East Godavari Crime News
-
దారుణం: కస్తూర్భ టీచర్పై భర్త కత్తి దాడి
సాక్షి, తూర్పు గోదావరి: తుని మండలం వి.కొత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కస్తూర్భా బాలికలో విద్యాలయంలో పనిచేస్తున్న జూవాలజీ టీచర్పై ఆమె కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేగింది. భర్త విచక్షణంగా దాడి చేయడంతో సదరు ఉపాధ్యాయురాలు మధురాక్షి తీవ్ర గయాలయ్యాయి. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకుని గాయపడిన మధురాక్షిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ తగాదాలే దాడికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
బాలుడి సరదా ఆటతో ఆవిరైన తండ్రి కష్టం
అమలాపురం టౌన్: స్థానిక గణపతి థియేటర్ సమీపంలో ఓ బాలుడు సరదాగా తన తల్లి స్మార్ట్ ఫోన్ నుంచి ఆడిన ఆన్లైన్ గేమ్తో రూ.5.40 లక్షల దోపిడీకి గురై ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో.. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక ఆ బాలుడి తల్లి తల్లడిల్లుతోంది. ఆన్లైన్ గేమ్ పేరుతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు రూ.లక్షలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. అమలాపురం పట్టణ పోలీసులకు బాలుడి తల్లి చెప్పిన వివరాలతో ఈ ఆన్లైన్ గేమ్ మోసంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆ బాలుడు తన తల్లి స్మార్ట్ ఫోన్తో ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటూనే ఖాళీ సమయాల్లో సరదాగా ఆన్లైన్ గేమ్ల్లోకి వెళ్లాడు. 20 రోజులుగా ఆ గేమ్లు ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ గేమ్ యాప్ను ఓపెన్ చేశాడు. అందులో వెపన్స్ కొనాలంటే ఫలానా లింక్ ఓపెన్ చేయమంటే అదీ కూడా ఓపెన్ చేశాడు. (అవకాశాలు అంత తేలికకాదు.. ) అందులో ఈ గేమ్ యాప్ నిర్వాహకులు తెలివిగా తొలుత ఆ వెపన్స్ రూ.వంద నుంచి ధర చూపించాడు. ఓటీపీ అడిగినప్పుడు అదీ కూడా టైప్ చేసేశాడు. అలా ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ల విషయాలన్నీ అవతలి వారికి తెలిసే ప్రక్రియ అందులో ఉంటుంది. రూ.వందతో మొదలైన వెపన్స్ కొనుగోలు రూ.400, రూ.1000 నుంచి రూ.5000 వరకు ధరలతో బాలుడి తన స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడంతో తన తల్లికి సంబంధించిన రెండు బ్యాంక్ల అకౌంట్ల నుంచి 20 రోజుల్లో మొత్తం రూ.5.40 లక్షలు డ్రా అయ్యాయి. 20 రోజుల్లో రోజుకు కొంత మొత్తం వంతున అంతా ఆన్లైన్ మోసంతో కొల్లగొట్టేశారు. తల్లి ఏదో అవసరం పడి శనివారం ఏటీఎంకు వెళ్లి రూ.15 వేలు డ్రా చేసేందుకు పిన్ కొడితే డబ్బులు రాలేదు. మళ్లీ రూ.10 వేలు డ్రా చేస్తే నగదు వచ్చింది. అయితే రూ.10 వేలు డ్రా అయిన తర్వాత తన స్మార్ట్ ఫోన్కు రూ.1000 మాత్రమే బ్యాలెన్స్ చూపడంతో తల్లి కంగారు పడింది. తర్వాత రెండు బ్యాంక్లకు వెళ్లి ఆరా తీస్తే రెండు అకౌంట్లలో డబ్బులన్నీ డ్రా అయినట్టు చెప్పడంతో ఆమెకు చెమటలు పట్టాయి. పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో ఆదివారం ఉదయం విచారించారు. అయితే గేమ్ ఆడినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు స్మార్ట్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నా అవి గజిబిజిగా ఉండడంతో అంతగా చదువుకోని ఆమె పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఓటీపీ ఇవ్వడం, డ్రా అయిన డబ్బులకు మెసేజ్లు రావడంతో పోలీసులు ఈ కేసు సైబర్ నేరం కింద వస్తుందా? రాదా? అనే దానిపై సైబర్ నేరాల నిపుణలతో సంప్రదిస్తున్నారు. ఆమె భర్త కువైట్లో ఉంటూ తాను అక్కడ కష్ట పడి పనిచేస్తూ భార్య, పిల్లల కోసం రూ.లక్షలు కూడబెట్టి బ్యాంక్లో వేస్తే తమ కొడుకు సరదాగా ఆడిన ఆట ఆ కుటుంబాన్ని కోలుకోని దెబ్బతీసింది. పరాయి దేశంలో తన కుటుంబ కోసం శ్రమకోర్చి సమకూర్చుకున్న ఆదాయం ఇక్కడ అన్లైన్ మోసంతో ఆవిరైపోయింది. -
‘నేను స్పెషలాఫీసర్ని.. ఇది నా ఐడీ’
సాక్షి, సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని తన సెల్ నంబర్: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్ వైఎస్సార్సీపీ! ) సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండడం కొసమెరుపు. నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: నగర శివారు తిమ్మాపురం గ్రామ పంచాయతీ అవంతి నగర్లోని ఓ అద్దె ఇంట్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను తిమ్మాపురం పోలీసులు రట్టు చేశారు. తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. దుర్గాడకు చెందిన కొటికలపూడి రాజు, చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి ఇందిరా ప్రియదర్శిని కలిసి ఫ్యామిలీ పేరుతో అవంతి నగర్లో అద్దెకు ఇల్లు తీసుకున్నారు. గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన అప్పాజీ, బెంగళూరుకు చెందిన ఏజెంట్ రాజేష్ల ద్వారా అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచార దందా సాగిస్తున్నారు. లాక్డౌన్కు ముందే బెంగళూరు నుంచి రప్పించిన ఇద్దరు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని కాకినాడ చుట్టుపక్కల వ్యక్తులను ఫోన్ల ద్వారా రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో సీఐ మురళీకృష్ణ, ఎస్సై విజయ్కుమార్, సిబ్బంది దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు బెంగళూరు అమ్మాయిలకు విముక్తి కల్పించారు. నిందితుల్లో ఏజెంట్ రాజేష్, కొటికలపూడి రాజు, ప్రియదర్శిని, గుర్తేడుకు చెందిన సతీష్, కొత్తపల్లికి చెందిన అప్పాజీ, కరపకు చెందిన పెంకే శ్రీనుబాబు, విటులు పంపన రాముడు, దబరిక సూరిబాబు ఉన్నారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు రాజేష్తో పాటు సతీష్, అప్పాజీలు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని, బెంగళూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాధితులుగా గుర్తించి నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. వారి ఉత్తర్వుల ప్రకారం ఆ అమ్మాయిలను ప్రొటెక్షన్ హోమ్కు పంపుతామని డీఎస్పీ తెలిపారు. వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేసిన సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది శ్రీనివాసరావు, సూర్యచంద్ర, మొహిద్దీన్, శిరీష, ఐడీ పార్టీ సిబ్బంది సత్యనారాయణ, ప్రసాద్బాబు, రవికుమార్, నారాయణరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
ప్రియుడి మోసం.. విధుల్లో ఉండగానే
తూర్పుగోదావరి, పెద్దాపురం: మండలంలోని వడ్లమూరు రోడ్డులోని అపెక్స్ రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న యువతి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మాడపల్లి పద్మ (24) ఈ పరిశ్రమలో కార్మికురాలు. సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ ఫాక్యరీలోనే విధుల్లో ఉండగానే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . పద్మ అక్కడికక్కడే మృతి చెందగా ఈ ఘటనను చూసిన ఒడిశాకు చెందిన సహచర యువతులు సోనాలి, మనీషా, గంగీలు అపస్మారక స్థితిలోకి చేరారు. దీంతో స్థానికులు వారిని పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వి,సురేష్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తమామల దాష్టీకం.. కర్టెన్ తాడుతో
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లిలో అమానుషం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కడలి శాంతి అనే మహిళపై ఆమె అత్తమామలు మంగళవారం హత్యాయత్నం చేశారు. కర్టెన్ తాడుతో మహిళకు ఉరివేసేందుకు ప్రయత్నించగా ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో అత్తమామలు ఆమెను కాలితో పొత్తి కడుపులో తన్నారు. బాధిత మహిళ కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కాగా శాంతి యూరినల్ ఆగిపోవడంతో ఆమెను హుటాహుటిన రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(మాస్టారు నీచత్వం: విద్యార్థితో) -
రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం అమలాపురం డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళ్లే బస్సు, అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న బస్సులు రత్నా ప్లాస్టిక్స్ వద్ద అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేస్తూ అమలాపురం నుంచి వస్తున్న బస్సును ఎదురుగా ఢీ కొట్టాడు. అమలాపురం బస్సు విద్యుత్ సబ్ స్టేషన్ గేటు గోడకు ఢీ కొట్టాగా, రాజమహేంద్రవరం బస్సు కల్యాణి సోంపాపిడి కోట్టును ఢీ కొట్టి అగిపోయింది. ఈ సంఘటనలో పట్టి సీమ ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న ఉప్పలగుప్తంకు చెందిన సలాది తాతారావు, ఆయన భార్య సలాది భ్రమరాంబ, వారి కుమార్తెలు మహేశ్వరి, వైష్ణవి తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరి కుటుంబం బస్సు ముందు భాగంలో కూర్చొవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నరేంద్రపురానికి చెందిన వెలుగుల శంకరరావు, కొత్తపేటకు చెందిన పచ్చమళ్ళ శ్రీనివాసరావు, అమలాపురానికి చెందిన సత్య, అనుషా స్వల్పగాయాలతో బయటపడ్డరు. మరి కొంత మంది గాయాల పాలవ్వగా వారికి ప్రాథమిక చికిత్స అందించారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తెను ఇచ్చి వివాహం చేయనందుకే..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి నలుగురు మృతికి, ఇద్దరు చిన్నారులు గాయాల పాలవ్వడానికి కారణమైన నిందితులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీ బాజ్పేయి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటాల సమయంలో కోట్ని సత్యవతి(50) ఆమె కుమారుడు కోట్ని రాము(16) కుమార్తె గంటాా దుర్గా భవానీ(30) భవానీ కుమార్తె గంటాా విజయలక్ష్మి, మరో ఇద్దరు గంటా దుర్గా మహేష్, గంటాా యేసు కుమార్ ఒకే గదిలో నిద్రిస్తుండగా కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన మాసాడ శ్రీను, అతడి బావ మర్లపూడి మోహన్లు ఇంటి తలుపులు తీసి పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారని తెలిపారు. ఈ సంఘటనలో కోట్ని రాము(16), గంటా విజయలక్ష్మి(5) అక్కడికక్కడే దగ్ధమై మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలతో కోట్ని సత్యవతి, గంటా దుర్గా భవానీ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వీరితో పాటు గాయాలపాలైన గంటా దుర్గా మహేష్, గంటా ఏసు కుమార్లు కోలుకున్నారని వివరించారు. వివాహం చేస్తామని చెప్పి.. మాట తప్పారని.. కోట్ని సత్యవతికి మేనల్లుడయ్యే మాసాడ శ్రీనుకు తన రెండో కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని అతడి వద్ద రూ.లక్ష నగదు తీసుకుందని, అనంతరం శ్రీను వ్యసనాలకు బానిస కావడంతో వివాహం చేయలేదని వివరించారు. మేనత్త కూతుర్ని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి, తీసుకున్న అప్పు ఇవ్వకుండా తనను మోసం చేసిన మేనత్తపై కక్ష పెంచుకున్న మాసాడ శ్రీను ఆమె రెండో కుమార్తె రామలక్ష్మికి వేరే వివాహం చేశారని తెలుసుకొని జనవరి 17వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో దుళ్ల గ్రామంలోని సత్యవతి ఇంటికి వచ్చి ఆమె గొంతుపై చాకుతో దాడి చేసి పరారయ్యాడని తెలిపారు. ఈ సంఘటనపై కడియం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం తన మేనత్త బతికి ఉందని తెలుసుకున్న మాసాడ శ్రీను, అతడి బావ (అక్క భర్త) మర్లపూడి మోహన్లు, సత్యవతిని హత్య చేయాలని జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో దుళ్ల గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని సత్యవతి ఇంట్లో పడుకున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి బయట తలుపు గొళ్లెం పెట్టాడని వివరించారు. గదిలో మంటలు వ్యాపించి గదిలో నుంచి బయటకు వచ్చేందుకు వీలులేక మంటల్లో కాలిపోతూ కేకలు వేశారని తెలిపారు. ఈ కేకలు విన్న స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారని, ఈ సంఘటనలో కోట్ని రాము, గంటా విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కోట్ని సత్యవతి, ఆమె కుమార్తె గంటా దుర్గా భవాని చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. నిందితులను ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విశాఖ జిల్లా రావికవతం మండలం, టి.అర్జాపురం గ్రామంలోని సిమెంట్ ఇటుకల బట్టీ వద్ద మాసాడ శ్రీను, మర్లపూడి మోహన్ లను సౌత్ జోన్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కడియం ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ కుమార్ వారి సిబ్బంది సీహెచ్వీ రమణ, కె.సురేష్ బాబు, కె.బాల గంగాధర్, బి.నాగరాజుల సహాయంతో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని, స్పెషల్ టీమ్ను అభినందించి రివార్డు అందజేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకుతొమ్మిది ప్రత్యేక బృందాలు నిందితులను అరెస్ట్ చేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ షిమూషీ బాజ్పేయి తెలిపారు. ఎక్కడా ఆధారాలు లేకుండా మారణ హోమం సృష్టించిన నిందితులు ఆరు నెలలు ఒక చోట చొప్పున గ్రామాలు మారుతూ అప్పులు చేస్తుంటారని పోలీస్ విచారణలో తేలిందని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటన జరిగిన రాత్రి నిందితులు స్కూటీ పై దుప్పల పూడి వెళ్లి, కోళ్ల ఫారం వద్ద ఉంటున్న కుటుంబ సభ్యులకు ఏమి తెలియకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. కోళ్లఫారం యజమాని వద్ద తమ కుమారుడికి వంట్లో బాగోలేదని చెప్పి రూ.రెండు వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. సామర్లకోట రైల్వే స్టేషన్లో స్కూటీ మోటారు సైకిల్ను ఉంచి అనకాపల్లికి మకాం మార్చారని వివరించారు. మాసాడ శ్రీను, అతడి తండ్రి, తల్లి, అక్క, బావ వారి పిల్లలు నలుగురూ ఒక గ్రూప్గా ఉంటూ అప్పులు చేసి అక్కడి నుంచి పరారవుతుంటారని తెలిపారు. విశాఖ జిల్లా రావికవతం గ్రామంలో సిమెంట్ ఇటుకల బట్టీలో పనికి కుదిరారని, అక్కడ నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. -
జల్సాలకు అలవాటు పడి.. మైనర్లను ఉచ్చులోకి
తాళ్లరేవు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసి జువైనల్ కోర్టుకు తరలించినట్లు కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ తెలిపారు. కోరంగి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాళ్లరేవు, కాజులూరు, ఐ.పోలవరం మండలాల పరిధిలో గత కొన్ని రోజులుగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఐదుగురు యువకులను జార్జిపేట వై.జంక్షన్ వద్ద తమ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25 వేల నగదు, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి ప్రధాన నిందితుడైన ఓలేటి మహాలక్ష్మిరావు అలియాస్ మహాను ఏ1గా నమోదు చేసి అతనిపై రౌడీషీట్ కూడా దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఎదుర్లంక గ్రామానికి చెందిన మహాలక్ష్మీరావు కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతను జల్సాలకు అలవాటు పడి అభం శుభం తెలియని మైనర్లను ఈ ఉచ్చులోకి లాగుతున్నాడని తెలిపారు. ఆయా మండలాల పరిధిలోని నాలుగు కేసులకు సంబంధించి రికవరీలు చేశామన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఓ సుజుకీ బైక్, ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వైన్షాప్లో జరిగిన దొంగతనం కేసులో కొంతమేర నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులకు సంబంధించి ఉప్పంగల గ్రామంలో జరిగిన దొంగతనంలో మంగళసూత్రాలు, బంగారు నెక్లెస్, బ్రాస్లెట్, చెవి దుద్దులు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకున్న కోరంగి ఎస్సై వై.సతీష్, ఏఎస్సై వలీ, సిబ్బంది పి.కాసురాజు, ఎన్వి రమణ, పి.సురేష్ తదితరులును అభినందించడంతో పాటు వారికి రివార్డులు అందించనున్నట్లు సీఐ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ మురళీకృష్ణ సూచించారు. ఇటీవల సెల్ఫోన్ల దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయని తమ సెల్ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని రాత్రి వేళల్లో తలుపులు తెరచుకుని పడుకోరాదని అన్నారు. అలాగే తీర్థయాత్రలకు, ఎక్కడికైనా వెళ్లేటపుడు సెల్ఫోన్లో ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నూతన గృహాలు నిర్మించుకునేవారు తమ ఇంటివద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. సమావేశంలో ఎస్సై యడవల్లి సతీష్, ఏఎస్సై వలీ, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
చోరీ చేశారు.. చివరికి చిక్కారు
తూర్పుగోదావరి, మామిడికుదురు: సినీ ఫక్కీలో వారు బ్యాంకుకే కన్నం వేశారు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మామిడికుదురులోని ఎస్బీఐలో చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారిని ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు రాజోలు పోలీస్ స్టేషన్లో సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చోరీకి 11 మంది సభ్యులు వ్యూహం రచించారు. ఇందులో ఓ మహిళతో సహా ఏడుగురిని గత నెల 30న మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చిన వారిలో మహారాష్ట్రకు చెందిన సంతోష్హరి ఖాదం, సచిన్ హరోన్సిం«థే, మంగేష్ దనాజీగోర్, అముల్ మహదేవ్బాగల్, సవితా సంతోష్హత్కర్, యూపీకి చెందిన అస్లాం ఖాన్, జాఫర్ అలీ ఉన్నారు. నిందితుల నుంచి రూ.93,275 చిల్లర నాణేలతో పాటు రెండు చిన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మధ్యప్రదేశ్కు చెందిన బాబు కౌసర్ అలియాస్ బాబూఖాన్, పస్తా అలియాస్ తాజాబ్ అలమ్కల్లుఖాన్, నవజాద్ నన్సార్ అలీ అలియాస్ సహబాజ్ఖాన్, ఖళియా ఇస్రాక్ అలీఖాన్ అనే గుడ్డూఖాన్లను మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కాతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో అరెస్టు చేశారు. వారిని మామిడికుదురు ఎస్బీఐ చోరీ కేసులో అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. దోపిడీకి పాల్పడిన మిగతా సొమ్మును ఎక్కడ దాచారో వారి నుంచి కూఫీ లాగుతామన్నారు. నిందితులంతా పాత నేరస్తులే అన్నారు. కొల్హాపూర్లో వారిని అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్కు తీసుకుని రాజోలు జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చామన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రెండు నెలల క్రితమే రెక్కీ ఈ ముఠా బ్యాంకు చోరీల్లో ఆరితేరారు. ఇందులో భాగంగా మామిడికుదురులో చోరీకి రెండు నెలల ముందే రెక్కీ నిర్వహించారు. రెండు కార్లలో అమలాపురం మీదుగా మామిడికుదురుకు గత నెల 24వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ కార్లను వెనక్కి తిప్పి పంపించేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్, సిలిండర్ల సాయంతో బ్యాంకు ప్రధాన ద్వారం తాళాలు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్, సెల్ప్ లాకర్లను తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్ట్రాంగ్ రూమ్లోని అల్యూనిమినియం పెట్టెల్లో భద్రపరిచిన రూ.18.76 లక్షలను దోచుకుపోయారు. తెల్లవారు జామున 4.30 గంటల వరకు బ్యాంకులోనే ఉండి తరువాత బయటకు వచ్చి అక్కడ రెడీగా ఉన్న తమ వాహనాల్లోనే తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని కొల్హాపూర్ చెక్పోస్టు వద్ద పోలీసులకు చిక్కారు. అక్కడి పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మన జిల్లా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రాజోలు సీఐ డి.దుర్గాశేఖరరెడ్డితో పాటు వారి దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషాలు అభినందించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
గండేపల్లి (తూర్పుగోదావరి) : ఇంజినీరింగ్ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై బి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన కిలుకూరి అలేఖ్య (19) మండలంలోని సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతూ, అదే కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది. కొంతకాలం నుంచి తలనొప్పితో బాధపడుతూ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఆదివారం ఉదయం 6.40 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె తాను ఉంటున్న హాస్టల్లోని నాల్గో అంతస్తు పైనుంచి కిందకు దూకేసింది. ఆమె తలకు బలమైన గాయమై రక్తస్రావం జరిగింది. పక్కగదిలో ఉన్న హాస్టల్ విద్యార్థినులు ఈ విషయం గమనించి వార్డెన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను కళాశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమ్తితం కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి ప్రసాద్ రెడ్డి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై తెలిపారు. ప్రగడవరంలో విషాదఛాయలు చింతలపూడి: విద్యార్థిని ఆత్మహత్యతో స్వగ్రామం ప్రగడవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన చిలుకూరి ప్రసాద్రెడ్డి, నాగమణి దంపతుల కుమార్తె అలేఖ్య. విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన కాకినాడ తరలివెళ్లారు. చదువులో చలాకీగా ఉండే అలేఖ్య మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చాడని..
సాక్షి, తుని(తూర్పు గోదావరి) : వివాహేతర సంబంధానికి తరచూ అడ్డుతగులుతున్నాడన్న అక్కసుతో కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. తండ్రి, ప్రియుడు, ప్రియుడి స్నేహితుడి సహాయంతో భర్త హత్యకు ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేసి చివరికి జైలు పాలైంది. ఆమెకు సహకరించిన వారు కూడా కటకటాల పాలయ్యారు. ఈనెల 17వతేదీ రాత్రి తుని మండలం డి.పోలవరం బస్టాప్లో పడుకున్న చిల్లపల్లి అప్పారావు (38) హత్య గ్రామంలో సంచలనం కలిగించింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ కొత్తూరి కిషోర్బాబు, రూరల్ ఎస్సై గణేష్ కుమార్ ఇలా వెల్లడించారు. (బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం) వారి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామానికి చెందిన చల్లపల్లి అప్పారావు(38) ఈనెల 17న హత్యకు గురయ్యాడు. 18న సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యలో పాల్గొన్న వంకల చినగవరయ్య(గున్నయ్య) బుధవారం గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోగా, అతడిని విచారించగా హత్యతో సంబంధం ఉన్న చినగవరయ్య, చల్లపల్లి వేణు, వనశెట్టి ముసలయ్య(మురళి), లావేటి భానులను అరెస్టు చేశామన్నారు. చల్లపల్లి అప్పారావుకు తుని మండలం డి.పోలవరం గ్రామానికి చెందిన వేణుతో వివాహమైందని, స్వగ్రామంలో ఇతడిపై లైంగిక దాడి, దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. (దారుణం : బాలుడిపై సామూహిక అత్యాచారం) దీంతో అప్పారావు, భార్య వేణు మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా ఉండడంతో, వేణు తునికి చెందిన వనశెట్టి ముసలయ్య (మురళి) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందన్నారు. భర్త గ్రామానికి వచ్చిపోతుండడం వేణు, మురళీలకు ఇబ్బందిగా మారింది. దీంతో కాపురాన్ని తుని పట్టణంలోకి వేణు మార్చింది. భర్తను పూర్తిగా వదిలించుకోవాలని భావించిన వేణు తన ప్రియుడు మరళి, అతడి స్నేహితుడు లావేటి భాను, తండ్రి గున్నయ్యలతో కలసి హత్యకు ప్రణాళిక సిద్ధం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఎప్పటిలాగే మద్యం సేవించి గ్రామానికి వచ్చిన అప్పారావును మామగారైన గున్నయ్య బస్టాప్లో పడుకోబెట్టాడు. తర్వాత మురళి, భానులు వెళ్లి లారీ కమాన్ప్లేటుతో బలంగా తలపై కొట్టి హత్య చేశారన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు అప్పగించినట్టు తెలిపారు. -
‘పెట్రోల్ దాడి’ ఘటనపై దర్యాప్తు వేగవంతం
తూర్పుగోదావరి,కడియం: మండలంలోని దుళ్ల ముదిరాజుల పేటలో నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్పాయ్ స్వయంగా కేసును పర్యవేక్షిస్తుండడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడిగా భావిస్తున్న మాసాడ శ్రీను నివాసం ఉంటున్న తిరుపతికి ప్రత్యేక బృందం చేరుకుని అతడి బంధువులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిందితుడుతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. పెట్రోల్ బంకు వద్ద సీసీ టీవీ ఫుటేజీలను బట్టి ఇది తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఎవరన్న దిశలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 17న తన మేనత్తపై దాడి సమయంలో శ్రీను కూడా మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తి కోసం కూపీలాగుతున్నారు. అలాగే బాధితులు, నిందితుల బంధువులు, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. గొళ్లెం పెట్టడమే కీలకం.. నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, ఆ గది తలుపులకు బయట వైపు గొళ్లెం పెట్టడంపై ప్రస్తుతం పోలీస్లు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ గదితో పాటు పక్కనే ఉన్న ఇంటి యజమాని గదికి కూడా గొళ్ళెం పెట్టారు. 17వ తేదీన కూడా మేనత్త సత్యవతిపై దాడి సమయంలో ఇదే విధంగా యజమాని నిద్రపోతున్న గదికి మాసాడ శ్రీను గొళ్లెం పెట్టి, గొడవకు సిద్ధమైనట్టు తెలిసింది. పెట్రోల్ దాడి ఘటనలో కూడా అదే విధంగా తలుపులకు గొళ్లెం పెట్టడంతో నిందితుడు మాసాడ శ్రీనుగానే పోలీస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అలాగే పెట్రోల్ బంకులో వంద రూపాయల పెట్రోల్ను ప్లాస్టిక్ సీసాలో పోయించుకున్నప్పుడు మరో వ్యక్తి మోటారు సైకిల్పై ఉన్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. 17న దాడి సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులే వచ్చారు. తలుపులకు గొళ్లెం పెట్టడం, ఇద్దరు వ్యక్తులు ఉండడం, దాడికి కొద్ది సేపటి ముందే సీసాలో పెట్రోలు పోయించుకోవడం వంటి విషయాలను గమనిస్తే మాసాడ శ్రీనే నిందితుడై ఉండొచ్చని బలంగా విశ్వసిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మూడు రోజులు మృత్యువుతో పోరాడి.. రాజమహేంద్రవరం క్రైం: కాలిన గాయాలతో మూడు రోజులు గా నరకయాతన అనుభవించి, మృత్యువుతో పోరాడి మరో మహిళ మృతి చెందింది. దుళ్ల గ్రామంలో ఉన్మాది ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటనలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంటా దుర్గా భవాని(23) మృతి చెందింది. ఈ సంఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పాపం చిన్నారులు కళ్ల ముందే చెల్లెలు విజయలక్ష్మి, మేనమామ కోట్ని రాము అగ్నికి ఆహుతి కాగా బియ్యం పెట్టె చాటున దాక్కొని స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయట పడిన గంటా ఏసు కుమార్, గంటా దుర్గా మహేష్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలతో విలవిల్లాడుతున్నారు. తల్లి, చెల్లి, అమ్మమ్మ, మేనమామ ఇలా నలుగురినీ ఒకేసారి కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తల్లి చనిపోయిందనే సమాచారం ఆ చిన్నారులకు బంధువులు చెప్పకపోవడంతో ఆమె రాకకోసం వారు బెంగగా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులకుమృతదేహాలు అప్పగింత ఈ సంఘటనలో మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు కోట్ని సత్యవతి భర్త అప్పారావు(నిందితుడిని పట్టుకునేందుకు ఆచూకీ కోసం పోలీసులు తిరుపతి తీసుకువెళ్లారు.) అందుబాటులో లేకపోవడంతో అల్లుడు గంటా భద్రరాజు మామతో ఫోన్లో మాట్లాడి సత్యవతి, దుర్గా భవానీల మృతదేహాలకు రోటరీ కైలాస భూమికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు అయిన ఖర్చును వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి బాధితులకు అందించారు. -
కన్న తండ్రే కాటేశాడు
రాయవరం: కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన ఓ తండ్రి బాగోతమిది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాకలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన బాలిక రామచంద్రపురంలోని హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి, సోదరుడు నాయనమ్మతో కలిసి వెదురుపాకలో నివాసం ఉండటంతో పండగ సెలవులకు ఆదివారం ఇంటికి వచ్చింది. ఆ రాత్రే ఆమెకు కన్న తండ్రి కాళరాత్రిని చూపించాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మిన్నకుండి పోయింది. సోమవారం రాత్రి తిరిగి మరోసారి లైంగిక దాడికి తెగబడటానికి ప్రయత్నిస్తుంటే ఆమె పక్కింటికి పారిపోయి, ఫోన్లో సమీప బంధువులకు తెలిపింది. స్థానికులు ఈ విషయాన్ని 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పడంతో ఎస్సై ఎల్.శ్రీనివాసనాయక్ ఘటనా స్థలికి వెళ్లి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి, అనపర్తి సీఐ ఎన్వీ భాస్కరరావు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. గతంలోనూ ఆ చిన్నారిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడటానికి ప్రయత్నించగా స్థానికులు దేహశుద్ధి చేసినట్లు సమాచారం. -
మధ్యప్రదేశ్లో చోరీ.. కాకినాడకు చేరి
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: మధ్యప్రదేశ్లోని ఓ హోటల్లో మారు తాళంతో బంగారు వ్యాపారి ఉండే రూమ్ను తెరచి రూ.2.300 కిలోల బంగారాన్ని దొంగిలించిన ఓ వ్యక్తిని కాకినాడలో త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామానికి చెందిన పిన్నిటి రమేష్బాబు కాకినాడలో కొన్ని సంవత్సరాలుగా ఇత్తడి వ్యాపారం చేస్తూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం వివేకనగర్లో ఉంటున్నాడు. ఇతడు 20 రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీ, రాజ్వాడ్కు వెళ్లి హోటల్ పుష్కర్లో రూమ్ తీసుకొని ఆ హోటల్లో ఉన్న మిగిలిన రూములకు సంబంధించి నకిలీ తాళాలు తయారు చేయించారు. దీనిలో భాగంగా ఆ హోటల్లో బస చేసిన ఒక బంగారు వ్యాపారి రూమ్ తాళాన్ని తెరిచి ఆ రూమ్లో ఉన్న బంగారాన్ని రమేష్బాబు దొంగిలించాడు. దీనిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ముద్దాయి కాకినాడలో ఉన్నట్టు ఇండోర్ ఎస్పీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీకి తెలిపారు. దీనిపై అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం కాకినాడ ఎస్డీపీవో కరణం కుమార్ను అప్రమత్తం చేశారు. కాకినాడ మూడో పట్టణ పోలీసులు పలు చోట్ల దర్యాప్తు చేపట్టారు. ఇండోర్ పోలీసులు కాకినాడకు చేరుకోవడంతో త్రీటౌన్ శాంతి, భద్రతల విభాగం సిబ్బందితో కలసి సర్పవరం వివేకనగర్లో ఉన్న ముద్దాయి రమేష్బాబు ఇంటిని చెక్ చేయగా ఇండోర్ సిటీ, రాజ్వాడ్లోని హోటల్ పుష్కర్లో ముద్దాయి దొంగిలించి తీసుకొచ్చిన 2.300 కిలోల బంగారాన్ని సీజ్ చేసి ముద్దాయిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ కరణం కుమార్, సీఐ శ్రీరామకోటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర తెలిపారు. ముద్దాయి పిన్నిటి రమేష్బాబును నాలుగో అదనపు మొదటి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
పీజీ అమ్మాయి.. పదో తరగతి అబ్బాయి
ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. యువతి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ అయితే.. యువకుడు అదే ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్.. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ప్రేమను పెద్దలకు చెప్పలేక.. తీవ్ర మానసిక సంఘర్షణ మధ్య ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి ప్రేమ కథకు వారికి వారే ముగింపు పలుకుతూ.. వారి రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టారు. సాక్షి, మలికిపురం(తూర్పుగోదావరి జిల్లా): మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన చిక్క రాముడు, సూర్యకుమారి భార్యాభర్తలు. వీరికి వీరవెంకట నాగ సత్య దుర్గా ప్రశాంతి కుమార్తె, సాయి వీరేంద్ర కుమారుడు. వీరిది నిరుపేద కుటుంబం. చేనేత వృత్తితో ఆదాయం సరిపోక తండ్రి రాముడు తాపీపని చేస్తుంటారు. భర్త చేనేతలో పాలు పంచుకుంటూ భార్య కూడా నేత నేస్తుంది. తమ సంతానం తమ మాదిరిగా కాకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆ పేదింటి తల్లిదండ్రుల పట్టుదల. అందుకు తగ్గట్టుగానే కుమార్తెను పీజీ వరకు చదివించారు. కుమారుడు కూడా పీజీ పదువుతున్నాడు. పీజీ అనంతరం ప్రశాంతి మండలంలోని గూడపల్లి వెంకటసత్య కాన్సెప్ట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ కుటుంబానికి చేదుడు వాదోడుగా నిలుస్తూ వచ్చింది. శోక సముద్రంలో ప్రశాంతి తల్లిదండ్రులు తీవ్ర మానసిక సంఘర్షణతో.. రాజోలు మండలంలో కాట్రేనిపాడుకు చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన యాలంగి రమేష్తో ఆమెకు పరిచయమై అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ భావించారు. పదో తరగతి చదివిన యాలంగి రమేష్ ప్రశాంతి పనిచేసే కాన్వెంట్ స్కూల్ వ్యాన్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఈనెల 8న ప్రశాంతికి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. అయితే ప్రశాంతి తన ప్రేమ సంగతిని కుటుంబ సభ్యులకు చెప్పలేక, ప్రేమించిన యువకుడిని వదల్లేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైంది. అయితే తల్లిదండ్రులు ఆమెకు ముందుగా కుదిర్చిన యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించేశారు. ఆ మరుసటి రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకున్న కళాశాల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని చెప్పి బయల్దేరిన కుమార్తెను ఆ తల్లి ఉదయమే బస్సు ఎక్కించి దగ్గరుండి మరీ సాగనంపింది. అవే ఆ తల్లీ, కుమార్తెలకు కడసారి చూపులు అవుతాయని ఆరోజు వారు అనుకోలేదు. సర్టిఫికెట్ల కోసమని వెళ్లిన కుమార్తె చీకటిపడినా రాకపోవడంతో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈనెల 12న యానాం వద్ద గోదావరిలో కుమార్తె ప్రశాంతి, ఆమె ప్రేమికుడు రమేష్ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలియదని తెలిస్తే సహకరించే వారమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా సున్నితమనస్కురాలైన ప్రశాంతి చదువులో ఎప్పుడూ ఫస్ట్లోనే ఉంటానని చెబుతూ అలానే చదువుకుందని, పెద్ద ఉద్యోగం చేసి తమకు కష్టాలు లేకుండా చేస్తానని ఎప్పుడూ చెప్పే చిట్టి తల్లి కళ్లెదుటే కనిపించకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు కుమార్తె ఫొటోను చూసుకుంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. మరో వైపు యాలంగి రమేష్ తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సీతలను ఎవరైనా పలకరిస్తే చాలు దుఃఖం పొంగుకువచ్చేస్తోంది. ఆ ప్రేమజంట అర్ధాంతరంగా తనువు చాలించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. -
భారీ సంఖ్యలో పట్టుబడిన కోడికత్తులు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోళ్ల పందాలలను నివారించే దిశగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడి కత్తుల తయారీ కేంద్రాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాళ్లరేవు మండలం కోరంగి పరిధిలో సోమరాజు అనే వ్యక్తి వద్ద సుమారు రూ. 12 లక్షలు విలువ చేసే 3800 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కరణం కుమార్ హెచ్చరించారు. -
భూమాయ కేసులో.. కీలక సూత్రధారుల అరెస్టు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం భూమాయ కేసులో ప్రధాన నిందితులు, సూత్రధారులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వేదికగా సాగిన ఈ భూమాయలో ప్రధాన నిందితులైన ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు, లక్ష్మీనరసమ్మ, వారి కుమారుడు మోటూరి బలరామమూర్తిలను అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఆధ్వర్యంలో పట్టణ సీఐ జి.సురేష్బాబు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఎర్రవంతెన వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వాస్తవంగా లేని 53 ఎకరాల భూములకు నకిలీ రికార్డులు సృష్టించి వాటిని అమలాపురం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో తనఖా పెట్టి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన, సహకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బేబీ జ్ఞానాంబతో పాటు మరో సూత్రధారి కామనగరువు వీఆర్వో బడుగు ప్రశాంత్కుమార్, అమలాపురం తహసీల్దార్ కార్యాలయ వెబ్ ల్యాండ్ కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ, కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితులు భార్యాభర్తలు, వారి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయగా అదే రోజు ఈ కేసులో మరో నిందితుడైన బ్యాంక్ రుణానికి గ్యారంటీర్గా ఉన్న ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు పొలంలో పనిచేసే పాలేరు కాశి పల్లంరాజు కూడా కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. ఇక కేసులో అరెస్ట్ చేయాల్సిన ఒకే ఒక నిందితుడు విశ్రాంత తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ పరారీలోనే ఉన్నాడు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్బాబు, ఎస్సై వి.శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. మోసం బయటపడిందిలా.. బ్యాంక్ను బురిడీ కొట్టించి తీసుకున్న భారీ రుణానికి కొన్ని వాయిదాలు చెల్లించి మోటూరి కుటుంబీకులు మిన్నకున్నారు. అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు తమ వార్షిక తనిఖీల్లో భాగంగా తనఖా పెట్టిన ఈ 53 ఎకరాల భూములను వెబ్ల్యాండ్ చూసుకోవడంతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెబ్ ల్యాండ్లో, క్షేత్రస్థాయిలో ఆ భూములు లేకపోవడంతో బ్యాంక్ను మోసం చేసినట్టు గత సెప్టెంబర్లో గుర్తించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఈ భూమాయ వెలుగు చూసింది. బ్యాంక్, రిజిస్ట్రార్ అధికారులపైవచ్చిన అభియోగాలపైనా విచారణ ఈ భూమాయలో అటు అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు ఈసీ, మార్టగేజ్ చేసిన ఆ కార్యాలయ అధికారులపైన, క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా, లీగల్ ఒపీనియన్ సరిగా తీసుకోకుండా రుణం ఇచ్చేసిన బ్యాంక్ అధికారులపైన వస్తున్న అభియోగాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్బాబు వెల్లడించారు. వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నకిలీ రికార్డుల సృష్టి ఇలా.. మోటూరి చినతాతయ్యనాయుడు కుటుంబీకులు 2017 ఆగస్టులో తొలుత కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానం గ్రామాల్లో లేని 53 ఎకరాలకు అప్పటికే అదే మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న ప్రశాంత్కుమార్ పథకంతో ఆ రెండు గ్రామాల వీఆర్వోల సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించారు. అందుకు అప్పటి కాట్రేనికోన తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ కూడా సహకారం అందించారు. ఈ నకిలీ రికార్డులను హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సమర్పించి రూ.1.50 కోట్ల రుణం కోసం ప్రయత్నించారు. అయితే భూములు కాట్రేనికోన మండలానికి చెందినవి కావడంతో బ్యాంక్ అధికారులు ఈ దస్తావేజులను మార్ట్గేజ్ కోసం ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపారు. అక్కడి రిజిస్ట్రార్ వాటిని పరిశీలించగా నకిలీ రికార్డులుగా గుర్తించి ఈ సమాచారాన్ని కాట్రేనికోన తహసీల్దార్ కార్యాలయానికి తెలిపారు. దీంతో అక్కడ వీరి అక్రమాలు పారకపోవడంతో వారి స్కెచ్ను అమలాపురం తహసీల్దార్ కార్యాయానికి మార్చారు. అప్పటికే అమలాపురం రూరల్ మండలం వీఆర్వోగా వచ్చిన ప్రశాంత్కుమార్ మరో స్కెచ్ వేశారు. అందుకు అప్పటి అమలాపురం తహసీల్దార్ బేబీ జ్ఞానాంబతో పాటు అదే కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ అందుకు సహకరించారు. అంతే మరోసారి ఇదే మండలంలో లేని 53 ఎకరాలకు తప్పడు రికార్డులు తయారుచేయడం, వాటిని అదే బ్యాంక్లో తనఖా పెట్టడం చకాచకా జరిగిపోయాయి. ఈసారి ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరికిపోయినట్టు దొరికిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు మార్టగేజ్ అయ్యే వరకు వెబ్ల్యాండ్లో నకిలీ సర్వే నంబర్లు అలానే ఉంచి బ్యాంక్ రుణం మంజూరు చేసిన తర్వాత వెబ్ ల్యాండ్ నుంచి ఈ నంబర్లను రీవోక్ చేసేశారు. ఇదంతా 2018 జూన్లో జరగడం...బ్యాంక్ రుణం ఇచ్చేయడం జరిగిపోయింది. ఎవరికి ఎంతెంత లంచం? ఈ భూమాయలో సహకరించిన రెవెన్యూ అధికారులకు మోటూరి తాతయ్యనాయుడు కుటుంబీకులు బ్యాంక్ నుంచి అప్పనంగా తీసుకున్న రూ.1.50 కోట్ల రుణం నుంచి రూ.22 లక్షలు లంచాలుగా పంచేశారు. తొలుత కాట్రేనికోన తహసీల్దార్ కార్యాయంలో పుట్టించిన నకిలీ రికార్డుల కోసం అప్పటి తహసీల్దార్ రమేష్కు రూ.ఐదు లక్షలు, స్కెచ్ వేసిన వీఆర్వో ప్రశాంత్కుమార్కు రూ.ఐదు లక్షలు, కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలకు చెరో రూ.రెండు లక్షలు ఇచ్చారు. తర్వాత అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన నకిలీలకు తహసీల్దార్ బేబీ జ్ఞానాంబకు రూ.ఐదు లక్షలు, వీఆర్వో ప్రశాంత్కుమార్కు రూ.రెండు లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణకు రూ.లక్ష లంచాలు అందించారు. ఈ లంచాల వివరాలను సీఐ సురేష్బాబు గణాంకాలతో వివరించారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలి
సాక్షి, పిఠాపురం(తూర్పు గోదావరి): ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలంటూ చేబ్రోలుకు చెందిన బండి దుర్గాభవాని శుక్రవారం రాత్రి గొల్లప్రోలు పోలీస్స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం గోర్స సమీపంలోని ఆనంద్ నగర్కు చెందిన సలాది నాగేశ్వరరావు, దుర్గాభవాని రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేసి వేరే పెళ్లికి సిద్ధపడ్డాడు. దీంతో దుర్గాభవాని తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ముందు 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి నిరసనకు దిగింది. తాళి»ొడ్డు, పూలదండలతో రోడ్డుపై బైఠాయించింది. నాగేశ్వరరావుతో తన వివాహం జరిపించాలని పట్టుబట్టింది. దీంతో మెయిన్రోడ్డుపై రెండు గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామలింగేశ్వరరావు ఆ యువతికి, బంధువులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. పిఠాపురం సీఐ బి.సూర్య అప్పారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ను బైపాస్ రోడ్డువైపు మళ్లించారు. రాత్రి పది గంటలకు కూడా నిరసన కొనసాగుతోంది. దుర్గాభవాని ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విషాదంగా మారిన దీప్తీశ్రీ కిడ్నాప్ కేసు
సాక్షి, తూర్పుగోదావరి : మూడు రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి దీప్తీశ్రీ (7) కేసు చివరికి విషాదంగా మారింది. కాకినాడలో శుక్రవారం పాఠశాలకు వెళ్లిన దీప్తీ కిడ్నాప్కు గరైన విషయం తెలిసిందే. పాప సవతి తల్లి శాంతి కుమారినే ఈ దారుణానికి పాల్పడినట్లు చిన్నారి నాయనమ్మ ఆరోపించడంతో పోలీసులు శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీప్తిని గొంతు నులిమి హత్య చేసినట్లు, ఉప్పుటేరు కాల్వలో పడేశానని పలు రకాల సమాధానాలు చెప్పడంతో కాకినాడ సబ్ డివిజన్ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చర్యలు ముమ్మరం చేసిన పోలీసులకు ఇంద్రపాలెం లాకుల వద్ద గుర్రపు డెక్కల కింద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి దీప్తీని సవతి తల్లి శాంతికుమారి అపహరించి హత్య చేసిందని, అనంతరం ఆమె మృతదేహాన్ని మూటలో కట్టి ఇక్కడ పడేసినట్లు పోలీసులు తెలిపారు. -
యువతితో ట్రాప్ చేయించి.. నగ్న వీడియోలతో
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్ చేయించి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉండగా, రాకేష్ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముఠాకు చెందిన రాకేష్ భార్య అశ్వినీతో గొల్లలమామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్ చేయించారు. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు. ఈ క్రమంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు ముఠాకు చెందిన వ్యక్తులు వీడియోలు చిత్రీకరించారు. అనంతరం ఆ నగ్న వీడియోను చూపించి మణికంఠను బెదిరించడం మొదలుపెట్టారు. అతడిని కిడ్నాప్ చేసి దాదాపు 63 వేల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాకు చెందిన రాకేష్తో పాటు వారికి సహకరించిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా దుర్గారెడ్డికి, రాకేష్కు సహకరించిన ఈ ఏడుగురు కాకినాడకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ముఠాలోని ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఏసీబీ వలలో అవినీతి ఏఎస్సై
సాక్షి, కాకినాడ: కాకినాడలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. ఏఆర్ కానిస్టేబుల్గా పోలీసు శాఖలో 1981లో చేరిన గుణ్ణం వీరవెంకట సత్యనారాయణ చౌదరి 37 ఏళ్లలో రూ. కోట్లకు పడగెత్తారు. తన ఉద్యోగంతో పాటు అక్రమ ఆస్తులనూ అదే స్థాయిలో కూడబెడుతూ వచ్చారు. ఏఎస్సై స్థాయి అధికారి రూ. కోట్లకు పడగెత్తాడంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని వివిధ చోట్ల రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని, వారికి బినామీగా ఉంటూ రూ. కోట్లకు ఎగబాకినట్టు తెలుస్తోంది. రాత్రిపూట వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల వారిని తనిఖీల పేరుతో భారీగా సొమ్ములు వసూలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా పోలీసులు సైతం చెబుతున్నారు. ఆయన తాను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం, స్థలాలు కొనుగోలు చేయడం, తన శాఖ అధికారులు, సిబ్బంది, బంధువులు, స్నేహితులతో వడ్డీ వ్యాపారం చేయించడం అలవాటుగా మార్చుకున్నాడు. పొలం కొనుగోలుతో వివాదం ఇటీవల సామర్లకోట మండలం అచ్చంపేట–ఉండూరు మధ్యలో సత్యనారాయణ చౌదరి అరెకరం పొలం కొనుగోలు చేయడంతో వివాదం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు వ్యక్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు చెబుతున్నారు. కాకినాడ ట్రాఫిక్లో హెచ్సీగా పనిచేసిన సత్యనారాయణ చౌదరి పదోన్నతిపై పోర్టు పోలీస్ స్టేషన్ ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. వారు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు జరిపారు. కాకినాడ జగన్నాథపురం మరిడమ్మపేటలోని సత్యనారాయణ చౌదరి ఇంటితో పాటు కాకినాడ రామారాపుపేట, రావులపాలెం, సామర్లకోటలోని రెండుచోట్ల, యానాం, గండేపల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో బుధవారం సోదాలు నిర్వహించారు. ముందుగా కరప మండలం అరట్లకట్టకు పెదపూడికి ఏసీబీ బృందాలు వెళ్లాయి. అరట్లకట్టలో అత్తగారి పేరుతో ఇల్లు, చర్చి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కాకినాడలో రెండుచోట్ల, సామర్లకోటలో రెండుచోట్ల, రావులపాలెంలోను సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు గుర్తించాయి. రూ. మూడు కోట్లుగా చెబుతున్నా.. అధికారులు గుర్తించిన ఏఎస్సై అక్రమాస్తుల విలువ రూ. మూడు కోట్లుగా చెబుతున్నప్పటికీ బయట మార్కెట్లో చూస్తే వీటి విలువ రూ.10 నుంచి 15 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో జగన్నాథపురంలోని రెండంస్తుల భారీ భవనం, రామారావుపేటలో రెండంస్తుల డాబా ఇల్లు, సామర్లకోటలో రెండంతస్తుల భవనాలు రెండు, యానాంలో నాలుగంతస్తుల భవనంతో పాటు కేజీన్నర బంగారం, కేజీ వెండి, 100కు పైగా అప్పులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, ఎనిమిది ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలు, రూ. 3 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులతో పాటు 10 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ బ్యాంకులో రూ.19.75 లక్షలు ఉన్నట్లు బ్యాంకు పుస్తకాల పరిశీలనలో తెలిసింది. అంతేగాకుండా పెద్ద మొత్తంలో బ్యాంకు లాకర్లు ఉన్నాయని, వీటిల్లో కూడా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సత్యనారాయణ చౌదరి భార్య వీరవెంకట వరలక్ష్మి పేరుతోనే ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. బ్యాంకులోని లాకర్లను కూడా తెరిపించనున్నట్లు వివరించారు. బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, ఏసీబీ అధికారులు తిలక్, పుల్లారావు, సూర్యనారాయణ తదతరులు పాల్గొన్నారు. ఏఆర్ కానిస్టేబుల్గా ప్రస్థానం సామర్లకోట మండలం ఉండూరుకు చెందిన సత్యనారాయణ చౌదరి 1981లో ఏఆర్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. కొంతకాలం తర్వాత సివిల్ కానిస్టేబుల్గా మారారు. కాకినాడ, సామర్లకోట, రావులపాలెం, పిఠాపురం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఎక్కువ కాలం కాకినాడలోనే ఆయన ఉద్యోగం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వాధికారులకు అవినీతికి పాల్పడినా, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా తమకు సమాచారం అందించాలని ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, డీఎస్పీ రామచంద్రరావు కోరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో సత్యనారాయణ చౌదరిని అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఆ మూడూ హత్యలు చేసింది సింహాద్రినే!
ఇంతవరకు ఆ ముగ్గురు సాధారణంగానే మృతి చెందారని భావించారు. అయితే వారిలో ఒకరిది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరూ ఊహించన విధంగా ఆ ముగ్గురు హత్యకు గురయ్యారన్న విషయం తెలియగానే రాజమహేంద్రవరంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ముగ్గురిని హత్య చేసింది ఒక్కడే. వారిలో బంధువులైన ఇద్దరు మహిళలను.. ఆశ్రమం స్వామీజీని నిందితుడు హత్య చేశాడు. దీంతో బంధువులు బోరున విలపిస్తుంటే.. ఆశ్రమం పరిసర గ్రామాల వారు అవాక్కయారు. సంచలనం సృష్టించిన ఈ హత్యల ఉదంతం ఇలా ఉంది. సాక్షి, రాజమహేంద్రవరం: ఎవరికీ అనుమానం రాకుండా బంగారు వస్తువులు, నగదు చోరీకి పాల్పడుతూ నగరంలో మూడు హత్యలు చేసిన ఏలూరు మండలం వెంకటాపురానికి చెందిన వెల్లంకి సింహాద్రి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు చిక్కాడు. జిల్లాలో ఈ ముగ్గురిని హత్య చేసిన అతడు ఏమీ ఎరుగనట్టు వారి కుటుంబ సభ్యులతోనే తిరుగుతూ ఆ తర్వాత తప్పించుకోపోయాడు. చివరకు ఒక హత్య కేసులో దొరకడంతో డొంక కదిలింది. తాను చేసిన పది హత్యల్లో జిల్లాలో ముగ్గురుగు ఉన్నట్టు నిందితుడు అంగీకరించాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని రామకృష్ణానంద స్వామీజీ ఆశ్రమం నిర్వాహకుడు రామకృష్ణానంద స్వామి, రాజమహేంద్రవరం పేపరు మిల్లు ప్రాంతానికి చెందిన కొత్తపల్లి నాగమణి, బొమ్మూరు గ్రామానికి చెందిన శామంతకుర్తి నాగమణిలను నిందితుడు హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రియల్ ఎస్టేటు లాభసాటిగా లేదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంత లాభసాటిగా లేదని, సులభంగా డబ్బు సంపాదించాలని సింహాద్రి ఆలోచనలో పడ్డాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగురాళ్లు ఇంట్లో ఉంటే కోటీశ్వరులు కావచ్చని, గుప్త నిధులు చూపిస్తానని, బంగారాన్ని రెట్టింపు చేస్తానని నమ్మించడం మొదలెట్టాడు. సైనేడ్ కలిపిన ప్రసాదం, ఆయుర్వేదం మందు ఇచ్చి.. 20 నెలల్లో పది మందిని హతమార్చాడు. ఏలూరుకు చెందిన పీఈటి కాటి నాగరాజు మృతితో భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏలూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంతో జిల్లాకు చెందిన మూడు హత్యలు బయటపడ్డాయి. 2018 ఏప్రిల్ 28న.. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో రామకృష్ణా పరమానంద స్వామీజీ ఆశ్రమంలోని రామకృష్ణానంద స్వామీజీ వద్దకు నిందితుడు భక్తుడిగా స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. నిత్యాన్నదానం, పండగలకు హోమాలు స్వామీజీ చేస్తుంటే.. ఆయనతో ఉంటూ పరిసర ప్రాంతాల వారికి సుపరిచితుడయ్యాడు. స్వామీజీ వద్ద భారీగా సొమ్ము ఉంటుందని భావించి 2018 ఏప్రిల్ 28న ఆయుర్వేద మందులో సైనేడ్ కలిపి ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామీజీ బస్టాండ్ వద్ద ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్వామీజీ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందారనుకుని అందరూ భావించారు. ఆశ్రమంలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. స్వామిజీ వద్ద నగదు లేకపోవడంతో అతడు వెనుదిరిగాడు. సింహాద్రి పోలీసులకు చిక్కడంతో స్వామీజీ గుండెపోటుతో మరణించలేదని, హత్యకు గురయ్యాడని తెలియడంతో పురుషోత్తపట్నం తదితర ప్రాంతాల వారు ఆశ్చర్యపోతున్నారు. స్వామిజీని ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయం వరకు ఉన్న సింహాద్రి ఆ తరువాత కనిపించ లేదని స్థానికులు చెబుతున్నారు. స్వామీజీని హత్య చేశారన్న విషయాన్ని జీరి్ణంచుకోలేకపోతున్నామని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 డిసెంబర్ 23న.. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు క్వార్టర్స్లో ఉండే కొత్తపల్లి నాగమణికి సింహాద్రి సమీప బంధువు. చుట్టపు చూపుగా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. 2018 డిసెంబర్ 23న డయోబెటిక్ మందు అంటూ ఆమెతో సైనేడ్ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆమె మెడలోని బంగారు మంగళ సూత్రం తాడు తీసుకుని పరారయ్యాడు. ఆమెది అందరూ సహజ మరణంగా భావించారు. ఆమె దిన కార్యక్రమాల్లో ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే అతడు తిరిగాడు. ఈ ఏడాది జనవరి 12న.. కొత్తపల్లి నాగమణిని హత్య చేసిన కొద్దిరోజులకే ఆమె కోడలు, వరుసకు వదిన అయిన బొమ్మూరు గ్రామానికి చెందిన దెందులూరులో హెచ్వీగా పనిచేస్తున్న శామంతకుర్తి నాగమణి (50)ను డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఈ ఏడాది జనవరి 12న ఆమె ఆలమూరు వెళ్లి యేసురాజు అనే వ్యక్తిని చేబోదులుగా రూ.5 లక్షలు అడిగింది. మధ్యాహ్నం బ్యాంకులో బంగారం పెట్టి ఇస్తానని చెప్పి తీసుకువచ్చింది. మధ్యాహ్నం బొమ్మూరులోని ఇంటి వద్ద సింహాద్రి ప్రసాదం పేరుతో ఆమెకు సైనేడ్ తినిపించి, రూ.5 లక్షలు, బంగారు వస్తువులతో పరారయ్యాడు. బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను అప్పుట్లో బొమ్మూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మర్నాడు సింహాద్రి పోస్టుమార్టం వద్దకు వచ్చి రూ.5 లక్షలు ఇచ్చిన యేసురాజుపై కేసు పెట్టేంచేలా ప్రయత్నాలు చేశాడు. కుటుంబ సభ్యులు సైతం అతనికి మద్దతుగా నిలిచారు. తల్లి నాగమణిని, భార్యను అతడు హత్య చేశాడని తెలుసుకున్న భర్త మాణిక్యాలరావు అవాక్కయ్యాడు. కుటుంబ సభ్యుడే ఇలా హత్యలకు పాల్పడడాన్ని వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. బాధలో ఉన్న తమను ఇంక వదిలేయాలని ప్రాధేయపడ్డారు. -
కొడుకును చంపిన తండ్రి
చుట్ట ఇవ్వలేదన్న కోపంతో బిక్కవోలు మండలం కొంకుదురులో ఓ తండ్రి క్షణికావేశంలో తన తయుడుని హతమార్చగా.., కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురంలో మరో తండ్రి కుమారుడి వేధింపులు భరించలేక అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో సంచలనమయ్యాయి. సాక్షి బిక్కవోలు (తూర్పుగోదావరి): ఓ చుట్ట కోసం కొడుకుతో తగాదా పెట్టుకున్న తండ్రి క్షణికావేశంలో కర్రతో తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయిన ఘటన బిక్కవోలు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ శివారులో ఉన్న ఇటుక బట్టిలో పని చేయడానికి నాలుగు నెలల కిందట జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పాక చంటి, అతని రెండో భార్య అర్జమ్మ వచ్చారు. గురువారం రాత్రి తండ్రి చుట్ట ఇమ్మని కొడుకుని అడిగితే ఇంట్లో బియ్యం పెట్టె మీద ఉంది తీసుకోమన్నాడు. అది కనిపించలేదు. దీంతో కొడుకు మీద కొప్పడ్డాడు. ఇలా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో తండ్రి కోపంతో కర్ర తీసుకువచ్చి కొడుకు నాగు (24)తలపై కొట్టాడు. ఆ దెబ్బకు తల పగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసికెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి సమాచారం మేరకు బిక్కవోలు పోలీసులు శుక్రవారం ఉదయం అనపర్తి సీఐ ఎన్వీ భాస్కరరావు, ఎస్త్సె పి.వాసు, వీఆర్వో రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు చంటి పరారీలో ఉన్నాడని ఎస్త్సె పి.వాసు తెలిపారు. కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం కిర్లంపూడి (జగ్గంపేట): కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మండలంలోని ఎస్ తిమ్మాపురం గ్రామంలో జరిగింది. కిర్లంపూడి ఎస్సై జి అప్పలరాజు కథనం ప్రకారం.. ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన నక్కా పెదఅప్పారావుకి నలుగురు కుమారులు ఉన్నారు. ఇతడు ప్రతినెలా వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్నాడు. ప్రతినెలా పెద్ద కొడుకు నక్కా పెద సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు తండ్రి వద్ద నుంచి బలవంతంగా పింఛను డబ్బులు గుంజుకుంటున్నాడు. ఈ నెలలో అలా చేయడంతో పెదఅప్పారావు కొడుకు సత్తిబాబుపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడి ముఖంపై బలమైన గాయమవ్వడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగో కుమారుడు నక్కా శివ ఫిర్యాదు మేరకు తండ్రి నక్కా పెదఅప్పారావుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.అప్పలరాజు తెలిపారు. -
భార్య రాలేదన్న మనస్తాపంతో..
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: పుట్టింటి నుంచి భార్య రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఇంట్లో ఫ్యాన్ ఉక్కుకు లుంగీతో ఉరేసుకొని మరణించాడు. టూటౌన్ పోలీస్స్టేషన్ సీఐ పి ఈశ్వరుడు కథనం ప్రకారం.. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 47వ డివిజన్ ఎస్ అచ్యుతాపురం రావిచెట్టువీధికి చెందిన నూతలపాటి వీరబాబు (22)కి గొల్లప్రోలుకు చెందిన సత్యవేణితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన దగ్గర నుంచి భార్య సత్యవేణి పుట్టింటికి వెళ్లిపోతుండడంతో ఈనెల 16న తన భార్యను తీసుకువచ్చేందుకు వీరబాబు గొల్లప్రోలు వెళ్లాడు. తన భార్యను పంపించాలని అడగడంతో అత్త, మామ, బావమరిది భార్య కలసి వీరబాబును కొట్టి పంపించేశారు. భార్యపై ఆపేక్ష పెంచుకున్న వీరబాబు మళ్లీ దీపావళి పండగకు గొల్లప్రోలు వెళ్లాడు. అత్తింటి వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో తిరిగి వచ్చి సోమవారం రాత్రి తన ఇంట్లోనే లుంగీతో ఫ్యాన్ ఉక్కుకు ఉరేసుకుని చనిపోయినట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు. మృతుడు తల్లి వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
రాలిపోయిన క్రీడా కుసుమం
సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): క్రీడా కుసుమం రాలిపోయింది. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన నాగబాబు కన్నుమూశాడు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకుడిని బాణసంచా పేలుడు పొట్టను పెట్టుకుంది. ఈ నెల 18న తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడు ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణ(18) నాలుగు రోజులపాటు నరకయాతన అనుభవించి మంగళవారం తనువు చాలించాడు. నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని జి.వేమవరం తీసుకువెళ్లారు. కన్నీటి వీడ్కోలు.. చేతికందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లి అనంతలక్ష్మి, సోదరుడు పవన్ కృష్ణమూర్తిలు బోరున విలపించడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. నాగబాబుతో కలసి చదువుకున్న స్నేహితులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు సైతం నాగబాబు మృతదేహం వద్ద బోరున విలపించారు. పేలుడు ఘటనలో గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి సత్యనారాయణకు కుమారుడి మరణవార్త తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు విషణ్ణవదనాలతో నాగబాబుకు కన్నీటి వీడ్కోలు పలికారు. వాలీబాల్, సాఫ్ట్బాల్, త్రోబాల్ క్రీడల్లో విశేష ప్రతిభ నాగబాబు చిన్నతనం నుంచి చదువుతో పాటు ఆటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆరో తరగతి నుంచి క్రీడల్లో సత్తా చాటుతున్నాడు. అండర్–14, అండర్–19 విభాగాల్లో త్రోబాల్, సాఫ్ట్బాల్, వాలీబాల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కురుక్షేత్రలో జరిగిన త్రోబాల్ చాంపియన్షిప్, హర్యానాలో జరిగిన వాలీబాల్ అండర్ 14 ఎస్జీఎఫ్ఐ క్రీడల్లో ప్రతిభ కనబరిచాడు. రెండుసార్లు వాలీబాల్, నాలుగుసార్లు సాఫ్ట్బాల్ జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినట్టు జి.వేమవరం హైసూ్కల్ పీడీ స్వామి తెలిపారు. నాగబాబు ఐడియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో జరిగిన వైఎస్సార్ ఎస్జీఎఫ్ క్రీడల్లో పాల్గొన్నాడు. క్రీడల నుంచి 17వతేదీన తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే 18వ తేదీన తండ్రితోపాటు బాణసంచా తయారీకి వెళ్లి పేలుడు ఘటనలో బలయ్యాడు. రూ.10 లక్షల నష్ట పరిహారం జి.వేమవరం బాణసంచా పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణకు రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించినట్టు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ పేర్కొన్నారు. బాణసంచా బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో మంచి క్రీడాకారున్ని కల్పోవడం బాధాకరమన్నారు. బంగారంలాంటి క్రీడాకారున్ని కోల్పోయాం మంచి క్రమశిక్షణ, నైపుణ్యం కలిగిన క్రీడాకారున్ని కోల్పోయాం. సాధారణంగా క్రీడాకారులు ఏదో ఒక్క క్రీడలో రాణించడం జరుగుతుంటుంది. అయితే నాగబాబు అనేక క్రీడలలో రాణించడంతోపాటు అతిచిన్న వయస్సులోనే జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్లో సైతం 185 సెంమీ హైజంప్ను నాగబాబు అవలీలగా చేసేవాడు. ఇటువంటి క్రీడాకారున్ని కోల్పోవడం దురదృష్టకరం. ఎస్ఆర్కేయూ స్వామి, ఫిజికల్ డైరెక్టర్, జెడ్పీ హైసూ్కల్, జి.వేమవరం -
విశ్వవిద్యాలయాల్లో విశృంఖలత్వం
సాక్షి , రాజమహేంద్రవరం: యువతను సన్మార్గంలో పెట్టి సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించాల్సినా గురువులు గాడి తప్పుతున్నారు. కొందరి వక్రబుద్ధి మొత్తం విద్యావ్యవస్థకే కళంకం తెచ్చిపెడుతోంది. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుందామని ఎన్నో ఆశలతో వందల కిలోమీటర్ల దూరం నుంచి తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చే విద్యార్థినులకు మనో ధైర్యం నింపాల్సిన బాధ్యత గురువులపై ఉంది. అటువంటి వారే ఇంటర్నల్ మార్కులను ఆసరాగా చేసుకుని బరితెగించి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు దిగడం జుగుప్సాకరంగా మారింది. వీటిని సంస్కరించాల్సిన పెద్దలు పాలకమండళ్ల పీఠాలపై కూర్చొనికూడా అరికట్టలేకపోతున్నారు. కాకినాడ జేఎన్టీయూ, రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నతమైన విద్య అందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ఆవు చేలో మేస్తే చందంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు ఏకంగా సహచర ఉపాధ్యాయినులపైనే వేధింపులకు ఒడిగట్టడం విడ్డూరం. ఈయనపై కేసు పెట్టినా గత టీడీపీ సర్కార్లో కేసును నీరుగార్చేయడం తెలిసిందే. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వైఎస్సార్కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని సస్పెండ్ చేసింది. జేఎన్టీయూకేలో... గత ఏడాది కాకినాడ జేఎన్టీయులో కూడా ఇప్పుడు నన్నయ వర్సిటీలో జరిగినట్టే ఎంటెక్ విద్యార్థినులపై ప్రొఫెసర్ కె.బాబులు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనమైంది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న ఒక మంత్రి అండదండలతో టీడీపీ నేతలు ప్రొఫెసర్ కు అనుకూలంగా పావులు కదిపారు. చివరకు విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో వర్సిటీ ఐఎస్టీ డైరెక్టర్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును తప్పిం చారు. ఆ సంఘటన మరువకుండానే నన్నయలో ఇంగ్లిషు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.సూర్యరాఘవేం ద్ర లైంగిక వేధింపుల బాగోతం సంచలనమైంది. విద్యార్థినులు నేరుగా సీఎంకు లేఖ రాయడం, ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి వచ్చి రాష్ట్ర స్థాయిలో తీవ్ర సంచలనమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను విచారణకు పంపించారు. ఇంగ్లిషు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో బలవంతంగా రాజమహేంద్రవరంలో తన ఫ్లాట్కు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ రాఘవేంద్రను సస్పెండ్ చేయడానికి పాలకమండలి మీనమేషాలు లెక్కించడం విమర్శలపాలైంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థినులు నేరుగా సీఎంకు లేఖ రాసుకున్నా, రాఘవేంద్ర నిజస్వరూపం వర్సిటీలో చాలా మందికి తెలిసినా.. చర్యలకు వెనుకాడటం గమనార్హం. ఆంధ్ర మహిళా ఫో రం జోక్యం తరువాతనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలు వడ్డాయి. గురువారం వరకూ నిందితుడ్ని అరెస్టు చేయకుండా వదిలేయడం తదితర పరిణామాలు మేధావి వర్గాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రమహిళ ఫోరం చొరవ తీసుకోకుండా, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు జోక్యం చేసుకోకుండా ఉండిఉంటే రాఘవేంద్ర అకృత్యాలు వర్సిటీ కాంపౌండ్ గేటు దాటి బయటకు వచ్చేవే కావని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. హైపవర్ కమిటీపై భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఓ ఎత్తైతే రాఘవేంద్రపై సమగ్ర విచారణ కోసం నియమించిన హైపవర్ కమిటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ అనుబంధంగా ఉన్న కాకినాడ పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు టీచింగ్, ఇద్దరు నాన్టీచింగ్, ఇద్దరు ఎన్జీఓలతో కలిపి ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీపై విమర్శలు వస్తున్నాయి. ఏడుగురు సభ్యుల కమిటీలో ఇద్దరు ఎన్జీఓలు మినహాయిస్తే మిగిలిన ఐదుగురు వర్సిటీలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఇటువంటి వ్యవహారాల్లో ఏర్పాటయ్యే ఈ తరహా కమిటీల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే విశ్వా సం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు. ఎం దుకంటే విచారణ అనంతరం కమిటీలో మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా నివేదిక రూపొం దుతుందనేది బహిరంగ రహస్యమే. అందునా ఏడుగురు సభ్యులలో ఐదుగురు సభ్యులు వర్సిటీ ఉద్యోగులే కావడం గమనార్హం. కేవలం ఇదే కారణంతో రాజమహేంద్రవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసి హైపవర్ కమిటీ నుంచి వైదొలగడం ఇందుకు బలం చేకూరుస్తోంది. చర్యలపై పలు సందేహాలు రాఘవేంద్ర లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంధ్రమహిళా ఫోరం వర్సిటీలోకి ప్రవేశించక ముందు, ఆ తరువాత పరిణామాలను బేరీజు వేసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న విచారణ పలు సందేహాలకు తావిస్తోంది. ఇందుకుతోడు రాఘవేంద్రపై ‘ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67 ఎ’ ప్రకారం కేసు నమోదుచేసి ఉంటే చర్యలు తీవ్రంగా ఉండేవని రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అభిప్రాయపడుతున్నారు. అటువంటి చర్యల ద్వారా మాత్రమే వర్సిటీలో ఇటువంటి అకృత్యాలకు చెక్ పెట్టవచ్చునంటున్నారు. ఇదిలా ఉండగా, వర్సిటీలో గురువారం నాడు చోటుచేసుకున్న సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. వర్సిటీ నుంచి సమాచారం బయటకు ఎలా పోతుందనే అంశం అంతర్గత సమీక్షలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇద్దరు అధ్యాపకురాలు తప్పుపట్టారని విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థినులతో రాఘవేంద్ర అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలకు తామే ప్రత్యక్ష సాక్షులమని వివరించడంతో అధికారులు మిన్నకుండిపోయారని సమాచారం. అప్పుడు జేఎన్టీయూకేలో, ఇప్పుడు నన్నయలో అయినా నిష్పక్షపాత విచారణ ద్వారా విద్యార్థినుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రభుత్వ ప్రయత్నాలకు విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల ప్రతినిధులు కాస్త మానవతాదృక్పథంతో సహకరించాల్సి ఉంది. ఈ తరహా వ్యవహారాలు తలెత్తినప్పుడు గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బయటి వర్సిటీ ప్రొఫెసర్తో కమిటీ వేయడం లేక, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించారు. వర్సిటీలపై మరింత నమ్మకం పెరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత పాలకమండళ్లపై ఉంది. కంచే చేను మేస్తే? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ...ఇదీ మన సంప్రదాయం. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుంటారని ఎంతో నమ్మకంతో పాఠశాలలకు, కళాశాలలకు పంపుతారు. గురువే కీచకునిగా మారితే, ఇక విద్యార్థినులు తమ సమస్యలçను ఎవరితో చెప్పుకోవాలి? కంచే చేను మేస్తే ఎవరు దిక్కు? విద్యాసంస్థలలో నిఘా మరింత పెంచాలి. ఇటీవల నన్నయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికే మచ్చ తెచ్చేతీరులో ఉన్నాయి. పరిస్తితిని అదుపుచేయకపోతే, విద్యావ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితులు తలెత్తవచ్చు. – ఎం.ఉమాదేవి, ప్రిన్సిపాల్, శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డి.ఎడ్.కళాశాల విచక్షణతో కూడిన కోరికలు మాత్రమే ఉండాలి మానవునికి కోరికలు ఉండాలి, కానీ అవి విచక్షణతో కూడినవై ఉండాలి. విద్యాలయాలలో ఇటువంటి కీచకులు తరచుగా కనిపిస్తున్నారు. వీరిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇలాంటివారికి వేసే శిక్షలు కఠినంగా ఉండాలి. అప్పుడే మరో కీచకుడు తయారవకుండా ఉంటాడు. – పి.శ్యామ, వైస్ ప్రిన్సిపాల్, ఏఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ గురువులు యోగా,మెడిటేషన్ తప్పనిసరిగా అలవరచుకోవాలి మానవునికి జీవులలోకెల్లా భిన్నంగా విచక్షణాజ్ఞానాన్ని ప్రకృతి ప్రసాదించింది. ఆ విచక్షణను చదువుకున్న విద్యావంతులే మంచికి ఉపయోగించకపోవటం విచారకరం. మానవుడు వివేకవంతంగా నడవాలంటే యోగా, మెడిటేషన్లు అలవరచుకోవాలి. వీటితోపాటు ఆత్మశుద్ధి కలగటానికి దైవమార్గాన్ని అలవరచుకోవాలి. అప్పుడే మానవుడు వక్రబుద్ధి వదలి సన్మార్గంలో నడవగలుగుతాడు. – డాక్టర్ డి.చిన్నారావు, రసాయన శాస్త్రం విభాగాధిపతి, ఏఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67ఏ ప్రకారం కేసు నమోదు చేయాలి ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67 ఏ ప్రకారం కేసు నమోదు చేసి ఉంటే బెయిల్ రావడానికి అవకాశం ఉండేది కాదు. బెయిల్ వచ్చే విధంగా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేశారో అర్థం కావడం లేదు. పోలీసులు ఇప్పటికైనా సక్రమంగా విచారణ జరిపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం కేసు నమోదు చేసి, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విద్యార్థుల, ప్రజల్లో నమ్మకాన్ని కలిగేట్టు చేయాల్సిన అవసరం ఉంది. – ముప్పాళ్ల సుబ్బారావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి ఆదికవి నన్నయ్య యూనిర్శిటి విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేసిన అధ్యాపకుడు సూర్య రాఘవేంద్రపై తక్షణం క్రిమినల్ కేసులు పెట్టాలి. విద్యార్థునులను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆయన అంగికరించాడు. నిర్భయ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టాలి. భవిషత్తులో ఇలాంటివి జరగకుండా యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి. ఇంటర్నల్ కమిటీ వేయడంతో ఇంటర్నల్ మార్కులు వారి చేతిలో ఉంటాయి. భయం కొద్దీ చెప్పలేరు. అలాంటివి కాకుండా ప్రభుత్వం తరుపు నుంచి, ఐసీడీఎస్ అధికారులను వేసి విచారణ జరపాలి. – టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి చట్టాలు కఠినంగా ఉండాలి... సరస్వతీ నిలయాలుగా ఉండే విద్యాలయాల్లో ఇటువంటి చర్యలకు పాల్పడి విద్యావ్యవస్ధకే ముప్పు తెస్తున్నారు. ఇటువంటి వాటిపై వర్సిటీ స్ధాయిలో కఠినమైన చట్టాలు ఉండాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థినులకు సరైన రక్షణ ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. జగన్ ప్రభుత్వం ఇంత త్వరగా స్పందించి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. – కాశిన మల్లేశ్వరరావు,బీసీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు వర్సిటీలో గ్రీవెన్స్సెల్ సమర్థవంతంగా పనిచేయాలి వర్సిటీలో ఉన్న గ్రీవెన్స్ సెల్ సమర్థవంతంగా పనిచేసి మహిళలకు రక్షణ కల్పించాలి. వర్సిటీలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల తరువాత గురువులనే పూజిస్తారు. వీరి ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. – వై.జయ, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్,జేఎన్టీయూకే మొగ్గలోనే తుంచి వేయాలి చదువుచెప్పే అధ్యాపకుని ప్రవర్తనలో అభ్యంతరకరమైన ధోరణి కనపడితే, విద్యార్థినులు మౌనంగా ఉండరాదు. ఈ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయడానికి అధికారులు, తల్లిదండ్రులు, సాటి విద్యార్థుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాలి. విద్యార్థినులు సంఘటితశక్తిగా నిలబడాలి. తప్పు చేసినవాడిని నిలదీయాలి. అధ్యాపకులు విద్యార్థినులను తమ పిల్లలుగా భావించాలి. – గుంటూరి వెంకటేశ్వరరావు, కవి, విశ్రాంత ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ -
పర్యాటకంలో విషాదం...
తూర్పుగోదావరి ,పి.గన్నవరం: సరదాగా ప్రకృతి ఒడిలో సేద తీరదామని వచ్చిన ఓ యువకుడు అదే ప్రకృతిలో ప్రాణాలను కోల్పోయాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన అతడిని మృత్యువు కాటేసింది. మారేడుమిల్లి నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతం అమృతధార జలపాతం వద్దకు ఆదివారం సాయంత్రం పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన పాలూరి మణికంఠ (23) స్నేహితులతో వాహనంలో వచ్చాడు. స్నానం చేసేందుకు అమృతధార జలపాతం పైకి ఎక్కగా ప్రమాదవశాత్తూ పైనుంచి జారి పడ్డాడు. అతని శరీరానికి బలంగా బండరాళ్లు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని స్నేహితులు వారు వచ్చిన వాహనంలో రంపచోడవరం ఆస్పత్రికి తీసుకు వెళ్లేసరికే అతడు మృతి చెందాడు. ముంగండలో విషాద ఛాయలు ముంగండ ముత్యాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన మణికంఠ మరణించినట్టు సమాచారం రావడంతో అతడి తల్లిదండ్రులు, బంధువుల కన్నీరుమున్నీరుగా విలపించారు. అతడి తండ్రి ఆదినారాయణ కొబ్బరి కాయలు గ్రేడింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. వీరికి అతడు ఏకైక సంతానం. అతడు కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన ఏకైక కుమారుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో తల్లి,దండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. -
వీడిన కాకినాడ జంట హత్యల కేసు మిస్టరీ!
సాక్షి, తూర్పుగోదావరి: నాలుగు నెలల క్రితం కాకినాడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాకినాడ టూటౌన్ పోలీసులు.. సోమవారం నిందితుడు వీర్రాజును అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితుడు వీర్రాజు గతంలో రెండేళ్ల పాటు అదే ఇంట్లో అద్దెకు ఉన్నాడనీ, స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో చోరీలకు పాల్పడేవాడు. అదే క్రమంలో చోరీకి పాల్పడుతూ అడ్డుకున్న దంపతులను హత్య చేశాడు. ఈ క్రమంలో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పలు డాక్యుమెంట్లను తగులబెట్టాడు. కాగా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ముమ్మిడివారి వీధిలో నివాసం ఉంటున్న తుమ్మలపల్లి సత్యానందం (65), మంగతాయారు (62) అనే వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యభర్తలను హత్య చేసిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు చేసిన కేవలం మూడు సెకండ్స్ ఫోన్ కాల్ ఆధారంగా కేసును చేధించామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. అంతేకాక అతని నుంచి రూ. 4 లక్షల 75 వేల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్లు మీడియాకు వివరించారు. -
ఆరిపోయిన ఇంటి దీపాలు
దీపావళి రోజున వెలుగులు నింపడానికి బాణసంచా తయారీలో పనికి కుదిరిన ఆ కూలీల జీవితాల్లో విషాదమే మిగిలింది. వ్యవసాయ పనులేవీ లేకపోవడంతో నెల రోజుల ఉపాధి కోసం వెళ్లిన ఈ ఐదుగురూ మృత్యువుతో పోరాడి అసువులు బాశారు. బుధవారం ఇద్దరు, గురువారం ముగ్గురు మృత్యువాత పడడంతో సామర్లకోట మండల పరిధిలోని వేట్లపాలెం శివారు కాలనీల్లో కన్నీరు గూడుకట్టుకుంది. తెలతెలవారుతుండగానే... సూరీడు పొద్దు పొడవకముందే ఆ గ్రామంలో కూలీలు నిద్రలేచి కూటి కోసం పరుగులు తీస్తారు. రోజూలాగానే 12 మంది కూలీలందరూ కలసి గత నెల 30వ తేదీన బాణసంచా తయారీ పనులకు వెళ్లారు. గత నెలాఖరు... అదే వారి జీవితాల్లో ఆఖరి ఘడియలని తెలుసుకోలేకపోయారు. వారి బతుకులతో విధి ఆడిన వికృత క్రీడకు ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి. సామర్లకోట (పెద్దాపురం): మండలంలోని వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య కెనాల్ రోడ్డులో ఉన్న ఇందిరా ఫైర్ వర్క్స్లో గత సోమవారం బాణసంచా తయారీ చేస్తుండగా జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. వేట్లపాలెం శివారు ప్రాంతం గూడపర్తి, జొన్నలదొడ్డికి చెందిన 12 మంది సోమవారం బాణసంచా తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ సంఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడగా, వారిని మెరుగైన వైద్యం కోసం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ క్షతగాత్రులైన బంటు చెల్లాయ్యమ్మ (45) మాకిరెడ్డి నూకాలమ్మ (70) బుధవారం మృతి చెందగా, బత్తిన లోవ కుమారి (45) కాకర అనిత(30) కొంగు లక్ష్మి(55) గురువారం మృతి చెందారు. క్షతగాత్రులు మృతి చెందిన విషయం తెలియడంతో వేట్లపాలెంలోని శివారు ప్రాంతాలైన జొన్నలదొడ్డి, గూడపర్తిలలో విషాదఛాయలు అలముకున్నాయి. బంటు చెల్లాయ్యమ్మకు ఇద్దరు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు చేసింది. భర్తను పోషించడానికి కూలి పనికి వెళ్లి పేలుడు ప్రమాదంలో చనిపోయింది. మాకిరెడ్డి నూకాలమ్మ వృద్ధాప్యంలోనూ కుటుంబపోషణకు వెళ్లి బలైంది. బత్తిన లోవకుమారికి భర్త, ఇద్దరు కుమార్తెలు. బాణసంచా తయారీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. నాలుగు రోజులుగా తన తల్లి కనిపించకపోవడంతో ఏడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్న చిన్నారులు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. గురువారం తల్లి మృతి చెందిన విషయం తెలిసి చిన్నారులతో పాటు ఆ ప్రాంత ప్రజలు విషాదంలో మునిగిపోయారు. కాకర అనితకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె ఇంటర్, మరో కుమార్తె ఆరో తరగతి చదువుతున్నారు. సోమవారం నుంచి తండ్రి దుర్గారావుతోపాటు వారు కూడా కంటిపై కునుకు లేకుండా ఉన్నారు. గురువారం అనిత మరణ వార్తతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. కొంగు లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్నకుమారుడుకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆమె లేకుండా పోయిందని ఆమె బంధువులు రోదించారు. మృతదేహాలను ఇళ్లకు తీసుకువెళ్లకుండా కాకినాడ నుంచి నేరుగా వేట్లపాలెంలోని శ్మశాన వాటికకు గురువారం రాత్రి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఆందోళనతో విజయం సాధించాం బాణసంచా పేలుడు ప్రమాదంలో క్షతగాత్రులు మృతి చెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించామని దళిత నాయకులు లింగం గంగాధర్, లింగం శివప్రసాద్, వల్లూరి సత్తిబాబు, సరిపల రాజేష్, సిద్ధాంతుల కొండబాబు, పి.జనార్దన్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు, ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు దళిత సంఘాల ఆందోళనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తెలిపారు. మృతి చెందిన వారి, క్షతగాత్రుల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి కన్నబాబు వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి మృతి చెందిన వారికి రూ.పది లక్షలు, క్షతగాత్రులకు రూ.నాలుగు లక్షలు ఇవ్వడానికి అంగీకరించారని దొరబాబు స్థానిక విలేకర్లకు తెలిపారు. వీరి కుటుంబాలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని దొరబాబు తెలిపారు. -
ఫోటోలు తీయాలంటూ నమ్మించి..
సాక్షి, కాకినాడ: పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు ఫొటోలు తీయాలని, బంగారు ఆభరణాలు తీసివేసి ఫోటో దిగాలని నమ్మిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మలికిపురం పోలీసులు అరెస్టు చేశారు. రాజోలులో సీఐ నాగమోహనరెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. సఖినేటిపల్లికి చెందిన ఇంజేటి ఆనంద్బాబు కొంతకాలంగా పలు చోరీ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. మలికిపురం మండలం శంకరగుప్తం, లక్కవరం, విశ్వేశ్వరాయపురం గ్రామాల్లో ఇటీవల పలు చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆనంద్బాబుపై అనుమానం వచ్చింది. గతంలో సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించి అతడు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తాజా చోరీల నేపథ్యంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావు అతడిపై నిఘా పెట్టారు. గుడిమెళ్ళంకలో ఆదివారం ఆనంద్బాబు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్సై అతడిని అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ.2.36 లక్షల విలువైన 65 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఫొటోలు తీయాలని, ఆ సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు తీసివేయాలని, లేకపోతే పింఛన్ పొందేందుకు అర్హత కోల్పోతారని చెబుతూ, వారి నగలను అపహరిస్తున్నాడని సీఐ తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి, బంగారు ఆభరణాలు అపహరిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడన్నారు. నిందితుడిని రాజోలు కోర్టుకు తరలిస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
మాయగాడి వలలో చిక్కుకొని..
సాక్షి, కాకినాడ : హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఆ మాయగాడి వలలో పడింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్లు సహజీవనం చేశారు. ఓ బిడ్డను కన్నారు. చివరికి ఆ యువతిని అతగాడు వంచించాడు. ‘ఎవడి దగ్గర బిడ్డను కన్నావంటూ అత్యంత అవమానకరంగా, నీచంగా మాట్లాడి, ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి నెల రోజుల ఆడ శిశువుతో ఆ యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఆమె కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన కేసిరెడ్డి పాండు, లక్ష్మి దంపతుల కుమార్తె నందిని. ఆమెకు 2013లో వరంగల్కు చెందిన మేనమామతో వివాహమైంది. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో కొద్ది రోజులకే తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లకుండా ఓ ఇంట్లో పనికి చేరింది. 2016లో ఓ మొబైల్ షాపులో చేరింది. అదే సమయంలో కోటనందూరు మండలం ఎస్సార్ పేట గ్రామానికి చెందిన అన్నంరెడ్డి నూకరాజు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పని చేసేవాడు. నందినితో అతడు పరిచయం ఏర్పరచుకున్నాడు. నందిని పరిస్థితులు తెలుసుకున్న నూకరాజు పెళ్లి చేసుకుంటానని, తన దగ్గరకు వచ్చేయమని కోరాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె ఆ మాటలు నమ్మి, అతడి వద్దకు చేరింది. నెల రోజుల పసికందుతో బాధితురాలు నందిని నందిని ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకున్న నూకరాజు మోసపూరితంగా వ్యవహరించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించేందుకు హైదరాబాద్లోని ఒక గుడిలో దండలు మార్చి, పెళ్లయ్యిందనిపించాడు. అలా సహజీవనం ప్రారంభించిన కొంత కాలానికి నందిని గర్భవతి అయ్యింది. దీంతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడు. ఆ తరువాత మళ్లీ తన ఇంట్లో అందరి సమక్షంలోనూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మళ్లీ గర్భవతి కావడంతో రెండోసారి కూడా అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు నందిని తిరస్కరించింది. అప్పటి నుంచీ అల్లర్లు, గొడవలతో వారి జీవనం సాగేది. ఈ నేపథ్యంలో ప్లేటు ఫిరాయించిన నూకరాజు ‘‘ఎవడి దగ్గర బిడ్డని కన్నావు? నిన్ను పెళ్లి చేసుకోను’’ అని నీచంగా మాట్లాడుతూ ముఖం చాటేశాడు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకొనేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామం ఎస్సార్ పేట వచ్చాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నందిని ఆదివారం సాయంత్రం నెల రోజుల తన పసిబిడ్డతో ఎస్సార్ పేట చేరుకుంది. అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. నూకరాజు కుటుంబ సభ్యులు గెంటేయడంతో తన బిడ్డతో పక్కవారింట్లో తల దాచుకొంది. అయిన వారందరినీ కోల్పోయిన తాను నూకరాజుతోనే జీవిస్తానని, తనకు పుట్టిన బిడ్డకు నూకరాజే తండ్రని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. స్థానికుల సహకారంతో కోటనందూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి : నపుంసకునితో వివాహం చేశారని.. -
ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో..
సాక్షి, కాకినాడ : ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. వేగాయమ్మపేట గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని హైస్కూల్ వీధిలో నివాసం ఉండే వాడపర్తి మంగకు మేనమామ సమనస చంద్రరావుతో 35 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం తన సొంత ఊరు ముమ్మిడివరం మండలం కమిడి నుంచి వేగాయమ్మపేటకు చంద్రరావు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు. వారందరికీ వివాహాలు జరిగినా భార్యలతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. చంద్రరావు, కుమారులు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చంద్రరావు పెళ్లయిన నాటి నుంచే అనుమానంతో భార్యను వేధించేవాడు. ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లినా నీ దగ్గరకు వచ్చి వెళ్తున్నారంటూ భార్య మంగతో గొడవ పడి కొడుతుండేవాడు. కొడుకులు, బంధువులు వారించినా వినేవాడు కాదు. శనివారం రాత్రి కూడా 10 గంటల సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. నిన్ను చంపితే పీడ విరగడ అవుతుందని కేకలు వేశాడు. ఉదయం చిన్న కొడుకు వీరబాబు, మంగ చెల్లెలు వాడపర్తి లక్ష్మి టీ ఇద్దామని మంగ దగ్గరకు వెళ్లగా గదిలో మంచంపై భయంకరమైన స్థితిలో మంగ(50) మృతదేహం పడి ఉంది. గొడ్డలితో బలంగా నరికినట్టు తలభాగం విడిపోయి మెదడు బయటకు వచ్చి చూసేందుకు భయం గొలిపేలా ఉంది. వెంటనే వారు ద్రాక్షారామ పోలీసులకు సమాచారం అందించారు. తెల్లవారు జామున 5 గంటల సమయంలో చంద్రరావు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని టవల్లో చుట్టి సైకిల్పై తీసుకువెళ్లడం చూశామని కొందరు చెప్పడంతో మంగ తండ్రి వాడపర్తి సూరన్న తన కూతురును హత్య చేసిన చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు. పక్క ఇంట్లో ఉంటున్న బంధువుల ఇద్దరి కుమార్తెలు బాలింతలు. వారి పిల్లలు పాల కోసం ఏడుస్తుండటంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంగ వారి ఇంటికి వెళ్లి చంటి పిల్లలను సముదాయించి వెళ్లడంతో హత్య తెల్లవారుజామున చేసి ఉంటాడని భావిస్తున్నారు. రామచంద్రపురం సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ద్రాక్షారామ ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ సంఘటనా స్థలం వద్ద విచారణ నిర్వహించారు. గ్రామ వీఆర్వో వాసంశెట్టి శ్రీరామకృష్ణ పోలీసుల విచారణకు సహకరించారు. మృతురాలి తల్లిదండ్రులు సూరన్న, సత్తెమ్మ, కుమారులు లోవరాజు, గుర్రయ్య, వీరబాబు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది. ఇంత దారుణం చేస్తాడనుకోలేదు పెళ్లయిన నాటి నుంచే అనుమానంతో వేధించేవాడు. తరువాత మారతాడులే అనుకునే వాళ్లం. కానీ వయస్సు పెరిగినా అతడిలో అనుమానం చావలేదు. ఇంటికి పెద్ద గోడ కట్టించినా బయటివాళ్లకు మా అమ్మాయి కన్పించకూడదని కొబ్బరి ఆకులు అడ్డం పెట్టాడు. ఎవరు రోడ్డుపై నుంచి వెళ్లినా వాళ్లతో సంబంధం అంటగట్టి గొడవ పెట్టేవాడు. ఏడాది క్రితం నెత్తి మీద కర్రతో గట్టిగా కొట్టడంతో బలమైన గాయం అయ్యింది. అప్పుడు పోలీసు కేసు పెట్టకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాం. ఇప్పుడు ఇంత భయకరంగా నరికి చంపుతాడని ఎవరం ఊహించలేదు. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. – వి.సూరన్న, మృతురాలి తండ్రి -
ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య
సాక్షి, కాకినాడ : రూరల్ మండలం తూరంగిలో ఓ ప్రధానోపాధ్యాయుడ్ని అతని ఇంట్లోనే దారుణంగా నరికి హత్య చేసిన సంఘటన కాకినాడలో కలకలం సృష్టించింది. రేపూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న పట్నాల వెంకట్రావు (57) హత్యకు గురయ్యారు. ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీలోనుంచి వెదురు గెడకు చిన్న చాకును కట్టి దాన్ని వంచి తలుపు గెడ తీసి ఇంటి లోపలకు ప్రవేశించిన దుండగులు వెంకట్రావును హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి ముందు దుండగులతో ఆయన పెనుగులాడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే విషయాలు తెలియకపోవడంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ కె.కుమార్, రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ వేలిముద్రలు సేకరించాయి. చుట్టు పక్కల ప్రాంతాలను డాగ్ స్క్వాడ్ పరిశీలించింది. కుక్క వాసన చూసుకుంటూ పక్కనే ఉన్న కాలువ వరకూ వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. హత్యకు గురైన వెంకట్రావు తూరంగి సూర్యనగర్ పక్కన ఉన్న రోడ్డు నుంచి కొవ్వూరు వెళ్లే రోడ్డులో ఓ లేఅవుట్లో రెండంతస్తుల ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఆ ఇంటి వెనుక మరో రెండంతస్తుల భవనం మాత్రమే ఉంది. చుట్టు పక్కల ఎవరూ నివసించకపోవడం, అంతా ఖాళీ ప్రదేశం కావడంతో వచ్చిన దుండగులు వెంకట్రావును సులభంగా హత్య చేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు. మృతునికి భార్య వెంకటరమణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికీ వివాహాలు కావడంతో వెంకట్రావు దంపతులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. బంధువులు తెలిపిన సమాచారం మేరకు... హైదరాబాదులో ఉంటున్న చిన్న కుమార్తె తులసి రాధికకు, ఆమె పిల్లలకు అనారోగ్యంగా ఉందని తెలియడంతో భార్యను శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో బస్సు ఎక్కించి ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు. తూరంగి భాస్కర గార్డెన్వీధిలో నివాసం ఉంటున్న తన వియ్యంకుడు ప్రభాకరరావుతో కొద్దిసేపు ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఇంటికి భోజనానికి రావాలని ప్రభాకరరావు కోరడంతో తాను తన అమ్మ సత్యవతిని చూడటానికి కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప వెళ్తానని చెప్పారు. ఉదయం హైదరాబాద్ చేరుకున్న వెంకట్రావు భార్య వెంకటరమణ ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో తమ వియ్యంకుడు ప్రభాకరరావుకు ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తడంలేదని, ఒక సారి ఇంటికి వెళ్లి చూసి రావాలని కోరారు. దీంతో ప్రభాకరరావు తన మేనల్లుడితో కలసి వెంకట్రావు ఇంటికి వెళ్లారు. ముందు తలుపులన్నీ మూసి ఉండటంతో వెనుక వైపు వెళ్లి చూసేసరికి తలుపులు తీసి ఉండటం, లోపలికి వెళ్లగా వెంకట్రావు శరీరంపై అనేక కత్తిపోట్లతో మృతి చెంది ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య రాత్రి 11 గంటల సమయంలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్య జరిగిన కోణాన్ని పరిశీలిస్తే దొంగతనం కోసం జరిగినట్టుగా కన్పించడంలేదని, ఏదో కక్షతో ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్టు కన్పిస్తుందన్నారు. ఇంట్లో ఏ వస్తువు గానీ, బీరువాను గానీ దుండగులు ముట్టుకోలేదని పోలీసులు చెబుతున్నారు. వెంకట్రావు ఫోను, ల్యాబ్టాప్ కన్పించడంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ హత్యకు కారణాలు ఏమిటీ, దొంగతనం కోసం జరిగి ఉంటే ఇంట్లో ఏ ఒక్క వస్తువు పోలేదని, ఆస్తుల గొడవలు ఏమీ లేవని బంధువులు చెబుతున్నారన్నారు. హెచ్ఎం వెంకట్రావు హత్య సమాచారం అందడంతో ఉపాధ్యాయులు, అధికారులు, స్నేహితులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో సౌమ్యుడిగా పేరొందిన వెంకట్రావు హత్యను తోటి ఉపాధ్యాయులు, అధికారులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని చూసిన ఉపాధ్యాయులు బోరున విలపించారు. పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మింగేసిన బావి
రోజూ మాదిరిగానే ఉపాధి కోసం కూలి పనికి వెళ్లిన వారు అక్కడే సజీవ సమాధి అయిపోయారు. పాడుబడిన ఓ బావిని పూడ్చే యత్నంలో.. మీద పడిన మట్టిపొరల్లో చిక్కుకుపోయి మృత్యులోకాలకు చేరుకున్నారు. కాకినాడలోని ఓ ఇంట్లో బావిని పూడ్చేందుకు శుక్రవారం ఇటుకలు తీస్తూండగా.. ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన ఘటన అయినవారికి విషాదాన్ని మిగిల్చింది. సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కాకినాడ ఎస్.అచ్యుతాపురం రైల్వేగేటు సమీపంలోని ద్వారకానగర్లో పాడుబడిన నుయ్యిని మూసే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో ఎస్.అచ్యుతాపురం ద్వారకానగర్కు చెందిన గోడసకుర్తి సత్యనారాయణ (42), కరప మండలం పెద్దాపురప్పాడు సలాది శ్రీను(45) మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ద్వారకానగర్లోని గుర్రాల లక్ష్మీకాంతానికి చెందిన స్థలంలో 50 ఏళ్ల పైబడిన 15 అడుగుల పురాతన నుయ్యి ఉంది. దీనిని పూడ్చేందుకు నిర్ణయించిన లక్ష్మీకాంతం మొదట మట్టి వేసి మూసివేయాలని ప్రయత్నించారు. ఎవరో అలా చేయకూడదని చెప్పడంతో తనకు తెలిసిన వాస్తు సిద్ధాంతి సలహా తీసుకున్నారు. ఆయన కూడా నూతిని నేరుగా పూడ్చకూడదని, ఉన్న ఇటుకలు, తీసివేసి అప్పుడు మూసివేయాలని చెప్పడంతో ఆ ప్రకారం లక్ష్మీకాంతం తన సమీప బంధువు తాపీమేస్త్రీ అయిన ఎస్ అచ్యుతాపురం ద్వారకానగర్కు చెందిన గోడసకుర్తి సత్యనారాయణ(42)కు పని పురమాయించారు. దీంతో సత్యనారాయణ తన వద్ద పని చేస్తున్న కరప మండలం పెద్దాపురప్పాడు సలాది శ్రీను (45)తో కలసి గురువారం నుంచి నూతిలోని ఇటుకలను తీసివేసే పనులు ప్రారంభించారు. శుక్రవారం కూడా యథావిధిగానే ఆ పనులు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో ఇంటి యజమాని గుర్రాల లక్ష్మీకాంతం పనుల పరిశీలనకు ఆ ప్రాంతానికి రాగా అక్కడ పని చేస్తున్న సత్యనారాయణ, శ్రీను కనిపించలేదు. నుయ్యిలోని మట్టి అండలు కూలిపోయి ఉండడంతో ఆందోళనకు గురైన లక్ష్మీకాంతం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి నుయ్యిలో పూడుకుపోయిన అండలను తీసే కార్యక్రమాన్ని చే³ట్టారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రత్యేక క్రేన్ల సాయంత్రం మట్టి అండలను, ఇటుకలు తీసే పనులను ప్రారంభించారు. చివరకు రాత్రి 7.30 గంటల సయమంలో నూతిలో సజీవ సమాధి అయిన సత్యనారాయణ, శ్రీను మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబాలు అక్కడకి చేరుకొని మృతదేహాలను తరలించేందుకు వీల్లేదని, తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. ఈ సంఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్కు పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు గోడసకుర్తి సత్యనారాయణకు భార్య ఉమామహేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉండగా, సలాది శ్రీనుకు భార్య ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయని బంధువులు చెబుతున్నారు. బావిలో మట్టిపెళ్లలు తొలగించి, కూలీల మృతదేహాలను వెలికితీస్తున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది -
ఆశయం నెరవేరకుండానే అనంతలోకాలకు..
సాక్షి తూర్పుగోదావరి(కత్తిపూడి) : విధి నిర్వహణలో ఉండగానే తండ్రి అకాల మరణం చెందడంతో ఆ ఉద్యోగం పొందేందుకు బంధువు సహయంతో బైక్పై వెళుతున్న ఓ యువతి గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. ఏలేశ్వరం మండలం మార్కెండేయపురానికి చెందిన బొజ్జపు వెంకటలక్ష్మి (28) తండ్రి ఇటీవలే అకాల మరణం చెందారు. అయితే తండ్రి ఉద్యోగాన్ని పొందేందుకు ఆమె తన సమీప బంధువు అడ్డతీగల గ్రామానికి చెందిన పడాల నరేష్తో కలసి తుని ఆర్టీసీ డిపోకు వెళుతుండగా కత్తిపూడి 16 నంబరు జాతీయ రహదారి ఆర్టీఓ కార్యాలయం సమీపంలో తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న మినీవ్యాన్ రాంగ్ రూట్లో వచ్చి వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. నరేష్కు తీవ్ర గాయాలు కావడంతో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పంచనామా నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ ఎస్సై శంకర్రావు తెలిపారు. -
స్నేహితురాలితో మేడపై ఆడుకుంటూ...
సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం) : వారిద్దరూ మిత్రులు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న వీరు ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసే ఆడుకుంటారు. ఎప్పటిలానే తమ మేడపై ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ రూపంలో వచ్చిన మృత్యువు ఆ స్నేహాన్ని విడదీసింది. ఒకరు అనంత లోకాల్లో కలసి పోగా మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పిఠాపురం పట్టణంలోని లయన్స్క్లబ్ ఏరియాలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. పిఠాపురం లయన్స్క్లబ్ ఏరియాలో నివాసముంటున్న చింతపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె చింతపల్లి సమీర(11), వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఇందనపు సుబ్బలక్ష్మి కుమార్తె ఐశ్వర్య (12) ఇద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరు స్థానిక ప్రైవేటు స్కూల్లో ఏడో తరగతి చదువుతుండగా ఐశ్వర్య ఈ ఏడాది ప్రైవేటు స్కూల్ నుంచి స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలకు మారింది. స్నేహితురాలికి జ్వరం వచ్చిందని.. స్కూలుకు వెళ్లేటప్పుడు వచ్చిన తరువాత ఇద్దరు కలుసుకుని మాట్లాడుకోవడం, ఖాళీ సమయాల్లో కలిసి ఆడుకోవడం చేస్తుంటారు. బుధవారం స్కూల్కు బయల్దేరిన ఐశ్వర్య తన స్నేహితురాలు బడికి వెళ్లడం లేదని జ్వరం వచ్చిందని తెలిసి తాను బడికి వెళ్లడం మానేసింది. తన ఫ్రెండ్ సమీర ఇంటికి వెళ్లిన ఐశ్వర్య సమీరకు తోడుగా ఉంది. జ్వరం కాస్త తగ్గడంతో ఇద్దరు మధ్యాహ్నం సమీర ఇంటి మేడపైన బంతాట ఆడుకుంటున్నారు. ఇంతలో బంతి మేడ పిట్టగోడకు బిగించి ఉన్న లైట్ వద్దకు వెళ్లి పోవడంతో దానిని తీసుకునే ప్రయత్నం చేసిన ఐశ్వర్య ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురై లైట్కు అతుక్కుపోయింది. అక్కడే ఉన్న సమీర ఆమెను రక్షించే ప్రయత్నం చేసి ఆమెను లాగే ప్రయత్నంలో ఆమె కూడా కరెంట్ షాక్కు గురైంది. ఇంతలో వారి అరుపులు విన్న సమీర తల్లి నాగశివజ్యోతి పరుగున మేడపైకి వచ్చి ఇద్దరినీ రక్షించే ప్రయత్నంలో తాను కూడా కరెంట్ షాక్కు గురవుతానన్న భయంతో వెంటనే కిందకు వెళ్లి మెయిన్ ఆఫ్ చేసి వచ్చి ఇద్దరినీ విడిపించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఐశ్వర్య మృతి చెందింది. సమీరను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. కంటికి రెప్పలా పెంచుకున్న కన్న కూతురు ఇక లేదని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్న మృతురాలి తల్లి సుబ్బలక్ష్మిని ఆపడం ఎవరితరం కావడం లేదు. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించిందని దాడి!
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ) : పెళ్లికి నిరాకరించడంతో యువతిపై చాకుతో దాడి చేసి ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మార్టేరుకు చెదిన గ్రంధి మణికుమార్(28), రామోజు శాంతకుమారి(22) మార్టేరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేసేవారు. మణికుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకు శాంతకుమారి నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం పెనుగొండ గాంధీ బొమ్మల సెంటరుకు పనిమీద వచ్చిన యువతిపై మణికుమార్ చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి స్వల్ప గాయం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆమెపై దాడికి పాల్పడిన మణికుమార్ అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో మణికుమార్ కోలుకుంటున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్ను నమ్మించి..
సాక్షి, తూర్పుగోదావరి(అన్నవరం) : బ్యాంకులో కుదువ పెట్టిన రూ.ఏడు లక్షల విలువైన బంగారాన్ని విడిపించుకోవడానికి రూ.2.20 లక్షలు సహాయం చేస్తే ఆ బంగారాన్ని తక్కువ ధరకు మీకే విక్రయిస్తానని ఫైనాన్సియర్ను నమ్మించి ఆ సొమ్ము తీసుకుని పరారైన ఘరానా మోసగాడి ఉదంతమిది. తొండంగి ఎస్సై గోపాలకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని గోపాలపట్నంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఇటీవల బ్యాంకులో ఖాతాదారులు విడిపించుకోని బంగారాన్ని వేలం వేస్తున్నట్టు పత్రికలో ప్రకటన ఇచ్చింది. అది చూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కుమార్ అనే వ్యక్తి విజయవాడలోని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేశాడు. ఆ కంపెనీ బ్యాంకు వేలం వేసే బంగారాన్ని పాడుకుని తిరిగి లాభాలకు విక్రయిస్తుంది. ఈ కంపెనీకి ఈనెల ఆరో తేదీన కుమార్ ఫోన్ చేసి గోపాలపట్నంలో గల స్టేట్బ్యాంక్ శాఖలో రూ.ఏడు లక్షల విలువ చేసే తన బంగారం సోమవారం వేలం వేస్తున్నారని, తన వద్ద రూ.ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన డబ్బు మీరు సర్దితే ఆ బంగారాన్ని విడిపించి వెంటనే మీకు అమ్ముతానని తెలిపాడు. అది నిజమని నమ్మిన ఆ ఫైనాన్స్ కంపెనీ యజమాని రూ.2.20 లక్షలు తమ వద్ద పనిచేసే టి.సురేష్ అనే వ్యక్తికి ఇచ్చి సోమవారం ఉదయం ఆ బ్యాంక్కు పంపించారు. మరోవైపు కుమార్ సోమవారం ఉదయం అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్ దిగి, తాను ఆర్టీసీలో డీఎంనని అక్కడ క్యాంటీన్ నిర్వహిస్తున్న కర్రి లోవదొరను పరిచయం చేసుకున్నాడు. అర్జెంట్ గా స్టేట్బ్యాంక్కు వెళ్లాలని కారు కావాలని అడిగాడు. దీంతో లోవదొర తన కారు ఇచ్చి తన బంధువుతో అతడిని బ్యాంకుకు పంపించాడు. ఆ బ్యాంకు వద్ద వేచి ఉన్న ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ వద్దకు వెళ్లి ఈ కారు తనదేనని చెప్పి బీఎం వద్దకు వెళ్లి మాట్లాడివస్తానని వెళ్లాడు. తరువాత కొంతసేపటికి వెనక్కి వచ్చి డబ్బు ఇవ్వండి బ్యాంకు మేనేజర్కు కట్టేస్తాను అని రూ.2.20 లక్షలు తీసుకుని మరలా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెనక్కి వచ్చాడు. అర్జంటుగా బయటకు వెళ్లి ఒక సంతకం పెట్టాలి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళుతుండగా ఆ ఫైనాన్స్ ఉద్యోగి అతడిని నిలదీశాడు. ‘‘మా కారు ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తా’’ అని చెప్పి రోడ్డు మీదకు వెళ్లాడు. ఎంతసేపటికి అతడు రాకపోవడంతో ఆఫైనాన్స్ ఉద్యోగి బ్రాంచ్ మేనేజర్ వద్దకు వెళ్లి గోల్డ్లోన్ వేలం గురించి, తన వద్ద డబ్బు చెల్లించాలని తీసుకున్న విషయం చెప్పాడు. అయితే తనను ఆ విషయాలు అతడు అడగలేదని, పర్సనల్ లోన్ కావాలని మాత్రమే అడిగాడని బీఎం చెప్పారు. దీంతో ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంకుకు వచ్చి సీసీటీవీ పుటేజీ పరిశీలించి ఆ మోసగాడి ఫొటో డౌన్లోడ్ చేశారు. ఈ మోసగాడిపై ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో పదికి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని పరిశీలనలో తేలిందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రేమించాడు..పెళ్లి ముహుర్తం పెట్టాకా..
సాక్షి, తూర్పుగోదావరి(ముమ్మిడివరం) : ప్రేమించిన ప్రియుడు వివాహ ముహూర్తం పెట్టాక ముఖం చాటేయడంతో ప్రియురాలి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు ఛీటింగ్, అత్యాచారం కేసులు నమోదు చేశారు. కాకినాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ యాక్టు విభాగం డీఎస్పీ ఏబీజే తిలక్, ఎస్సై వెంకటరమణ మండలంలోని కొమానపల్లిలో బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. కొమానపల్లి గ్రామానికి చెందిన వంగలపూడి అమ్మాజీ, ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన అప్పాడి రాజేష్ అమలాపురంలో కంప్యూటర్ విద్య నేర్చుకొనే సమయంలో ప్రేమించుకున్నారు. ఆ తరువాత అమ్మాజీ ముమ్మిడివరంలో హోండా షోరూమ్లో పనిచేస్తున్న సమయంలో రాజేష్ గత జూలై నెలలో పెళ్లి చేసుకుంటానని అమలాపురం సాయిబాబా గుడికి తీసుకు వెళ్లి నుదుట విభూది బొట్టు పెట్టి అక్కడి నుంచి ఓడల రేవు బీచ్కు తీసుకువెళ్లాడు. 29న హైదరాబాద్ ఆర్య సమాజానికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుని, కొద్ది రోజులు అక్కడ వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. విషయం అమ్మాజీ తల్లిదండ్రులకు తెలియడంతో కొమానపల్లి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఆగస్టు 25న వారికి పెళ్లి చేయడానికి రాజేష్ తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే ఫైనాన్స్ కంపెనీలో తగవు ఉందని చెప్పి ఆగస్టు 17న స్నేహితులతో కలిసి వెళ్లిన రాజేష్ తిరిగి రాలేదని ఈ విషయంపై రాజేష్ తండ్రిని నిలదీస్తే వారి పెళ్లికి కులం అడ్డుగా చూపి నిరాకరించాడని అమ్మాజీ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ముమ్మిడివరం ఎస్సై ఎం.పండుదొర ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్వగృహంలో సోమ వారం అమ్మాజీతో పాటు తల్లిదండ్రులు శంకరరావు, సత్యవతిలను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. -
కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య
మనస్తాపం.. ఒక్క నిమిషం తమాయించుకుంటే.. ఎంతటి సమస్యకైనా కాలమే సమాధానమిస్తుంది. అలా నిగ్రహించుకోలేకపోతే.. వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటోయో.. ఈ తల్లి, కొడుకు ఆత్మహత్య ఉదంతం.. సాక్ష్యంగా నిలుస్తుంది. కాపురంలో చిన్నపాటి వివాదాలు. గతంలో అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చేసిన ఆమె.. ఈసారి మాత్రం మనస్థాపంతో నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. ఈసారీ అలాగే వస్తుందనుకున్న భర్త, బంధువులు.. వారిద్దరి మృతదేహాలు కంటపడేసరికి తల్లడిల్లిపోయారు. పల్లం గ్రామం బోరున విలపించింది. ఇదేమీ తెలియని మృతురాలి చిన్నారి.. అందరి వైపు చూస్తుంటే.. అతడిని చూసిన అందరు.. ఉబికివస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయారు. సాక్షి, కాట్రేనికోన (తూర్పు గోదావరి): పల్లం గ్రామానికి చెందిన సంగాని రామలక్ష్మి (22) కుమారుడు గీతాకృష్ణ (4)తో పాటు గోదావరి పాయలో పడి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఈ గ్రామానికి చెందిన సంగాని నరసింహరాజు (చిన నరసింహులు)తో ఆరేళ్ల క్రితం రామలక్ష్మికి వివాహమైంది. వీరికి వివాహ బంధంలో ఇద్దరు పిల్లలు గీతాకృష్ణ (4) ఏడాది లోపు పాప ఉన్నారు. మృతురాలు రామలక్ష్మి సోదరుడు శేషాద్రి, ఆమె భర్త నరసింహరాజు మధ్య బుధవారం వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రాత్రి భార్యాభర్తల మధ్య కూడా గొడవ తలెత్తడంతో విసుగు చెందిన ఆమె పుట్టింటికి వెళ్లిపోతానని, రాత్రి 12 గంటల సమయంలో కుమార్డు గీతా కృష్ణను తీసుకుని వెళ్లిపోయింది. గతంలో గొడవ పడి వెళ్లిపోయిన ఆమె బంధువుల ఇంటికి వెళ్లి ఆ తరువాత తిరిగి ఇంటి వెళ్లింది. అలాగే తిరిగి అవుతుందని అనుకున్నా.. ఆమె తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లకు వెళ్లి వెతికినా ఆమె లేకపోవడంతో పరిసరాల్లో వెతికారు. గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి బాలుడి మృతదేహం గోదావరి పాయలో కనబడింది. వినాయక నిమజ్ఙనంలో ఎవరో బాలుడు మృతి చెంది ఉంటాడనుకున్నారు. భార్య, కొడుకు కోసం వెతుకు తున్న భర్త, వారి బంధువులకు గోదావరి పాయలో బాలుడి మృతదేహం ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లి చూసి గీతకృష్ణ మృతదేహంగా గుర్తించారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానించి.. గాలించడంతో భార్య రామలక్ష్మి మృతదేహం కూడా బయటపడింది. వృత్తి రీత్యా మృతురాలి భర్త చేపల వేట చేస్తుంటాడు. చేపలను తక్కువ ధరకు విక్రయిస్తున్నావని రోజూ కొట్టేవాడని, అతని వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. కంట తడిపెట్టిన గ్రామస్తులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏడాది పాపను ఇంటి వద్దనే వదిలి కొడుకు గీతాకృష్ణతో పాటు రామలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటంతో పల్లం గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి మృతదేహంపై పడి బంధువులు రోధిస్తున్న తీరు అందరినీ కలసి వేసింది. రోజూ అందరితో ఆడుకొనే బాలుడు మృతి చెందడంతో అతడితో ఆడుకొనే చిన్నారులు బిక్కముఖాలతో కూర్చున్నారు. ఏమి జరిగిందో తెలియని మృతురాలి ఏడాది లోపు చిన్నారి.. అక్కడి అందరినీ చూస్తూ కూర్చోవడం.. చూపరులకు దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటనపై కాట్రేనికోన ఏఎస్సై వి.నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!
సాక్షి, అమలాపురం(తూర్పు గోదావరి) : అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకున్న ఘటనలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తులో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని ఈ రైసు పుల్లింగ్ ఊబిలోకి లాగి రూ.కోట్లు కాజేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యుడైన కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకటవేణుధర ప్రసాద్ను అమలాపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాలతో నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్ను అమలాపురం బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టణ సీఐ బి.సురేష్బాబు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా సూత్ర, పాత్రధారి అయిన హైదరాబాద్కు చెందిన షావలిన్, ముఠాలోని మిగిలిన సభ్యులు అనంతరామ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ బాషా తెలిపారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రంలో తమ పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ వీరి కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డాక్టర్ కుటుంబం నుంచి రూ.ఐదు కోట్లు గుంజుకున్న ముఠా ముఠా సభ్యుడైన వెంకట వేణుధర ప్రసాద్ను అరెస్ట్ అనంతరం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బాషా మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణ, రూరల్, ముమ్మిడివరం సీఐలు బి.సురేష్బాబు, ఆర్.భీమరాజు, రాజశేఖర్లతో కలిసి ముఠా వివరాలను వెల్లడించారు. ఏడాది నుంచి డాక్టర్ రామకృష్ణంరాజు ఈ ముఠా మాయమాటల్లో పడినట్టు చెప్పారు. తొలుత వేణుధరప్రసాద్ డాక్టర్కు పరిచయమై రైస్ పుల్లింగ్ ఆశ పుట్టించాడు. తర్వాత డాక్టర్ను హైదరాబాద్లోని ప్రధాన నిందితుడు షావలిన్కు పరిచయం చేశాడు. దైవాంశ సంభూతమైన పురాతన విగ్రహాలు, నాణేలు, పాత్రల గురించి డాక్టర్కు వివరించి వాటి వల్ల రుణ విముక్తి కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఎలా ప్రాప్తిస్తాయో తన ముఠాలోని సభ్యులతో ఆయనకు చెప్పించి నమ్మించాడు. రైస్పుల్లింగ్లో ఇవ్వబోయే పురాతన వస్తువు విలువ రూ.కోట్లలో ఉంటుందని మానసికంగా సిద్ధం చేశారు. మీ కోసం రైస్ పుల్లింగ్ వస్తువు తయారవుతోందని డాక్టర్ కుటుంబం నుంచి ముఠా దఫదఫాలుగా నగదు రూపంలో, బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంది. ఇందు కోసం డాక్టర్ అధిక మొత్తాలను అధిక వడ్డీలకు అప్పు చేసి రూ.ఐదు కోట్లు ముఠాకు అతికష్టంగా సరిపెట్టారు. చివరకు ఈ ముఠా చేసిన మోసాలకు బలి అయ్యానని డాక్టర్ కుటుంబం గ్రహించి ఇటీవల హైదరాబాద్ వెళ్లి రెండు వారాలు ఉండి పొగొట్టుకున్న రూ.ఐదు కోట్లను ఏలాగైనా రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఇంతటి ఘోరమైన మోసానికి గురైన డాక్టర్ కుటుంబం చివరకు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు ఒడిగట్టిందని డీఎస్పీ బాషా తెలిపారు. డాక్టర్ పెద్ద కుమారుడు, మృతుడు డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్, డాక్టర్ చిన్న కుమారుడు కృష్ణ వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు రైస్ పుల్లింగ్ మోసాలు, ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు. -
అయ్యో.. పాపం!
సాక్షి, శంఖవరం(తూర్పుగోదావరి) : అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను ఆ ఊరు చెరువు పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటనతో సమీప బంధువులైన రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. తమ బంధువుతో చెరువులో మోటారు బైక్ కడిగేందుకు వెళ్లిన ఈ ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా, మరో చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. నిత్యం తమ ఇళ్లలో చలాకీగా తిరిగే ఈ ఇద్దరు చిన్నారులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ బంధువుల్లో విషాదం నెలకొంది. శంఖవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోడపాటి వీరాస్వామి, చిలకమ్మ దంపతులకు కుమారు వీరప్రకాశ్(12), కుమార్తె కృపాజ్యోతి(10) ఉన్నారు. కుమారుడు ఆరోతరగతి చదువుతున్నాడు. బంధువైన బోడపాటి వీరాస్వామి అన్నయ్య అల్లుడైన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన గాలింక అప్పారావుకు భార్య నాగరత్నం, నాగేశ్వరరావు(10), ప్రదీప్(8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రెండు నెలల క్రితం వ్యవసాయ పనుల కోసం ఇక్కడి వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువైన గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన కొల్లు వీరబాబు(23) వీరాస్వామి కుటుంబాన్ని చూసేందుకు శంఖవరం వచ్చాడు. శంఖవరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపం గ్రామం ఊర చెరువులో మోటారు బైక్ను కడిగేందుకు వీరాస్వామి కుమారుడు వీరప్రకాశ్, అప్పారావు కుమారుడైన నాగేశ్వరరావు, సమీప బంధువైన బోడపాటి శ్రీను(11)లను చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. చెరువు వద్ద వీరబాబు బహిర్భూమికి వెళ్లగా బైక్ కడిగేందుకు ముగ్గురూ చెరువులోకి దిగారు. చెరువు లోతును గమనించకపోవడంతో ప్రమాదవశాత్తూ వీరప్రకాశ్, నాగేశ్వరరావు చెరువులో మునిగిపోయారు. అక్కడే ఉన్న శ్రీను గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వీరబాబుతో పాటు పలువురు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దగ్గలేదు. అప్పటికే చెరువులో మునిగిపోవడంతో మృత్యువాత పడ్డారు. దారిన వెళుతున్న మత్స్యకారులు విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ వీరాస్వామి బోరున విలపించాడు. ఇంటికి పెద్ద కొడుకు మృత్యువాత పడడంతో అప్పారావు బోరున విలపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. -
పదోన్నతి పొంది.. అంతలోనే విషాదం
పోలీస్...ఆ మూడు అక్షరాలు సాధనేతన ధ్యేయంగా భావించింది ఖాకీ దుస్తులే తనకు కవచ కుండలాలనుకుంది లాఠీ...శాంతి, భద్రతల అదుపునకు వజ్రాయుధమనుకుంది విజిల్...కూత ట్రాఫిక్ నియంత్రణకు లక్ష్మణ రేఖగా భాసించింది ,పేదరికమనే అవరోధం ఆడపిల్లనే ఆక్షేపణం అడుగడుగునా అడ్డుగా నిలిచినా అధిగమించి, అరోహించి ‘స్టార్’గా నిలవాలనే లక్ష్యం సాధించి పదోన్నతి సాధించి...అందరికీ ఆనందం పంచి అంతలోనే విషాదం నింపి జీవనం పయనం చాలించి...(పిఠాపురం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న విజయలక్ష్మి విధి నిర్వహణలో ఉండగానే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది... ఆ ఫలాలు ఆస్వాదించకుండానే లారీ చక్రాల కింద బంగారు భవిత నలిగిపోయింది.) సాక్షి, తూర్పుగోదావరి(రంగంపేట) : రంగంపేట శివారు అట్టల ప్యాక్టరీ వద్ద ఏడీబీ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. రంగంపేట ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళాహెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న కూటి విజయలక్ష్మి (47)గురువారం రాజమహేంద్రవరం కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తన హోండా యాక్టివా బైక్పై వెళుతుండగా ఉదయం తొమ్మిది గంటలకు రంగంపేట శివారు అట్టల ఫ్యాక్టరీ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి పెద్దాపురం నుంచి రాజానగరం వైపు వెళుతున్న లారీ బలంగా ఢీ కొట్టింది. విజయలక్ష్మిని కొంతదూరం ఈడ్చుకుపోయింది. టైర్ల కింద ఇరుక్కుపోయి ఆమె చనిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. రంగంపేట వీఆర్వో శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, రంగంపేట ఇన్చార్జి ఎస్సైగా ఉన్న సామర్లకోట ఎస్సై వీఎల్వీకే సుమంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మహిళా హెడ్కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పెద్దాపురం: స్థానిక ఏడీబీ రోడ్డులో రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిఠాపురం పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కె.విజయలక్ష్మి మృతదేహాన్ని గురువారం జిల్లా ఎస్పీ నయీం అస్మీ పరిశీలించారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పోలీస్ యంత్రాంగం నుంచి అందించాల్సిన సహాయక చర్యలు చేపట్టి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్బీ డీఎస్పీ సుంకర మురళీమోహన్, పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్సై వెలుగుల సురేష్ తదితరులున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రంగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ విజయలక్ష్మి మృతి చెందడంతో ప్రమాదస్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు సందర్శించారు. -
జసిత్ కిడ్నాప్ కేసులో చిక్కిన అపరిచిత వ్యక్తి
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నాప్ ఘటనను అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఎత్తుగడ వేసిన అపరిచిత వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన వివరాలను సీఐ అడపా నాగమురళి గురువారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని విజయలక్ష్మి నగర్కు చెందిన నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే. మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్న నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు జసిత్ గత నెల 22న కిడ్నాప్కు గురై 25వ తేదీ ఉదయం క్షేమంగా తల్లిదండ్రులను చేరాడు. 60 గంటల పాటు సాగిన కిడ్నాప్ కథ సుఖాంతమైనా కిడ్నాప్కు గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సంఘటనతో భయాందోళనకు గురైన జసిత్ తల్లిదండ్రులు తమ స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయించుకుని అక్కడికి వెళ్లిపోయారు. అతడి మేనమామ రామరాజు కాకినాడలో నివాసముంటున్నారు. తాము అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే ఈ సారి జసిత్ను విడిచిపెట్టబోమంటూ మంగళవారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు వచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా అపరిచిత వ్యక్తి ఆచూకీ కనిపెట్టి పథకం ప్రకారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సులువుగా సొమ్ములు సంపాదించాలని.. జసిత్ కిడ్నాప్ వ్యవహారంపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాళ్లముదునూరిపాడు గ్రామానికి చెందిన చిక్కాల నరేష్ జసిత్ తండ్రికి ఫోన్ చేశాడు. ‘నేనే మీ అబ్బాయిని కిడ్నాప్ చేసి క్షేమంగా కుతుకులూరులో వదిలిపెట్టి వెళ్లానని, వెంటనే రూ.50 వేలు ఇవ్వాలని బెదిరించాడు. జసిత్ తండ్రి వెంకటరమణ తన బావమరిది రామరాజుకు ఫోన్చేసి మండపేట పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై తోట సునీత దర్యాప్తు చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట రావాలని ఫోన్ చేసి జసిత్ తండ్రి వెంకటరమణతో నరేష్కు చెప్పించారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట వచ్చిన నరేష్ను సినిమా రోడ్డులో సీఐ నాగమురళీ, ఎస్సై సునీత సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. నరేష్ గతంలో తెలంగాణలోని కాళేశ్వరం ఇసుక ర్యాంపులో పనిచేసేవాడని, నిందితుడికి భార్య, కుమారుడు ఉన్నట్టు సీఐ నాగమురళీ తెలిపారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ రామచంద్రరావు కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ 2016లో రూ.9.5 లక్షల వ్యయంతో అన్నవరం రైల్వేస్టేషన్కు ఎదురుగా గల దేవస్థానం పొలంలో రేకుల షెడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ను టెండర్ ద్వారా పొందాడు. పని పూర్తయ్యాక అతడికి కాంట్రాక్ట్ తాలుకు బిల్లులు చెల్లించారు. నిబంధనల ప్రకారం ఈఎండీ మొత్తం రూ.40,646 దేవస్థానం వద్ద డిపాజిట్లో ఉంచారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ పూర్తయిన రెండేళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ నాలుగు నెలలుగా ఈఎండీ మొత్తాన్ని ఇవ్వమని ఇంజినీరింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 19న ఇదే పనిపై ఇంజినీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ చిక్కాల సాయిబాబాను కలిశాడు. రూ.ఐదు వేలు ఇస్తే తప్ప డిపాజిట్ రిఫండ్ ఇవ్వడం కుదరదని సాయిబాబా చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగినట్టుగా సాయిబాబా వాయిస్ రికార్డు కూడా కాంట్రాక్టర్ సమర్పించడంతో దానిని పరిశీలించి సాయిబాబాపై నిఘా ఉంచామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గురువారం ఉదయం కాంట్రాక్టర్ వరప్రసాద్ సాయిబాబాకు కెమికల్ పూసిన రూ.500 నోట్లు ఇవ్వగా, తాము దాడి చేసి పట్టుకున్నామన్నారు. లంచం స్వీకరించిన నిందితుడు సాయిబాబాను అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తే సెల్:9440446160కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు తిలక్, మోహన్రావు, పుల్లారావు, ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లు ఈ దాడి లో పాల్గొన్నారు. విసిగి ఫిర్యాదు చేశా: కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ నిరుద్యోగంతో వేగలేక చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న తనను అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు ఈఎండీ ఇవ్వకుండా వేధించారని కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ విలేకర్లకు తెలిపారు. తాను ఈఎండీ సొమ్ము ఇవ్వమని ఇంజినీరింగ్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు గుమస్తా కూడా ఈఎండీ ఇవ్వాలంటే కొంచం ఖర్చువుద్ది అని చెప్పాడని తెలిపారు. దాంతో మూడు నెలలు ఆగి మరలా వస్తే ఇప్పుడున్న గుమస్తా చిక్కాల సాయిబాబా కూడా రూ.ఐదు వేలు లంచం ఇవ్వనిదే పని జరగదని చెప్పాడని తెలిపారు. దాంతో ఏసీబీ ని ఆశ్రయించినట్టు తెలిపారు. దేవస్థానంలో కాంట్రాక్ట్ చేసినట్టుగా ‘ఎక్స్పీరియన్స్’ సర్టిఫికెట్ ఇవ్వమని 2018లో ఇంజినీరింగ్ అధికారులను, అప్పటి ఈఓను అడిగినా ఇవ్వలేదని తెలిపారు. అదే విధంగా ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన తన మోటార్ సైకిల్ చోరీ జరిగిందని దీనిపై దేవస్థానం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కాంట్రాక్టర్ వరప్రసాద్ వాపోయారు. దీంతో విసిగి వేసారి సిబ్బందిలో కొంతైనా మార్పు వస్తుందనే ఇలా చేశానని తెలిపారు. -
ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రత్తిపాడు రూరల్ (తూర్పు గోదావరి): రెప్పతీస్తే జననం.. రెప్ప మూస్తే మరణం అన్నాడో కవి. నిద్ర మరణానికి మరో రూపం అంటారు. అదే వారి కొంపముంచింది. కొత్తగా టాటా ఏస్ కొనుక్కున్న సంబరంతో మిత్రులతో కలసి తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళుతుండగా దాన్ని నడుపుతున్న చెల్లుబోయిన మరిడియ్యకు నిద్రమత్తుతో రెప్ప పడగా రోడ్డుపక్కన ఆటోను ఢీకొన్నాడు. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా ఎనిమిదిమంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన బొంతు సత్యశ్రీనివాస్ టాటా ఏస్ కొనుక్కొన్నాడు. అదే గ్రామానికి చెందిన పదకొండుమంది బంధు మిత్రులతో శనివారం రాత్రి తలుపులమ్మవారి దర్శనానికి బయల్దేరాడు. అమ్మవారిని దర్శించుకొని ఆదివారం వారు తిరుగుప్రయాణమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. దాంతో అందులో ప్రయాణిస్తున్న మట్టపర్రు గ్రామానికి చెంది న చెల్లుబోయిన మరిడియ్య (ఆటో డ్రైవర్) (36), చెల్లుబోయిన సత్యనారాయణ (46), మట్టపల్లి ఏడుకొండలు (42) మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి ప్రత్తిపాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై ఎ.రవికుమార్ పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీజీహెచ్లో క్షతగాత్రులు కాకినాడ: ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆదివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్కు తీసుకువచ్చారు. యాండ్ర హరికృష్ణ, యాంత్ర పరమేష్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన శివప్రసాద్, బొంతు సత్య శ్రీనివాసరావుతో పాటు వ్యాన్ డ్రైవర్ రాపాక శ్యామ్బాబులను జీజీహెచ్కు తీసుకురాగా యాంత్ర పరమేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉం దని వైద్యులు చెబుతున్నారు. వీరందరినీ అత్యవసరవిభాగంలో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. గాజులగుంటలో విషాదం పి.గన్నవరం: ధర్మవరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట గ్రామానికి చెందిన మట్టపర్తి ఏడుకొండలు (చిన్న) (52) మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తాపీ పని చేసుకొనే ఏడుకొండలుకు భార్య పద్మావతి, కుమార్తెలు వర్ణిక, మౌనిక ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. ఏడుకొండలు గ్రామంలో అం దరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. అతడి మరణ వార్తను గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. మట్టపర్రు శోకసంద్రం మలికిపురం(రాజోలు): ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు, గ్రామానికి చెందినవారి అల్లుడు మరణించడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం వార్త ఆదివారం రాత్రి గ్రామస్తులకు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన చెల్లుబోయిన వీర వెంకట సత్యనారాయణ కొబ్బరి ఒలుపు కార్మికుడు. అతని భార్య, కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. మరొక మృతుడు చెల్లుబోయిన మరిడియ్య ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య అరుణ ఉపాధికోసం విదేశాల్లో ఉంటోంది. మరిడియ్య కుమార్తె బాలదుర్గకు వివాహం కాగా కుమారుడు శ్రీరామ కృష్ణ చదువుకుంటున్నాడు. గ్రామానికి చెందిన బొక్క సత్యనారాయణ, వెంకట రమణలకు మరిడియ్య అల్లుడు. వెంకట రమణకు స్వయానా సోదరుడు. చిన్నప్పటి నుంచి అక్కే అతనిని పెంచి పెద్ద చేసి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. మరిడియ్య మరణంతో వెంకట రమణ– సత్యనారాయణ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరొక మృతుడు మట్టపల్లి ఏడుకొండలు మట్టపర్తికి చెందిన యాండ్ర సత్యనారాయణకు అల్లుడు. అతను శనివారం రాత్రి అత్తవారింటికి వచ్చాడు. ఏడుకొండలు బావ మరిది హరి కృష్ణ, బంధువులతో కలిసి లోవ వెళ్లాడు. ఏడుకొండలు స్వగ్రామం పి. గన్నవరం మండలం గాజుల గుంట. అల్లుడి మృతి వార్త తెలిసి అత్తింటి వారు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుకొండలు బావమరిది హరి కృష్ణకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామం అంతా రోదనలతో నిండి పోయింది. ఆదివారం అర్ధ రాత్రి వరకూ బంధువులకు మృతి వివరాలు తెలియ లేదు. -
ఎమ్మెల్యే రాపాక అరెస్టు.. విడుదల
సాక్షి, తూర్పుగోదావరి(రాజోలు) : చట్టం ముందు అందరూ సమానమేనని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ అన్నారు. మలికిపురం పోలీస్స్టేషన్కు మంగళవారం ఆయన వచ్చారు. ఈ నెల 11న ఈ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళనలో ధ్వంసమైన అద్దాలను పరిశీలించారు. పేకాడుతున్న వారి అరెస్ట్ నేపథ్యంలో, రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ఎస్సై కేవీ రామారావు మధ్య వివాదం కారణంగా ఏర్పడిన ఘర్షణ వివరాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు తప్పు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు ఉందన్నారు. ఫిర్యాదులపై విచారణ చేసి తప్పు చేసిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. అలా కాకుండా ఎమ్మెల్యే స్టేషన్ వద్ద ధర్నా చేయడం, అనుచరులతో స్టేషన్పై దాడి చేయడం తగదన్నారు. ఇది యువతను తప్పు తోవ పట్టించి ప్రభుత్వం, వ్యవస్థల పట్ల తప్పుడు సంకేతాలు పంపడమేనని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులందరిపైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట రాజోలు సీఐ మోహన్ రెడ్డి, ఎస్సై రామారావు ఉన్నారు. ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైన నేపథ్యంలో మలికిపురంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కాకినాడ క్రైం: మలికిపురం పోలీస్స్టేషన్పై దాడి కేసులో నిందితులు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు ఎనిమిది మందిని మంగళవారం రాజోలు సీఐ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. అనంతరం వీరిని బెయిల్పై విడుదల చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులోని వారు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తెలిపారు. ‘చిన్న విషయమని పవన్కల్యాణ్ ప్రకటించడం విచారకరం’ మలికిపురం: స్థానిక పోలీస్ స్టేషన్పై దాడి సంఘటన.. జనసేన ఎమ్మెల్యే రాపాక, పోలీసుల మధ్య ఏర్పడిన వివాదమే తప్ప ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అన్నారు. ఈ విషయంపై కొందరు తమ పార్టీని విమర్శించడం తగదని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. పేకాడుతున్న వారిని అరెస్ట్ చేస్తే ఆందోళన చేసిన జనసేన నేతలపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. జనసేన నేతలు స్టేషన్పై దాడి చేసి, దగ్ధం చేయడాన్ని సమర్థించడం పవన్కళ్యాణ్కు తగదని, ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డి లలిత్కుమార్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మంగెన సింహాద్రి, సొసైటీ చైర్మన్లు దివ్వి చిట్టిబాబు, బెల్లంకొండ సూరిబాబు ఏఎంసీ మాజీ చైర్మన్ గెద్దాడ సత్యనారాయణ, ఎస్.శాంతికుమారి, రాయుడు విజయకుమార్, ఓగూరి హనుమంతరావు, చేట్ల సత్యనారాయణ, మేడిది రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జాతీయ ‘రక్త’దారి..
సాక్షి, తూర్పుగోదావిరి : జాతీయ రహదారులు రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. జిల్లాలో గోపాలపురం నుంచి తుని వద్ద గల పాయకరావు పేట వరకు 140 కిలో మీటర్లు ఉన్న జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జాతీయ రహదారి గోతులమయం కావడం, రహదారుల వెంబడి మద్యం షాపుల ఏర్పాటు, ప్రమాదకర మలుపులు, గ్రామాలను కలుపుతూ వెళ్లిన జంక్షన్ల వద్ద సరైన రక్షణ ఏర్పాటు చేయకపోవడం, మద్యం మత్తులో, నిద్ర మత్తులో, లైసెన్స్ లేని డ్రైవర్లు సైతం జాతీయ రహదారులపై హేవే వాహనాలు డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా గత టీడీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారమే ప్రధాన ఆదాయంగా నిబంధనలు తుంగలో తొక్కి లైసెన్స్లు ఇచ్చేసింది. దీంతో మద్యం సేవించి లారీ డ్రైవర్లు, హే టెక్ బస్సు డ్రైవర్లు, ఇతర వానం డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. హైవేలపై పర్యవేక్షణ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్టు అధికారులు మాముళ్ల మత్తులో వాహనాలు తనిఖీలు నిర్వహించకుండానే వదిలి వేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే సమయంలో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించకుండా జారీ చేయడంతో రోడ్డు ప్రమాదాలకు అవి కూడా కారణమవుతున్నాయి. గత మూడేళ్లలో 1,490 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 419 మంది మృతి చెందారు. 1,653 మందికి గాయాలయ్యాయి. ఏటా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని వందలాది మంది ప్రజాలు ప్రాణాలు కోల్పోతున్నా హైవే అథారిటీ అధికారులు కళ్లు తెరవడం లేదు. గోతులను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారిలో గోతులు పడడంతో వేగంగా వెళ్లే వాహనాలు వాటిని తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు వాహనం గోతుల నుంచి తప్పించేందుకు కొంత పక్కకు తిప్పడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనం ఢీ కొని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల ఐదో తేదీ సోమవారం దివాన్చెరువు ఆటోనగర్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొత్త వెలుగు బంద గ్రామానికి చెందిన మరుకుర్తి శ్రీనివాస్, లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గోతులను తప్పించే క్రమంలో వెనుక వైపు నుంచి లారీ వచ్చి వారిని ఢీ కొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి పిల్లలు అనాథలయ్యారు. తాజాగా ఆదివారం జరిగిన రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజానగరం మండలం తోకాడకు చెందిన భార్యాభర్తలు రాయుడు నరసింహ మూర్తి, అతడి భార్య సత్యవతి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తమ కుమారుడు గోవింద్తో కలిసి బైక్పై శ్రీరామ్నగర్లోని బంధువుల ఇంట జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. వీరిని జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గోవిందుతో పాటు వెనుక కూర్చున భార్యాభర్తలు ఎగిరి కిందపడడంతో వారి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాలు నిత్యం హైవేలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ జంక్షన్లు జిల్లాలో జాతీయ రహదారి 140 కిలో మీటర్లు ఉండగా జాతీయ రహదారిపై నుంచి పట్టణాలు, నగరాలకు వేళ్లే మార్గాలు, అప్రోచ్ రోడ్లు, ఇతర జంక్షన్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుని పరిధిలో జగన్నాథగిరి, గవరయ్య కోనేరు సెంటర్, తేటగుంట సెంటర్, సి.ఇ చిన్నాయ పాలెం, బెండపూడి, కత్తిపూడి, రామవరం, గండేపల్లి, మల్లేపల్లి, రాజానగరం, రాజమహేంద్రవరం లాలా చెరువు, మోరంపూడి సెంటర్, బొమ్మూరు జంక్షన్, కడియం, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో డేంజర్ జంక్షన్లు ఉన్నాయి. హైవేకు అప్రోచ్ రోడ్లు ఉండడం వలన నగరాల నుంచి హైవేకు వెళ్లే మార్గాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెంటర్లలో సరైన రక్షణ చర్యలు చేపకట్టకపోవడం, జాతీయ రహదారికి సంబంధం లేకుండా బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతులు పూడుస్తున్నాం జాతీయ రహదారిలో ప్రతిరోజూ రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల శాఖ వారు బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్లు అప్రోచ్ డైవర్షన్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కడియపు లంక నుంచి దివాన్ చెరువు వరకూ ఐదు టీమ్లు ఏర్పాటు చేసి వర్షానికి ఏర్పడిన గోతులు యుద్ధప్రాతిపదికన పూడుస్తున్నాం. – శ్రీనివాసరావు, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ గోతులతో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహాదారి పై ఏర్పాడిన గోతుల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో పోటు అప్రోచ్ రోడ్లు, జంక్షన్లు వద్ద ఒక్క సారిగా రోడ్డు పైకి వాహనాలు వేగంగా వచ్చేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాము. డ్రంకన్ డ్రైÐŒ , వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నాము. – ఎస్. వెంకట్రావు, ట్రాఫిక్ డీఎస్పీ,రాజమహేంద్రవరం అర్బన్ -
పోలీసు స్టేషన్పై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పోలీస్స్టేషన్పై దాడికి దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం రాత్రి తెలిపారు. మలికిపురంలో ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్హౌస్లో పేకాడుతున్నట్టు వచ్చిన సమాచారంపై మలికిపురం ఎస్సై కేవీ రామారావు తన సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ దాడిలో రూ.37,700 నగదు, ఆరు మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మీ తెలిపారు. దీనిపై క్రైం నంబర్ 182/2019గా గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వెంటనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్ సంఘటన స్థలంలో ఎస్సై రామారావుతో గొడవపడి మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు వీల్లేదని గొడవపడ్డారన్నారు. దీనిపై ఎస్సై ‘తాను అలా చేయడానికి లేదని, అవకాశం ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేస్తాను’ అని చెప్పినా ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే గెడ్డం తులసీభాస్కర్ ఎస్సైతో వాగ్వివాదానికి దిగి ఇష్టానుసారంగా దూషించినట్టు ఎస్సై తెలిపారు. తరువాత ముద్దాయిలను, స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎమ్మెల్యే స్టేషన్కు తీసుకువచ్చారు. తరువాత కొందరు వ్యక్తులు ఎస్సై ఎమ్మెల్యేను నిందించినట్టు ప్రచారం చేశారన్నారు. దీంతో ఎమ్మెల్యే రాపాక, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్లు సుమారు 100 మంది అనుచరులతో స్టేషన్పై దాడి చేసి పోలీసులను నిందించుకుంటూ, పోలీస్స్టేషన్పై రాళ్లు రువ్వుతూ కిటీకీ అద్దాలు పగలుగొట్టారన్నారు. పేకాడుతూ పట్టుబడిన వ్యక్తులను తక్షణం విడుదల చేయాలని పోలీసుల విధులకు ఆటంక పరిచారని ఎస్పీ నయీం అస్మీ వివరించారు. పోలీస్స్టేషన్పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరులపై ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ ఆదేశాల మేరకు క్రైం నంబర్ 183/2019 కింద సెక్షన్లు 143, 147, 148, 341, 427, 149, అండ సెక్షన్ 3 కింద పీడీపీపీ యాక్ట్ అండ్ క్రిమినల్ ఎమైండ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల దుర్మరణం
‘నాతిచరామి’ అంటూ పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను మరువ లేదేమోనన్నట్టుగా.. ఆ దంపతులు.. ఒకరికొకరు తోడుగా మృత్యు కౌగిట్లోకి ఒదిగిపోయారు. రాజానగరం శివారు శ్రీరామనగర్లో బంధువుల ఇంట ఓ ఫంక్షన్కు వెళ్లిన తోకాడకు చెందిన దంపతులు రాయుడు నరసింహమూర్తి, సత్యవతి.. తిరుగు పయనంలో.. ఆ ఫంక్షన్ జరిగిన ఇంటికి సమీపంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంధువులంటే అతడికి వల్లమానిన అభిమానం. ఎవరింట ఏ కార్యక్రమం జరిగినా.. తప్పనిసరిగా హాజరై అందరితో సరదాగా ఉండే అతడంటే వారందరికీ కూడా ఎంతో అభిమానం. అదేవిధంగా శ్రీరామనగర్లో బంధువుల ఇంట నిర్వహించిన ఫంక్షన్కు భార్య, కుమారుడితో వచ్చి తిరిగి వెళుతుంటే.. ఆ ఇంటి సమీపంలోనే ప్రమాదానికి గురై భార్యతో సహా చని పోయాడు. విషయం తెలుసుకున్న పంక్షన్లోని వారందరూ పరుగున వెళ్లి విగతజీవులుగా పడి ఉన్న భార్యాభర్తలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. మండలంలోని తోకాడకు చెందిన రాయుడు నరసింహమూర్తి (55), అతని భార్య సత్యవతి (50) కుమారుడు గోవిందుతో కలసి మోటారు బైకుపై శ్రీరామనగర్లోని బంధువుల ఇంట జరిగే ఒక ఫంక్షన్కు వచ్చారు. ఫంక్షన్ ముగిశాక తిరుగు పయనమై డివైడర్ దాటి అవతల వైపువెళుతుండగా బైక్పై ఉన్న వీరిని.. జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకు నడుపుతున్న కుమారుడు గోవిందుతోపాటు వెనుక కూర్చున్న భార్యాభర్తలు ఎగిరి పడ్డారు. డివైడర్పై వర్షపు నీరు పోయేందుకు నిర్మించిన సీసీ బోదెల అంచులకు భార్యాభర్తల తలలు బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. గోవిందు మాత్రం డివైడర్పై గడ్డితో ఉన్న మట్టిపై పడటంతో కాలు, చెయ్యి విరిగింది. వెంటనే అతడిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు చిన్నతనంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరిలో పెద్దవాడికి, అమ్మాయికి వివాహాలను వారు చేశారు. గాయపడిన కుమారుడు గోవిందు అవివాహితుడు. సంఘటన స్థలంలో ప్రమాదం జరిగిన తీరును రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సమయం మించిపోవడంతో సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. -
వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కామవరపుకోట(పశ్చిమగోదావరి) : కామవరపుకోటలోని కోటగట్టు ప్రాంతానికి చెందిన కె.రత్నశ్రీ (18) ఆకతాయి వేధింపులు తాళలేక శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుందని తడికలపూడి ఎస్ఐ కె.సతీష్ కుమార్ తెలిపారు. రత్నశ్రీ నాయనమ్మ వీరవెంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం..రత్నశ్రీ స్థానిక వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రత్నశ్రీ తల్లి చిన్నతనంలోనే చనిపోగా, ఇటీవలే తండ్రి కూడా మరణించాడు. దీంతో నాయనమ్మ ఆలనాపాలనా చూస్తోంది. కోటగట్టు ప్రాంతానికి చెందిన వామిశెట్టి నాగు గత ఏడాదిగా రత్నశ్రీ వెంటపడి వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రత్నశ్రీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు తాళలేక మనస్తాపంతో శనివారం ఉదయం విషం తాగింది. మనవరాలిని నిద్ర లేపటానికి వెళ్ళిన నాయనమ్మ వీరవెంకమ్మకు పురుగుల మందు వాసన రావడం, రత్నశ్రీ అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రత్నశ్రీ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
సాక్షి, తూర్పుగోదావరి(తుని) : తుని మండలం టి.తిమ్మాపురం గ్రామంలో కట్టుకున్న భర్తే డబ్బుల కోసం తగాదా పడి భార్యను హత్య చేశాడు. ఈ సంఘటనలో పక్కుర్తి శివకుమారి(28) మృతి చెందగా, భర్త మహాలక్ష్మి పరారీలో ఉన్నాడు. విషయం తెలియడంతో సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, రూరల్ సీఐ కె.కిషోర్బాబు, రూరల్ ఎస్సై ఎస్.శివప్రసాద్ పరిశీలించారు. రూరల్ సీఐ కిషోర్బాబు కథనం ప్రకారం.. టి.తిమ్మాపురానికి చెందిన పక్కుర్తి మహాలక్ష్మికి, కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి చెందిన శివకుమారితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఎనిమిది, ఐదేళ్ల వయస్సుగల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె దేవి తాతయ్య వద్ద ఉంటుండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాలక్ష్మి వ్యవసాయ కూలి. కొద్ది రోజులుగా శివకుమారి తునిలో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. ఇటీవల గొర్రెల లోను కోసం రూ.40వేలను లబ్ధిదారువాటాగా చెల్లించారు. ఆ లోను రాకపోవడంతో లబ్ధిదారు వాటాగా పెట్టిన డబ్బు మంగళవారం వెనక్కి ఇచ్చారు. ఆ డబ్బును పెద్దమ్మ వరుసైన ఆవాల సుబ్బలక్ష్మికి ఇవ్వడంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ బుధవారం తెల్లవారుజామున శివకుమారి హత్యకు దారితీసింది. శివకుమారిని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్టు వివరించారు. మృతురాలి తండ్రి ఇసరపు త్రిమూర్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం నిందితుడు భార్య శివకుమారిని హత్య చేసి మృతదేహాన్ని నివాస గృహం ఎదుట ఉన్న రైల్వే పట్టాలపై ఉంచి ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరించాడన్నారు. బహిర్భూమికి వెళ్లగా మృత్యువాత పడిందనుకున్న స్థానికులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానికులు మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్లగా రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. మృతురాలి తల్లి దుబాయ్లో ఉంటుండగా తండ్రి, సోదరుడు సర్పవరంలో ఉంటున్నారు. వీరిద్దరూ వచ్చి అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్సై శివప్రసాద్, సీఐ కిశోర్బాబు, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావులు హత్యగా నిర్ధారించారు. అనాథలైన చిన్నారులు : తల్లి శివకుమారి మృత్యుఒడికి చేరగా తండ్రి మహాలక్ష్మి పరారీలో ఉండడంతో వీరికి జన్మించిన ఇద్దరు చిన్నారులు అనాథులయ్యారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. భర్తకు చేదోడుగా ఉండేందుకు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న శివకుమారి కొద్దిరోజులుగా తునిలో వస్త్ర దుకాణంలో పనికి వెళుతోంది. అందరితో కలసిమెలసి ఉండే శివకుమారి మృతితో పిల్లలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అంతా ఊడ్చుకెళ్లిన దొంగలు!
సాక్షి, తూర్పుగోదావరి(గొల్లప్రోలు) : పట్టణంలో సోమవారం ఉదయం భారీ చోరీ జరిగింది. స్థానిక మార్కండేయపురంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు మాండపాక ప్రభాకరరావు ఇంట్లో సుమారు రూ.13లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు, విలువైన బాండ్లు, డాక్యుమెంట్లు అపహరణకు గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండపాక ప్రభాకరరావు, అతడి భార్య వరలక్ష్మి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ప్రభాకరరావు ప్రత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో, వరలక్ష్మి గొల్లప్రోలులోని మలిరెడ్డి వెంకట్రాజు మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఉదయం యథావిధిగా ఇద్దరూ విధుల్లోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరలక్ష్మి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి , బీరువాలో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న భర్త ప్రభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు. ఇంటి వెనుక గోడ దూకి వచ్చి చోరీకీ పాల్పడిన వ్యక్తి ఇంటి వెనుక ఉన్న గోడ దూకి లోపలకు ప్రవేశించినట్టు బురద కాలితో ఉన్న ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. ఇంటి తాళం బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించి బీరువా తాళం తెరిచి అందులో ఉన్న వస్తువులను సోఫా, మంచంపై పేర్చి బాక్సుల్లో ఉన్న వస్తువులను చాకచక్యంగా అపహరించాడు. రూ.13లక్షల విలువైన సొత్తు అపహరణ 43కాసుల బంగారు ఆభరణాలు, 57 తులాల వెండి వస్తువులతో పాటు రూ.20వేల నగదు చోరీకు గురైంది. వీటి విలువ సుమారు రూ.13లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసిన రూ.9.85 లక్షల విలువైన డిపాజిట్ బాండ్లు, రెండు స్థలాల డాక్యుమెంట్లు, భూమి డాక్యుమెంట్లు కూడా అపహరణకు గురయ్యాయి. క్రైమ్ పార్టీ, స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి, సమీప నివాసితుల నుంచి వివరాలు సేకరించారు. తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. -
దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : జాతీయరహదారిపై అడుగడుగునా ఉన్న గోతులు భార్యభర్తల ప్రాణాలను హరించాయి. త్రుటిలో మరొకరు ఈ ప్రమాదం నుంచి గట్టెక్కారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రాజానగరం మండలం దివాన్చెరువు ఆటోనగర్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం కొత్త వెలుగుబంద గ్రామానికి చెందిన మరికుర్తి శ్రీను(32), మరికుర్తి లక్ష్మి(28)లు భార్యాభర్తలు. రాజమహేంద్రవరంలో మరికుర్తి లక్ష్మికి దంతాన్ని తీయించేందుకు వీరిద్దరూ సోమవారం ఉదయం ఇంటి నుంచి మోటర్ బైక్పై వచ్చారు. దంతాన్ని తీయించిన అనంతరం కొత్త వెలుగుబంద గ్రామానికి బయలుదేరారు. ఆటోనగర్ సమీపానికి వచ్చేసరికి లాలాచెరువు నుంచి రాజానగరం వైపు యాసిడ్లోడుతో వెళుతున్న ట్యాంకర్ జాతీయరహదారి గోతిలో పడి స్పీడుగా లాగేందుకు ప్రయత్నించి బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ జాతీయరహదారిపై ఉన్న మరో గోతిలో పడడంతో శ్రీను, లక్ష్మిలు బైక్తో సహా కిందపడి ట్యాంకర్ మధ్య చక్రాల కింద నలిగిపోయారు. లారీ వారిని, బైక్ను ఈడ్చుకుంటూ ముందు మరో స్కూటర్పై వెళుతున్న దివాన్చెరువు గ్రామానికి చెందిన బొంగా స్టాన్లీపాల్ను ఢీకొట్టింది. అతడు డివైడర్పైన ఉన్న గడ్డిలో పడిపోయాడు. త్రుటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ట్యాంకర్ చక్రాల కింద పడిన మరుకుర్తి శ్రీను, మరుకుర్తి లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఈ ప్రమాదంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సంఘటన స్థలానికి బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి చేరుకుని పరిశీలించగా, ఈ లోపు అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎస్.వెంకట్రావు చేరుకుని సిబ్బందితో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలు ట్యాంకర్ చక్రాల కింద ఇరుక్కుపోవడంతో లక్ష్మి మృతదేహం బయటకు రాగా, శ్రీను మృతదేహాన్ని రెండు క్రేన్ల సహాయంతో ట్యాంకర్ను జరిపి బయటకు తీశారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై ఉన్న గోతులతోనే ప్రమాదాలు జాతీయరహదారిపై ఉన్న గోతులతోనే తరచూ ప్రమాదాలు జరిగి వాహనచోదకులు మృత్యువాత పడుతున్నారని ట్రాఫిక్ డీఎస్పీ ఎస్.వెంకట్రావు పేర్కొన్నారు. సోమవారం ఆటోనగర్ ప్రమాద సంఘటన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భార్యభర్తలు మృత్యువాత కూడా జాతీయరహదారిపై ఉన్న గోతుల వలనే జరిగిందన్నారు. గతంలో జరిగిన రోడ్డుప్రమాదాలకు ఇవే కారణమని తెలిపారు. తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్ మాట్లాడుతూ జాతీయరహదారిపై గోతులను పూడ్చితే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సంబంధిత అధికారులకు, జాతీయరహదారి అధికారులకు గోతులను పూడ్పించాలని లిఖితపూర్వకంగా ఇస్తామన్నారు. స్వగ్రామాల్లో విషాద వాతావరణం రాజానగరం: పంటి సమస్యతో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించేందుకని వెళ్లిన తన కొడుకు భార్యతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ దివాన్చెరువు సమీపంలోని ఆటోనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన మరుకుర్తి శ్రీనివాస్ తల్లిదండ్రులు మరుకుర్తి వీర్రాజు, లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యకు పంటి వైద్యం చేయించి, బైకుపై తిరిగి ఇంటి వస్తున్న వారిద్దరినీ మృతువు లారీ రూపంలో కబలించిన విషయం తెలియడంతో శ్రీనివాస్ స్వగ్రామమైన కొత్తవెలుగబంద, లక్ష్మి స్వగ్రామమైన దివాన్చెరువులో విషాదవాతావరణం నెలకొంది. శ్రీనివాస్, లక్ష్మిలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో కుమిలిపోతున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పాడి గేదెలను మేపుకొంటూ తీరిక సమయాల్లో వ్యవసాయ పనులకు కూడా వెళుతూ కుటుంబాన్ని పోషించుకు రావడంతో చేదోడుగా ఉన్న తన తమ్ముడు, మరదలు ఇక లేరనే విషయాన్ని శ్రీనివాస్ హారిబాబు, వదిన నూకరత్నం తట్టుకోలేక పడిపడి విలపిస్తున్నారు. మమ్మీ, డాడీ ఎక్కడ? శ్రీనివాస్, లక్ష్మిల అకాల మరణంతో వారి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. అబ్బాయి రామశ్రీదుర్గాగణేష్, అమ్మాయి దుర్గాభవానీలిద్దరూ దివాన్చెరువులోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్, నర్సరీ చదువుతున్నారు. స్కూల్ అయ్యాక సాయంత్రం ఆ చిన్నారులు స్కూల్ బస్సులో కొత్తవెలుగుబందలోని తమ ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ జనమంతా గుమిగూడి ఉండడంతో ఏమి జరిగిందో తెలియని అయోమయంలో అందరినీ చూస్తూ.. మమ్మీ, డాడీ ఏరీ.. అంటూ అమాయకంగా వేసిన ప్రశ్న అక్కడ ఉన్న వారి హృదయాలను కలచివేసింది. అక్కడనే రోదిస్తూ ఉన్న పెదనాన్న, పెదమ్మలు ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటుంటే అందరి కళ్లు చెమర్చాయి. దీంతో అక్కడ ఉంటే ఆ చిన్నారులకు విషయం అర్థమై బెంగపెట్టుకుంటారనే భావంతో దివాన్చెరువులో ఉంటున్న అమ్మమ్మ వాళ్లింటికి తీసుకువెళ్లారు. -
క్రికెట్ బెట్టింగ్ వల్లే జసిత్ కిడ్నాప్!
సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : మండపేటలో బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్ కిడ్నాప్ క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే సాగిందని ఎస్పీ అద్నాన్ నయిమ్ అస్మీ తెలిపారు. ఆయన ఆదివారం తమ కార్యాలయంలో ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరుల ప్రశ్నకు పైమేరకు సమాధానమిచ్చారు. 17 మంది బుకీలు ఈ కిడ్నాప్ సంఘటనలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో బాలుడి బంధువులు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. బాలుడిని మూడు రోజుల పాటు దాచేందుకు ఉపయోగించిన స్థలాలను నిర్థారించామన్నారు. చదవండి: జసిత్ను కిడ్నాప్ చేసింది ఎవరు? -
ఆప్టింగ్ డ్రైవర్.. యాక్టింగ్ చోరీ
సాక్షి, అమలాపురం : ఓ డాక్టర్గారి కారుకు తరచూ ఆప్టింగ్ డైవర్గా వెళ్లే ఓ యువకుడు ఆ ఇంటి ఆనుపానులు అన్నీ తెలుసుకొని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. డాక్టర్ హైదరాబాద్ వెళ్లగా ఇంట్లో ఆయన భార్య మాత్రమే ఉన్న సమయంలో తన స్నేహితులతో చోరీ చేయించాడు. ఆమె మెడలోని రూ.1.32 లక్షల విలువైన 44 గ్రాముల బంగారు నగలు కాజేశారు. ఈ సంఘటన జరిగిన పదిరోజులు కాకుండానే రాజోలు పోలీసులు నిందితులను అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆ వివరాలను ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా రాజోలు సీఐ కె.నాగమోహరెడ్డి, ఎస్సై ఎస్.శంకర్లతో కలసి విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో డాక్టర్ గాదిరాజు నారాయణరాజు కొన్నేళ్లుగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన కొంబత్తుల శ్యామలరావు అలియాస్ శ్యామ్ కొన్నేళ్లుగా డాక్టర్ సూర్యనారాణరాజు కారుకు డ్రైవర్ అవసరమైతే ఆప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డాక్టర్ ఎక్కడకైనా వెళ్లాల్సివస్తే శ్యామ్కు ఫోన్ చేసి ఆప్టింగ్ డ్రైవర్గా తీసుకు వెళుతున్నారు. శ్యామ్ డాక్టర్ కుటుంబం నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. గత నెల 26వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ సూర్యనారాయణరాజు శ్యామ్కు ఫోన్ చేసి తాను హైదరాబాద్ వెళ్తున్నానని, కారుకు ఆప్టింగ్ డ్రైవర్గా రావాలని చెప్పారు. అయితే అదే సమయానికి తన ఆస్పత్రిలో డ్రైవింగ్ వచ్చిన కాంపౌండర్ అందుబాటులో ఉండడంతో డాక్టర్ నారాయణరాజు శ్యామ్కు ఫోన్ చేసి అవసరం లేదని చెప్పారు. డాక్టర్ ఊరు వెళ్లడంతో సాయంత్రం ఆరు గంటలైతే ఆసుపత్రి సిబ్బంది వెళిపోతారు. ఇంట్లో డాక్టర్ భార్య రాణి సంయుక్త (72) మాత్రమే ఉంటారు. ఆమె దివ్యాంగురాలు. ఈ పరిస్థితులను శ్యామ్ అదనుగా తీసుకున్నాడు. తన స్నేహితులైన ఏనుగుపల్లి ధర్మరాజు అలియాస్ ధర్మ, నేరేడుమిల్లి రాజువర్మ అలియాస్ రాజేష్, మాదాసి వెంకటేష్ అలియాస్ చిన్న, మర్లపూడి ప్రేమ్బాబుతో కలిసి డాక్టర్ ఇంట్లో చోరీకి ప్లాన్ చేశాడు. ఈ అయిదుగురూ యువకులే. డాక్టర్ భార్యపై దాడి..ఆపై చోరీ 26వ తేదీ సాయంత్రం ఆరు గంటలు దాటాక చీకటి పడ్డాక ఆసుపత్రి పై అంతస్తులో ఉన్న డాక్టర్ ఇంట్లోకి ధర్మ, రాజేష్ వెళ్లారు. ఆసుపత్రి గేటు వద్ద ఒకరు కాపలా ఉన్నారు. ఆసుపత్రి బయట రోడ్డుపై మరో స్నేహితునితో కలిసి రెండు మోటారు సైకిళ్లపై శ్యామ్ వేచి ఉన్నాడు. డాక్టర్ భార్యపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న నగలను దోచుకున్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి అభినందన ఈ చోరీ కేసును కేవలం ఎనిమిది రోజుల్లో ఛేదించి చోరీకి పాల్ప డిన డ్రైవర్ శ్యామ్, అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేయడంతో పాటు బంగారు నగలను నూరు శాతం రికవరీ చేసిన రాజోలు సీఐ నాగమోహనరెడ్డి, ఎస్సై శంకర్, హెచ్సీలు కె.గణేష్, ఎ.ప్రభాకర్, బొక్కా శ్రీను, కానిస్టేబుల్ వీరేంద్ర, హోంగార్డ్ అనంద్లను జిల్లా ఎస్పీ నయిమ్ అస్మీ, డీఎస్పీ బాషా ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డు కూడా ప్రకటిస్తారని డీఎస్పీ తెలిపారు. చోరీకి ఉపయోగించిన రెండు మోటారు సైకిళ్లు, రెండు సెల్ఫోన్లను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ అయిదుగుర్నీ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజోలు మండలం చింతలపల్లి కళింగుల సెంటరులో రెండు మోటారు సైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. -
చోరి చేశాడనే అనుమానంతో బాలుడిపై...
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : పాచి పని చేసుకొని జీవించే తల్లి వెంట వెళ్లడమే ఆ బాలుడి చేసిన నేరమైంది. ఇంట్లో నగదు, సెల్ఫోన్ చోరీ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే తెల్లవారు జామున ఇంటికి వచ్చి తీసుకువెళ్లి ఊచ కాల్చి వాతలు పెట్టిన అమానుష సంఘటన రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, లక్ష్మి వారపు పేటకు చెందిన మేడబోయిన సీత, అదే ప్రాంతానికి చెందిన రాణి అనే మహిళ ఇంట్లో పాచిపని చేసుకుని జీవిస్తోంది. సీత కుమారుడైన బాలుడు అప్పుడప్పుడూ తల్లితో కూడా రాణి ఇంటికి వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో గురువారం రాణి ఇంట్లో రూ.ఐదు వేల నగదు, ఒక సెల్ ఫోన్ పోవడంతో సీత కుమారుడే తీశాడనే అనుమానంతో శుక్రవారం తెల్లవారు జామున సీత ఇంటికి వచ్చి ఆమె కుమారుడిని తీసుకువెళ్లి నగదు, సెల్ ఫోన్ ఏం చేశావంటూ రాణి, ఆమె అన్నయ్య, తల్లి, పక్కన ఉండే మరో వ్యక్తి కర్రలతో కొట్టారు. అంతటితో ఆగకుండా ఊచ కాల్చి వాతలు పెట్టారు. తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆ బాలుడుని విడిచిపెట్టకుండా అమానుషంగా ప్రవర్తించారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్లైన్ జిల్లా కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకొని జువైనల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చోరీ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా చట్టాన్ని చేతులోకి తీసుకుని బాలుడిని హింసించడం తగదని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్రంలో స్నానం చేస్తూ...
సాక్షి, తూర్పుగోదావరి : అల్లవరం మండలం ఓడలరేవు బీచ్లో గురువారం విషాదం చోటు చేసుకుంది. అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సానబోయిన హరి(19) ఓడలరేవు సముద్రంలో స్నానం చేస్తూ భారీ అలలకు మునిగి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం బొండాయికోడుతూము గ్రామానికి చెందిన హరి తోటి విద్యార్థులతో పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యాడు. అమలాపురం మండలం పేరూరు పల్లపు వీధికి చెందిన గంటి శివ(19) హరితో పాటుగా స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్కేబీఆర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 మంది విద్యార్థులు, తోటి స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల నిమిత్తం ఓడలరేవు బీచ్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు కావలసిన భోజన సదుపాయాలు తమతో బీచ్కు తీసుకెళ్లారు. తోటి విద్యార్థి పుట్టిన రోజు వేడుక పూర్తి చేసుకుని సముద్ర రిసార్ట్సు సమీపంలో సముద్రంలో స్నానానికి దిగారు. ఆ సమయంలో భారీ అలల ఉధృతికి సానబోయిన హరి, గంటి శివ గల్లంతయ్యారు. తమతో స్నానాలు చేస్తున్న హరి, శివలు కనిపించకపోవడంతో తోటి విద్యార్థుల్లో విషాదం అలుముకుంది. ఇంతలో భారీ అలలకు సానబోయిన హరి మృతదేహాం ఒడ్డుకి కొట్టుకొచ్చింది. అప్పటి వరకు సరదాగా తమతో గడిపి అంతలోనే విగతజీవుగా కనిపించడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరో విద్యార్థి గల్లంతైన శివ జాడ కోసం విద్యార్థులు నిరీక్షించడం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు. ఈ సంఘటనపై అల్లవరం పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఎస్సై కె.చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్కేబీఆర్ కాలేజీ నుంచి పుట్టిన రోజు పార్టీ నేపథ్యంలో బీచ్కు వచ్చిన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. సముద్రంలో గల్లంతైన శివ ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు, గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు అడ్డంకి మారిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. విద్యార్థుల గల్లంతుపై కోనసీమ జాక్ సంతాపం ఓడలరేవు సముద్రంలో స్నానానికి దిగి మృతి చెందిన హరి, గల్లంతైన శివ పట్ల కోనసీమ జాక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఓడలరేవులో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరిగి విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని, ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. -
నేరాలు.. ఘోరాలు!
సాక్షి, కాకినాడ క్రైం(తూర్పుగోదావరి) : క్షణికావేశంలో కొందరు.. కావాలని మరికొందరు.. ఆస్తికోసం కొందరు.. అనుమానంతో ఇంకొందరు.. ఇలా హత్యలు చేసి తమ జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో హత్యానేరాల సంఖ్య పెరిగింది. భార్యపై అనుమానాలు, ఆస్తి తగదాల నేపథ్యంలోనే హత్యలు జరుగుతుండడంతో జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా 45 రోజుల క్రితం జిల్లా కేంద్రంకాకినాడలో జరిగి వృద్ధదంపతుల హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఇప్పటి వరకు ఛేదించక పోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న, చిన్న విషయాలకే.. ఇటీవల కాలంలో జిల్లా పరిధిలో చోటు చేసుకుంటున్న హత్యలు క్షణికావేశంలో చోటు చేసుకుంటున్నవే అధికం. వీరందరూ చిన్న గొడవలు, ఆస్తి తగదాలు, అనుమానాలతో హత్యలకు పాల్ప డుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ శాతం మహిళలే హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా అనుమానం పెనుభూతంగా మారి హత్యలకు దారితీస్తోందని పోలీసులు చెబుతున్నారు. శిక్షలపై అవగాహనేది? జిల్లాలో జరుగుతున్న హత్యలపై ప్రజల్లో నెలకొన్న భయాన్ని తగ్గించడం కోసం ఆయా నియోజక వర్గాల పరిధిలోని పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ నేరం చేస్తే ఎంతకాలం శిక్ష పడుతుంది? జైలులో అనుభవించాల్సిన కష్టాలు, నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకున్న వారి జీవితకథలను ప్రజలకు వివరిస్తే కొంత మేరకు ఈ హత్యలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంటుంది. నేరాలు చేసి జైలుకు వెళితే.. వారి పిల్లల భవిష్యత్తు ఏంటనే స్పృహ వారిలో కలిగిస్తే కాస్త హత్యానేరాలను కొంత మేర అరికట్టవచ్చు. జిల్లాలో జరిగిన హత్యలు ఇలా.. ⇔జూన్ ఏడో తేదీన కాకినాడలో వృద్ధ దంపతుల హత్య జరిగింది. కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్ వెనుక ఉన్న ముమ్మిడివారి వీధిలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ దంపతుల హత్యకు కారణాలేంటనే విషయంపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 50 రోజులు దాటినా నేటికీ ఈ హత్య విషయాన్ని పోలీసులు ఛేదించలేకపోవడం విశేషం. ⇔కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ బర్మాకాలనీలో ఏప్రిల్ 17న తల్లితో తండ్రి ప్రతిరోజు గొడవ పడి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, భావించిన దత్తత కొడుకు కుమార్ కర్రతో తండ్రిని కొట్టాడు. ఆ దెబ్బలకు తండ్రి గోపిరెడ్డి ఈశ్వరరావు చనిపోయాడు. వెంటనే తల్లి సాయంతో ఇంటి పెరట్లోనే గొయ్యి తీసి మూడో కంటికి తెలియకుండా పూడ్చివేశాడు. ⇔కాకినాడ సురేష్నగర్లో పైడిముక్కల రవీంద్రనాథ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. స్నేహితుల మధ్య ఉండే గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ⇔కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన ఓ యువతికి మే 15న కరపకు చెందిన యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన వారం రోజులకే తన ప్రియుడితో కలిసి పెనుగుదురులో కట్టుకున్న భర్తను కడతేర్చింది. ⇔మండపేటలో వరి చేలో ఓ మహిళను పెట్రోల్ పోసి తగులబెట్టారు. వివాహేతర సంబంధాలు వల్లే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా జిల్లాలో అనేక చోట్ల హత్యలు క్షణికావేశంలోనే జరుగుతున్నాయి. అవగాహన కల్పిస్తాం జిల్లా పరిధిలో జరిగిన హత్యలు క్షణికావేశంతో అవగాహన లోపంతో జరుతున్నవే అధికం. నేరాలు చేస్తే జరిగే పరిణామాలపై శిక్షలపై పోలీస్శాఖ తరఫున ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. చట్టపరిధిని దాటి ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తాం. – అద్నాన్ నయీం అస్మీ, ఎస్పీ -
వలస జీవుల విషాద గీతిక
సాక్షి, రాజవొమ్మంగి (తూర్పుగోదావరి) : ఉన్నచోట ఉపాధి లభించకపోవడంతో పనులను వెతుక్కుంటూ వలసపోక తప్పదు. అదే పరిస్థితి రాజవొమ్మంగి మండలం గింజర్తి గ్రామంలో నెలకొంది. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామానికి చెందిన పదిమంది నిరుద్యోగ యువకులు కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ పనులకోసం వలస వెళ్లారు. కోలారు జిల్లాలోని మలబాగుల తాలూకా విరూపాక్ష గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ కొండెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29) విద్యుదాఘాతానికి గురై మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గింజర్తి గ్రామానికి చెందిన కొడెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29), కించు సత్యనారాయణ, ఆవూరి రాజ్కుమార్ కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగుల తాలుకా, విరూపాక్ష గ్రామంలో విద్యుత్తులైన్ల పనికి వెళ్లారు. వీరిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ‘పావని కంట్రోల్స్ అండ్ ప్యానల్ లిమిటెడ్’ పనుల్లో పెట్టుకొంది. విరూపాక్ష గ్రామంలో ఆది వారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్తంభం ఎక్కి విద్యుత్లైన్ల ఏర్పాటులో నిమగ్నమై ఉన్న చిన్నబాబుకు షాక్ తగిలింది. అతను విలవిలలాడుతుండగా బాలరాజు స్తంభం ఎక్కి చిన్నబాబును కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే విద్యుత్తుషాక్ నుంచి బయటపడ్డ చిన్నబాబు కిందపడి అక్కడికక్కడే మరణించగా అతనిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన బాలరాజు విద్యుదాఘాతానికి గురై స్తంభానికి అతుక్కు పోయి అక్కడే మరణించాడు. వీరిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన మరో యువకుడు కించు సత్యనారాయణ విద్యుత్ షాక్తో కింద పడి గాయాల పాలయ్యాడు. అతని కుడికాలు విరిగిపోగా ప్రాణాలు దక్కాయి. పక్కనే గల మరో స్తంభంపై పనిచేస్తున్న ఆవూరి రాజ్కుమార్ తనకు కూడా ఎక్కడ షాక్ తగులుతుందో అని భయపడి అక్కడ నుంచి దూకేశాడు. దాంతో రాజ్కుమార్ కూడా గాయాలపాలయ్యాడు. ఈ సమాచారాన్ని ఆ కంపెనీ వర్గాలు మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం ఉదయానికి ఇక్కడకు వస్తాయని మృతుల కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. స్థానిక మాజీ సర్పంచ్ ఆవూరి శుభలక్ష్మి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శోక సంద్రంలో తల్లిదండ్రులు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న తమ పిల్లలు మరో రాష్ట్రానికి వెళ్లి విగతజీవులుగా తిరిగివస్తున్నారని తెలిసి ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. వారిని ఊరడించడం ఎవరి వల్ల కాకపోయింది. ఈ ఏడాది మే నెల 13వ తేదీన పనులకు వెళ్లిన వీరు మరో వారంరోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నారనగా ఇలా జరగడంతో చిన్నబాబు, బాలరాజుల తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. చిన్నబాబు తండ్రి నాలుగు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న చిన్నబాబు తల్లిదండ్రులకు భారంకాలేక ఉన్న ఊరు, కన్నతల్లిని వీడి కర్ణాటకకు పనుల కోసం వలస వెళ్లాడు. అక్కడ రోజుకు రూ.400 సంపాదిస్తూ తను తినగా మిగిలినదానిని తల్లిదండ్రులకు పంపించేవాడు. చిన్నబాబు గతంలో మిలటరీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకొన్నాడు. అన్నిట విజయం సాధించినప్పటికీ మెడికల్ చెకప్లో నెగ్గుకురాలేకపోయాడు. దాంతో ఆ ఉద్యోగం వరించలేదు. పోలీసు కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకొన్న చిన్నబాబు శారీరక దారుఢ్యపరీక్షల్లో నెగ్గుకు వచ్చినప్పటికీ రాత పరీక్షలో పాస్ కాలేకపోయాడు. పోలీసు కావాలనే కోరిక ఉన్నప్పటికీ అర్థిక పరిస్థితులు కలసిరాక, తన కొడుకు కోచింగ్కు కూడా వెళ్లలేకపోయాడని తండ్రి వెంకటేశ్వర్లు ‘సాక్షి’ వద్ద వాపోయాడు. ఇలా ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించిన తన ఒక్కగానొక్క కుమారుడు సుదూర ప్రాంతానికి పనులకు వెళ్లి అర్ధాంతరంగా మరణించడం ఏనాడో నేను చేసుకొన్న పాపమంటూ అతను బోరున విలపించాడు. కొడుకు రేపో మాపో వస్తాడని ఎదురు చూస్తున్న చిన్నబాబు కన్నతల్లి లీలావతి ఈ మరణ వార్త విని కుప్పకూలింది. తమకు దిక్కెవరని కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తున్న లీలావతిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ సంఘటనలో మరణించిన ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు మిరియాల బాలరాజు తల్లిదండ్రులు వరకుమారి, వెంకటేశ్వర్లులది నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని వీరికి ఎదిగివచ్చిన కొడుకు ఆసరాగా నిలిచాడు. పని కోసం వలస వెళ్లిన బాలరాజు ఇంటిఖర్చులకు సొమ్ములు పంపిస్తూ ఆదుకుంటున్నాడని వారు సంబరపడుతున్నారు. ఆ సమయంలో విగత జీవిగా మారాడనే సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందా అని కంటిమీద కునుకులేకుండా మృతుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. -
నేను కూడా పోలీసులను అడగలేదు : డిప్యూటీ సీఎం
మండపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగించిన మండపేటలో నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. జసిత్ను చూసేందుకు శనివారం మండపేట వచ్చిన డిప్యూటీ సీఎం బోస్ మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో పోలీసులు, మీడియా ఒకరికొకరు పోటీపడి పనిచేశారని ప్రశంసించారు. జసిత్ విషయమై స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీసేవారన్నారు. తాను ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో సమీక్షించానన్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ మూడు రోజులపాటు మండపేటలోనే ఉండి కేసు దర్యాప్తు చేయడం పట్ల ఆయనను అభినందించారు. కేసును పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారని, వివరాలు వెల్లడించడం సరికాదని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను కూడా పోలీసులను వివరాలు అడగలేదని, వారిని స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోనివ్వాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకోనున్నట్టు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ విషయమై అనుమానాలున్నాయని ఒక విలేకరి అడుగ్గా అసాంఘిక, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యకలాపాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. వారు ఎవరైనా, ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని బోస్ అన్నారు. అటువంటి వ్యక్తులు ఒకవేళ తమ పార్టీలో ఉన్నా వారిని వదులుకుంటామే తప్ప క్షమించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు చాలాచోట్ల సరిగా పనిచేయడం లేదని బోస్ దృష్టికి తీసుకురాగా పక్కాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత జసిత్ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళిని పరామర్శించిన బోస్ కొద్దిసేపు జసిత్తో ముచ్చటించారు. నన్ను ఎలా కిడ్నాప్ చేశారంటే..అంటూ బాలుడు చెప్పే మాటలు విని మురిసిపోయారు. లిటిల్ హీరో అంటూ జసిత్ను ఆయన అభినందించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాజుబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి..
సాక్షి, రాజానగరం(తూర్పు గోదావరి) : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జాతీయ రహదారి పై లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దివాన్చెరువుకు చెందిన బలభద్ర వీరభద్రరావు అనే చిన్నబ్బు (55) అనారోగ్యంతో రాజమహేంద్రవరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన ఇయ్యపురాలిని పరామర్శించేందుకు భార్య, మనుమడితో కలసి బైకు పై వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళుతున్న లారీని వెనుక వస్తున్న మరో లారీ అధిగమించే ప్రయత్నంలో రహదారి పక్క నుంచి వెళుతున్న చిన్నబ్బు బైకును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడి భార్య, మనుమడు రహదారికి ఎడమ వైపు పడిపోగా, చిన్నబ్బు కుడివైపునకు పడటంతో లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో చిన్నబ్బు భార్య సూర్యలక్ష్మి సొమ్మసిల్లి పోయారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరభద్రరావు -
ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ స్థాయిలో సొమ్ములు వసూలు చేసి ఓ మోసగాడు పరారైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. బాధితుల కథనంప్రకారం.. రాజోలు మండలం మలికిపల్లి గ్రామానికి చెందిన జోగి శ్రీనివాసరావు అనే వ్యక్తి జిల్లాలో అనేక మందితోపాటు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరుద్యోగులను వలలో వేసుకొని వారికి మాయమాటలు చెప్పి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా మోసపోయిన వారు సుమారు 50 మంది వరకు ఉంటారని, రూ.1.80 కోట్లమేర స్వాహా చేసి నిందితుడు ఉడాయించాడని బాధితులు లాలాచెరువుకు చెందిన ఎం.శివ ప్రసాద్, కాతేరు గ్రామానికి చెందిన టి.హేమల రావు, నక్కా జయరాజు, కాకుల పాటి వీరేష్ కుమార్ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు ఎర ఈ వ్యవహారంలో మధ్యవర్తులు పంపన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నిరుద్యోగులకు ఎరవేసి జోగి శ్రీనివాసరావు రెండో భార్య అయిన ఆళ్లపు మంగ అకౌంట్లో నిరుద్యోగుల నుంచి నగదు వేయించుకుని మరో రెండు, మూడు రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని నమ్మించి అనంతరం కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. నిందితుడు హైదరాబాద్కు పరారైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. -
జసిత్ కిడ్నాప్ కేసును ఛేదిస్తాం: ఎస్పీ
సాక్షి, కాకినాడ: కిడ్నాప్కు గురైన జసిత్ ఆచూకీ కోసం ఏడు పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం హస్మీ మంగళవారం బాలుడు కిడ్నాప్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జసిత్ తండ్రి వెంకటరమణను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. అన్ని చెక్ పోస్టులు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అప్రమత్తం చేశామని, ఆర్థిక లావాదేవీలు కూడా కిడ్నాప్కు కారణమా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, కచ్చితంగా చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదిస్తామన్న నమ్మకం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్స్ రాలేదని, కిడ్నాప్కు ముందే రెక్కి నిర్వహించి ఉంటారని అమామానిస్తున్నట్లు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చదవండి: కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్ -
అవహేళన చేస్తావా.. అంటూ కత్తితో..
సాక్షి, రాజోలు (తూర్పు గోదావరి): చీటికీ మాటికీ తనను అవహేళనగా మాట్లాడుతున్న ఉపాధ్యాయుడిపై ఒక యువకుడి కత్తితో దాడి చేశాడు. రాజోలు తోరం వారి వీధిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు బుడితి నాగ కోట సత్యనారాయణమూర్తిపై సోమవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన యువకుడు నల్లి విన్సెంట్ కత్తితో దాడి చేశాడు. ఉపాధ్యాయుడికి వీపుపై రెండు, ఛాతీపై రెండు మొత్తం నాలుగు చోట్ల కత్తిపోట్లు దిగాయి. దీంతో దాడి జరిగిన ప్రాంతమంతా రక్తపు మడుగుగా మారింది. గాయాలతో కిందపడి ఉన్న ఉపాధ్యాయుడిని స్థానికులు రాజోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్లో మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడికి పాల్పడిన యువకుడు రాజోలు పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. యువకుడి చేతికి కూడా గాయం కావడంతో బంధువులు రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు మలికిపురం మండలం గుడిమెళ్లంక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ భార్య, కుమార్తెతో కలిసి రాజోలులోని తోరం వారి వీధిలో నివాసం ఉంటున్నాడు. అదే వీధిలో పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న పాస్టర్ నల్లి విక్టర్బాబు కుమారుడు విన్సెంట్. విన్సెంట్, ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి గత కొంతకాలంగా మాటామాటా అనుకుంటున్నారని స్థానికులు తెలిపారు. చీటికీమాటికీ తనను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడని అందుకే దాడికి పాల్పడినట్టు యువకుడు విన్సెంట్ తెలిపాడు. రోడ్డుపై వెళ్తుండగా ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి తనను పిలిచి కత్తి చూపించి బెదిరించాడని, దీంతో కోపం వచ్చి ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని వివరించాడు. ఈ పెనుగులాటలో ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి పాల్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో విన్సెంట్ చేతికి కూడా కత్తి గుచ్చుకుని గాయమైంది. రాజోలు ఎస్సై ఎస్.శంకర్ మాట్లాడుతూ గాయపడ్డ ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తిని అమలాపురం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని, ఉపాధ్యాయుడి వాగ్మూలం నమోదు చేసుకునేందుకు సిబ్బంది వెళ్లారన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. -
కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్
సాక్షి, మండపేట(తూర్పుగోదావరి): మండపేట పట్టణంలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. అప్పటివరకూ నాన్నమ్మతో కలిసి ఆడుకుని ఇంట్లోకి చేరుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఓ అపరిచిత వ్యక్తి నాన్నమ్మపై దాడి చేసి ఆ బాలుడిని ఎత్తుకెళ్లిపోయాడు. అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు విషయం తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఘటన జరిగిన తీరును బట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ కిడ్నాప్ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నూకా వెంకటరమణ, నాగావళి భార్యాభర్తలు. ఏడాది క్రితం బదిలీపై వీరు మండపేట వచ్చారు. వెంకటరమణ పట్టణంలోని యూనియన్ బ్యాంకులోను, నాగావళి కెనరా బ్యాంకులోను పీవోలుగా పని చేస్తున్నారు. స్థానిక విజయలక్ష్మి నగర్లోని అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. వారి నాలుగేళ్ల కుమారుడు జసిత్ను అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూలులో యూకేజీలో చేర్పించారు. బాలుడి సంరక్షణను వెంకటరమణ తల్లి పార్వతి చూస్తోంది. జసిత్ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాన్నమ్మ పక్కనే ఉన్న స్కూల్ ఆవరణలోకి తీసుకువెళ్లి ఆడించి తీసుకువస్తూంటుంది. రోజూ మాదిరి సోమవారం సాయంత్రం జసిత్ను గ్రౌండ్కు తీసుకువెళ్లి ఆడించింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో అతడిని తీసుకుని అపార్ట్మెంట్ వద్దకు చేరుకుంది. అప్పటికే విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా అంధకారం అలముకొంది. మెట్లు ఎక్కుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. నాన్నమ్మ పార్వతి.. రోదిస్తున్న తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి కరెంటు లేదా? అని పార్వతిని ప్రశ్నించాడు. లేదని ఆమె బదులిస్తున్న సమయంలో ఒక్కసారిగా బలంగా ఆమె దవడపై కొట్టి బాలుడిని లాక్కొని మోటారు సైకిల్పై ఎక్కించుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆమె ముఖంపై రక్తపు గాయాలయ్యాయి. పార్వతి వెంటనే తేరుకుని మోటారు సైకిల్ను వెంబడించినప్పటికీ చుట్టూ చీకటిగా ఉండటంతో ఆగంతకుడు ఎవరో గుర్తు పట్టలేకపోయింది. విధులు ముగించుకుని అదే సమయానికి ఇంటికి చేరుకున్న కుమారుడు, కోడలికి విషయం చెప్పడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. నాగావళి ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భిణి. వెంకటరమణ ఫిర్యాదు మేరకు మండపేట రూరల్ సీఐ కె.మంగాదేవి ఆధ్వర్యంలో మండపేట అర్బన్, రూరల్ ఎస్సైలు రాజేష్కుమార్, దొరరాజులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రామచంద్రపురం డీఎస్పీ జీవీ సంతోష్కుమార్ సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. బాలుడి నాన్నమ్మ పార్వతిని, తల్లిదండ్రులను విచారించారు. సంఘటన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడానికి కారణాలను ఆరా తీస్తున్నారు. తెలిసినవారి పనేనా? ఈ కిడ్నాప్ ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల అపార్ట్మెంట్లో ఉంచిన వెంకటరమణ ద్విచక్ర వాహనం చోరీ అవడం, తాజాగా ఆయన కుమారుడిని కిడ్నాప్ చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బాలుడి ఆచూకీ కోసం డీఎస్పీ జీవీ సంతోష్కుమార్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. వెంకటరమణకు కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా? ఎవరినుంచైనా బెదిరింపులు వచ్చాయా అనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. ఆగంతకుడిని గుర్తించడం కోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, అపరిచిత వ్యక్తుల సంచారంపై స్థానికులను ఆరా తీస్తున్నారు. -
తరిమి కొట్టి.. చెట్టుకు కట్టి..
సాక్షి, రాజానగరం(పశ్చిమ గోదావరి): భూవివాదంలో ఓ వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనతో రాజంపేటవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునికూడలికి చెందిన చిడిపి నాగభూషణానికి తన చిన్నాన్న చిడిపి నాగయ్యతో తొమ్మిది సెంట్ల భూవివాదం కొంతకాలంగా నడుస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు తన చిన్నాన్న కుమారుడు చిడిపి నాగేశ్వరావు(స్టాలిన్) మునికూడలి పంచాయతీ పరిధిలోని రాజంపేటలో ఉన్న భూమిని దున్నుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న స్టాలిన్, తన కుమారుడు తరుణ్లతోపాటుగా ఇనుగంటివారిపేటకు చెందిన నలుగురు యువకులు క్రికెట్ బ్యాట్లు, స్టంప్లతో నాగభూషణంపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు రాజంపేట గ్రామంలోకి పరుగులు తీశాడు. నీలవేణి అనే మహిళకు తన వద్ద ఉన్న బ్యాగ్ను ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పగా, అప్పటికే దాడి చేస్తున్న వారు చేరుకోవడంతో భయభ్రాంతులకు గురై ఆమె తిరిగి బ్యాగ్ను నాగభూషణానికి అందించింది. నాగభూషణం నుంచి బ్యాగ్ను తీసుకుని కొడుతూ ఈడ్చుకుని వెళ్లి పొలం వద్ద ఉన్న కొబ్బరి చెట్టుకు కట్టేశారు. విషయం తెలిసిన నాగభూషణం కుమారుడు రాజు 100కు కాల్ చేయడంతో స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, కానిస్టేబుల్ ప్రసాద్ వెళ్లి చెట్టుకు కట్టి ఉన్న నాగభూషణాన్ని విడిపించారు. బ్యాగ్లో పొలం దస్తావేజులు, రెండు బ్యాంక్ చెక్బుక్లతోపాటుగా పాస్బుక్లు, ప్రాజెక్ట్కు సంబంధించిన పత్రాలు, రూ.45 వేలు ఉన్నాయని భాదితుడు నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కోరుకొండ సీఐ పవన్కుమార్ రెడ్డి, ఎస్సై డి ఆనంద్ కుమార్ విచారించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆనంద్ కుమార్ తెలిపారు. -
అల్లుడిని చంపిన మామ
సాక్షి, పిఠాపురం రూరల్(తూర్పు గోదావరి): పిఠాపురం మండలం ఎల్ఎన్ పురంలో పిల్లనిచ్చిన మామే సొంత అల్లుడిని హతమార్చిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్ఎన్ పురానికి చెందిన మృతుడు యలమంచిలి రాజు (36)కు అదే గ్రామానికి చెందిన తప్పిట చంద్రరావు కుమార్తె గాయత్రితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి. కాకినాడలోని వెల్డింగ్ పనిచేసే రాజు కొన్నాళ్లుగా మద్యం సేవించి భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం తాగి బుధవారం రాత్రి తన అత్తగారి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన మామ చంద్రరావుపైనా దాడి చేయడంతో క్షణికావేశంలో మామ పక్కనే ఉన్న గునపంతో అల్లుడి తలపై బలంగా మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చైతన్యకుమార్, ఇన్చార్జి గోవిందరాజు పరిశీలించారు. మృతుడి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం
తమ కుమారుడు బాగా చదువుతున్నాడు. ఇంకా బాగా చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ఆ తల్లిదండ్రులు భావించారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఆ విద్యార్థి కూడా చదువులో రాణిస్తున్నాడు. ఐటీడీఏ ప్రోత్సాహంతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలోనూ అతడికి చోటు లభించింది. దీంతో రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చేరాడు. అయితే విధి వక్రించింది. అతడి ఆశలను చిదిమేస్తూ అనారోగ్యం, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడు మృతి చెందాడు. కన్నవారిని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ గిరిజన విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి మృతదేహంతో ఆ గ్రామ గిరిజనులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. మండలంలోని బి.రామన్నపాలెం గ్రామానికి చెందిన కంగల సాయిబాబాదొర(16) బుధవారం రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో మృతి చెందాడు. వారం రోజుల నుంచి విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి జోగిదొర పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏటా ఐటీడీఏ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన కార్పొరేట్ పాఠశాలకు ఐటీడీఏ ఏటా ఫీజులు చెల్లిస్తోంది. దీనిలో భాగంగానే సాయిబాబాదొర హోలీ ఎంజెల్సీలో పదో తరగతి చదువుతున్నాడు. ఐటీడీఏ ఎదుట ఆందోళన హోలీ ఏంజెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి ఐటీడీఏ ఎదుట విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేశారు. వారం రోజుల నుంచి విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని, కనీసం ఇంటికి ఫోన్ చేసుకునేందుకు కూడా ఫోన్ ఇవ్వలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యం చేయించి ఉంటే విద్యార్థి మృతి చెందేవాడు కాదని గ్రామస్తులు వాపోయారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని మృతదేహంతో బైఠాయించారు. దీంతో ఐటీడీఏ ఏపీఓ నాయుడు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహం తరలింపు రాజమహేంద్రవరం క్రైం: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలన గిరిజన విద్యార్థి మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. మరోవైపు పాఠశాల యాజమాన్యం చర్యలు కూడా ఆ ఆరోపణలు వాస్తవమన్నట్టుగానే వ్యవహరించారు. బాలుడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా తమ వద్ద ఉన్న మాత్రలు వేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నేపథ్యంలో సాయిబాబు దొర పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మంగళవారం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బాలుడు స్వగ్రామం తరలించారు. పాఠశాలపై అనేక ఆరోపణలు గతంలో హోలీ ఏంజల్స్ పాఠశాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. మూడేళ్ల క్రితం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉన్న సమయంలో గిరిజన విద్యార్థులపై దాడులకు పాల్పడడం, వారిని కొట్టడం, మంచి భోజనం పెట్టకుండా హింసించడం, వంటివి చేయడంతో అప్పట్లో పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పటి సబ్ కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపారు. అప్పటి ప్రభుత్వం పాఠశాల యాజమాన్యంపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, పాఠశాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాఠశాల యాజమాన్యం మరలా పాత ధోరణి అవలంభించడం, విద్యార్థులకు సరైన వసతి భోజనం పెట్టకపోవడంతో వారు పౌష్టికాహార లోపంతో ఉంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ పాఠశాల పై దృష్టి సారించి, విద్యార్థులను విచారణ చేసి పాఠశాలలో ఏవిధంగా జరుగుతున్నది సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పర్యవేక్షణ కరువు ఐటీడీఏ జిల్లాలోని ఏడు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఏటా ప్రవేశం కల్పిస్తోంది. ఏటా మూడు, ఐదు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. వీరు పదో తరగతి పూర్తయిన తరువాత బయటకు వస్తారు. ఇదే తరహాలో హోలీ ఎంజెల్స్ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ రెండేళ్ల క్రితం గిరిజన విద్యార్థులు తమకు ఆహారం సరిగా పెట్టడం లేదని ఆరోపిస్తూ ఐటీడీఏ పీవోను కలిసి ఆందోళన చేశారు. గిరిజన సంక్షేమ విద్యా విభాగం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తరువాత వారి బాగోగులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ విద్యార్థులు ఏం తింటున్నారో, ఎలా చదువుతున్నారో, అసలు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది? అనేది తెలుసుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం పరిపాటిగా మారింది. -
ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా..
ఆ యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. డబ్బు సులభంగా సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డారు. చైన్ స్నాచింగ్లు మొదలుపెట్టారు. ఒంటరిగా వెళుతున్న వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఆ చోరుల వివరాలను మంగళవారం రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ వై.వి.రమణకుమార్, తూర్పు మండలం డీఎస్పీ వి.వి.రమణ కుమార్ వెల్లడించారు. రెండున్నర నెలలుగా రాజా నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో చైన్ స్నాచింగ్స్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన కాకరబాల సుబ్రహ్మణ్యం(అలియాస్ బాబి) రావి వెంకటేష్ (వెంకీ), జక్కంపూడి వెంకటేష్ , ధవళేశ్వరం గ్రామానికి చెందిన సాంబారి క్రాంతి కుమార్లు స్నేహితులు. వీరు ఆటో డ్రైవర్గా, లారీ డ్రైవర్గా, కూలిపనులు చేసుకుని జీవిస్తుంటారు. వ్యసనాలకు బానిసలైన ఈ యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం చైన్ స్నాచింగ్లకు దిగారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలే లక్ష్యంగా వీరు చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు. కాకరాల బాల సుబ్రమ్మణ్యం, మరో యువకుడు మోటారు సైకిల్పై మహిళలను వెంబడించి, నిర్జీవ ప్రదేశంలో వారి మెడలోని బంగారు గొలుసులను తెంచుకుని పారిపోయేవారు. వాటిని మల్లయ్య పేటకు చెందిన(రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో బంగారు నగలు తయారీ చేసే వ్యక్తి) పాలతీర్ధపు మహేష్ అనే వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారని పోలీసులు తెలిపారు. పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చోరీలు నిందితులు ప్రతి చోరీ పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చేస్తుండేవారని అడిషనల్ ఎస్పీ వివరించారు. నిందితులు తొలిసారిగా ఈ ఏడాది మే 3న కొంతమూరులో చైన్ స్నాచింగ్ చేశారని తెలిపారు. అనంతరం మే 29న కొంతమూరు గ్రామంలో, జూన్ 6న మరో చైన్ స్నానింగ్ చేశారని తెలిపారు. జూన్ 24వ తేదీన మరో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఒకే ప్రాంతంలో చోరీలు చేస్తుండడంతో పోలీసుల నిఘా పెంచారు. దీంతో వారు చోరీ చేసే ప్రాంతాన్ని మార్చుకున్నారని తెలిపారు. ఐదో సారి జూలై నాలుగో తేదీన బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్లో చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారని తెలిపారు ఈనెల 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొంతమూరు అవుట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటారు సైకిల్పై కాకర బాలసుబ్రహ్మణ్యం, రావి వెంకటేష్ పోలీసుల ను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా చైన్ స్నాచింగ్ చేస్తున్న మిగిలిన వారి పేర్లు జక్కంపూడి వెంకటేష్, సాంబారీ క్రాంతి కుమార్ పేర్లు వెల్లడించారని తెలిపారు. వీరితో పాటు చోరీ చేసిన నగలు కొనుగోలు చేసిన పాలతీర్ధపు మహేష్ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అన్నారు. అలాగే చోరీలు చేయడానికి ఉపయోగించే రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో క్రైం పార్టీ పోలీస్ కానిస్టేబుళ్లు కె.సురేష్, డి.విజయ కుమార్, స్టేషన్ క్రైం పోలీసు కానిస్టేబుళ్లు బీఎన్ఎస్ ప్రసాద్, కె. కళ్యాణరావు, ఎం.ప్రసాద్ సహకరించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు ఎం.వి.సుభాష్, నాగబాబు పాల్గొన్నారు. -
టోల్గేట్ బిల్లింగ్ బూత్ను ఢీకొన్న లారీ
సాక్షి, కిర్లంపూడి (తూర్పుగోదావరి) : జేసీబీలను తరలిస్తున్న ఓ లారీ కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బిల్లింగ్ బూత్ను ఢీకొనడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒకరు మరణించారు. దాంతో మృతుని బంధువులు ధర్నా, రాస్తారోకో చేపట్టగా నాలుగు గంటలసేపు ట్రాఫిక్ స్తంభించింది. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన ఉండ్రు రాజు (25) రెండేళ్లుగా కృష్ణవరం టోల్గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాజు ఆదివారం ఉదయం యథావిధి గా విధులు నిర్వహిస్తుండగా రాజమహేంద్రవరం నుంచి వైజాగ్ వైపు రెండు జేసీబీలను తరలిస్తున్న లారీ బిల్లింగ్ బూత్ను ఢీకొట్టింది. దాంతో బిల్లింగ్ బూత్ శ్లాబ్ కూలి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టోల్గేట్ సిబ్బంది రాజును ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనలో టోల్గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు, మాలమహానాడు, మాదిగ దండోరా నాయకులు, టోల్ సిబ్బంది టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆందోళన కొనసాగడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ ఏబీజీ తిలక్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. రాజు మృతికి టోల్గేట్ యాజమాన్యం కారణమని, ఆ యాజమాన్యమే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. టోల్గేట్ యాజమాన్యం నష్టపరిహారంగా రూ. లక్ష చెల్లించేందుకు ముందుకు వచ్చింది. రెండు రోజుల టోల్ఫీజు ఇవ్వాలని వారు పట్టుబట్టారు. పోలీసుల చొరవతో ఎట్టకేలకు టోల్గేట్ యాజమాన్యం రూ. 6 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో దళిత నాయకులు దానం లాజర్బాబు, కాపారపు రాజేంద్ర, శివ, అధిక సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు. పెద్దాపురం సీఐ జి.శ్రీనివాస్, కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, ఏలేశ్వరం ఎస్సైలు జి.అప్పలరాజు, టి.రామకృష్ణ, తిరుపతిరావు, సుధాకర్, పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై జి.అప్పలరాజు కేసు నమోదు చేశారు. వివాహమైన రెండు నెలలకే.. రాజుకు రెండు నెలల క్రితమే వివాహం అయ్యింది. రాజు మరణవార్త తెలుసుకున్నఅతని భార్య పావని, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తోటి సిబ్బంది సైతం రాజు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
వీడిన నవ వరుడి హత్యకేసు మిస్టరీ
-
హత్య పథకం నవ వధువుదే
తూర్పుగోదావరి, కరప (కాకినాడరూరల్): వైవాహిక జీవితం ఆనందంగా గడపాల్సిన ఆ యువజంటలో నవ వరుడు మరణించగా నవ వధువు జైలుపాలైంది. నవ వధువు తన ప్రియుడితో కలసి హత్యకు పథకరచన చేసి ఈ హత్య చేయించినట్టు తేలింది. కరప మండలం పెనుగుదురువద్ద ఈనెల 22వ తేదీన ఒకయువకుడు (నవవరుడు) దారుణహత్యలోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహమైన వారం రోజుల్లోనే నవవరుడు హత్యకు గురికావడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఆధ్వర్యంలో కరప ఎస్సై జి.అప్పలరాజు, పోలీసుసిబ్బంది వారంరోజుల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్టు చేసి కాకినాడ కోర్టులో హాజరుపరచగా రెండువారాలు రిమాండ్ విధించారు. కరప పోలీసుస్టేషన్లో గురువారం కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం కరప గ్రామంలోని నీలయ్యతోటవీధికి చెందిన పేకేటి రాముడు కుమారుడు సూర్యనారాయణ (27) కరపమండలం పెనుగుదురు–పాతర్లగడ్డ రోడ్డులో పంటపొలాల్లో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై నరకడంతో అతను మృతి చెందాడు. మృతుని సోదరుడు సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదేరోజు హత్యకేసుగా నమోదుచేశారు. మృతుడు పేకేటి సూర్యనారాయణకు కరప శివారు పేపకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మితో ఈనెల 15వ తేదీన వివాహమైంది. నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా అక్రమసంబంధం ఉంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టంలేక నాగలక్ష్మి తన ప్రియుడు రాధాకృష్ణతో కలసి హత్యకు పథక రచన చేసింది. అందులో భాగంగా ముద్దాయి రాధాకృష్ణ ఈనెల 21వ తేదీన సూర్యనారాయణకు ఫోన్ చేసి, సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడనుంచి పక్కనే గల పాతర్లగడ్డరూటులోగల పంటపొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ కూర్చుండపెట్టి తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నరికి చంపేశాడు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నేరస్తుడు పట్టుబడింది ఇలా: స్థానికుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. నవవరుడు సూర్యనారాయణ భార్యతో బయటకు వెళ్లివస్తానని చెప్పి వచ్చాడు. మృతుని భార్య నాగలక్ష్మి, ఆమెప్రియుడు రాధాకృష్ణ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం రాధాకృష్ణ పెనుగుదురు వద్ద నుంచి ఫోన్ చేసి సూర్యనారాయణను రప్పించాడు. కత్తితో నరికి చంపేసి, మృతదేహంపై గడ్డికప్పి, కత్తిని కేఎంజే కాలువలో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి సోదరులు, బంధువులు ఆ రాత్రి ఎంతగా గాలించినా సూర్యనారాయణ జాడ తెలియలేదు. దాంతో వారు పోలీసుస్టేషన్లో సూర్యనారాయణ అదృశ్యంపై ఫిర్యాదుచేశారు. రాధాకృష్ణ పేపకాయలపాలెంలోని నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెళ్లికొడుకు మోటార్సైకిల్ పెనుగుదురు సమీపంలోని పొలాల్లో కనిపించిందని చెప్పాడు. నాగలక్ష్మి, సూర్యనారాయణ బంధువులతోపాటు వెదకటానికి రాధాకృష్ణ కూడా ఏమీతెలియనట్టు వెళ్లాడు. మోటార్సైకిల్వద్దకు అందరితోపాటు వెళ్లి కొంతసేపటికి దూరంగా మృతుడి చెయ్యి కనిపిస్తోంది అదిగో అంటూ చూపించడంతో అందరూ అక్కడకు వెళ్లారు. అక్కడ సూర్యనారాయణ మృదేహం కనిపించింది. మృతుని బంధువులు మృతదేహం కనిపించినట్టు కరప ఎస్సై జి.అప్పలరాజుకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చినా ఆధారాలు దొరకలేదు. కాకినాడరూరల్ సీఐ ఈశ్వరుడు, పోలీసుసిబ్బంది తమదైన శైలిలో మృతదేహం ఉన్నట్టు ఎవరు చెప్పారంటూ క్లూ లాగడంతో ఒకటొకటిగా వాస్తవాలు వెలుగుచూశాయి. -
వివాహమైన వారానికే.. దారుణహత్య
అతడు ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్.. ఏ విధమైన చెడు అలవాట్లు లేవు. కాలేజీ లేకపోతే పొలం పనులు చేసుకోవడం, పశువులను చూసుకోవడం తప్ప వేరే ధ్యాస కూడా ఉండదు. వారం రోజుల క్రితమే అతడికి వివాహమైంది. ఆ నవవరుడు హత్యకు గురయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ ఓ పొలం గట్టు వద్ద శవమై కనిపించాడు. కరప మండలం పెనుగుదురు వద్ద మంగళవారం రాత్రి ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కరప గ్రామానికి చెందిన పేకేటి సూర్యనారాయణ హత్య ఆ గ్రామంలో కలకలం రేపింది. మంగళవాయిద్యాలు మోగిన నవవరుడు, వధువు గృహాలు బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ఎటువంటి చెడు అలవాట్లు లేని వ్యక్తి ఇలా హత్యకు గురయ్యాడంటే నమ్మలేకపోతున్నామని ఆ గ్రామస్తులు అంటున్నారు. కరప (కాకినాడరూరల్): కరప గ్రామానికి చెందిన పేకేటి రాముడుకు నలుగురు కుమారులు. ఆఖరి వాడైన సూర్యనారాయణ(30) మండపేట శ్రీవికాస కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 15న కరప శివారు పేపకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు అనే బాషా కుమార్తె నాగలక్ష్మితో అతడికి వివాహమైంది. మంగళవారం సాయంత్రం సూర్యనారాయణ తమ ఇంటి వద్ద పశువులకు నీరుపెట్టి, గడ్డివేశాడు. ఇంటి వద్ద చెప్పి అత్తారింటికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయల్దేరి పేపకాయలపాలెం వెళ్లాడు. అక్కడ 5.30 గంటల వరకు ఉండి, ఐదుగురు స్నేహితులు పార్టీ ఇమ్మంటున్నారు, భోజనం టైంకు వచ్చేస్తానని భార్య నాగలక్ష్మితో చెప్పి, మోటారు సైకిల్పై వచ్చేశాడు. రాత్రి 7.30 గంటలకు కూడా రాకపోయేసరికి భార్య ఫోన్ చేస్తే అరగంటలో వస్తానని చెప్పాడు. రాత్రి తొమ్మిది గంటలకు కూడా రాకపోయే సరికి ఫోన్ చేస్తే సూర్యనారాయణ సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన సూర్యనారాయణ మామ బాషా కరప ఫోన్ చేసి విషయం చెప్పాడు. రాత్రి నుంచి సూర్యనారాయణ సోదరులు, బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించి, స్నేహితులకు ఫోన్ చేసినా తెలియదని సమాధానం వచ్చింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో కరప నుంచి పెనుగుదురు వైపు మోటార్సైకిల్పై వెళుతున్నట్టు చూశామని గ్రామస్తులు అంటున్నారు. బుధవారం ఉదయానికి కూడా రాకపోయేసరికి కరప పోలీసుస్టేషన్ కెళ్లి సూర్యనారాయణ అదృశ్యంపై ఫిర్యాదుచేశారు. పెనుగుదురు సమీపంలో.. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పెనుగుదురు సమీపంలో గొల్లపాలెం రోడ్డులోని లేఅవుట్ వద్ద మోటార్సైకిల్ ఉండడాన్ని గమనించి, అక్కడ పరిశీలించగా పొలంలో గట్టును ఆనుకుని గడ్డి కప్పి, సూర్యనారాయణ మృతదేహం కనిపించింది. వెంటనే కరప పోలీసులకు సమాచారం అందించారు. కరప ఎస్సై జి.అప్పలరాజు, రైటర్ ఎన్.వెంకటరమణ, గొల్లపాలెం, ఇంద్రపాలెం ఎస్సైలు, సిబ్బందితో కలిస ఘటనాస్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి, హత్య గురించి సీఐకు సమాచారం ఇచ్చారు. కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఘటనా స్థలానికి వచ్చి, జరిగిన హత్యపై ఆరాతీశారు. హత్యకు ఆధారాలు దొరుకుతాయేమోనని కాకినాడ నుంచి డాగ్స్క్వా డ్ను పిలిపించారు. డాగ్ పరిసర ప్రాంతాల్లో కొంతదూరం తిరిగినా ఆధారాలు ఏమీ దొరకలేదు. చేతికి ఉన్న బంగారు ఉంగరాలు, జేబులో మనీపర్స్ అలాగే ఉన్నాయి. మెడలో ఉండే బంగారు చైన్లు, చేతికి ఉండే బ్రేస్లెట్ కనిపించలేదు. బంగారం కోసం జరిగిన హత్య కాదని, దీని వెనుక బలమైన కారణమే ఉంటుందని, దర్యాప్తులో అన్నీ తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. పెనుగుదురు పొలాల్లో ఉన్న సూర్యనారాయణ మృతదేహాన్ని పరిశీలిస్తున్న కాకినాడ రూరల్ సీఐ ఈశ్వరుడు హత్య మిస్టరీని ఛేదిస్తాం కరప గ్రామానికి చెందిన పేకేటి సూర్యనారాయణ వివాహమైన వారానికే హత్య గురయ్యాడంటే విచారణ జరిపి, దీనివెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తామని కాకినాడ రూరల్ సీఐ ఈశ్వరుడు తెలిపారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హత్య జరిగి ఉండవచ్చన్నారు. తలపై గొడ్డలి, కత్తితో నరికి ఉండొచ్చన్నారు. లే అవుట్లో హత్య చేసి, మృతదేహాన్ని గట్టుపక్కన పడేసి, గడ్డికప్పి పోయారన్నారు. ప్రస్తుతానికి హత్యకు సంబంధించి ఆధారాలేమీ దొరకలేదన్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నేరస్తులను పట్టుకుంటామని సీఐ ఈశ్వరుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్య కేసు నమోదుచేశారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్
తూర్పుగోదావరి, ఆలమూరు (కొత్తపేట): ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్కు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన నాతి వెంకటేష్ (వెంకన్న) ఆలమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై టి.క్రాంతికుమార్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి కేసులకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఆలమూరుకు చెందిన వెంకన్న కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే నిందితుడు వెంకన్నపై భార్యపై హత్యాయత్నం కేసుతో పాటు మరో ఏడు కేసులు స్థానిక పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. అప్పటి నుంచి అతడి కోసం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఐడీ పార్టీ ప్రతినిధులు ఇళ్ల శ్రీనివాసు, సీహెచ్ యేసుకుమార్ తదితరులు గాలింపు చర్యలు చేపట్టారు. జొన్నాడ సెంటర్లో మంగళవారం సాయంకాలం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి గొలుసుల రూపంలో ఉన్న 190 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు వెంకన్నను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. పోలీసు శాఖలో కీలక అరెస్ట్లు ఆలమూరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు నెలల కాలంలో కీలకమైన ఆరుగురు దారి దోపిడీ దొంగలను, ఒక గొలుసు దొంగను అరెస్ట్ చేసినట్టు మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి తెలిపారు. మార్చి 31న దారి దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకోగా, బుధవారం చైన్ స్నాచర్ను అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు బాధితులకు అప్పగించనున్నామన్నారు. -
గుప్పు.. గుప్పుమంటూ..
తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: గంజాయి సాగు, రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది. జిల్లాలో 11 మండలాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏఓబీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వెళ్ల లేని ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి కూలీలను ఏర్పాటు చేసుకొని సాగు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ పండించిన గంజాయి 99 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో అన్ని విధాలుగా రైలు, రోడ్డు మార్గాలు ఉండడం వల్ల గంజాయి రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది. నిరాటంకంగా సాగుతూ.. జనసమర్థమైన ప్రదేశాలకు, జాతీయ రహదారులకు చేర్చేందుకు గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. 25 కేజీల మూటలు రెండింటిని జాతీయ రహదారికి చేర్చితే గిరిజనులకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు కిరాయి ఇస్తుంటారు. దీంతో రాత్రి సమయాల్లో గంజాయి రవాణా అటవీ ప్రాంతం గుండా నిరాటంకంగా సాగుతోంది. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం అయిన ఒడిశా, విశాఖ జిల్లాల నుంచి కూడా ఈ జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది. విస్తారమైన అటవీ ప్రాంతం ఉండడం వల్ల జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఆటవీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిరాటంకంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హైవే ప్రాంతం ఆనుకొని జిల్లా ఉండడంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోని తుని, జగ్గంపేట, రాజమహేంద్రవరం, అనపర్తి, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో నిల్వలు చేసి రవాణా చేస్తున్నారు. కేసులు.. అరెస్టులు.. గత మూడేళ్లలో గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ శాఖ అధికారులు 29 మందిని అరెస్ట్ చేసి 19 కేసులు నమోదు చేశారు. 1312.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 91823 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల జైలు శిక్షలు ప్రస్తుతం గంజాయి కేసులో పట్టుబడిన వారికి కోర్టులు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. దీని వల్ల గిరిజన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గంజాయి స్మగ్లింగ్ వల్ల కలిగే నష్టాలపై ఐటీడీఏ అధికారులు గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిరిజనులే బలి.. సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో రిమాండ్లో ఉన్న, శిక్ష పడిన ముద్దాయిలు దాదాపు 500 మందికి పైగా ఉన్నారంటే ఈ గంజాయి సాగు, రవాణాపై ఎంతమంది ఆధారపడ్డారో అర్ధం అవుతుంది. అక్షర జ్ఞానం లేని గిరిజనులు తమకు వచ్చే కొద్ది సొమ్ముల కోసం ఆశపడి ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నర్సరీ మొక్కలు, కాయగూరల మాటున స్మగ్లింగ్ తవుడు బస్తాలు, నర్సరీ మొక్కలు, కాయగూరలు, బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్నారు. టూరిస్ట్ బ్యాగ్లలో, రైల్వేలో ప్రయాణికుల మాదిరిగా గంజాయి తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఇతర ముఖ్య పట్నాల నుంచి హైటెక్ బస్సులు లగేజీల ద్వారా కూడా గంజాయి రవాణా చేస్తున్నారు. వీటితో పాటు లారీ ట్రాన్స్పోర్టులు ద్వారా జరుగుతోంది. జిల్లా నుంచి హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయలోపం.. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలంటే స్థానిక పోలీసులతో పాటు, ఎక్సైజ్, రెవెన్యూ, ఫారెస్ట్, సెంట్రల్ ఎక్సైజ్, ఎన్సీబీ(నార్కోట్సె కంట్రోల్ బోర్డు, సెంట్రల్ రెవెన్యూ ఇంటిలిజన్స్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అయితే వారి మధ్య సఖ్యత లేకపోవడం గంజాయి స్మగ్లర్లకు వరంగా మారింది. నిరంతరంనిఘా ఏర్పాటు గంజాయి రవాణా సాగుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది రాయవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సుమారు 192 కేజీల గంజాయిని స్వా«ధీనం చేసుకున్నాం. ఏడుగురు ముద్దాయిలలో ఆరుగురిని అరెస్ట్ చేశాం. ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాల్సి ఉంది.– కె.ఎస్.ఎన్. ప్రభు కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్. రాజమహేంద్రవరం -
దారికాసిన మృత్యువు
తూర్పుగోదావరి, రంపచోడవరం/నెల్లిపాక: నిరుద్యోగ భృతి అందుతుందని, తమకు కొంత ఆర్థిక చేయూత లభిస్తుందని ఆశపడిన ఆ యువతుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. రంపచడవరానికి ఏడు కిలోమీటర్లు దూరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎటపాక మండలం గౌరీదేవీపేటకు చెందిన తానికొండ ప్రవల్లిక (24), తోటపల్లి గ్రామానికి చెందిన సూదిపాక లావణ్య( 24), గన్నవరానికి చెందిన ములిశెట్టి ప్రశాంత్(26) మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన యువతులు యువనేస్తం పథకంలో భాగంగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి సర్టిఫికెట్స్ పరిశీలన కోసం బుధవారం ఉదయం గన్నవరం నుంచి ఆరు గంటలకు ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. వీరితో పాటు గన్నవరానికి చెందిన గంజి వీరబాబు, తోటపల్లి గ్రామానికి చెందిన జి రమేష్ కూడా ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. రంపచోడవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని సీతపల్లి గుడి సమీపంలో మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవళిక, లావణ్య, ప్రశాంత్లను ప్రైవేట్ వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే సరికే ప్రవళిక, లావణ్యలు మృతి చెందారు. ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మలుపు వద్ద పొంచి ఉన్న మృత్యువు సీతపల్లి పాత రోడ్డు, కొత్త రోడ్డు కలిసే జంక్షన్ వద్ద మృత్యువు పొంచి ఉంది. మంగళవారం రెండు వాహనాలు ఢీకొనడంతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా బయట పడ్డారు. అయితే బుధవారం జరిగిన ప్రమాదంతో ఇదే మలుపులో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గోకవరం నుంచి ఇసుక లోడ్తో వస్తున్న లారీ సీతపల్లి గుడి సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వెనుక భాగాన్ని ఢీకొనడంతో వెనుక సీటులో ఉన్న ముగ్గురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు రమేష్, వీరబాబులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామాల్లో విషాదఛాయలు ఎటపాక మండలంలోని మూడు గ్రామాలకు చెందిన యువతులు, యువకుడు మృతి చెందడంతో ఆ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిరుద్యోగ భృతి కోసం వెళుతూ మృత్యువాత పడడంతో వారు తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రశాంత్ ఆటో నడుపుతూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడని తలచుకుని రోదిస్తున్నారు. మృతి చెందిన వారిని ప్రభుత్వపరంగా అదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ కోరారు. అలాగే రంపచోడవరం ఏరియా మార్చురీలో ఉన్న యువతుల మృతదేహాలను భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన ప్రజలు ఆ పాఠశాలకు చేరుకుని, కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన నిర్వహించారు. కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురం ఎంపీపీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు తాటికొండ గణేశ్వరరావు ఆరో తరగతి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ, ఆ బాలిక తల్లిదండ్రులతోపాటు పలువురు గ్రామస్తులు ఆందోళన చేశారు. పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. నిందితుడైన ఉపాధ్యాయుడు పరారవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుడు అడపా సత్యనారాయణను పాఠశాలలో నిర్బంధించారు. గతంలో రెండుమూడుసార్లు ఇటువంటి సంఘటనలు జరిగినా ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రధానోపాధ్యాయుడిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ టి.జోసెఫ్, ఎస్సై జి.నరేష్లు ఎస్.తిమ్మాపురం పాఠశాలకు చేరుకుని విషయాన్ని ఆరా తీశారు. బాధిత బాలిక నుంచి, ఆమె తల్లిదండ్రుల నుంచి ఎంఈఓ రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. కీచక ఉపాధ్యాయునిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారికి సిఫారసు చేయనున్నామని తెలిపారు. ఆందోళనలో గ్రామస్తులు గొల్లపల్లి చక్రధర్, బొజ్జపు శ్రీను, ఎం.బాబ్జీ, విద్యాకమిటీ చైర్మన్ గొల్లపల్లి ప్రసాద్, గొల్లపల్లి సత్యనారాయణ, సోము నారాయణరావు, దాసు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాబేజీల మధ్యలో గంజాయి రవాణా
తూర్పుగోదావరి, రాజానగరం: పదమారో నంబరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిపోతున్న రూ.10.25 లక్షల విలువైన 205 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. సీఐ సురేష్బాబు, ఎస్సై జగన్మోహన్ల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి ముంబైకి ఐషర్ వ్యాన్లో క్యాబేజీ బస్తాలు రవాణా చేస్తున్నారు. వాటి మధ్య గంజాయి ఉంచి, పైకి క్యాబేజీ బస్తాలుగా చూపిస్తూ తరలిస్తున్నారు. రాజానగరం సమీపాన కలవచర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో దీనిని పట్టుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన దేవదాసు లడ్డూ, దిలీప్సింగ్ పరదేశి, బేల్ధార్, అంబుదాస్ కచ్చిరు, సురేష్ కచ్చిరు, అనాబక్రీ, ఏక్నాథ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు, 9 సెల్ఫోన్లు, కారు, క్యాబేజీల్లో గంజాయితో ఉన్న ఐషర్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పగలు పనులకు.. రాత్రిళ్లు చోరీలకు..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అతడు పగలు వడ్రంగి పనుల కోసం ఇళ్లకు వస్తాడు. పని చేస్తూనే ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో గమనిస్తాడు. తలుపులను ఎలా తొలగించవచ్చు? ఏ తలుపులు సునాయాసంగా వస్తాయి? ఇలా ఇంటిని నిశితంగా పరిశీలించి అదును దొరికినప్పుడు ఆ ఇంట్లో చోరీకి పథక రచన చేయడంలో అతడు సిద్ధహస్తుడు. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కుక్కుల శ్రీనివాసరావు వడ్రంగి పని చేస్తూనే అక్రమార్జన కోసం చోరీల బాట పట్టాడు. అంబాజీపేట, అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్లలో ఆరు చోరీలకు పాల్పడ్డాడు. 2017–18లో అంబాజీపేట మండలం కోఠివారి అగ్రహారం, నందంపూడి, వ్యాఘ్రేశ్వరం, కె.పెదపూడి, అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం ప్రాంతాల్లో ఈ చోరీలు చేయడంతో ఆయా మండలాల ఎస్సైలు కేవీ నాగార్జున, జి.గజేంద్రకుమార్ తమ సిబ్బందితో అతడిపై గట్టి నిఘా పెట్టారు. అమలాపురం రూరల్ సీఐ సురేష్బాబు ఆధ్వర్యంలో అంబాజీపేట ఎస్సై నాగార్జున చోరీలకు పాల్పడిన శ్రీనివాసరావును అంబాజీపేట గ్యాస్ కంపెనీ సమీపంలో గురువారం ఉదయం మాటు వేసి పట్టుకున్నారు. క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ లంకాడి శ్రీనివాసరావు కూడా కుక్కల శ్రీనివాసరావును పట్టుకోవడంలో చొరవ చూపారు. అరెస్ట్ చేసిన శ్రీనివాసరావు వద్ద నుంచి రూ. 5.63 లక్షల విలువైన 81 గ్రాముల బంగారు నగలు, ఎనిమిది కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన శ్రీనివాసరావును అమలాపురం రూరల్ సీఐ సురేష్బాబు రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో గురువారం ఉదయం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. అలాగే అతడు చోరీ చేసిన బంగారు నగలు, వెండి వస్తువులను కూడా ప్రదర్శించారు. శ్రీనివాసరావు తొలుత ఇళ్లలోకి వడ్రంగి మేస్త్రిగా పనికి వచ్చి చోరీలకు అనువైన ఇళ్లను ఎంచుకుని పనిచేస్తున్న సమయంలో తాను చేయబోయే చోరీలకు ప్లాన్ చేసుకుంటాడని సీఐ సురేష్బాబు తెలిపారు. ఇంతటి సొత్తును రికవరీ చేసిన ఎస్సైలు నాగార్జున, గజేంద్రకుమార్, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాసరావులను సీఐ సురేష్బాబు ప్రత్యేకంగా అభినందించారు. -
ఏమయ్యారో..!
తూర్పుగోదావరి, కొత్తపల్లి: ముస్లింల ఆరాధ్య దైవంగా కొలిచే బషీర్ బీబీ(బంగారుపాప) ఉరుసు 64వ ఉత్సవాల్లో ఇద్దరు బాలురు అద్యశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ ఉత్సవాల్లో ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదని స్థానిక ముజావర్లు అంటున్నారు. ఉత్సవాలు ముగిసిన తరువాత ఆలయానికి వచ్చిన భక్తులు ఇంటికి బయలు దేరేసమయంలో వారిరువురు అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం పొన్నాడలో వేంచేసిన బషీర్బీబీ ఉరుసు ఉత్సవాలు ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగాయి. గుంటూరు జిల్లా పట్నారిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన షేక్ అజీజ్ తన కుటుంబ సభ్యులతో పాటు కుమారుడు షేక్ మహబూబ్ సుభానీ(4), ఇదే జిల్లా పొన్నూరు రోడ్డుకు చెందిన కరీముల్లా కుటుంబసభ్యులతో పాటు తన కుమారుడు సయ్యద్ అబ్దులా(5)తో కలిసి ఉరుసు ఉత్సవాలకు 16న పొన్నాడ చేరుకున్నాడు. రెండు రోజుల పాటు ఉత్సవాలు పాల్గొన్నారు. సోమవారం ఉదయం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకు ఆలయ సమీపంలో ఆడుకున్న షేక్ మహబూబ్ సుభానీ, సయ్యద్ అబ్దుల్లాలు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు విచారణ ప్రారంభించారు. కాకినాడ డీఎస్పీ రవివర్మ, పిఠాపురం ఇన్చార్జి సీఐ ఈశ్వరుడు, ఎస్సై కృష్ణమాచార్యులు పొన్నాడ చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరు బాలురు కిడ్నాప్కు గురయ్యారా? లేక తప్పిపోయారా? అనే కోణాల్లో దర్యప్తు చేస్తున్నారు. ఆలయ సమీపంలో ప్రత్యేక బలగాలతో గాలింపు చేపట్టారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీపీ ఫుటేజీని సేకరించారు. పిఠాపురం, కా>కినాడ రైల్వే, బస్ స్టేషన్లలో ఆచూకీ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ తెలిసిన వారు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సెల్ : 9440900752కి సమాచారం తెలియజేయాల్సిందిగా కోరారు. చిన్నారులవివరాలిలా.. షేక్ మహబూబ్ సుభానీ వయస్సు నాలుగేళ్లు. ఎత్తు మూడడుగులు, చామనఛాయ రంగు, జీన్ ఫ్యాంటు, పచ్చరంగు కలిగిన గళ్ల చొక్కా దుస్తులు ధరించాడు. సయ్యద్ అబ్దుల్లా వయస్సు ఐదు సంవత్సరాలు. ఎత్తు 3.5అడుగులు రంగు చామనఛాయ, తెలుపురంగు నిక్కరు, నలుపు రంగు చొక్కా దుస్తులు ధరించారు. తప్పిపోయిన ఇద్దరు పిల్లలు కూడా అన్నయ్య, చెల్లెలు కుమారులు. అబ్దుల్లా స్వగ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వెళుతున్నాడు. వారు అదృశ్యం కావడంతో ఆలయం వద్ద కుటుంబ సభ్యులు విషాదానికి గురయ్యారు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
రాజమహేంద్రవరం క్రైం: వృద్ధ దంపతులను చంపుతామని బెదిరించి వారి నుంచి బంగారు నగలు, నగదు చోరీ చేసిన కేసులో ముగ్గురి నిందితులను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ వైవీ రమణ కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కడియపు లంక గ్రామ శివారు, నేషనల్ హైవే రోడ్డు గంగుమళ్ల సత్యనారాయణ నర్సరీ ఎదురుగా ఉన్న శ్రీ సత్యభవానీ ఆంధ్ర భోజన హోటల్ నిర్వాహకులు వృద్ధ దంపతులైన పెనుమాక సత్యనారాయణమ్మ, ఆమె భర్త నాగేశ్వరరావుకు చెందిన ఇంట్లోకి ప్రవేశించి కత్తి చూపించి చంపుతామని బెదిరించి సత్యనారాయణమ్మ వద్ద ఉన్న బంగారు నగలు, రూ.49 వేల నగదు చోరీ చేశారని తెలిపారు. ఈ సంఘటన పై కడియం పోలీస్ స్టేషన్లో ఈ నెల 12వ తేదీన కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సూపరింటెండెంట్ షిమూషీ బాజ్పేయ్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ డీఎస్పీ సీహెచ్ విజయ భాస్కరరావు ఆధ్వర్యంలో కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు వారి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈనెల 15వ తేదీన కడియం ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకినాడ కెనాల్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కేశవరం వైపు నుంచి కడియం వైపునకు మోటారు సైకిల్ పై వస్తున్న ముగ్గురు నిందితులను తనిఖీలు చేయగా వారు పారిపోవడానికి ప్రయత్నించారని వివరించారు. కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది నిందితులైన యానాంకు చెందిన కాలే మాణిక్యాలరావు, పాలెపు సురేష్, గంగాబత్తుల దుర్గబాబు లను అరెస్ట్ చేశారన్నారు. ఈ ముగ్గురూ వ్యసనాలకు బానిసలై దేవాలయాల్లోని హుండీల్లో నగదు చోరీ చేస్తుంటారని వివరించారు. ఇప్పటి వరకు వీరిపై కేసులు లేవని తెలిపారు. నిందితుల నుంచి రెండున్నర కాసుల బంగారు గొలుసు, అరకాసు లక్ష్మీదేవి ఉన్న బంగారు ఉంగరం, అరకాసు బంగారు చెవి దిద్దులు, ఒక సెల్ ఫోన్, రూ.29 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. రెక్కీ నిర్వహించి చోరీ నిందితులు వారం రోజులు ముందుగా అదే హోటల్లో మద్యం సేవించి చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు అడిషనల్ ఎస్పీ వై.వి.రమణ కుమార్ తెలిపారు. వృద్ధ దంపతులు ఒక్కరే ఉండడంతో చోరీ చేయడం సులువని గ్రహించి నిందితులు ఈ నెల 11న దంపతులను కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు చోరీ చేసి పరారయ్యారని తెలిపారు. చోరీ అనంతరం కాకినాడ తదితర ప్రాంతాల్లో వీరు తిరిగారని వివరించారు. నాలుగు రోజుల్లోనే నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగలు, నగదు రికవరీ చేసిన పోలీస్ సిబ్బందికి అవార్డులకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ సీహెచ్ విజయ భాస్కరరావు, కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి పట్టివేత, నలుగురి అరెస్టు
తూర్పుగోదావరి, రామచంద్రపురం: వాహనాలను తనిఖీ చేస్తుండగా రామచంద్రపురం బైపాస్ రోడ్డు జంక్షన్లో పోలీసులకు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. రామచంద్రపురం ఎస్సై ఎస్.లక్ష్మి కథనం ప్రకారం..రామచంద్రపురం బైపాస్ రోడ్డులో సీఐ పి.శివగణేష్ నేతృత్వంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటోలో వెళుతూ అనుమాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా వారి వద్ద ఉన్న చీరల మూటల్లో గంజాయి కనిపించింది. విషయాన్ని ఆర్డీవో ఎన్.రాజశేఖర్కు సమాచారం అందించిన పోలీసులు ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ పి. చిన్నారావు, ఆర్ఐ కె.మహాలక్ష్మినాయుడు, వీఆర్వో పెంకే సత్యనారాయణ, ఇతర రెవెన్యూ సిబ్బంది సమక్షంలో వారి వద్ద నుంచి 48 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా రాజమండ్రికి చెందిన ఇద్దరు, చెన్నైకు చెందిన ఒక వ్యక్తి, రంగంపేటకు చెందిన ఒక వ్యక్తి మండపేట నుంచి కాకినాడ వైపునకు ఆటోలో గంజాయిని తీసుకు వెళుతున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
బెయిల్పై విడుదలైనా గంజాయి స్మగ్లింగ్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: గంజాయి కేసులో పట్టుబడి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్పై విడుదలైనప్పటికీ... తిరిగి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ముద్దాయి.. ఆత్మహత్యా యత్నానికి పాల్పడాడు. రాజమహేంద్రవరం అర్బన్ తూర్పు మండలం డీఎస్పీ యు.నాగరాజు కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నడింపల్లి సీతారామరాజు, నల్లజర్ల మండలం సింగరాజు పాలేనికి చెందిన నెక్కలపూడి రాంబాబు, నెల్లూరు జిల్లా లక్ష్మీ నర్సంహపురానికి చెందిన షేక్ ఆహ్మద్, తమిళనాడుకు చెందిన పి.సురేష్ ఆదివారం రాత్రి గంజాయిని తమిళనాడు, చెన్నైకు రవాణా చేస్తుండగా బొమ్మూరు పోలీసులకు చిక్కారు. నిందితులు పాడేరు నుంచి ఒక ఐషర్ వ్యాన్, కారులో 240 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో బొమ్మూరు పోలీసులు హుకుంపేట వద్ద తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో సోమవారం తెల్లవారుజామున వారిని విచారణ చేస్తుండగా ముద్దాయి సీతారామరాజు స్టేషన్ వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లాడు. అతడు బయటకు ఎంతకీ రాకపోవడంతో బాత్రూమ్ తలుపులు తీసే సరికి అక్కడ రేక తో గొంతు కోసుకొని రక్తం కారుతున్న ముద్దాయి కనిపించాడు. అతడికి వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. సీతారామరాజుతో పాటు మరో ఇద్దరు నిందితులు షేక్ ఆహ్మద్ భాష, నెక్కలపూడి రాంబాబులను రిమాండ్పై సెంట్రల్ జైలుకు తరలించారు. మరో నిందితుడు తమిళనాడుకు చెందిన సురేష్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. ముద్దాయి సీతారామరాజు హైకోర్టు ఇచ్చిన పెరోల్ కండిషన్తో బెయిల్పై ఉన్నాడని, మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు ఆయన తెలిపారు. జైలుకు వెళ్లినా మారని తీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ముద్దాయి సీతారామరాజు 2015లో అన్నవరం పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు. ఇతనికి అప్పట్లో రాజమహేంద్రవరం ఫస్ట్ అడిషినల్ సెషన్స్ కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష తోపాటు రూ.1.50 లక్షలు జరిమానా విధించింది. జైలులో సత్ప్రర్తనతో ఉన్నందున అతడు హైకోర్టు పెరోల్ కండీషన్తో 2017 జనవరి 12న బెయిల్పై విడుదలయ్యాడు. విడుదల తరువాత పాత నేరస్తులు నెక్కలపూడి రాంబాబుకు అతడు రూ.30 లక్షలు అప్పు పడ్డాడు. దీంతో రాంబాబు, ఇతడికి అప్పు తీర్చే మార్గం చెబుతానని చెప్పి ఈ నెల 11న అనకాపల్లి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి పాడేరు వెళ్లి అక్కడ వ్యాన్, కారులో 240 కేజీల గంజాయి బస్తాలు రవాణా చేస్తుండగా బొమ్మూరు పోలీసులకు పట్టుబడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ధవళేశ్వరం/రాజమహేంద్రవరం క్రైం: రోడ్డు ప్రమాదంలో యువతీయువకుడు మృతి చెందిన సంఘటన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ధవళేశ్వరం కాటన్పేట వద్ద ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పొట్టిలంక గ్రామానికి చెందిన ఆనం స్వరూప (18), నక్కిన వీరమల్లికార్జునరావు(20) మృతి చెందారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసుల కథనం ఇలా.. ఆనం స్వరూప రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఆమెకు బంధువైన నక్కిన వీరమల్లికార్జునరావుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేమగిరి వైపు వెళుతున్న భారీ కంటైనర్ లారీ ఢికొట్టింది. దీంతో స్వరూప, మల్లికార్జునరావు తలలపై నుంచి కంటైనర్ లారీ దూసుకుపోవడంతో వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. దక్షిణమండల ఇన్చార్జ్ డీఎస్పీ భరత్మాతాజీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరం సీఐ బాలశౌరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోపెడ్ను ఢీకొన్న లారీ
తూర్పుగోదావరి, పెద్దాపురం: మోపెడ్పై వెళుతున్న కుటుంబ సభ్యులను లారీ ఢీకొనడంతో 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా భార్య, భర్త, కుమారుడు, మనువడు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం పెద్దాపురం ఏడీబీ రోడ్డులో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసుల కథనమిలా.. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన కుంజా సత్తిబాబు, భార్య చిన్న, మూడో కుమార్తె జ్యోతి, కుమారుడు ఉదయ్కుమార్, మనువడు ప్రదీప్లతో కలిసి టీవీఎస్ మోపెడ్పై వారు నివాసముంటున్న కాకినాడకు బయల్దేరారు. పెద్దాపురం వాలుతిమ్మాపురం దాటే సరికి కాకినాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని లారీ డ్రైవర్ వాహనాన్ని వెనుకకు తిప్పాడు. దీంతో మోపెడ్ అదుపు తప్పి కిందకు పడగా కుమార్తె జ్యోతి(11) అక్కడిక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి పోçస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలం వద్ద తల్లి చిన్న, తండ్రి, తమ్ముడు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అది హత్యే..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: దీపావళికి జరిగిన చిన్న ఘర్షణతో ఓ యువకుడిని హత్య చేసి గోదావరిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులు పోలీసులకు చిక్కారు. తూర్పు మండలం డీఎస్పీ యు.నాగరాజు బుధవారం రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్లో త్రీటౌన్ సీఐ శేఖర్ బాబుతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. విశాఖ జిల్లా, గుమ్మలపాడు గ్రామానికి చెందిన పట్టిమ కిరణ్ బాబు (23) రాజమహేంద్రవరంలోని ఓ స్కూల్లో బస్సు డ్రైవర్గా పని చేస్తూ రాజమహేంద్రవరం లలితా నగర్లో ఉండేవాడు. దీపావళి సందర్భంగా కాల్చిన టపాసుల కారణంగా కిరణ్ బాబు కుటుంబ సభ్యులకు, లలితానగర్కు చెందిన ఆళ్ల సాయి(పొట్టి సాయి)కి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కక్షపెంచుకున్న ఆళ్ల సాయి, తన స్నేహితులు లలితానగర్కు చెందిన భోగా కార్తీక్, పిన్నింటి ఉదయ భాస్కర్, ఆదెమ్మ దిబ్బ ప్రాంతానికి చెందిన వారాది సాయి, మీసాల మహేష్, రామారావు(బాబి) అనే వారికి డిసెంబర్ 13వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాగా మద్యం పోయించాడు. కిరణ్ బాబును భయపెట్టాలని చెప్పి వాళ్లను లలితా నగర్లోని 2వ వీధి వేపచెట్టు వద్దకు తీసుకువచ్చారు. కిరణ్ బాబును వీరందరూ దారుణంగా కొట్టారు. గాయాల పాలైన కిరణ్ బాబు ‘మీ అంతు చూస్తాను’ అని చెప్పి వెళ్లిపోతుండగా గామన్ ఇండియా బ్రిడ్జి(నాల్గవ వంతెన) వద్ద పట్టుకొని మరలా కొట్టి పీక నొక్కి హత్య చేశారు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆరుగురు నిందితులు గామన్ ఇండియా బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి మృతదేహాన్ని పడవేశారు. తేల్చిన పోలీసులు, ముగ్గురు నిందితుsiల అరెస్ట్ కిరణ్ బాబు మృతితో కుటుంబం వీధిన పడింది. మృతుడు కిరణ్ బాబు నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్య గర్భిణి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుల వెనుక రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దొరికిందిలా.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులు మృతదేహాన్ని చీకట్లో గోదావరిలో పడవేశామనుకొని, ఒడ్డునే పడవేశారు. డిసెంబర్ 14న గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో త్రీటౌన్ సీఐ శేఖర్ బాబు, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మృతుడు పట్టిమ కిరణ్బాబుగా గుర్తించారు. పోస్టు మార్టం నివేదికలో మృతుడి శరీరంపై గాయాలు ఉండడం, కొన్ని ఎముకలు విరిగి ఉండడంతో పాటు గోదావరిలో పడి మృతి చెందితే ఊపిరితిత్తులు, శరీరం నిండా నీరు చేరుతోంది. మృతదేహంలో ఏవిధమైన నీరు లేకపోవడం, శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు భోగ కార్తిక్, పిన్నింటి ఉదయ భాస్కర్, వారాధి సాయిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురు మీసాల మహేష్, ఆళ్ల సాయి, రామారావులను అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. -
తాగిన మైకంలో దాడి
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: కాకినాడ నగరం రెండో డివిజన్లోని బొందగుంటలో ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో శుక్రవారం చేసిన దాడిలో ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గంటా పెద్దిరాజు (35) మరణించగా, కుండల ఆదినారాయణ, గంటా మహాలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. కుండల ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహాలక్ష్మికి తలపై గాయమైంది. వివరాలు ఇలా ఉన్నాయి... కాకినాడ రూరల్ మండలం వలసపాకల బొందగుంటకు చెందిన కుండల దుర్గాప్రసాద్, కుండల శ్రీనివాసరావు మద్యం మత్తులో వారి పెద్దనాన్న కుండల ఆదినారాయణ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టారు. తాగి గొడవ చేస్తారన్న భయంతో ఆదినారాయణ తన ఇంటి పక్కనే ఉంటున్న అల్లుడు గంటా పెద్దిరాజును పిలిచాడు. అల్లుడు వచ్చేలోపు తలుపు తీసుకొని బయటకు వచ్చిన కుండల ఆదినారాయణను తలపై ఇనుపరాడ్డుతో కొట్టారు. మామగారిపై దాడి చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన గంటా పెద్దిరాజును రాడ్లతో తలపై బలంగా కొట్టారు. అక్కడే ఉన్న పెద్దిరాజు తల్లి మహాలక్ష్మిపై కూడా దాడి చేశారు. దాడిలో పెద్దిరాజు తీవ్రంగా గాయపడగా కాకినాడ జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయిన కుండల ఆదినారాయణకు, గాయపడిన మహాలక్ష్మికి కాకినాడ జీజీహెచ్లో వైద్యం అందజేస్తున్నారు. ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అసలు తమ కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు లేవని, వీరు మద్యం తాగి వచ్చి ఎందుకు ఈ దాడులకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. దాడికి పాల్పడిన కుండల దుర్గాప్రసాద్, కుండల శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
తాళి కట్టాకే ఆత్మహత్య ?
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు: ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని, మృతి చెందారు. ఎవరూ లేని సమయంలో గదిలో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. లంపకలోవ గ్రామానికి చెందిన మాసా ఏసుబాబు, రాణి దంపతుల కుమార్తె నవ్య (17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం దూర ప్రాంతంలో ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. నవ్య తన నాయనమ్మ మాసా ముసలమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కింతాడ అంజిబాబు (21) పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అంజిబాబు, నవ్యలు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అంజిబాబు తల్లిదండ్రులు రాంబాబు, నూకాలమ్మలు అంజిబాబు, నవ్యలకు వివాహం చేయాలని నవ్య తల్లిదండ్రులను కోరారు. కానీ బంధువుల అబ్బాయితో తమ కుమార్తెకు వివాహం చేస్తామంటూ ఏసుబాబు, రాణిలు తిరస్కరించారు. పెద్దలు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో నవ్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి పాలడ్డారు. మాసా ముసలమ్మ ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగా నవ్య మృతదేహం కిందన, దూలానికి వేలాడుతూ అంజిబాబు ఉండడంతో కేకలు పెట్టింది. ఇరుగు పొరుగు ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎం అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని, విచారిస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం ప్రేమికుల ఆత్మహత్య రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇరుగు పొరుగుతో సఖ్యతతో ఉండే అంజిబాబు, నవ్యలు మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవ్య నాయనమ్మ ముసలమ్మను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పిల్లను చేతిలో పెట్టి బతుకు దెరువు కోసం దూరప్రాంతాని వెళ్లిన తన కొడుకు, కోడలికి ఏమి చెప్పాలంటూ బోరున విలపిస్తోంది. ఇక కింతాడ రాంబాబు, నూకాలమ్మ దంపతుల మూడో సంతానమైన అంజిబాబు ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు మృతిని వారు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం వరకు కళ్లముందు ఉన్న కొడుకు విగతజీవుడుగా మారడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాళి కట్టాకే ఆత్మహత్య ? మాసా నవ్య మెడలో పసుపుతాడు ఉండడంతో ఆత్మహత్యకు ముందే ఆ గదిలో వివాహం చేసుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది. వారిద్దరి వివాహానికి నవ్య తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు అనుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోగలిగామనే సంతృప్తితోనే ఆఖరి క్షణంలో వివాహం చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యల వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిందే. -
దొంగలు దొరికారు..
ప్రాంతమేదైనా పక్కా స్కెచ్తో వెళతారు. దొరికిన కాడికి దోచేస్తారు. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలోనే వీళ్లు చోరీలకు పాల్పడ్డారు. ఓ పక్క పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నా.. వీరి ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఒక్కొక్కరిపై 20 నుంచి 30కి పైగా కేసులున్నా.. వారు మాత్రం చోరీల బాటను వీడడం లేదు. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కారు. ఈ సారి రాజానగరం పోలీసులు వారిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సామగ్రిని స్వాధీనపరచుకున్నారు. తూర్పుగోదావరి, రాజానగరం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించుకుపోతున్న ఇద్దరు నేరగాళ్లకు, ఆ దొంగ సొత్తును కొనుగోలు చేస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్న వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి, కోర్డుకు హాజరు పరిచారు. నిందితుల నుంచి రూ.6.50 లక్షలు విలువజేసే 17 కాసుల బంగారు, 350 గ్రాముల వెండి నగలు, నాలుగు ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలు, ఒక గ్యాస్ సిలిండర్, సెల్ఫోన్, ఇన్వర్టర్, రెండు హోమ్ థియేటర్లతో పాటు రూ.పది వేల నగదును స్వాధీనపర్చుకున్నామని రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు సోమవారం తెలిపారు. రాజానగరం, కోరుకొండ పోలీసు స్టేషన్ల పరిధిలోని కోలమూరు, కొంతమూరు, మధురపూడిలోని గత ఆగస్టులో వరుసగా ఏడు గృహాల్లో జరిగిన చోరీలపై చేపట్టిన దర్యాప్తులో కొంతమూరులోని సంతోష్నగర్కి చెందిన మోర్త వెంకటేష్, కలమాటి మధుశ్రీనులతోపాటు రాజమహేంద్రవరం సీటీఆర్ఐ సమీపంలోని పనసచెట్టు సెంటర్కు చెందిన వాకాడ జనార్దనరావులను అరెస్టు చేశారు. గతంలోనూ వీరిపై కేసులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్కెట్ చేసుకుని దొంగతానాలు చేయడం వీరికి అలవాటు. మోర్త వెంకటేష్పై 38 కేసులు, కలమాటి మధుశ్రీనుపై 23 కేసులు, వారికి సహకరించిన వ్యాపారి వాకాడ జనార్దనరావుపై 23 కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి తిరిగి నేరాలు ప్రారంభించారు. చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం పోలీసులు నిందితులను ఆదివారం పట్టుకున్నారు. చోరీల్లో వారు చేజిక్కించుకున్న ఏటీఎం కార్డును రాజమహేంద్రవరంలోని ఒక వస్త్ర దుకాణంలో వినియోగించడం ద్వారా పట్టుబడ్డారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చురుకైన పాత్ర వహించిన రాజానగరం సీఐ సురేష్బాబు, కానిస్టేబుల్స్ ఎ.సుబ్రహ్మణ్యం, బీఎన్ఎస్ ప్రసాద్, కె. శ్రీధర్లను అభినందించడంతోపాటు రివార్డుకు సిఫారసు చేస్తానన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని డీఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాల్లే బాగా ఉపయోగించుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో సీఐ సురేష్బాబు పాల్గొన్నారు. -
‘తూర్పు’లో మూగజీవిపై లైంగికదాడి!
పిఠాపురం రూరల్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో గుర్తు తెలియని దుండగులు ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత రైతు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోకివాడ– బి.కొత్తూరు ప్రధాన రహదారి పక్కన గోకివాడకు చెందిన నామా బుచ్చిరాజుకు పశువుల మకాం ఉంది. శనివారం రాత్రి దుండగులు మకాంలో ఉన్న 3 నెలల చూడి ఆవును సమీపంలోని తాడిచెట్టుకు బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున రైతు బుచ్చిరాజు సమీపంలోని ఓ తాడిచెట్టు వద్ద కదల్లేని స్థితిలో పడి ఉన్న తన ఆవును గుర్తించాడు. తోటి రైతుల సాయంతో ఆవును బంధించిన తాళ్లను తొలగించాడు. ఆవు కదల్లేని స్థితిలో ఉండటం, దాని జననేంద్రియంపై రక్తపు గాయాలు కనిపించడంతో లైంగిక దాడి జరిగిందని రైతులు గుర్తించారు. దీంతో బుచ్చిరాజు కుమారుడు లక్ష్మీనారాయణ పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశువైద్య సిబ్బంది ఆవుకు వైద్య సేవలందిస్తున్నారు. సంఘటన స్థలంలో ఒక ఖాళీ మద్యం సీసా దొరికింది. దీన్ని బట్టి దుండగులు తాగిన మైకంలో ఈ అకృత్యానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. -
మెరుగు పెడతామంటూ మోసం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తక్కువ ధరలకే బంగారానికి మెరుగులు పెడతామంటూ మోసాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఆలమూరు మండలం బడుగు వాణిలంక గ్రామంలో ఓ మహిళ వద్ద నుంచి పుస్తెల తాడు అపహరించి పారిపోవడానికి ప్రయత్నించగా మహిళ గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన యువకులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసలు గుర్తించారు. -
నువ్వు లేని జీవితం వ్యర్థం
తమ్ముడి మరణాన్ని ఆ అన్నయ్య తట్టుకోలేకపోయాడు. ఎప్పుడూ తనతో పాటు కలిసిమెలిసి తిరిగే సోదరుడు ఇక లేడన్నవిషయాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి, మారేడుమిల్లి (రంపచోడవరం): అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఆవిరైపోతున్న ప్రస్తుత రోజుల్లో ఒకరి కోసం మరొకరు అన్నదమ్ములు మృతు ఒడికి చేరుకోవడం ఆ కుటుబంలో పెనువిషాదాన్ని నింపింది. నిన్నటి వరకు కళ్ల ముందు తిరిగిన తమ్ముడు సాయంత్రానికి ఒక్కసారిగా మృతువాత పడడంతో అతడి మరణాన్ని జీర్ణించుకోలేని అన్నయ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసరాగా ఉంటారనుకునే కొడుకులు ఒకరి తరువాత ఒకరు దూరమవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మారేడుమిల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది. స్థానిక అద్దరవీధికి చెందిన బత్తుల సుమన్(25) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవనంపై నుంచి జారి పడి మృతి చెందాడు. అతడి మరణాన్ని చూసి తట్టుకోలేని అన్నయ్య బత్తుల శాంసన్(30), తమ్ముడు మృతి చెందిన గంట వ్యవధిలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడాడు. ఇది గమనించిన బంధువులు, స్నేహితులు, హుటహుటిన స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి అంబులెన్స్లో కాకినాడ జీజీహెచ్కు తరలించగా సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుల తండ్రి గతంలో మరణించగా, వారికి అమ్మ, ఒక చెల్లెలు ఉంది. అన్నదమ్ములిద్దరూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నకొడుకు మృతి వార్త విన్న తల్లి మేరీ గుండె పగిలేలా రోదించింది. పెద్ద కొడుకు మరణం ఆమెను మరింత కుంగదీయడంతో ఆమె కుప్పకూలింది. తోబుట్టువులు ఇద్దరూ మరణించడంతో వారి చెల్లి రోదించిన తీరు స్థానికులతో కంటతడిపెట్టించింది. -
ఎయిర్పోర్టులో యువకుడి ఆత్మహత్య
తూర్పుగోదావరి, మధురపూడి (రాజానగరం): రాజమహేంద్రవరం విమానాశ్రయం సివిల్స్ విభాగంలో పని చేస్తున్న బండి రామకృష్ణ (25) చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కోరుకొండ మండలం గుమ్ములూరుకు చెందిన బండి రామకృష్ణ ఎయిర్పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజులుగా ఇంటికి వెళ్లకపోవడంతో అధికారులు, బంధువులు ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. వికలాంగుడైన రామకృష్ణ ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చనే అనుమానంతో అక్కడ పనిచేసే కార్మికులతో అధికారులు వెతికించారు. ఎయిర్పోర్టు కార్ పార్కింగ్ నూతన షెడ్ వెనుక వైపు ఉన్న చెట్ల పొదల్లో వేపచెట్టుకు ఉరివేసుకుని ఉన్న రామకృష్ణను మేకల శ్రీను తదితరులు గుర్తించారు. విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు ఎయిర్పోర్టు పోలీసులకు తెలిపారు. కోరుకొండ ఎస్సై శివాజీ సిబ్బందితోపాటు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఉద్యోగులు, బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితుల నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై శివాజీ తెలిపారు. మృతిపై పలు అనుమానాలు రామకృష్ణ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నగా ఉండే వేపచెట్టు కొమ్మకు అతడి మృతదేహం వేలాడుతుండడం చూసిన వారందరూ ఇది ఆత్మహత్య కాదని, హత్య అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఇంటి నుంచి ఎయిర్పోర్టుకు ఉద్యోగం నిమిత్తం వస్తున్న రామకృష్ణకు, అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి ఘర్షణ జరిగిందని, ఆ సంఘటనలో ఆ యువకుడు రామకృష్ణను కొట్టడంతో మనస్తాపానికి గురయ్యాడని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్టు ఎస్సై ఏసురత్నం, ఎయిర్పోర్టు అధికారులు, పోలీసులు ఉన్నారు. ఇలాంటి సంఘటనపై దిగ్భ్రాంతి బండి రామకృష్ణ మృతిపై ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజ్కిషోర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు ఆవరణలో జరిగిన మొదటి కేసు కావడం, రామకృష్ణ దివ్యాంగుడు కావడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
భార్య, కుమారుడితో సహా బ్యాంకు ఉద్యోగి అదృశ్యం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: తన సోదరుడు, అతడి భార్య, కుమారుడితో గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని తణుకుకు చెందిన కొల్లిమధుబాబు శుక్రవారం రాత్రి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం రోడ్డుకం రైలుబ్రిడ్జిపై సోదరుడి సెల్ఫోన్, మోటార్ బైక్ ఉన్నాయని కొవ్వూరు పోలీసుల ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్లోని తులీప్ అపార్టుమెంట్లో నివసిస్తున్న కెనరాబ్యాంకు ఉద్యోగి 42 ఏళ్ల కొల్లి ఆనందబాబు, అతడి భార్య 40 ఏళ్ల కొల్లి అరుణ, కుమారుడు, బీటెక్ చదువుతున్న చరణ్సాయిచంద్ను తీసుకుని గురువారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లారు. రాజమహేంద్రవరం రోడ్డుకం రైలుబ్రిడ్జిపై అర్ధరాత్రి ఆనందబాబు బైకు, సెల్ఫోన్, ముగ్గురి చెప్పులు ఉండడంతో అక్కడ చూసిన వారు 100కి కాల్ చేస్తే కొవ్వూరు పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. శుక్రవారం ఉదయం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఫోన్లో నంబర్ ఆధారంగా అతడి సోదరునికి పోలీసులు ఫోన్ చేసి చెప్పడంతో మధుబాబు సంఘటన స్థలంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడు ఆనందబాబుకు సుమారు రూ.ఏడులక్షల వరకు అప్పులు ఉండడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటాడని మధుబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు బొమ్మూరు సబ్ఇన్స్పెక్టర్ యూవీఎస్ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చదువుకు ఫుల్స్టాప్.. చోరీలు నాన్స్టాప్
ఆ యువకులు చెడువ్యసనాలకు బానిసయ్యారు. చదువుకు మధ్యలోనే ఫుల్స్టాప్ పెట్టి.. చోరీ బాట పట్టారు. ఇప్పటికే పలు స్టేషన్లలో వారిపై కేసులు ఉండగా.. తాజాగా మరోసారి పోలీసులకు పట్టుబడ్డారు. తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: రాత్రి సమయాల్లో కారు అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసి, వారి నుంచి 30 బ్యాటరీలు, ల్యాప్టాప్, కంప్యూటర్ మానిటర్, సీపీయూ కారు స్వాధీనం చేసుకున్నట్టు అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. వాటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని, చోరీ చేసిన రూ.15వేల నగదును ఖర్చు పెట్టేశారని డీఎస్పీ తెలిపారు. బుధవారం బొమ్మూరు పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన ఇలా వెల్లడించారు. రాజమహేంద్రవరం సుబ్బారావునగర్కు చెందిన తెలంశెట్టి సాయిభార్గవ్ అలియాస్ భార్గవ్, చౌడేశ్వరనగర్కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు, సంజయనగర్కు చెందిన గెద్దాడ సునీల్కుమార్ అలియాస్ సునీల్, సంజీవనగర్కు చెందిన ఘంటసాల చిరంజీవి రాజేష్కుమార్ అలియాస్ రాజేష్లు చెడువ్యసనాలకు బానిసై చదువులను మధ్యలోనే నిలిపివేశారు. రాత్రి సమయాల్లో కారును అద్దెకు తీసుకుని రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్ దగ్గరలోని వీఎస్ గ్రానైట్స్కు చెందిన ఆఫీసురూమ్ పగలగొట్టి అందులో రూ.15వేల నగదు, ల్యాప్టాప్, ఆ పక్కనే పార్కు చేసి ఉంచిన లారీ, కారు బ్యాటరీలు చోరీకి చేశారన్నారు. దీనిపై బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై యూవీఎస్ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారు దొంగిలించిన బ్యాటరీలను అమ్ముదామని లాలాచెరువు సంజయ్నగర్లో గెద్దాడ సునీల్ ఇంటి వద్ద అద్దెకు తీసుకున్న వెర్నా కారులో సర్దుతుండగా తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజుకు అందిన పక్కా సమాచారం మేరకు బుధవారం ఉదయం ఎస్సై నాగబాబు. తన సిబ్బందితో కలిసి నలుగురు నిందితులను అరెస్టుచేసి, కారుతో పాటు, వారు చోరీచేసిన 30బ్యాటరీలు(లారీలు,కారులు), ల్యాప్టాప్, కంప్యూటర్ మానిటర్, సీపీయూలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా వీఎస్గ్రానైట్స్తో పాటు, హోండా షోరూమ్ ఎదురుగా ఉన్న కారుషెడ్ తాళాలు పగలగొట్టి ఆరు కారుబ్యాటరీలు, దివాన్చెరువు శ్రీరామపురంరోడ్డులోని ఆగి ఉన్న లారీల ఆరు బ్యాటరీలు, బొమ్మూరు సుద్దగని వద్ద ఆగిఉన్న లారీల ఐదు బ్యాటరీలు, రాజమహేంద్రవరం జేఎన్రోడ్డులో రెండు బ్యాటరీలు, లాలాచెరువు శ్రీకృష్ణనగర్లో కంప్యూటర్, మోనిటర్, సీపీయూ, రెండుబ్యాటరీలు, సామర్లకోట పట్టణంలో ఏడుబ్యాటరీలో చోరీ చేసినట్టు తెలిపారన్నారు. నిందితుల్లో తెలంశెట్టి సాయిభార్గవ్ గతంలో బొమ్మూరు, ప్రకాష్నగర్, రాజానగరం పోలీస్స్టేషన్లలో బ్యాటరీల దొంగతనం కేసుల్లో, గెద్దాడ సునీల్కుమార్ తన స్నేహితులతో కలసి బలవంతగా డబ్బులు వసూలు చేసిన కేసు నమోదై ఉందన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబు, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు. -
పక్కా ప్లాన్తో..
అతడు అప్పులపాలయ్యాడు. వాటిని ఎలా తీర్చాలని భావించాడు. అతడి కన్ను పినతల్లి ఒంటిపై ఉన్న బంగారంపై పడింది. అంతే ప్లాన్ సిద్ధం చేశాడు. ఆమె ఇంటికి వెళ్లి పక్కాగా అమలు చేశాడు. పినతల్లిని హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని పరారయ్యాడు. ఈకేసును ప్రతిష్టాత్మంగా తీసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: వ్యసనాలకు బానిసై, అప్పుల పాలై వాటిని తీర్చేందు పిన తల్లిని హత్య చేసి నగలు చోరీ చేసిన నిందితుడిని అర్బన్ జిల్లా క్రైం, ప్రకాష్ నగర్ పోలీస్లు సంయుక్త ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్లో అడిషనల్ ఎస్పీ వై.వి.రమణ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, నారాయణపురం ఎఫ్సీఐ గోడౌన్స్ పక్క వీధి, సైక్లోన్ కాలనీలో నివసిస్తున్న దేవాదుల శ్యామల(60) నవంబర్ 14న అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలికి బావ కుమారుడైన ఇన్నీసుపేటకు చెందిన దేవాదుల నాగేశ్వరావు వృద్ధురాలిని హత్య చేశాడని తెలిపారు. అప్పులపాలైన అతడు తన పినతల్లి ఒంటరిగా నివశించడం, ఆమె ఒంటిపై బంగారు నగలు ఉండడంతో తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమెను హత్య చేసి నగలు చోరీ చేశాడని తెలిపారు. నిందితుడు ఇంటర్ వరకు చదువుకొని ప్రైవేటు ఉద్యోగాలు చేశాడని, ఐదేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో నష్టపోయాడని తెలిపారు. వ్యసనాలకు బానిసైన నాగేశ్వరరావు సుమారు రూ.ఆరు లక్షల వరకు అప్పులు చేశాడని తెలిపారు. అప్పుల వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఎలాగైనా వాటిని తీర్చాలనే దురాశతో తన పిన్ని శ్యామల ఇంటికి వెళ్లాడన్నారు. చాలా కాలం తరువాత వెళ్లడంతో మృతురాలు శ్యామల ఆదరించి లోపలికి ఆహ్వానించి మంచినీళ్లు ఇచ్చిందని, ఆ గ్లాసు ఇంట్లో పెట్టేందుకు వెళుతున్న సమయంలో వెనుక వైపు నుంచి వృద్ధురాలి మెడను నొక్కి ఊపిరాడకుండా చేసి చపాతీలు తయారు చేసే కర్తతో తల వెనుక భాగంలో కొట్టడంతో ఆమె మృతి చెందిందని తెలిపారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు 8, రాళ్ల బంగారు గాజులు రెండు, ఉంగరాలు మూడు, బంగారు నల్లపూసల దండ, ముత్యాలు, పగడాలు బంగారు గొలుసు, బంగారు సూత్రాలతో ఉన్న రెండు పేటల బంగారు నానుతాడు చోరీ చేశాడని తెలిపారు. చోరీ చేసిన 34 కాసుల బంగారు నగలు విలువ రూ.ఏడు లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిన్న కుమారుడు, కోడలు పక్కపోర్షన్లో ఉండగానే.. మృతురాలి చిన్న కుమారుడు, కోడలు పక్క పోర్షన్లో టీవీ చూస్తుండగా నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి పథకం ప్రకారం ఆమె తలపై కర్రతో కొట్టి పీకనులిమి హత్య చేసి బంగారు నగలతో పరారయ్యాడని తెలిపారు. ఈ కేసులో ఏవిధమైన ఆధారాలు లేకపోయినా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ డాక్టర్ షీమూషీ బాజ్పే, అడిషనల్ ఎస్పీ క్రైం వైవీ రమణ కుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ క్రైం త్రినాథరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి 15 రోజుల్లో కేసును ఛేదించారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు అధికారి పి. మురళీ కృష్ణారెడ్డి, త్రీటౌన్ క్రైం సీఐ వరప్రసాద్, సిబ్బంది హెచ్సీలు భద్రరావు, పెద్దిరాజు, కేవీవీ సత్యనారాయణ, పీసీలు మణికంఠ, బూరయ్య, శ్రీనివాస్, బషీర్, ఆలీ సహకరించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ తదితరలు పాల్గొన్నారు. నింది తుడిని రిమాండ్కు తరలించారు. -
'సెల్'రేగిపోతున్నారు
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం: ఖరీదైన సెల్ ఫోన్లే లక్ష్యంగా రాజమహేంద్రవరం నగరంలో ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. దేవాలయాలు, రైతు బజార్లు, షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు ఇలా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ ముఠాలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఖరీదైన యాపిల్, శ్యామ్సంగ్ ఇతర కంపెనీల మొబైళ్లను చోరీ చేసి ముఠా సభ్యులు పరారవుతున్నారు. ఉదయం సమయంలో రద్దీగా ఉండే దేవాలయాలు, ఘాట్లు, రైతు బజార్లు, చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్, మొయిన్రోడ్డు రద్దీ ప్రాంతాలను ఎంచుకొని జేబులో పెట్టుకున్న సెల్ఫోన్లు చోరీ చేస్తున్నారు.గోకవరం,బిక్కవోలు, ఆకివీడు ప్రాంతాల నుంచి వచ్చిన తెలగపాముల ముఠాలు రాజమహేంద్రవరంలో సంచరించి ఖరీదైన సెల్ఫోన్లు చోరీలకు పాల్పడుతున్నాయి. దానవాయి పేట ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగికి చెందిన రెండు సెల్ఫోన్లు ఈ మధ్య కాలంలో దేవాలయానికి వెళ్లినప్పుడు చోరీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో బిల్లు కలెక్టర్గా పని చేస్తున్న ఆర్.శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. లాలా చెరువులో మోటారు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని మోటారు సైకిల్ పడిపోతుందని అతడిని పక్కదారి పట్టించి అతడి జేబులో ఉన్న ఖరీదైన సెల్ ఫోన్ను చోరీ చేసి పరారయ్యారు. అల్లు రామలింగయ్య హోమియో కళాశాల ఎదురుగా చేపలు కొనుక్కునేందుకు వెళ్ళిన రాజేంద్ర నగర్కు చెందిన ఒక యువకుడి వద్ద పై జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ చోరీకి గురైంది. యువకుడు చేపలు అమ్మే వ్యక్తితో బేరమాడుతుండగా జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ను ఎవరో చోరీ చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట ఖరీదైన సెల్ఫోన్లు చోరీకి గురవుతూనే ఉన్నాయి. విలువైన సెల్ ఫోన్ల చోరీ.. ఈ ముఠా సభ్యులు ముఖ్యంగా కంపెనీ బ్రాండ్ సెల్ఫోన్లను చోరీ చేస్తున్నారు. యాపిల్ బ్రాండ్ సెల్ ఫోన్ ధర సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. అలాగే ఇతర కంపెనీలకు చెందిన సెల్ ఫోన్లు రూ.60 వేలు, రూ.75 వేలు ఉంటాయి. వీటిని చోరీ చేసి సిమ్ కార్డును తీసివేసి ఇతర రాష్ట్రాలు ముంబయ్, కోల్కత్తా, హైదరాబాద్లోని జగదీష్ మార్కెట్, విజయవాడ, నేపాల్ సరిహద్దులకు సెల్ఫోన్లు తరలించి అక్కడ విక్రయిస్తున్నట్టు పోలీసుల నిఘాలో తేలింది. ఇతర ప్రాంతాలకు సెల్ఫోన్లు తరలించడం వల్ల వీటిని రికవరీ చేయడం పోలీసులకు సా«ధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సెల్ఫోన్లు పోయిన బాధితులు సాధారణంగా ఫిర్యాదులు చేయడం లేదు. వచ్చినా తక్కువ ఫిర్యాదులు మాత్రమే వస్తున్నాయి. దీంతో సెల్ఫోన్ చోరీలు నగరంలో విరివిగా సాగుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడి.. కొంత మంది యువకులు సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఖరీదైన సెల్ ఫోన్లు చోరీ చేసి వాటిని అమ్ముకోవడం ద్వారా తమ జల్సాలకు డబ్బులు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్లయితే ఈజీగా చోరీ చేయవచ్చనే ఉద్దేశంతో ఈ బాట పట్టారు. చోరీ చేసిన వెంటనే దొంగలు వీటిని స్విచ్ ఆఫ్ చేస్తుండడంతో వారిని పట్టుకోవడంకష్టమవుతోంది. -
యువకుడి ఆత్మహత్య
తూర్పుగోదావరి , యానాం (ముమ్మిడివరం): తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. సుంకరపాలెంలో ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న కట్టా వీరాస్వామి(17) మంగళవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరిన అతడిని కుటుంబసభ్యులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్థానిక వైద్యులు ముందుగా చనిపోయాడని భావించారు. అయితే వైద్యులు సపర్యలు చేయగా అతడు శ్వాస తీసుకుంటున్నట్టు గుర్తించి తక్షణం మెరుగైన వైద్యం కోసం యానాం అంబులెన్స్లో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అయితే వీరాస్వామి అక్కడ చికిత్స పొందూతూ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన స్థలం కోరంగి పోలీస్స్టేషన్ పరిధికి వస్తుండడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. -
ఫేస్బుక్ పరిచయంతో ఉద్యోగం ఇప్పిస్తానంటూ..
విలాసవంతమైన జీవితం, గుర్రపు పందాలతో జోష్...ఖరీదైన వాహనాల్లో రయ్...రయ్, లగ్జరీ సూట్లలో హల్చల్...చూస్తే వీఐపీ పోజు ... చేసే పనులన్నీ మస్కా... ఇందుకు చేతినిండా డబ్బులు కావాలి...అందుకే ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని అవతలివారిని ‘బుక్’ చేయడం హాబీగా మార్చుకున్నాడు ఆ యువకుడు. అమరావతి సెక్రటేరియట్లో ఉద్యోగిగా ఓ యువతిని పరిచయం చేసుకుని, జ్యుడీషియల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి దశలవారీగా రూ.16.50 లక్షలు స్వాహా చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం రూరల్: ఫేస్బుక్లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 లక్షలు కాజేసిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.10 వేలు, ఒక ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోను ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు మొబైల్ ఫ్యాన్సీ నంబర్లు ఇస్తానని చెప్పి రూ.30 లక్షలు కాజేసిన కేసులో జైలు శిక్ష అనుభవించాడు. దీపక్ ఏపీ సెక్రటరీయేట్లో ఉద్యోగం చేస్తున్నానని చెబుతూ ఫేస్బుక్లో పలు పరిచయాలు పెంచుకున్నాడు. శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన దొండపాటి దుర్గ అనే యువతికి దీపక్ ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో నిందితుడు(ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చిత్రం) ఆమె పిన్నికుమార్తె బోనగిరి శేషారత్నానికి న్యాయశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి తన అకౌంట్లో రూ.16.50 లక్షలు వేయించుకున్నాడు. సొమ్ములు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా, వారిని నమ్మించేందుకు బెంగళూరులో ఇటీవల జరిగిన న్యాయశాఖ ఉన్నతాధికారులు సమావేశం వద్దకు తీసుకువెళ్లి అపాయింట్మెంట్ లెటర్ తయారవుతోందని, ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఈ నెల13న శేషారత్నం తాత ఊరా రాముడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాను వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్, బెంగళూరులలో గుర్రపు పందాలు, స్టార్ హోటళ్లలో దిగి వాడేసినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడికి స్కేటింగ్లో కుడికాలు పోయిందని..కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. -
తెగించారు
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరంలో గుట్కా మాఫియా కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఏకంగా రాజమహేంద్రవరంలోనే తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం లేని ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరుకు తీసుకొచ్చి పలువురు విక్రయిస్తున్నారు. నగరం నడిబొడ్డున మెయిన్ రోడ్డులో తయారీ యూనిట్ నడుపుతూ లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. ముడిసరుకు, తయారీదారులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి ఇక్కడే తయారు చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు తమకు అందిన సమాచారంతో అడపాదడపా దాడులు చేసి పట్టుకుంటున్న సరుకు విక్రయిస్తున్న మొత్తంలో ఒక శాతం కూడా ఉండదు. ఇక పోలీసులు కూడా దాడులు చేస్తున్నా ఏ మాత్రం ఆగడంలేదు. పోలీసులనే గుట్కా మాఫియా కొనుగోలు చేస్తోంది. జడలు విప్పిన గుట్కా మాఫియా.. ఇతర రాష్ట్రాల నుంచి యంత్రాంగం కళ్లు కప్పి గుట్కా ప్యాకెట్లను నగరానికి తీసుకురావడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో కొంతమంది గుట్కా వ్యాపారులు ఇక్కడే తయారు చేస్తున్నారు. నగరంలో వ్యాపారాలు చేస్తున్న బయట రాష్ట్రాల వ్యాపారులు ఈ యూనిట్లను విజయవంతంగా నడిపిస్తున్నారు. గత గురువారం రాజమహేంద్రవరం నగరంలోని మెయిన్ రోడ్డు మెరక వీధిలో ఓ అపార్ట్మెంట్లో గుట్కా తయారీ యూనిట్పై పోలీసులు దాడులు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తయారీ యంత్రాలు, లక్షల విలువైన ముడిసరుకు, తయారైన సరకును పట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన గుట్కా మాఫియా పోలీసులతో అక్కడికక్కడే బేరసారాలు నడిపింది. యంత్రాలు, ముడిసరుకు వదిలేస్తే భారీగా ముట్టజెబుతామని ప్రతిపాదించింది. ప్రతిపాదనలకు ఒప్పుకున్న పోలీసులు యంత్రాలు, ముడిసరుకు వదిలేసి తయారైన ప్యాకెట్లలో రెండు బస్తాలు మాత్రమే స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రతిపాదనలకు అనుగుణంగా కేసు... ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పోలీసులు కథ నడిపించారు. సీజ్ చేసిన రెండు బస్తాల సరకును భద్రపరిచి, నిందితులపై తూతూ మంత్రంగా కేసులు కట్టారు. స్టేషన్కు తీసుకువచ్చిన వారి పేర్లు బయటకు రాకుండా వారి తరఫున తయారీదారులు తమ వద్ద పని చేస్తున్న వారి పేర్లపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అసలు నిందితులైన తయారీదారులను వదిలేసి ఆ యూనిట్లో పని చేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురిపై పోలీసుల కేసులు నమోదు చేయడం విశేషం. అంతర్గత రిపోర్టులో నిందితుల పేర్లు నమోదు చేసుకున్న పోలీసులు, డీఎస్ఆర్లో గానీ, ఎఫ్ఐఆర్లో గానీ నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ గుట్కా వ్యవహారం పోలీసు వర్గాల్లో గుప్పుమంటోంది. నాలుగు రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నూతన ఎస్పీ షిమూషీ బాజ్పాయ్ దృష్టికి ఈ వ్యవహారం ఎక్కడ వెళుతుందోనని ఈ కేసులో భాగస్వాములైన వారు ఆందోళనలో ఉన్నారు. -
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తాడితోట, వీరభద్రనగర్కు చెందిన బొడ్డుపల్లి వెంకటరమణ(21) డిగ్రీ వరకు చదివాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తల్లి చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని కిందకి దించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. వన్టౌన్ సీఐ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తను నరికి చంపిన అల్లుడు
తూర్పుగోదావరి, గోకవరం (జగ్గంపేట): మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.పిల్లనిచ్చిన అత్తను ఓ అల్లుడు కత్తితో అతికిరాతంగా నరికి చంపాడు. ఈ సంఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొత్తపల్లి గ్రామంలో చాకలిపేటకు చెందిన బవిరి చంటమ్మ (65) కుమార్తె దుర్గను ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జాజిముగ్గుల దుర్గాప్రసాద్కు మూడేళ్ల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి రెండేళ్ల వయస్సు గల బాబు ఉన్నాడు. దివ్యాంగురాలైన దుర్గ సామర్లకోట వెలుగు కార్యాలయంలో పని చేస్తోంది. భార్య కాపురానికి రావడం లేదని, దీనికి అత్త కారణమని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దీనిపై తరచూ అత్తతో గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కొత్తపల్లి వచ్చి అత్తతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో అత్తపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చంటమ్మ చేతి మణికట్టు సైతం తెగిపడింది. ఈ దాడిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చంటమ్మకు నడుము, మెడ భాగాల్లో లోతైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై జి.ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఘాతుకానికి పాల్పడిన దుర్గాప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని కోరుకొండ సీఐ రవికుమార్ సందర్శించారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికితరలించామన్నారు. -
చెట్టుకు వేలాడుతున్న మృతదేహం
తూర్పుగోదావరి, గండేపల్లి (జగ్గంపేట): జాతీయరహదారిపై పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. రోడ్డు పక్కన చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు, ప్రయాణికులు, వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. జగ్గంపేట సీఐ రాంబాబు, ఎస్సై ఏసుబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. మృతుడు నీలం రంగు ప్యాంట్ ధరించాడని, చామనఛాయలో 5.8 ఎత్తు, సుమారు 40 నుంచి 50 వయసు ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసినవారు సమాచారం అందజేయాలని కోరారు. మృతిపై పలు అనుమానాలు ఈ గుర్తు తెలియని వ్యక్తిది హత్య? ఆత్మహత్య? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తలపై గాయం, మృతుని కుడిచేయి చెట్టుకు ఉన్న రెండు పలవల మధ్యలో ఉంది. ఎవరైనా హతమార్చి ఇక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే ప్రయత్నించారా? అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. టీషర్ట్తోనే మృతదేహం చెట్టుకు వేలాడుతుండటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే మానసిక ఒత్తిడి, ఆర్థిక, అనారోగ్య పరిస్థితులతో ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎసై పాల్ తెలిపారు. -
నెలలో పెళ్లి.. డెంగీతో యువకుడి మృతి
తూర్పుగోదావరి, తాళ్లరేవు (ముమ్మిడివరం): నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడ్ని డెంగీ బలి తీసుకుంది. దీంతో అతడి కుటుంబంలో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. మండలంలోని శుంకరపాలెం గ్రామ మాజీ సర్పంచి శీలం నాగేశ్వరరావు ద్వితీయ కుమారుడు శీలం వెంకన్న (26) ఇటీవల అనారోగ్యంగా ఉండటంతో గ్రామంలోని ఆర్ఎంపీని వైద్యం చేయించారు. అతని పరిస్థితి విషమం కావడంతో కాకినాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చడంతో అతడికి డెంగీ సోకిందని అక్కడి వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతుండగా ప్లేట్లెట్స్ పడిపోవడంతో అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారని చెప్పారు. వెంకన్నకు ఇటీవలే పెండ్లి నిశ్చితార్థం అయిందని, మరో నెలలో వివాహం కానుందని వారు విలపిస్తూ తెలిపారు. గ్రామంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, వీటిని నిరోధించాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం క్షీణించిందని, వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గ్రామానికి రావడం లేదని వారు ఆరోపించారు. -
ఉడుముల విక్రేత అరెస్ట్
తూర్పుగోదావరి ,తాళ్లరేవు (ముమ్మిడివరం): మడ అడవుల్లో సంచరించే ఉడుములను పట్టుకుని కాట్రేనికోన సంత పరిసరాల్లో విక్రయిస్తున్న ఆవుల ఏసు అనే వ్యక్తిని ఆదివారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం వన్యప్రాణి విభాగం అధికారి అనంతశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కాట్రేనికోన సంత ప్రాంతంలో ఉడుములను విక్రయిస్తున్న ఏసును పట్టుకున్నట్టు తెలిపారు. అతడి వద్ద నుంచి ఐదు ఉడుములు స్వాధీనం చేసుకోగా వాటిలో ఒకటి మృతి చెందిందని తెలిపారు. ఈ మేరకు వన్యప్రాణి చట్టం 1972 సెక్షన్ 9, 48ఎ ప్రకారం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు. ఉడుమును చంపితే పులిని చంపిన శిక్షే వన్యప్రాణి చట్టం ప్రకారం పులిని చంపిన వారికి విధించే శిక్షే ఉడుమును చంపిన వారికి కూడా వర్తిస్తుందని అనంతశంకర్ తెలిపారు. చట్టంలో ఉడుములు షెడ్యూల్–1లో ఉన్నాయన్నారు. పులిని చంపితే మూడు నుంచి ఏడేళ్ల సంవత్సరాల జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించడం జరుగుతుందని, అదేమాదిరిగా ఉడుములతో వ్యాపారం చేసినా, వాటిని చంపినా అదేశిక్ష విధించడం జరుగుతుందన్నారు. -
ఎడబాటు భరించలేక వ్యక్తి ఆత్మహత్య!
తూర్పుగోదావరి , తుని రూరల్: మండలంలోని ఎస్.అన్నవరం శివారు కొత్తసూరవరం (శాంతినగర్)లో నివాస గృహంలో ఆచంట రాజేష్ (32) ఉరి వేసుకుని మృతి చెందినట్టు రూరల్ ఎస్సై కె.సుధాకర్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్న రాజేష్ ఈ నెల రెండో తేదీన సోదరుడి బియ్యం దుకాణానికి వెళ్లాడు. సోదరుడు లేకపోవడంతో తిరిగివచ్చేశాడు. శనివారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేడు. అదే రోజు ఇంట్లో శ్లాబ్కు ఉన్న ఇనుప కొక్కేనికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదారు రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా చెడిపోయి దుర్వాసన వస్తుండడాన్ని స్థానికులు గమనించి సమాచారం ఇచ్చారన్నారు. ఏడాదిన్నరగా భార్య శ్రీదేవి, కార్తికేయ గణేష్ (3), చాణుక్య (1) అనే ఇద్దరు పిల్లలతో అమ్మగారి ఇంటివద్ద ఉంటోంది. ఈ కారణంగానే రాజేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎడబాటే కారణమా? తుని పట్టణం చినపండా వీధికి చెందిన రాజేష్కు శంఖవరం గ్రామానికి చెందిన శ్రీదేవితో 2013లో వివాహమైంది. వీరిద్దరికి ఏడాదిలోనే మొదట బిడ్డ కార్తికేయ గణేష్ జన్మించాడు. కుటుంబ తగాదాలతో రాజేష్, శ్రీదేవి కొత్త సూరవరం శాంతినగర్ కాలనీలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తర్వాత శ్రీదేవి రెండోసారి గర్భవతి కావడంతో నాలుగో నెలలో శంఖవరంలో పుట్టింటికి వెళ్లింది. రెండో కాన్పులో మగబిడ్డ జన్మించాడు. ఆ విషయాన్ని రాజేష్కు తెలియజేయలేదు. ఏడాది గడుస్తున్నా భార్య, పిల్లలు తన వద్దకు రాలేదన్న మనోవేదన, ఎడబాటు భరించలేక రాజేష్ ఆత్మహత్యకుపాల్పడినట్టు తెలుస్తోంది. అనాథలైన చిన్నారులు అమ్మానాన్నల ఒడిలో ఆడుకునే వయస్సులో ఆ చిన్నారులు తండ్రి లేని అనాథలయ్యారు. తండ్రి చనిపోయిన విషయం తెలియని ఆ చిన్నారులు అక్కడికి వచ్చిన జనాలను చూసి తాతయ్య సత్యనారాయణ వద్ద బిక్కుబిక్కుమంటూ ఉండడం స్థానికులను కంటతడి పెట్టించింది. రాజేష్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
తూర్పుగోదావరి, రావులపాలెం (కొత్తపేట): ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు కేసుల్లో నిందితులు, అంతర్ జిల్లాల దొంగలు నలుగురిని రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.తొమ్మిది లక్షల విలువైన 404.54 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటరు సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పెద్దిరాజు వారి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గతంలో పలు కేసులు నమోదు కాబడిన నిందితులు మలికిపురం మండలం గుడిమెళ్లంకకు చెందిన మామిడి శెట్టి సురేష్, భీమవరం మండలం గునిపూడికి చెందిన పందిరి వెంకట నారాయణ, సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన జిళ్లెళ్ల రాకేష్, గతనెల 15వ తేదీన మండలంలోని వెదిరేశ్వరంలో ఒక ఇంటిలో దొంగతనం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా నిందితులు దొంగిలించిన నగదును మార్చేందుకు తణుకు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న సీఐ పెద్దిరాజు వచ్చిన సమాచారంతో శుక్రవారం రావులపాలెం ఎస్సై సీహెచ్ విద్యాసాగర్, సిబ్బంది మండలంలోని ఈతకోట చెక్పోస్టు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా దొంగలించిన మోటరు సైకిల్పై నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని విచారించగా, చోరీ సొత్తును మారకం చేసేందుకు సహకరించిన తణుకు మండలం వేల్పూరుకు చెందిన ఒబినీడి సాయికృష్ణ కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నాలుగు కేసుల్లో రెండు రావులపాలెం మండల పరిధిలోనివి కాగా మిగిలిన రెండు అమలాపురం రూరల్ పరిధిలో నమోదైన కేసులు, నాలుగు కేసుల్లో సుమారు రూ.తొమ్మిది లక్షల విలువైన 404.54 గ్రాముల బంగా>రు ఆభరణాలు, మోటరు సైకిల్ను స్వా«ధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. వీరిపై ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో కూడా పలు కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కొత్తపేట జేఎఫ్సీఎం కోర్టులో హజరుపర్చనున్నట్టు తెలిపారు. దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన ఎస్సై విద్యాసాగర్ను, పీఎస్సై దుర్గాప్రసాద్, ఏఎస్సై ఆర్వీరెడ్డి, హెచ్సీలు పి.అమ్మిరాజు, దుర్గారావు, బ్రహ్మాజీ, రమణ, కానిస్టేబుళ్లు చక్రవర్తి, గీతాకృష్ణ, కృష్ణ, సతీష్, తదితరులను సీఐ అభినందించారు. -
రోడ్డుకు అడ్డంగా ఇలా చేస్తావా.. హత్య చేసిన బావ
తూర్పుగోదావరి, తాళ్లరేవు (ముమ్మిడివరం): రోడ్డుకు అడ్డంగా సామాన్లు కడుగుతోందన్న కోపంలో మరదలిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ శాంతిమూల గ్రామంలో జరిగింది. కోరంగి ఎస్సై సుమంత్ కథనం ప్రకారం.. పటవల శాంతిమూల ఎస్సీపేటలో పోలినాటి నాగమణి అతడి ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తోంది. పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం, రెండో కుమారుడు శ్రీనివాస్లు ఒక ఇంట్లో నివసిస్తుండగా, మూడో కుమారుడు సత్యనారాయణ, మాధవి దంపతులు పక్కనే ఉన్న పూరిపాకలో నివసిస్తున్నారు. మాధవి(25) బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డుపై సామాన్లు తోముతుండగా, ఆమె బావ శ్రీనివాస్ పూటుగా మద్యం సేవించి అటుగా వెళుతుండగా, రోడ్డుపై సామాన్లు అడ్డంగా ఉండడంతో ఇలా ఉంటే ఎలా వెళ్లాలి? అని ఘర్షణకు దిగాడు. దీంతో పక్కనే ఖాళీ ఉంది కదా? అని మాధవి చెప్పడంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ మూడడుగుల లావుపాటి బద్ది కర్రతో మాధవి తలపై కుడిభాగంలో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. ఇంట్లో భోజనం చేస్తున్న సత్యనారాయణ బయటకు వచ్చేసరికే మాధవి మృతి చెందినట్టు చెబుతున్నారు. మృతురాలికి నాలుగేళ్ల అనువాసిని అనే కుమార్తె, 15 నెలల రాజు కుమారుడు ఉన్నారు. తల్లి మృతితో పిల్లలు బిక్కుబిక్కు మంటూ చూడడం స్థానికులను కలచివేస్తోంది. ఇలా ఉండగా శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో 15 ఏళ్ల క్రితమే అతడి భార్య ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్రీనివాస్ తల్లితోనే కలిసి ఉంటున్నాడు. కూలి పని చేసుకునే శ్రీనివాస్ ఒక్కొక్కసారి మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తుంటాడని చెపుతున్నారు. గతంలో రెండుసార్లు శ్రీనివాస్ బ్లేడుతో పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దకుమారుడు భార్య కువైట్లో ఉండడం, రెండో కుమారుడు భార్య వదిలి వెళ్లిపోవడం, మూడో కుమారుడు భార్య మృత్యువాత పడడంతో వారికిగల చిన్నారుల బాధ్యత నానమ్మ నాగమణిపై పడింది. వీళ్లందరినీ ఎలా సాకాలి? అంటూ నాగమణి బోరున విలపిస్తుంది. కాకినాడ రూరల్ సీఐ రాంబాబు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
ద్రావకం కొట్టులో బంగారు ముద్దల దొంగలు అరెస్టు
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లోని ద్రావకం కొట్టులో బంగారం ముద్దల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ముద్దాయిలను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.24 లక్షల విలువైన 743 గ్రాముల బంగారు బిస్కెట్ల ముద్దలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరించారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, విఠ మండలం, కార్వి గ్రామానికి చెందిన ప్రశాంత్జాదవ్, సుశాంత్జాదవ్లు అన్నదమ్ముల పిల్లలు. వీరు ఇరువురు బంగారం ద్రావకం షాపులో పనిచేస్తుంటారు. సుశాంత్జాదవ్ గతంలో ఢిల్లీలో పని చేశాడు. ప్రశాంత్జాదెవ్ పెదనాన్న కొడుకు సతీష్జాదవ్కు కాకినాడ గోల్డ్ మార్కెట్లో ద్రావకం కొట్టు ఉంది. ఈ షాపులో దాదాపు ఏడేళ్లుగా వర్కర్గా పని చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం పనిని మానేసి తన స్వగ్రామం వెళ్లిపోయాడు. మరలా తిరిగి ఈ సంవత్సరం సెప్టెంబర్ 2018లో కాకినాడకు వచ్చి తిరిగి పనిలో చేరాడు. సతీష్జాదవ్ షాపులో కొన్నిరోజులు పనిచేసి గొడవపడి వినాయక చవితి రోజు తన స్వగ్రామమైన కార్వి గ్రామం వెళ్లిపోయాడు. తిరిగి ఈనెల 9వ తేదీన మహారాష్ట్ర నుంచి ప్రశాంత్జాదెవ్, సుశాంత్జాదెవ్లు ఇరువులు కలసి కాకినాడ వచ్చారు. అదే రోజు రాత్రి 2.30 గంటల సమయంలో ప్రశాంత్జాదెవ్ వద్ద ఉన్న రెండో తాళం చెవితో షాపును తెరవగా సుశాంత్జాదవ్ను షాపు బయట కాపలా పెట్టి షాపులో ఉన్న రెండు బంగారు ముద్దలను దొంగిలించారని ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. ఈ దొంగిలించిన బంగారం ముద్దలను కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న ఆవరణలో దాచిపెట్టి తిరిగి మహారాష్ట్రలోని వారి స్వగ్రామం వెళ్లిపోయారు. ఈ దొంగతనంపై అనుమానం వచ్చిన సీసీఎస్ డీఎస్పీ ఎ పల్లపురాజు తమ సిబ్బందితో మహారాష్ట్ర వెళ్లి టెక్నికల్ సపోర్టు ద్వారా దర్యాప్తు చేశారు. ఈనెల 28న ముద్దాయిలైన ప్రశాంత్జాదెవ్, సుశాంత్జాదెవ్లు మహారాష్ట్ర నుంచి కాకినాడ వచ్చి సాయంత్రం ఐదు గంటల సమయంలో కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్లో దాచిపెట్టిన బంగారు ముద్దలను తీసుకెళ్లేందుకు వచ్చారని ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. మహారాష్ట్ర నుంచి కాకినాడ వచ్చినట్టు డీఎస్పీ పల్లపురాజుకు ముందుగా రాబడిన సమాచారం మేరకు త్రీ టౌన్ సీసీఎస్ ఎస్సై వి శ్రీనివాసరావు, ఎం రవీంద్ర, సీహెచ్ సుధాకర్, హెచ్సీ గోవిందరావు తమ సిబ్బందితో పోర్టు రైల్వే స్టేషన్ వద్ద దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి దొంగిలించిన 743 గ్రాములు రెండు బంగారపు బిస్కెట్ ముద్దలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. -
దివిలిలో మహిళ దారుణ హత్య
తూర్పుగోదావరి, పెద్దాపురం: కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలకు కారణమవుతోందన్న అక్కసుతో తమ్ముడి అత్తను అత్యంత దారుణంగా ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన గురువారం జిల్లాలోని పెద్దాపురం మండలం దివిలిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిరిగినీడి అమలావతి(49) పట్టపగలు అత్యంత దారుణంగా తన అల్లుడి అన్న చేతిలో దారుణ హ్యతకు గురైంది. పట్టపగలు అత్యంత దారుణంగా ఆమెను హతమార్చి ‘మీ అమ్మను చంపేశాం వెళ్లిపో’’ అని నిండు గర్భిణి అయిన మరదలు శివగంగకు చెప్పి అన్న, తమ్ముడు, తండ్రి పరారయ్యారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన సిరిగినీడి విష్ణుమూర్తి, అమలావతి దంపతుల చిన్న కుమార్తె శివగంగకు మూడేళ్ల క్రితం పులిమేరు గ్రామానికి చెందిన మాగాపు గణేష్తో వివాహమైంది. వారికి రెండేళ్ల పాప జన్మించింది. గతం నుంచి అత్త అమలావతికి అల్లుడు గణేష్ కుటుంబాలకు ఆస్తి తగాదా నడుస్తోంది. ఇటీవల పెద్దల వద్ద ఒప్పందం కుదుర్చి రాజీ పడ్డారు. ఆ వివాదాల నేపథ్యంలో కుటుంబ కలహాలకు అమలావతి నిత్యం కారణమవుతోందన్న అక్కసుతో గణేష్ అన్న అయ్యన్న గురువారం ఉదయం దివిలి లో ఆమె ఇంటికి వచ్చి ‘మా ఇంటి పరువు రచ్చకీడుస్తున్నావే’ అంటూ కత్తితో అత్యంత దారుణంగా నరికి హతమార్చాడు. అక్కడి నుంచి పులిమేరులో ఉన్న ఆమె మరదలు శివగంగకు ‘మీ అమ్మను చంపేశాను. మీ అమ్మని చివరి చూపు చూసుకో’ అంటూ చెప్పి అక్కడి నుంచి అయ్యన్న తమ్ముడు గణేష్, తండ్రి వెంకట్రావులతో కలిసి పరారయ్యాడు. నిండు గర్భిణి అయిన శివగంగ దివిలి వచ్చి అమ్మ మృతదేహాన్ని చూసి రోదించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది. విషయం తెలుసుకు పెద్దాపురం సీఐ జి. యువకుమార్, ఎస్సై కృష్ణ భగవాన్ హుటాహుటిన అక్కడికి చేరుకుని హత్య ఘటన కారణాలపై ఆరా తీశారు. నిందితులు పరారీలో ఉన్నారని, ఆస్తి తగాదాలు, కటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందని, నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ మేరకు సీఐ యువకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకోని ఆపద్బంధువు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కత్తిపూడి శివారు 216వ జాతీయ రహదారి పక్కన ఇటీవల 108 సేవలు సకాలంలో అందకపోవడంతో నడిరోడ్డుపైనే మతి స్థిమితం లేని మహిళ ప్రసవించింది. ఫోన్ చేసినా సకాలంలో 108 రాకపోవడంతో జన్మించిన శిశువుకు వైద్యం అందలేదు. దీంతో శిశువు వెంటనే కన్నుమూసింది. ఘటన జరిగిన 3 గంటల తర్వాత 108 వాహనం అక్కడికి చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోమవారం కూడా అదే తరహా జాప్యం పునరావృతమైంది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో టాటా మేజిక్ వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయగా వెంటనే రాలేదు. ఫోన్ చేసిన 2 గంటల తర్వాత వాహనం చేరుకుంది. ఈలోపు తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. 108 వచ్చేలోపు పోలీసు జీపు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. ఇలా చెప్పుకునిపోతే గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కానీ, ప్రభుత్వంలో చలనం లేదు. వైఎస్సార్ హయాంలో ఎన్నో ప్రాణాల్ని కాపాడిన ఆపద్బంధువు ఇప్పుడేమాత్రం ఆదుకోలేకపోతోంది. ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత గానీ రాని పరిస్థితి నెలకొంది. ఈలోపే క్షతగాత్రులు, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒకప్పుడు ప్రథమ చికిత్సతోప్రాణాల్ని నిలబెట్టేవి. తదుపరి వైద్యసేవలు అందేవరకు మెరుపు వేగంతో తరలి వచ్చి పునర్జన్మ ప్రసాదించేవి. ఇప్పుడా పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. సమయానికి రాకపోగా, వచ్చేవి కూడా ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితిలో 108 ఉంది. ఆక్సిజన్ కూడా 108 వాహనాల్లో లేని దుస్థితి నెలకొంది. జిల్లాలో 42 వాహనాలుండేవి. ఇందులో ప్రస్తుతం 33 పని చేస్తున్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికైతే క్షేత్రస్థాయిలో 29 మాత్రమే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వన్నీ మూలకు చేరిపోయాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో 20 వరకు చిన్న,చిన్న మరమ్మతులతో ఉన్నాయి. ఎప్పుడేది ఆగిపోతుందో తెలియదు. ఇక, ఆక్సిజన్ లేక, ఇంజన్ ఆయిల్ మార్చక, టైర్లు ఆరిగిపోయి తిరుగుతున్న వాహనాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాస్తవ పరిస్థితి బయటకు చెబితే ప్రభుత్వం కన్నెర్ర చేస్తుందని అధికార వర్గాలు బయటికి చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 108 వాహనాలు వచ్చి ఆదుకుంటాయనే ఆశ ప్రజలకు లేకుండా పోయింది. అందుకు ఉదాహరణే తాజాగా గొల్లప్రోలు వద్ద జరిగిన ప్రమాదం. కత్తిపూడిలో అదే నిర్లక్ష్యం... మొన్న కత్తిపూడిలో ఫోన్ చేసిన 3 గంటల తర్వాత 108 వాహనం రావడంతో రోడ్డుపై మతి స్థిమితం లేని మహిళ జన్మనిచ్చిన శిశువు చనిపోగా సోమవారం చేబ్రోలులో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సేవలందించే విషయంలో కూడా అదే తరహా జాప్యం చోటుచేసుకుంది. దీనికంతటికీ ప్రమాదం జరిగిన గొల్లప్రోలు మండలంలో 108 వాహనం లేకపోవడమే కారణం. గతంలో ఇక్కడ 108 వాహనం ఉండేది. కాకినాడ రూరల్లోని వాహనం పాడైందని గొల్లప్రోలులో ఉండే వాహనాన్ని తరలించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గమంతటికీ రెండే వాహనాలున్న పరిస్థితి నెలకొంది. అసలే అరకొరగా పనిచేస్తుండగా, ఆపై వాహన కొరత ఉండటంతో ఫోన్ చేసిన వెంటనే ఘటన జరిగిన చేబ్రోలుకు 108 రాలేకపోయినట్టు తెలుస్తోంది. సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరగ్గా 108 వచ్చే సరికి రెండు గంటలు ఆలస్యమైంది. ఈలోపే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సకాలంలో వైద్యసేవలందక మృతి చెందారు. సమయానికి వచ్చి ఉంటే వారిద్దరూ బతికేవారేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలను పణంగా పెట్టక తప్పదన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాప్యానికి కారణంపరిశీలిస్తా... ఫోన్ చేసిన వెంటనే 108 వాహనం ఎందుకు రాలేకపోయిందో పరిశీలిస్తాను. ఏ కారణం చేత రాలేదో తెలుసుకుంటాను. కాకినాడ రూరల్ 108 వాహనం చెడిపోయిన కారణంగా గొల్లప్రోలు వాహనాన్ని అక్కడికి తరలించాం. 108 వాహనాల కొరత ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వాహనాలు రానున్నాయి.– బాలాజీ, 108 సేవల జిల్లా మేనేజర్ -
అర్చకుడి ఆత్మహత్యలో టీడీపీ నేతల హస్తం?
తూర్పుగోదావరి, మధురపూడి (రాజానగరం) : అర్చకుడు మల్లికార్జున శర్మ ఆత్మహత్యలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషించగా ఆయనను తప్పించేందుకు యత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కోరుకొండ మండలం కణుపూరులోని స్వయంభు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ అర్చకుడు మల్లికార్జున శర్మను తొలగించే యత్నాల్లో ఆయనను మానసికంగా వేధింపులకు గురి చేశారు. ఆయన నివసించే ఇంటి తాళాలు పగలుకొట్టి, ఇంట్లోని సామాన్లను పంచాయతీకి తీసుకురావడంలో ఆ నాయకుడు కీలకమైన పాత్ర పోషించారు. శర్మ తన ఆత్మహత్యకు కారకులుగా పేర్కొన్న జాబితాలో ఆయన పేరున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి సత్యనారాయణశర్మ పోలీసులకు ఇచ్చిన లిస్టులో కూడా ఆ ప్రజాప్రతినిధి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసులో ఆయన పేరు కనీసం ప్రస్తావనకు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాల్ డేటా పరిశీలిస్తే కొత్తసమాచారం మృతుడి తండ్రి, ఆయనతో మాట్లాడిన వారి ఫోన్లోని కాల్లిస్టును పరిశీలిస్తే కొత్త సమాచారం లభ్యమవుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా శర్మతో సఖ్యతగా ఉంటున్నవారితో మాట్లాడితే కొత్త సమాచారం వస్తుందంటున్నారు. అధికార పార్టీ నేతను తప్పించే యత్నాలు అర్చకుడు మల్లికార్జున శర్మ ఆత్మహత్య కేసులో టీడీపీ నాయకుడు, ప్రజా ప్రతినిధిని తప్పించడం కోసం పై స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు నూతన పద్ధతులను అవలంబిస్తేనే నిజాలు బయటపడతాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. శర్మను మానసికంగా క్షోభపెట్టిన, అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పడంలో కీలకపాత్ర పోషించిన వారిని పోలీసులు గుర్తించాల్సి ఉంది. -
చావు చాటున లంచాల బేరం.. ఇలా బయటపడింది నేరం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలోని ఓ స్టేషన్లో జరిగిన వ్యవహారం తాజాగా పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ కేసుకు సంబంధించి విచారణలో జరిగిన తంతు క్రైం సినిమాను తలపించేలా నడిచింది. ఈ వ్యవహారంలో సదరు అధికారి పై పోలీసు ఉన్నతాధికారులకు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడం, ఏసీబీ వల వేసేలోపు సదరు అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం గంటల వ్యవధిలో జరిగిపోయింది. తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 18వ తేదీన రాజమహేంద్రవరం నగరం ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దేపల్లి కాలనీ యశోదా ఆర్కెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 202లో మద్దిపాటి రామకృష్ణ (64), అతని కుమారుడు మద్దిపాటి నరేష్ (32)లు పురుగులు మందు తాగి, ఆ పై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సొంత ప్లాస్టిక్ డబ్బాలు, పైపులు, ప్యాకింగ్ అట్టపెట్టెల కంపెనీలో తయారయ్యే వస్తువులను రిటైల్గా విక్రయించేందుకు రామకృష్ణ వీఎల్పురంలో దుకాణం నిర్వహిస్తున్నారు. తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్నారు. ఒకే తాడుతో ఆలింగనం చేసుకుని చనిపోయిన ఘటన చుట్టుపక్కల వారితోపాటు ఘటనా స్థలాన్ని సందర్శించిన అప్పటి పోలీసులనూ కలిచివేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సమస్యల పరిష్కారంపై విభేదాలే ఈ ఆత్మహత్యలకు దారితీశాయి. చనిపోయే ముందు బంధువులు, విడిగా ఉంటున్న భార్య తదితరులతో మాట్లాడిన రామకృష్ణ తమ ఆత్మహత్యలకు గల కారణాలను నాలుగు పేజీల లేఖలో వరుసగా పేర్లు, వారి ఫోన్ నంబర్లు, వారు తమను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ సవివరంగా వివరించారు. నిందితులు తప్పించుకు నే వీలు లేకుండా ఆత్మహత్యలకు గల కారణాలను పేర్కొం టూ రాసిన లేఖను పలు కాపీలు తీసి ఫ్లాట్లోని హాలు, బెడ్రూమ్, వంటగది, డైనింగ్ టేబుల్, సోఫా తదితర ప్రాంతాల్లో ఉంచాడు. ఆ కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించేందుకు చట్టంతో బేరం.. లేఖలో పేర్కొన్న పది మంది పేర్లు, వివరాల ఆధారంగా పోలీసులు నిందితులైన రామకృష్ణ బంధువులను స్టేషన్కు పిలిపించారు. కొంత మంది అదే రోజు అక్కడకు రావడంతో స్టేషన్కు తరలించారు. మూడు నాలుగు రోజులు స్టేషన్లో ఉన్న సమయంలో కేసు నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మార్గాలను వెతికారు. సదరు వ్యక్తులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు నగరానికి చెందిన ప్రముఖులతో లంచాల ఆశ చూపిస్తూ ముందుకు కదిలారు. ఈ ఘటలో ఏ సెక్షన్ మీద కేసు నమోదు చేస్తారు? ఆ సెక్షన్ వల్ల ఎలాంటి శిక్ష పడుతుంది? వాటికి బదులు ఇంకే సెక్షన్ పెట్టవచ్చు? తద్వారా శిక్ష నుంచి వీలైనంతగా ఎలా తప్పించుకోవచ్చు? తదితర అంశాలపై చర్చలు స్టేషన్లోనే జరిగాయి. ఈ మేరకు శిక్ష నుంచి తప్పించేందుకు భారీగా ముడుపులు చేతులు మారినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల ఫొటోలు తీసేందుకు, చుట్టుపక్కల వారి స్టేట్మెంట్లు రికార్డు చేసేందుకు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇంటిలిజెన్స్ నిఘా, ఏసీబీకి ఫిర్యాదులు... ఆరు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో నిందితులకు సులువుగా బెయిల్ వచ్చేందుకు తగిన సహకారం అందించిన నేపథ్యంలో భారీగా ముడుపులు డిమాండ్ చేసినట్లు సమాచారం. పది మందిలో ఒక్కొక్కరికి వేర్వేరుగా చెల్లింపుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో స్టేషన్లో జరుగుతున్న వ్యవహారంపై ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా వేశాయి. పూర్తి సమాచారం ఉన్నతాధికారులకు చేరవేశాయి. మరోవైపు నిందితుల్లో ఒకరు ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్టేషన్లో జరిగిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేసి నిర్థారణకు వచ్చారు. ఈలోపు 22వ తేదీన ఇదే స్టేషన్ పరిధిలోని సుబ్బారావు పేటలో బాణాసంచా పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను పరిశీలించేందుకు వచ్చిన ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్ మూర్తి ఈ ఘటనను కారణంగా చెబుతూ ప్రకాశ్నగర్ ఇన్స్పెక్టర్ సీహెచ్.సూర్యభాస్కరరావును సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు, తండ్రీకొడుకుల ఆత్మహత్య కేసులో ఉన్నతాధికారుల ప్రమేయంపై కూడా మాట్లాడాల్సి వస్తుందని, చివరకు తామే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందన్న భావనతో అసలు కారణం చెప్పలేదన్న చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. -
పండగవేళ.. ప్రమాదం
తూర్పుగోదావరి ,గండేపల్లి (జగ్గంపేట): సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో పండగపూట విషాదం నెలకొంది. రెప్పపాటులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లీకూతురు, మరోచోట ఓ మహిళ ఇలా వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. లారీ ఢీకొని తల్లీకూతురు.. పండగకు సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చిన ఆ తల్లీకూతరు దుర్మరణం చెందారు. బంధువులతో కలిసి బైక్పై వెళుతుండగా.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన ఆచంట అప్పలరాజు అనే మహిళతో పాటు శ్రీను, శెట్టిపల్లి నాగవీరదుర్గ(దేవి)(23), అమ్ము(4)లు ఈ నలుగురు గురువారం మోటార్ సైకిల్పై మండలంలోని తాళ్లూరులో బట్టల షాపునకు వచ్చారు. తిరుగుప్రయాణంలో జెడ్ రాగంపేట పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకుని సొసైటీ కార్యాలయం సమీపంలో ఉన్న డివైడర్ వద్ద రోడ్డు దాటారు. ముందు వెళుతున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వెనుకే వస్తున్న లారీ వీరిని ఢీకొని మోటార్ సైకిల్ను కొంతమేర ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో నాగ వీర దుర్గ ఎడమవైపు శరీరం నడుమ నుంచి మోకాలి వరకు నుజ్జునుజ్జయ్యి అక్కడిక్కడే మృతి చెందింది. చిన్నారి అమ్ము కూడా ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై పడిపోవడంతో శ్రీను, అప్పలరాజుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అప్పలరాజును జగ్గంపేట ప్రైవేట్ ఆస్పత్రికి, శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీవనోపాధి నిమిత్తం నాగ వీరదుర్గ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటున్నారని, ఇటీవల ఈమె పండగ నిమిత్తం లింగంపర్తి వచ్చినట్టు తెలిసింది. వీరందరూ సమీప బంధువులని చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం సేవించినట్టు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై రాస్త్రారోకో.. తమకళ్లెదుటే ప్రమాదం జరగడంతో ఆగ్రహించిన స్థానికులు, ఇతర ప్రయాణికులు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. సుమారు గంటపాటు నిర్వహించిన ఈ ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు దీరి ట్రాఫిక్ నిలిచిపోయింది. డివైడర్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మల్లేపల్లిలో మండలంలోని మల్లేపల్లికి చెందిన దిడ్డి సుబ్బలక్ష్మి (47) లారీ ఢీకొని మృతి చెందింది. శుక్రవారం ఉదయం గ్రామంలోని కొత్తూరు సెంటర్లో రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళుతున్న లారీ ఈమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈమె అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు. గండేపల్లిలో..: గ్రామానికి చెందిన రాయుడు అన్నవరం (57) స్థానికంగా ఉన్న కాన్ చెరువులో పడి మృతిచెందాడు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన అన్నవరం ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు ఇచ్చిన పాపానికి వృద్ధ దంపతులు ఆత్మహత్య
రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఆ దంపతులది. కాయకష్టం చేసుకుని సంపాదించిన రూపాయి, రూపాయి పోగేసి కొంత మొత్తం దాచారు. ఆ డబ్బు అనారోగ్యంతో ఉన్న కొడుక్కి వైద్య ఖర్చులకు పనిచేస్తుందని భావించారు. ఇంతలో వారితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి వారిని మాయ మాటలతో నమ్మించి వారి వద్ద నుంచి రూ.రెండు లక్షల సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఒక ఏడాది పాటు వారికి వడ్డీ చెల్లించేందుకు నానా తిప్పలు పెట్టాడు. కొన్ని రోజులకు మొత్తం ఇవ్వడం మానేశాడు. ఇదేంటని? ఆ దంపతులు అతడిని ప్రశ్నించారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారు అతడికి వివరించారు. అంతేకాదు పెద్దల్లోనూ పంచాయతీ పెట్టారు.. అయినా ఆ కర్కశుడి గుండె కరగలేదు.. ‘ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి. మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆ దంపతుల వద్ద ఉన్న కాగితాలు సైతం లాక్కున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధదంపతులు బాకీదారుడి ఇంటి వద్దే పురుగుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడి వచ్చిన దంపతుల కుమారుడు వారిని ఆసుపత్రిలో చేర్చగా వారు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది. తూర్పుగోదావరి, అంబాజీపేట, అమలాపురం టౌన్: అప్పు తీసుకున్న వ్యక్తులు వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటాం.. దానికి భిన్నంగా రుణం ఇచ్చిన దంపతులు.. ఆ బాకీల వసూలు కాక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. అయినవిల్లి మండలం వెలవలపల్లికి చెందిన పొత్తూరి వెంకట్రాజు(70) బంగారమ్మ (60) దంపతులకు 2014లో దుర్గమ్మ కాలనీలో ఇళ్ల స్థలం ఇచ్చారు. అప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టు తీసుకుంటున్న అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన బొక్కా చిట్టిబాబు వీరికి పరిచయమై వారికి ఇళ్లు నిర్మించాడు. ఈ నేపథ్యంలో వారితో పరిచయాలు పెంచుకుని వారి వద్ద నుంచి నాలుగేళ్ల క్రితం రూ.రెండు లక్షలను అప్పుగా తీసుకున్నాడు. ఒక ఏడాది తీసుకున్న రుణానికి సంబంధించి స్వల్ప వడ్డీ మొత్తాన్ని ఇస్తూ వారికి చుక్కలు చూపించాడు. ఆ తరువాత కనీసం వడ్డీ డబ్బులు కూడా చెల్లించకుండా నానా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో గ్రామ పెద్దలను ఆశ్రయించగా వారి తీసుకున్న రుణాన్ని పది రోజుల్లో చెల్లిస్తానని పంచాయతీ పెద్దలనే నమ్మించాడు. పెద్దల మాటకు విలువ లేకుండా ప్రవర్తించడంతో ఆ వృద్ధ దంపతులు నేరుగా చిట్టిబాబు ఇంటికి వచ్చి తీసుకున్న డబ్బులు ఇవ్వమని, తన కుమారుడికి వైద్యం చేయించాలని కంట తడిపెట్టుకుని వెళ్లేవారు. అయినా అతడి మనస్సు కరగలేదు. దాంతో ఈ నెల 6న ఆ వృద్ధ దంపతులు చిట్టిబాబు ఇంటికి వచ్చి తమ కుమారుడికి వైద్యం కోసం డబ్బులు అవసరమని, తీసుకున్న అప్పు చెల్లించమని కోరడంతో వారి పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించి వారి వద్ద నున్న కాగితాలను సైతం లాక్కొని దుర్భాషలాడాడు. పురుగు మందు సేవించి.. మనస్తాపానికి చెందిన వృద్ధ దంపతులు కూల్డ్రింక్లో పురుగు మందు కలుపుకొని సేవించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన కుమారుడైన జయరాజ్కు తల్లిదండ్రులు వివరించారు. విషయాన్ని తెలుసుకున్న కుమారుడు సంఘటన స్థలానికి చేరుకుని చిట్టిబాబును ప్రశ్నించగా అతడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి అతడి వద్ద నున్న మోటారు సైకిల్ తాళం లాక్కున్నాడు. వైద్య చికిత్స నిమిత్తం తల్లిదండ్రులను అమలాపురం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతున్న బంగారమ్మ ఈ నెల ఎనిమిదో తేదీన మృతి చెందారు. ఆమె అంత్యక్రియలను బంధువులు, స్థానికుల సాయంతో జరిపారు. వెంకట్రాజు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల పదో తేదీన మృతి చెందారు. తండ్రి అంత్యక్రియలను నిర్వహించేందుకు తన వద్ద చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో కుటుంబానికి న్యాయం జరగలేదన్న కారణంతో మృతదేహాన్ని నాలుగు రోజులుగా అంత్యక్రియలు చేపట్టకుండా అమలాపురం శ్మశాన వాటిక వద్దే ఉంచారు. వినాయక చవితి రోజు గురువారం కూడా శవం వద్ద వారు నిరసన కొనసాగించారు. శవాన్ని శ్మశానంలోనే ఫ్రిజర్లో పెట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు. అప్పు తీసుకుని దంపతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, మృత దంపతుల ఏకైక కుమారుడైన కిడ్నీ వ్యాధిగ్రçస్తుడిని ఆర్థికంగా ఆదుకోవాలన్న డిమాండ్లతో బంధువులు నిరసన కొనసాగిస్తున్నారు. దంపతుల ఆత్యహత్యకు కారకుడైన చిట్టిబాబుపై అంబాజీపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయానికి బంధువుల ఆందోళన తీవ్రతరం చేయడంతో అంబాజీపేట, అయినవిల్లి ఎస్సైలు నాగార్జున, షేక్ జానీ బాషాలు శ్మశాన వాటిక వచ్చి బంధువులతో చర్చలు జరిపినా సాయంత్రం వరకూ సఫలం కాలేదు. జయరాజ్కు దిక్కెవరు..? కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు ఇక లేరని తెలిసి జయరాజు కన్నీరుమున్నీరవుతున్నాడు. అతడి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెలా వేలాది రూపాయలు ఖర్చవుతుందని, అతడికి దిక్కెవరంటూ బంధువులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంకట్రాజు, బంగారమ్మల వద్ద నుంచి అప్పుగా తీసుకున్న రూ.రెండు లక్షలతో పాటు కొంత మొత్తం అతడి పేరున బ్యాంకులో వేస్తే జయరాజ్ను ఆదుకునేవారమవుతామనే ఆలోచన నిందితుడు చిట్టిబాబు, పోలీసులకు లేకపోవడం బాధాకరం. దంపతుల ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తి అరెస్టు దంపతుల ఆత్మహత్యకు కారకుడైన చిట్టిబాబును అరెస్టు చేసి, అమలాపురం కోర్టులో హాజరు పరిచామని అంబాజీపేట ఎస్సై కె.వి.నాగార్జున శుక్రవారం తెలిపారు. కోర్టు అతడికి 15 రోజులు రిమాండ్ విధించినట్టు ఆయన వెల్లడించారు. నేడు కోనసీమ క్షత్రియ పరిషత్ ఆందోళన అమలాపురం టౌన్: అప్పు ఇచ్చిన పాపానికి అయినవిల్లి మండలం వెలవెలపల్లికి చెందిన దంపతుల ఆత్మహత్యలపై... ఆ కుటుంబానికి జరగాల్సిన న్యాయం కోసం కోనసీమ క్షత్రియ పరిషత్ శనివారం ఉదయం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగనున్నట్టు ఆ పరిషత్ ప్రతినిధులు శుక్రవారం ప్రకటించారు. అమలాపురం శ్మశానంలో నాలుగు రోజులుగా ఆత్మహత్యలు చేసుకున్న దంపతుల్లో భర్త వెంకట్రాజు మృతదేహంతో నిరసన తెలుపుతున్న వారి బంధువులను కోనసీమ క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు డీవీఎస్ రాజు, మున్సిపల్ కౌన్సిలర్ దంతులూరి మోహనరాజు, పరిషత్ నాయకుడు సయ్యపరాజు సత్తిబాబురాజు తదితరులు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. వెంకట్రాజు మృతదేహాన్ని కూడా పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నుంచి పరిషత్ తరఫున ఆందోళన దిగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అయినవిల్లి ఎంపీపీ సలాది పుల్లయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. దంపతుల ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ: దంపతుల ఆత్మహత్యలు, శ్మశానంలో భర్త మృతదేహంలో నిరసన వంటి సంఘటనలపై పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజ నిర్ధారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీఆర్ అమలదాసు డిమాండ్ చేశారు. అప్పు తీసుకున్న చిట్టిబాబు వల్లే దంపతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
ఏ1 రిసార్ట్స్ యాజమాని లొంగుబాటు
తూర్పుగోదావరి, రంపచోడవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహరంలో దేవరాతిగూడెంలోని ఏ–1 రిసార్ట్స్ యాజమాని బి రమణమహర్షి(బాబ్జి) మంగళవారం రంపచోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు ఏఎస్పీ రాహుల్దేవ్సింగ్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల ఏడో తేదీన దేవరాతిగూడెం ఏ1 రిసార్ట్స్లో యువతులతో కలిసి కొంత మంది పురుషులు నృత్యాలు చేస్తూ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో స్థానిక సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు, ఎస్సై జె విజయబాబు దాడి చేసి విజయవాడకు చెందిన 21 మంది పురుషులను, ఎనిమిది మంది యువతులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఏ1 రిసార్ట్స్ యాజమానిని బుధవారం రంపచోడవరం కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న యువతులకు రంపచోడవరం సీడీపీఓ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న పురుషులు, యువతులకు 41ఏ సీఆర్సీపీ నోటీసులు జారీ చేసి పంపించామన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని చట్ట ప్రకారం చేసినట్టు వెల్లడించారు. ఏజెన్సీలో సేఫ్ టూరిజం అభివృద్ధికి పోలీస్ శాఖ తమ వంతు కృషి చేస్తుందన్నారు. -
అంతా ఆమేనట..
తూర్పుగోదావరి, రామచంద్రపురం: పట్టణంలో గత నెల 26న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చెల్లూరి రాంబాబు మృతి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాంబాబు భార్య క్రాంతి తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీధర్కుమార్ ఆయన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తొలుత రాంబాబు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం రాంబాబు హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చి రాంబాబు భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. రాంబాబు భార్య క్రాంతి ప్రియదర్శినికి పట్టణంలోని శీలంవారిసావరానికి చెందిన కుడిపూడి మోహన్శివసాయికిశోర్తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో తన భర్తను అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడు కిశోర్తో హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫోన్ ద్వారా మాట్లాడుకుంటే విషయం బయటపడుతుందని డమ్మీ ఫేస్బుక్ అక్కౌంట్లను మారు పేర్లు, అమ్మాయిల పేర్లతో ఓపెన్ చేసి మెసెంజర్ ద్వారా మాట్లాడుకుంటూ రాంబాబు హత్యకు కుట్రలు పన్నినట్టు సీఐ తెలిపారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న కిశోర్ పథకంలో భాగంగా గతనెల 25న శనివారం సాయంత్రం పట్టణానికి చేరుకున్నాడు. రాంబాబు నివాసం ఉంటున్న అపార్టుమెంటులోనే భార్య క్రాంతి, కిశోర్లు తాము వేసుకున్న పథకాన్ని అమలు చేశారు. అందులో భాగంగా భార్య క్రాంతి, రాంబాబుకు నిద్ర మాత్రలు ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అపార్ట్మెంట్కు వెళ్లిన కిశోర్తో కలిసి రాంబాబు చేతులు కట్టివేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. ఈ మేరకు వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ శ్రీధర్కుమార్ తెలిపారు. కిశోర్ వద్ద నుంచి రూ.రెండు లక్షలు స్వాధీనంచేసుకున్నట్టు ఆయన తెలిపారు. -
శంఖవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్
తూర్పు గోదావరి, శంఖవరం: శంఖవరం ఎస్సీ పేటలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదంలో బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్ సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సీ పేటలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ రెవెన్యూ, పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల 144 సెక్షన్ శుక్రవారం కూడా కొనసాగింది. ఇరు వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలు జరగకుండా ఎస్సీ పేటలో ప్రతి వీధిలో పెద్దాపురం డీఎస్పీ సీహెచ్ వెంకట రామారావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. మృతదేహాలు అప్పగింత.. సజీవదహనమైన మృతులు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు స్వగ్రామానికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహలను చూసి కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. కుటుంబ సభ్యులతో దహన సంస్కారాలు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలు నిలకడగా ఉండే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎసై.పార్ధసారథి, తహసీల్దార్ ఎం సుజాత వివరించారు. హత్యాకాండకు బాధ్యులైన పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ సీఎచ్వీ రామారావు విలేకర్లకు తెలిపారు. -
ప్రేమ వివాహం.. సజీవ దహనం
వారం కిందట జరిగిన ప్రేమ వివాహం... ఇరు కుటుంబాలను ఒప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు ... బంధు, మిత్రులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు...ఇందుకు వారం రోజుల ముందునుంచీ సందడే సందడి. ఆ రోజు రానే వచ్చింది. ఆ జంటలో ఆనందం ... ఓ వైపు వచ్చీపోయే వారితో ఆ ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే విషాదం...ఇరు వర్గాల మధ్య చిన్నగా ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. కత్తిపోట్ల వరకూ వెళ్లింది. ఇది సహించని ప్రత్యర్థివర్గం కత్తితో దాడి చేసిన అన్నదమ్ములపై దాడికి దిగారు. వారు పారిపోతున్నా వెంట తరిమారు. వారిద్దరూ ఓ ఇంటి గదిలో దాక్కున్న విషయం గమనించి పెట్రోలు పోసి నిప్పంటించడంతో సజీవ దహనమయ్యారు. కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా ... అక్కడే అందరూ ఉన్నా ... ఏ ఒక్కరూ రక్షించే సాహసం చేయలేకపోయారు. తూర్పుగోదావరి, శంఖవరం: శంఖవరం ఎస్సీపేటలో ఇద్దరి వ్యక్తుల సజీవ దహనంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో ఎస్సీపేటలో పులి సుధాకర్, మీరా రాజేంద్రప్రసాద్, హత్యకు గురైన బత్తిన నూకరాజు, ప్రసాద్ మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం డీఎస్పీ సీహెచ్వీ రామారావు, ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో ఎస్సీపేటలో కర్కట నాగేశ్వరరావు కుమారుడు ప్రసాద్, పులి మోజేష్ కుమార్తె శిరీషల ప్రేమ వివాహం సందర్భంగా గురువారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడు తరఫు బంధువులు మృతులు బత్తిన నూకరాజు, ప్రసాద్, పెండ్లి కుమార్తె తరఫున పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్ తదితరులు ఒకరినొకరు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో మృతులు నూకరాజు, ప్రసాద్లు ప్రత్యర్థి వర్గీయులైన పులి సుధాకర్, రాజేంద్రప్రసాద్ల వర్గీయులతో కవ్వింపు చర్యలు దిగి దాడి చేశారు. ఈ దాడిలో సుధాకర్, రాజేంద్రప్రసాద్లను బత్తిన నూçకరాజు, ప్రసాద్లు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ సుధాకర్, రాజేంద్రప్రసాద్ వారి అనుచరులతో కలసి నూకరాజు, ప్రసాద్లను వెంటాడారు. సుధాకర్, రాజేంద్రప్రసాద్ వర్గీయుల నుంచి తప్పించుకోవడానికి ముందుగా బుద్ధాల లోవరాజుకు చెందిన ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఆ ఇంటిపై దాడి చేయడంతో ప్రాణభయంతో మరలా ఎదురుగా ఉన్న పెండ్లి కుమారుడు తండ్రి కర్కాట నాగేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సుధాకర్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఆ ఇంటిని చుట్టుముట్టి గది తలుపులకు తాళాలు వేసి గది పక్కనే ఉన్న కిటికీలోంచి పెట్రోల్ బాటిళ్లు విసిరి నిప్పుపెట్టారు. దీంతో లోపల ఉన్న పర్నీఛర్ అంటుకుని మంటలు చెలరేగి గదిలో దాగి ఉన్న నూకరాజు, ప్రసాద్లు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలంలో వందలాదిమంది ప్రజలు ఉన్నా సుధాకర్, రాజేంద్రప్రసాద్, తదితరులు చేస్తున్న దాడులకు భయపడి వారందరూ పరుగులు తీశారు. గ్రామంలో 144సెక్షన్ విధింపు ఘటనా స్థలానికి పెద్దాపురం ఆర్డీఓ వసంతరాయుడు, తహసీల్దార్ ఎం.సుజాత, పెద్దాపురం డీఎస్పీ సీహెచ్వీ రామారావు చేరుకున్నారు. గ్రామంలో పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. పోలీసుల అదుపులో పలువురి నిందితులు ఈ ఘటనకు సంబంధించి పలువురి నిందితులను పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్, మేరా సుశీల, పులి కృష్ణ, కాపారపు సింహాచలం, కాపారపు నానిబాబు, తదితరులును అదుపులోకి తీసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ సీహెచ్వీ రామారావు తెలిపారు. పూర్తి నేరపరిశోధన జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. భయాందోళనలో ఎస్సీపేట బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్ల హత్యతో శంఖవరం ఎస్సీపేటవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ హత్యాఘటనతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. గ్రామంలో ఈ ఘోర హత్యతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. -
చిచ్చురేపిన చెవిదిద్దులు..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదంలో బుధవారం రాత్రి మోరంపూడి సాయినగర్కు చెందిన లావేటి రాజరాజేశ్వరి(19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏడాదిన్నర క్రితం పెట్రోలు బంకులో పని చేస్తున్న సమయంలో రాజరాజేశ్వరి ఆటోడ్రైవర్ లావేటి మోహన్ల మధ్య స్నేహం ప్రేమగా మారి కొవ్వూరు కృష్ణునిగుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం మోరంపూడి సాయినగర్లోని రేకులో షెడ్డులో కాపురం ఉంటున్నారు. రాజేశ్వరికి తల్లి పోలవరపు వరలక్ష్మి సుమారు నాలుగు గ్రాములు బంగారపు చెవిదిద్దులు చేయించి ఇచ్చింది. అయితే తల్లికి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుమార్తెకి చెందిన చెవిదిద్దులను తీసుకుని వెళ్లి తనఖాపెట్టారు. దీంతో బుధవారం రాజేశ్వరి, మోహన్ల మధ్య ఈ విషయంపై వాగ్వివాదం చోటుచేసుకుంది. రాజేశ్వరి ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో రాత్రి 7.30 గంటలకు ఆమె కుమార్తె ఇంటికి వచ్చి అల్లుడితో మాట్లాడింది. అయితే మోహన్ తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ఆ చెవిదిద్దులు ఇస్తే తనఖాపెట్టి ఇబ్బందులు తొలగించుకుంటానని తెలిపాడు. దీంతో అత్త వరలక్ష్మి ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, తరువాత విడిపిస్తానని తెలిపింది. ఈ లోపు అల్లుడు కోపంతో బట్టల బ్యాగు తీసుకుని ఆటో వేసుకుని వెళ్లిపోయాడు. ఈలోపు తల్లి, తమ్ముడు బయట మాట్లాడుకుండగానే లోపలికి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాజేశ్వరి రాలేదు. దీంతో తల్లి వరలక్ష్మి లోపలికి వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. వెంటనే ఉరి విప్పి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రాజేశ్వరి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. రాజేశ్వరి తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో తహసీల్దార్ కె.పోసిబాబుశవపంచనామా నిర్వహించారు. -
వాట్సప్, ఫేస్బుక్లతో అమ్మాయిలకు వల
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వారికి మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలు కాజేశాడు. కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి బురిడీ కొట్టించాడు. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వారికి టోకరా ఇచ్చిన అంతర్రాష్ర ్ట మాయగాడిని కాకినాడ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 1.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను టూటౌన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ రవివర్మ, టూటౌన్ సీఐ ఎండీ ఉమర్తో కలసి మంగళవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాజమహేంద్రవరం రామచంద్రరావుపేట, 2వ వీధికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష (28) 2009లో సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో చేరాడు. 2013 వరకూ చదివి మధ్యలో మానేశాడు. 2014లో హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరి కొంతకాలం పనిచేసి మానేశాడు. జల్సాలకు అలవాటుపడిన వంశీకృష్ణ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారి ద్వారా మరికొందరు అమ్మాయిలను పరిచయం చేసుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ. 80 లక్షల వరకూ వసూలు చేశాడు. అతని మోసాన్ని గమనించి వారు పోలీసు కేసులు పెట్టగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చి ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. అందులో తన ఫొటోకు బదులుగా మిత్రుడు హర్ష ఫొటోను ఉంచి అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. వారితో వ్యక్తిగత పరిచయాలు పెంచుకొని వారి వివరాలను తెలుసుకొని వాట్సప్ ద్వారా వారి మిత్రులతో పరిచయం పెంచుకొనేవాడు. వారి నుంచి రూ. 2 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 5 లక్షలు తీసుకుంటూ ఆ డబ్బుతో క్రికెట్ బెట్టింగ్, గుర్రప్పందాలు ఆడుతూ జల్సా చేశాడు. అలా రూ. 44 లక్షలు దోచేశాడు. అలాగే రంVýæరాయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆరు నెలల క్రితం మోసం చేసి రూ. 70 వేల నగదు, ఐదున్నర కాసుల బంగారాన్ని తీసుకొని ఉడాయించాడు. దాంతో ఆమె కాకినాడ టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో అప్పటి నుంచి పోలీసులు వంశీకృష్ణ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ ఆరునెలల్లో అతను 25 సిమ్ కార్డులను మార్చి తప్పించుకు తిరిగాడు. చివరకు టౌన్రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం 11 గంటలకు వంశీకృష్ణను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. ముద్దాయి వంశీకృష్ణపై హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్, ఖమ్మం టూటౌన్, నిజామాబాద్ వన్టౌన్, భీమవరం టౌన్, పాలకొల్లు టౌన్, ఆకివీడు, మహబూబ్నగర్, కాకినాడ టూటౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్, కైకలూరు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అమ్మాయిలను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దోచేసిన ముద్దాయి వంశీకృష్ణపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఇటువంటి నేరాలు తరచూ జరుగుతున్నాయని వాట్సప్,ఫేస్బుక్ల్లో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు తెలియని వ్యక్తులకు ఇవ్వవద్దని డీఎస్పీ రవివర్మ సూచించారు. వంశీకృష్ణను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ఉమర్, ఎస్సై జీవీవీ సత్యనారాయణ, ఏఎస్సై పట్టాభి, హెచ్సీ నూకరాజు, రమేష్, కానిస్టేబుల్ నూకరాజులను డీఎస్పీ రవివర్మ అభినందించారు. -
చదివింది డీఫార్మసీ.. బోర్డు మాత్రం ఎంబీబీఎస్
తూర్పుగోదావరి, రంపచోడవరం: విలీన మండలం నెల్లిపాకలో విద్యుత్శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గొర్లె చెల్లారావు హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య గొర్లె హేమలత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేల్చారు. నిందితులు హతుడి భార్య గొర్లె హేమలత, రెడ్డి శివప్రసాద్లను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోలీసులు హత్యకేసు వివరాలు వెల్లడించారు. భర్త చెల్లారావుతో విడిపోయిన హేమలత స్థానిక ఎర్రంరెడ్డి నగర్లో నివాసం ఉంటోంది. విశాఖపట్నం జిల్లా నాతవరానికి చెందిన ప్రైవేట్ వైద్యుడు రెడ్డి శివప్రసాద్ రంపచోడవరంలో ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు క్లినిక్కు వెళ్లడంతో ఆమెతో పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్తను హత్య చేసి అడ్డు తొలగించుకునేందుకు ఇద్దరు కలిసి పథక రచన చేశారు. గత నెల 30న తెల్లవారు జామున భార్య ఇంటికి వచ్చిన చెల్లారావు భార్య ప్రియుడు అక్కడే ఉండడంతో గొడవకు దిగాడు. దీంతో ప్రియుడితో భార్య హేమలత కలిసి చెల్లారావు తలపై తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. అక్కడ సమీపంలోని డ్రైనేజీలో శవాన్ని పడవేశారు. సంఘటన జరిగిన తరువాత ఏఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సై జె విజయబాబు పర్యవేక్షణలో దర్యాప్తు చేసి కేసును చేధించారు. చదివింది డీఫార్మసీ.. బోర్డు మాత్రం ఎంబీబీఎస్, ఎండీ(న్యూరోసర్జన్) నిందితుడు శివప్రసాద్ డీఫార్మసీ చదివినట్టు సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొన్నేళ్లుగా రంపచోడవరంలో ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్నాడని, అతను నిర్వహించే క్లినిక్ వద్ద ఎంబీబీఎస్, ఎండీ (న్యూరోసర్జన్) బోర్డు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఎటువంటి అర్హతలు లేకుండా ఎంబీబీఎస్ అంటూ బోర్డు పెట్టుకుని వైద్య సేవలు చేసిన దానిపై ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వివరాలు అందజేస్తామన్నారు. వారి నివేదిక ఆధారంగా మరో కేసు నమోదు చేస్తామన్నారు. -
ఆస్తి కోసం భార్య హత్య
తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్: కాకినాడ రేచర్లపేటలో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాల్లో భర్త, భార్య పీక కోసి హత్య చేశాడు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న రేచర్లపేటలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో రేచర్లపేటలో విషాదం నెలకొంది. రేచర్లపేటకు చెందిన నరుకుర్తి నాగరాజు, అప్పయమ్మ (65)లు భార్యభర్తలు. అప్పయ్యమ్మ నాగరాజుకు రెండో భార్య. అప్పయ్యమ్మకు పిల్లలు పుట్టలేదు. ఈమె గల్ఫ్లో కొన్నాళ్లు ఉండి డబ్బు సంపాదించగా, నాగరాజు మున్సిపాలిటీలో ఉద్యోగం చేసి పదవీ విమరణ చేశాడు. అప్పట్లో ఇద్దరు కలసి పిఠాపురం మండలం రాపర్తిలో రెండు ఎకరాల భూమి, రేచర్లపేటలో రెండంతస్తుల డాబా ఇల్లు సంపాదించారు. ఈ రెండు కూడా మృతురాలి అప్పయమ్మ పేరున ఉండడంతో అప్పయమ్మ రాపర్తిలో ఉన్న భూమిలో తన మేనల్లుడికి 40 సెంట్ల భూమి ఒకసారి, 50 సెంట్లు భూమి మరోసారి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. ఇది భర్త నాగరాజుకు నచ్చలేదు. నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మిగిలిన భూమిని ఇంటిని తన మేనల్లుడికి రాయించి ఇస్తానని చెబుతుండడంతో సహించలేని నాగరాజు సోమవారం తెల్లవారుజామున అప్పయమ్మ పీక కోసి హత్యచేశాడు. హత్య చేసిన వెంటనే నాగరాజు టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రవివర్మ, టూటౌన్ సీఐ ఎండీ ఉమర్ సందర్శించి పరిశీలించారు. అప్పయమ్మ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ హత్య నాగరాజు ఒక్కరే చేసారా? లేక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ వివరించారు. -
విదేశంలోని భర్తతో వీడియో కాల్, వాయిస్ రికార్డ్..
తూర్పుగోదావరి,అమలాపురం టౌన్: అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులను తాళలేక ఆత్మహత్య చేసుకున్న అమలాపురం విద్యుత్నగర్కు చెందిన కామిశెట్టి అరుణదేవి కేసును పట్టణ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన మూడు నెలలకే ఫ్రాన్స్ దేశంలో ఉన్న భర్త, అత్త మాములు, ఆడపడుచు ఫోన్లతో పెడుతున్న వేధింపులకు విసిగి వేసారిన అరుణదేవి ఆత్యహత్య చేసుకుందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఫ్రాన్స్ లో ఉంటున్న అరుణదేవి భర్త పెరుమాళ్లు, అత్త మామలు, ఆడపడుచు మొత్తం నలుగురిపై డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ కేసులు నమోదు చేశారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు శుక్రవారం విద్యుత్నగర్లో అరుణదేవి ఆత్యహత్య చేసుకున్న గదిని మరోసారి పరిశీలించారు. అలాగే అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న అరుణదేవి మృతదేహాన్ని కూడా పరిశీలించి మరిన్ని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకు వెళ్లకుండా కుంటి సాకులు చెబుతూ అదనపు కట్నం కోసం తమ అల్లుడు పెరుమాళ్లు నిత్యం విదేశం నుంచే ఫోన్లలో తన కుమార్తెను వేధించేవాడని అరుణదేవి తండ్రి వెంకటేశ్వరరావు డీఎస్పీకి వివరించారు. ఆత్మహత్యకు ముందు అరుణదేవి రికార్డు చేసిన వాయిస్ రికార్డు, వీడియో కాల్ చేసిన స్మార్ట్ ఫోన్ పోలీసులు సీజ్ చేశారు. ఆ భార్యాభర్తల ఫోన్ల కాల్ డేటాలను సేకరించి కేసును మరింత వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. విదేశం నుంచి అరుణదేవి భర్త, అత్తమామలు వస్తేనే గాని ఆమెకు అంత్యక్రియలు నిర్వహించబోమని ఆమె కుటుంబసభ్యులు మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి మార్చురీలో ఉంచేశారు. వీడియో కాల్ లైవ్లోనే ఆత్యహత్య: విదేశం నుంచి భర్త రోజూ అదనపు కట్నం కోసం ఫోన్లో ఎంతెలా వేధించినా తల్లిదండ్రులకు అరుణదేవి పూర్తి విషయాలు చెప్పేది కాదు. భర్త నుంచి ఫోన్ వస్తే గదిలోకి వెళ్లి తలుపులు వేసి మాట్లాడేది. బుధవారం రాత్రి తన స్మార్ట్ ఫోన్ నుంచి అరుణదేవి .‘ప్లీజ్ అండి...ఒక్కసారి మాట్లాడండి... మీతో మాట్లాడాలి’ అని వాయిస్ మెసేజ్ చేసింది. అయితే భర్త ‘నేను టైర్ అయ్యాను. ఇప్పుడు మాట్లాడలేన’ని తిరిగి మెసేజ్ పెట్టాడు. దీంతో అరుణ భర్తకు వీడియో కాల్ చేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా మళ్లీ వేధింపు మాటలు రావడంతో ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’నని చెప్పి వీడియో కాల్ను లైవ్లోనే ఉంచి ఆమె ఉరి పోసుకుంది. పెరుమాళ్లు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి ఇండియాలోని అరుణ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ అమ్మాయి గదిలో ఆత్యహత్యాయత్నం చేస్తోంది’ అని సమాచారం ఇచ్చారు. తక్షణమే ఆమె ఉన్న గది తలుపులు తట్టగా అవి గడియ పెట్టి ఉండడంతో పగలగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే అరుణ ఫ్యాన్ కొక్కానికి ఉరితో వేలాడుతూ ఉంది. వెంటనే ఆమెను కిందికి దించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. -
వివాహేతర సంబంధాలా? ఆర్థిక లావాదేవీలా?
రామచంద్రపురం: తాను ఉంటున్న అపార్టుమెంటులో అనుమానాస్పదంగా మృతి చెందిన చెల్లూరి రాంబాబు మృతి మిస్టరీగా మారింది. ఈనెల 26న పట్టణానికి చెందిన రాంబాబు తోటవారివీధిలోని ఒక అపార్టుమెంటులో ముఖమంతా రక్తంతో గాయాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో మృతి చెందాడని చెప్పినా.. శరీరంపై ఉన్న గాయాలతో రాంబాబు హత్యకు గరైనట్టు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన ఐదో రోజు నుంచి పోలీసులు చేపట్టిన దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు రాంబాబు హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చి దర్యాప్తును మొదలెట్టారు. సంఘటన జరిగిన రోజునే రాంబాబు భార్య క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఒకే కోణంలో విచారణ చేయడంపై చూస్తే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. క్లూస్టీం ఎందుకు రాలేదు? సాధారణంగా అనుమానాస్పదంగా మృతి చెందిన కేసుల్లో పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి క్లూస్టీం ను తీసుకువచ్చి ఆధారాలు సేకరిస్తుంటారు. రాంబాబు మృతి విషయంలో సంఘటన స్థలం అపార్ట్మెంట్కు పోలీసులు తాళాలు వేశారే తప్ప క్లూస్టీంను రప్పించలేదు. మృతి చెందిన నాలుగు రోజులకు రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, సీఐ కె శ్రీధర్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అపార్ట్మెంటులో సీసీ కెమెరాలెక్కడ? సంఘటన జరిగిన అపార్ట్మెంట్కు సీసీ కెమెరాలు కూడా లేకపోవడం రాంబాబు మృతి వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలను రాంబాబు సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి వంద మంది వరకు సంచరించే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. అంతేకాదు అపార్ట్మెంట్కు రెండు చోట్ల ఉన్న ద్వారాలకు గేట్లు లేకపోవడంతో రాంబాబును హతమార్చినవారు వెనుక గేటు నుంచి వెళ్లిపోయి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలే కారణమా? హతుడు రాంబాబు కొంతమంది పెద్ద తలకాయలకు బినామీగా ఉన్నాడనే విషయం పలువురు చెబుతున్నారు. జూదం ఆడే కొంత మందికి కార్లు, ఇతర మోటారు సైకిళ్లు తాకట్టు పెట్టుకుని రాంబాబు పెద్ద మొత్తంలో ఫైనాన్స్ చేస్తుంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. రాంబాబుకు ఇటీవల పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టాయని కొంత మంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ఇదే వ్యవహారంపై ద్రాక్షారామలో రాంబాబు ఒక సెటిల్మెంట్ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలే ఆయన హత్యకు దారితీశాయనే అనుమానాలు ఉన్నాయి. తన భార్యతో గొడవలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తప్ప రాంబాబుతో ఆర్థిక లావాదేవీలు జరిపే వారిని విచారించకపోవడం, క్లూస్టీంను రప్పించకపోవడంపై అనుమానాలు బలపడుతున్నాయి. రాంబాబు స్థానిక అధికార పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడు. అధికార పార్టీలో ఉండి కూడా రాంబాబు హత్యకు గురైతే ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంటున్నారనే రాంబాబు సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అనుమానలతో నాలుగు రోజులుగా రామచంద్రపురం పట్టణంలో రాంబాబు హత్య ఉదంతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీధర్ను వివరణ కోరగా దోషులెవరైనా విడిచిపెట్టేది లేదని దర్యాప్తు వేగవంతం చేశామని చెప్పారు. -
పెళ్లయిన మూడు నెలలకే..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత అదనపు కట్నం వేధింపులతో ఆత్యహత్య చేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే విదేశం వెళ్లిన భర్త అక్కడి నుంచి అదనపు కట్నం కోసం ఫోన్లో తరచూ వేధిస్తుండడంతో అమలాపురం విద్యుత్నగర్కు చెందిన కామిశెట్టి అరుణాదేవి(24) తన పుట్టింట్లో ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. యానానికి చెందిన కేవీ పెరుమాళ్లతో అరుణాదేవికి గత మే ఐదోతేదీన అమలాపురంలో వివాహమైంది. పెరుమాళ్లు ఫ్రాన్స్ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజులపాటు ఇండియాలో ఉండి ఆ తర్వాత భార్య అరుణాదేవిని వెంట తీసుకుని వెళ్లకుండా ఆమెను పుట్టింటి వద్దే ఉంచి ఫ్రాన్స్ వెళ్లిపోయాడు. పెరుమాళ్లు తల్లిదండ్రులు కూడా ఉద్యోగాల రీత్యా ఫ్రాన్స్ దేశంలోనే స్థిరపడ్డారు. వెళ్లిన తర్వాత నుంచి పెరుమాళ్లు భార్య అరుణాదేవికి రోజూ ఫోన్ చేస్తూ అదనపు కట్నం కోసం వేధించ సాగాడు. భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు, హైదరాబాద్లో ఉంటున్న అతడి సోదరి కూడా అదనపు కట్నం కోసం ఒత్తిడి తెస్తున్నారని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. తనకు అదనంగా మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు. ఇందులో భాగంగానే భర్త పెరుమాళ్లు నుంచి భార్యకు బుధవారం ఫోన్ వచ్చింది. మళ్లీ అదనపు కట్నం కోసం అరుణాదేవిని ఫోన్లో పదేపదే వేధించడంతో తట్టుకోలేక ఆమె అమలాపురంలోని తన పుట్టింటిలోనే ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుందని సీఐ తెలిపారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచాం.. విదేశంలో ఉద్యోగస్తుడని, అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లిని ఎంతో ఆడంబరంగా చేశామని, పెళ్లయిన మూడు నెలలకే తమ అల్లుడు, అతడి తల్లిదండ్రుల వేధింపులతో మా అమ్మాయిని పొట్టనపెట్టుకున్నారని అరుణాదేవి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. బీటెక్ చదివిన తన కుమార్తెను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానని, చివరకు అదనపు కట్నం కోసం ఆత్యహత్య చేసుకునేలా ఆమె మెట్టింటి వారు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. భర్త, అత్తమామలువిదేశం నుంచి వచ్చాకే.. మృతురాలి తండ్రి రావూరి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. భర్త పెరుమాళ్లతోపాటు అతడి తల్లిదండ్రులు, సోదరిపైనా కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అమలాపురం తహసీల్దార్ బేబీ జ్ఞానాంబ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా చేశారు.అయితే భర్త, అత్తమామలు విదేశం నుంచి వచ్చిన తర్వాతే మృత దేహానికి పోస్టుమార్టం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేయడంతో ప్రస్తుతానికి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. -
పెళ్లికి అడ్డుచెబుతోందని..
తూర్పుగోదావరి, అల్లవరం (అమలాపురం): ప్రేమించిన యువతితో పెళ్లి చేయకుండా, తమ ప్రేమను అడ్డుకుంటోందన్న ఆగ్రహంతో ఆ యువతి తల్లిని దారణ హత్య చేశాడు ఓ యువకుడు. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పొన్నమండ విష్ణుకుమారి(45) దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన ఆమె కుమార్తెను ప్రేమించిన చిలకలపూడి దుర్గాప్రసాదు ఆమెపై చాకుతో దాడి చేసి ఈ హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓడలరేవు మరిడమ్మ సెంటర్ సమీపంలో నివసిస్తున్న విష్ణుకుమారికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె, కుమారుడు ఉన్నారు. హత్యకు పాల్పడ్డ దుర్గాప్రసాద్కు ఇటీవల ఆమె కుమార్తె పరిచయమై, అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల సమక్షంలో వారికి పెళ్లి నిశ్చయించారు. గ్రామంలో విష్టుకుమారికి చెందిన మూడు సెంట్ల స్థలాన్ని, రూ.మూడు లక్షలు కట్నంగా ఇచ్చేందుకు పెద్దలు ఒప్పించారు. అందుకు పెద్దల సమక్షంలో అంగీకరించిన విష్ణుకుమారి కొద్ది రోజులకు అభ్యంతరం తెలిపింది. దీంతో తరచూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. గల్ఫ్ వెళ్లిన దుర్గాప్రసాద్ తన సంపాదనలో కొంత భాగం విష్ణుకుమారికి పంపుతూ ఉండేవాడు. కొంత కాలం తర్వాత అతడు గల్ఫ్ నుంచి సొంతూరు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ముందు ఒప్పుకున్న మాట ప్రకారం తాను ప్రేమంచిన ఆమె కుమార్తెతో పెళ్లి చేయమని అడుగుతుండేవాడు. అయితే దుర్గాప్రసాద్కు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తోంది. కుమార్తెతో పెళ్లి చేయక, గల్ఫ్ నుంచి తాను పంపిన డబ్బులకు సమాధానం చెప్పక విసుగు చెందిన దుర్గాప్రసాద్ ఆగ్రహంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న విష్ణుకుమారిపై చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె పొట్ట, రెండు అరి చేతులు, ఎడమ మోకాలు, పీక, వీపుపై మొత్తం పది చోట్ల చాకుతో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో ఉన్న విçష్ణుకుమారిని ఆమెను మంచంపై ఉన్న బొంతతో సహా గదిలోంచి ఈడ్చుకుంటూ డాబాకు వెనుక అరుగుపైకి తీసుకొచ్చాడు. అరుగు చెంతనే ఉన్న రాడుపై ఆమెను గిరాటు పెట్టినట్టుగా విసిరేశాడు. దీంతో విష్ణుకుమారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్యకు పాల్పడిన దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు సీఐ దేవకుమార్, ఎస్సై డి.ప్రశాంత్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విష్ణుకుమారి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నాడు. కుమార్తె హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుకుంటోంది. ఏడాది క్రితమే మృతురాలి భర్త చనిపోయాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడం... ఇల్లు గ్రామ శివారున కొబ్బరితోటలో ఉండడంతో దుర్గాప్రసాద్ ఈ హత్యను సునాయాసంగా చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏడాది క్రితం తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోవడంతో ఆమె కుమారుడు, కుమార్తె ఇక మాకు దిక్కెవరు...? అంటూ విలపిస్తున్నారు. -
భార్యే హత్య చేసిందా..?
తూర్పు గోదావరి ,రామచంద్రపురం: ముఖమంతా రక్తంతో.. అనుమానస్పదంగా ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన రామచంద్రపురం పట్టణంలో ఆదివారం సంచలనం కలిగించింది. మృతుని బంధువులు, సన్నిహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని తోటవారి వీధికి చెందిన చెల్లూరి రాంబాబు( 38), అదే వీధిలో నివసించే క్రాంతిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. రాంబాబుపై గతంలో రామచంద్రపురం పోలీసుస్టేషన్లో రౌడ్షీట్ నమోదయ్యింది. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని ఎత్తివేశారు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య కాపురంలో గొడవలు ఏర్పడ్డాయి. ఇరువురూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వీరికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అనంతరం స్థానిక తోటవారి వీధిలో గల ఒక అపార్టుమెంట్లో వారు కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం రాంబాబు భార్య క్రాంతి తన భర్త మంచం మీద నుంచి లేవలేదని, నోట్లో నుంచి రక్తం వస్తోందని చెప్పటంతో స్థానికులు అతనిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్థానికంగా ఎస్సై, సీఐలు లేకపోవటంతో ద్రాక్షారామ ఎస్సై సతీష్, మండపేట రూరల్ సీఐలక్ష్మణ రెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. రామచంద్రపురం ఆదనపు ఎస్సై ఆర్. వెంకటేశ్వరరావు మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. మిస్టరీగా మారిన మరణం తాను ఉంటున్న ప్లాట్లోనే మంచంపై నోట్లో రక్తం వస్తూ రాంబాబు మృతి చెందటం మిస్టరీగా మారింది. ఆసుపత్రికి తరలించే సమయానికే రాంబాబు మృతి చెందగా అర్థరాత్రి దాటిన తరువాతనే మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ మంతా రక్తంతో ఉండటం, తాను నిద్రించిన మంచంపైన కూడా రక్తపు మరకలు ఉండటం తో రాంబాబు మృతిపై పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. తన కుమారుడిని కోడలు క్రాంతి చంపేసిందంటూ రాంబాబు తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయటం దీనికి బలం చేకూరుస్తోంది. ఆ డబ్బే కారణమా...? ఈ మధ్య రాంబాబుకు రూ.25లక్షల వరకు చేతికందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ డబ్బుతో తోటవారివీధిలో ఒక స్థలాన్ని రాంబాబు కొనుగోలు చేసేందుకు ఆదివారం అగ్రిమెంటు చేసుకోవాల్సి ఉంది. దాని కోసం రూ.16 లక్షలు తీసుకువచ్చి ఇంట్లో ఉంచినట్టు తెలుస్తోంది. తన పేరునే ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని భార్య క్రాంతి ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి వారిద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చని, అదే రాంబాబు మృతికి కారణం అయ్యి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. కాగా రాంబాబు తెచ్చిన సొమ్ములు మాయమైనట్టు తెలుస్తోంది. పోలీసులు క్రాంతిని, ఇతర కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. -
టిఫిన్ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం చిన్న వంతెన వద్ద గల ఆమని హోటల్ యాజమాని నల్లా సాయిబాబుపై ఓ వ్యక్తి రౌడీయిజం చేయడమే కాకుండా, హత్యాయత్నం చేశాడు. అమలాపురం ఉప్పరకాలనీకి చెందిన కోసూరి ప్రసాద్ అనే వ్యక్తి రోజూ ఆ హోటల్కు వచ్చి టిఫిన్లు తిని డబ్బులు ఇవ్వకుండా ఘరానాగా వెళ్లిపోతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ప్రసాద్ హోటల్కు వచ్చి టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నప్పుడు హోటల్ యాజమాని సాయిబాబు డబ్బులు ఇవ్వమని అడిగారు. నేను లోకల్...నన్నే డబ్బులు అడుగుతావా? అంటూ రౌడీయిజం చేశాడు. అక్కడే ఉన్న స్థానిక మార్కెట్కు చెందిన అమలదాసు గోవిందు అతడిని వారించాడు. అయినా ప్రసాద్ హోటల్ యాజమానిని చంపేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా తన జేబులోంచి బ్లేడ్ తీసి సాయిబాబు పీక కోసేందుకు ప్రయత్నించాడు. సాయిబాబు త్రుటిలో తప్పించుకున్నా అతని ఎడమ బుగ్గ, పెదవి చీరుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అలాతప్పించుకున్న సాయిబాబుపై బ్లేడ్తో దాడి చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తుండడంతో స్థానికులు అతడిని అదుపు చేశా రు. తీవ్ర రక్తస్రావం అదుతున్న సాయిబాబును తక్షణమే అత్యవర వైద్యం కోసం అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడైన హోటల్ యాజమాని సాయిబాబు ఫిర్యాదు మేరకు ప్రసాద్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. కత్తులతోనే కాదు బ్లేడ్తో దాడి చేసినా రౌడీయిజం, హత్యాయత్నానికి పాల్పడినట్టేనని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు అన్నారు. ఎస్సై పి.విజయశంకర్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. -
ఓ అత్త, కూతురు, అల్లుడు..దొంగల ముఠా
తూర్పు గోదావరి, అమలాపురం టౌన్: కారులో వస్తారు.. బంగారు దుకాణాల్లోకి టిప్ టాప్గా వెళతారు. నగలు కొనుగోలు ముసుగులో చాకచక్యంగా నగలు నొక్కేస్తారు. అయితే ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందనే సంగతి మాత్రం వారు గుర్తించరు. ఇలా అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది ఓ దొంగల ముఠా. తీగ లాగితే డొంక కదలినట్టు అమలాపురంలో నాలుగు రోజుల క్రితం ఓ బంగారు దుకాణంలో కొనుగోలుకు వచ్చి బంగారు రూపు దొంగిలించి పట్టుబడడంతో గత ఏడాది వారు చేసిన చోరీ కూడా బయటపడింది. ఈ చోరీలు చేసింది ఓ అత్త, కూతురు, అల్లుడు. హైదరాబాద్ బేగంపేటలో ప్రకాష్నగర్కు చెందిన ఆళ్ల అరుణకుమారి (అత్త), తాడి శ్రీదేవి (కూతురు), తాడి శివ దుర్గారావు (అల్లుడు) ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. వీరి స్వగ్రామం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి. వీరు కొంత కాలంగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈనెల 18న అమలాపురంలోని ఓ నగల దుకాణానికి నగల కొనుగోలు కోసం కారులో వచ్చారు. దుకాణంలోకి వచ్చిన అత్త, కూతురు, అల్లుడు ఏవో నగలు చూస్తున్నట్టు...ధరలు అడుగుతున్నట్టు నటిస్తూనే ఓ బంగారు రూపును చాకచక్యంగా కాజేశారు. దీనిని దుకాణ యాజమాని సీసీ కెమెరా ఫుటేజీలో గమనించారు. అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా చోరీ చేసినట్టు గుర్తించి, ఆ ముగ్గురిని పోలీసులకు అప్పగించారు. కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ ముగ్గురే గత ఏడాది ఏప్రిల్ 22న అమలాపురంలోని మరో నగల దుకాణంలో కొనుగోలు ముసుగులో నగలు కాజేసినట్టు తేలింది. గత ఏడాది చోరీలో వీరు ఆరు జతల బంగారు చెవి దిద్దుల జతలు మాయం చేసినట్లు... ఈనెల 18న జరిగిన చోరీలో ఓ బంగారు రూపు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. వీరు అమలాపురంలో సూర్య జ్యూయలర్స్, ఆదినారాయణ జ్యూయలర్స్ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు నగల దుకాణదారుల ఫిర్యాదుల మేరకు అత్త, కూతురు, అల్లుడిపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.1.53 లక్షల విలువైన బంగారు నగలు, వారు వేసుకుని వచ్చిన మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురినీ మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని అమలాపురం మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ పవన్కుమార్ ముందు హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన మండపేట తహసీల్దార్
తూర్పుగోదావరి , మండపేట: రైతు నుంచి రూ.30 వేలు తీసుకుంటూ మండపేట తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె ఆస్తులపైనా సోదాలు చేయనున్నట్టు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ కథనం ప్రకారం మండలంలోని కేశవరానికి చెందిన రైతు ఉండమట్ల సుబ్బారావు తండ్రి పేరిట ఉన్న 3.59 ఎకరాల భూమిని అన్నదమ్ములు పంచుకున్నారు. ఈ భూమిలో 60 సెంట్లను సుబ్బారావు, అతని తమ్ముడు చెరో 30 సెంట్ల చొప్పున పంచుకున్నారు. గత నెల 20న సుబ్బారావు పాస్బుక్ కోసం తమ్ముడు కుమారుడితో కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేనుకున్నాడు. సర్వే నంబర్ తప్పుగా ఉందంటూ పాస్బుక్ మంజూరుకు తిరస్కరించారు. గ్రామానికి చెందిన వీఆర్ఏ వీర్రాజు తహసీల్దార్ వెంకటలక్ష్మి కారు డ్రైవర్గా పనిచేస్తుండడంతో పాస్బుక్ ఇచ్చేలా చూడాలని సుబ్బారావు అతడిని కోరినట్టు డీఎస్పీ తెలిపారు. అయితే రూ.50 వేలు ఇస్తే పనైపోతుందని తహసీల్దార్ చెప్పినట్టుగా చెప్పాడు. చివరికి రూ.30 వేలకు బేరం కుదిరింది. దీంతో సుబ్బారావు ఈ నెల 17న రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సోమవారం రసాయనాలు పూసిన 15 రెండు వేల రూపాయల నోట్లను సుబ్బారావుకు అందజేశారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటలక్ష్మికి అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుధాకర్, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని కూడా విచారిస్తున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వి.పుల్లారావు, సూర్యమోహనరావు, తిలక్, ఎస్సై నరేష్, ఎక్సైజ్ సీఐ మోహన్రావు పాల్గొన్నారు. విధుల్లో చేరిన రెండు నెలలకే.. రాజమహేంద్రవరం సబ్కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్గా పనిచేస్తున్న వెంకటలక్ష్మి గత జూన్లో మండపేట తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. 2009లో గ్రూపు–2 ద్వారా టీడీగా ఎంపికైన ఆమె కిర్లంపూడి, రాజమహేంద్రవరంలో 2013లో పదోన్నతిపై అంబాజీపేట, రంగంపేట, ఏలేశ్వరం తహసీల్దార్గా బాధ్యతలు నిర్వర్తించారు. -
కొడుకు సహజీవనం.. తల్లిదండ్రుల కిరాతకం
తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్: కొడుకుతో సంబంధం పెట్టుకుందన్న అక్కసుతో ఆ యువకుడి తల్లిదండ్రులు ఒక యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం గురజనాపల్లికి చెందిన రాముల కుమారి కుమార్తె బొడ్డు మల్లేశ్వరికి నాలుగేళ్లు క్రితం రౌతులపూడి మండలం శృంగవరానికి చెందిన మోర్త అప్పారావుతో వివాహమైంది. వారికి రెండేళ్లు పాప ఉంది. కలహాలతో వారు ఏడాదిగా విడిగా ఉంటున్నారు. గురజనాపల్లిలో తల్లి రావుల కుమారి వద్ద ఆమె ఉంటోంది. జగన్నాథపురం రామారావుపేట చినమార్కెట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ బొడ్డు గంగాద్రితో ఆమెకు సంబంధం ఏర్పడింది. గంగాద్రి తల్లిదండ్రులను వదిలి ఆమెతో నాలుగు నెలలు సర్పవరంలో సహజీవనం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇద్దరూ గొడవ పడ్డారు. రెండేళ్ల బిడ్డను, తల్లిని తీసుకొని ఆమె అతడి ఇంటికి వచ్చింది. దీంతో అతడి తల్లిదండ్రులు బొడ్డు కామేశ్వరరావు, అమ్మాజీ వారిని బయట ఉండమని మల్లేశ్వరిని లోపలికి పిలిచారు. ఆమె గొడవ పడుతుండగా ఆగ్రహించిన అతడి తండ్రి ఆమెపై పెట్రోల్ను పోసి నిప్పు అంటించాడు. ఆర్తనాదాలతో కాలుతున్న ఆమె పరుగులు పెట్టడంతో స్థానికులు వారు గోనె సంచులు కప్పి ఆమె రక్షించారు. అప్పటికే 80 శాతానికి పైగా కాలిపోయిన ఆమెను 108 వాహనంలో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో దివ్వాంగురాలైన ఆమె తల్లి నిస్సహాయురాలిగా ఉండిపోయింది. పోలీసులకు మల్లేశ్వరి వాంగ్మూలంగా ఇచ్చింది. కాలిన గాయాలతో ఉన్న ఆమెను కూతురు.. అమ్మాలే అమ్మా, వెళ్లిపోదామని అనడంతో పోలీసులతోసహ చూపరులను కలచివేసింది. ఈ సంఘటనపై ఒన్టౌన్ సీఐ సన్యాసిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగాద్రి తల్లిదండ్రులు అమ్మాజీ, కామేశ్వరరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎవరికైనా చెబితే.. నరకానికి పోతావ్!
‘‘ఇక్కడ జరుగుతున్న విషయాన్ని నువ్వు ఎవరికైనా చెబితే నరకానికి పోతావ్’’ అంటూ.. ఆమెకు నిత్యం నరకం చూపించాడు ఆ మతబోధకుడు. అనారోగ్యంతో ఉన్న ఆమెను స్వస్థతపరుస్తాను.. తన వద్దే ఉంచండంటూ.. ఆమె తల్లిదండ్రులను నమ్మబలికిన ఆ కామ పాస్టర్ ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.చివరికి ఆ పాస్టర్ వికృత చేష్టలకు విసుగుచెందిన ఆ బాలిక ఎట్టకేలకు తల్లిదండ్రులకు చెప్పడం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆ పాస్టర్ను, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలు కాకినాడ నగరంలో చకచకా జరిగిపోయాయి. తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: నగరంలోని పర్లోవపేటకు చెందిన 15 ఏళ్ల బాలికపై హౌస్ ఆఫ్ సాల్వేషన్ పేరుతో చర్చి నడుపుతున్న 54 ఏళ్ల పాస్టర్ తాతపూడి జాషువా నిహార్ ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరునెలలుగా అత్యాచారం చర్చికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నేర్పిస్తానంటూ పర్లోవపేట నుంచి బాలికను రామారావుపేటలోను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఈ కార్యక్రమం దాదాపు ఆరు నెలలుగా జరుగుతోందని బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ‘‘ఎవరికైనా చెబితే నువ్వు నాశనమై నరకానికి పోతావంటూ’’ పాస్టర్ బాలికను బెదిరించి తరచూ అత్యాచారానికి పాల్పడేవాడని బాలిక పోలీసులకు వివరించింది. దీనిపై పోలీసులు పాస్టర్ తాతపూడి జాషువా నిహార్పై పోక్సో యాక్ట్, కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్టు టూటౌన్ సీఐ ఉమర్ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ రవివర్మ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా చర్చి పాస్టర్కు, బాలిక తండ్రికి మధ్య నెలరోజులుగా గొడవలు జరుగుతున్నాయని, చర్చి జరుగుతున్న సమయంలో పాస్టర్పై బాలిక తండ్రి దాడికి యత్నించగా కొందరు విశ్వాసులు అడ్డుకున్నారని స్థానికులు చెబుతున్నారు. తనపై చర్చి పాస్టర్తో పాటు మరికొందరు కావాలని కక్షపూరితంగా దాడి చేసి గాయపరిచారని, దీంతో తాను జూలై 21న పోర్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని బాలిక తండ్రి వివరిస్తున్నారు. ఏడాదిగా జాషువా నిహార్ చర్చికి వెళుతున్నామని, అతడు పిల్లలను ఆసరాగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్నారు. పాస్టర్, ఓ మహిళ అరెస్టు బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న జాషువా నిహార్ను అతనికి సహకరిస్తున్న ఓ మహిళను కూడా టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ ఆదివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. బాలిక అనారోగ్యంగా ఉండడంతో ఆమె తల్లి ప్రార్థనా మందిరానికి తీసుకు వచ్చేదని, తొందరగా కోలుకునేందుకు అవసరమైన ప్రార్థనలు చేస్తానని పాస్టర్ జాషువా నిహార్ బాలిక తల్లిని నమ్మబలకడంతో ఆమె బాలికను పాస్టర్ ఇంటికి సువార్త కోసం పంపేదని వివరించారు. ఇదే అదనుగా పాస్టర్ నిహార్ బాలికపై అత్యాచారం చేసేవాడన్నారు. ఈనెల ఏడోతేదీన బాలిక తనపై జరుగుతున్న అత్యాచారాన్ని బయట పెట్టిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పాస్టర్ను అరెస్టు చేశామన్నారు. బాలికను తీసుకెళ్లేందుకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ సంఘటనలో పాస్టర్కు సహకరించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు చేపడతామని డీఎస్పీ రవివర్మ స్పష్టం చేశారు. -
ప్రేమించిన యువతి బంధువులే హత్య చేశారు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: యువకుడు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్పై మృతి చెందిన ఘటనపై రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కథనం ప్రకారం.. ఆల్కట్ తోటకు చెందిన రేగుళ్ల అరుణ్ కుమార్(22) రాజమహేంద్రవరం బాలాజీ పేట రైల్వే ట్రాక్ పై అనుమానాస్పదంగా మృతి చెందాడు. యువకుడు ఆల్కట్ తోట ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తుండగా.. నాలుగు నెలల క్రితం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో యువకుడిని చంపుతామని బెదిరించిన యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హతమార్చి రైల్వే ట్రాక్పై పడేశారని యువకుడి తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. అరుణ్ కుమార్ తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోవడంతో తల్లి జీవీకే విద్యుత్ ప్లాంట్లో కేటరింగ్ పని చేస్తూ తన ముగ్గురి పిల్లల్ని పోషిస్తోంది. మృతి చెందిన అరుణ్ కుమార్ రెండో వాడు కాగా, అతడు టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మిగిలిన ఇద్దరూ సెంటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతదేహం, తలపైన మూడు చోట్ల గాయాలుండడం, అలాగే నొసటి పైనా గాయం ఉండడం, కాలిపై నుంచి రైలు చక్రం ఎక్కి నుజ్జునుజ్జుకావడంతో బంధువులు ఆ యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆల్కట్ తోటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జీఆర్పీ ఎస్సై సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో తల్లడిల్లుతున్న తల్లి ఎదిగి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో మృతుడి తల్లి, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. -
గోదారమ్మ ఒడి... కన్నీటి జడి...
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం: రోడ్డు–కమ్–రైలు వంతెన ఆత్మహత్యలకు నిలయంగా మారింది. క్షణికావేశంలో పలువురు ఇక్కడ నుంచి గోదావరి నదిలోకి దూకి ప్రాణాలు పోగోటుకుంటున్నారు. తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా... అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిండు ప్రాణాలకు నూరేళ్లు నిండిపోతున్నాయి. పుష్కర ఘాట్లో కూడా ఆత్మహత్యలు, ప్రమాదాల వల్ల ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. సకాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పోలీసులు, స్థానికులు రక్షించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ప్రేమికుల పెళ్లికి పెద్దలు నిరాకరించడం... క్రికెట్ బెట్టింగ్లో అప్పుల పాలై బుకీల వత్తిడి తట్టుకోలేక.. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై.. చదువులో వెనకపడామని విద్యార్థులు ఇలా అనేకనేక కారణాలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంపై విరక్తి చెందిన వారు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత జూన్లో ఒక యువకుడు ఇంజినీరింగ్ వరకూ చదివి ఒక ప్రైవేటు కంపెనీలో ఎంపికై రోడ్డు కమ్ రైలు వంతెన పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబంలో నిరాదరణకు గురైన వృద్ధులు, మోసపోయిన యువతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు సరేసరి ధరలు పెరిగిపోవడంతో ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరగకపోవడంతో అనేకమంది మానసికంగా కుంగిపోతున్నారు. గతంలో ఏటా 10 శాతం ఖర్చులు పెరిగితే.. ప్రస్తుతం కుటుంబ పోషణకే విపరీతమైన ఖర్చు అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే సంసార జీవితంలో వారిమధ్య అవగాహన రాహిత్యం ఏర్పడి వచ్చే వివాదాలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని వారు అంటున్నారు.పిల్లలకు భారం అయ్యామన్న వేదనతో వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆఫీసులలో వత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయని వారు చెబుతున్నారు. సమస్యకు చావే పరిష్కారం కాదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా చావే పరిష్కారం కాదని, ఆశావాద దృక్పథం అలవరుచుకుంటే ఆ సమస్య ఎప్పుటికైనా పరిష్కారమవుతుందంటున్నారు. ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు భరోసా ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. ఆత్మహత్యలకు రెండు కారణాలు.. ఆత్మహత్యలకు రెండు కారణాలు ఉంటాయని మానసిక నిపుణులు అంటున్నారు. కుటుంబంలోని కలహాలు, నిరాదరణ వల్ల.. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. గుర్తింపు లేదనో, లేక కుటుంబంలో తమను ఎవరూ లెక్క చేయడం లేదన్న భావనలో ఉన్న వారు ఉన్నారు. మెదడులోని కెరోటిన్ డాక్యుమెన్ అనే గ్రంధి వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని చెబుతున్నారు. మూడేళ్లలోఆత్మహత్యల వివరాలు 2015లో గోదావరిలో 32 మంది మృతి చెందారు. వీరిలో 12 మంది ఆత్మహత్యలకు పాల్పడగా మిగిలిన వారు ప్రమాదవ శాత్తు మృతి చెందారు. 2016లో 31 మంది మృతి చెందగా 16 మంది వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారు.మిగిలిన 15 మంది వివిధ ప్రమాదాల్లో మృతి చెందారు. 2017లో 39 మంది మృతి చెందగా వారిలో 14 మంది ఆత్మహత్య చేసుకోగా మిగిలిన 25 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 20 మంది వరకూ మృత్యువాత పడ్డారు. వీరిలో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న వారి కదలికలపై దృష్టి పెట్టాలి ఒంటరిగా ఉంటున్న వారిపై కుటుంబ సభ్యులు దృష్టి పెట్టాలి. సాధారణంగా వారిని కుటుంబ సభ్యులు పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒంటరిగా ఉన్నవారి సమస్యలు అడిగి తెలుసుకుని ఆవి తీరే మార్గాలు అన్వేషించాలి. సమస్యను రేపైనా పరిష్కరించుకోవచ్చుననే భరోసాను కుటుంబ సభ్యులు కల్పించాలి. అప్పుడే మనోధైర్యంతో వారు ఆత్మహత్యలు చేసుకోవడం అనే అలోచన నుంచి బయటపడతారు.– డాక్డర్ హిప్నో కమలాకర్, కౌన్సెలింగ్ సైకాలజిస్టు -
చున్నీతో గొంతు నొక్కి హత్య
తూర్పుగోదావరి, రంపచోడవరం: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే పాశవికంగా హత్య చేసిందో ఇల్లాలు. రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరం వద్ద జరిగిన ఈ హత్యను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. స్థానిక సీఐ బీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్సై జె.విజయబాబు బుధవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. వడ్డి ఇమ్మానియేల్, దేవి దంపతులు రాజమహేంద్రవరం సమీపంలోని హుకుంపేటలో నివాసం ఉండేవారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. ఇమ్మానియేల్ తాపీ పని చేస్తాడు. కొండ్రుతు శివ కూడా తాపీమేస్త్రీ. ఇద్దరూ కలిసి పనికి వెళ్లేవారు. దేవి పిల్లలను స్కూల్కు తీసుకువెళ్లే క్రమంలో ఆమెకు శివతో పరిచయం పెరిగింది. అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులుగా ఇమ్మానియేల్ దంపతుల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. తరచూ ప్రశ్నలతో వేధిస్తుండడంతో ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు శివకు చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి ఎలాగైనా ఇమ్మానియేల్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. అమలు చేసిందిలా.. జూలై 26న రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ సెంటర్కు రావాలని ఇమ్మానియేల్ను శివ కోరాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గోకవరం మీదుగా రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. గోకవరంలో కొనుగోలు చేసిన మద్యాన్ని తాగారు. తరువాత శివ గోకవరం వెళ్లి హతుడి భార్య దేవిని ఘటనా స్థలానికి తీసుకు వచ్చాడు. ‘నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్’ అంటూ ఇమ్మానియేల్ భార్యను ప్రశ్నించాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే ఇమ్మానియేల్ మద్యం మత్తులో ఉన్నాడు. దేవి, శివలు కలిసి ఇమ్మానియేల్ గొంతు నొక్కి చున్నీతో గట్టిగా చుట్టడంతో మృతి చెందాడు. తర్వాత నిందితులిద్దరూ నరసాపురం వద్ద కొనుగోలు చేసిన పెట్రోల్ పోసి శవాన్ని తగలబెట్టారు. హత్య కేసును ఛేదించింది ఇలా.. ఘటనా స్థలంలో దొరికిన హతుడి సెల్ఫోన్ హంతకులను పట్టించింది. ఆ ఫోన్లో సిమ్ కార్డు లేదు. సెండ్ ఐటమ్స్లో ఒక్క నెంబరు ఉండడంతో, ఆ నంబర్కు పోలీసులు ఫోన్ చేశారు. పశ్చిమ గోదావరి పోలవరం ప్రాజెక్ట్ వద్ద గుమాస్తాకు ఆ ఫోన్ వెళ్లడంతో పోలీసులు అతడికి విషయం చెప్పారు. ఆ గుమాస్తా హతుడి వివరాలను పోలీసులకు తెలిపారు. దీంతో బొమ్మూరు పోలీసుల సహాయంతో హత్యకు గురైన ఇమ్మానియేల్ ఇంటికి రంపచోడవరం పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో దొరికిన బ్రాందీ సీసాపై ఉన్న లేబుల్ను బట్టి ఎక్సైజ్ శాఖ సహకారంతో ఆ మద్యం బాటిల్ ఎక్కడ కొనుగోలు చేశారో పోలీసులు తెలుసుకున్నారు. గోకవరం బ్రాందీ షాపులో ఆ బాటిల్ కొన్నట్టు తెలియడంతో అక్కడి సీసీ టీవీ పుటేజీలను వారు పరిశీలించారు. నిందితుడు, హతుడు ఇద్దరూ కలిసి మద్యం కొనుగోలు చేసినట్టు తేలింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు బుధవారం శివను, దేవిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. తల్లిని చూడాలనడంతో... నిందితురాలైన దేవిని పోలీసులు అరెస్టు చేయడంతో పిల్లలు ఆమెపై బెంగ పెట్టుకున్నారు. దీంతో వారి పెద్దమ్మ పిల్లలను రంపచోడరవం పోలీస్ స్టేషన్కు బుధవారం తీసుకు వచ్చింది. -
కొంపముంచిన వాట్సప్ పోస్టింగ్
తూర్పుగోదావరి ,కాజులూరు (రామచంద్రపురం): దొంగిలించబడిన పాప తమ వద్ద ఉందని, తల్లిదండ్రులకు తెలిసేలా ఈ విషయాన్ని పది మందికీ పంపాలంటూ వచ్చిన ఓ పోస్టింగ్ను ఇతరులకు పంపడమే ఆమె నేరమైంది. ఆకతాయిలు వక్రీకరించి ఇతరులకు పోస్టింగ్ పెట్టడంతో లేని పాపను తీసుకు రమ్మంటూ ఇప్పుడు అధికారులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది. వివరాల్లోనికి వెళితే గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తున్న టి. వరలక్ష్మికి కొన్నిరోజుల క్రితం ఆమె సెల్ ఫోన్కు ఒక వాట్సప్ పోస్టింగ్ వచ్చింది. ఐదు నెలల వయసున్న పసిపాపను ఎవరో దొంగిలించి ముష్టి చేస్తుండగా, తాము పట్టుకున్నామని, పాప తమ వద్ద ఉందని, ఈ విషయం పాప తల్లిదండ్రులకు చేరేలా పది మందికీ పోస్టు చెయ్యాలంటూ కింద రెండు సెల్ఫోన్ నెంబర్లు ఇస్తూ వాట్సప్ పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆ పోస్టింగ్ను తన సెల్ఫోన్లో ఉన్న కొందరికి పంపింది. ఆపై ఎవరో ఆకతాయిలు ముష్టిచేస్తున్న వారి నుంచి పట్టుకున్న పాప గొల్లపాలెం అంగన్వాడీ టీచరు వరలక్ష్మి వద్ద ఉందంటూ పోస్టింగ్కు జతచేస్తూ ఇతరులకు పంపించారు. ఆకతాయిలు పెట్టిన పోస్టింగ్ ఒక సెల్ ఫోన్ నుంచి మరో సెల్ఫోన్కు వెళుతూ చివరకు జిల్లా అధికారులకు కూడా చేరింది. ఆ పాపను స్వాధీనం చేసుకొమ్మని కలెక్టరేట్ నుంచి కాజులూరు తహసీల్దార్కు, ఐసీడీఎస్ నుంచి అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ అధికారులు పాపను అప్పగించాలని అంగన్వాడీ టీచరు వరలక్ష్మిని డిమాండ్ చేస్తున్నారు. ఎవరో వాట్సప్ మెజేస్ పెడితే మానవతా దృక్పథంతో తిరిగి ఇతరుకు వాట్సప్ చేశానని లేని పాపను తీసుకు రమ్మంటే ఎలా తీసుకురాగలనని వరలక్ష్మి లబోదిబోమంటోంది. జరిగిన ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరలక్ష్మికి వచ్చిన వాట్సప్ పోస్టింగ్లోని నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని గొల్లపాలెం ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. -
ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి
తూర్పుగోదావరి ,కాజులూరు (రామచంద్రపురం): ఓ కానిస్టేబుల్ తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగించాడంటూ గొల్లపాలెం పోలీసు స్టేషన్ ఎదుట ఒక యువతి మంగళవారం ఆందోళనకు దిగింది. బాధితురాలు, నిందితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శలపాకకు చెందిన వాకపల్లి నాగబాబు ఇండియన్ టిబెట్ బోర్డర్ ఫోర్స్లో కానిస్టేబుల్గా హర్యానాలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పోలినాటి సంధ్య, నాగబాబు ప్రేమించుకుంటున్నారు. సంధ్య కాకినాడలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతుంది. ఈ క్రమంలో జూలై 23న సంధ్యతో కలిసి నాగబాబు బైక్పై వెళుతున్నారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికీ గాయాలయ్యాయి. దీంతో వారి ప్రేమ సంగతి తెలుసుకున యువతి కుటుంబీకులు ఇరువురికీ వివాహం చేయమని నాగబాబు కుటుంబీకులను అడిగారు. నాగబాబు ఆసుపత్రి నుంచి వచ్చాక మాట్లాడదామంటూ అతడి తల్లిదండ్రులు విషయాన్ని దాటవేశారు. దీంతో సంధ్య కుటుంబీకులు జూలై 29న కాకినాడ వెళ్లి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నాగబాబు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని తలంచాడు. అదే రోజు రాత్రి శలపాక గ్రామానికే చెందిన దడాల పద్మశ్రీ అనే మరో అమ్మాయిని తుని చర్చిలో వివాహం చేసుకున్నాడు. దీంతో సంధ్య మంగళవారం తన బంధువులతో వచ్చి గొల్లపాలెం పొలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. ఎస్సై షేక్ జబీర్ ఆందోళనకారులను శాంతింపజేసి నిందితుడు నాగబాబును పోలీసు స్టేషన్కు రప్పించారు. తాను ముందు నుంచీ దడాల పద్మశ్రీనే ప్రేమిస్తున్నానని జూలై 14న తమ ఇద్దరికీ వివాహమైందంటూ అబద్ధం చెప్పాడు. సంధ్య ఆరోపించినట్టుగా తమ విహహం జూలై 29న జరగలేదని, ఆ రోజు తాను గాయాలతో ఆసుపత్రిలో ఉన్నానని నిందితుడు ఫొటోలు, ఇతర ఆధారాలు చూపి, పోలీసులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు, అతడి స్నేహితుల సెల్ఫోన్లు సేకరించిన ఎస్సై షేక్ జబీర్ ఇరు వర్గీయులను విచారించారు. బాధితురాలు జూలై 29న ఎస్పీకి ఫిర్యాదు చేశాక, అదే రోజు రాత్రి నిందితుడు దడాల పద్మశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ సమయానికి అతడికి అంత తీవ్రమైన గాయాలు లేవు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు సెల్ఫోన్లో తీసిన ఫొటోలు బయట పెట్టారు. దీంతో నిందితుడు నాగబాబు తాను చేసిన మోసాన్ని అంగీకరించాడు.దీంతో నాగబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై షేక్ జబీర్ చెప్పారు. -
ఆ బంధాన్ని ప్రశ్నించిందని భార్య హత్య
తూర్పుగోదావరి, జగ్గంపేట: వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఇంటికి రాకుండా ఆమె వద్దే ఉంటున్నాడని తెలుసుకున్న భార్య ఇదేమిటని ప్రశ్నించడమే ఆమె తప్పైంది. భార్య నిలదీయడాన్ని తప్పుగా భావించిన భర్త కర్కసుడై ఆమె ప్రాణాలు బలిగొన్న ఘటన జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాజమహేంద్రవరం సమీపంలోని శాటిలైట్ సిటీకి చెందిన కుడిపూడి కళావతి (35) సోమవారం మధ్యాహ్నం భర్త బాపిరాజు చేతిలో హత్యకు గురైంది. శాటిలైట్ సిటీలో నివాసం ఉండే బాపిరాజు, కళావతి దంపతులకు పాప, బాబు సంతానం. బాపిరాజు జగ్గంపేటలోని ఒక హోటల్లో వంట మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జగ్గంపేట పెట్రోల్ బంక్ వెనక వీధిలో అద్దెకు ఉండే ఓ మహిళతో అతడికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికిదారి తీసింది. శాటిలైట్ సిటీలోని ఇంటికి ఎక్కువగా వెళ్లకుండా స్థానికంగా పరిచయమైన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భర్తపై అనుమానం వచ్చి విచారించిన కళావతికి నిజం తెలిసింది. సోమవారం ఉదయం ఆమె నేరుగా జగ్గంపేటలో భర్త అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి పరిశీలించింది. ఆ సమయంలో బాపిరాజు ఒంటరిగానే ఉన్నాడు. వివాహేతర సంబం«ధంపై బాపిరాజును ఆమె గట్టిగా నిలదీసింది. ఇరువురి మధ్య వా గ్వాదం చోటుచేసుకోవడంతో సహనం కోల్పోయిన బాపిరాజు భార్య మెడను గట్టిగా పట్టుకుని గొంతు పిసికి హత్య చేశాడు. అనంతరం అతడు జగ్గంపేట పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. సీఐ కాశీవిశ్వనాథం, ఎస్సై అలీఖాన్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు తీసి చూడగా ముక్కు, నోటి నుంచి రక్త స్రావంతో కళా వతి మృతదేహం కనిపించింది. ఎస్సై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు. బాపిరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని సీఐ తెలిపారు.