త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ మెరవనుంది. ఫిట్నెస్ కోసమని సాధన ప్రారంభించిన ఏడాదిలోనే టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరగనున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్కు అర్హత సాధించింది. పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ విభాగంలో సత్తా చాటనుంది. కుటుంబ నేపథ్యం ఇదీ.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరంలోని కేబుల్ ఆఫీసులో పనిచేసే నాగం వెంకటేశ్వరరావు, సుధారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూజిత బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. రెండో కుమార్తె జ్ఞానదివ్య గత మార్చిలో ఇంటర్ పూర్తిచేసింది. దివ్య ఫిట్నెస్ కోసమని గ్రామంలోని మాతృశ్రీ వెయిట్లిఫ్టింగ్ అకాడమీలో ఏడాది కిందట చేరింది. నిత్యం సాధన చేసింది. ఆమె ఆసక్తిని గమనించిన ఫవర్ లిఫ్టర్ కొల్లిపర నాగశిరీష దివ్యను ప్రోత్సహించారు. పవర్లిఫ్టింగ్లో మెళకువలు నేర్పారు. నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నాగశిరీష పవర్లిఫ్టింగ్లో నేషనల్ గోల్డ్మెడలిస్ట్. తనలాగే జ్ఞాన దివ్య కూడా జాతీయస్థాయిలో సత్తా చాటాలనే ఉద్దేశంతో చక్కని తర్ఫీదునిచ్చారు. నాగశిరీష, ఆళ్ల వెంకటరెడ్డి, సోమిశెట్టి కోటేశ్వరరావు, సుభాన్వలి తదితర లిఫ్టర్ల సలహాలతో దివ్య అనేక పతకాలు సాధించింది. దివ్య విజయాలు ఇవీ.. ► 2021 నవంబరు 21, 22 తేదీల్లో జగ్గయ్యపేటలో జరిగిన స్టేట్మీట్ క్లాసిక్ కేటగిరీలో బంగారు పతకం. ► కేరళలోని అలప్పుజలో జరిగిన జాతీయస్థాయి 84 ప్లస్ కేటగిరీలో బంగారు పతకం. ► అనకాపల్లిలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో ఎక్విప్డ్ విభాగంలో రజతం. ► మంగళగిరిలో గత జూన్ 9న జరిగిన స్టేట్మీట్ ఎక్విప్డ్లో 84 ప్లస్ విభాగం స్క్వాడ్లో 187.5 కిలోలు, డెడ్లిఫ్ట్లో 160 కిలోలు, బెంచ్ ప్రెస్లో 55 కిలోల బరువులనెత్తి బంగారు పతకాలు కైవసం. ► హైదరాబాద్లో ఈనెల 5న జరిగిన నేషనల్ సెలక్షన్స్లో స్క్వాడ్లో బంగారు, బెంచ్ప్రెస్, డెడ్లిఫ్ట్లో రజత పతకాలు. ► ఈనెల 16న విశాఖపట్టణంలో జరిగిన 9వ రాష్ట్రస్థాయి క్లాసిక్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం. ► ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కేరళలో జరగనున్న నేషనల్స్కు అర్హత. ► ఆగస్టు ఆఖరు నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్కు ఎంపిక. (క్లిక్: సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!) -
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బిగ్బాస్ విన్నర్.. షాక్లో అభిమానులు
టెలివిజన్ నటి, మోడల్, హిందీ బిగ్బాస్ ఓటీటీ విజేత దివ్య అగర్వాల్ తన బాయ్ఫ్రెండ్తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ప్రియుడు వరుణ్ సూద్తో 4 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫోటోను షేర్ చేస్తూ ఆదివారం ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘జీవితం సర్కస్ లాంటిది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరి నుంచి ఏదీ ఆశించొద్దు. అదే నిజం. సెల్ఫ్ లవ్ తగ్గిపోవడం మొదలైనప్పుడు ఏమి జరుగుతుంది ? నా జీవితంలో జరుగుతున్న దేనికి నేను ఎవరినీ నిందించను. అదే మంచిది. నా కోసం నేను బతకాలనుకుంటున్నాను. నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించాడానికి సమయం వెచ్చించాలనుకుంటున్నాను అని అధికారికంగా ప్రకటిస్తున్నాను. చదవండి: ప్రభాస్ సినిమాకి టైటిల్ మారనుందా? త్వరలోనే అప్డేట్ ఒక నిర్ణయం తీసుకోడానికి పెద్ద పెద్ద కారణాలు, సాకులు అవసరం లేదు. దీని నుంచి బయటపడటానికి ఇది నేను తీసుకున్న నిర్ణయమే. తనతో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవే. అతను గొప్ప వ్యక్తి. తనెప్పుడూ నాకు మంచి స్నేహితుడే. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి.’ అంటూ ప్రియుడు వరుణ్తో బ్రేకప్ గురించి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) కాగా టెలివిజన్ సిరీస్ ఏస్ ఆఫ్ స్పేస్లో పాల్గొనడానికి ముందే వరుణ్, దివ్య స్నేహితులు. అక్కడి నుంచి వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వరుణ్ దివ్యకు ప్రపోజ్ చేయడంతో వీరిద్దరి లవ్ ట్రాక్ ఆఫీషల్ అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. అయితే ఇలా అనుకోకుండా వరుణ్, దివ్య విడిపోవడంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. చదవండి: చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ -
బుల్లెటు బండెక్కి డుగ్గుడుగ్గుమని వచ్చేత్తపా... వచ్చేత్తపా
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు. ‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత: ‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’ ‘ఈ పాప బుల్లెట్బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’ ‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’ కొద్దిసేపటి తరువాత.... ‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్నేమ్’ కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది? తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు. మెకానిజం అంటే ఆమెకు పాషన్! నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది. యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది. ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది. శభాష్ దివ్యా! -
విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..
సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లు. మంచి చెడులు ఆలోచించగల విచక్షణ ఉన్నవారు. కష్టాలు కలకాలం ఉండవనే నిజం తెలిసిన వారే. అయినా క్షణికావేశానికి గురయ్యారు. పెళ్లి విషయంలో ధైర్యం చూపిన ఈ దంపతులు.. బతికే విషయంలో మాత్రం తెగువ చూపలేకపోయారు. రేగిడి మండలంలోని తునివాడకు చెందిన నవ దంపతులు పల్లి హరీష్(29), రుంకు దివ్య(20) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణం వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్స్టేషన్లో లొంగుబాటు) వివరాలు సేకరిస్తున్న ఎస్.ఐ షేక్ మహమ్మద్ ఆలీ మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్ ఎంసీఏ చదివాడు. అదే గ్రామానికి చెందిన రుంకు దివ్య డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఒకే గ్రామం, ఒకే సా మాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నేహి తుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖలో కొత్త కాపురం పెట్టారు. ఇద్దరూ ఉద్యోగాల వేటలో పడ్డారు. రెండు రోజుల కిందటే ఊరికి వచ్చిన ఈ దంపతులు అబ్బాయి ఇంటిలో ఉన్నారు. బుధవారం ఏమైందో గానీ ఇద్దరూ ఇంటిలో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవులయ్యారు. కేసు నమోదు విషయం తెలిసిన వెంటనే సీఐ జి.శంకరరావు, ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తునివాడ గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని, ఇంటిని పరిశీలించా రు. వీరితో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అనంతరం శవ పంచనామా చేసి రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు. చదవండి: (కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం) -
బిగ్బాస్ ఓటీటీ విన్నర్గా దివ్య, ఎంత గెలుచుకుందంటే?
బిగ్బాస్ ఓటీటీ షో గ్రాండ్గా ముగిసింది. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో బుల్లితెర నటి దివ్య అగర్వాల్ విజేతగా అవతరించింది. శనివారం(సెప్టెంబర్ 18)న జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో దివ్య బిగ్బాస్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్మనీ గెలుచుకుంది. నిషాంత్ భట్ ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. షమితా శెట్టి, రాకేశ్ బాపత్, ప్రతీక్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. బిగ్బాస్ ఓటీటీ స్పెషాలిటీ ఏంటంటే? హిందీలో బిగ్బాస్ 14 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో 15వ సీజన్ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సీజన్ రావడానికి ముందే ప్రయోగాత్మకంగా బిగ్బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్లైన్ ఇచ్చారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్లోనే ప్రసారమైంది. ఏడు వారాలపాటు ప్రసారమైన ఈ షోను మినీ బిగ్బాస్గా చెప్పుకోవచ్చు. ఇందులో బిగ్బాస్ ఓటీటీ టైటిల్ గెలుచుకున్న దివ్య బిగ్బాస్ 15వ సీజన్లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉందా? లేదా? అన్నది సస్పెన్స్గా మారింది. అదే సమయంలో ప్రతీక్.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న బిగ్బాస్ 15వ సీజన్లో పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎవరీ దివ్య అగర్వాల్ దివ్య అగర్వాల్ విషయానికొస్తే ఆమె నటి, డ్యాన్సర్. MTV స్ప్లిట్స్విల్లా 10వ సీజన్లో పాల్గొన్నప్పుడు ఆమె లైమ్లైట్లోకి వచ్చింది. అంతేకాదు, ఈ సీజన్లో ఆమె రన్నరప్గా నిలిచింది. MTV ఏస్ ఆఫ్ స్పేస్ 1లో పాల్గొని విజేతగా అవతరించింది. రియాలిటీ షోస్ క్వీన్ దివ్య ద ఫైనల్ ఎగ్జిట్ అనే సినిమాలోనూ నటించింది. గతంలో బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక శర్మతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంతో ఆమె మరింత హైలైట్ అయింది. ప్రస్తుతం ఆమె ఖత్రోన్ కీ ఖిలాడీ 11వ సీజన్ ఫేమ్ వరుణ్ సూద్తో డేటింగ్ చేస్తున్నట్లు భోగట్టా! View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
దివ్యమైన కల
అమ్మాయిలందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. ముంబైకు చెందిన దివ్య పెరియసామి ఆచార్యకు మాత్రం అతివలను మరింత అందంగా తీర్చిదిద్దడమంటే ఎంతో ఇష్టం. దీంతో బ్యూటిషియన్ కావాలని కలలు కనేది. కానీ సంప్రదాయ కుటుంబంలో పుటి ్టపెరిగిన దివ్య బ్యూటిషియన్ కావడం కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు. ఆమె కోరికను వారు వ్యతిరేకించేవారు. అయినా దివ్య మాత్రం తన కలను నిజం చేసుకునే మార్గాలను వెదికేది. ఈ క్రమంలో 2018లో ‘సలాం బాంబే ఫౌండేషన్’(ఎస్బీఎఫ్) వారు ‘స్కిల్స్ ః స్కూల్’ పేరిట శిక్షణ ఇస్తున్నట్లు దివ్యకు తెలిసింది. వెంటనే బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్లో చేరి బ్యూటిషియన్ కోర్సుకు సంబంధించిన అన్ని రకాల శిక్షణలు తీసుకుని, తరువాత ఓ పార్లర్లో ఇంటర్న్షిప్ కూడా చేసింది. పట్టుదలతో స్కిల్స్ నేర్చుకుని పార్లర్ పెట్టుకునే స్థాయి ఎదగడంతో తల్లిదండ్రుల మనసు కరిగి సంతోషంతో ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఇంటిదగ్గరే ‘దివ్యాస్ బ్యూటీ పార్లర్’ పేరిట పార్లర్ను ప్రారంభించి వివిధ రకాల బ్యూటీ సర్వీసులు, ఫేషియల్, మెనిక్యూర్, పెడిక్యూర్, మేకప్, మెహందీ డిజైన్స్ వంటి వాటన్నింటిని కస్టమర్లకు అందిస్తోంది. ‘‘పదిహేడేళ్ల అమ్మాయిగా ప్రభుత్వ పథకాలు పొందడం చాలా కష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకాలైనా 18 ఏళ్లు పైబడిన వారికే వర్తిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్బీఎఫ్ 16–20 ఏళ్లలోపు వారికి అందించే వొకేషనల్ శిక్షణ కార్యక్రమం నా కలను నిజం చేసింది. బడ్జెట్ నిర్వహణ, కస్టమర్లతో ఎలా మెలగాలి, సౌందర్య సాధనాల కొనుగోలు, వాడకం వాటిæరికార్డులు ఎలా నిర్వహించాలి అన్న అంశాలతోపాటు కొత్తరకం వ్యాపార అవకాశాల గురించి తెలుసుకున్నాను. గూగుల్ బిజినెస్, వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు ఎలా తెరవాలో నేర్చుకుని సొంతంగా నేనే బ్యానర్, విజిటింగ్ కార్డును రూపొందించుకున్నాను. ఇప్పుడు బ్యూటీపార్లర్ నడుపుతూనే, సొంతఫార్ములాతో హెయిర్ ఆయిల్ను తయారు చేసి విక్రయిస్తున్నాను. బ్యూటిషియన్ కావాలన్న నా కలను ప్రారంభంలో కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటలు పట్టించుకోకుండా బ్యూటì షియన్ కోర్సుపై దృష్టిపెట్టి పార్లర్ పెట్టే స్థాయికి ఎదగడంతో అమ్మ వాళ్లు కూడా మనస్పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో సొంతంగా స్టూడియో పెట్టుకుని నాలాంటి మరి కొంతమంది అమ్మాయిలను బ్యూటిషియన్గా తీర్చిదిద్ది, ఉపాధి కల్పిస్తాను’’ అని దివ్య చెప్పింది. -
టాలీవుడ్లోకి కోడి రామకృష్ణ కూతురు ఎంట్రీ.. హీరో ఎవరంటే..
లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంటిమెంట్ – భక్తికి గ్రాఫిక్స్ జోడించి ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడాయన. అమ్మోరు, దేవి, అరుంధతి చిత్రాలు ఆ కోవలోకి వచ్చినవే. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలు రూపొందించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ను ఖాతాలో వేసుకున్నారు. అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసురాలు సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. తొలి చిత్రానికి గాను కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్కు దివ్య అవకాశం ఇచ్చారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. KODI RAMAKRISHNA presents ! Kodi RamaKrishna's elder daughter @kodidivya announces her new production @KodiDivyaaEnt 's venturing into Production with @KiranAbbavaram 's #KA5 💥 A #ManiSharma Musical 🎹 Directed by #KaarthikShankar 🎬 pic.twitter.com/dgfnUkrFRg — Haricharan Pudipeddi (@pudiharicharan) July 15, 2021 -
Divya Gokulnath: ఆన్లైన్ టీచర్
టీచర్ కావాలన్నది ఆమె ఆశయం. అదొక్కటే కాదు, జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా వెళ్లలేదు. తన సొంత దేశస్థులకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నారు. బైజూస్ కో ఫౌండర్ అయ్యారు. ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. శక్తిమంతమైన ఎంట్ర్ప్రెన్యూర్గా ఎదిగారు బెంగళూరుకు చెందిన దివ్య గోకుల్నాథ్. భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్ – టెక్ కంపెనీ బైజూస్. ఈ యాప్కి ఎన భై మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఏడాదిన్నరగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ‘బైజూస్’ టీమ్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తీసుకు వచ్చింది. ఉద్యోగులంతా వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ ఈ ఏడాది కాలంలో పనులు చేస్తూ ఎన్నో విజయాలు సాధించేలా చేశారు ఈ సంస్థ కో ఫౌండర్ దివ్య గోకుల్నాథ్. విద్యార్థిగా చేరి... బైజూస్లో ఒక స్టూడెంట్గా చేరి కో ఫౌండర్ స్థాయికి ఎదిగారు. తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయటం వల్ల ఈ అద్భుత విజయం సాధించగలిగారు. చదువుకునే రోజుల్లోనే దివ్య ఆల్రౌండర్గా ఎదగాలనుకున్నారు. ‘‘నేను బయో టెక్నాలజీ చదువుకునే రోజుల్లో మాకు సరైన అధ్యాపకులు లేకపోవటంతో, చాలా ఇబ్బంది పడ్డాం. ఒకరితో ఒకరు చర్చించుకుంటూ పాఠాలు నేర్చుకునేవాళ్లం. పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేలా ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చాను’’ అంటారు దివ్య గోకుల్నాథ్. టీచర్గా మొదటి రోజు.. బైజూలో విద్యార్థిగా చేరి, ఆ తరవాత అక్కడ టీచర్ని అయ్యాను. నేను టీచర్ కావాలనుకున్న నా కల అలా నెరవేరింది. మొదటి రోజు క్లాసు తీసుకున్నప్పుడు క్లాసులో వందమంది విద్యార్థులు ఉన్నారు. వారంతా నా కంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నవారు. నేను టీచర్లా కనిపించటం కోసం ఆ రోజున క్లాసుకి చీర కట్టుకుని వెళ్లాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఆ రోజు పాఠం చెబుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపించింది’ అంటారు దివ్య టీచర్గా తన మొదటి అనుభవం గురించి. విదేశాలలో పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఇంజినీరింగ్ చదివేటప్పుడు బయోటెక్నాలజీ చెప్పడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకపోవటంతో పడిన ఇబ్బందులను దివ్య గోకుల్నాథ్ మరచిపోలేదు. తనలా ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదనుకున్నారు. ‘ఆఫ్లైన్ టెస్ట్ ప్రిపరేషన్ క్లాసులు మానేసి, ఆన్లైన్ క్లాసులను దేశంలోని మారుమూలలకు సైతం తీసుకువెళ్లాలని మా బైజులో నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. 2015లో యాప్ లాంచ్ చేశాం. ఇందులో ర్యాంకులు, క్లాసులో టాపర్లు వంటివి ఉండవు. ఇందులో విజయం సాధించగలమని, మా ప్రోడక్టు మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంది’’ అంటారు దివ్య గోకుల్నాథ్. చిత్తశుద్ధి ఉండాలి.. స్టార్టప్లకు కావలసింది చిత్తశుద్ధి. ఏ స్టార్టప్ అయినా, కస్టమర్కి చాలా వేగంగా స్పందించడం ముఖ్యం. తొలిదశలో ఎంతమంది ఆదరిస్తున్నారనేది కాదు. పనిలో శ్రద్ధ చూపిస్తే విజయం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవటం, ఆచరణలో పెట్టడం వెంట వెంటనే జరిగి పోవాలి. ఆలస్యం చేస్తే నిరుపయోగం.. అని నమ్ముతారు దివ్య గోకుల్నాథ్. ‘‘నేను, బైజు... మా ఇద్దరి దార్శనికత, ప్రాధాన్యతలు ఒకేలా ఉంటాయి. మా విజయం వెనుక ప్లేబుక్ ఏమీ లేదు. ఈ పాండమిక్ సమయంలో, కేవలం ఆరు మాసాల వ్యవధిలో సుమారు 35 మిలియన్ల మంది మా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. మేం ఒక్కో అడుగు ఎదుగుతున్నాం’’ అంటూ తమ విజయం గురించి చెబుతారు దివ్య గోకుల్నాథ్. ఎన్నో ఆశయాలు, ఆలోచనతో కృషి చేస్తున్న దివ్య గోకుల్నాథ్... భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తమ సేవలు విస్తరించాలనుకుంటున్నారు. -
‘బెల్ట్ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’
ముంబై: దివంగత నటి దివ్యా భట్నాగర్ భర్త గగన్ గబ్రూకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారమే తనను నమ్మించి మోసం చేశాడంటూ దివ్య గతంలో చేసిన చాట్కు సంబంధించిన స్క్రీన్షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో సెటిల్ అయ్యేందుకే గగన్ తనను ప్రేమించినట్లు నాటకమాడాడని, పెళ్లైన తర్వాత రోజూ చిత్రహింసలు పెట్టేవాడని ఆమె తన ఫ్రెండ్తో గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మాట మాటకి బెల్ట్ తీసి కొట్టేవాడు. వేళ్లు విరిచేవాడు. గగన్ మాత్రమే కాదు వాళ్ల కుటుంబం మొత్తం మోసగాళ్లే. నన్ను పెళ్లిచేసుకునేందుకు చేసిన కుట్రలో గగన్ వాళ్లమ్మ ప్రమేయం కూడా ఉంది. నాలాగే ఎంతో మందిని మోసం చేశారు. ఆ అమ్మాయిల వివరాలు తెలుసుకునేందుకు నేను ప్రయత్నించా. ప్రతీ పనిని పక్కాగా చేయడం వాళ్లకు అలవాటు. అందుకే నాకు మొదట అనుమానం రాలేదు’’అంటూ భర్త, అతడి కుటుంబం తన పట్ల ప్రవర్తించిన తీరు గురించి దివ్య చాట్లో ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దివ్య సోదరుడు దేవాశిష్ భట్నాగర్ ఆమె(దివ్య) ఇన్స్టా అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. తనకు ముందే తెలిసి ఉంటే ఆ దెయ్యం నుంచి దివ్యను కాపాడుకునే వాడినంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా వారిని ఎదిరించి మరీ దివ్య ఏడాది క్రితం గగన్ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇటీవల కరోనా బారిన పడిన దివ్యను గగన్ పట్టించుకోకపోవడం వల్లే ఆమె అర్ధాంతరంగా తనువు చాలించిందని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ‘యే రిష్తా క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్ గయి తో పియా మోరే’ వంటి హిందీ సిరీయల్స్లో దివ్య నటించారు.(చదవండి: ప్రేమ పెళ్లి: దారుణంగా హింసించేవాడు..) -
శారీరకంగా, మానసికంగా హింసించేవాడు..
ముంబై: ‘‘గగన్.. దివ్యను మానసికంగా, శారీరకంగా దారుణంగా హింసించాడు. పెళ్లైన కొన్ని రోజులకే తనకు నరకం చూపించేవాడు. భర్త తనను వేధించిన విధానం గురించి దివ్య నవంబరు 7న ఓ నోట్ రాసింది. నిన్న తన కబోర్డు తెరచి చూడగా అది మా కంటపడింది. నిజానికి తను పోలీసులను కూడా ఆశ్రయించింది. నవంబరు 16న ఫిర్యాదు చేసింది. గృహహింస కేసు పెట్టాలనుకుంది. తను ఆస్పత్రిలో ఉన్నపుడు నేను చూడటానికి వెళ్లాను. ఈ విషయాలను నాతో పంచుకుంది. తనను కాపాడుకోలేకపోయాం’’ అని దివంగత టీవీ నటి దివ్యా భట్నాగర్ సోదరుడు దేవాశిష్ ఆవేదన వ్యక్తం చేశాడు. భర్త గగన్ కారణంగా తన సోదరి ఎన్నో ఇబ్బందులు పడిందని, తనను పట్టించుకోనందు వల్లే ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు.(చదవండి: తన బంగారాన్ని దొంగిలించాడు: నటి) కాగా ‘యే రిష్తా క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్ గయి తో పియా మోరే’ వంటి హిందీ సిరీయల్స్లో నటించిన దివ్య(34) కరోనాతో సోమవారం కన్నుమూసిన విషయం విదితమే. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో దివ్య భర్త గగన్ గబ్రూ నిర్లక్ష్యమే ఆమె మరణానికి కారణమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన తల్లిదండ్రులను ఎదిరించి మరీ దివ్య ఏడాది క్రితం గగన్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా భర్తతో కలిసి ఉంటున్న క్రమంలో ఆమెకు ఇటీవలే కోవిడ్ సోకింది. దీంతో అతడు ఆమెను వదిలేసి దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులే ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఇక దివ్య బెస్ట్ ఫ్రెండ్, నటి దేవోలినా భట్టాచార్య సైతం గగన్ గబ్రుపై ఇదే రకమైన ఆరోపణలు చేశారు. దివ్య కుటుంబం, స్నేహితుల గురించి మాట్లాడే అర్హత తనకు లేదంటూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. -
నాగేంద్రకు 14 రోజులు రిమాండ్
సాక్షి, విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్యకేసులో అరెస్టైన నిందితుడు నాగేంద్రను మొదటి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు నేడు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్. కమలాకర్రెడ్డి అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నాగేంద్రను మచిలీపట్టణం సబ్ జైలుకు తరలించారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. కాగా కోర్టులో హాజరుపరచడానికి ముందు నాగేంద్రకు ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్, ఈసీజీతో పాటు కోవిడ్-19 టెస్టు కూడా చేయించారు. ఇక దివ్య తేజస్విని హత్య సమయంలో తాను గాయాలపాలైన విషయాన్ని నాగేంద్ర ఈ సందర్భంగా వైద్యులకు చెప్పాడు. (చదవండి: ప్రేమోన్మాది నాగేంద్రబాబు అరెస్ట్) కాగా విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22)ని అదే ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు కత్తితో పొడిచి హతమార్చిన విషయం విదితమే. దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దిశ పోలీసులు పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. నాగేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, అతడి ఆరుగురు స్నేహితులను కూడా ప్రత్యేక బృందం విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. -
దివ్య హత్యకేసు: ప్రేమోన్మాది అరెస్ట్
సాక్షి, అమరావతి: ప్రేమోన్మాదంతో విచక్షణా రహితంగా తన ప్రియురాలిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన నాగేంద్రబాబును దిశ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ప్రియురాలిపై కత్తితో దాడి చేశాక.. తానూ ఆత్మహత్యాయత్నం చేసుకొని చావుబతుల్లో ఉన్న నాగేంద్రబాబును గత నెల 15న పోలీసులు గుంటూరు ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. 21 రోజులపాటు చికిత్స పొందిన నాగేంద్రబాబుకు ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు అతడిని శుక్రవారం డిశ్చార్జి చేశారు. ఆ వెంటనే విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22)ని అదే ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దిశ పోలీసులు పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. నాగేంద్ర వెల్లడించిన ఆరుగురు స్నేహితులను కూడా ప్రత్యేక బృందం ఇంటరాగేట్ చేయనుంది. హత్య కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. నేడు మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచనున్నారు. సమగ్ర విచారణ కోసం పోలీసులు వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉంది. -
దివ్య హత్య కేసు: దిశా పోలీస్ స్టేషన్కు నాగేంద్ర
సాక్షి, విజయవాడ: దివ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్రను జీజీహెచ్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచడానికి 24 గంటల సమయం ఉండటంతో పోలీసులు నిందితుడిని దిశ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. దీంతో దిశా టీమ్ నాగేంద్ర నుంచి వాస్తవాలు రాబట్టే పనిలో పడ్డారు. గత రెండు గంటల నుంచి హత్యకు గల కారణాలపై పోలీసులు నాగేంద్ర నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు. కోర్టు సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇంటివద్దే నాగేంద్రను హాజరు పరిచే అవకాశం ఉంది. అనంతరం చార్జ్షీట్ దాఖలు చేసి నాగేంద్రను పోలీసులు కస్టడీకి కోరనున్నారు. (దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు) -
నాగేంద్ర అరెస్ట్కు కౌంట్డౌన్ మొదలు
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్ర అరెస్ట్కు కౌంట్ డౌన్ మొదలైంది. 45 మందిని విచారించిన పోలీసులు వారం క్రితమే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసారు. అరెస్ట్కు వైద్యపరమైన చిక్కులు ఎదురవడంతో ఆటంకం ఏర్పడింది. వైద్యుల నుంచి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉండటంతో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు డీసీపీ హర్షవర్ధన్ సాక్షి టీవీతో మాట్లాడారు. వైద్యులు క్లారిటీ ఇచ్చిన వెంటనే నాగేంద్రను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు. కస్టడీకి తీసుకొని హత్యకు గల కారణాలు రాబడతామని డీసీపీ పేర్కొన్నారు. చదవండి: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే అరెస్ట్ చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు -
నాగేంద్ర అరెస్ట్కు రంగం సిద్ధం
-
దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్కు రంగం సిద్ధం
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య హత్య కేసులో చిక్కుముడులు వీడాయి. నిందితుడు నాగేంద్ర వాదనలో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నాగేంద్ర అరెస్ట్కు రంగం సిద్ధం చేశారు. దీనిపై సీపీ బత్తిన శ్రీనివాసులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దివ్య తేజస్విని హత్య కేసులో విచారణ పూర్తి చేశాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాము. ఫోరెన్సిక్, మెడికల్ రిపోర్టులు కూడా వచ్చాయి. దివ్య.. నిందితుడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమె చేతులకు కత్తిగాట్లు పడ్డాయి. ( వాడికి బతికే అర్హత లేదు ) గొంతు కోసి, కడుపులో బలంగా పొడవటం వల్లే దివ్య చనిపోయింది. శాస్త్రీయ ఆధారాలు నివేదికల్లో ఉన్నాయి. కత్తి పోట్లపై నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాము. నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందు వల్ల అరెస్ట్ చేయలేకపోతున్నాం. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, డిశ్చార్జ్ అవగానే అరెస్ట్ చేస్తాము. కోర్టులో హాజరు పరిచాక న్యాయమూర్తి అనుమతితో కస్టడీలోకి తీసుకొని వివరాలు రాబడతామ’’న్నారు. -
వాడికి బతికే అర్హత లేదు
సాక్షి, విజయవాడ: తమ ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఉన్మాది నాగేంద్రకు బతికే అర్హతలేదని, నేరాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించి అతడికి ఉరిశిక్ష పడేలా చూడాలని దివ్య తేజస్విని తల్లితండ్రులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా దివ్య తల్లితండ్రులు శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నిజం నిప్పులాంటిదని దాన్ని బయటకు రాకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర) తమ బిడ్డను కిరాతకంగా హత్య చేయటమే కాక మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అందరినీ నాగేంద్ర తప్పుదారి పట్టించాడని వాపోయారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో దివ్యది హత్యే అని తేలిందని, తాము మొదటినుంచీ చెబుతున్నదే నిపుణుల రిపోర్టులో వచ్చిందని తెలిపారు. అబద్దం చెప్పి తప్పించుకొనేందుకు నాగేంద్ర కట్టుకథలు చెబుతున్నాడన్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న దివ్య తేజస్విని ఈ నెల 15న నాగేంద్ర జరిపిన కత్తి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నాగేంద్ర తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. అయితే దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామన్నాడు. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికలు రావడంతో అతడు చెప్పింది అబద్ధమని తేలిపోయింది. చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు -
దివ్యది హత్యే..
-
దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు విచారణ పూర్తి అయ్యింది. దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా హత్యగా తేల్చారు. దివ్య ఒంటిపై గుర్తించిన కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని, నిందితుడు నాగేంద్రనే హత్య చేసినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, దివ్యను తాను హత్య చేయలేదని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు. కేసుకు సంబంధించి దిశా పోలీసులు ఈనెల 28న ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. (సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) అలాగే ఆసుపత్రి నుంచి నిందితుడు నాగేంద్ర డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకొని విచారించి మరికొన్ని విషయాలను రాబట్టనున్నారు. మరోవైపు ఇరువురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ కావడంతో వాటి ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు హోంమంత్రి సుచరిత పలువురు మంత్రులు పరామర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
దివ్య తల్లిదండ్రులకు రూ.10 లక్షల చెక్కు అందజేత
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దివ్య కుటుంబసభ్యులకు పది లక్షలు చెక్కును అందజేశారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. హామీ ఇచ్చిన 48 గంటల్లోనే దివ్య తల్లిదండ్రులకు ప్రభుత్వం చెక్కును అందజేసింది. చక్కగా చదువుకునే దివ్య జీవితం నాశనం చేసిన నాగేంద్రకు కఠిన శిక్ష పడుతుందని దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ దివ్య తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారని, ప్రభుత్వం తరపున , పార్టీ తరపున వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) సీఎం వైఎస్ జగన్ సహాయం మరవలేనిదని దివ్య తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. మా బాధను విని సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చారని, ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారని తెలిపారు. ఆర్థిక సహాయం చేస్తారని ఊహించలేదని, మా కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జగన్కి రుణపడి ఉంటామన్నారు. ఈ కేసులో తమ బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. (సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) -
దివ్యతేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల సహాయం
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దివ్యతేజస్విని కుటుంబసభ్యులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి వారిని ఓదార్చారు. చలించిపోయిన సీఎం దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారని, ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పారన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ను హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్ ముఖ్య మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం దివ్యతేజస్విని తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రి సుచరిత సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ప్రేమోన్మాది నాగేంద్రబాబు కోలు కోగానే అదుపులోకి తీసుకుని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగేంద్రబాబు పూర్వ పరిచయాన్ని అడు ్డపెట్టుకుని దివ్యతేజస్వినిని వేధించాడన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వేధింపులపై మహిళలు, యువతులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ దివ్యతేజస్విని కుటుంబసభ్యులు కోలుకునే వరకు పార్టీపరంగా కూడా అండగా ఉండాలని సీఎం జగన్ తమకు సూచించారని చెప్పారు. దివ్యతేజస్వినిని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ మాట్లాడుతూ నాగేంద్రబాబుకు ఉరిశిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. నిందితుడి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని చెప్పారు. -
సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
-
సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
సాక్షి, విజయవాడ : బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాశ్లు దివ్య తల్లిదండ్రులైన జోసెఫ్, కుసుమ, దివ్య సోదరుడు దినేష్లను స్వయంగా సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.కాగా సీఎం జగన్ దివ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని హోంమంత్రికి సూచించారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి మాకు న్యాయం చేయాలని కోరామన్నారు. తమ మాటలకు చలించిపోయిన సీఎం తప్పకుండా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆడపిల్లల ఎదుగుదలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని.. తమ కూతురు లాంటి వారు ఎందరో ఆ పథకాలతో ఎంతో ఉన్నతికి వస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ ఆ కిరాతకుడు మా కూతురుని పొట్టన పెట్టుకున్నాడని దివ్య కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.(చదవండి : బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ.. సీఎం జగన్ చాలా బాగా స్పందించారు. దివ్య తేజస్విని విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి దివ్య కుటుంబసభ్యుల బాధను పూర్తిగా విన్నారని.. వెంటనే వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కూడా చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని.. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని సుచరిత వెల్లడించారు. దివ్య తేజస్విని కుటుంబానికి తాము అండగా ఉంటామని సీఎం జగన్ పేర్కొన్నారని దేవినేని అవినాశ్ తెలిపారు. ఇలాంటి సంఘటనల్లో పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని.. తమ పార్టీ, ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉంటుందని అవినాశ్ తెలిపారు.కాగా మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి : దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్) -
దివ్యకేసు: పురోగతి సాధించిన పోలీసులు
సాక్షి, విజయవాడ: బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దివ్యను హత్య చేసినట్టు నిర్దారణ అయ్యింది. నిందితుడు నాగేంద్ర కాల్డేటాను పోలీసులు పరీశీలించారు. హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు నాగేంద్ర తన స్నేహితుడికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నాగేంద్ర స్నేహితుడు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దివ్య హత్యకేసును దిశా పోలీసులు విచారిస్తున్నారు. దివ్య కుటుంబ సభ్యులతో పాటు, చుట్టు పక్కల వారిని దిశా టీం విచారిస్తోంది. డీజీపీ ఆదేశాలతో దిశ టీం శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. 7 రోజుల్లో చార్జిషీటు: డీజీపీ సవాంగ్ దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారని చెప్పారు. హోంమంత్రి సుచరిత.. దివ్య కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 7 రోజుల్లో ఘటనపై చార్జిషీటు దాఖలు చేస్తామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్ -
సీఎం జగన్ను కలవనున్న దివ్య పేరెంట్స్
సాక్షి, గుంటూరు: విజయవాడలో ప్రేమోన్మాది నరేంద్రబాబు చేతిలో హతమైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా, తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను కలవటానికి హోంమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా దివ్య తేజస్విని కుటుంబసభ్యులు సాక్షి టీవీతో మాట్లాడారు. 'సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం మా అదృష్టం. మహిళా పక్షపాతిగా ఉండే సీఎం మాకు అవకాశం కల్పిస్తారని తెలుసు. మాకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్కు వివరిస్తాం. నిందితుడు నాగేంద్రను ఉరితీయాలని కోరతాం' అని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) -
నిలకడగా నాగేంద్రబాబు ఆరోగ్యం
సాక్షి, గుంటూరు: దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు అనంతరం ఆత్మహత్యకు యత్నించి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్ చేసిన అనంతరం వైద్యులు నాగేంద్ర బాబును పోస్టు ఆపరేటివ్ ఐసీయూ వార్డుకు మార్చారు. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్ఎంఓ సతీష్ ఆదివారం తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు పరీక్షించిన అనంతరం తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు. ('7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో') -
'హోంమంత్రి భరోసాతో ధైర్యంగా అనిపిస్తుంది'
విజయవాడ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని, దివ్యను హత్యచేసిన ఉన్మాదిని శిక్షించి న్యాయం చేయాలని ఆమె తల్లి కుసుమ విన్నవించుకున్నారు. స్వయంగా రాష్ర్ట హోం మంత్రే తమ ఇంటికి రావడంతో భరోసాగా ఉందని దివ్య తండ్రి జోసెఫ్ అన్నారు. కోర్టుల చుట్లూ తిరగలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తమకు హోంమంత్రి భరోసా ఇవ్వడం చాలా ధైర్యంగా అనిపిస్తుందన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగేలా మంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) తాను సీఎం వైఎస్ జగన్కు వీరాభిమానినని , తన చెల్లికి తక్షణమే న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అని దివ్య సోదరుడు దినేష్ అన్నారు. ఈ ఘటనను సామాజిక దారుణంగా చూడాలని, ఇంట్లో ఉన్నా రక్షణ లేకపోవడం అన్నది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమన్నారు. దేశంలో ప్రతీ రెండు రోజులకు ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు జరుగతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా! ) -
అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. దివ్యను దారుణంగా చంపిన ఉన్మాదికి విధించే శిక్ష రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలి కోరారు. ఆడపిల్లలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్ష ఉండాలని లేఖలో పేర్కొన్నారు. మా పాపకు తక్షణ న్యాయం జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీస్తురాజపురంలో చాలామంది గుట్కా, గంజాయి, మద్యానికి బానిసలై ఉన్మాదులుగా మారుతున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి శనివారం రాసిన లేఖలో కోరారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్) దివ్య కుటుంబాన్ని పరామర్శించిన సుచరిత దివ్య తల్లిదండ్రులకు శనివారం సాయంత్ర సుచరిత పరామర్శించారు. దివ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భగా తమకు న్యాయం చేయాలని కోరుతూ లేఖను హోంమంత్రికి అందించారు. బాధితు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని సుచరిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘దివ్య ఘటన బాధాకరం. ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివ్య కుటుంబానికి అండగా ఉంటాం. తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. నిందితుడిపై ఎస్సీఎస్టీ, 302 కేసు నమోదు చేశాం. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులకు చెప్పాలి. 100కు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి:’ అని పేర్కొన్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
దివ్య ఎంత క్షోభ అనుభవించిందో
-
అసలేం జరిగింది?
-
'7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో'
సాక్షి, విజయవాడ: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసులో నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు దివ్య తల్లిదండ్రులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'దివ్యను నాగేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. నాగేంద్ర తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడు. పోలీసులకు వివరాలు చెప్పాం. దివ్య పెళ్లి ఇతర విషయాలు నిజం కాదు. ఏడు నెలలుగా మా బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో సెల్ఫీ వీడియో చూసేదాకా మాకు తెలీదు. సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది. నా కూతర్ని అత్యంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలి' అని దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్) పోలీసుల విచారణలో కొత్త విషయాలు దివ్య తేజస్విని హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. దివ్య, నాగేంద్ర వివాహంపై పోలీసుల విచారణలో ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. అయితే 2018 మార్చిలో మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి దివ్య, నాగేంద్ర వెళ్లారు. అక్కడ వారికి వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందకు పోలీసులు బృందం విష్ణు కాలేజీకి వెళ్లింది. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం నాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న చివరిసారిగా నాగేంద్రకు దివ్య కాల్ చేయగా.. ఏప్రిల్ 2న దివ్యకు నాగేంద్ర నుంచి చివరి కాల్ వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసును బెజవాడ పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్కు బదిలీ చేశారు. పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం జీజీహెచ్ సర్జికల్ వార్డులో నాగేంద్రబాబుకు చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి అన్నారు. నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి. అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి. వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే అతను సాధారణ స్థితికి రావడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది' అని ఆమె వెల్లడించారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!) -
అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!
సాక్షి, అమరావతి : ఇద్దరం ఇష్టపడ్డాం.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు కలిసి బతకలేకపోయాం.. అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా’నంటూ నిందితుడు నాగేంద్రబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజుపురంలో గురువారం ప్రేమోన్మాదంతో నాగేంద్రబాబు తన ప్రియురాలి దివ్య తేజస్వినిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు పోలీసులకు, మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పెళ్లి చేసుకున్న తాము కలిసి బతకలేక పోతున్నామని.. ఇక కలిసే పరిస్థితి లేకపోతే ఇద్దరం ఇష్ట ప్రకారమే చనిపోదామన్న దివ్య సలహా మేరకు ఆమె ఇచ్చిన కత్తితోనే హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని నాగేంద్రబాబు పోలీసులకు వెల్లడించాడు. దివ్య హత్యకు ఆమె తల్లిదండ్రులే కారణమని ఆరోపించాడు. చదవండి: దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు మంగళగిరిలో మంగళసూత్రం కట్టా.. దివ్యతో తనకు పదమూడేళ్ల నుంచి పరిచయముందని, అది ప్రేమగా మారి, ఇద్దరి ఇష్ట ప్రకారమే గత ఏడాది మంగళగిరిలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నట్టు నాగేంద్రబాబు స్పష్టం చేశాడు. ఈ విషయం ఇరువురి పెద్దలకు తెలుసని, ఆమె తల్లిదండ్రులు తామిద్దరినీ వేరు చేశారని చెప్పాడు. దివ్య లేకుండా తాను ఉండలేకపోతున్నానని, కాపురానికి తనతో తీసుకువెళతానని పలుమార్లు దివ్య తండ్రి జోసెఫ్తో గొడవ పడినట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అసలు నాగేంద్రబాబు ఎవరో తమకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని దివ్య తల్లిదండ్రులు చెబుతున్నారు. నిష్కారణంగా తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని ఆవేదన చెందుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న తమ కూతురు ఓ ప్రేమోన్మాది చేతిలో బలైపోయిందంటూ దివ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో గారాబంగా పెంచుకున్న తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని రోదిస్తున్నారు. విషణ్ణ వదనాలతో శుక్రవారం దివ్యకు అంత్యక్రియలు జరిపించారు. చదవండి: దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్ ‘దిశ’ ప్రత్యేకాధికారుల పరామర్శ హత్యకు గురైన దివ్య తేజస్విని కుటుంబాన్ని ‘దిశ’ ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్లు శుక్రవారం పరామర్శించారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దివ్య కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. -
దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేస్తారని దిశ ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, దీపికా పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వారు విజయవాడలోని దివ్య తేజశ్విని కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాం. ► మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ► ఈ కేసులో నిందితుడిపైన దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తాం. ► ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100, డయల్ 112, డయల్ 181 ద్వారా పోలీసుల సహాయం కోరాలి. దిశ యాప్, పోలీస్ సేవ యాప్ అందుబాటులో ఉన్నాయి. -
దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాదానికి బలైపోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్రతో బాధితురాలు మాట్లాడిన ఫోన్ కాల్స్ లీకవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వారిద్దరికీ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన ఆడియోలో పెళ్లి విషయం దాచిపెట్టలేక తీవ్ర సంఘర్షణకు గురైనట్లు దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందులా అందరితో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నా అని, మానసిక కుంగుబాటుకు గురవుతున్నా అని నాగేంద్రతో తన బాధను పంచుకున్నారు. తాను త్వరగా అప్సెట్ అవుతున్నాఅని, ఇలా ఎందుకు ఉంటున్నానో తనకు అర్థం కావడంలేదని ఫోన్లో విలపించారు. తనకు నాగేంద్రతో పాటు భవిష్యత్ కూడా ముఖ్యమేనని చెప్పారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర) తనలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయని, ఎవరితో మాట్లాడాలి, ఎవరి సలహాలు తీసుకోవాలో కూడా అర్థంకావడంలేదని దివ్య వాపోయారు. అంతేకాకుండా వివాహం అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎవరితోనూ చర్చించలేకపోతున్నా అని నాగేంద్రతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. తాజాగా తేజస్వినికి చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా మరికొన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. నాగేంద్రతో రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో కొనసాగానని, ఆ తరువాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని దివ్య తెలిపారు. ఓ మహిళ కారణంగా తను మోసపోయానని వీడియో వెల్లడించారు. తాను చేసిన తప్పిదాల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాఅని, తన జీవితం ఏటు పోతుందో కూడా అర్థకావడంలేదని పేర్కొన్నారు. తనకు బెదింపు కాల్స్, మెస్సెజ్లు వస్తున్నాయని వీడియో ద్వారా రికార్డు చేసుకున్నారు. (మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర) మరోవైపు తామిద్దరం వివాహం చేసుకున్నామని, అది వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నిందితుడు నాగేంద్ర చెబుతున్నాడు. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫోన్కాల్స్ రికార్డులు లీకవ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. లీకైన ఆడియోలు, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. -
ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర
సాక్షి, విజయవాడ: ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామని నాగేంద్ర తెలిపాడు. నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం దివ్య నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. దివ్య బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా. ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని దివ్య చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు’అని నాగేంద్ర పేర్కొన్నాడు. (చదవండి: మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర) కాగా, నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తనను దివ్య దూరం పెట్టిందని నాగేంద్ర చెప్తుండగా.. అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నాగేంద్ర పెయింటర్. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం) ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దివ్య తేజస్విని అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వ్యవహారంపై దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. దివ్యతో నాగేంద్రకు రహస్య వివాహం జరిగిందన్న నిందితుడి వాదనలో నిజం లేదు. నాగేంద్ర ఇంటిపై మేము దాడి చేసామన్న ఆరోపణలు కూడా సత్యదూరం. అతడి మాటల్లో దివ్యపై ప్రేమ ఉంటే అంత కిరాతకంగా ఎలా చంపాడు..?. వాట్సాప్ చాటింగ్లు, ఫొటోలు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవన్నీ కూడా మార్ఫింగ్ ఫొటోలని దివ్య తల్లి కుసుమ కొట్టిపారేసింది. -
మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర
సాక్షి, విజయవాడ: బెజవాడలో కలకలం రేపిన దివ్య తేజస్విని హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. దివ్యతో తనకు పెళ్లి జరిగినట్లు నిందితుడు నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మంగళగిరిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఆమె తండ్రి వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపిస్తూ స్పృహ కోల్పోయాడు. దీంతో స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక నిందితుడి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. (చదవండి: గంజాయి తాగుతాడు, పనికిరాని వాడు: దివ్య తల్లి) మరోవైపు.. నాగేంద్ర చెబుతున్నవన్నీ అసత్యాలని, ఇంజనీరింగ్ చదువుతున్న తమ కూతురు అలాంటి పనికిరాని వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుందని దివ్య తల్లి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. దివ్య తేజస్విని హత్య కేసులో మాచవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 449, 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) ఎవరికీ చెప్పలేదని చెప్పాడు: నాగరాజు గుంటూరు: దివ్య తేజస్వినిని పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర తనకు చెప్పాడని అతడి సోదరుడు నాగరాజు మీడియాకు తెలిపాడు. ఈ విషయం గురించి రాత్రి దివ్య ఇంటికి వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడానని, ఆయన ఇందుకు ఒప్పుకోలేదని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. బెజవాడలో గురువారం చోటుచేసుకున్న దివ్య హత్యోదంతం గురించి నాగరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన జరగగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నాగేంద్ర కోసుకున్నాడు అని చెప్పారు. నేను పని దగ్గర నుంచి డైరెక్ట్గా ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాను. అక్కడే నా సోదరుడితో మాట్లాడాను. దివ్య, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకున్నామని నాగేంద్ర చెప్పాడు. అంతేకాదు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అని కూడా అన్నాడు. ఏం జరిగిందో క్లారిటీ లేదు. జరిగిన విషయాన్ని కరెక్టుగా చెప్పలేదు. పెళ్లి చేసుకున్న అని మాత్రం చెప్పాడు’’ అని తెలిపాడు. -
‘ఆ తిరుగుబోతును ఎందుకు పెళ్లి చేసుకుంటుంది’
సాక్షి, విజయవాడ: ‘‘కావాలనే నా కుమార్తె గురించి ప్రేమ, పెళ్లి అని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా దివ్య భీమవరంలోని మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. నా బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. అపురూపంగా చూసుకున్నాం. ఆ నాగేంద్ర పెయింటింగ్ పని చేస్తాడు. గంజాయి తాగి తిరుగుతూ ఉంటాడు. అలాంటి తిరుగుబోతుకు, దివ్య పేరుతో సంబంధం కలుపుతున్నారు. ఎందుకు పనికిరానివాడిని తను ఎందుకు పెళ్లిచేసుకుంటుంది? ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు’’అంటూ ఉన్మాది స్వామి చేతిలో బలైపోయిన దివ్య తేజస్విని తల్లి కుసుమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) తన కూతురు గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిని ప్రేమ పేరుతో వేధించిన నాగేంద్ర బాబు అలియాస్ స్వామి, గురువారం ఆమెపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దివ్య మృతి చెందిన విషయం విదితమే.(చదవండి: దివ్య, స్వామి మంచి స్నేహితులు) ఈ ఉన్మాదం ఇంకెంతకాలం: వాసిరెడ్డి పద్మ నగరంలో చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర ఘటనను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంట్లోకి చొరబడి, నిద్రపోతున్న అమ్మాయిపై దాడి చేయడం దారుణం. తన గొంతు కోసి అమానుషంగా ప్రవర్తించాడు. మంచం మీద నిద్ర పోతున్న పిల్ల.. మార్చురీకి వచ్చి చేరింది. ఇటువంటి ఆగడాలను అరికట్టాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టం తెచ్చారు. ఇటువంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి. ‘‘నేను ప్రేమిస్తే.. నాకే దక్కాలి’’ అనే ఉన్మాదం ఎంతకాలం? ప్రేమించకపోతే మరణ శాసనం రాస్తారా..? చంపేస్తారా?’’ అని ప్రశ్నించాలి. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసేవిధంగా, కేంద్రం కూడా దిశ లాంటి చట్టానికి వెంటనే ఆమోదం తెలపాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. యేళ్ల తరబడి కోర్టులలో కేసులు పెండింగ్లో ఉండటం వల్లే ఈ ఘటనలు పెరుగుతున్నాయి. మనోవర్తి కేసులపై కూడా న్యాయ వ్యవస్థ ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. శిక్షలు పడేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఆడ పిల్లలు మా ప్రాణం, మా ప్రాధాన్యత అనేలా అందరూ ఆలోచించాలి. ప్రేమ పేరుతో ఉన్మాదం, దారుణాలకు పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడాలి’’అని పేర్కొన్నారు. -
దివ్య, స్వామి మంచి స్నేహితులు
సాక్షి, విజయవాడ : నగరంలో చోటు చేసుకున్న ప్రేమోన్మాదం ఘటనపై బాధితురాలి సోదరుడు స్పందించాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి తమకు చిన్నప్పటి నుంచి తెలుసునన్నాడు. దివ్య, చినస్వామి మంచి స్నేహితులని, అతడెందుకు ఉన్మాదిలా ప్రవర్తించాడో తెలియడం లేదన్నాడు. తన చెల్లెలి చావుకు కారణమైన స్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నాం: సీపీ నగర కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకి చేరుకుని బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. వారి వద్దనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘11.30 మధ్య దాడి జరిగిందని సమాచారం వచ్చింది. నిందితుడు నాగేంద్రబాబు అలియాస్ స్వామి దివ్య తేజస్విని గొంతుపై కత్తి దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆసుపత్రిలో చనిపోయింది. అతడు కూడా కత్తితో పొడుచుకోవటంతో పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఎవరూ లేరు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నా’’మని తెలిపారు. ( బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది ) దివ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ప్రేమోన్మాది దాడిలో బలైన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర వారిని కలిసి మాట్లాడి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
నవ వధువు బలవన్మరణం
పెగడపల్లి(ధర్మపురి): వరకట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వి వాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బతికపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ స భ్యులు, పోలీసులు తెలిపిన వివరాలప్ర కారం..గ్రామానికి చెందిన ఐలేని అంజి రెడ్డి–శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్య(22) హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ది వ్యకు అదే గ్రామానికి చెందిన పెయ్యాల రాజిరెడ్డి–అంజలి దంపతుల కుమారుడు ప్రవీన్రెడ్డితో 2020 ఫిబ్రవరి 22న వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.10 ల క్షల నగదు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నం కింద ముట్టజెప్పారు. ఈనేపథ్యంలో దివ్య హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా ప్రవీన్రెడ్డి స్థానికంగా వ్యవసాయం చేస్తున్నాడు. (ప్రేమజంట ఆత్మహత్య) కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని లేదా కట్నం కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాలని అత్త, మామ రాజిరెడ్డి, అంజలిలతో పాటు భర్త వేధిస్తున్నారు. అంతే కాకుండా ప్రవీన్రెడ్డి శారీరకంగా, మానసికంగా దివ్యను ఇబ్బందులను గురి చేయడంతో పాటు వాట్సప్ ద్వారా అసభ్యకరమైన మెస్సెజ్లు పంపించేవాడు. నాలుగు రోజులు క్రితం హైదరాబాద్ నుంచి తల్లి గారింటికి వచ్చిన దివ్య అత్తింటి పోరును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. దీంతో మంగళవారం ఉదయం దివ్యను ఆమె తల్లిదండ్రులు అత్తారింటికి తీసుకు వచ్చి వారితో మాట్లాడుతుండగా తిరిగి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన దివ్య ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని తన తల్లిగారి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక తమ కూతరు ఆత్మహత్య చేసుకుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, ఎస్సై నవతలు ఘటనా స్థలాన్ని సందర్శించి శవ పంచనామ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సోను నిగమ్పై వీడియో ద్వారా ప్రతిదాడి
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మాటల దాడులు కొనసాగుతున్నాయి. ఆరోపణలూ ప్రత్యారోపణలు వేడి మీద ఉన్నాయి. ‘నెపొటిజమ్’ (పక్షపాతం) ఎవరు ఎవరి పట్ల వహిస్తే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు సోనూ నిగమ్ ‘ఆత్మహత్యలు నటీనటుల్లోనే కాదు ఇక మీదట గాయకుల్లో, సంగీత దర్శకుల్లో కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆడియో కంపెనీల నిరంకుశ వైఖరి ఇందుకు కారణం’ అని కామెంట్ చేశాడు. ఇది ‘టి సిరీస్’ సంస్థను, దాని అధిపతి అయిన భూషణ్ కుమార్ను ఉద్దేశించినది. సోను నిగమ్ అంతటితో ఆగకుండా ‘భూషణ్ 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షించమని కూడా వచ్చాడు’ అన్నాడు. టి. సిరీస్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలో హతమయ్యాడు. అప్పటికి ఆయన కుమారుడైన భూషణ్ వయసు 18 సంవత్సరాలు. అయినప్పటికీ భూషణ్ సంస్థ పగ్గాలు చేపట్టాడు. సంస్థను నిలబెట్టాడు. పెద్ద నిర్మాతగా కూడా ఉన్నాడు. సోను నిగమ్ ఆరోపణలకు భూషణ్కుమార్ బదులివ్వలేదు. కాని అతని భార్య దివ్యా ఖోస్లా కుమార్ మాత్రం ఆగ్రహంతో అపర కాళిగా మారింది. తన భర్త మీద ఆరోపణలు చేసిన సోను నిగమ్ మీద వీడియో ద్వారా ప్రతిదాడికి దిగింది. ఒక వేడుకలో గాయకుడు సోను నిగమ్, టి సిరిస్ అధినేత భూషణ్ కుమార్, దివ్యా ఖోస్లా ‘సోనూ నిగమ్ గారూ. టి సిరీస్ సంస్థ ఎందరో గాయకులకు, సంగీత దర్శకులకు బ్రేక్ ఇచ్చింది. ఢిల్లీలో మీరు ఐదు రూపాయలకు కచ్చేరి ఇస్తున్న రోజుల్లో మా మామగారు గుల్షన్ కుమార్ గారు మిమ్మల్ని స్పాట్ చేసి బాంబే పిలిపించి గాయకుడిగా అవకాశం ఇచ్చారు. కాని ఆయన చనిపోయినప్పుడు సంస్థ మునిగిపోతుందని భావించిన మీరు టి సిరీస్తో కాకుండా మరో మ్యూజిక్ కంపెనీతో కాంటాక్ట్లోకి వెళ్లారు. ఇదా మీరు చేయాల్సింది. అసలు మీరు ఇంత పెద్ద గాయకులు అయ్యారు కదా మీరు ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు? మిమ్మల్ని మీరు చూసుకోవడం తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు. ఇక మీరు అండర్ వరల్డ్ ప్రస్తావన తెచ్చారు. మావారు మీ దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షణ కోసం వచ్చారని చెబుతున్నారు. అంటే మీకు అండర్ వరల్డ్తో లింక్స్ ఉండేవా? దీనిమీద ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నాను. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల సోషల్ మీడియాలో నా భర్త మీద, నా మీద, నా సంతానం మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇది చాలా తప్పు. అవకాశాలు అందరికీ ఇవ్వలేము. అవకాశాలు దొరకని వాళ్లు ఆరోపణలకు దిగితే ఎవరూ మిగలరు. ఇక మీదటైనా మీ ఆరోపణలు బంద్ చేసుకోండి’ అని గట్టిగా హెచ్చరించింది దివ్యా ఖోస్లా. ఈ భార్య చెప్పిన బదులు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) on Jun 24, 2020 at 7:23am PDT -
దివ్య హత్య కేసులో షాకింగ్ నిజాలు
సాక్షి, విశాఖటపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన దివ్య హత్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య కేసును విచారిస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతవారం అరెస్ట్ చేసిన నిందితులలో దివ్య పిన్ని కాంతవేణితో పాటు మరికొందరిని పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. రెండేళ్ల క్రితం దివ్య అమ్మమ్మ, తల్లి, సోదరుడు అనుమానస్పదంగా మృతి చెందారు. ఇందులో అమ్మమ్మ మృతదేహం మాత్రమే గోదావరిలో శవమై కనిపించగా మిగిలిన ఇద్దరివీ ఇప్పటికీ ఆచూకి లభించలేదు. ఆ సమయంలో అనాథగా మారిన దివ్యను సొంత పిన్ని కాంతవేణి చేరదీసింది. అప్పడికే వ్యభిచార వృత్తిలో ఉన్న పిన్ని కాంతవేణి దివ్య ద్వారా కూడా డబ్బులు సంపాదించాలని భావించింది. ఇందులో భాగంగా దివ్యను బలవంతంగా ఒత్తిడి చేసి వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా తనకి పరిచయమున్న వ్యభిచార నిర్వహకురాలు గీతకి దివ్యను లక్ష రూపాయిలకి ఆమె పిన్ని కాంతవేణి అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (దివ్య చుట్టూ రక్కసి మూక!) కాంతవేణి సహజీవనం చేస్తున్న కృష్ణ బ్యాంకు అకౌంట్ లోకి గత ఏడాది సుమారు లక్ష రూపాయిలు గీత అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ కావడాన్ని పోలీసులు గుర్తించి ఆరా తీయగా దివ్యను గీతకి అమ్మేసిన వైనం బట్టబయలైంది. దివ్యను కొనుక్కున్న గీత కొన్ని రోజుల పాటు తన వద్దే ఆశ్రయం ఇచ్చి దివ్యను విటుల వద్దకి పంపి డబ్బులు సంపాదించేది. ఆ తర్వాత పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో దివ్యను తాత్కాలింగా మరో వ్యభిచార నిర్వహకురాలు వసంత వద్దకి గీత పంపింది. ఇక అప్పటి నుంచి దివ్య వసంత ఇంటి వద్దే ఉంటూ వసంత చెప్పినట్లుగా వ్యభిచారాన్ని నిర్వహించేది. దివ్య ద్వారా ఆదాయం బాగానే వస్తుండటంతో దివ్యను తన దగ్గరే ఉంచుకోవాలని వసంత భావించింది. ఇందులో భాగంగా మధ్యలో ఒకసారి గీత దివ్యను వెనక్కి పంపేయాలని వసంతపై ఒత్తిడి తీసుకురాగా తన దగ్గర నుంచి వెళ్లిపోయిందని అబద్దం చెప్పింది. గీత ఒత్తిడి తగ్గడంతో వసంత దివ్య ద్వారా బాగా డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. దివ్య ద్వారా రోజుకి వేలాది రూపాయిలు వస్తుండటంతో వసంత దివ్యను బంగారుబాతులా భావించింది. (దివ్య హత్య కేసులో కొత్త కోణాలు) దివ్య సొంతపిన్ని కాంతవేణి చాలా పకడ్బందీగా దివ్యను వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నేరుగా వ్యభిచారంలోకి దింపితే తనకి ఇబ్బంధి అవుతుందని భావించి తాను సహజీవనం చేస్తున్న కృష్ణ దగ్గర బందువు వీరబాబుతో 2018 లోనే పెళ్లి జరిపించింది. భర్త వీరబాబు, కృష్ణల సాయంతో పిన్ని కాంతవేణి దివ్యపై ఒత్తిడి తీసుకువచ్చి వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే భర్త వీరబాబు ఆమె పూర్తిగా వ్యభిచారంలోకి దిగేలా పిన్ని కాంతవేణికి సహకరించినట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాతే దివ్యను గీతకి అమ్మేసినట్లు తెలుస్తొంది. ఈ మొత్తం ఆధారాలను సేకరించిన విశాఖ పోలీసులు కాంతవేణితో సహజీవనం చేసిన కృష్ణ, దివ్య భర్త వీరబాబులను సైతం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దివ్యతో గత కొన్ని రోజులగా ఆర్ధిక పరమైన వివాదాలే హత్యకి కారణాలగా పోలీసులు గుర్తించారు. దివ్యపై వసంత అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రోజూ విటుల వద్దకి బలవంతంగా పంపడం వేలాది రూపాయిలు వస్తున్నా దివ్యకి రూపాయి కూడా ఇవ్వకపోవడం, ఆఖరికి దివ్య వద్ద ఫోన్ కూడా ఉండకుండా చేయడంతో గత కొద్ది రోజులుగా దివ్యకి, వసంతకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వసంత దగ్గర నుంచి దివ్య బయటకి వెళ్లిపోవాలని భావించింది. దీంతో తన దగ్గర నుంచి దివ్య వెళ్లిపోతే వేలాది రూపాయిల ఆదాయం పోతుందని వసంత భావించి ఆమెను అందవి హీనంగా చేయాలని మొదట భావించింది. ముందుగా దివ్య కాళ్లూ చేతులు కట్టి గదిలో బంధించి గుండు కొట్టించి, కనుబొమ్ముల సైతం పూర్తిగా కత్తిరించి అందవిహీనంగా తయారు చేసింది. అప్పటికీ కక్ష తీరక క్రూరాతి క్రూరంగా పెద్ద అట్ల కాడను బాగా కాల్చి శరీరంలోని ప్రతీ భాగంపై వాతలు పెట్టింది. నాలుగైదు రోజులపాటు భోజనం కూడాపెట్టకుండా... రోజూ వాతలు పెట్టడంతో దివ్య శరీరం కుళ్లిపోయింది. ఆకలికి తట్టుకోలేక... రోజూ పెడుతున్న వాతలు తట్టుకోలేక దివ్య ఎంత ప్రాధేయపడ్డా వసంత కరగలేదు. నాలుగైదు రోజుల పాడు ఇదే విధంగా దివ్యను క్రూరంగా హింసించడంతో ఆమె చనిపోయింది. దివ్య హత్యను సైతం కప్పిపుచ్చడానికి వసంత ప్రయత్నించింది. దహన సంస్కారాలకి ఉపయోగించే వాహనంలో దివ్య మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలని వసంత ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి పోలీసులకి పట్టించింది. దివ్య మృతదేహంపై గాయాలను వ్యాన్ డ్రైవర్ గుర్తించకపోయినట్లైతే వసంత గ్యాంగ్ తప్పించుకునేవారు. చివరి నిమిషంలో దివ్య శరీరంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేసిన డ్రైవర్ వెనక్కి వెళ్లిపోయి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దివ్య హత్య ఉదంతం పూర్తిగా బయటపడింది. దివ్య హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
దివ్య హత్య కేసు: కృష్ణ అకౌంట్లో డబ్బులు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో కీలక సమాచారం వెల్లడైంది. బాబాయ్ కృష్ణ అకౌంట్లో దివ్య సంపాదన లక్ష రూపాయలు డిపాజిట్ అయినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. కృష్ణ ఖాతాలో వసంత, గీతలు దఫదఫాలుగా ఈ సొమ్ము జమచేసినట్టు తేలింది. కాగా, దివ్య భర్త వీరుబాబు, బాబాయ్ కృష్ణను విశాఖ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (వైజాగ్ యువతి హత్యకేసులో రౌడీషీటర్ హస్తం! ) దివ్యను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలోనే వీరుబాబు, కృష్ణపై కేసు నమోదైంది. వీరితో కలిపి దివ్య హత్యకేసులో అరెస్టైనవారి మొత్తం సంఖ్య 8కి చేరింది. నిందితులకు వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కు తరలించారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించనున్నారు. కాగా, 2018 డిసెంబర్లో వీరుబాబుతో దివ్యకు వివాహమైంది. మేనల్లుడు వీరబాబుతో దివ్యకు కృష్ణ వివాహం చేయించాడు. (చదవండి: దివ్య చుట్టూ రక్కసి మూక!) -
విశాఖ దివ్య హత్య కేసులో పురోగతి
-
దివ్య చుట్టూ రక్కసి మూక!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): చిత్ర హింసలు అనుభవించి దారుణ హత్యకు గురైన దివ్య చుట్టూ ఓ రక్కసి మూకే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. కట్టుకున్నవాడు, చేరదీసిన వారు.. ఇలా అందరూ రాక్షసంగా ప్రవర్తించినట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పేద కుటుంబంలో పుట్టిన దివ్యకు లోకంపోకడ తెలియక ముందే తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురవడంతో విశాఖ నగరంలోని ఎన్ఏడీ కూడలి వద్ద ఉంటున్న గీత వద్దకు చేరింది. దివ్య అందాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న గీత మాయమాటలతో వ్యభిచార రొంపిలోకి దింపింది. కొద్ది నెలల తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని స్వస్థలం చేరగా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వీరుబాబుతో బంధువులు వివాహం చేశారు. అయితే భర్త వేధించడంతోపాటు తీసుకొచ్చి మళ్లీ విశాఖలోని గీతకు అప్పగించాడు. అక్కడ కొద్ది రోజులున్న తర్వాత అక్కయ్యపాలెంలోని వసంత అలియాస్ జ్యోతి వద్దకు దివ్య చేరింది. అప్పటి నుంచి దివ్య అందంతో వ్యాపారం చేసిన వసంత... ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో సుమారు ఆరు రోజులపాటు తిండి పెట్టకుండా తీవ్ర చిత్రహింసలకు గురి చేసి హతమార్చినట్లు విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. ఇప్పటికే కస్టడీకి తీసుకున్న వసంత, గీతను బుధవారం నుంచి విచారించిన నగర పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు వారితోపాటు అరెస్టయి జైలులో ఉన్న మరో నలుగురు నిందితులనూ కోర్టు అనుమతితో శుక్రవారం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. మరోవైపు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు కాల్ డేటా ఆధారంగా దివ్య భర్త వీరుబాబుతోపాటు బంధువు కృష్ణని అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. మరో రోజు కస్టడీ పొడిగింపు మరోవైపు ప్రధాన నిందితురాలు వసంతతోపాటు గీత కస్టడీ శుక్రవారంతో ముగిసినప్పటికీ కోర్టు మరో రోజు విచారణకు అనుమతించింది. దీంతో ఆరుగురు నిందితులనూ శనివారం విచారించి... కేజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలుకు తరలించనున్నారు. అయితే ఎన్నిరకాలుగా విచారిస్తున్నప్పటికీ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో అన్న విషయాన్ని వసంత వెల్లడించడం లేదు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న కోణాల్లో లోతుగా ఆరా తీస్తున్నారు. దివ్య భర్త వీరుబాబు పాత్రపైనా విచారించారు. మరిన్ని వివరాల కోసం లోతుగా విచారణ సాగిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
వైజాగ్ యువతి హత్యకేసులో రౌడీషీటర్ హస్తం!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో సంచలనం రేపిన దివ్య హత్య కేసులో ఓ రౌడీషీటర్ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడయింది. పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు వసంత, గీతలను నగర పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ మీనా రెండో రోజు గురువారం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా విచారించగా ఈ కీలక విషయం వెల్లడైనట్లు తెలిసింది. హత్యకు ఓ రౌడీషీటర్ సహకరించినట్లు సీపీకి వసంత తెలిపినట్లు తెలిసింది. మరోవైపు వసంత మరిది సంజయ్య ఫోన్లోని డేటా డిలీట్ చేసేందుకు సహకరించిన దొండపర్తిలోని ఓ సెల్ షాపు యజమానినీ పోలీసులు విచారించారు. అయితే తన షాపు వద్దకు వచ్చి ఫోన్లోని డేటా డిలీట్ చేయాలని సంజయ్య కోరగా... ఫోన్కు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పానని... అవి తీసుకొచ్చాకే డేటా డిలీట్ చేశానని... అంతకు మించి తనకే సంబంధం లేదని విచారణలో ఆ షాపు యజమాని వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న సీపీ ఆర్కే మీనా వివిధ కోణాల్లో వసంత, గీతను విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. ఆరు రోజులు చిత్రహింసలు పెట్టి... అనంతరం సీపీ రాజీవ్కుమార్ మీనా మాట్లాడుతూ దివ్య హత్య అత్యంత క్రూరమైనదని అన్నారు. దివ్యను ఆమె పిన్ని అమ్మేయడంతో ఇంటి పనికి తీసుకొచ్చిన వసంత వ్యభిచార ఊబిలోకి దింపిందని గుర్తు చేశారు. అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో తిండి పెట్టకుండా ఆరో రోజులపాటు చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. దివ్యని వివాహం చేసుకున్న వీరబాబుకు కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్ అమ్మమ్మ నాగమణి ఓ రౌడీషీటరు చేతిలో హత్యకు గురయ్యారని తెలిసిందని... ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నామని స్పష్టం చేశారు. హత్యతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం రెండు బృందాలు ఇప్పటికే రావులపాలెం, ఏలేశ్వరం పంపించామని తెలిపారు. ప్రస్తుతం వసంత, గీతను విచారిస్తున్నామని.., రిమాండ్లో ఉన్న మిగిలిన నలుగురినీ పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరగా... కోర్టు అనుమతించడంతో వారిని శుక్రవారం నుంచి విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపారు. విశాఖలో హల్చల్ చేసిన చిట్టిమాము గ్యాంగ్ పుట్టిన రోజు పార్టీకి సంబంధించి చేపట్టిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర ముఠా మోసగాడు జవహర్ బాలకుమార్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాలకుమార్ చేతిలో అనేక మంది మహిళలు మోసపోయారని పేర్కొన్నారు. దివ్య హత్యకేసు విచారణలో ఈస్టు ఏసీపీ కులశేఖర్, సీఐ కోరాడ రామారావు, ఎస్ఐలు శ్రీనివాస్, గౌరి, సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
దివ్య హత్య కేసులో కొత్త కోణాలు
-
దివ్య హత్య అత్యంత క్రూరమైంది..
-
దివ్య హత్య అత్యంత క్రూరమైంది..
సాక్షి, విశాఖ : నగరంలో దారుణంగా హత్యకు గురైన దివ్య హత్య కేసులో రెండవ రోజు విచారణ కొనసాగుతుంది. ప్రధాన నిందితురాలు వసంత, ఆమెకు సహకరించిన గీత అలియాస్ కుమారి లను పోలీసులు కస్టడీ లో తీసుకుని విచారిస్తున్నారు. వసంత ఫోన్ కాల్ డేటా ను తీసుకున్నారు. అయితే దివ్యను చంపిన తర్వాత నిందితురాలు వసంత మొబైల్లో ఉన్న కాల్ డేటా మొత్తాన్ని ఓ మొబైల్ దుకాణానికి తీసుకు వెళ్లి డిలీట్ చేయించినట్లు ఇంటరాగేషన్లో తేలింది. దీంతో సదరు మొబైల్ దుకాణ యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. (దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్) ఈ సందర్భంగా దివ్య హత్యకేసు విచారణపై నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా గురువారమిక్కడ మాట్లాడుతూ.. నిందితులు వసంత, గీతను కస్టడీకి తీసుకున్నాం. మిగిలిన నలుగురు నిందితులను కూడా పోలీస్ రిమాండ్కు అప్పగించమని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుంటాం. దివ్య హత్య అత్యంత క్రూరమైంది. ఆమెకు ఆరురోజుల పాటు తిండి పెట్టకుండా చాలా హింసించారు. (కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!) ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ఆరా తీస్తున్నాం. దివ్య తల్లి, సోదరుడు, అమ్ముమ్మ ఓ రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైనట్లు నిందితులు చెబుతున్నారు. అయితే వాళ్లు హత్యకు గురయ్యారా? లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.’ అని తెలిపారు. సీపీ అంతకు ముందు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) -
దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్యపై విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దివ్య హత్యకేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. కాగా 2018లో వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దివ్యతో పెళ్లి తర్వాత మూడు నెలల పాటు కాపురం చేసిన వీరబాబు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. కాగా వీరబాబుకు దివ్య పిన్ని కాంతవేణి కూడా తోడయి ఆమెను ఒత్తిడికి గురి చేశారు. వీరి ఒత్తిడిని తట్టుకోలేకనే విశాఖపట్నంకు వచ్చిన దివ్య.. గీత, వసంత వద్దకు వచ్చినట్లు తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. కాగా హత్య సమయంలో నిందితులు దివ్య వద్ద సెల్ఫోన్ లేకుండా చేశారని తెలిపారు. (పోలీసు కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!) విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ మీనా మాట్లాడుతూ.. 'దివ్య హత్య కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు నిందితులని అరెస్ట్ చేయడానికి రెండు బృందాలతో గాలింపుచర్యలు చేపట్టాం. దివ్యకి గతంలో పెళ్లి జరిగినట్లు గుర్తించాం. నిందితులందరినీ పూర్తిస్ధాయిలో విచారించడానికి పోలీసు కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ వేస్తాం. దివ్యను అతి క్రూరంగా హింసించి హత్య చేశారు. దివ్య శరీరంపై అనేక గాయాలున్నాయి' అంటూ వివరించారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) -
కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దివ్య హత్య కేసును విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. దివ్య హత్యలో పాల్గొన్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేసి, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు, నలుగురు మహిళలు, ఒక వ్యక్తి అరెస్టయిన సంగతి తెలిసిందే. (అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య) కేసులో ఏ1 గా వసంత, ఏ2గా వసంత సోదరి మంజు, ఏ3గా వసంత తల్లి ధనలక్ష్మి, ఏ4గా వసంత మరిది సంజయ్ ఏ5గా గీత అలియాస్ కుమారి, ఏ6గా దివ్య పిన్ని కాంతవేణిలపై ఐపీసీ 302,343,324,326తో పాటు.. మహిళల అక్రమ రవాణచట్టం 201,294 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. వీరికి ఆదివారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించి, మొదటి అదనపు జడ్జి ఎదుట హాజరుపర్చగా 19 వరకు రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఏడాదిన్న క్రితం ఉపాధి నిమిత్తం విశాఖకు వచ్చిన దివ్య.. వసంత ఇంటిలో ఆశ్రయం పొందింది. ప్రధాన నిందితురాలు వసంత, దివ్య పిన్ని కాంతివేణిల మధ్య పాత పరిచయం ఉండటంతో.. ఆ పరిచయంతోనే దివ్యను ఆమె పిన్ని కాంతవేణి.. వసంత ఇంటికి తీసుకొచ్చింది.విశాఖలో వసంత వ్యభిచార నిర్వహకురాలిగా ఉండగా, దివ్య పిన్ని కాంతవేణికి సైతం పడుపు వృత్తిలోనే వసంత పరిచయం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. దివ్యను సైతం వసంత వ్యభిచార రొంపిలోకి దింపినట్లు సమాచారం. గత ఏడాదిన్నరగా దివ్య ద్వారా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించి.. వసంత కాసులు సంపాదిస్తునట్లుగా పోలీసుల విచారణలో తేలింది. తనను వాడుకుని డబ్బులు సంపాదిస్తూ వసంత తనని మోసం చేస్తోందని దివ్య గ్రహించింది. ఇటీవల కాలంలో దివ్య, వసంతల మధ్య విబేధాలు పొడచూపడంతో దివ్య బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో దివ్యపై కక్ష పెంచుకున్న నిందితురాలు వసంత.. కొందరితో కలిసి ఆమెకు గుండు కొట్టించి అతిక్రూరంగా ఐదు రోజుల పాటు హింసించి హత్య చేశారు. చివరకు అందమే శాపంగా మారి దివ్య తన జీవితాన్నే కోల్పోయింది. -
దివ్య హత్య కేసులో నిందితులు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితురాలు ఏ1 గూటాల వసంత, ఏ2 వసంత సోదరి మంజు ఎలియాస్ సంధ్య, ఏ3 వసంత తల్లి ధనలక్ష్మ, ఏ4 వసంత మరిది సంజయ్, ఏ5 గీత ఎలియాస్ కుమారి, ఏ6 దివ్య పిన్ని కాంతవేణిలు ఉన్నారు. అనంతరం వీరిని వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. పరీక్షలు ముగిసిన తరువాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నిందితులపై ఐపీసీ 302 ,343, 324,326 సెక్షలతో పాటు మహిళల అక్రమ రవాణాచట్టం 201, 294 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 15 మందిని ఎగ్జామిన్ చేశారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) -
దివ్య హత్య కేసులో నిందితులు అరెస్ట్
-
దివ్య హత్య కేసు: సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం : దివ్య హత్య కేసులో విశాఖ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. దివ్య హత్యకేసులో నలుగురికిపైగా వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితురాలు వసంత, ఆమె సోదరి మంజులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు దివ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత పాశవికంగా దివ్య హత్య నిందితులు దివ్య కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత పాశవికంగా పెద్ద అట్లకాడతో ఒళ్లంతా వాతలు పెట్టారు. ఆమెకు గుండు కొట్టించి, కనుబొమ్మలను సైతం తొలగించారు. అయిదారు రోజులపాటు భోజనం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలు చేసి అయిదారు రోజులపాటు ఆహారం పెట్టకపోవడంతో దివ్య మరణించింది. మృతురాలి శరీరంపై 33 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హత్య చేసిన రోజే మృతదేహాన్ని తరలించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. రాత్రి సమయంలో అంతిమయాత్ర వాహన యాజమాని నాయుడుని సంప్రదించారు. ( అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య ) ఎంత డబ్బు అయినా ఇస్తామని, శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించాలని వాహన యాజమానిపై వారు ఒత్తిడి తెచ్చారు. దివ్య శరీరంపై గాయాలను గుర్తించిన నాయుడు పోలీసులకి తెలియజేశాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ దివ్యను తన ఇంట్లోనే ఉంచి వసంత అనైతిక కార్యకలాపాలకి ఉపయోగించి డబ్బు సంపాదించేది. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్యా ఆర్ధిక విషయాలకు సంబంధించి విభేదాలు తలెత్తాయి. దీంతో వసంత నుంచి బయటకి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో దివ్యపై కక్ష పెంచుకున్న నిందితులు క్రూరంగా హత్యచేశారు. -
అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసును విశాఖ పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్య మృతదేహానికి శనివారం కేజీహెచ్లో పోస్ట్మార్టం నిర్వహించారు. ఆమె శరీరంపై 33 చోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. దివ్యను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమెతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటట్లు చేసిన అక్కయ్యపాలెం నందినగర్ నివాసి వసంత అనే మహిళే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బతుకుదెరువుకు వచ్చి బలి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఊబలంకకు చెందిన దివ్య(20) తల్లిదండ్రులు చనిపోవడంతో బతుకుదెరువు కోసం వసంత(30) దగ్గరకు వచ్చింది. అప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వసంత దివ్యను కూడా వ్యభిచార రొంపిలోకి దింపింది. కొన్నాళ్లకు తన అందంతో ఎదుగుతున్న దివ్యను చూసి అసూయ, ద్వేషాలకు గురైన వసంత దివ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ముందుగా దివ్య అందాన్ని చెరిపేయాలని నిర్ణయించుకుని ఇంట్లో బంధించి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసింది. వీటిని భరించలేక దివ్య బుధవారం రాత్రి మృతి చెందింది. అంతిమయాత్ర వాహన యజమాని అనుమానంతో... దివ్య మరణించాక.. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు జ్ఞానాపురం ప్రాంతంలోని అంతిమ యాత్ర వాహనం యజమానికి ఫోన్ చేసి ఎంత డబ్బయినా ఇస్తానని వసంత ఆశ చూపించింది. అనుమానం వచ్చిన వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దివ్యది సహజ మరణంగా చూపడానికి ఆమె ప్రయత్నించింది. దివ్య మృతదేహంపై గాయాలు ఉండడాన్ని గమనించి హత్య కోణంలో దర్యాప్తు చేశారు. వసంత హత్యా నేరం అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో వసంత సోదరి, మరిదిని అదుపులోకి తీసుకున్నారు. 2015లో దివ్య కుటుంబ సభ్యుల హత్య దివ్య కుటుంబ సభ్యులు కూడా 2015లో హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మలను కూ డా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఆ హత్యలపైనా పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
షాకింగ్: దివ్య శరీరంపై 33 గాయాలు!
-
షాకింగ్: దివ్య శరీరంపై 33 గాయాలు!
సాక్షి, విశాఖపట్నం : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దివ్య కేసును పోలీసులు ఛేదించారు. చట్ట వ్యతిరేక కార్యాకలాపాల్లో భాగంగా డబ్బు పంపకంలో తేడాలు రావడంవల్లే ఆమెను హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు దివ్య మృతదేహానికి పోస్ట్మార్టంలో పలు విషయాలు వెల్లడైయ్యాయి. ఆమె శరీరంపై 33 గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరి నగర్ కాలనీలో ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంటి యజమానురాలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలుగో టౌన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో యువతి (22) దివ్య మృతదేహాన్ని కుటుంబసభ్యులు మేడపై నుంచి కిందకు దించారు. (దివ్యది హత్యే!) గుట్టుచప్పడు కాకుండా శ్మశానవాటికకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్ధానికుల కంటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి శరీరంపై గాయాలు ఉండటంతో ఇంటి యజమానురాలు వసంత (అలియాస్ జ్యోతి)పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా దివ్య గత ఎనిమిది నెలలుగా వసంత ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వసంతను విచారించిన సమయంలో.. ఆమె చెప్పిన వివరాలతో ఘటనకు పొంతన కుదరలేదు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్యను ఆమె చిన్నాన్న, పిన్ని కలిసి వసంతకు అప్పగించినట్లు పోలీసు విచారణలో తేలింది. అప్పటి నుంచి దివ్య వసంత ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు విచారించారు. ఈ క్రమంలోనే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దివ్యచే అసాంఘిక కార్యక్రమాలు చేయించాలని వసంత పట్టుబట్టగా..దానికి ఆమె నిరాకరించింది. దీంతో దివ్యను చిత్రహింసలకు గురిచేసి చివరికి వసంతే హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. హత్యకు గురైన దివ్య తల్లి, సోదరుడు, అమ్మమ్మ 2015లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ ముగ్గురి మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడం గమనార్హం. దీంతో దివ్య హత్య కేసుతో పాటు ఆ హత్యలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
విశాఖపట్నంలో యువతి అనుమానస్పద మృతి
-
దివ్య హత్య కేసు: వేరే వాళ్లకు దక్కకూడదనే..
-
దివ్య హత్య కేసు: వేరే వాళ్లకు దక్కకూడదనే..
సాక్షి, గజ్వేల్(సిద్ధిపేట): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య(23)హత్య కేసులో నిందితుడైన వెంకటేశ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారం రోజుల్లో పెళ్లి అనగా.. దివ్యను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తున్న నిందితుడు వెంకటేష్ ఈ నెల 18న ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు. మొదట పోలీసులు వెంకటేష్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంతో.. నిందితుడు తానే స్వయంగా వచ్చి నిన్న(బుధవారం) వేములవాడ పోలీసు స్టేషన్లో లొంగిపోయిన విషయం తెలిసిందే. విచారణలో నిందితుడు తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో వేములవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక నిందితుడు దివ్యను హత్య చేసిన తీరును పోలీసులు వివరిస్తూ.. ఈ నెల 18 దివ్య తండ్రి లక్ష్మీరాజ్యం పోలీసు స్టేషన్కు వచ్చి.. తన కూతురుని వేధిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేశ్.. తనను హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత, ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిన్న(బుధవారం) రాత్రి వేములవాడ పట్టణంలో స్పెషల్ టీమ్స్ అధికారులు వెంకటేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే దివ్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు కాగా 5 నెలల క్రితం దివ్యకు గజ్వేల్ ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. గతంలో వెంకటేశ్తో సన్నిహితంగా మెలిగిన దివ్య.. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి తనను దూరం పెడుతోందని భావించిన వెంకటేశ్.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దివ్యకు వేరేవారితో పెళ్లి కుదరడంతో తనకు దక్కనిది, మరెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం దివ్య ఉద్యోగం చేస్తున్న గజ్వేల్ బ్యాంకు వద్దకు, ఆమె ఇంటికి పలుమార్లు వచ్చి వెళ్ళాడు. ఈ క్రమంలో ఈనెల 18న రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో బ్యాంకు నుండి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న దివ్యను గమనించి వెంబడించాడు. ఇక ఆ సమయంలో ఇంటిలో దివ్య తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో నిందితుడు తన వెంట తెచ్చుకుని కత్తి తీసి దివ్య గొంతు, ఇతర శరీర భాగాలపై పొడిచి హత్య చేశాడు. (వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..) ఈ నేపథ్యంలో పోలీసు స్టేషనులో లొంగిపోయిన వెంకటేశ్ను.. పోలీసులు విచారించగా తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు అంగీకరించాడు. తొలుత ఘటనాస్థలం నుంచి నేరుగా సికింద్రాబాద్ నుంచి రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్ మీదుగా వేములవాడకు వచ్చినట్లు వెల్లడించాడు. కాగా నిందితుడికి కఠిన శిక్ష పడి దివ్యకు న్యాయం జరిగేలా కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. ఇక కేసు 24 గంటల్లో చేధించిన గజ్వేల్ ఏసీపీ నారాయణ, గజ్వేల్ సీఐ ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. -
దివ్య హత్య కేసులో లొంగిపోయిన నిందితుడు
-
పథకం ప్రకారమే దివ్య హత్య!
గజ్వేల్/వేములవాడ: బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్యోదంతం మలుపులు తిరుగుతోంది. పథకం ప్రకారమే ఆమె హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచా రం. మంగళవారం రాత్రి గజ్వేల్లోని తమ ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యపై దాడి చేసి పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో గత కొన్నేళ్లుగా వేధిస్తున్న వెంకటేశ్ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే, దివ్య, తన కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, హైదరాబాద్లో ఇరువురూ కలిసి కొంతకాలం ఉన్నారని వెంకటేశ్ తండ్రి చెప్పడం సంచలనంగా మారింది. మరోపక్క వెంకటేశ్ బుధవారం వేములవాడ పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. పదో తరగతి నుంచే... రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలపల్లి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. హత్యకు గురైన దివ్య చిన్న కుమార్తె. లక్ష్మీరాజం వేములవాడ ఆలయం వద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తూ ప్రైవేటు లాడ్జిని లీజుకు తీసుకొని నడిపేవారు. ఆ సమయంలో దివ్య వేములవాడలోని వెంకటరమణ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ చదివింది. వేములవాడలోని శాస్త్రినగర్కు చెందిన కైరి పరుశురాం, లత దంపతుల కుమారుడు వెంకటేశ్ కూడా అదే పాఠశాలలో పదో తరగతి చదివాడు. అప్పటినుంచే దివ్యను ప్రేమ పేరుతో వేధించేవాడని మృతురాలి తల్లిదం డ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ సమయంలోనూ వేధింపులు కొనసాగించాడని, దీంతో వెంకటేశ్పై వేములవాడ, ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశామని చె బుతున్నారు. ఓసారి దివ్య కోసం ఒంటిపై కిరోసిన్ పోసు కుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంకటేశ్ కుటుంబీకులు తమపై దాడికి ప్రయత్నించారని లక్ష్మీరాజం వెల్లడించారు. దీంతో తాము కొంతకాలం హైదరాబాద్ వెళ్లిపోయామని.. అప్పుడే తమ కుమార్తె ఓయూలో డిగ్రీ పూర్తిచేసి, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉద్యోగం సాధించిందన్నారు. కొంతకాలంగా వెంకటేశ్ రెక్కీ? వరంగల్కు చెందిన సందీప్తో దివ్యకు పెళ్లి కుదిరింది. ఈ నెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో దివ్యపై కక్ష పెంచుకున్న వెంకటేశ్ కొంతకాలంగా గజ్వేల్ వచ్చి ఆమె ను దూరం నుంచి గమనించడం.. ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరగడం చేస్తుండేవాడని పోలీసు విచారణలో బ యటపడినట్టు సమాచారం. పథకం ప్రకారం ఆమెను హ త్యచేసే ఉద్దేశంతో గజ్వేల్ వచ్చాడని, దివ్య తల్లిదండ్రులు పెళ్లి పనులపై ఎల్లారెడ్డిపేట వెళ్లారని తెలియడంతో అదను చూసి ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడిచేసి చంపేశాడని అ నుమానిస్తున్నారు. దివ్య కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా.. ఆ సమయం లో అతడు గజ్వేల్లోనే ఉన్నట్టు వెల్లడైంది. దీంతో వెంకటేశ్ను పట్టుకునేందుకు గజ్వేల్, వేములవాడలకు రెండు ప్ర త్యేక బృందాలను పంపించారు. అనంతరం వెంకటేశ్ తల్లిదండ్రులను విచారణ నిమిత్తం వేములవాడ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్ నేరుగా ఠాణాకు వచ్చి లొంగిపోయాడు. దీంతో అతడిని విచారణ నిమిత్తం సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. దివ్య కుటుంబీకుల ఆందోళన: దివ్య మృతదేహానికి పోస్టుమార్టం సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రివద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. న్యాయం జరిగేంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ భీష్మించారు. అంతలో మంత్రి కేటీఆర్..ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యుడు ఆగయ్యకు ఫోన్చేసి.. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ విషయాన్ని ఆగయ్య చెప్పడంతో ఆందోళనకు తెరపడింది. దివ్యకు ఎల్లారెడ్డిపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు: పరుశురాం వెంకటేశ్, దివ్య ప్రే మించి పెళ్లి చేసుకున్నార ని అతడి తండ్రి పరుశు రాం విలేకరులకు తెలిపారు. ఇద్దరూ టెన్త్ సమయంలోనే ప్రేమలో పడ్డార నీ, పెళ్లయిన తర్వాత దివ్య తల్లిదండ్రులు ఆమెను ఇ క్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. దీంతో తానే స్వ యంగా డబ్బులు ఖర్చుచేసి దివ్యను హైదరాబాద్లో హాస్టల్లో ఉంచి చదివించానని చెప్పారు. ఓయూ క్యాంపస్లో చదువుతున్న దివ్య.. దిల్సుఖ్నగర్లో ఇంజనీరింగ్ కోచింగ్ తీసుకుంటున్న వెంకటేశ్తో కలసి ఉన్నట్లు వివరించారు. అయితే.. ఉద్యోగం వచ్చాక దివ్య ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. అప్పట్నుం చి తన కుమారుడు వెంకటేశ్ ఇబ్బందులు పడుతున్నా డని చెప్పారు. తిరిగి దివ్యకు తల్లిదండ్రులు దగ్గరై పెళ్లి సంబంధాలు చూడటంతో వెంకటేశ్ మానసిక సంఘర్షణ కు గురయ్యాడన్నారు. నిజానికి తన కుమారుడు పిరికివాడని, హత్య చేసేంత ధైర్యం అతడికి లేదని అతని తండ్రి పరశురాం వివరించారు. -
దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు
సాక్షి, వేములవాడ : దివ్య హత్యకేసు విచారణలో భాగంగా నిందితుడిగా అనుమానిస్తున్న వెంకటేష్ తల్లిదండ్రులను పోలీసులు వేములవాడలో అదుపులోకి తీసుకున్నారు. పరుశరాం గౌడ్, లతను విచారణ నిమిత్తం గజ్వేల్కు తరలించారు. వెంకటేష్కు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ తండ్రి మాట్లాడుతూ..‘చిన్నప్పుడు 5,6 తరగతుల్లోనే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. జ్యోతిష్మతి కాలేజీలో ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్లో కోచింగ్కు వెళ్లిన వాళ్లు అక్కడే పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అప్పట్లో అమ్మాయి మిస్సింగ్ అంటూ దివ్య తల్లిదండ్రులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. (దివ్య హత్య కేసులో మరో కోణం..) దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో పోలీసుల్ని కలిశారు. ఆ తర్వాత దివ్య మనసు మార్చేసిన ఆమె తల్లిదండ్రులు.. వెంకటేష్ వేధిస్తున్నాడని 2018 అక్టోబర్లో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దర్నీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి జోలికి వెళ్లవద్దని పోలీసులు చెప్పడంతో రాత పూర్వకంగా హామీ ఇచ్చాం. మా కొడుకు హత్య చేశాడని అనుకోవడం లేదు. చనిపోయిన వారిని చూస్తేనే భయపడతాడు. అలాంటి వాడు హత్య చేశాడంటే ఎలా నమ్ముతాం’ అని అన్నారు. (వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..) మరోవైపు దివ్య మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. అయితే తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహాన్ని తరలించే ప్రస్తకే లేదని మృతురాలి కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వెంకటేష్ కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం
-
దివ్య హత్య కేసులో మరో కోణం..
సాక్షి, గజ్వేల్ : దారుణ హత్యకు గురైన దివ్య కేసులో మరో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో దివ్య మేజర్ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు... హాస్టల్లో ఉంచి చదివించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను వెంకటేష్ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని...దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్ హామీ పత్రం రాసిచ్చినట్లు భోగట్టా. (గజ్వేల్లో యువతి దారుణ హత్య) ఆ తర్వాత దివ్యకు గజ్వేల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిర్చారు. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేషే..ఈ ఘోరానికి పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేములవాడలోని ఇంటికి తాళం వేసి వెంకటేష్తోపాటు అతని కుటుంబం ఎక్కడికో వెళ్లిపోయానట్లు తెలుస్తోంది. వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దివ్య మెడలో బలవంతంగా దండ వేసి పెళ్లంటూ.. కాగా ఎల్లారెడ్డిపేటలో దివ్య నివాసం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎదిగిన బిడ్డ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న సమయంలో దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దివ్య తల్లి మణెమ్మ మాట్లాడుతూ.. వెంకటేషే తన బిడ్డను హతమార్చాడని, ఆరేళ్లుగా వెంటపడుతున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోకుంటే చంపుతానని బెదిరించాడని, చిన్నప్పుడు దివ్య మెడలో బలవంతంగా దండ వేసి పెళ్లి అయినట్లు ప్రచారం చేశాడని తెలిపారు. దివ్య జోలికి రావద్దని చెప్పినా వినలేదని, దీంతో 2018 అక్టోబర్ 9న ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వెంకటేష్పై పోలీసులు కేసు నమోదు చేశారని, ...మరోసారి దివ్య జోలికి రాను అని అతడు కాగితం రాసిచ్చాడని తెలిపారు. తన బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వెంకటేష్ను కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
నడివీధిలో భర్తపై భార్య దాడి
కర్ణాటక, యశవంతపుర: కుటుంబ కలహాలతో భర్త ను భార్య నడివీధిలో చితకబాదిన ఘటన బెంగళూరులో జరిగింది. బాణసవాడి మారుతీసేవనగరకు చెందిన వినోద్, దివ్యలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా దివ్య తల్లితో కలిసి ఉంటోంది. అయితే దివ్యను ఏదోవంకతో వినోద్ కుటుంబ సభ్యులు గొడవలు పడేవారు. ఇదిలా ఉంటే ఈనెల 9న దివ్య తనకు బంధువైన కానిస్టేబుల్ను తీసుకుని వినోద్ పిలిపించి నడి వీధిలో చితకబాదింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు. -
దివ్య స్పందన స్థానంలో మరో వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను కొత్త వ్యక్తికి అప్పగించింది. గుజరాత్కు చెందిన రోహన్ గుప్తాను సోషల్ మీడియా విభాగానికి చీఫ్గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాగా మొన్నటి వరకు సోషల్ మీడియా వింగ్ను నడిపిని ఆ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నాలుగు నెలల అనంతరం ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. రోహన్ గుప్తా 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్గా పనిచేశారు. ఏఐసీసీ జాతీయ మీడియా సమన్వయకర్తగా ఉన్న కాంగ్రెస్ నేత రాజ్కుమార్ గుప్తా కుమారుడే రోహన్ గుప్తా. -
ప్రేమికుల సంశయం
అనిరుథ్ కస్తూరి, దివ్య జంటగా మహేష్ చెంగారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సంశయం’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మోషన్ పోస్టర్ను విడుదల చేయనున్నారు. మహేష్ మాట్లా డుతూ– ‘‘ప్రేమించడానికి, ప్రేమించనని చెప్పడానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి యువతరం ప్రేమను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్న విషయాన్ని చర్చించాం. ప్రేమను కొత్త కోణంలో చూపించాం. నటీనటులంతా ఎన్ఆర్ఐలు కావడం విశేషం. అందరూ కొత్తవారే అయినప్పటికి అనుభవం ఉన్నవారిలా నటించారు. ఈ చిత్రానికి ఈ టైటిల్నే ఎందుకు పెట్టామనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అని అన్నారు. -
ప్రియుడి హత్య.. పరువు హత్య కానేకాదు..
సాక్షి, చెన్నై: ‘ఓ ప్రేమజంట కులాంతర వివాహం ఏడేళ్ల క్రితం మూడు గ్రామాల్ని కన్నీటి మడుగులో ముంచింది. వందలాది ఇళ్లు భష్మీపటలం అయ్యాయి. ఆ తదుపరి పరిణామాలతో ప్రియుడు రైలు పట్టాలపై శవంగా తేలడం రాష్ట్రంలో ఓ సామాజిక వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ను రంగంలోకి దించక తప్పలేదు. ఎట్టకేలకు ఈ కేసులో ప్రియుడి హత్య పరువు హత్య కానే కాదని, ఇది ఆత్మహత్య అని తేల్చుతూ ఆ కమిషన్ సమర్పించిన నివేదిక ఆదివారం ఓ వెబ్సైట్లో ప్రత్యక్షం అయింది. దర్మపురి జిల్లా చెల్లం కోట్టైకు చెందిన నాగరాజన్ కుమార్తె దివ్య (21), అదే జిల్లా నాయకన్ కోట్టై నత్తం కాలనికి చెందిన ఇళంగోవన్ కుమారుడు ఇలవరసన్ (23)ల ప్రేమ వివా హం ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో పెద్ద వివాదానికి దారి తీసింది. కుమార్తె కులాంతర వివాహంతో నాగరాజన్ ఆత్మహత్య చేసుకోవడం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ సామాజిక వర్గాలకు చెందిన రాజకీయ పార్టీలు సైతం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ సామాజికవర్గం ఆగ్రహానికి మరో సామాజిక వర్గానికి చెందిన మూడు గ్రామాలు కన్నీటి మడుగులో మునిగాయి. వందలాది ఇళ్లు భష్మీ పటలం అయ్యాయి. ఈ వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. చివరకు ఇరు సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు రంగంలోకి దిగి ఈ జంటను విడగొట్టే యత్నం చేశారు. తామిద్దరం కలసి జీవిస్తామని ఈ ప్రేమజంట తొలుత స్పష్టం చేసినా, చివరకు ఏమి జరిగిందో ఏమోగానీ దివ్య మాత్రం తన తల్లి వెన్నంటి వెళ్తున్నట్టుగా కోర్టులో ప్రకటించింది. దివ్య దూరం కావడంతో తీవ్ర మనోవేదనలో ఇలవరసన్ పడ్డాడు. దివ్య తన తల్లి వెంట వెళ్లిన కొద్ది రోజులకు ధర్మపురి ఆర్ట్స్ కళాశాల వెనుక ఉన్న రైల్వే ట్రాక్లో ఇలవరసన్ మృతదేహం బయట పడింది. పరువు హత్యే అంటూ దళిత సామాజిక వర్గానికి చెం దిన సంఘాలు, రాజకీయపార్టీలు మరో సా మాజిక వర్గంకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని ప్రదర్శించాయి. ధర్మపురి జిల్లానే కాదు, కృష్ణగిరి, సేలం జిల్లాల్లో సైతం పరిస్థితి ఉద్రిక్తంగా మా రే రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. రంగంలోకి సింగార వేలు కమిషన్.. ఈ కులాంతర ప్రేమ వివాహం, ప్రియుడి అనుమానాస్పద స్థితి వ్యవహారం చివరకు పీఎంకే, వీసీకేల మధ్య వివాదాన్ని రేపే పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో విచారణ సీబీసీఐడీకి అప్పగించారు. ధర్మపురి కోర్టులో సీబీసీఐడీ చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చార్జ్షీట్లో తేల్చారు. దీనిని ఇలవరసన్ కుటుం బీకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన పార్టీలు, సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు రిటైర్డ్ జడ్జి సింగార వేలు నేతృత్వంలో ప్రత్యేక కమి షన్ రంగంలోకి దిగింది. ఈ కమిషన్ కొన్నేళ్లుగా విచారణ సాగించి, సమగ్ర సమాచారాలు, ఆధారాలతో నివేదికను సిద్ధం చేసి, గత ఏడాది ఆగస్టులో సీఎం పళనిస్వామికి సమర్పించింది. అయితే, ఆ నివేదికలో ఏమున్నదో అన్నది బహిర్గతం కాలేదు. బయట పెట్టాల్సిందేనని దళిత సామాజిక వర్గానిక చెందిన సంఘాలు, పార్టీలు నినదిస్తూ వచ్చాయి. అయితే, ఆ నివేదిక బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఈ నివేదిక ఓ వెబ్సైట్లో ప్రత్యేక్షం కావడం గమనార్హం. 1300 పేజీలతో తన నివేదికను సింగార వేలు సిద్ధం చేసి సమర్పించారు. వన్నియర్ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గానికి చెందిన వారి వద్ద జరిపిన విచారణ, తటస్థంగా ఉన్న వ్యక్తుల వద్ద సాగించిన విచారణ, వాంగ్మూలం, సేకరించిన వివరాలు అందులో పొందు పరిచారు. ఇలవరసన్ మృతదేహం పడి ఉన్న చోట లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక, వైద్యపరంగా సేకరించిన సమాచారాలు, అన్ని రకాల వివరాలను సేకరించి, వాటి ఆధారంగా ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారించి ఉండడం గమనార్హం. దివ్య దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉన్నట్టుగా నివేదికలో తేల్చి ఉన్నట్టుగా వివరాలు ఆ వెబ్ సైట్లో పేర్కొన బడి ఉంది. ఇలవరసన్ మరణం ఆత్మహత్యే గానీ, పరువు హత్య కాదు అని ఆ కమిషన్ స్పష్టం చేసి ఉండడంతో, పీఎంకే నేత రాందాసు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విడుదల చేసిన ప్రకటనలో తమపై నిందల్ని వేసే విధంగా గతంలో వ్యవహరించిన వాళ్లు, పరువు హత్య కాదని తేలడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అని సవాల్ చేయడం గమనార్హం. -
తల్లిదండ్రులు మందలించారని..
కుషాయిగూడ: తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హెచ్బీకాలనీ, కృష్ణానగర్కు చెందిన అంప దివ్యజ్యోతి అలియాస్ ప్రభావతి (19) ప్రైవేటు ఉద్యోగి. అయితే మృతురాలు ఓ యువకుడిని ప్రేమిస్తుంది. అతడికి మరో అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా మృతురాలు అతనితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
పెళ్లయిన వారం రోజులకే యువతి..
మేడ్చల్రూరల్: పెళ్లయిన వారం రోజులకే ఓ యువతి అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామానికి చెందిన యాదమ్మ, నర్సింహ్మ దంపతుల కూతురు దివ్య (21)కు ఈ నెల 22న మెదక్ జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన మహేశ్తో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ నెల 27న దివ్య తన భర్త మహేశ్తో కలిసి కండ్లకోయలోని పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె తల్లి యాదమ్మ డ్యూటీకి వెళ్లిపోయింది. దివ్య తన భర్త మహేశ్, తండ్రి నర్సింహలకు భోజనం వడ్డించి తానూ భుజించింది. సాయంత్రం తల్లి యాదమ్మ విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంది. 28న ఉదయం యాదమ్మ డ్యూటీకి వెళ్లిపోయింది. తనకు ఆదాయ సర్టిఫికెట్ తీసుకురావాలని తండ్రి నర్సింహను దివ్య బయటికి పంపించింది. ఇంట్లో ఉన్న భర్త మహేశ్ నిద్రిస్తుండడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. విషయం గమనించిన కుటుంబికులు దివ్య ఆచూకీ కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో గురువారం మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. దివ్య తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముసుగుల వెనుక రహస్యం
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ లాంటి సందేశాత్మక, కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా నటించారు. ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. బి.బాపిరాజు మాట్లాడుతూ–‘‘ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో కథ సాగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ చిత్రాల్ని మించిన వినోదంతో పాటు చక్కటి మెసేజ్ ఉంటుంది’’ అన్నారు పి.సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారియో, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
కాంట్రవర్సీ కోసం మాట్లాడలేదు
‘‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’’ చిత్రాల పుణ్యమా అని, లిప్లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. దర్శకులు, నిర్మాతలు, రచయితలు సామాజిక బాధ్యతతో సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను’’ అని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నటి–దర్శకురాలు జీవితారాజశేఖర్ అన్నారు. వరుణ్, దివ్య జంటగా నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. సినిమాలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సోషల్ మీడియాలో, టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదించవచ్చు. నిజమే.. ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూమ్లో కూర్చొని ఒంటరిగా చూస్తాం. సినిమా అనేది వందల మందితో కలిసి చూసేది. మీ కార్యక్రమానికి (‘డిగ్రీ కాలేజ్’ టీమ్ను ఉద్దేశిస్తూ) వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు. ఈ ట్రైలర్ని చూసి నా మనసుకు అనిపించినది చెబుతున్నాను’’ అన్నారు. నరసింహనంది మాట్లాడుతూ ‘‘గతంలో సందేశాత్మక సినిమాలు చేశాను. అవార్డులు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. ‘హైస్కూల్’ చిత్రానికి వచ్చాయి. నాదైన నవ్య పంథాలో ఈ సినిమా తీశాను. ట్రైలర్ చూసి సినిమా మొత్తం వల్గర్గా ఉంటుందని అనుకుంటున్నారు. ఇందులో మంచి కంటెంట్ ఉంది. వాస్తవిక సంఘటనలకు సినిమాటిక్ అంశాలను పొందుపరిచి, ఈ సినిమా చేశాం. లిప్ లాక్లు, శృంగారభరిత సన్నివేశాలు కథ డిమాండ్ మేరకే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డిలతో తదితరులు పాల్గొన్నారు. -
మృత్యుంజయురాలు దివ్య..
సుల్తాన్బజార్: నాలుగేళ్ల దివ్య.. మృత్యుంజయురాలై తిరిగొచ్చింది..తమ కుమార్తె అంత ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో బయటకు రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ అసలేం జరిగిందంటే..గౌలిగూడ టెలిఫోన్ కేంద్రం వద్ద చంద్రకాంత్ అనే కార్పెంటర్ నివాసముంటున్నాడు. ఇతనికి వెన్నెల(8), దివ్య(4) ఇద్దరు కూతుళ్లు. ఆదివారం ఉదయం చిన్నారులిద్దరూ టిఫిన్ తినేందుకు టెలిపోన్ కేంద్రం వద్దకు వచ్చారు. తరువాత ఇంటికి వెళుతుండగా దివ్య మూత్ర విసర్జనకు వెళ్లింది. అయితే అక్కడే కచ్చామోరీపై పెద్ద రంధ్రం ఉంది.ఇది గమనించకపోవడంతో దివ్య అందులో పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ కేంద్రం అధికారి రాజకుమార్ గౌడ్కు సమాచారం అందించారు. ఫైర్సిబ్బంది క్రాంతికుమార్, సురేష్, రమణ, వసంతరావులు అక్కడికి చేరుకుని నిచ్చెన, తాడుతో క్రాంతికుమార్ కాలువలోపలికి దిగారు.లోపల చిన్నారి కనిపించకపోవడంతో కాసేపు ఆందోళన చెందారు.తరువాత ఏడుపు వినిపించడంతో టార్చ్లైట్తో మొత్తం వెతికారు. కాలువలో కొద్ది దూరంలోనే బురదలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది. దీంతో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కూతురు క్షేమంగా బయటకు రావడంతో ఆ తల్లిదండ్రులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
ముసుగుల రహస్యం ఏంటి?
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ లాంటి సందేశాత్మక కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్లపై ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బి.బాపిరాజు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్స్లో గతంలో విడుదలైన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలకు సీక్వెల్గా ‘రొమాంటిక్ క్రిమినల్స్’ తెరకెక్కించాం. ముసుగుల వెనుక ఉన్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలను మించిన వినోదంతో పాటు సమాజానికి మంచి మెసేజ్ ఈ చిత్రంలో ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేసి, మేలో సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారోయో, కెమెరా: ఎస్.వి. శివరామ్, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
శిక్ష తప్పదు
ఇరుకళల పరమేశ్వరి ప్రొడక్షన్ పతాకంపై నెట్రంబాక హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో న్. హరిత ప్రియా రెడ్డి నిర్మించిన చిత్రం ‘సిబిఐ వర్సెస్ లవర్స్’. వంశీ, జైన్ నాని, దివ్య, శ్రావణి నిక్కి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రంలో సుమన్ , సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేశారు. ఘన శ్యామ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సుమన్ ఆవిష్కరించి, సత్య ప్రకాష్కు ఇచ్చారు. ‘‘థియేటర్స్ విషయంలో చిన్న చిత్రాలకు ప్రభుత్వం అండగా నిలిస్తే మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సుమన్. ‘‘తొందరపాటు నిర్ణయాల వల్ల విద్యార్థులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే కథతో నిర్మించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం. నెక్ట్స్ ‘బ్రహ్మముహూర్తం’ పేరుతో సినిమా నిర్మించబోతున్నాం’’ అన్నారు హరిత ప్రియారెడ్డి. ‘‘తప్పు చేసినవారికి శిక్ష తప్పదనే సందేశం ఇస్తున్నాం’’ అన్నారు హరి ప్రసాద్రెడ్డి. -
నా కూతురి ప్రాణం కాపాడండి
విశాఖపట్నం , అల్లిపురం(విశాఖ దక్షిణ): జీబీ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తె దివ్య ప్రాణం కాపాడాలని ఆమె తల్లిదండ్రులు మజ్జి శ్రీనివాసరెడ్డి, జయలక్ష్మిలు వేడుకుంటున్నారు. అల్లిపురంలోని అమ్మవారివీధికి చెందిన మజ్జి దివ్య గతేడాది డిసెంబర్ 31న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నడుము నుంచి కింద భాగం మొత్తం అచేతనంగా మారి కాలు కదల్లేని పరిస్థితిలో నగరంలో ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై గత నెల 18న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దాతలు స్పందించి తోచిన ఆర్థిక సాయం చేశారు. దాతల సాయంతో ఆమెకు చికిత్స అందజేసినా.. ఇంకా దివ్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఆమె కోలుకోవాలంటే మరో రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్టు దివ్య తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత తమకు లేదని, దాతలు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటి వరకు తమకు చేయూతనిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సహాయం చేయాలనుకునే దాతలు ఎస్.సురేష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెడ్నెమ్ గార్డెన్స్ బ్రాంచ్, ఎస్బీ ఖాతా నంబర్ 20033585049, ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్ ఎస్బీఐఎన్0000952 ద్వారా గాని, పేటీఎం, గూగుల్ పే, పోన్ పే నుంచి 78424 73149 నంబర్ ద్వారా సహాయం చేయాలని వేడుకుంటున్నారు. -
నేర చరిత్ర
మూవీ మొఘల్ ప్రొడక్షన్స్పై అజర్ షేక్ నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్’. దాసరి గంగాధర్ దర్శకునిగా పరిచయ మవుతున్నారు. కిశోర్, దివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా ఇది నా తొలి సినిమా. నా మీద ఉన్న నమ్మకంతో నిర్మాతకు నన్ను పరిచయం చేసిన రాముగారికి థ్యాంక్స్. కథ విషయానికొస్తే ఏ ఊరికైనా నేర చరిత్ర ఉంటుంది. రాత్రి సమయంలో జరిగే క్రైమ్ ఇన్సిడెంట్ని తీసుకొని అల్లుకున్న కథ ఇది. ఇప్పటివరకు ప్రపంచం చూడని నేర సామ్రాజ్యాన్ని నా సినిమాలో చూపించబోతున్నా’’ అన్నారు. అజర్ షేక్ మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రయాణంలో ఇదే తొలి మెట్టు. గంగాధర్ చెప్పిన ఈ కథ నచ్చి నిర్మించడానికి ఒప్పుకున్నాను. జనవరిలో షూటింగ్ ప్రారంభించి మార్చిలో సినిమాని పూర్తి చేస్తాం’’ అన్నారు. -
కాంగ్రెస్ ‘సోషల్ మీడియా’లో ముసలం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ‘సోషల్ మీడియా టీమ్’లో ముసలం పుట్టింది. అందులో నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నట్లు వస్తున్న వార్తలు కాంగ్రెస్ పార్టీని కూడా నిరాశ పరుస్తున్నాయి. ఈ రెండు నెలల కాలంలోనే మొత్తం 40 మంది గల పార్టీ సోషల్ మీడియా బంధం నుంచి ఎనిమిది మంది బయటకు వచ్చినట్లు వారు ఇతర సంస్థల ఇంటర్వ్యూలకు హాజరవడం ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని పార్టీ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ఉద్యోగులు కూడా ధ్రువీకరించారు. అందరూ కూడా టీం ఇంచార్జి దురుసు, తిక్క ప్రవర్తనే ప్రధాన కారణమని చెబుతున్నారు. అక్కడ లేడీ బాస్కు తోటి ఉద్యోగులంటే లెక్కలేకుండా పోయిందని, ఉద్యోగులను మందలించాల్సి వచ్చినప్పుడు ఆమె పది మందిలో పరువు తీసేవారని, మాటిమాటికి ఉద్యోగం పీకేస్తానంటూ బెదిరించేవారని ఇప్పటికే బయటకు వచ్చిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దాదాపు 250 మందితో అధికార పక్షం బీజేపీ మీడియా సవ్యంగా పనిచేస్తుండగా, కేవలం 40 మంది సభ్యులుగల కాంగ్రెస్ మీడియాలో కలహాలు రేగడం పట్ల ఆ పార్టీలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడిప్పుడే బలపడుతుందని భావిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాలో 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ప్రతికూలమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకన్నా దాదాపు ఆరేళ్లు ఆలస్యంగా, 2015లో ట్విట్టర్ ఖాతాను తెరచిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్, ఫేస్బుక్, స్నాప్షాట్ తదితర సోషల్ మీడియాలో పార్టీ ప్రచారం కోసం 2017లో రమ్యా అలియాస్ దివ్యా స్పందనను తీసుకొచ్చి బాస్గా కూర్చోబెట్టారు. ఏడు కన్నడ, ఆరు తమిళ సినిమాలతోపాటు తెలుగులో ‘అభిమణ్యు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన దివ్యా స్పందన అత్యంత పిన్న వయస్సులో ఎంపీగా రికార్డు కూడా సష్టించారు. కర్ణాటకకు చెందిన ఆమె 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరి కర్ణాటకలోని మాంధ్య పార్లమెంట్ నియోజక వర్గానికి 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి సినిమాలు, కాంగ్రెస్ యువజన రాజకీయాలను చూస్తున్న ఆమె, 2016లో సినిమాలకు గుడ్బై చెప్పారు. దాంతో ఆమెను తీసుకొచ్చి 2017లో కాంగ్రెస్ సోషల్ మీడియాకు హెడ్ను చేశారు. బాస్ చెప్పారు కాబట్టి తప్పలేదు సోషల్ మీడియాలో ఓ ఉద్యోగిపై తోటి ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు ఆ కేసును డీల్ చేయడంలో కూడా దివ్యా స్పందన విఫలమయ్యారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఉద్యోగులు తెలిపారు. ఈ కేసులో సంస్థ అంతర్గత కమిటీ విచారణను పూర్తి చేయక ముందే నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారని, నిందితుడు బెయిల్పై విడుదలయ్యాక అతను అలాంటి వాడు కాదంటూ 29 మంది ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకొని దివ్యా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రచారం నడిపారని వారంటున్నారు. లైంగిక ఆరోపణలు నిజమా, కాదా ? అన్నది తమకు తెలియదని, బాస్ చెప్పారు కనుక సదరు ఉద్యోగి మంచివాడేనంటూ తాము సంతకాలు చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు. ఏమీ చెప్పరు.. లేడీ బాస్ ప్రవర్తనే కాకుండా పార్టీ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా తమకు నచ్చడం లేదని, పార్టీలో భాగంగా చూడాల్సిన సంస్థను పోటీ సంస్థగా చూస్తున్నారని కొంత మంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కమ్యూనికేషన్ల విభాగం తమకు ఏ మాత్రం సహకరించడం లేదని, విలేకరుల సమావేశం ఉన్నా చివరి నిమిషం దాకా తమకు చెప్పరని వారన్నారు. అవసరమైనప్పుడు పార్టీ ‘వైఫై’ నెట్వర్క్ను ఉపయోగించుకోవడానికి కూడా పార్టీ నాయకులు అనుమతించరని వారు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం తమకు బాధాకరమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని వారు వ్యాఖ్యానించారు. -
కలలు కనాలి.. నెరవేర్చుకోవాలి
పటమట (విజయవాడ తూర్పు): విద్యర్థులు తమ జీవితాశయం ఏమిటో చిన్ననాటి నుంచే కలలు కనాలని, వాటిని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయాలని మహిళా బోయింగ్ పైలెట్ అన్నే దివ్య పేర్కొన్నారు. బోయింగ్ 777 విమానానికి తొలి కమాండర్గా చరిత్ర సృష్టించిన అన్నే దివ్య బెంజిసర్కిల్ వద్ద ఉన్న వాసవ్య మహిళా మండలిలో బుధవారం సందడి చేశారు. ఇక్కడ ఉంటున్న బాలికలతో కాసేపు ముచ్చటించారు. చిన్నారులకు స్ఫూర్తి కలిగించేలా మాట్లాడారు. తాను మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయినేనని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, తపన, కృషి, పట్టుదల ఉన్నప్పుడు విజయం వరిస్తుందన్నారు. వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రశ్మీ, మహిళా మిత్ర సభ్యులు ఉన్నారు. -
కేటీఆర్కు రాఖీ కట్టిన చిన్నారి దివ్య
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాఖీ బహుమతిగా ఆపన్నహస్తం అందించారు. గత ఏప్రిల్లో కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్కు చెందిన 9 ఏళ్ల దివ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కిరాయి ఆటోని నడుపుకుని జీవనోపాధి పొందుతున్న ఆమె తండ్రి చికిత్సకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడని స్థానిక టీఆర్ఎస్ యువజన నాయకుడు జగన్మోహన్రావు ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి దివ్యకు చికిత్స అందించాలని నిమ్స్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో దివ్య ఎడమకాలిని పోగొట్టుకోవడం విషాదంగా మారింది. ఆపదలో అన్నలా ఆదుకున్న కేటీఆర్కు రాఖీ కట్టాలన్న తన ఆకాంక్షని దివ్య వెలిబుచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆమెను ఆదివారం తన ఇంటికి పిలిపించుకుని రాఖీ కట్టించుకున్నారు. ఆమెకు కృత్రిమ అవయవాన్ని అందించారు. అవసరమైతే మరింత సహాయం దివ్యకు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే తనతో రాఖీ కట్టించుకోవడమే పెద్ద బహుమతి అన్న దివ్య, ఇంకేం వద్దంటూ మంత్రికి తెలిపింది. దివ్య తండ్రి కిరాయి ఆటో నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి, త్వరలోనే అయనకు ఒక కొత్త ఆటోను రాఖీ బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యను అన్నలా ఆదుకున్న మంత్రి తారక రామారావుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు తమ ఆనందన్ని వ్యక్తం పరిచారు. కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత మంత్రి కేటీఆర్కు ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ కట్టారు. కేటీఆర్ సతీమణి శైలిమ కూడా కవిత భర్త అనిల్ కుమార్కు రాఖీ కట్టారు. -
ఆ కేసులో కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ సభ్యుడిని మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఐటీ సెల్లో పనిచేసే చిరాగ్ పట్నాయక్ తనను లైంగికంగా వేధించాడని గతంలో ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్నాయక్ను నార్త్ ఎవెన్యూ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. బాధితురాలు మేజిస్ర్టేట్ ఎదుట తన స్టేట్మెంట్ను రికార్డు చేసిన క్రమంలో నిందితుడిని అదుపుతోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పట్నాయక్ సోషల్ మీడియా మేనేజర్గా ఉన్న సమయంలో బాధితురాలు కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్లో సభ్యురాలిగా ఉన్నారు. నిందితుడు పలు సందర్భాల్లో తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడని, తన వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకువచ్చేలా ప్రవర్తించాడని ఢిల్లీ పోలీస్ కమీషనర్ అమ్యూ పట్నాయక్, ఇతర సీనియర్ అధికారులకు ఈమెయిల్లో ఫిర్యాదు చేశారు. కాగా పట్నాయక్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా హెడ్ దివ్య స్పందన విస్మయం వ్యక్తం చేశారు. పట్నాయక్ను సమర్ధిస్తూ 39 మంది పార్టీ కార్యకర్తల సంతకాలతో కూడిన స్టేట్మెంట్ను ఆమె తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతోనే తాను టీమ్ నుంచి వైదొలగుతున్నట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారని చెప్పారు. -
లైఫ్లో ఏదీ సులభంగా అందదు
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని అంటారు. ఇప్పుడు దానిని కాస్త మార్చి మహిళా సీఈవోలను చూసి, కంపెనీలని చూడాలని అంటున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో అత్యున్నత పదవులకు మహిళల నియామకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దినట్టే మహిళలు కంపెనీనీ సమర్థంగా నిర్వహిస్తారనే భావన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ తమ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా (సీఎఫ్ఓ) మొట్టమొదటిసారిగా ఒక మహిళను నియమించింది. భారత్లోని చెన్నైకి చెందిన దివ్య సూర్యదేవరను సీఎఫ్ఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.జనరల్ మోటార్స్లో దివ్య 2005 సంవత్సరంలో చేరారు. వివిధ స్థాయిల్లో ఎన్నో పదవులు నిర్వహించారు. 2017 జూలై నుంచి ఆమె కార్పొరేట్ ఫైనాన్స్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. సెప్టెంబర్ నుంచి సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే జనరల్ మోటార్స్ కంపెనీ సీఈవోగా మేరీ బర్రా అనే మహిళే ఉన్నారు. అంతే కాకుండా హెర్షే కో, సిగ్నెట్ జ్యుయలర్స్ వంటి ప్రసిద్ధ కంపెనీలకు సీఈవో, సీఎఫ్ఓలుగా మహిళలే ఉన్నారు. ‘‘పెద్ద పెద్ద కంపెనీలన్నీ అత్యున్నత స్థాయి పదవుల్లో మహిళల్నే నియమించడం నిజంగా గర్వ కారణం. ఇది సంబరాలు చేసుకునే సమయం’’ అని మహిళలు అత్యున్నత స్థాయికి వెళ్లడానికి శిక్షణనిచ్చే స్వచ్ఛంద సంస్థ సీనియర్ డైరెక్టర్ అన్నా బెనింగర్ వ్యాఖ్యానించారు. చదువులకోసం అప్పులు బ్యూక్, కాడిలాక్, చావర్లెట్ వంటి కార్లను రూపొందించే అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీ జనరల్ మోటార్ ఆర్థిక వ్యవహారాల బాధ్యతల్ని చూడటం అంటే ఆషామాషీ కాదు. ఈ స్థాయికి దివ్య ఎదగడం వెనుక ఆమె అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయి. తాను చేరిన సంస్థలోనే అత్యున్నత స్థాయికి ఎదగడంతో దివ్య ఆనందం పట్టలేకపోతున్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నతనంలో తను ఎన్ని కష్టాలు పడ్డారో గుర్తు చేసుకున్నారు. ‘‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. దీంతో అమ్మ ఒక్కతే రెక్కలు ముక్కలు చేసుకుంటూ మమ్మల్ని పెంచింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అప్పోసొప్పో చేసి మరీ చదివించింది. పెద్ద చదువులు చదివి పైకి ఎదగాలని మా అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది. జీవితంలో ఏదీ సులభంగా అందదని నాకు చిన్నవయసులోనే అర్థమైంది. ఉన్నత చదువుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఉద్యోగం వచ్చాక నేనే చెల్లించాను. అమెరికాకు వచ్చాక సాంస్కృతిక తేడాల కారణంగా అలవాటు పడటానికి సమయం పట్టింది’’ అంటూ ఆమె తన మనోగతాన్ని వెల్లడించారు. మద్రాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివి దివ్య ఆ తర్వాత అమెరికాకు వచ్చేశారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్లో తొలుత ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 25 ఏళ్లకే జనరల్ మోటార్లో చేరారు. దివ్యలో ప్రతిభ, ఆమె అనుభవం, నాయకత్వ లక్షణాలతో జీఎం మంచి వాణిజ్యపరమైన లాభాలు చూసిందని ఆ సంస్థ కొనియాడింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అన్నీ తానై!
ప్రతిభకు కష్టం తోడైతే గెలుపు మార్గం కనిపిస్తుంది. ఆ గెలుపు మార్గంలో వెళ్తున్న ఓ యంగ్ టాలెంటెడ్ టీనేజ్ సింగర్ని కొందరు మాటలతో ఓడించాలని ట్రై చేశారు. ఫైనల్లీ ఆ అమ్మాయే గెలిచింది. కానీ ఈ గెలుపులో ఐశ్యర్యారాయ్ ఆ అమ్మాయికి అన్నీ తానై అండగా నిలబడి, అభయమిచ్చారు. హిందీ చిత్రం ‘ఫ్యాన్నీఖాన్’ కథ ఇలానే ఉండబోతుందని బీటౌన్ టాక్. ఐశ్యర్యారాయ్, అనిల్ కపూర్, రాజ్కుమార్ రావ్, దివ్య ముఖ్యతారలుగా నటిస్తోన్న చిత్రం ‘ఫ్యాన్నీఖాన్’. ఈ సినిమాలో సింగర్ పాత్రలో ఐశ్యర్యారాయ్ బచ్చన్ కనిపించనున్నారు. ట్యాక్సీ డ్రైవర్గా అనిల్కపూర్ కనిపించనున్నారట. సినిమాలో అనిల్ కపూర్కి ఓ కూతురు ఉంటుంది. తను టాలెంటెడ్ సింగర్. సీనియర్ సింగర్ అయిన ఐశ్యర్య ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తారట. అదెలా అనేది స్క్రీన్పై చూడాల్సిందే. ఈ సినిమాలో ఐశ్యర్య లుక్ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది రంజాన్కు ‘ఫ్యాన్నీఖాన్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సల్మాన్ ‘రేస్ 3’తో రంజాన్కు రెడీగా ఉన్నారు. మరి.. సల్మాన్ వర్సెస్ ఐశ్యర్యలో ఎవరు వెనక్కి తగ్గుతారన్న చర్చ బాలీవుడ్లో జరుగుతోంది. -
మామగారి కానుక
అబ్బాయిల్లో అనుష్కా శర్మకు పెద్ద ఫ్యాన్ ఫాలోయిం ఉంది. వాళ్లందరిలో ఫ్యాన్ బాయ్ నెంబర్ 1 విరాట్ కోహ్లీ. అమ్మాయిల్లో విరాట్కు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. వాళ్లందరిలో ఫ్యాన్ గర్ల్ నెంబర్ 1 అనుష్క. విరాట్ సెంచరీ చేసిన ప్రతిసారీ ఫస్ట్ విజిల్ అనుష్కదే. అనుష్క కొత్త సినిమా వస్తున్న ప్రతిసారీ ఆ మూవీ గురించి ఎక్కువగా మాట్లాడేది కోహ్లీనే. ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇప్పుడు భారతదేశానికి యువ ఆదర్శ దంపతులు. ఈ దంపతులకు ఇప్పుడు విరాట్ అత్తమామలు (అనుష్క పేరెంట్స్) అజయ్ కుమార్ శర్మ, అషిమలు కూడా ఫ్యాన్స్ అయినట్లున్నారు. వర్ధమాన కవయిత్రి తేజస్వినీ దివ్యా నాయక్ రాసిన తొలి పుస్తకం ‘స్మోక్ అండ్ విస్కీ’ ఆవిష్కరణ సభకు భార్యతో కలిసి వెళ్లిన విరాట్ మామగారు... ఆ సభా ప్రాంగణంలోనే క్యూలో నిలబడి మరీ.. తేజస్విని సంతకం ఉన్న రెండు పుస్తకాలను కొని, వాటిని విరాట్ అనుష్కల కోసం దాచి ఉంచారు! అనుబంధాలపై రాసిన 42 కవితల సంకలనం ‘స్మోక్ అండ్ విస్కీ’. ప్రస్తుతం విరాట్ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అనుష్క.. షారుక్ ఖాన్తో కలిసి నటిస్తున్న ‘జీరో’ చిత్రం షూటింగ్లతో బిజీగా ఉంది. ఈ జంటను ఒకటిగా చూడడం కోసం రెండు కుటుంబాల వాళ్లు ఎదురు చూస్తున్నట్టే.. కరణ్ జోహార్ కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ‘కాఫీ విత్ కరణ్ షో’లో వీళ్లను కలిపి చూపాలని టీవీ చానల్స్ కూడా తహతహలాడుతున్నాయి. అంతవరకు మనం విరాట్ క్రికెట్ విన్యాసాలతో, మార్చి 2న విడుదల కాబోతున్న ‘పరీ’ సినిమాతో సంతృప్తి పడవలసిందే! కవయిత్రి తేజస్వినీ దివ్య నాయక్ -
దివిలో ‘దివ్య’ పథం
గన్నవరం: ప్రపంచంలోనే అతి పిన్న వయసులోనే బోయింగ్ 777 విమానం నడిపిన తొలి మహిళా కమాండర్గా గుర్తింపు పొందిన యానీ దివ్య శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ముంబై విమాన సర్వీస్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. దివ్య తండ్రి పఠాన్కోట్లో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగిగా పనిచేశారు. ఆమె అక్కడే జన్మించారు. తండ్రి పదవీ విరమణ అనంతరం ఆమె కుటుంబం స్వస్థలమైన విజయవాడకు వచ్చి స్థిరపడింది. విజయవాడలోనే పాఠశాల విద్య పూర్తి చేసిన దివ్య 17 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో చేరి పైలట్ శిక్షణ పూర్తిచేసుకుంది. 19 ఏళ్లకే ఎయిరిండియాలో కెరీర్ ప్రారంభించింది. తర్వాత స్పెయిన్, లండన్లో బోయింగ్ 737 విమాన పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేసుకుని 21 ఏళ్ల వయస్సులో అతిపెద్ద విమానం బోయింగ్ 777 నడపడం ప్రారంభించింది. అతి చిన్న వయసులో బోయింగ్ నడిపిన తొలి మహిళగా దివ్య ప్రపంచాన్ని ఆకర్షించారు. ఎయిరిండియాలో ఆమెకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్నప్పటికి టికెట్ కొనుగోలు చేసి ముంబైకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. -
స్వచ్ఛతకు ‘దివ్యో’పాయం
సాక్షి, ఆదిలాబాద్: వంద శాతం స్వచ్ఛ ఆదిలాబాద్ సాధించేందుకు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వినూత్న ఆలోచన చేశారు. మండలాల్లో అధికారులకు రెండు గ్రామాల చొప్పున కేటాయించి లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మండల అధికారు లు, వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ సిబ్బందికి ఈ లక్ష్యాన్ని కేటాయించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. లక్కీ డ్రా ద్వారా గ్రామాలను అప్పగించారు. లక్ష్యం లో ఫిబ్రవరిలో 50 శాతం, మార్చిలో 50 శాతం లో పూర్తి చేసేలా ఆలోచన చేసి ముందుకు కదులుతున్నారు. ఆమె అనుకు న్న విధంగా మార్చి లో పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రభుత్వ లక్ష్యం మేరకు గడువు కంటే ముందే స్వచ్ఛ ఆదిలాబాద్ సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో దశలో 165 జీపీల్లో స్పెషల్డ్రైవ్.. రాష్ట్ర స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)ఆధ్వర్యం లో అన్ని జిల్లాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో గ్రామీణ నీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కం ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణాలు చేపట్టారు. ఆ తర్వాత గతేడాది జూన్ నుంచి ఆర్డబ్ల్యూఎస్, ఉపాధిహామీల నుంచి ఐహెచ్హెచ్ఎల్ను నిలిపివేసి పూర్తిగా డీఆర్డీఓలోని ఎస్బీఎంకు బదలాయించారు. జిల్లాలో మొదటి దశలో 78 గ్రామపంచాయతీల్లో వ్యక్తిగ త మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ గ్రామపంచాయతీల్లో 20వేలకు పై గా లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 11వేలకు పై గా పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 9వేలు పూర్తి చేయాల్సి ఉంది. ఇక మిగిలి న 165 గ్రామపంచాయతీలను రెండో దశ కింద తీసుకొని ఈ స్పెషల్డ్రైవ్ను కలెక్టర్ అమలు చే స్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, నీటిపారుదల శాఖ, గిరిజన సం క్షేమ శాఖ, ఎన్ఆర్ఈజీఎస్లోని ఇంజినీరింగ్ శాఖ సిబ్బంది సహకారంతో ఎంపీడీవోలు, ఈఓపీఆర్డీలు, ఏపీఎంలు, ఏపీవోలు ఈ కార్యం లో పాల్గొంటున్నారు. చెరో రెండు గ్రామాలను టాస్క్గా కేటాయించారు. ఈ గ్రామాలను లక్కీ డీప్ ద్వారా వారికి కేటాయించారు. రెండు గ్రామాల్లో ఒకటి ఫిబ్రవరి, మరొకటి మార్చిలో తీసుకొని ఆ గ్రామాలను ఓడీఎఫ్గా మార్చేందుకు కృషి చేయాలి. తద్వారా 165 గ్రామపంచాయతీలను 80 మందికి పైగా అధికారులకు బాధ్యతలు అప్పగించి ఈ కార్యాన్ని సఫలీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటికి మరుగుదొడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కలుషితం కారణంగా అనేక రోగాలు ప్రబలి పర్యావసనంగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా పారిశుధ్య లోపం కారణంగానే ఈ పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నీటిని కలుషితం చేస్తోంది. గ్రామాల్లో ఇప్పటికీ ఇది ప్రధాన సమస్యగా ఉందంటే నమ్మాల్సిందే. పారిశుధ్యం మెరుగుపర్చాలంటే ప్రధానంగా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగించడం ముఖ్యమని ప్రజల్లో భావన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత ప్రవర్తన కారణాలతో పలువురు మరుగుదొడ్డి నిర్మాణాలకు ముందుకు రాకపోవడం సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో గౌరవం, గోప్యత, సురక్షిత, సాంఘికస్థితి తెలియజేసేందుకు ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం క్లీన్ ఇండియా నినాదంతో 2019 అక్టోబర్ 2కు స్వచ్ఛభారత్ నిర్మించాలనే ఉద్దేశ్యంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)అనే కార్యక్రమాన్ని చేపట్టి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. 2018 అక్టోబర్ 2 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకుంది. గత ప్రభుత్వాల హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పెద్దఎత్తున మరుగు దొడ్డి సామగ్రి కొనుగోలు చేసినప్పటికీ నిర్మా ణాలు జరగకపోవడం, సామగ్రి కూడా వృథా అయినటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. బేస్లైన్ సర్వే 2012 ప్రకారం స్వచ్ఛభారత్లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు లేని ఇళ్ల సముదాయాలను గుర్తించడం జరిగింది. జనవరి 31లోగా పరిపాలన ఆమోదం తీసుకోవాలి.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగిరం చేసేందుకు కలెక్టర్ వినూత్న ఆలోచన చేశారు. లక్కీడీప్ ద్వారా అధికారులకు గ్రామాలను కేటాయించడం జరిగింది. మిగిలిన 165 గ్రామపంచాయతీల్లో జనవరి 31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి పరిపాలన ఆమోదం తీసుకోవాలి. మార్చిలో అనుకున్న మేరకు టాస్క్ పూర్తి చేస్తాం. ఒకవేళ కొంత మిగిలిపోయినా గడువుకంటే ముందే పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అక్టోబర్ 2కు ముందే జిల్లాను ఓడీఎఫ్గా తీర్చిదిద్దుతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో, ఆదిలాబాద్ జిల్లా -
ఫోనులో దెయ్యం
కిరణ్, దివ్య జంటగా కె. నరేంద్రబాబు దర్శకత్వంలో వెంకటేశ. సి నిర్మించిన సినిమా ‘మళ్లీ వచ్చిందా’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసిన టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ థ్రిల్లర్స్కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ‘గంగ, రాజుగారి గది, ఆనందో బ్రహ్మ’ తరహా జానర్లో వస్తోన్న ‘మళ్లీ వచ్చిందా’ కూడా ప్రేక్షకాదరణ పొందుతుంది’’ అన్నారు. నరేంద్రబాబు మాట్లాడుతూ– ‘‘ఆత్మలు, దెయ్యాలు మనుషుల్ని ఆవహించి, భయపెట్టడం చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఒక దెయ్యం ఓ ఫోన్ నుంచి మరో ఫోన్కి వెళుతూ మనుషుల్ని భయపెడితే ఎలా ఉంటుందనేది మా సిన్మాలో చూపించాం. ఈ దెయ్యం స్పెషాలిటీ ఏంటంటే... ఎవరి ఫోన్కైనా వారి వాయిస్ను ‘డెత్ మెసేజ్’ రూపంలో పంపిస్తుంది’’ అన్నారు. త్వరలో పాటల్ని, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రసహ నిర్మాతలు గురురాజ్, జి. శశికాంత్, హీరో కిరణ్, హీరోయిన్ దివ్య, కెమెరామ్యాన్ పూర్ణ .కె తదితరులు పాల్గొన్నారు. -
నా కోసమే మరణిస్తున్నా..
- నగరంలో యువతి ఆత్మహత్య - ఎవరిపైనా కోపం లేదని సూసైడ్ నోట్.. నిజామాబాద్: ‘‘ఎవరిపైనా కోపం లేదు.. నా కోసమే మరణిస్తున్నా’’ అని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం నగరంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోగల ఎర్రకుంట కాలనీలో చోటు చేసుకుంది. మూడో టౌన్ ఎస్సై వెంకట్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎర్రకుంట కాలనీకి చెందిన సిరిసిల్ల అరుణ అశోక్లకు ముగ్గురు కూతుళ్లు. తండ్రి రైల్వేస్టేషన్ వద్ద ఉడిపి హోటల్లో మేనేజర్గా, తల్లి బాలసదన్లో ఆయాగా, మొదటి, రెండో కుమార్తెలు ప్రైవేట్ ఆస్పత్రులలో పని చేస్తున్నారు. చిన్నకూతురు దివ్య(18) ఓ కోచింగ్ సెంటర్లో బ్యుటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతోంది. దివ్య శుక్రవారం మధ్నాహ్నం ఇంటికి చేరుకుని తలుపులు వేసుకుంది. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న తల్లికి ఇంట్లో ఏదో కాలిన వాసన రావటంతో కిటికీలో నుంచి చూడగా కూతురు పూర్తిగా కాలిపోయి కనిపించింది. ఆమె పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడకు చేరుకుని తలుపులు తెరిచారు. దివ్య బలవన్మరణానికి పాల్పడిన స్ధలంలో ఆమె చేతితో రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘‘అమ్మ నువ్వు చాలా మంచి దానివి, నా కోసం ఎన్నో చేశావు, ఎంతో కష్ట పడ్డావు, నాకు బతకాలని లేదు. నేను ఎవరి కోసమో చనిపోవటం లేదు. నా కోసమే చనిపోతున్నాను. నాన్న అమ్మను కొట్టవద్దు. అమ్మ చాలా మంచింది. మీ అందరూ బాగుండాలి’’ అని రాసి ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
తల్లి పాలు తాగి ఇద్దరు చిన్నారుల మృతి
అన్నానగర్: అమ్మ పాలు అమృతం కంటే తీయనివి. తన రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు ఇస్తుంది. అలాంటిది ఆ తల్లిపాలు విషం అయ్యాయి. పాలు తాగి పడుకున్న ఆ చిన్నారులు శాశ్వతంగా ఆతల్లిని విడిచివెళ్లారు. తల్లిపాలు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్కోవిల్లో జరిగింది. కుమరి జిల్లా పుత్తన్దుర్ ప్రాంతంలో ఉన్న కాట్రాడిత్తడికి చెందిన కన్నన్(39) భార్య దివ్య (29). వీరికి అనుష్క(02)అనే కుమార్తె ఉంది. దివ్యకి 22వ తేదీన ఇద్దరు కవలలు జన్మించారు. వీరికి ఆమె శుక్రవారం ఉదయం పాలు ఇచ్చి నిద్రపుచ్చింది. అయితే కొద్దిసేపటికే ఆ ఇద్దరు పసికందులు మృతి చెందారు. దీంతో బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి వచ్చి తల్లిపాలు తాగితే మృతి చెందరని.. ఊపిరి ఆడకుండా మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తరువాత పసికందులను పూడ్చివేశారు. ఈ సంఘటనపై కుమరి జిల్లా పిల్లల రక్షణ అధికారి కుముదాకి అందిన సమాచారం మేరకు దివ్య ఇంటికి వెళ్లి విచారణ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కోట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి కన్నన్, దివ్యలను విచారిస్తున్నారు. -
ఓ ఎమ్మెల్యే.. ఓ ఐఏఎస్.. ఓ లవ్ స్టోరీ
-
ఓ ఎమ్మెల్యే.. ఓ ఐఏఎస్.. ఓ లవ్ స్టోరీ
సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు కొత్తకాదు. కానీ ఈ కేరళ ప్రేమకథ కాస్త భిన్నం. అతనేమో పూర్తిస్థాయి రాజకీయ నాయ కుడు. ఆమె స్వతంత్రభావాలు కలిగిన యువ అధికారిణి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.ఎస్.శబరినందన్, తిరువనంతపురం సబ్ కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్లు ప్రేమలో పడ్డారని గత కొంతకాలంగా కేరళలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు మంగళవారం శబరినందన్ తన ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ను మార్చి దీన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ కలసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసి... రిలేషన్షిప్ స్టేటస్ను ‘కమిటెడ్’గా పేర్కొన్నారు. ‘కొంతకాలంగా తెలిసిన వారందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. నేనిప్పుడదే విషయాన్ని సంతోషంగా వెల్లడిస్తున్నాను. సబ్ కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్ను తిరువనంతపురంలో కలిశాను. సాన్నిహిత్యం పెరిగాక తెలిసింది మా ఇద్దరి ఆలోచనలు, ఆసక్తులు, దృక్పథాలు ఒకటేనని. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో దివ్య త్వరలో నా జీవిత భాగస్వామి కాబోతోంది. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని 33 ఏళ్ల శబరినందన్ పోస్ట్ చేశారు. పెళ్లి వచ్చేనెలలో ఉండొచ్చు. మాజీ స్పీకర్, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జి.కార్తికేయన్ కుమారుడు శబరినందన్. ఎంబీఏ చదివిన ఆయన టాటా ట్రస్ట్లో పనిచేసేవారు. తండ్రి మరణంతో 2015లో అరువిక్కర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో మళ్లీ గెలిచారు. సీఎంసీ వేలూర్ కాలేజీలో మెడిసిన్ చదివిన దివ్య 2013లో ఐఏఎస్ సాధించారు. మరో విశేషమేమిటంటే శబరినందన్ తండ్రి కార్తికేయన్ పెళ్లి కూడా అప్పట్లో సంచలనమే. కాలేజీ ప్రొఫెసర్ ఎం.టి.సులేఖను ప్రేమించారు కార్తికేయన్. ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఆధారంగా మమ్ముట్టి హీరోగా సినిమా కూడా వచ్చిందడోయ్. -
నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రలు
దివ్యదర్శన యాత్ర ప్రారంభం దేవాదాయ శాఖ ఆర్జేడీ చంద్రశేఖర్అజాద్ అడ్డతీగల (రంపచోడవరం) : దివ్యదర్శన యాత్ర ద్వారా నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రల భాగ్యం కల్పిస్తున్నట్టు దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. నిరుపేద భక్తులకు దేవాదాయశాఖ కల్పించిన ఉచిత తీర్థయాత్ర సదుపాయాన్ని జిల్లాలోనే ప్రథమంగా సోమవారం అడ్డతీగల నుంచి ఆర్జేడీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకసారి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తే అధ్యాత్మిక అనుభూతితో సమాజ హితానికి తోడ్పడడానికి కట్టుబడి తోటి వారిని ఉత్తేజపర్చాలనే బృహత్తర సంకల్పాన్ని పాదుకొల్పాలనేది దివ్యదర్శన యాత్ర లక్ష్యమన్నారు. ఈ యాత్ర నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటుందన్నారు. జిల్లా నుంచి 18 నుంచి 70 ఏళ్ల ఆరోగ్యవంతులు ఏడాదికి 10 వేల మంది వరకూ రాష్ట్రంలోని 9 పెద్ద దేవాలయాల దర్శనం కల్పిస్తామని ఆర్జేడీ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఒకే కుటుంబంలో అత్యధికంగా ఐదుగురు వరకూ వెళ్లవచ్చన్నారు. ప్రతి వారం ఒక మండలంలో ఉన్న 200 మంది నిరుపేదలకు దివ్యదర్శన యాత్రలో భాగస్వాములను చేస్తామని ఆర్జేడీ చెప్పారు. యాత్రలో భక్తులు చేయకూడని పనులను ఆయన వివరించారు. భక్తులు, దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందితో దీక్షా ప్రమాణం చేయించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ రమేష్బాబుతో కలిసి జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. గోవిందనామస్మరణతో భక్తులు దివ్యదర్శన యాత్రకు బయలుదేరారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కన్వీనర్ తణుకు వెంకటరామయ్య, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్లు సతీష్కుమార్, శ్రీనివాస్, రామలింగేశ్వరరావు, ఇతర సిబ్బంది, సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ ఎఫెక్ట్!
ఈతరం యువత ఎక్కువగా ఇంటర్నెట్కి అలవాటు కావడం వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే కథతో రూపొందుతున్న సినిమా ‘ఈనాడు’. రామ్, వరుణ్, దివ్య, ప్రియా ముఖ్య తారలుగా నల్లూరి శ్రవణ్ దర్శకత్వంలో పులికొండ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ డీజీపీ దినేశ్రెడ్డి క్లాప్ ఇవ్వగా, నిర్మాత మద్దినేని రమేశ్ కెమేరా స్విచాన్ చేశారు. తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య స్క్రిప్ట్ని చిత్ర బృందానికి అందజేశారు. ‘‘ఫిబ్రవరి రెండోవారంలో చిత్రీకరణ ప్రారంభించి, ఏప్రిల్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత రామ్. ‘‘కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఓ ప్రముఖ హీరోయిన్ చిత్రంలో నటించనున్నారు’’ అని దర్శకుడు తెలిపారు. -
తెరపైకి మరో వారసురాలు
సినిమా చాలా బలమైన మాధ్యమం అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సినిమా చాలా ఉపయోగపడుతుందన్నది తెలిసిన విషయమే. అందుకే ఇతర రంగాల్లోని ప్రముఖులు ఆ మాధ్యమాన్ని వాడుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దివ్య తన భావాలను వ్యక్తం చేయడానికి సినిమాను మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈమె సీనియర్ నటుడు సత్యరాజ్ కూతురు అన్నది గమనార్హం. పౌష్టికాహారం, శారీరక వ్యాయామం అంశాల గురించి ఒక లఘు చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కథాంశం ఉంటుందని దివ్యా సత్యరాజ్ అన్నారు.ఆమె విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే శారీరక వ్యాయామం అవసరం లేదని, శారీరక వ్యాయామం చేస్తుంటే ఆహారం విషయంలో నియమాలు పాటించనవసరం లేదని చాలా మంది భావిస్తున్నారని, తన వద్దకు వచ్చే వారి భావాలను చూస్తే అర్థమైందన్నారు. అయితే మనిషికి శారీరక వ్యాయామం చాలా అవసరం అన్నారు. ఇక పౌష్టికాహారపు అలవాట్లు చాలా ముఖ్యం అని చెప్పారు. ఇలాంటి పలు అంశాల గురించి తెలిపే లఘు చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. తనతో పాటు పలువురు క్రీడాకారులు నటించనున్న ఈ లఘు చిత్రాన్ని ముంబైకి చెందిన ఒక కార్పొరేట్ సంస్థ నిర్మించనుందని, దీనికి వినీత్ రాజన్ దర్శకత్వాన్ని, సాషా ఛాయాగ్రహణం అందించనున్నట్లు దివ్యా సత్యరాజ్ వెల్లడించారు. దివ్యకు ఈ లఘు చిత్రం నటిగా వెండి తెరకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. -
ఇద్దరు వివాహితలు అదృశ్యం!
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్ సిటీ): నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివి.. కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయింది. మేకలమండి ప్రాంతానికి చెందిన జీ.దుర్గా కూతురు వీ.దివ్య(22) దీపావళి పండుగను పురస్కరించుకొని తల్లిగారింటికి వచ్చింది. శనివారం కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లను తీసుకొస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన దివ్య తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో వేణు అనే యువకుడిపై అనుమానం ఉందని పేర్కొంటూ ఛత్రినాక పోలీస్స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్స్టేషన్లో గాని 9490616505, 9490616500 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లి.. ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఎన్.రమేష్, త్రివేణిలు భార్యభర్తలు. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన త్రివేణి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త ఛత్రినాక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 5.3 అడుగుల ఎత్తున్న ఆమె ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్స్టేషన్లో గాని 9490616505, 9490616500 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. -
గో గర్ల్.. బి అలర్ట్.. బి సేఫ్
► ఆపదలో ఉన్న మహిళల కోసం యాప్ ► రూపొందించిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య ► పాన్-ఇండియా యాప్ క్రియేషన్ పోటీల్లో జాతీయస్థాయి గుర్తింపు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేలా... అత్యవసర సమయంలో సైరన్ మోగేలా సరికొత్త యాప్... ‘గో గర్ల్’ను అందుబాటులోకి తెచ్చింది నగరంలోని ఇంజనీరింగ్ విద్యార్థిని పి.దివ్య. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఆటోమేటిక్గా రికార్డయ్యేలా రూపొందించిన ఈ యాప్కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇటీవల చెన్నైలో జరిగిన యాప్ క్రియేషన్ ఫైనల్స్లో తొలి బహుమతిని కై వసం చేసుకుంది. 17 రాష్ట్రాలకు చెందిన 700 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఇందులో పోటీపడ్డారు. నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న దివ్య... యాప్ విశేషాలను ‘సాక్షి’కి వివరించింది. త్వరలో గూగుల్ ప్లే స్టోర్లో.. కిడ్నాప్లు, బెదిరింపులు, అత్యాచారయత్నాలు, అల్లరి, ర్యాగింగ్లకు పాల్పడే వారి నుంచి తమను తాము రక్షించుకొనేందుకు మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పోలీస్ సైరన్ మోగుతుంది. సాక్ష్యాధారాలు కూడా రికార్డవుతాయి. ఫలితంగా నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాలేజీ అమ్మారుులు, రాత్రి విధులు నిర్వహించే ఐటీ, కాల్సెంటర్ తదితర మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అవస్థలకు ఈ ‘గో గర్ల్.. బి అలర్ట్... బి సేఫ్’ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. త్వరలోనే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి రానుంది. మహిళలు తమ వ్యక్తిగత భద్రత కోసం ఆండ్రారుుడ్ మొబైల్ ఫోనులో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేఫ్/అన్సేఫ్ ఇండికేషన్ యాప్లో ని ‘కాల్ కాంటా క్ట్’ ఆప్షన్లో ఐదు నంబర్లు యాడ్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో స్క్రీన్పై ‘హెల్ప్ మీ’ అనే బటన్ నొక్కితే చాలు.. వెంటనే ఆయా నంబర్లతో పాటు పోలీసు కంట్రోల్ రూమ్, ఉమెన్స హెల్ప్లైన్, ఎన్సీడబ్ల్యూ, యాంటీ స్టాకింగ్ కాల్స్, అంబులెన్స, ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్లకు ఆటోమేటిక్గా మెస్సేజ్ వెళ్తుంది. దీంతో బాధితురాలు ఏ లొకేషన్లో ఉందనే విషయం గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి ప్రమాదం నుంచి కాపాడే వీలుంది. ఆత్మరక్షణ కోసం పోలీసు సైరన్, కోర్టులో పక్కాగా సాక్ష్యం సమర్పించేందుకు ఆటోమేటిక్ వారుుస్ రికార్డింగ్ కూడా ఉంది. ఆపదలో ఉన్న మహిళలు ‘హెల్ప్ మీ’ ఆప్షన్ నొక్కడం ద్వారా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకొనే ఫీచర్ (సేఫ్/అన్సేఫ్ ఇండికేషన్స) దీని ప్రత్యేకత. ఆపదలో ఉంటే రెడ్ సిగ్నల్, లేదంటే గ్రీన్ సిగ్నల్ గూగుల్ మ్యాప్లో కనబడుతుంది. -
నగల షాపులో చోరీకి యత్నం
తనను చూశాడని గుమిస్తాపై దొంగ దాడి మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో ఉన్న దివ్య జ్యుఝెల్లరీ షాపులో మంగళవారం రాత్రి ఓ దొంగ చోరీకి యత్నించాడు. షాపు యజమాని అప్రమత్తం కావడం తో అతడు పారిపోయాడు. షాపు యజ మాని కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన పమ్మి ధనుంజయచారి పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో తన నివాస గృహంలోనే దివ్య జ్యుఝెల్లరీ షాపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దొంగ షాపునకు సంబంధించిన ప్రహరీ గోడ దూకి ఆ షాపు ఆవరణలోకి అడుగుపెట్టాడు. షాపు తాళం పగులగొట్టేందుకు యత్నించాడు. అదే సమయంలో ఆ షాపు వర్కర్ పరమేశ్వర్ నిద్ర లేచి మూత్రవిసర్జ నకు బయటికి రాగా దొంగ కనిపిం చాడు. అతడు నిద్ర మత్త నుంచి తేరుకునేలోపే అతడిపై దొంగ కర్ర తో దాడి చేశాడు. పరమేశ్వర్ అరుపులు, కేకలకు షాపు యజమాని ధనుంజయచారి లేవడంతో దొంగ పారిపోయాడు. షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో టౌ¯న్ ఎస్సై తిరుపతి చేరుకుని దొంగ కోసం వెదికారు. గతంలోనూ ధనుంజయచారి షాపులో దొంగలు రెండుసార్లు చోరీకి పాల్పడ్డారు. -
నిశ్చితార్థం రద్దైందని..
కుత్బుల్లాపూర్: చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.. ఇటీవల నిశ్చితార్ధం రద్దైంది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం.. మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన శారద(41) భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం సుచిత్రబ్యాంక్ కాలనీకి వచ్చి నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె దివ్య (19) ఇంటర్ పూర్తి చేసింది. సంవత్సరం కిందట దివ్యకు నిశ్చితార్ధం జరుగగా అనివార్య కారణాల వల్ల రద్దైంది. దీంతో ఆమె మానసికంగా కుంగిపోతూ వస్తోంది. మంగళవారం తల్లి శారద అంబర్పేటలో ఉంటున్న తన చెల్లెలు ఇంటికి వెళ్లగా.. తమ్ముడు మేడ్చల్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలియని శారద బుధవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుంది. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో చుట్టు పక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా దివ్య అపస్మారక స్థితిలో ఉంది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి సెలవులో జేసీ దివ్య!
ఖమ్మం జెడ్పీసెంటర్ : జాయింట్ కలెక్టర్ దేవరాజన్ దివ్య సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవుపై వెళ్తున్నట్లు సమాచారం. తిరిగి ఆమె 15వ తేదీన విధుల్లో చేరి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు కలెక్టర్ లోకేష్కుమార్, సీఎస్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇన్చార్జ్ కలెక్టర్గా దివ్య వ్యవహరిస్తున్నారు. గతనెల 31 నుంచి ఈనెల 8వ తేదీ వరకు సెలవులో ఉన్న కలెక్టర్ లోకేష్కుమార్ మంగళవారం విధుల్లో చేరారు. పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్కు బాధ్యతలు అప్పగించిన జేసీ 11వ తేదీ నుంచి సెలవులో ఉండనున్నారు. -
చంపేశారు!
♦ దివ్య మృతిపై అనుమానాలు ♦ సాగు...తోన్న రైల్వే పోలీసుల విచారణ ♦ హత్యేనంటున్న మృతురాలి తల్లిదండ్రులు ♦ చివరగా తండ్రికి ఫోన్.. అదే రోజు రాత్రి మృతి ♦ బాధ్యులను గుర్తించాలని ప్రజాసంఘాలు, విద్యార్థుల డిమాండ్ ♦ వెల్లువెత్తుతున్న నిరసనలు జహీరాబాద్/కోహీర్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని దివ్య కేసు ఇంకా మిస్టరీ వీడలేదు. ఆమె మరణించి వారం రోజులైనా కేసులో పురోగతి కన్పించడం లేదు. దివ్యది ముమ్మాటికి హత్యేనని కుటుంబసభ్యులు గట్టిగా వాదిస్తున్నారు. కేసు విచారణను వేగవంతం చేసి గుట్టురట్టు చేసి బాధ్యులను శిక్షించాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోహీర్ మండలం మద్రి గ్రామానికి చెందిన నడిమొదొడ్డి రత్నయ్య, ప్రేమలత దంపతుల కుమార్తె దివ్య (18) జహీరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. గత నెల 30న ఉదయం కళాశాలకు వెళ్లింది. అదే రోజు రాత్రి 8.05 గంటల ప్రాంతంలో దివ్య జహీరాబాద్ నుంచి తన తండ్రికి ఫోన్ చేసింది. స్నేహితురాలి ఇంటి వద్ద పుట్టిన రోజు వేడుక ఉందని, తాను అక్కడికి వెళ్తున్నట్టు చెప్పింది. రాత్రి అక్కడే ఉండి ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని చెప్పింది. 15 నిమిషాల తర్వాత మరోమారు తండ్రికి ఫోన్ చేసి.. తాను రాత్రి జహీరాబాద్లో ఉండి ఉదయమే ఇంటికి వస్తానని తెలిపింది. ఆ రెండు మార్లు కూడా ఇతరుల ఫోన్ నుంచి మాట్లాడింది. ఉదయం ఇంటికి వస్తానని చెప్పిన దివ్య ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మర్నాడు ఉదయం అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై విగత జీవిగా పడి ఉంది. వీడని చిక్కుముడి.. కళాశాలకు వెళ్లిన దివ్య రైల్వే పట్టాలపై శవమై పడి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన రైల్వే పట్టాలపై జరగడంతో వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తోటి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. తుది నివేదిక రావాల్సి ఉంది. ఈ కేసును స్థానిక సివిల్ పోలీసులకు బదలాయిస్తామని రైల్వే పోలీసులు ఇదివరకే ప్రకటించినా ఇంకా అప్పగించలేదు. నమ్మించి వంచించారా? తెలిసిన వారే దివ్యను నమ్మించి వంచిం చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివ్య చివరిసారిగా జూన్ 30న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో జహీరాబాద్లోని కుమార్ హోటల్ సమీపంలో దారిన వెళ్లే వ్యక్తి వద్ద ఫోన్ తీసుకుని తండ్రితో మాట్లాడింది. తండ్రితో ఫోన్లో మాట్లాడిన సమయంలో దివ్య ఒంటరిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో దివ్య జహీరాబాద్ నుంచి మద్రికి ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. రాత్రి వేళ బస్సు సౌకర్యం లేదు. ఆటోలు సైతం తిరగవు. హుగ్గెల్లి-గురుజువాడ రహదారిపై పగటి పూటనే జనసంచారం అంతంతగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి వేళ దివ్య ఒంటరిగా వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. బహుశా దివ్యకు తెలిసిన వారు ఎవరైనా రాత్రి పూట తారస పడి గ్రామానికి వెళ్దామని చెప్పి తీసుకువెళ్లి దురాఘతానికి పాల్పడి ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే శవాన్ని రైలు పట్టాలపై పడేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు. దివ్య చదువులో సరస్వతి... దివ్య మెరిట్ స్టుడెంట్. ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో గురుజువాడ పాఠశాల టాపర్గా నిలిచింది. ఎంపీ బీబీ పాటిల్ చేతుల మీదుగా సన్మానం పొందింది. ఉపాధ్యాయులు సైతం అభినందించారు. పాఠశాల తరఫున కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఓ విద్యావేత్త దివ్యకు నగదు పురస్కారాన్ని సైతం ప్రకటించారు. ప్రజా సంఘాల ఆందోళనలు.. దివ్య మరణంపై విచారణ నత్తనడకన సాగుతోండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాలు ఉద్యమ బాటపట్టాయి. ఇదివరకే ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జహీరాబాద్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. మహిళా సంఘాల వారు సైతం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్, మున్సిపల్ చైర్పర్సన్, పోలీసులకు వినతిపత్రాలను సమర్పించారు. బుధవారం కోహీర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. -
డాన్స్ చేయలేదని చితకబాదాడు
బాన్సువాడ టౌన్: డాన్స్ చేయనందుకు ఓ డీఎడ్ శిక్షణలో ఉన్న ఓ వ్యక్తి విద్యార్థిని చితకబాదాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 3వ తరగతి విద్యార్థిని దివ్యను డీఎడ్ శిక్షణ పొందుతున్న క్రాంతికుమార్ కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన దివ్య వీపును చూసిన ఆమె తండ్రి ప్రభాకర్ వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తరగతి గదిలో తనను నృత్యం చేయాలని క్రాంతి సార్ కోరాడని.. చేయకపోవడంతో కర్రతో కొట్టాడని విద్యార్థిని దివ్య తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విద్యార్థిని తండ్రి ప్రభాకర్ మీడియాకు చెప్పారు. -
స్టార్ వారసురాలి తెరంగేట్రం
కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ వారసురాలు తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. తమిళ టాప్ హీరో విజయ్ కూతురు దివ్య త్వరలోనే వెండితెర మీద సందడి చేయనుంది. అయితే హీరోయిన్గా మాత్రం కాదు, చైల్డ్ ఆర్టిస్ట్గానే. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 59వ సినిమా థేరితో దివ్య బాలనటిగా పరిచయం అవుతోంది. రాజారాణీ ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇప్పటికే విజయ్ 49వ సినిమా వేట్టైకారన్ తో విజయ్ తనయుడు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కూతురు కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఇలయదళపతి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే లడఖ్లో జరిగిన షూటింగ్లో విజయ్, దివ్యలు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. విజయ్ సరసన సమంత, అమీజాక్సన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
బాలిక హత్య కేసు కొలిక్కి!
కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దేవరాపల్లి: దేవరాపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక దివ్య హత్య కేసు దర్యాప్తులో పోలీసులు శుక్రవారం కీలక ఆధారాలు సేకరించిట్లు తెలిసింది. దీంతో హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులను పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిందితులను శుక్రవారం సాయంత్రమే పట్టుకున్నారని, సాయంత్రం చీకటి పడటంతో పాటు క్రిస్మస్ సెలవు దినం కావడంతో అరెస్టు చేయలేదని విశ్వనీయంగా తెలిసింది. వీరిని శనివారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేవరాపల్లి ఎస్ఐ జీఎన్.అప్పన్న కేసు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేసినట్టు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనేదానిపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. క్రైం కేసులను ఛేదించడంలో దిట్టగా పేరున్న ఎస్ఐ అప్పన్న ఆది నుంచి చాలెంజింగ్ తీసుకొని ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు. బాలిక అదృశ్యం అయినట్లు ఫిర్యాదు అందిన మరుక్షణమే గ్రామంలో దండోరా ద్వారా ప్రచారం చేయడమే దీనికి నిదర్శనం. దండోరా వేయించడమే నిందితులను పట్టుకోవడంలో కీలకమైనట్లు తెలుస్తోంది. అనుమానితుడిగా పోలీస్లు అదుపులో ఉన్న దివ్యకు వరుసకు మేనమామ అయిన గుణశేఖర్ను శుక్రవారం లోతుగా విచారించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడినట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా ముక్కు పచ్చలారని చిన్నారి దివ్యను హత్య చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అల్లారి ముద్దుగా పెంచుకున్న కుమార్తె హత్యకు గురికావడంపై బాలిక తల్లిదండ్రులు మాత్రం తీవ్ర మనోవేదనతో అల్లాడుతున్నారు. -
అపహరణకు గురైన దివ్య దారుణ హత్య
-
అపహరణకు గురైన దివ్య దారుణ హత్య
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో అదృశ్యమైన చిన్నారి దివ్య (7) దారుణ హత్యకు గురైంది. దివ్యకు మేనమామ వరుసయ్యే శేఖర్ అనే వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... దేవరాపల్లికి చెందిన వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులకు దివ్య, గణేష్ అనే పాప, బాబు ఉన్నారు. అయితే మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లిన దివ్య సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కుటుంబసభ్యులు, పరిచయస్తులు వద్ద వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దివ్యను మేనమామ వరుసయ్యే శేఖర్ రాళ్ల క్వారీవైపు తీసుకెళ్తుండగా తాము చూశామని స్థానికులు తెలిపారు. దాంతో పోలీసులు శేఖర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతడు హత్య చేసినట్లు తన నేరాన్ని ఒప్పుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రైవాడ రిజర్వాయర్ వెనుక వైపు ముళ్లపొదల్లో దివ్య మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. స్థానిక ఉషోదయ కాన్వెంట్ లో దివ్య యూకేజీ చదువుతోంది. -
జంట హత్యలు
దాచేపల్లి: వివాహేతర సంబంధం నేపథ్యంలో దాచేపల్లి మండలంలో ఆదివారం జంట హత్యలు జరిగాయి. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఆమెను, ఆమె ప్రియుడిని భర్త కత్తితో నరికి చంపడం సంచలనం కలిగించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన అక్కినపల్లి హనుమయ్యకు రెంటచింతల గ్రామానికి చెందిన దివ్య(23)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే వీరికి కుమారుడు మణికంఠ ఉన్నాడు. తన ఇంటి ఎదురుగా ఉన్న వీధిలో నివసించే చెన్నబోయిన నాగేశ్వరరావు(32)తో దివ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని హనుమయ్య అనుమానించాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో భార్యభర్తలకు పంచాయితీ కూడా జరిగింది. దివ్యపై హనుమయ్యకు రోజురోజుకూ అనుమానం బలపడటంతో నాగేశ్వరరావును హతమార్చేందుకు కుట్రపన్నాడు. ఈ క్రమంలో గామాలపాడు పంచాయతీ పరిధిలోని సిక్కులదాబాలో నాగేశ్వరరావు ఉన్నట్లు హనుమయ్య సమాచారం తెలుసుకున్నాడు. కారంపూడి మండలం పేటసన్నెగళ్ల గ్రామానికి చెందిన సమీప బంధువు నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్రవాహనంపై సిక్కులదాబా వద్దకు వెళ్లారు. వెంట తెచ్చుకున్న కత్తితో నాగేశ్వరరావుపై దాడి చేశాడు. గొంతు, మెడ వద్ద కత్తితో కోయటంతో తీవ్ర రక్తస్రావం అయి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి వద్ద భార్యను.. నాగేశ్వరరావు వద్ద ఉన్న సెల్ఫోన్ను తీసుకుని పరిశీలిస్తున్న క్రమంలో దివ్య సెల్ఫోన్ నుంచి కాల్వచ్చినట్లు హనుమయ్య గుర్తించాడు. దీంతో ఆగ్రహం పెంచుకున్న హనుమయ్య ద్విచక్రవాహనంపై నడికుడికి వచ్చి ఇంట్లో ఉన్న దివ్యపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఇంట్లో ఉన్న కుమారుడు మణికంఠను తన సమీప బంధువు నాగేశ్వరరావుకు ఇచ్చి పేటసన్నెగళ్లలోని తన బం ధువుల ఇంటికి పంపాడు. అనంతరం హనుమ య్య పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్య, ఆమె ప్రి యుడిని హత్యచేసినట్లు చెప్పి లొంగిపోయాడు. జంట హత్యల సమాచారం అందుకున్న గురజా ల సీఐ ఆళహరి శ్రీనివాసరావు వెంటనే దాబా లో, నడికుడిలో ఉన్న నాగేశ్వరరావు, దివ్య మృతదేహాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హత్యలకు సహకరించిన పేటసన్నెగళ్లకు చెందిన నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు చెప్పారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు నాగేశ్వరరావుకు భార్య లక్ష్మి ఉంది. -
అరుదైన అమ్మ... ఎంత కష్టమమ్మా!
అనగనగా ఓ అమ్మ. కొన్నేళ్ల క్రితం విధులకు వెళ్తున్న ఆమెకు చెత్త కుండీలో ఓ శిశువు కనిపించింది. ‘నాకెందుకులే’ అనుకోకుండా అక్కున చేర్చుకుంది. తన వారి వల్ల ఆ చిన్నారికి కష్టాలు ఎదురు కాకూడదని భావించి.. దత్తత తీసుకుంది. కన్నకొడుకు కంటే... పెంచిన కుమార్తెనే మిన్నగా భావించింది. ఆ బిడ్డ ఇప్పుడు అడ్డం తిరిగింది. అమ్మ గుండెను గాయపరుస్తోంది. జీవితాన్నిచ్చిన తల్లిని జీవశ్చవంలా మారుస్తోంది. బంజారాహిల్స్: ఒకరిది ప్రేమానురాగం.. ఇంకొకరిది ధనదాహం. ప్రాణానికి ప్రాణంగా.. అమ్మలోని మమకారాన్ని పంచి.. అల్లారు ముద్దుగా పెంచి... విద్యాబుద్ధులు నేర్పించి.. పెళ్లి చేసిందా తల్లి. బదులుగా వృద్ధాప్యంలో ఉందనే కనికరం కూడా లేకుండా ఆస్తికోసం ఆమెకు ప్రత్యక్ష నరకాన్నే చూపించిందా కూతురు. తీరా చూస్తే... ఈ కూతురు ఆమెకు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కాదు. చెత్తకుండీ వద్ద దొరికిన పసికందు. అయినా దత్తత తీసుకొని అపురూపంగా చూసుకున్న తల్లి పాలిట ఇప్పుడు ఆ దత్తపుత్రికే యమపాశంగా మారింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఇదీ కథ... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10సీలోని వెంకటగిరిలో నివసించే అమ్మినీయమ్మ(74) నీలోఫర్ ఆస్పత్రి సమీపంలోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో హెడ్నర్స్గా పని చేసి రిటైర్ అయ్యింది. 1992లో ఓ రోజు ఆస్పత్రిలోడ్యూటీకి వెళ్తుండగా గేటు వద్ద చెత్తకుండీలో క్యార్.. క్యార్మంటూ ఏడుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా ఇంకా రక్తపుమరకలు ఆరని అప్పుడే పుట్టిన శిశువు గుక్క పెట్టి ఏడుస్తుండటం చూసింది. అమ్మ మనసు కరిగింది. వెంటనే ఆ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లి సహచర నర్సులు సారా, సరోజతో కలిసి స్నానం చేయించి వైద్యం అందించి పాలుపట్టించింది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకొని సేవలందించింది. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంది. మూడేళ్లప్పుడు అధికారికంగా ఆ పాపను దత్తత తీసుకొని దివ్య అని పేరు పెట్టుకుంది. ఖరీదైన ప్రైవేట్ స్కూల్లో చదివించింది. యూసుఫ్గూడ సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ చదివించింది. అదే సమయంలో దివ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోగా అమ్మినీయమ్మ తన కూతురు కనిపించడం లేదంటూ అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పారిపోయి పెళ్లి చేసుకున్న దివ్య, ఆమె భర్త రమేష్ను పట్టుకొని తల్లికి అప్పగించారు. అప్పటి నుంచే అమ్మినీయమ్మకు కష్టాలు మొదలయ్యాయి. వెంకటగిరిలో 400 గజాల విస్తీర్ణంలో కట్టుకున్న మూడంతస్తుల ఇల్లును తనపేరు మీద రాయాలంటూ దివ్య పోరు ప్రారంభించింది. నిత్యం అమ్మినీయమ్మను శారీరకంగా, మానసికంగా వేధించేది. బాధలు భరించలేక కూతురికి ఒక అంతస్తు రాసిచ్చినా ఆమె దాహం తీరలేదు. మొత్తం ఇంటిని రాసివ్వాలంటూ ఇటీవల తిట్టడం, కొట్టడం కూడా చేస్తుండడంతో బాధలు భరించలేక కూతురిపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య, ఆమె భర్త రమేష్లను స్టేషన్కు పిలిపించారు. తన కన్న కొడుకును సరిగ్గా చూడకుండా దత్తత తీసుకున్న దివ్యను కన్నవాళ్ల కంటే ఎక్కువగా చూశానని ఇంతా చేస్తే ఇప్పుడు నరకాన్ని చూపిస్తున్నదని అమ్మినీయమ్మ పోలీసులకు చెప్పింది. ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రులలో హెడ్నర్స్గా పని చేసి రిటైర్ అయిన అమ్మినీయమ్మది కేరళ. భర్త 1972లోనే చనిపోగా కొడుకు వేణు తాగుడుకు బానిసై పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి దివ్యనే కొడుకుగా భావించి అల్లారుముద్దుగా చూసుకుంటుండగా చివరకు ఆమెకే నరకాన్ని చూపిస్తున్నదని ఆరోపించింది. ఇటీవల దత్త పుత్రిక బాధలు భరించలేక కిందపడగా కోమాలోకి వెళ్లి నెల రోజుల తర్వాత స్పృహలోకి వచ్చినట్లు తెల్పింది. అనంతరం నాలుగు తెల్లకాగితాల మీద బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆ తల్లి ఆరోపించింది. ఆస్పత్రి ఆవరణలో చెత్తకుండీలో దొరికిన గంటల శిశువును చేరదీసి పెంచి పెద్దచేస్తే చివరకు ఆ వృద్ధురాలికి ఆ కూతురే ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్న వైనాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. పెంచుకున్న కూతురు మోజులో కన్న కొడుకును, కోడలును, మనవరాళ్లను వదిలేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది ఆ వృద్ధురాలు. తాను ఒంటరిగా ఉంటానని కూతురి పోరు లేకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో యువతి సజీవదహనం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గొలిగొండ మండలం అప్పన్నపాలెంలోమంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇల్లు ఊరికి చివర ఉండటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన దివ్య అనే యువతి తల్లిదండ్రులు ఊరి చివరన ఉన్నజీడిమామిడి తోటలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు. తల్లి దండ్రులు సొంతపనుల నిమిత్తం నర్సీపట్నం వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దివ్య(18) సజీవ దహనమై కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని, ఆ తర్వాల పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐటీడీఏ పీవో బదిలీ
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీవో దేవరాజన్ దివ్య బదిలీ అయ్యారు. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్గా ఆమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2014 ఫిబ్రవరి 14న భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన దివ్య ఏడాది తిరగక ముందే బదిలీ కావటం గమనార్హం. అయితే ఐటీడీఏ పీవోగా దివ్య తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక్కడ విధుల్లో చేరిన కొన్ని రోజులకే సాధారణ ఎన్నికలు రాగా.. అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల నిర్వహణలో తనదైన పాత్ర పోషించి, ఉత్సవాల విజయవంతానికి సహకరించారు. మధ్య దళారులు లేకుండా చేయాలనే తలంపుతో 'ప్రజావాణి' పేరిట యూనిట్ అధికారులందరినీ గిరిజనుల ముంగిటకు పంపించారు. ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్ను ప్రజావాణిగా మార్చి, గిరిజనుల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుకు యూనిట్ అధికారులు జవాబుదారులుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపారు. కార్యాలయానికే పరిమితం కాకుండా గిరిజన గ్రామాల్లో పర్యటనపై ఎక్కువ శ్రద్ధ చూపారు. కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించారు. గిరిజనుల వైద్య సేవలకు పెద్ద దిక్కుగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఐటీడీఏ నుంచి నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలను కల్పించారు. ైవె ద్యం కోసం వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా అక్కడ నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి సూపరింటెండెంట్ మార్పు విషయంలో ఆమె కోటిరెడ్డికి మద్దతుగా నిలిచి పైస్థాయిలో తన వాదన వినిపించారు. రాష్ట్ర విభజనతో విలీన మండలాల్లో ఉన్న ఎటపాక విద్యా సంస్థలను తిరిగి వెన క్కు తీసుకురావడం, భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామాలను తెలంగాణలో క లపడంపై వాదన గట్టిగానే వినిపించారు. మితిమీరిన స్వేచ్ఛతో గాడితప్పిన పాలన... గతంలో ఏ అధికారీ ఇవ్వనంత రీతిలో దివ్య యూనిట్ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో పాలన గాడితప్పిందనే విమర్శలు ఉన్నాయి. గిరిజనులకు మేలు జరగాలనే ఆకాంక్ష కొంత నిధుల దుబారాకు దారితీసిందనే విమర్శ ఉంది. వివిధ పథకాల కింద వచ్చిన నిధుల ద్వారా గిరిజనలకు మేలు చేకూరితే చాలన్న రీతిలో యూనిట్ అధికారులు అడిగిందే తడవుగా నిధులు కేటాయించారు. అయితే అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించలేకపోయారనే అపవాదు ఆమెపై ఉంది. ఆశ్రమ పాఠశాలలు, ఉపాధి హామీ పథ కం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ నిర్మాణాలపై క్షేత్ర స్థాయిలో దృష్టి సారించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పనిచేసిన పీవోలు క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన సందర్భాల్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ దివ్య మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులపై కూడా ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శ ఉంది. దివ్య బయోడేటా జన్మస్థలం తమిళనాడులోని తిరుచ్చి జిల్లా కేంద్రం. తల్లిదండ్రులు నందిని, దేవరాజన్. తల్లి డెంటిస్ట్. తండ్రి తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో రిటైర్డ్ఇంజనీర్ 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో చెన్నైలోని సింథి మోడల్స్కూల్లో, అనంతరం ఇంజనీరింగ్లో బిట్స్ పిలానీలో సీటు సాధించి రాజస్థాన్లో 2006లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2007లో సివిల్స్ రాసి 503 ర్యాంకు సాధించా రు. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్లో చేరి బరోడాలో శిక్షణ తీసుకుంటూనే రెండవ సారి 2009లో సివిల్స్లో జాతీయ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించారు. ఉత్తరాఖండ్లోని లాల్బహదూర్శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పూర్తి చేసుకొని కృష్ణా జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అనంతరం భువనగిరి సబ్కలెక్టర్గా, ఆ తర్వాత హైదరాబాద్ ఈ గవర్నెన్స్ డైరక్టర్గా, 2014 ఫిబ్రవరి 14న భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతులు చేపట్టారు. 2008లో బెంగాల్కు చెందిన సుధిప్పోను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన బిట్స్ ఫిలానీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. -
సోదరీ మణులు!
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న... అనే మాటను ఆ ఇద్దరు చాలా సార్లు వినే ఉన్నారు. అమెరికా నుంచి మాతృదేశమైన ఇండియాకు వచ్చి, తిరుగు ప్రయాణంలో- ‘‘భగవాన్...ఈ పేదలను ఆదుకో’’ అని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అంతేకాదు...అమెరికాకు తిరిగి వెళ్లిన తరువాత ఇండియాలోని పేద పిల్లలకు ఆపన్న హస్తం అందించడానికి నడుం బిగించారు... కవల సోదరీమణులెన ఆర్యా, దివ్యా ఆనంద్లు నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు స్వదేశాన్ని చూశామనే సంతోషం కంటే తాము చూసిన కొన్ని దృశ్యాలు, విన్న మాటలు వారిని బాధకు గురి చేశాయి. ఆడిపాడాల్సిన వయసులో పిల్లలు వీధుల్లో అడుక్కోవడం వారిని కంట తడి పెట్టించింది. చదువుకోవాల్సిన పిల్లలు కూలి పనులకు వెళ్లడం వారిని బాధ పెట్టింది. ‘‘చదువుకునే వయసులో ఇదేమిటి?’’ అనుకున్నారు బాధగా. అమెరికాలోని మాసాచుసెట్స్, అండోవర్ హైస్కూల్లో చదువుకుంటున్న ఈ కవల సోదరీమణులు బాధ పడి మాత్రమే ఊరుకోలేదు. తమవంతుగా ఏదైనా చేయాలనుకొని రంగంలోకి దిగారు. దాతల దగ్గర విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ‘ల్యాంప్’ సహకారంతో మన దేశంలోని పేద పిల్లలకు తోడ్పాటు అందించడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. 2003లో మొదలైన ‘ల్యాంప్’ ఫౌండేషన్ దాదాపు మూడు లక్షల మంది పిల్లలను విద్యావంతులను చేసింది. ‘‘మాకున్న సౌకర్యాలతో ఇండియాలోని పేద పిల్లల దీనస్థితిని పోల్చుకున్నప్పుడు చాలా బాధేసింది’’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు ఆర్యా, దివ్యాలు. బాధ... బాధను మాత్రమే మిగల్చదని... కొత్త ఆలోచనను కూడా ఇస్తుందని ఆర్యా, దివ్యా ఆనంద్లను చూస్తే సులభంగానే అర్థమైపోతుంది! -
పాఠశాల భవనంపై పిడుగుపడి విద్యార్థి మృతి
పెనుమూరు: పాఠశాల భవనంపై పిడుగుపడి ఓ విద్యార్థి మృతి చెందింది. ఈ సంఘటన పెనుమూరు మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పాఠశాల టీచర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమూరు మండలం జెట్టివానిఒడ్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ప్రస్తుతం 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. టీచర్గా భాస్కర్రెడ్డి పనిచేస్తున్నారు. ప్రతి రోజులా బుధవారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్లడానికి ఇంటిగంట కొట్టారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఇళ్లకు వెళ్లలేక విద్యార్థులంతా పాఠశాల వరండాలో నిలబడి ఉన్నారు. సరిగ్గా 4.10 గంటలకు ఉరుములు, మెరుపులు వచ్చా రుు. పాఠశాల భవనంపై పిడుగుపడింది. వరండాలోనే ఉన్న టీచర్ భాస్కర్రెడ్డి సహా విద్యార్థులంద రూ షాక్కు గురయ్యూరు. అందరూ గిలగిలాకొట్టుకున్నారు. రెండు నిమిషాలకు టీచర్ తేరుకున్నారు. మూడో తరగతి చదువుతున్న కె.మాధవి(07) అక్కడికక్కడే మృతి చెందింది. నాలుగో తరగతి చదువుతున్న కె.దివ్య(08) అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే గ్రామస్తులు పెనుమూరు ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్లి చికిత్స చేరుుంచడంతో దివ్య కోలుకుంది. పిడుగుపడ్డ సమయంలో పాఠశాల తరగతి గదిలో ఉన్న ఓ ట్యూబ్ లైట్ పగిలింది. పాఠశాల తరగతి గదులు బీటలు పడ్డాయి. మృతిచెందిన మాధవి జెట్టివానిఒడ్డు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి రెండో సంతానం. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం తోటి పిల్లలతో ఆడుకుంటూ పాఠశాలకు వె ళ్లిన మాధవి సాయంత్రం ఇలా తమకు కనిపిస్తుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో గ్రామస్తులంతా సైతం కంటతడి పెట్టారు. గోడకు ఆనుకోవడం వల్లే మృతి ముందుగా తేలికపాటి వర్షం పడడంతో పాఠశాల భవనం గోడలు తడిసాయి. ఆ తర్వాత పిడుగుపడింది. ఈ సమయంలో మాధవి పాఠశాల గోడకు ఆనుకోవడం వల్ల పిడుగుపాటుతో షాక్ తగిలి మృతి చెందింది. లేకుంటే ప్రమాదం జరిగేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాల టీచర్ భాస్కర్రెడ్డి సహా మిగిలిన వారు వరండాలో గోడకు ఆనుకుని ఉండకపోవడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని వారు అంటున్నారు.