expensive
-
షారూఖ్ ఖాన్ చేతికి అరుదైన గోల్డ్ వాచ్.. ధర ఎంతో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనిపించారు. ఆ సమయంలో ఆయన చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇంతకీ అది ఏ బ్రాండ్ వాచ్ అని చాలామంది సెర్చ్ చేయడం కూడా మొదలెట్టేసారు.షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్.. ఆడేమర్స్ పిగుఎంట్ (Audemars Piguet) బ్రాండ్ అని తెలుస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఎందుకంటే ఇలాంటి వాచీలు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 250 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 76 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కనిపించిన షారుఖ్ ఖాన్.. నలుపు రెండు డ్రెస్సులో ఆకర్షణీయంగా కనిపించారు. ఈయన చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించి ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాచ్ ప్రత్యేకతలుషారుఖ్ ఖాన్ చేతికున్న ఆడేమర్స్ పిగుఎంట్ వాచ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది 18 క్యారెట్ల సాండ్ గోల్డ్తో తయారైనట్లు తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉంది. View this post on Instagram A post shared by SHAH RUKH KHAN (@shahrukh__khan__fanclub)షారుఖ్ ఖాన్ వాచ్ కలెక్షన్నటుడు షారుఖ్ ఖాన్ వద్ద ఆడేమర్స్ పిగుఎంట్ బ్రాండ్ వాచ్ మాత్రమే కాకుండా.. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ క్రోనోగ్రాఫ్ 5968ఏ, పాటెక్ ఫిలిప్పే నాటిలస్ 58811/1జీ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ ఆఫ్షోర్ 2640ఐపీఓ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ పర్ఫెటుల్ క్యాలెండర్, బెల్గరి ఆక్టో రోమా టూర్బిల్లాన్ సఫైర్ 103154, ట్యాగ్ హ్యూయర్ క్యాలిబర్ 1887 స్పేస్ఎక్స్, ట్యాగ్ మొనాకో సిక్స్టీ నైన్ సీడబ్ల్యు911 వంటి ఖరీదైన వాచీలు చాలానే ఉన్నాయి.ఇదీ చదవండి: 80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే.. -
పెళ్ళి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?
ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది.కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నాఇంకేం కావాలి. ఇదీ చదవండి: గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!‘సీతారాముల్లా ఉండండి!‘ అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? ‘పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!‘ అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు. -
జుకర్బర్గ్ చేతికి అరుదైన వాచ్: ధర అన్ని కోట్లా?
ప్రపంచ ధనవంతులలో ఒకరు, మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) ఇటీవల ఓ ఖరీదైన, అరుదైన వాచ్ కట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వాచ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.మార్క్ జుకర్బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9,00,000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ ధర కోట్లలో ఉండటం వల్ల దీనిని కొనొగోలు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఈ వాచ్ కలిగిన కుబేరుల జాబితాలో జుకర్బర్గ్ ఒకరు.గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్'హ్యాండ్ మేడ్ 1' (Hand Made 1) అనేది విలాసవంతమైన, ఖరీదైన వాచ్ల జాబితాలో ఒకటి. దీనిని ప్రఖ్యాత స్విస్ వాచ్మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని తక్కువ సంఖ్యలో (ఏడాదికి రెండు లేదా మూడు) మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.మార్క్ జుకర్బర్గ్ ఖరీదైన వాచ్లు కట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన పటెక్ ఫిలిప్, ఎఫ్పీ జర్న్ వంటి బ్రాండ్ వాచ్లను కట్టుకుని కనిపించారు. కాగా ఇప్పుడు గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్తో కనిపించారు. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ ధరించిన వాచ్ మీద పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.మార్క్ జుకర్బర్గ్ ఖరీదైన గడియారాన్ని కట్టుకోవడం వెనుక ఏమైనా ఆలోచన ఉందా? అని ఒకరు అన్నారు. ఫేస్బుక్ సత్యం, వాస్తవాలపై దృష్టి పెట్టాలని మరొకరు పేర్కొన్నారు. ఈ వాచ్ ఖరీదు చాలామంది ఇళ్ల ఖరీదు కంటే ఎక్కువ అని ఇంకొకరు అన్నారు. ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.వాచ్ల మీద అమితాసక్తి కలిగిన మార్క్ జుకర్బర్గ్.. అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ల వివాహానికి హాజరైనప్పుడు కూడా వాచ్ల ప్రస్తావన వచ్చింది. జుకర్బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన విలాసవంతమైన గడియారాన్ని మెచ్చుకోవడానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్అనంత్ అంబానీ వాచ్ముకేశ్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ ఇటీవల రూ. 22 కోట్ల విలువైన వాచ్ కట్టుకుని కనిపించారు. ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. -
అనంత్ చేతికి అరుదైన వాచ్: ప్రత్యేకతలివే..
కొంతమందికి కార్లంటే ఇష్టం, మరికొందరికి బైకులు, ఇంకొందరికి వాచీలు. ఇలా ఎవరి అభిరుచి వారిది. అయితే వాచీలను ఎక్కువగా ఇష్టపడే వారిలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ' (Anant Ambani) కూడా ఒకరు. గతేడాది 'రాధికా మర్చెంట్'ను (Radhika Merchant) పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన అనంత్.. ఇటీవల ఓ ఖరీదైన వాచ్ ధరించి కనిపించారు.అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఏకంగా రూ. 22 కోట్లు అని తెలుస్తోంది. ఇది ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ మాత్రమే కాకుండా అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి ఇతర బ్రాండెడ్ వాచీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ ప్రత్యేకతలుఒకే పీస్తో తయారైన ఈ వాచ్ మధ్య భాగంలో ఒక పుర్రె ఆకారం.. క్రాస్బోన్ ఉండటం చూడవచ్చు. దీని కింద వంతెనల లాంటి నిర్మాణాలను చూడవచ్చు. ఇవన్నీ ఖరీదైన మెటల్తో రూపొందించడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది నీలం రంగులో ఉండటం కూడా గమనించవచ్చు, ఇది ఐస్ క్యూబ్ మాదిరిగా ఉంటుంది.అనంత్ అంబానీఅనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు. అనంత్ జూలై 12, 2024న రాధిక మర్చంట్ను పెళ్లి చేసుకున్నారు. ఈయన వద్ద ఖరీదైన వాచీలు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు.. అనంత్ అంబానీ తోబుట్టువులు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
జోరుగా.. హుషారుగా వసూళ్లు : ప్రీ వెడ్డింగా? ప్రీ వేస్టింగా!
పెళ్లంటే..పందిళ్లు, బాజాలు, భజంత్రీలు, బంధువుల, విందు భోజనాలు...ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది. వివిధ రకాల ఫోటోషూట్లు వీటి స్థానాన్ని ఆక్రమించాయి. నేటి యువత పెళ్లి కంటే ప్రీ వెడ్డింగ్కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. వీటితోపాటు పెళ్లి, రిసెప్షెన్ డ్రస్సులకు కూడా వేలు, ఒక్కోసారి లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్కు తమ చుట్టుపక్కల చూడదగిన రమణీయమైన ప్రాంతాలకు వెళ్లడం లేదా ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం చేస్తున్నారు.కాబోయే జంటలను తీసుకెళ్లడానికి కార్లు, భోజనం మొదలుకుని బస చేయడానికి హోటళ్లు, గెస్ట్ హౌస్లలో గదుల బుకింగ్ పనులన్నిటినీ ఫొటోగ్రాఫర్లే చూసుకుంటారు. కొందరు ప్రీ వెడ్డింగ్కు రూ.25 వేల నుంచి 35 వేలు చార్జీలు తీసుకుంటుండగా మరికొందరు రూ.50–75 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత హై ఫై సౌకర్యా లు కావాలంటే ఏకంగా రూ.90 వేల వరకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్మేనేజర్లకు డిమాండ్ పెరిగింది. (ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!)ఎంతైనా తగ్గేదేలే... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి కనీసం మూడు, నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలు భాజాభజంత్రీలు, బ్యాండ్ల మోతలతో బారాత్లు(పెళ్లి ఊరేగింపులు) తీస్తున్న దశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే ఇంటి గుమ్మం ముందు లేదా ఖాళీ స్థలాల్లో జరిగేవి. కాని కాలం మారడంతో వాటికి స్వస్తి పలికి ఏసీ, నాన్ ఏసీ పంక్షన్ హాళ్లలో చేస్తున్నారు. ఫలితంగా హాళ్లకు డిమాండ్ పెరిగింది.ఇందుకోసం ఫొటోగ్రాఫర్లకు ఎంత చార్జీలు చెల్లించేందుకైనా వెనకాడడం లేదు. అయితే ఇది తమ తల్లిదండ్రులకు అదనపు భారంగా పరిణమిస్తుందని వధూవరులు గ్రహించలేక పోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫొటోగ్రాఫర్లు, మ్యూజిక్ బ్యాండ్లు, సంప్రదాయ సంగీత వాద్య బృందాలకు కూడా డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్లుగా.... అమ్మాయిల కొరత కారణంగా గత రెండు, మూడేళ్లుగా పెళ్లిళ్లు ఎక్కువ శాతం జరగలేదు. దీనికి తోడు ముహూర్తాలు కూడా ఎక్కువగా లేకపోవడంవల్ల చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువ ఉండడంవల్ల ఎక్కడ చూసిన పెళ్లి సందడి కనిపిస్తోంది. ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే రిజర్వై పోయి ఉండటంతో అందుబాటులో ఉన్న స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్లు, క్రీడా మైదానాలలో కూడా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఒకప్పుడు ముహూర్తాలు చూసుకుని ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునేవారు. (చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!)కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఏ రోజు హాలు ఖాళీ ఉందో ఆరోజు ముహూర్తం పెట్టుకోవల్సిన పరిస్ఠితి వచి్చంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, బాంక్వేట్ హాళ్లలో వేడుకలకు ఖర్చు తక్కువ కావడంతోపాటు బంధువులకు భద్రత, విలువైన వస్తువులకు రక్షణ ఎక్కువ. కానీ గ్రౌండ్లలో, ఖాళీ మైదానాలలో పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సిఉంటుంది. భారీ వేదిక, చుట్టుపక్కల, పైన టెంట్లు నిర్మించడం, గాలికి దుమ్ము, ధూళి లేవకుండా మైదానంలో కార్పెట్లు వేయడం, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలు, సిరీస్ లైట్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా స్ధలం కేటాయించడం, విలువైన వస్తువులు దొంగతనానికి గురికాకుండా కాపాడుకునేందుకు, బిచ్చగాళ్లు, బయట వ్యక్తులు వచ్చి భోజనం చేయకుండా చూసేందుకు ప్రైవేటు సెక్యురిటీ గార్డులను నియమించడం... ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని.మరోపక్క డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని లౌడ్స్పీకర్ల యజమానులు, బ్రాస్ బ్యాండ్ నిర్వాహకులు, బారాత్లకు అద్దెకిచ్చే ఓపెన్ టాప్ కార్లు, మెర్సిడీస్ బెంజ్ వాహనాలు, గుర్రపు బండ్ల యజమానులు అడ్డగోలుగా చార్జీలు పెంచేశారు. మేకప్కు కూడా లక్షల్లోనే... ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తైతే వధూవరులు అనవసరంగా చేస్తున్న ప్రీ వెడ్డింగ్, మేకప్ ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. వధూవరులతోపాటు బంధువుల మేకప్కు సైతం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి విన్నారా..?. ఈ ఫ్యాబ్రిక్ ఒక మీటర్ ఖరీదే దాదాపు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. ఇది మార్కెట్లో దొరకడం కూడా కష్టమే. ఖరీదు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. ఏంటి ఈ ప్యాబ్రిక్ విశిష్టత..?. ఎందుకంత ఖరీదు అంటే..ఈ ఫ్యాబ్రిక్ ఉన్నిని దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో ఉండే వికునా అనే ఒక విధమైన ఒంటె నుంచి సేకరిస్తారట. అందువల్లే ఈ ఫ్యాబ్రిక్ని వికునా అని పిలుస్తారు. దీనితో టానీ అనే కోటులు డిజైన్ చేస్తారట. ఏదో గొర్రెల మాదిరి పెంపుడు జంతువుగా ఈ ఒంటెలను పెంచడం సాధ్యం కాదట. అలాగే ఈ ఒంటె నుంచి ఉన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సేకరించగలరట.అలాగే ఇవి తక్కువ ఉన్నినే ఉత్పత్తి చేస్తాయట. ఆండియాన్ ఎత్తైన పర్వతాల్లో ఉండే చలి నుంచి రక్షణగా ఆ ఒంటెలపై ఈ మృదువైన ఉన్ని ఉంటుందట. ఇది గాలిని ఏ మాత్రం చొరబడనీయకుండా శరీరానికి హత్తుకుపోయేల వెచ్చగా ఉంచుతుందట. అలాగే వికునాల నుంచి ఉన్నిని సేకరించడానికి చాలా సమయం పడుతుందట కూడా. అత్యంత జాగ్రత్తలు తీసుకుని చాలా ఓపికతో ఆ జంతువు నుంచి ఉన్నిని సేకరించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఎవరు ధరిస్తారంటే..రాయల్టీకి చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్ని ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు ధరిస్తారు. అయితే ప్రస్తుతం స్పానిష్ ఆక్రమణతో ఈ జంతువుల అంతరించిపోయే జంతువులు జాబితాలో చేరిపోయిందని చెబుతున్నారు ప్యాషన్ నిపుణులు. అదీగాక ఈ జంతువుల పెంపకం సాధ్యం కానీ పని అయితే వాటి నుంచి ఉన్నిని సేకరించడం అనేది కూడా అత్యంత క్లిష్టమైన పని అందువల్లే ఈ ఉన్ని ఒక మీటరు ముక్క ధర సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందని చెబుతున్నారు ఫ్యాషన్ ఔత్సాహికులు.ఇప్పటి వరకు అత్యం లగ్జరియస్ ఫ్యాబ్రిక్లు అయిన మెరినో, కష్మెరె వంటి ఉన్ని దుస్తులు కంటే ఇదే అత్యంత ఖరీదైనది. అయితే మెరినో, కష్మెరె వంటివి అందుబాటులో ఉన్నంత ఈజీగా ఈ వికునా ఫ్యాబ్రిక్ ఉన్ని దొరకడం బహు కష్టం. ఈ ఉన్నితో చేసిన కోటు ధర రూ. 17 లక్షలకు పైనే ఉంటుందట. లోరో పియానా, బ్రియోని, కిటాన్తో సహా పలు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ హౌస్ల్లో ఈ వికునా కలెక్షన్స్ ఉంటాయట.(చదవండి: మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!) -
ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!
పులస చేపకే పుస్తెలమ్ముకోవాలనుకునే మన జనాలు ఈ పీత ధర వింటే ఏకంగా ఆస్తులకు ఆస్తులే అమ్మేసుకోవాలనుకుంటారు. జపాన్లో దొరికే ఈ అరుదైన పీత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పీత. సముద్రంలో మూడువందల మీటర్లకు పైగా లోతులో మాత్రమే ఇది దొరుకుతుంది. అంత లోతున వేటాడినా, అదృష్టం బాగున్న వేటగాళ్ల వలలకే ఇది చిక్కుతుంది. అందుకే దీనికి అంత ధర. దీనిని ‘మాత్సుబా క్రాబ్’ అని, ‘స్నో క్రాబ్’ అని అంటారు.ఈ పీత మాంసం చాలా రుచిగా ఉంటుందట! సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ పీతలు వలలో చిక్కినప్పుడు వాటిని వేలంలో అమ్ముతారు. గత ఏడాది నవంబర్లో ఒక మత్స్యకారుడి వలలో ఈ రకం పీత చిక్కింది. వేలంలో అమ్మితే, 1.2 కిలోల బరువు ఉన్న ఈ పీతకు ఏకంగా 10 మిలియన్ యెన్లు (రూ.58 లక్షలు) ధర పలికింది. జపాన్లోని రెస్టారెంట్లలో ఈ పీతలను సన్నగా తరిగి వేయించి ‘కనిసుకియాకి’, గంజిలో ఉడికించి ‘జోసుయి’, గ్రిల్డ్ క్రాబ్ వంటి వంటకాలను తయారు చేస్తారు. వీటిని ఆరగించేందుకు డబ్బున్న బడాబాబులు ఎగబడుతుంటారు. -
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..?
ప్రపంచంలోని చూడచక్కని దీవుల్లో ఇదొకటి. ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. దీవి తీరం దాటి లోపలకు వెళితే, పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ ఎలాంటి కట్టడాలూ కనిపించవు. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి పేరు ‘పామీరా’ దీవి.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. ప్రస్తుతం ఇది అమెరికా అధీనంలో ఉంది. ఈ దీవి గురించి న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు అమెరికా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 27.26 మిలియన్ డాలర్లు (రూ.228.49 కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకుంది.ఈ దీవి అమెరికా ప్రభుత్వం అధీనంలోకి వచ్చినా, ఇక్కడ మనుషులెవరూ ఉండరు. దీనికి గల చీకటి చరిత్రే అందుకు కారణం. ఈ దీవి అందానికి ముగ్ధులైన కొందరు ఔత్సాహికులు ఇదివరకు అప్పుడప్పుడూ వచ్చేవారు. వారిలో కొందరు అంతుచిక్కని కారణాలతో మరణించారు. మరికొందరు ఎలాంటి ఆచూకీ లేకుండా గల్లంతైపోయారు. అందువల్ల ఈ దీవి ఎంత అందంగా ఉన్నా, ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా ఇక్కడ అడుగుపెట్టాలంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అయితే, అప్పుడప్పుడు కొందరు శాస్త్రవేత్తలు బృందాలుగా ఇక్కడకు వచ్చి, పరిశోధనలు జరిపి వెళుతుంటారు. వారు కూడా ఇక్కడ రాత్రివేళల్లో బస చేయరు.ఇది కిరీటం కాదు.. లైటర్!చూడటానికి కిరీటం పైభాగంలా కనిపిస్తోంది గాని, నిజానికి ఇది సిగార్ లైటర్. ఇందులో విశేషమేంటనేగా మీ అనుమానం? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగార్ లైటర్. మిగిలిన లైటర్ల మాదిరిగా ఇదేమీ తేలికపాటి లైటర్ కాదు. దీని బరువు దాదాపు అరకిలో ఉంటుంది. దీని తయారీకి 400 గ్రాముల మేలిమి బంగారం, 41 కేరట్ల బరువు గల 152 అరుదైన నీలాలను ఉపయోగించారు.ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘ఎస్.టి.డ్యూపాంట్’ ఈ సిగార్ లైటర్ను ‘లూయీ గీఐఐఐ ఫ్లర్ డి పార్మ్’ పేరుతో హాంకాంగ్ వ్యాపారవేత్త స్టీఫెన్ హంగ్ ఆర్డర్పై 2013లో ప్రత్యేకంగా తయారు చేసింది. దీని తయారీ కోసం ఎనబై మంది నిపుణులైన స్వర్ణకారులు ఆరునెలల పాటు అహర్నిశలు శ్రమించారు. దీని ధర 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.19 కోట్లు).అయితే, షోకేసులో అలంకరించుకోవడానికే తప్ప తేలికగా వాడుకోవడానికి అనువుగా లేకపోవడం దీని లోపం. అందుకే, ఇదే కంపెనీ వాడుకోవడానికి అనువుగా ఉండే పరిమాణంలో ఇదే నమూనాలో నీలాలు పొదిగిన బంగారంతో తయారు చేసిన చిన్న లైటర్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి 15,900 డాలర్లు (రూ.13.33 లక్షలు) -
రూ.34 లక్షల వాచ్.. కేవలం 49 మందికే (ఫోటోలు)
-
హాట్ టాపిక్గా అనంత్ అంబానీ పెళ్లి : అతి విలాసవంతమైన పెళ్లిళ్లు ఇవిగో!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కనీవినీ ఎరుగుని రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. ఇంట్లో జరిగిన చివరి వివాహం కావడంతో దేశ విదేశీలకు ప్రముఖులతో అంత్యంత ఆడంబరంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. దీంతో ఈ వివాహ వేడుక ప్రపంచంలో ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.నిశ్చితార్థం మొదలు, రెండు ప్రీవెడ్డింగ్వేడుకలు, ముంబైలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అతిథుల ఆహ్వానం దగ్గర్నించీ, ఆతిథ్యం, వారికి అందించిన బహుమతులు ప్రత్యేక ప్రదర్శనలు, విందు ఇలా ప్రతీదీ ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ పెళ్లి వేడుకల్లో కొత్తదంపతులతో సహా అంబానీ కుటుంబ మహిళలు ధరించిన కోట్లాది రూపాయల విలువ చేసే దుస్తులు, వజ్రాభరణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. లైవ్మింట్, ది ఎకనామిక్ టైమ్స్ , ఔట్లుక్ అంచనా ప్రకారం ఈ వివాహ వేడుకల మొత్తం ఖర్చు 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా.ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వివాహాలలో చోటు దక్కించుకున్న బ్రిటీష్ యువరాణి డయానా ప్రిన్స్ చార్లెస్ల వంటి దిగ్గజ వివాహాల ఖర్చు రూ. 1,361 కోట్లను, షేక్ హింద్ బింత్ బిన్ మక్తూమ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ల ఖర్చులను రూ. 1,144 కోట్లుగా అధిగమించినట్టే. 1981, జూలై 29న అప్పటి ప్రిన్స్ చార్లెస్ , లేడీ డయానా వివాహం లండన్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్లో రాయల్ వెడ్డింగ్ అత్యంత ఘనంగా జరిగింది. 3,500 మంది వ్యక్తులు ప్రత్యక్షంగా చూసారు, అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 750 మిలియన్ల మంది ప్రజలు దీనిని టీవీలో వీక్షించారు. 10వేల, 25 అడుగుల పొడవుతో తయారు చేసిన అప్పటి యువరాణి డయానా వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్. 1979లో దుబాయ్ రాయల్ వెడ్డింగ్లో షేక్ మహ్మద్ తన కజిన్ షేఖా హింద్ను వివాహం చేసుకున్నాడు. వారం రోజుల పాటు అత్యంగ ఘనంగా ఈ వేడుకలు జరిగాయి.2004లో సహారా గ్రూప్కు చెందిన సుబ్రతో రాయ్ తన కుమారుల కోసం డబుల్ వెడ్డింగ్ సందర్భంగా లక్నోను విలాసవంతమైన ఏర్పాట్లతో ముంచెత్తారు. ఆరు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో 11వేల మంది అతిథుల హాజరయ్యారు. వీరి పెళ్లి ఖర్చు రూ. 550 కోట్ల రూపాయలట.2023, నవంబర్లో మేడ్లైన్ బ్రాక్వే , జాకబ్ లాగ్రోన్ల వెడ్డింగ్ "శతాబ్దపు వివాహం"గా పేరొందింది. ఈ వివాహానికి దాదాపు 59 మిలియన్ల డాలర్లు అంటే రూ. 489 కోట్లు ఖర్చయ్యాయి. పారిస్లోని వెర్సైల్లెస్ ప్యాలెస్లో విలాసవంతంగా ఈ వివాహం జరిగింది.2011లో కేట్ మిడిల్టన్ , ప్రిన్స్ విలియం రాజ వివాహం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ పెళ్లికి 43 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. 1,900 మంది అతిథులతో వెస్ట్మిన్స్టర్ అబ్బేలో జరిగిన ఈ ఈవెంట్ను ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు, కామన్వెల్త్ దేశాల్లో వేడుకలు జరిగాయి.2018లో, అమెరికన్ నటి మేఘన్ మార్క్లేతో ప్రిన్స్ హ్యారీ వివాహం బ్రిటీష్ రాయల్ వివాహం విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో జరిగిన వేడుకకు అనేక మంది ప్రముఖులు మరియు రాయల్టీతో సహా 600 మంది అతిథులు హాజరయ్యారు. ఇండియాకు చెందిన ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం ఆ జాబితాలో మరొకటి. 2004లో వనీషా మిట్టల్- అమిత్ భాటియా నిశ్చితార్థ వేడుక పారిస్లోని వెర్సైల్లెస్ ప్యాలెస్లో జరగగా, వివాహం చాటౌ వెక్స్లో జరిగింది. ఈ వివాహానికి సుమారు 66 మిలియన్ డాలర్లు రూ. 547 కోట్లు ఖర్చయిందట.2018, డిసెంబరు 12న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ -ఆనంద్ పిరమల్ వివాహ జరిగింది.ఈ వివాహానికి సుమారు 15 మిలియన్లు డాలర్లు అంటే రూ. 110 కోట్లు ఖర్చయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్, భారతీయ రాజకీయ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.2006, ఫిబ్రవరి 18 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మోడల్ ప్రియా సచ్దేవ్ వివాహం హోటల్ వ్యాపారి విక్రమ్ చత్వాల్తో మూడు నగరాల్లో 10 రోజుల పాటు వైభవంగా జరిగింది.26 దేశాల నుండి 600 మంది అతిథులు ఆహ్వానం, ప్రైవేట్గా చార్టర్డ్ విమానాలలో తరలించారు. అతిథి జాబితాలో బిల్ క్లింటన్, మోడల్ నవోమి క్యాంప్బెల్, అప్పటి భారత-పీఎం మన్మోహన్ సింగ్, లక్ష్మీ మిట్టల్ తదితరులు హాజరైనారు. 50,000 కిలోల పువ్వులు, 3వేల కొవ్వొత్తులు , ఇతర వస్తువులతో అలంకరించిన మొఘల్-కోర్ట్ శైలిలో ఈ వివాహం జరిగింది. పెళ్లికి 20 మిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ పెట్టుబడి బ్యాంకర్ మార్క్ మెజ్విన్స్కీని ల గ్రాండ్ వెడ్డింగ్ 2010లో ఆస్టర్ కోర్ట్స్లో జరిగింది. ఖర్చు 5 మిలియన్లు డాలర్లు. (దాదాపు రూ. 40 కోట్లు).ఇంకా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తన ప్రతిభను చాటుకుంటున్న ప్రియాంక చోప్రా ,నిక్ జోనాస్ 2018,డిసెంబర్ 1 న వివాహం చేసుకున్నారు ఐదు రోజుల పాటు వీరి వివాహం రాజస్థాన్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో జరిగింది. ఈ జంట కేవలం హోటల్స్కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లి తర్వాత ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది. -
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూర్లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500. -
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
కుబేరుల బిడ్డలు : ఘనమైన బహుమతులు, వీటి విలువ తెలుసా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 4 నెలల మనవడు గ్రాహ్కు రూ. 240 కోట్ల విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే సెలబ్రీటీలు తమ వారసులకు ఏయే ఖరీదైన గిఫ్ట్లు వార్తల్లో నిలిచాయి. నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి , అపర్ణ కృష్ణన్ల కుమారుడైన ఏకగ్రాహ్కు సుధా,మూర్తి దంపతులకు మూడో మనవడు . యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి వీరి పెద్ద కుమార్తె. అక్షత, రిషీలకు కృష్ణ , అనౌష్క అనే ఇద్దరు పిల్లలున్నారు. అంబానీ పెద్ద కోడలి గిఫ్ట్ ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు అంబానీ పెద్ద కోడలు కూడా ఖరీదైన బహుమతి దక్కించుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. రూ. 451 కోట్ల విలువైన మౌవాద్ ఎల్' నెక్లెస్ను నీతా అంబానీ కోడిలికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. కుమారుడికి పుట్టినరోజుకి పూనావాలా గిఫ్ట్ ఏంటంటే.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, DC కామిక్ పుస్తకాన్ని పోలిన బ్యాట్మొబైల్ను తన కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. 2015లో తన కుమారుడి 6వ పుట్టినరోజు సందర్భంగా, అదార్ పూనావల్ల తన Mercedes-Benz S-క్లాస్ని బ్యాట్మొబైల్ మోడల్లో తీర్చిదిద్దేలా చేశారు.ఈ మార్పులు పూర్తి చేయడానికి ఆరు నెలలకు పైగా పట్టిందట. శివ నాడార్ కూడా ప్రముఖ టెక్ సంస్థ హెసీఎల్ ఫౌండర్ పౌండర్, ఛైర్మన్ శివ్ నాడార్ 2014లో తన ఏకైక కుమార్తె రోష్ని కోసం ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. తూర్పు ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీలోని ఈ బంగ్లా విలువ రూ. 115 కోట్లు. ఇషా అంబానీ ట్విన్స్ కోసం ఇషా అంబానీ వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న ఇషా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖేష్ అంబానీ , నీతా అంబానీ ఏకైక కుమార్తె, ఇషా అంబానీ 2018లో బిలియనీర్ ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి సందర్భంగానే అజయ్ పిరమల్ స్వాతి పిరమల్ దంపతులు ఇషా , ఆనంద్ పిరమల్లకు ముంబైలోని ‘గులిటా’ అనే ఒక విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.450 కోట్లు అని సమాచారం. అలాగే ఇషా, ఆనంద్ దంపతులు ట్విన్స్ పుట్టిన సందర్భంగా అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన అల్మారాను బహుమతిగా ఇచ్చారు. 2022లో పుట్టిన కృష్ణ-ఆదియాలకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం విశేషం. బిల్గేట్స్ ముద్దుల బిడ్డ కోసం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ బిల్ గేట్స్ తన కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నాసర్పై తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. బిల్ గేట్స్ తన కూతురికి 277 కోట్ల రూపాయల విలువైన 124 ఎకరాలగుర్రపు ఫారమ్ను బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్లో ఉన్న ఈ గుర్రపు ఫారమ్ను ఎవర్గేట్ స్టేబుల్స్ అంటారు.ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత తన కుమార్తె రైడింగ్ కెరీర్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. -
రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' ఇప్పుడు మరో ఖరీదైన కారు 'ఆర్కాడియా డ్రాప్టైల్'ను వెల్లడించింది. ఈ కారు ధర సుమారు రూ. 209 కోట్లు. దీనిని కంపెనీ సింగపూర్లోని ఒక ప్రైవేట్ వేడుకలో వెల్లడించారు. రోల్స్ రాయిస్ ఆర్కాడియా అద్భుతమైన డిజైన్ కలిగి చాలా వరకు వైట్ పెయింట్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్ టబ్, ముందు భాగంలో బ్లాక్ కలర్ వంటి వాటిని పొందుతుంది. ఇది ఇతర డ్రాప్టెయిల్ల మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉండటం గమనించవచ్చు. రెండు డోర్స్, రెండు సీట్లు కలిగిన ఈ కారులో శాంటాస్ స్ట్రెయిట్ గ్రెయిన్ రోజ్వుడ్ ఎక్కువగా ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు తయారీలో సుమారు 233 చెక్క ముక్కలను ఉపయోగించినట్లు, దీనిని రూపొందించడానికి 8000 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినట్లు సమాచారం. డ్యాష్బోర్డ్లో రోల్స్ రాయిస్ క్లాక్ ఉంది. కేవలం దీనిని తయారు చేయడానికే.. రెండు సంవత్సరాల రీసర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారులోని ట్విన్ టర్బోచార్జ్డ్ 6.75 లీటర్ వీ12 ఇంజిన్ కలిగి 601 హార్స్ పవర్ 841 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్వుడ్ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..
ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు, కీటకాలు ఉంటాయి. అందులో కొన్నింటిని మనం ఆహారంగా తీసుకుంటాం. కొన్ని మన ప్రాణాలకు ప్రమాదకరం. అయితే ఒక కీటకం ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవడం విశేషం. దీని ధర ముందు బీఎండబ్ల్యూ, ఆడీ కార్లకు కూడా బలదూర్ అనిపించేలా ఉంది. అయినా ఒక కీటకం ఎందుకు అంత ధర పలుకుతుంది? దాని వల్ల ఉపయోగం ఏంటీ..? అంటే.. స్టాగ్ బీటిల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. ఇది కేవలం 2 నుంచి 3 అంగుళాల సైజులో ఉంటుంది. చెత్తలో ఉండే ఈ కీటకాన్ని జపనీస్ పెంపకందారుడు ఏకంగా 65 లక్షలుకు విక్రయించాడు. ఇప్పుడు అది ఏకంగా కోటి పైనే పలుకుతోందట. ప్రజలు కూడా ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేయడానికి కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి, ఇందులో దాదాపు 1,200 రకాల కీటకాలు ఉన్నాయి. ఈ భూమిపై ఉన్న అత్యంత వింతైన చిన్న కీటకం ఇది. చూడటానికి నల్లగా ఉండి తల నుంచి పొడుచుకు వచ్చిన కొమ్ముల ఉంటాయి. చెత్తలో ఉండే స్టాగ్ బీటిల్స్ కుళ్లిన కలపలోన ద్రవాలు, పండ్లరసం, చెట్ల రసం వంటి వాటినే ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా ద్రవాల మీద ఆధారపడతాయి. ఎందుకంటే ఇవి తినలేవు. ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఇది స్టాగ్ బీటిల్ అని వాటి తలపై ఉన్న కొమ్ముల ఆధారంగా గుర్తిస్తారట. అయితే వీటిని వివిధ రకాల మందుల తయారీలో వినియోగిస్తారు. అందువల్లే ఇది అంత ఖరీదు. వీటిలో మగ స్టాగ్ బీటిల్స్ పెద్ద దవడలు కలిగి ఉండగా, ఆడవారి దవడలు, మగవారి కంటే బలంగా ఉంటాయి. ఇక ఆడ స్టాగ్ బీటిల్స్ తరచుగా నేలపైనే కనిపిస్తాయి. ఎందుకంటే..? గుడ్డు పెట్టేందుకు ఎల్లప్పుడూ నేలపై సంచరిస్తుంటాయి. అయితే ఈ కీటకాలు పెద్దవి అయిపోయాక గట్టి చెక్కను తినలేవట. దాంతో లార్వా కాలంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడతాయి. శీతల వాతావరణం స్టాగ్ బీటిల్స్కు తగినది కాదు, ఎందుకంటే..? ఇది లార్వా ప్రక్రియను పొడిగించగలదు. శీతాకాలంలో చాలా కీటకాలు చనిపోతాయి, కాబట్టి వెచ్చని ప్రదేశాలు వాటికి ఉత్తమమైనవి. దీన్ని ఎక్కువగా ప్రమాదకరమైన వ్యాధులకు మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారట. అందువల్లే బీఎండబ్ల్యూ, ఆడీ కార్లను తలదన్నేలా అత్యంత ధర పలుకుతోంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉండటం బాధకరం. (చదవండి: చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్లో పురుగుల కలకలం! అలాంటివి వెంటనే తిరిగిచ్చేసి ఉచితంగా మరొకటి..) -
రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు?
ఒక సాధారణ సైకిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 20,000 రూపాయలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కనిపించే సైకిల్ ధర మాత్రం ఏకంగా రూ. 32 లక్షలు. సైకిల్ ఏంటి? రూ. 32 లక్షలు ఏంటి? అని చాలామంది ఒక్కసారిగా షాకవొచ్చు! అయితే మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూసెయ్యండి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'బుగాటీ' (Bugatti) కంపెనీ 'పీజీ ఎక్స్' తయారు చేసింది. ఇది చూడటానికి సాధారణ సైకిల్ మాదిరిగా అనిపించినప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది బుగాటీ చిరోన్ కారు నుంచి ప్రేరణ పొంది ఖరీదైన మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్లను ఉపయోగించి తయారైంది. 2017 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో కనిపించిన ఈ పీజీ ఎక్స్ బుగాటీ కేవలం 667 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీని ధర రూ. 39000 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 32 లక్షల కంటే ఎక్కువ). ఈ సైకిల్ తయారీలో అగ్రశ్రేణి స్పోర్ట్స్ ఆటోమొబైల్స్, నాసా, ఏరోనాటిక్ దిగ్గజాలలో ఉపయోగించే హై-ఎండ్ మెటీరియల్స్ ఉపయోగించారు. ఈ సైకిల్ను 95 శాతం అధిక శక్తి కలిగిన కార్బన్ ఫైబర్తో తయారు చేశారు, కాబట్టి ఇది ఐదు కిలోల కంటే తక్కువ బరువును కలిగి ఉంది. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో ప్రపంచంలో అత్యంత ఖరీదైన, తక్కువ బరువున్న సైకిల్ బహుశా ఇదే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఒక సీటు కలిగిన ఈ సైకిల్ సింగిల్ వీల్ బ్రేక్ మాత్రమే కలిగి ఉంటుంది. పీజీ బుగాటీ సైకిల్ కార్బన్ ఫ్రేమ్ను ఫార్ములా వన్ కార్లను తయారు చేసే అదే కార్మికులు తయారు చేశారు. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువ. -
అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ
భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కుబేరులు ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఓ ఖరీదైన కారుని వారికంటే ముందే, హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది. హైదరాబాద్ వాసి 'హర్షిక రావు' ఇటీవలే రూ. 2.55 కోట్ల లోటస్ ఎలెట్రే ఎలక్రిక్ కారును కొనుగోలు చేసి, ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: నీతా అంబానీ వాడే ఫోన్ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే? పవర్ట్రెయిన్ విషయానికి వస్తే.. Eletre అండ్ Eletre S మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. Eletre R మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 22 kWh AC ఛార్జర్ కూడా పొందుతుంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం..!
ఎన్నో రకాల ఖరీదైన కాఫీల గురించి విని ఉంటారు. కానీ ఇలాంటి కాఫీని చూసి ఉండరు, విని ఉండరు. అవును దీన్ని ఎంత వెరైటీగా సర్వ్ చేస్తారంటే..అంతకుముంచి దాన్ని సిప్ చేయడం ఓ సవాలు. ఇదేంటి? అంత ఖర్చుపెట్టుకుని తింటే..మళ్లీ ఇదేం తిరకాసు అనుకుంటున్నారా!. అయితే ఆ కాఫీ కహానీ ఏంటో చూసేద్దాం!. కోల్డ్ కాఫీ, డార్క్ కాఫీ అంటూ మార్కెట్లో పలు రకాల కాఫీకేఫ్లు కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసిన కాఫీలు వందకు మించి ఖరీదు ఉండదు. మహా అయితే అది ఏ ఫైవ్ స్టార్ హోటల్ అయితే తప్ప కళ్లుబైర్లు కమ్మేలా అంతంత రేంజ్ ధరలు ఉండవు. అలాంటిది ఈ కాఫీ ధరలోనే కాదు దీన్ని సర్వ్ చేసే విధానం కూడా భలే విచిత్రంగా ఉంది. ఆ కాఫీని నేరుగా ఐస్క్రీం కోన్లో పోసి సర్వ్ చేస్తారు. పైగా ఓ అందమైన కళాకృతులతో ఈ కాఫీని అందిస్తారు ఫెన్స్టర్ అనే కేఫ్లో. ఈ కేఫ్ ఆస్ట్రియాలోని వియాన్నలో ఉంది. దీని ధర మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 865/-. ఆ ఐస్క్రీం కోన్ కూడా నోరూరించేలా చాక్లెట్ లేయర్డ్ కోన్. దీనిలో మంచి రుచికరమైన కాఫీని అది కూడా ఓ మంచికళాకృతిలో సర్వ్ చేస్తారు. అయితే ఆ కాఫీ తాగడం ముగిసేలోపు ఆ కోన్ తినకుండా కంట్రోల్ చేసుకుంటూ తాగాలి ఓ పక్కన కోన్ నానకూడదు. లేదంటే అంత ఖర్చు చేసిన కాఫీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా!. ఐడియా అదుర్స్ కదా!. అంతేకాదండోయ్ ఆ కాఫీ యజమానికి ఏడాదికి ఈ కాఫీకి సంబంధించి సుమారు ఒక లక్షకు పైనే ఆర్డర్లు వస్తాయట. అక్కడ ఈ పానీయాన్ని చాలామంది ఇష్టంగా తాగుతుంటారని సదరు కాఫీ యజమాని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Fenster Cafe (@fenstercafe) (చదవండి: నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!) -
అత్యంత ఖరీదైన పెట్ డాగ్స్ (ఫోటోలు)
-
అత్యంత ఖరీదైన మొక్కలు ధర మీకు తెలుసా..? (ఫోటోలు)
-
రూ.167 కోట్ల కారులో కనిపించిన 'శామ్ ఆల్ట్మన్' - వీడియో వైరల్
గత నెలలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచిన ఓపెన్ ఏఐ(OpenAI) సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' ఇటీవల ఓ ఖరీదైన కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో కనిపించే ప్రత్యేకమైన సూపర్కార్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథనంలో ఆ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. వెల్థినెక్స్జెన్ ఇన్స్టాగ్రామ్లో కనిపించే వీడియోలో అత్యంత ఖరీదైన 'మెక్లారెన్ F1' సూపర్ కారును చూడవచ్చు. 1992లో ప్రారంభమైన ఈ కారు ధర భారతదేశంలో రూ. 167 కోట్ల కంటే ఎక్కువే. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఒకటి కావడం గమనార్హం. శామ్ ఆల్ట్మాన్ తన మెక్లారెన్ ఎఫ్1 సూపర్కార్లో కాలిఫోర్నియాలోని ఫ్యూయెల్ స్టేషన్ వద్ద ఉంటడం వీడియోలో చూడవచ్చు. వెర్మిలియన్ రెడ్ కలర్లో కనిపించే ఈ కారు సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారుని స్వయంగా ఆల్ట్మాన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. మెక్లారెన్ ఎఫ్1 నిజానికి కారు అనగానే అందులో కనీసం నలుగురు కూర్చోవడానికి సీట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ కనిపించే మెక్లారెన్ ఎఫ్1 మూడు సీట్ల కారు. మధ్యలో డ్రైవర్ సీటింగ్ పొజిషన్తో కేవలం ఒకే సీటు ఉంటుంది. వెనుకవైపు ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కారును 1992లో ప్రముఖ కార్ డిజైనర్ 'గోర్డాన్ ముర్రే' ప్రత్యేకంగా తయారుచేశారు. ఇవి కేవలం 106 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. మెక్లారెన్ ఎఫ్1 సూపర్ కారులో 6.1 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 627 పీఎస్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన ఈ కారు సుమారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు రూ. 386 కిమీ/గం కావడం గమనార్హం. ఇదీ చదవండి: నాలుగు అపార్ట్మెంట్లను అమ్మేసిన శ్రీదేవి ఫ్యామిలీ! మెక్లారెన్ ఎఫ్1 కారు ఇప్పటికే రోవాన్ అట్కిన్సన్ (మిస్టర్ బీన్), ఎలోన్ మస్క్ వద్ద కూడా ఉంది. అయితే రోవాన్ అట్కిన్సన్ కొన్ని రోజుల తరువాత ఈ కారుని విక్రయించినట్లు సమాచారం, మస్క్ మాత్రం ఈ కారును ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Motivation | Business | Wealth (@wealthynexgen) -
ఈ చెర్రీలు ఒక్కోక్కటే ఏకంగా..రూ. 25 వేలు!
మన దేశంలోని వివిధ నగరాల్లో సాధారణంగా చెర్రీలు కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వీటిని జూనో హార్ట్ చెర్రీలని, అవ్మోరీ చెర్రీలని అంటారు. మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను, రుచిలో మరింత తీపిగాను ఉంటాయి. వీటి ఆకారం మిగిలిన చెర్రీల్లా గుండ్రంగా కాకుండా, హృదయాకారంలో ఉంటుంది. వీటిని కిలోల చొప్పున అమ్మరు. ఒక్కొక్క పండుకే ధరకట్టి ఆ లెక్కన అమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చెర్రీలు ఒక్కొక్కటి 296 డాలర్ల (సుమారు 25 వేలు) వరకు ధర పలుకుతాయి. ఇవి 2.8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో ఉంటాయి. సాధారణ చెర్రీల కంటే వీటిలో చక్కెర 20 శాతం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
ఈ కారు కొనే డబ్బుతో ఫ్లైటే కొనేయొచ్చు!
ప్రపంచంలో ఖరీదైన కారు అంటే చాలామంది చెప్పే సమాధానం రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'బోట్ టెయిల్'. కానీ ఇప్పుడు ఈ కారుకంటే రెట్టింపు ధరకు 1962 నాటి ఫెరారీ కారు అమ్ముడైంది. ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏమిటి, ఎంతకు అమ్ముడైంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. న్యూయార్క్లో జరిగిన వేలంలో 1962 నాటి 'ఫెరారీ 250 జీటీవో' (Ferrari 250 GTO) 51.7 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీనిని అనామక బిడ్డర్ ఆర్ఎమ్ సోథెబీస్ కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ కారు ధర సుమారు రూ. 430 కోట్లు కంటే ఎక్కువ. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన కార్ల జాబితాలో ఇది స్థానం సంపాదించింది. ఫెరారీ 250 జీటీవో ప్రారంభంలో 4.0 లీటర్ ఇంజిన్ కలిగి 7500 ఆర్పీఎమ్ వద్ద 3910 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేది, ఆ తరువాత 3.0-లీటర్ జీటీవో డెవలప్మెంటల్ ఇంజన్ అమర్చారు. అప్పట్లోనే ఈ కారుని రేసింగ్లో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది 1965 సిసిలియన్ హిల్క్లైంబ్ ఛాంపియన్షిప్లో రన్నరప్ స్థానాన్ని పొందింది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? గతంలో ఫెరారీ క్లబ్ ఆఫ్ అమెరికా ఛైర్మన్ యాజమాన్యంలో ఉన్న ఈ కారు కావల్లినో క్లాసిక్లో FCS ప్లాటినం అవార్డు, కొప్పా బెల్లా మచినా అవార్డు గెలుచుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కువ ధరకు అమ్ముడైన కారు మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్హాట్ కూపే (Mercedes 300 SLR Uhlenhaut Coupe). ఇది జర్మనీలో జరిగిన వేలంలో రూ. 1202 కోట్లకు అమ్ముడైంది. -
విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!
మెరిసే కళ్ళు, సొట్ట బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ గర్ల్ పేరు ఐరా! మంచు విష్ణు, విరానికాల చిన్న కూతురు. ఐరా.. బుజ్జి మోడల్గా .. అమ్మ విరానికా స్టార్ట్ చేసిన ఫ్యాషన్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తోంది. ఆ ఫ్యాషన్ బ్రాండ్ గురించి కొన్ని విషయాలు..అమ్మ విరానికా .. ఐరాను ప్రేమగా ‘చిన్న పుప్పిటా’ అని పిలిచుకుంటే .. నాన్న విష్ణు ‘బిగ్గెస్ట్ బ్లాక్మెయిలర్’ అంటూ ముద్దు చేస్తాడట. ఇల్లు.. పిల్లలు.. వ్యాపారం.. ఈ మల్టీటాస్క్ని తనకు ఫింగర్ టిప్తో సమానమని నిరూపిస్తోంది విరానికా మంచు. న్యూయార్క్లో పుట్టి, పెరిగిన ఆమె.. జెమాలజీ, జ్యూలరీ డిజైన్, ఫ్యాషన్ మార్కెటింగ్లో డిగ్రీ చేసింది. సినీ హీరో మంచు విష్ణుని పెళ్లి చేసుకున్నాక ఇండియా వచ్చేసింది. ఇంట్లో వాళ్లకి కావలసిన డ్రెస్లు, నగలను తనే డిజైన్ చేస్తుంది. ‘విరానికా’ అని తన పేరు మీదే ఒక బొటిక్నీ నడుపుతోంది. అయితే అమ్మ విరానికా కల మాత్రం లండన్లో ఫ్యాషన్ స్టోర్ పెట్టాలనే! దాని కోసం వర్క్ చేసింది.. చివరకు సాధించింది. తాజాగా చిన్న పిల్లల కోసం ‘మేసన్ అవా’ అనే బ్రాండ్ని క్రియేట్ చేసింది. దాని స్టోర్ని.. వరల్డ్ ఫేమస్ లగ్జరీ డిపార్మెంట్ స్టోర్ అయిన హారోడ్స్ (లండన్)లో ఓపెన్ చేసింది. ఇక్కడ 2–14 సంవత్సరాల పిల్లల కోసం సరికొత్త డిజైన్స్లో అన్ని రకాల దుస్తులు ఉంటాయి. చాలా వరకు హ్యాండ్ మేడ్ డ్రెసెసే ఉంటాయి. ఈ బ్రాండ్కి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన గౌనును 2021లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య బచ్చన్.. తన పుట్టినరోజు నాడు వేసుకుంది. అమెరికన్ మోడల్ ప్యారిస్ హిల్టన్ సైతం ‘మేసన్ అవా’ డ్రెస్ వేసుకుంది. ధరలు హై రేంజ్లోనే ఉంటాయి. ఆన్లైన్లోనూ లభ్యం. ఇక విరానిక కూతురు ఐరా ధరించిన మేసన్ అవా డ్రస్ ధర ఏకంగా డ్రెస్ రూ. 99,520/- (చదవండి: దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!) -
ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏదంటే, చాలామంది ముంబైలోని యాంటిలియా పేరు చెబుతారు. దీని కంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి ఉందంటే నమ్మడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఇది నిజం. ఈ ఖరీదైన ప్యాలెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిలియనీర్ ముఖేష్ అంబానీ యాంటిలియా కంటే ఖరీదైన భవనం 'బకింగ్హామ్ ప్యాలెస్'. ఇది ప్రస్తుతం కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని బ్రిటన్ రాజకుటుంబ నివాసం. 1703లో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా కీర్తి పొందుతోంది. 19వ శతాబ్దంలో క్వీన్ విక్టోరియా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాజభవనాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ తరువాత కూడా చాలా సంవత్సరాలు ఇది కొన్ని కొన్ని మార్పులు పొందుతూనే ఉంది. ప్రస్తుతం బకింగ్హామ్ ప్యాలెస్లో 775 గదులు ఉన్నాయి. ఇందులో 19 స్టేటురూమ్లు, రాయల్స్, అతిథుల కోసం 52 బెడ్రూమ్లు, సిబ్బందికి 188 బెడ్రూమ్లు, 92 ఆఫీసులు, 78 బాత్రూమ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! ఈ భవనం విక్రయిస్తే 4.9 బిలియన్ల కంటే ఎక్కువ డబ్బు రావొచ్చని అంచనా. ముఖేష్ అంబానీ విలాసవంతమైన యాంటిలియా ధర కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రిటీష్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించినప్పటి నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ అత్యంత విలువైన ఆభరణాలకు, సంపదకు నిలయంగా విరాజిల్లింది. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ప్యాలెస్. దీని విలువ రూ. 15000 కోట్లు కంటే ఎక్కువ. 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి ఆరు అంతస్తులలో అంబానీ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారు. మిగిలిన అంతస్తుల్లో ఎన్నెన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. -
ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు!
ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైక్ లేదా కారు గురించి విని ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి బహుశా విని ఉండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ 'అజాచూర్'. దీని ధర రూ. 1.5 కోట్లకంటే ఎక్కువ. దీని ధర ఎందుకింత ఎక్కువగా ఉందంటే.. కారణం ఈ నెయిల్ పాలిష్లో మొత్తం 1,118 వజ్రాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా దీని క్యాప్ కూడా డైమండ్ కావడం ఇక్కడ విశేషం. దీనిని లాస్ ఏంజెల్స్కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ సీసా కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు. కావున సీసా కాలి అయిపోయిన తరువాత కూడా దాచుకోవచ్చు. ఈ ఒక్క నెయిల్ పాలిష్ కొనే డబ్బుతో ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కార్లను కొనుగోలు చేయొచ్చు. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! 2012లో తయారైన ఈ నెయిల్ పాలిష్ని ఇప్పటి వరకు 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణ ప్రజలు ఇలాంటి ఖరీదైన నెయిల్ పాలిష్ కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ డబ్బున్న సంపన్నులు అందరిలోకంటే ప్రత్యేకంగా కనిపించడానికి ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాయి. -
బంగ్లా ఖరీదే వందల కోట్లు.. ఎవరీ రేణుకా తల్వార్!
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిది అంటే.. ముందుగా చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ ఆదానీ వంటి పారిశ్రామికవేత్తల పేర్లే గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలో మాత్రం అత్యంత ఖరీదైన ఇల్లు ఒక మహిళకు చెందింది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ ఇంటి ఖరీదు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఢిల్లీలో ఖరీదైన ఇల్లు కలిగిన మహిళ పేరు 'రేణుకా తల్వార్'. ఈమె ప్రముఖ రియల్ ఎస్టేట్ 'కేపీ సింగ్' కుమార్తె. ఈమె కొనుగోలు చేసిన ఇల్లు పృథ్వీరాజ్ రోడ్లో ఉంది. టీడీఐ ఇన్ఫ్రా కార్పొరేషన్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించినట్లు సమాచారం. 2016లో ఈ బంగ్లాను రూ. 435 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీని ధర రూ. 510 కోట్లు వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఒకటిగా నిలిచింది. దీని విస్తీర్ణం దాదాపు 5000 చ.మీ కాగా ఇంటి నిర్మాణ ప్రాంతం రూ. 1189 చ.మీ. అంటే ఈ భారీ విలాసవంతమైన ఇల్లు చదరపు మీటరు ఖరీద్దు ఏకంగా రూ. 8.8 లక్షలు. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రేణుకా తల్వార్ కంటే ముందు, ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన పృథ్వీరాజ్ రోడ్లో షాహీ ఎక్స్పోర్ట్స్ హరీష్ అహుజా రూ. 173 కోట్లతో ఖరీదైన భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న రేణుకా తల్వార్ బంగ్లా పరిమాణంలో సగం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నికర సంపద విలువ ఏకంగా రూ. 2780 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.. ఏకంగా రూ. 914 కోట్లు!
భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ వివాహం అంగరంగ వైభవంగా చేశారు. ఇది అత్యంత ఖరీదైన వివాహంలో ఒకటిగా నిలిచింది కూడా. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహల్లో నెంబర్వన్ మాత్రం కాదట. ఆ స్థానం ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ డయాన వివాహమే ఉంది. వారి వివాహమే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఔను! ఇది నిజం. ఇప్పటికీ ఆ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేదట. ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీని పిరమల్ గ్రూప్ అధినేత ఆనంద్ పిరమల్కు ఇచ్చి వివాహం జరిపించారు. దానికి అయ్యిన ఖర్చు ఏకంగా రూ. 400 కోట్లు. దీన్ని చూసి మనం నోరెళ్లబెటం కానీ ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా వివాహ ఖర్చు దాదాపు రూ. 914 కోట్లు పైనే అయ్యిందట. అత్యధిక మంది వీక్షించిన వివాహ ఈవెంట్లలో ఇది ఒకటిగా నిలిచింది కూడా. అంతేగాదు ప్రిన్సెస్ డయానా ధరించి దుస్తులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డయనా డ్రస్ను ప్రముఖ డిజైనర్లు మాజీ భార్యభర్తలు డేవిడ్, ఎలిజబెత్ ఇమాన్యుయెల్ రూపొందించారు. ఈ డ్రస్ ఖరీదు దాదాపు రూ. 4.1 కోట్లు. ఈ జంట పెళ్లి రోజున ఏకంగా మూడు వేల ఖరీదైన బహుమతులు అందుకున్నారు కూడా. వాటిలో ఎక్కువగా ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, పాత్రలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ప్రిన్స్ చార్లెస్ ప్రిన్సెస్ డయానా వివాహమే రికార్డులు నెలకొల్పగా, అత్యంత ఖరీదైన వివాహ డ్రస్ ధరించని వధువుగా రికార్డు ఇషా అంబానీకే దక్కుతుంది. ఎందుకంటే ఇషా అంబానీ ఏకంగా ఏకంగా రూ. 90 కోట్ల విలువైన గోల్డెన్ అండ్ రెడ్ లెహెంగా ధరించారు. కాగా, ప్రిన్స్ చార్లెస్, డయానాల వివాహానికి దాదాపు 250 మంది సంగీతకారుల లైవ్ మ్యూజిక్ అందించగా, ఈ వేడుకకు దాదాపు 1400 మంది అతిరథులు హాజరయ్యారు. విషాదం ఏంటంటే ఈ జంట చివరికి విడాకులు తీసుకున్నారు. పైగా కొద్ది సంవత్సరాల్లోనే యువరాణి డయనా ఒక విషాద కారు ప్రమాదంలో మరణించారు. ఏదీ ఏమైనా ఇంప్పటికీ ఆ జంట పేరు మీద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు ఉండటం విశేషం. (చదవండి: అప్పటి వరకు సజీవంగా కనిపించిన వ్యక్తి..సడెన్గా 'మమ్మీలా'...) -
రూ.500 కోట్ల ఖరీదైన వినాయకుడు.. ఎక్కడుందో తెలుసా?
Most Expensive Ganesha Idol: వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రజలు తమ స్తోమతను బట్టి విగ్రహాలను కొనుగోలు చేసి ఆరాధిస్తూ ఉంటాడు. అయితే సూరత్ వ్యాపారవేత్త వద్ద ఉన్న గణేష్ ప్రతిమ మాత్రం చాలా ప్రత్యేకం, అంతే కాకుండా ఇది చాలా ఖరీదైనది కూడా. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఇది ఒక వజ్రం ముక్క. వినాయకుడిని పోలి ఉండటం వల్ల ప్రతి ఏటా దీనికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా తాపీ నది జలాలను విగ్రహం మీద చల్లుతారు. దీనిని 2005వ సంవత్సరంలో రూ. 29,000లతో కాంగోలోని మ్బుజీ గని నుంచి వేలంలో భాగంగా రాజేష్ పాండవ్ అనే వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసాడు. ఈ వజ్రం ఇండియాకు తీసుకువచ్చిన తరువాత వినాయకుని రూపంలో ఉండటం గమనించి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం పొడవు 24.11 మిమీ, వెడల్పు 16.49 మిమీ వరకు మాత్రమే ఉంది. ఇది 27.74 క్యారెట్స్ డైమండ్. దీనిని 2016లో వజ్రాల పరిశ్రమకు సంబంధించిన వార్షిక ప్రదర్శనలో కూడా ప్రదర్శించాడు. అప్పటి నుంచి దీనికి విస్తృత ప్రచారం లభించింది. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. ఈ ప్రతిమను కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారని. అయితే దానిని విక్రయించే ఆలోచన తనకు లేదని వజ్రాల వ్యాపారి స్పష్టం చేసాడు. సంవత్సరటం మొత్తం దానిని జాగ్రత్తగా ఉంచి, పండుగ సమయంలో మాత్రమే బయటకు తీస్తామని తెలిపాడు. దీని విలువ ఇప్పుడు సుమారు రూ. 500 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు. నిజానికి దీనిని ముద్రించి, విడుదల చేసినప్పుడు దీని ఖరీదు ఒక సెంటు (నాలుగు పైసలు) మాత్రమే! ఇప్పుడు దీని ధర ఏకంగా 8.5 మిలియన్ డాలర్లు (రూ.70.33 కోట్లు). అవాక్కయ్యారా? దీని ప్రాచీనత కారణంగానే ఇప్పుడు దీనికి ఇంత రేటు పలుకుతోంది. బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు 1856 నాటిది. బరువు ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు. ఈ స్టాంపు బరువు 40 మిల్లీగ్రాములు. ఇదే బరువు గల నాణ్యమైన వజ్రం ధర దాదాపు 700 డాలర్లు (రూ.58 వేలు). ఇదే బరువు గల ఖరీదైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీ ధర దాదాపు 5000 డాలర్లు (రరూ.4.13 లక్షలు). ఈ లెక్కన బ్రిటిష్ గయానాకు చెందిన ఈ ఒక సెంటు తపాలా స్టాంపు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ స్టాంపు ఇప్పటి వరకు తొమ్మిదిమంది యజమానుల చేతులు మారింది. ఇటీవల జరిగిన వేలంలో స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ దీనిని సొంతం చేసుకుంది. (చదవండి: చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు) -
ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఫొటోలో కనిపిస్తున్న చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్. ఉత్తర స్పెయిన్కి చెందిన విలక్షణమైన ఈ చీజ్ పేరు కాబ్రేల్స్ బ్లూ చీజ్. ఇటీవల ప్రిన్సిపాలిటీ ఆఫ్ అస్ట్యూరీయస్లో జరిగిన స్థానిక చీజ్ ఫెస్టివల్లో 2.2 కిలోల ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్ని వేలం వేయగా, రూ. 27 లక్షలు ధర పలికి ప్రపంచ రికార్డును కరిగించింది. సాధారణంగా బ్లూ చీజ్ని పచ్చి ఆవుపాలతో తయారు చేస్తారు. కానీ ఈ కాబ్రేల్స్ బ్లూ చీజ్ని మాత్రం మేకపాలు, గొర్రెపాలు కలిపి తయారు చేస్తారట! అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న సున్నపురాయి గుహలలో ఎనిమిది నెలల పాటు నిల్వ చేస్తారు. ‘అందుకే దీనికి ఇంతటి అద్భుతమైన రుచి’ అంటున్నారు చీజ్ ఫెస్టివల్ అతిథులు. (చదవండి: చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!) -
డెలివరీ బాయ్కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!
కాఫీ గుమగుమలు ముక్కు పుటలకు తాకగానే అబ్బా అనేస్తాం. పొద్దున్నే ఓ కప్పు కాఫీ పొట్టలో పడితే గానీ ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించదు. అలాంటి కాఫీ ప్రియులకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ఉందని తెలుసా!. ఐతే దాన్ని ఎలా తయారచేస్తారో వింటే మాత్రం..ఛీ యాక్ అంటారు. కానీ ఆ కాఫీ చాలా రుచిగా ఉండటానికి కారణం వాటివల్లనేట. ఆ కాఫీ తయారయ్యే విధానం తెలిస్తే మాత్రం..అమ్మబాబోయ్! అంటూ జోలికి వెళ్లే సాహసం చేయలేం. విచిత్రం ఏంటంటే ఆ కాఫీకి ఉన్న డిమాండ్ చూస్తే వామ్మో! అంటారు. కోపి లువాక్ లేదా సివెట్ కాఫీ ప్రంపచంలోనే అత్యంత ఖరిదైన కాఫీగా ప్రసిద్ధిచెందింది. దీన్ని ఎలా తయారు చేస్తారో వింటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్క క్షణం నిశబ్దంగా ఉండిపోతాం. దీని ధర ట్యాగ్ వెనుకు ఉన్న రహస్యం తెలుసుకుంటే షాకవ్వడం గ్యారంటీ. ఎలా తయారు చేస్తారంటే.. కోపి లువాక్ అనే కాఫీ ఇండోనేషియా, సుమత్రా, జావా, బాలి నుంచి ఉద్భవించింది. ఇది కాఫీ చెర్రీస్ అనే పండ్ల నుంచి తయారవ్వుతుంది. అయితే ఆ పండ్లను సేకరించి నేరుగా తయారు చేసేయ్యరు. ఆ కాఫీ చెర్రీలను పునుగు పిల్లి(ఆంగ్లంలో (సివెట్) అనే పిల్లి జాతి క్షీరదం తింటుందట. ఆ తర్వాత వాటి గింజలను విసర్జిస్తుతుంది. కాఫీ ఉత్పత్తిదారులు అది విసర్జించిన గింజలను సేకరించి ఈ కాఫీని తయారు చేస్తారు. నిజానికి ఈ కాఫీ చెర్రీలు చాలా చేదుగా ఉంటాయి. వాటిని ఈ పునుగు పిల్లులు తినడంతో వాటి కడుపులోని ఎంజైమ్లు బీన్స్ నేచర్ని మారుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే వాటి చేదు గుణాన్ని తగ్గించి వాటిని రుచిగా మారుస్తాయి. ఈ సహజ కిణ్వనప్రక్రియే కోలి లువాక్ అనే కాఫీ రుచికి ప్రధాన కారణమట. సేకరించిన పునుగు పిల్లి విసర్జకాలు ఎందుకింత ఖరీదంటే.. ఈ కాఫీ ఎందుకింత ఖరీదైందిగా పేరుగాంచిందంటే ఈ కాఫీ బీన్స్ సంప్రదాయంగా పండించడానికి బుదులుగా ఈ సివెట్(పునుగు పిల్లుల) రెట్లను సేకరించడం ద్వారానే తయారవ్వుతుంది కాబట్టి. ఉత్పత్తిదారులకు ఇది అధిక ఖర్చులకు దోహదం చేసే అంశం. ఇక సివెట్ తక్కువ మొత్తంలో ఈ కాఫీ చెర్రీలనే విసర్జిస్తాయి. దీంతో పరిమిత స్థాయిలోనే సరఫరా ఉండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది. పునుగు పిల్లి విసర్జక పదార్థాలతో తయారవుతుందనే దృష్ట్యా ఈ కాఫీపై పలు విమర్శలు కూడాఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ తాగాలనుకునేవారికి ఈ కాఫీ ఒక స్టేటస్ ఆఫ్ సింబల్గా ఉంటుంది. ఈ కాపీ తయారీ కోసమనే ఈ పునుగు పిల్లలను బంధిస్తున్నారని జంతుప్రేమికుల నుంచి విమర్మలు కూడా ఉన్నాయి. ఈ కోపీ లువాక్ కాఫీ ఖరీదు, విలక్షణమైన తయారీ విధానం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుందట. (చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..) -
చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఓ లుక్కేసుకోండి!
1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe: చంద్రయాన్-3 ఇటీవల చంద్రుని మీద అడుగుపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్రలో 'ఇండియా' పేరు సువర్ణాక్షరాలతో లికించడానికిది దోహదపడింది. అరుదైన గొప్ప రికార్డుని సొంతం చేసుకున్న చంద్రయాన్-3 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రూ.615 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన ఒక బెంజ్ కారు భారతీయ చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కారు ఏది? దాని ఖరీదెంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్హాట్ కూపే.. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ 'ఉహ్లెన్హాట్ కూపే' (1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe) అని తెలుస్తోంది. ఈ కారుని వేలం పాటలో 143 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1203 కోట్లు. జర్మనీలో స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన ఒక ప్రైవేట్ వేలంలో ఈ కారు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడైంది. ఈ కారు ఎందుకు ఇంత ఖరీదైనదంటే? ఇలాంటి మోడల్స్ ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! నిజానికి ఈ కార్లు లే మాన్స్లో రేసింగ్కు వెళ్ళడానికి అనుకూలంగా బెంజ్ కంపెనీ తయారు చేయడం జరిగింది. దీని సృష్టించిన సృష్టికర్త పేరునే ఈ కారుకి పెట్టడం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ కారు గరిష్ట వేగం 180 మైల్స్/గం (గంటకు 289.6 కిమీ) అని తెలుస్తోంది. ఈ కారు చాలా రేసుల్లో ఉపయోగించిన తరువాత కేవలం సెలబ్రిటీలను రవాణా చేయడానికి ఉపయోగించారు. -
ఖరీదైన చాక్లెట్ చోరీ.. పరారైన అమ్మాయిల కోసం పోలీసుల గాలింపు!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ఒక దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు అమ్మాయిలు ఒక దుకాణంలో ఖరీదైన చాక్లెట్ చోరీ చేసి పరారయ్యారు. దుకాణదారు తెలిపిన వివరాల ప్రకారం ఆ చాక్లెట్ ఖరీదు రూ.500. ఈ ఘటన మొత్తం సీసీటీవీలొ రికార్డయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ చోరీ పట్టణంలోని డీడీ నగర్ గేట్ వద్దనున్న డిపార్ట్మెంటల్ స్టోర్లో జరిగింది. ఈ స్టోర్కు వచ్చిన నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయి ఆ చాక్లెట్ను తన జీన్స్ ప్యాంటు జేబులో దాచుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమెతో పాటు మిగిలినవారు కూడా పరారయ్యారు. ఈ చాక్లెట్ చోరీ ఘటన స్టోర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిలో ఆ ఆమ్మాయి చోరీ ఎలా చేసిందీ రికార్డయ్యింది. కౌంటర్లో డబ్బులు చెల్లించకుండా ఎలా తప్పించుకున్నదీ దానిలో రికార్డయ్యింది. వారు ఇక్కడికి సమీపంలోని ఏదో హాస్టల్కు చెందినవారిగా స్టోర్ యజమాని అనుమానిస్తున్నారు. దుకాణదారుని ఫిర్యాదు మేరకు మహరాజ్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చాక్లెట్ ఖరీదు రూ. 500 ఉంటుందని దుకాణదారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్టోర్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా!
ముఖేష్ అంబానీ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ.. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. అయితే వీరి వద్ద ఉన్న లగ్జరీ వాహనాలు లెక్కకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ కారు రంగులు మార్చే 'రోల్స్ రాయిస్'. రోల్స్ రాయిస్ కల్లినన్.. రంగులు మార్చే ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కనిపించింది. వీరి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఇది చాలా ప్రత్యేకమైనదికి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీలైక్ఓమ్ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గమనించినట్లైతే పోర్స్చే 911 జీటీ3, టయోటా సుప్రా వంటి కార్లతో పాటు రోల్స్ రాయిస్ కారుని గమనించవచ్చు. ఇది దూరం నుంచి వైలెట్ కలర్ షేడ్లో కనిపిస్తుంది.. దగ్గరకు వచ్చే సరికి నీలం (బ్లూ) రంగులోకి మారింది. ఇలా అది దూరం వెళ్లే సరికి మళ్ళీ రంగు మారినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! సైకెడెలిక్ ర్యాప్.. నిజానికి వర్షం కురిసిన సమయంలో ఈ కారు కనిపించడంతో ఇలా కనిపించింది. అదే బాగా ఎండగా ఉన్న సమయంలో అయితే మరింత ఆకర్షణీయంగా కనిపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది కలర్ మార్చే ర్యాప్.. కావున దానిపై పడే కాంతి పరిమాణం, మీరు కారును చూస్తున్న కోణాన్ని బట్టి రంగు మారుతుంది. ఈ రకమైన ర్యాప్ను సైకెడెలిక్ ర్యాప్ అని కూడా పిలుస్తారు, ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ కారు అని తెలుస్తోంది. కావున ఈ లగ్జరీ కారు 6.8 లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్తో గరిష్టంగా 580 బీహెచ్పీ పవర్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఈ రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా.. బిఎమ్డబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్ఫాస్ట్, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్స్టర్, ఫెరారీ 488 జిటిబి, ఫెరారీ పోర్టోఫినో వంటి మరెన్నో కార్లు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ! -
ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే?
Pininfarina B95 Roadster: ఇప్పటి వరకు ఖరీదైన బైక్ గురించి తెలుసుకున్నాం, ఖరీదైన ఫ్యూయెల్ కారు గురించి తెలుసుకున్నాం.. అయితే ఈ కథనంలో ప్రపంచంలోనే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుని పినిన్ఫరినా (Pininfarina) అనే కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర 4.4 మిలియన్ యూరోలు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 39.8 కోట్లు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఇది ప్రసిద్ధి చెందింది. 10 యూనిట్లు మాత్రమే.. పినిన్ఫరినా కంపెనీ ఈ 'బి95 రోడ్స్టర్' హైపర్ కారుని కేవలం 10 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నట్లు సమాచారం. కంపెనీ 95వ యానివెర్సరీ సందర్భంగా 2025లో డెలివరీలు చేయనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ కారు అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు! గరిష్ట వేగం గంటకు 300 కిమీ.. పినిన్ఫరినా బి95 దాని బాటిస్టా మాదిరిగానే అదే పవర్ట్రెయిన్ పొందుతుంది. కావున 120 ఇందులోని కిలోవాట్ బ్యాటరీ మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 2 సెకన్లలోపు గంటకు 0 నుంచి 96 కిమీ/గం వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిమీ కావడం గమనార్హం. ఇందులో కాల్మా, పురా, ఎనర్జికా, ఫ్యూరియోసా అండ్ కరాటెరే అనే ఐదు డ్రైవింగ్ మోడ్లు లభిస్తాయి. బి95 రోడ్స్టర్ ఒక ఫుల్ ఛార్జ్తో 450 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని మోటార్ 1900 హార్స్ పవర్ అండ్ 2340 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 270 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 25 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. -
Saif Ali Khan Pataudi House: సైఫ్ అలీ ఖాన్ బంగ్లా అంటే అట్లుంటది (ఫొటోలు)
-
ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!
రెండు నెలల కిందటి వరకు సామాన్యులకు అందుబాటులోనే ఉన్న టొమాటో ధరలు ఇటీవలి కాలంలో కళ్లుబైర్లు కమ్మిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టొమాటో ధరలు కిలో వంద రూపాయలకు పైగానే ఉన్నాయి. కొన్నిచోట్ల కిలో రెండువందల యాభై వరకు కూడా పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ధరలకే జనాలు బెంబేలుపడుతుంటే.. ఇంకో రకం టొమాటో ధర వింటే అమ్మ బాబోయ్! అంటారు టొమాటోల్లో ఒక రకానికి చెందిన విత్తనాల ధర బంగారం కంటే ఎక్కువే! ‘హజేరా జెనెటిక్స్’ అనే యూరోపియన్ విత్తనాల కంపెనీ ‘సమ్మర్ సన్’ రకానికి చెందిన టొమాటో విత్తనాలను కిలో 3.50 లక్షల డాలర్లకు (దాదాపు రూ.3 కోట్లు) విక్రయిస్తోంది. ఈ విత్తనాలతో పండే టొమాటోల ధర యూరోప్ మార్కెట్లో కిలో దాదాపు 30 డాలర్ల (సుమారు రూ.2,500) వరకు ఉంటుంది. ఈ లెక్కన మన టొమాటోలు చౌకగా దొరుకుతున్నట్లే! ఈ రకం ఒక్కో విత్తనానికి సగటున ఇరవై కిలోల వరకు దిగుబడినిస్తుంది. (చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే) -
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
వామ్మో.. చిరంజీవి చేతికున్న వాచ్ అన్ని కోట్లా?
Chirajeevi Expensive Watch: ఇటీవల విడుదలైన బేబీ చిత్రం అంచనాలను దాటుకుంటూ మంచి వసూళ్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆ చిత్ర బృందం జులై 30న హైదరాబాద్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ని ఆహ్వానించారు. ఈ వేడుకల్లో కనిపించిన చిరంజీవి చేతికున్న వాచ్ చాలా మందిని ఆకర్శించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బేబీ చిత్ర బృందం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర 230000 డాలర్లు లేదా రూ. 1.90 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఇది రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ కావడం గమనార్హం. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ ధర మాత్రం భారీగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు చలన చిత్ర సీమలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి నటులు కూడా ఖరీదైన వాచ్లు కలిగి ఉన్నారన్న సంగతి గతంలో చాలా సార్లు అనేక కథనాల్లో వెల్లడయ్యాయి. కాగా మెగాస్టార్ త్వరలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించున్నారు. -
ప్రపంచంలోనే ఖరీదైన కారు మొదటిసారి రోడ్డుపై - చూస్తే హవాక్కావల్సిందే!
Rolls Royce Boat Tail: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). ఈ బ్రాండ్ కార్లు ప్రారంభ ధరలే కోట్లలో ఉంటాయి. కాగా గరిష్ట ధరలు ఏకంగా రూ. 200 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన కారు దుబాయ్ రోడ్ల మీద మొదటిసారి కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'రోల్స్ రాయిస్ బోట్ టెయిల్' (Rolls Royce Boat Tail) పేరుతో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే 'బెయోన్స్ అండ్ జే జెడ్' ఈ కారుని కొనుగోలు చేసినట్లు సమాచారం. ధర.. నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కనిపించడం ఇదే మొదటిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే విడుదల చేసింది. దీని ధర 28 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 220 కోట్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!) రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ బ్రాండ్ మోడల్స్ కంటే కూడా చాలా బిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో లభించే ఫీచర్స్ దాదాపు ఇప్పటివరకు ఇతర ఏ లగ్జరీ కార్లలోనూ లభించకపోవడం విశేషం. కావున దీనిని కంపెనీ స్పెషల్ కారు అని కూడా పిలుస్తారు. డిజైన్ మాత్రం చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో ఫీచర్ వెనుక భాగంలో కనిపించే కాక్టెయిల్ స్టోర్. ఇందులో అవసరమైన డ్రింక్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్ర్టిబుల్ టేబుల్స్, కుర్చీలు వంటివి లభిస్తాయి. -
గౌతమ్ సింఘానియా కొత్త కారు - ధర తెలిస్తే షాక్ అవుతారు!
భారతదేశంలోని సంపన్న వ్యక్తులలో ఒకరైన రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) ఇటీవల ఖరీదైన స్పోర్ట్స్ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మన దేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో గౌతమ్ సింఘానియా ఒకరు. ఇప్పటికే ఈయన వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్కార్, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి. కాగా ఇప్పుడు రూ. 4 కోట్ల విలువైన మసెరటి ఎమ్సీ20 కూపే సొంతం చేసుకున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గౌతమ్ సింఘానియా తన సరికొత్త మసెరటి ఎమ్సీ20 డ్రైవ్ చేస్తూ ముంబై వీధుల్లో కనిపించినట్లు తెలిసింది. దాని వెనుక టొయోటా ఫార్చ్యూనర్లో గార్డ్లు రావడం కూడా గమనించవచ్చు. మసెరటి ఎమ్సీ20.. మసెరటి ఎమ్సీ20 సూపర్ కారు 2020లో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా డెలివరీలు 2023 ప్రధమార్ధంలో మొదలయ్యాయి. సింఘానియా ఈ కారు డెలివరీని ముంబైలోని మసెరటి అధికారిక డీలర్షిప్ నుంచి పొందారు. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. -
ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఎవరిదీ అంటే వెంటనే గుర్తొచ్చేది 'అంబానీ ఫ్యామిలీ'. ఈ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారన్న విషయం అందరికి తెలిసిందే. 2018లో ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ని వివాహం చేసుకుంది. వివాహానంతరం ఈ కొత్త జంట అప్పట్లో కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ బంగ్లా విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గులిటాలోని ఇషా అంబానీ మాన్షన్ అని పిలువబడే సంపన్నమైన ఎస్టేట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆధునిక సదుపాయాలు, అధునాతన వసతులు కలిగిన ఈ భవనం భూలోక ఇంద్ర భావనాన్ని తలపిస్తుంది. వర్లీలోని హిందూస్తాన్ యూనిలీవర్కి చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకుంది. ఈ అద్భుతమైన భవనం అరేబియా సముద్రానికి ఎదురుగా ఉంటుంది. దీనిని అజయ్ పిరమల్ అండ్ స్వాతి పిరమల్ ఇషా అంబానీకి కానుకగా అందించారు. (ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!) 50000 చదరపు అడుగుల అల్ట్రా లగ్జరీ బంగ్లా ఖరీదు సుమారు రూ. 450 కోట్లు అని తెలుస్తోంది. ఐదు అంతస్తులు కలిగిన ఈ సౌధం మొదటి అంతస్థులో విశాలమైన మల్టి పర్పస్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ వంటి వాటితో పాటు ఆ తరువాత అంతస్తుల్లో లివింగ్, డిన్నర్, డ్రెస్సింగ్ వంటి వాటి కోసం ప్రత్యేకమైన రూమ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇషా ఆనంద్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. -
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?
నేటి జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' అధ్యక్షత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనే విషయాలు అధికారికంగా వెల్లడవుతాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్, మల్టి యుటిలిటీ వాహనాలు, క్యాసినో, గుర్రపు పందాలు వంటి వాటి మీద చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రియం కానున్నాయి. కాగా సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ధరలు పెరిగేవి.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలు మరింత ప్రియం కానున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని కమిటీ ఈ మూడింటి మీద ట్యాక్స్ పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటి పైన జీఎస్టీ 28 శాతం పెరిగే అవకాశం ఉంది. మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం & రాష్ట్ర అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ వీటి మీద 22 శాతం సెస్ వసూలు చేయాలని సిఫార్సు చేసింది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) ధరలు తగ్గేవి.. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా హాళ్ల యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండస్ట్రీ లాబీ గ్రూప్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) పన్నులను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సినిమా హాళ్లలో ఆహార పానీయాలపై 18 శాతం జీఎస్టీ కాకుండా 5 శాతం వర్తిస్తుందని కౌన్సిల్ ఈ రోజు స్పష్టం చేసిందని రెవెన్యూ కార్యదర్శి 'సంజయ్ మల్హోత్రా' అధికారికంగా తెలిపారు. శాటిలైట్ సర్వీస్ లాంచ్ కూడా చౌకగా మారే అవకాశం ఉంది. కమిటీ దీనిపైనా కూడా ట్యాక్ తగ్గింపుని కల్పించడానికియోచిస్తోంది. మెడిసిన్స్ మీద కూసే ధరలు తగ్గే అవకాశం ఉంది. రోగులు సాధారణంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నందున రూ. 36 లక్షల ఖరీదు చేసే మందులను GST నుండి మినహాయించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది క్యాన్సర్ ఔషధం (dinutuximab/qarziba) వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్నప్పుడు 12% ఇంటిగ్రేటెడ్ GST (IGST) నుండి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్..ఇందులో చేరాలంటే..
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన క్లబ్లలో డిస్నీలాండ్కు చెందిన క్లబ్–33 ఒకటి. దీనిలో సభ్యత్వానికి ప్రవేశ రుసుముగా 50 వేల డాలర్లు (రూ.41.02 లక్షలు), వార్షిక రుసుముగా 15 వేల డాలర్లు (రూ.12.30 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన డిన్నర్ క్లబ్బులలో ఒకటిగా ఇది పేరు పొందింది. తొలుత దీనిని 1967లో ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఫ్లోరిడాలోని డిస్నీలాండ్ పార్కులోను, టోక్యో, షాంఘై సహా పలు నగరాల్లోని డిస్నీ పార్కుల్లోనూ ఈ క్లబ్ శాఖలను ఏర్పాటు చేశారు. న్యూ ఆలీన్జ్ స్క్వేర్లోని 33 రాయల్ స్ట్రీట్లో ఉన్న డిస్నీపార్కు చిరునామా ఆధారంగా ఈ క్లబ్కు క్లబ్–33 అని పేరు పెట్టారు. క్లబ్ తొలి శాఖను ఇక్కడే నెలకొల్పారు. తొలిరోజుల్లో ఈ క్లబ్ డిస్నీలాండ్ కార్పొరేట్ స్పాన్సర్లకు మాత్రమే పరిమితంగా పనిచేసేది. వాల్ట్ డిస్నీ మరణానంతరం ఇందులో ఇతర వీఐపీలకు కూడా సభ్యత్వం కల్పించడం ప్రారంభించారు. సామాన్యుల కంట కనబడకుండా ఉండటానికి హాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఇక్కడ డిన్నర్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. (చదవండి: 13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది!) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ఏందుకంత స్పెషల్?
పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో 95 శాతం నీరు ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. రక్తప్రసరణను మెరుగుపరిచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పదిల పరిచే పుచ్చకాయను ఏ సీజన్లో అయినా తినేందుకు ఇష్టపడతారు. కానీ ఓ పుచ్చకాయ ధర 5లక్షల రూపాయలంటే నమ్మగలరా? జపాన్లో పండే ఈ అరుదైన పుచ్చకాయ అక్కడ చాలా ఫేమస్. ఎందుకంత కాస్ట్లీ? అసలు ఏంటీ దాని స్పెషాలిటీ ఇప్పుడు చూద్దాం. జపాన్ దేశంలో అత్యంత ఖరీదైన పండ్లను పండిస్తారు. వాటిలో ఒకటి డెన్సుకే పుచ్చకాయ. దీన్ని పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తారు. ఈ పుచ్చకాయల్ని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ప్రతీ పుచ్చకాయ బరువు దాదాపు 6 నుంచి 7 కేజీల దాకా ఉంటుంది. అంతేకాకుండా దీని రుచి కూడా చాలా బాగుంటుందంట. తియ్యగా కరకరలాడుతూ, రవ్వ రవ్వగా ఉంటుంది. ఏడాది మొత్తంలో కేవలం 100 డెన్సుకే పుచ్చకాయలు మాత్రమే పండుతాయి. పైగా ఇవి సాధాసీదా మార్కెట్లలో లభించవు. వీటిని ప్రత్యేకంగా వేలం పాట ద్వారా విక్రయిస్తారు. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలనే పట్టుదలతో ఉండేవారు ఈ వేలం పాటలో పాల్గొంటారు. ఈ పుచ్చకాయ ధర ప్రతి ఏటా పెరుగుతుంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో సుమారు రూ. 5 లక్షలు ఉంది. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ పుచ్చకాయలను తినడానికి కొనరంట..ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తారట. అయినా అంద ధర పెట్టి పుచ్చకాయ కొనడం, తినడం రెండూ విడ్డూరమే కదూ.. -
ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?
మనం ఇప్పటి వరకు మునుపటి కథనాల్లో ఖరీదైన కారు గురించి, ఖరీదైన బైకు గురించి తెలుసుకున్నాం. అయితే ఈ కథనంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం (వైన్) ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం వోడ్కా అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. దీని ధర రూ. 30 కోట్లు వరకు ఉంటుంది. భారతదేశంలో ఖరీదైన మద్యం అంటే సుమారు రూ. 30 నుంచి రూ. 40 వేలు వరకు ఉంటుంది. అలాంటిది 'లియోన్ వెర్రెస్ మాస్టర్పీస్' (Leon Verres Masterpiece) 3.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. నిజానికి ఈ మద్యం బాటిల్ కొనుగోలు చేసే ధరతో కొన్ని జీవితాలు సెటిల్ అయిపోతాయి అంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మద్యం ఇంత ధర ఉండటానికి ప్రధాన కారణం బాటిల్ 3000 వజ్రాలతో ఉంటుంది. అంతే కాకుండా ఈ బాటిల్ ఆకర్షణీయకంగా కనిపించేందుకు వైలెట్ హ్యూడ్ హెవీ గ్లాస్తో ఒక ప్రత్యేకమైన పూత ఉంటుంది. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) బాటిల్ లోపల ఉండే మద్యం ధర కంటే కూడా బాటిల్ ధర ఎక్కువ కావడం గమనార్హం. ఇది ఖరీదైన ప్లాటినం, రోడియం వంటి విలువైన లోహాల కలయికతో అందంగా తాయారు చేసి దానికి గోల్డ్ లేబుల్ అందించడం జరిగింది. బాటిల్ మొత్తం ఖరీదైన వజ్రాలతో తయారై ఉంటుంది కావున ధర భారీగా ఉంటుంది. -
ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!
భారతదేశంలో చాలామంది ధనవంతులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి బ్రాండ్ కార్లు మాత్రమే కాకుండా 'మెక్లారెన్' (McLaren) వంటి కార్లు కూడా ఉన్నాయి. అయితే మన దేశంలో ఏదైనా వాహనం కొని దానిని ఉపయోగించే ముందు పూజ చేయడం ఆనవాయితీ.. ఇదే పద్దతిని ఒక మిలియనీర్ కూడా పాటించాడు. కోట్ల సంపద కలిగిన వ్యక్తి తన కారుకి పూజ చేయడానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం, ముంబై నగరానికి చెందిన ఒక వ్యాపారవేత్త ఇటీవల సరికొత్త 'మెక్లారెన్ 720ఎస్' (McLaren 720S) డెలివరీ చేసుకున్నాడు. డెలివరీ తీసుకున్న తరువాత సమీపంలో ఉండే ఒక గుడి వద్ద పూజ కూడా చేయించాడు. పూజాదికార్యక్రమాలు ముగిసిన తరువాత ముంబైలోని పబ్లిక్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించింది. ఈ కారుని చూసిన వారిలో చాలా మంది జనం దానితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) మెక్లారెన్ 720ఎస్: మెక్లారెన్ 720ఎస్ సూపర్ కారు విషయానికి వస్తే, ఇవి భారతీయ మార్కెట్ కోసం 400 యూనిట్లను మాత్రమే కేటాయించారు. ఇది శక్తివంతమైన 4.0 లీటర్ వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి 710 Bhp పవర్ 770 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 341 కి.మీ కావడం విశేషం. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. (ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!) నిజానికి ఖరీదైన మెక్లారెన్ 720ఎస్ స్టాండర్డ్, లగ్జరీ, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అయితే ఇవన్నీ చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ విషయంలో టాప్ ఎండ్ మోడల్ ఓ అడుగు ముందుంటుంది. ఇప్పటికీ ఈ ఖరీదైన కారుని ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ, గౌతమ్ సింఘానియా వంటి వారు కూడా కొనుగోలు చేశారు. కంపెనీ అధికారిక డీలర్షిప్ ముంబైలో ఉంది. అయితే ఈ కార్లు కావాలనుకునే వారు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. -
ఇండియన్ ఫ్యామిలీ చేతికి అద్భుతమైన విల్లా.. ధర ఎన్ని కోట్లంటే?
భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్, అతని భార్య రాధిక ఓస్వాల్ ఇటీవల స్విట్జర్లాండ్లో కోట్ల రూపాయల భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన విల్లాలలో ఒకటి కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్విట్జర్లాండ్లోని గింగిన్స్ గ్రామంలోని పిక్చర్స్క్యూ వద్ద 4.3 లక్షల చదరపు అడుగుల ఈ విల్లాను వారు సొంత చేసుకున్నారు. ఈ భవనం ఖరీదు 200 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 1649 కోట్లు. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన టాప్ 10 భవనాల్లో ఒకటి అని నివేదికలు చెబుతున్నాయి. ఈ విల్లా ఒకప్పుడు గ్రీకు షిప్పింగ్ మాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె 'క్రిస్టినా ఒనాసిస్' యాజమాన్యంలో ఉండేది. అయితే దీన్ని ఓస్వాల్ కుటుంబం కొనుగోలు చేసిన తరువాత రీడిజైన్ చేసింది. ఈ రీడిజైన్ బాధ్యతలను ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ జెఫ్రీ విల్కేస్కు అప్పగించారు. ఈ విల్లా భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, అదే సమయంలో విశ్వసౌందర్యాన్ని నిలుపుకోవాలని చెబుతూ తమకు అప్పగించారని డిజైనర్ జెఫ్రీ విల్కేస్ అన్నారు. ఈ విల్లాలో ఒక ప్రైవేట్ జిమ్, స్పా, వెల్నెస్ వింగ్, పెద్ద ఫ్రెంచ్ కిటికీలు ఉన్నాయి. ఈ భవనం చుట్టూ తోటలు మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. ఇది చూడటానికి ఒక అద్భుతమైన రాజ సౌధం మాదిరిగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..) ఇక పంకజ్ ఓస్వాల్ విషయానికి వస్తే.. ఈయన 2016లో మరణించిన ఓస్వాల్ ఆగ్రో మిల్స్ అండ్ ఓస్వాల్ గ్రీన్టెక్ వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త 'అభయ్ కుమార్ ఓస్వాల్' కుమారుడు. తండ్రి మరణించిన తరువాత కంపెనీ బాధ్యతలను పంకజ్ ఓస్వాల్ స్వీకరించాడు. కంపెనీ పరిధిలో పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, ఎరువులకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్రూఫ్ లీక్పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!) View this post on Instagram A post shared by RIDI (@realridi) పంకజ్ ఓస్వాల్ మన దేశంలో ఉన్న మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత రాధికా ఓస్వాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి వసుందర ఓస్వాల్, రిధి ఓస్వాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2013లో ఓస్వాల్ కుటుంబం ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్కు వెళ్లింది. -
పెయింట్ ఖర్చు రూ. కోటి! ఆ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Rolls Royce Cullinan: భారతదేశంలో ముఖేష్ అంబానీ గురించి, వారి కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉంటూ.. రిలయన్స్ గ్రూప్ వంటి బడా కంపెనీతో కోట్లు సంపాదిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అత్యంత విలాసవంతమైన భవనాల్లో నివసించడమే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లను సైతం లెక్కకు మించి కొనుగోలు చేశారు. వీరి వద్ద ఇప్పటికే మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉండటం గమనార్హం. వీటి ధరలు రూ. కోట్లలో ఉన్నాయి. కాగా ఇందులో ఒక కారు పెయింట్ ఖర్చు మాత్రమే రూ. 1 కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత సంవత్సరంలో ముఖేష్ అంబానీ మూడవ 'రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) డెలివరీ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ కారు చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. ఇది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటమే కాకుండా, వారికి నచ్చిన విధంగా తయారైంది. దీన్ని బట్టి చూస్తే ఇది కస్టమైజేషన్ కారు అని తెలుస్తోంది. ఈ కారు ధర ఏకంగా రూ. 13.14 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి. మార్కెట్లో రోల్స్ రాయిస్ కల్లినన్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.8 కోట్లు. అయితే ఇది ఆప్షనల్ ఫీచర్స్ కలిగి కస్టమైజ్ పొందటం వల్ల ధర ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో తెలుసుకోవలిసిన మరో అంశం ఏమిటంటే పెయింటింగ్ స్కీమ్. ఈ కారు పెయింట్వర్క్కే రూ. 1 కోటి ఖర్చు అయినట్లు సమాచారం. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం కూడా ఇందులో గమనించవచ్చు. (ఇదీ చదవండి: ఇన్స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?) రిజిస్ట్రేషన్ నెంబర్ ముఖేష్ అంబానీ కల్లినన్ 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉంటుంది. సాధారణ విఐపి నెంబర్ ధర రూ. 4 లక్షలు. అయితే ఈ నెంబర్ మరింత స్పెషల్ కావున దీని ధర రూ. 12 లక్షలు. అంతే కాకుండా ఈ కారు కోసం రూ. 20 లక్షలు వన్-టైమ్ టాక్స్ చెల్లించారు. ఇది 2037 వరకు చెల్లుబాటు అవుతుంది. (ఇదీ చదవండి: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్ఫోన్!) భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ బెంటాయగ, బీఎండబ్ల్యూ, ఫెరారీ మొదలైన ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. -
గ్లోబల్ స్టార్.. చేతి వాచ్ కూడా ఆ రేంజ్లో ఉండాల్సిందే!
ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు జన్మించిన విషయం అందరికి తెలిసిందే. లిటిల్ ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అపోలో హాస్పిటల్లో జన్మించిన ఈ చిన్నారిని చూడటానికి చిరంజీవి, వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. అయితే వైద్యశాల నుంచి ఇంటికెళ్లే సమయంలో రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎంతోమందిని ఆకర్శించింది. ఇందులో చెప్పుకోదగ్గది ఆయన ఖరీదైన వాచ్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిచర్డ్ మిల్లే బ్రాండ్ రామ్ చరణ్ కట్టుకున్న వాచ్ ధర రిచర్డ్ మిల్లే బ్రాండ్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ. 1.62 కోట్లు కావడం గమనార్హం. అత్యంత ఖరీదైన వస్తువులను ఇష్టపడే చరణ్ వద్ద ఇప్పటికే యోహాన్ బ్లేక్, రోలెక్స్, పటేక్ ఫిలిప్, ఆర్ఎమ్ 61-01 యోహాన్ బ్లేక్ రిచర్డ్ మిల్లె వంటి మరిన్ని కాస్ట్లీ వాచ్లు ఉన్నాయి. వీటి ధర కూడా చాలా ఎక్కువని సమాచారం. (ఇదీ చదవండి: ఇన్స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?) కేవలం వాచ్లు మాత్రమే కాకూండా కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. వీటితో పాటు చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నట్లు చెబుతారు. -
మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' (Mercedes Maybach S 680) ఒకటి. ధనవంతులు సైతం ఈ కారుని కొనుగోలు చేయడానికి వెనుకాడతారు, కానీ 33 ఏళ్ల వయసులోనే 'అభిషేక్ మాంటీ అగర్వాల్' మేబ్యాచ్ సెడాన్ కొనుగోలు చేసాడు. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఫౌండర్ అభిషేక్ మాంటీ అగర్వాల్ రూ. 4 కోట్ల విలువైన 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' కారు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ భయాని అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అభిషేక్ మాంటీ అగర్వాల్ కొత్త బెంజ్ కారు భారత్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం వల్ల భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ డ్రైవ్ చేయడానికి అర్హత కలిగి ఉంది. సాధారణ నెంబర్ ప్లేట్ అయితే ఈ అవకాశం ఉండదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు కొంత సమస్య ఉంటుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ సెడాన్.. పరిమాణం పరంగా చాలా విశాలంగా ఉంటుంది. దీని పొడవు ఏకంగా 5.5 మీటర్ల. భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కారు ఇదే కావడం గమనార్హం. హెడ్ లైట్స్, విస్తరించి ఉండే గ్రిల్, బ్రాండ్ లోగో వంటివి ముందు భాగంలో చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ టెయిల్ లైట్, రియర్ స్పాయిలర్ మొదలైనవి పొందుతుంది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్, టాకొమీటర్, డిజిటల్ ఓడోమీటర్ వంటివి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ మల్టి ట్రిప్ మీటర్, వెనుక వైపు ఫోల్డింగ్ టేబుల్, రెండవ వరుస ప్రయాణికుల కోసం డిస్ప్లే వంటి అనేక లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్ఫోన్స్ - ధర కూడా తక్కువే!) మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680 సెడాన్ 6.0 లీటర్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 603.46 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. -
ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!
Sohan Roy: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ ఏది అంటే.. వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). మన దేశంలో ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా మొదలైన పారిశ్రామిక వేత్తలు ఈ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లను వినియోగిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే మొట్ట మొదటి 'రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఫస్ట్ 'కల్లినన్' సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, యుఎఇకి చెందిన 'సోహన్ రాయ్' (Sohan Roy) రోల్స్ రాయిస్ కల్లినన్ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి భారతీయుడు. అతడు తన భార్య 'అభిని సోహన్'కు 25 వ పెళ్లి రోజు కానుకగా కొనుగోలు చేసినట్లు గతంలోనే వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. దీని ధర రూ. 5 కోట్ల కంటే ఎక్కువని సమాచారం. సోహన్ రాయ్ ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈఓగా ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా ఈయన సినిమా డైరెక్టర్ కూడా. సోహన్ దర్శకత్వంలో DAM999 చిత్రం తెరకెక్కింది. అంతే కాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ విస్మయాస్ మాక్స్ స్టూడియో కాంప్లెక్స్ను ఏరీస్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. (ఇదీ చదవండి: వంటగదిలో మొదలైన వ్యాపారం కోట్లు కురిపిస్తోంది - 50 ఏళ్ల మహిళ సక్సెస్ స్టోరీ) ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కల్లినన్ విషయానికి వస్తే.. ఇది ఖరీదైనదైనప్పటికీ లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు 2018లో మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది ట్విన్-టర్బోచార్జ్డ్ 6.75-లీటర్ V12 ఇంజన్ ప్యాక్ కలిగి 5000 ఆర్పిఎమ్ వద్ద 563 హార్స్ పవర్, 1600 ఆర్పిఎమ్ వద్ద 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. (ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్ఫోన్స్ - ధర కూడా తక్కువే!) రోల్స్ రాయిస్ కల్లినన్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా విశాలంగా ఉండే ఈ కారు 1835 మిమీ పొడవు, 5341 మిమీ వెడల్పు, 2164 మిమీ ఎత్తు కలిగి ఈ కారు బరువు సుమారు మూడు టన్నుల వరకు ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కువమంది ధనవంతులు కొనుగోలు చేసిన కార్లలో ఇది ప్రధానమైనది. -
బాలీవుడ్ నటులు మరియు వారి ఖరీదైన కార్లు
-
ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర తెలిస్తే షాక్ అవుతారు!
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) అనగానే మొదట గుర్తొచ్చేది లగ్జరీ కార్లు. అయితే ఈ సంస్థ ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా సైకిల్స్ కూడా విడుదల చేస్తుందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఒక సైకిల్ విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. లంబోర్ఘిని విడుదల చేసిన ఈ సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని, స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని. వీటి ధరలు వరుసగా 9,899 డాలర్లు (రూ. 8,15,365), 8,999 డాలర్లు (రూ. 7,41,226). కంపెనీ ఈ సైకిల్స్ విడుదల చేయడానికి ప్రత్యేకంగా 3టి అనే సంస్థతో జత కట్టింది. (ఇదీ చదవండి: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్ - ధర ఎంతో తెలుసా?) ఈ లేటెస్ట్ లంబోర్ఘిని సైకిల్స్ 51, 54, 58 సెంటీమీటర్ల లిమిటెడ్ సైజుల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సైకిల్స్ డెలివరీకి సుమారు 16 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని అనేది ఒక లైట్వెయిట్ మోడల్. దీనిని 3టీ కార్బన్ పరికరాలతో తయారు చేశారు. ఈ సైకిల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్ప్లోరో రేస్మ్యాక్స్ ఎక్స్ హరికెన్ స్టెరెట్టో సైకిల్ను పోలి ఉంటుంది. రెండవ మోడల్ స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలిని ప్రత్యేకంగా కంఫర్ట్, ఎయిరోడైనమిక్స్ కోసం రూపొందించారు. ఇందులో ఎస్ఆర్ఏఎం ఫోర్స్ పరికరాలు ఉంటాయి. 3టీతో జతకట్టి లంబోర్ఘిని విడుదల చేసిన మూడవ సైకిల్ ఇది కావడం గమనార్హం. ఇప్పటికే సంస్థ 2018లో ఆర్5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్ రూపొందించింది. అప్పట్లో ఇది కేవలం 63 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
బాల్కనీ ఉంటే చాలు.. సోలార్ పవర్ పొందొచ్చిలా..
సౌరవిద్యుత్తు వాడుక ఇప్పుడిప్పుడే వ్యాప్తిలోకి వస్తోంది. ఇంటికి సౌరవిద్యుత్తు అమర్చుకోవాలంటే, పైకప్పులో చాలాభాగం సౌరఫలకాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారికి ఇదంతా కుదిరే పనికాదు. అందువల్ల సౌరవిద్యుత్తుపై ఆసక్తి ఉన్నా, నగరాల్లో అపార్ట్మెంట్లలో ఉండే జనాలు సౌరవిద్యుత్తు జోలికి పోవడం లేదు. ఈ సమస్యను గమనించి, జపాన్కు చెందిన ‘ఇకో ఫ్లో’ బాల్కనీలో కూడా అమర్చుకోవడానికి వీలైన కాంపాక్ట్ పోర్టబుల్ సోలార్ పవర్ జెనరేటర్ను అందుబాటులోకి తెచ్చింది. పవర్ జెనరేటర్తో పాటు ఉండే నాలుగు సౌరఫలకాలను బాల్కనీలో ఎండ సోకే ప్రదేశంలో పెట్టుకుంటే చాలు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) దీని ద్వారా ఏడాదికి దాదాపు 1040 కిలో వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే, ఒక ఇంటి అవసరాలకు ఈ విద్యుత్తు పూర్తిగా సరిపోతుంది. దీనిని అరగంట లోపే కోరుకున్న చోట అమర్చుకోవచ్చు. ఆరుబయట పిక్నిక్లకు తీసుకువెళ్లేందుకు కూడా ఇది చాలా అనువుగా ఉంటుంది. దీని ధర 2,049 పౌండ్లు (రూ.2.10 లక్షలు) మాత్రమే! -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకులు ఇవే (ఫోటోలు)
-
ఈ గుడ్ల ధరలు తెలిస్తే.. గుడ్లు తేలేస్తారు!
చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. గుడ్లతో ప్రతీరోజూ వంటకాలు చేసుకునేవారు ఉన్నారు. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? వాటికి అంత ధర ఎందుకు ఉంటుందో తెలిస్తే ఎవరూ ఒక పట్టాన నమ్మలేరు. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా తినే ఆహారాలలో గుడ్డు ఒకటి. సాధారణంగా అందరూ తెల్లని గుడ్లు తింటారు. వీటి ధర రూ.5 నుంచి రూ.10 మధ్య ఉంటుంది. అయితే కాస్త డబ్బులు అధికంగా ఉండేవారు దేశీ గుడ్లను తింటుంటారు. ఇవి కాస్త గులాబీరంగులో ఉంటాయి. వీటి ధర రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. మరికొందరు వివిధ పక్షుల గుడ్లను కూడా తింటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు.. రోత్స్చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ గుడ్లు. ఈ గుడ్డు ధర రూ. 9.6 మిలియన్ డాలర్లు. దీని ధర భారత కరెన్సీలో చూస్తే రూ. 78 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వికీపీడియాలోని సమాచారం మేరకు ఈ గుడ్డుపై పూర్తిస్థాయిలో వజ్రాలను పొదిగారు. ఇది బంగారు కవర్ కలిగివుంటుంది. అయితే ఈ గుడ్డు తినేందుకు కాదు. అలంకరణ కోసం తీర్చిదిద్దారు. పైగా ఇది ఆర్టిఫిషియల్ గుడ్డు. ఖరీదైన గుడ్ల పరంగా చూస్తే రెండవ స్థానంలో మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ధర 8.4 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీనిని చూస్తే రూ. 69 కోట్లకు సమానం. 18 కేరెట్ల బంగారంతో రూపొందించిన ఈ గుడ్డును వేయి వజ్రాలతో అలంకరించారు. ఈ గుడ్డును చూసే వారికి అది గుడ్డు సైజులో ఉన్న వజ్రం అని అనిపిస్తుంది. మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ఖరీదు సుమారు రూ. 82 లక్షలు. ఈ గుడ్డు 65 సెంటీమీటర్ల పొడవు కలిగివుంటుంది. ఈ గుడ్డునుకొనాలంటే మీ కున్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. ఈ గుడ్డు చూసేందుకు చాక్లెట్ మాదిరిగా ఉంటుంది. ఈ గుడ్డు పైభాగంలో వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు దీనిని బంగారంతో రూపొందించారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
చుక్కలు తాకిన చెక్క కారు ధర - ఎంతో తెలుసా?
Wooden Citroen 2CV: వాహన ప్రపంచం రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది. ఇందులో భాగంగా అనేక ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ అది ఏ కారు? ఎంత ధరకు అమ్ముడైందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దాదాపు రెండు కోట్లు.. చెక్కతో తయారైన కారు పేరు 'సిట్రోయెన్ 2సీవీ' (Citroen 2CV). చాలా మంది చెక్క కారుని ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ ఇది వేలం పాటలో 2.1 లక్ష యూరోలకు అమ్ముడైంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.85 కోట్లు. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని 'మిచెల్ రాబిల్లార్డ్' అనే వ్యక్తి రూపొందించాడు. ఈయన ఈ కారుని తయారు చేయడానికి వివిధ రకాల చెట్ల కలపను ఉపయోగించారు. చాసిస్ కోసం పియర్, యాపిల్ చెట్టును.. బోనెట్ అండ్ బూట్ కోసం చెర్రీ చెట్టుని ఉపయోగించినట్లు తెలిపాడు. ఈ వుడెన్ కారుని తయారు చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టిందని తెలుస్తోంది. ఈ కారుని రూపొందించడం 2011లో ప్రారంభించాడు. దాదాపు 5వేల గంటకు కృషి చేసి మొత్తానికి అనుకున్నట్లుగా కారుని తయారు చేసాడు. చెక్కతో తయారు చేసిన ఈ కారుని గత ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్ వేలం పాటలో 'జీన్ పాల్ ఫావాండ్' అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఈయన పారిస్ లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్ యజమాని, కావున ఈ అరుదైన కారు త్వరలోనే ఆ మ్యూజియంలో దర్శనమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?) ఈ కారుని తయారు చేసిన మిచెల్ రాబిల్లార్డ్ మాట్లాడుతూ తనకు ముగ్గురు కొడుకులున్నరాని, ఈ కారు తన కూతురు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా త్వరలోనే సిట్రోయెన్ కంపెనీకి చెందిన మరో కారు 'సిట్రోయెన్ డిఎస్'ను కూడా చెక్కతో రూపొందించాలనుకున్నట్లు చెప్పాడు. -
ఐపీఎల్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ న్ని వదిలించుకుంటున్న పంజాబ్
-
ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన రెస్టారెంట్లు
-
సెలబ్రిటీల మనసుదోచే ఆ కారు మలయాళీ స్టార్ గ్యారేజిలో
Kunchacko Boban Land Rover Defender: ప్రముఖ మలయాళీ నటుడు 'కుంచకో బోబన్' (Kunchacko Boban) ఇటీవల కొత్త 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' (Land Rover Defender) కొనుగోలు చేశారు. ఖరీదైన కారు కొనుగోలు చేసిన ఇతడు దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కొనుగోలు చేసిన ఈ SUV ఇప్పుడు కుంచకో బోబన్ గ్యారేజిలో కూడా చేరింది. ఇది డిఫెండర్ 110 వెర్షన్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 89.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నటుడు కొనుగోలు చేసిన ఈ కారు కస్టమైజ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలలో కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ పూర్తిగా బ్లాక్ కలర్ పొందింది. అయితే రూప్ మాత్రం విభిన్నమైన కలర్ పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన గ్యారేజిలో టయోటా వెల్ఫైర్, పోర్షే కయెన్, మినీ కూపర్ ఎస్ వంటి మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ఖరీదైన కార్ల జాబితాలోకి ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా చేరింది. (ఇదీ చదవండి: పాకిస్థాన్లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?) ల్యాండ్ రోవర్ డిఫెండర్ భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు బాడీ స్టైల్స్లో లభిస్తుంది. అవి 110 వెర్షన్, 90 వెర్షన్. 110 వెర్షన్ అనేది 5-డోర్ మోడల్ కాగా, 90 వెర్షన్ అనేది 3-డోర్ వెర్షన్. కుంచకో బోబన్ కొనుగోలు చేసిన 110 వెర్షన్ 5 డోర్ మోడల్. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఆధునిక టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది. డిఫెండర్ 110 అండ్ 90 వెర్షన్ల కోసం కంపెనీ 5.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఇంజిన్లు స్టాండర్డ్గా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన రిస్ట్ వ్యాచ్స్
-
అత్యంత ఖరీదైన సెలబ్రిటీ ఎంగేజ్మెంట్ రింగ్స్
-
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకులు - అన్నీ రూ. కోట్లలోనే (ఫోటోలు)
-
అంబానీ కంపెనీలో ఉద్యోగి అంటే అట్లుంటది.. అన్ని ఖరీదైన వస్తువులే!
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఉపయోగించే వస్తువులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇందులో బ్యాగులు, వాచ్లు మొదలైనవి ఉంటాయి. మనం గతంలో జాన్వీ కపూర్, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, భూమి పడ్నేకర్, నైసా దేవగన్, సమీక్ష పెడ్నేకర్ వంటి వారికి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు 'ఓర్హాన్ అవత్రమణి' (Orhan Awatramani)కి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా సెలబ్రిటీలు తరచుగా పార్టీలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ పార్టీలలో వారు ఖరీదైన వస్తువులతో కనిపిస్తారు. అయితే ఓర్హాన్ అవత్రమణి కూడా ప్రముఖులతో పరిచయం ఉన్న వ్యక్తి. ఈ పేరు బహుశా ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఇతన్ని ఒర్రీ అని కూడా పిలుస్తారు. ఓర్హాన్ అవత్రమణి సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఇటీవల ఇతడు జాన్వీ కపూర్తో కలిసి ఒక కార్యక్రమంలో కనిపించాడు. ఇందులో జాన్వీ మెటాలిక్ డిటైలింగ్తో కూడిన డ్రెస్ ధరించగా.. ఓర్రీ ఆప్టికల్ ఇల్యూషన్తో కూడిన బ్లూ కలర్ జాకెట్ ధరించాడు. Loewe బ్రాండ్కి చెందిన దీని ధర సుమారు రూ. 2.14 లక్షలు. అంతే కాకుండా అతడు ధరించిన ప్యాంట్ ఖరీదు రూ. 5,000 కాగా, ఫోన్ పట్టుకున్న కవర్ ధర రూ. 25,000 కావడం విశేషం. వీటితో పాటు ఓర్రీస్ నైక్ స్నీకర్స్ ధర రూ. 50,000. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఓర్హాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో స్పెషల్ ప్రొడక్ట్ మేనేజర్ అని తెలుస్తోంది. ఎప్పుడూ బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించే ఓర్హాన్ అవత్రమణి రూ. 40,000 రూపాయల విలువైన షార్ట్లు ధరించి ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సుమారు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు కూడా సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు
ఆధునిక కాలంలో ప్రజల జీవన శైలి, వారి జీవన విధానం మారిపోయాయి. చాలా మంది విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో యువత మరింత వేగంగా ఉన్నారు. ఇటీవల ఒక యువకుడు ఏకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువకా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో కనీసం 18 సంవత్సరాలు కూడా నిండని ఒక బాలుడు జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసాడు. ఇందులో కేవలం ఆ యువకుడు తన బాడీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు. ఇందులో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ కారుని అతడే కొన్నాడా? లేక వారి తల్లిదండ్రులెవరైనా గిఫ్ట్గా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు హైదరాబాద్లోని కంపెనీ అధీకృత డీలర్ అవుట్లెట్ నుంచి బ్లాక్ కలర్ Mercedes-Benz GLS 400 డెలివరీ చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ కూడా పొందలేని వయసులో కారు కొనటం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 400డి విషయానికి వస్తే దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0-లీటర్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 326 bhp పవర్, 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది, కావున అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. -
జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఐస్క్రీమ్ తినగలమా..! ఎందుకంటే?
ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుని చూసుంటారు, బైకుని చూసుంటారు.. అంతెందుకు ఖరీదైన దుస్తులను కూడా చూసుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్ గురించి తెలుసుకోబోతున్నారు. ఐస్క్రీమ్ ఏంటి.. ఖరీదైనదేంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా, దీని ధర వెయ్యో, పదివేలో అనుకుంటే పొరపాటే. అక్షరాలా రూ. 5 లక్షల కంటే ఎక్కువ. జపాన్కు చెందిన ఐస్క్రీమ్ తయారీదారులలో ఒకటైన 'సిలాటో' దీనిని తయారు చేసింది. ఇది బైకుయా అనే ప్రోటీన్ కలిగిన ఐస్క్రీమ్ కావడం విశేషం. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'ఐస్క్రీమ్'గా రికార్డుకెక్కింది. ఇంత ఖరీదైన ఐస్క్రీమ్ కూడా పాలతోనే తయారవుతుంది. కానీ ఇది వెల్వెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో చీజ్, గుడ్డులోని పచ్చ సోన వంటివి కలుపుతారని సమాచారం. వీటితో పాటు ఇందులో పర్మిజియానో చీజ్, వైట్ ట్రఫుల్, ట్రఫుల్ ఆయిల్, గోల్డ్ లీఫ్ ఉంటాయి. ఈ మొత్తం ఐస్క్రీమ్ ఒక స్టైలిష్ బ్లాక్ బాక్స్లో ప్యాక్ చేస్తారు. ఇది చూడటానికి సాధారణ ఐస్ క్రీమ్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే దీనిని తినటానికి ఉపయోగించే స్పూన్ చేతితో తయారు చేసిన మెటల్ కావడం విశేషం. దీనిని క్యోటోకి చెందిన హస్తకళాకారులు ప్రత్యేకంగా తయారు చేశారు. (ఇదీ చదవండి: వాట్సాప్లో ఇలాంటి ఫీచర్ ఒకటుందని తెలుసా? తెలిస్తే ఎగిరి గంతేస్తారు!) కేవలం 130ml ఐస్క్రీమ్ ధర కంపెనీ వెబ్సైట్లో అక్షరాలా 8,80,000 యెన్స్ అంటే అమెరికా కరెన్సీ ప్రకారం దాదాపు 6వేల డాలర్ల కంటే ఎక్కువ, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5 లక్షలకంటే ఎక్కువ. ఈ ఐస్క్రీమ్ తినటానికి నిర్దిష్ట గడువు అంటూ ఏమి ఉండదు, కావున దీనిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ధర ఎక్కువ కావడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్గా ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. -
మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!
మహీంద్రా థార్ వాహనాల ధర రూ.1.05 లక్షల వరకు పెరిగింది . బీఎస్ 6 ఫేజ్ 2 , ఆర్డీఈ ఉద్గార నిబంధనలకు రూపొందించిన నేపథ్యంలో ధరలు పెంచినట్లు తెలుస్తోంది. థార్ X (O) హార్డ్ టాప్ డీజిల్ MT RWD వేరియంట్ ధర రూ. 55,000, మహీంద్రా థార్ LX హార్డ్ టాప్ డీజిల్ MT RWD వేరియంట్ ధర రూ.1.05 లక్షలు పెరిగాయి. ఇతర మోడళ్ల ధర కూడా రూ. 28,000 పెరిగింది. మహీంద్రా థార్ ఎస్యూవీ టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ డీజిల్ AT 4WD కొత్త ధర రూ.16.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే బేస్ వేరియంట్ ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. థార్ కొత్త వేరియంట్? మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ కొత్త వేరియంట్ను తీసుకొస్తున్నట్లు సమాచారం. లీక్ అయిన ఆర్టీఓ డాక్యుమెంట్ ప్రకారం ఆ కొత్త వేరియంట్ ఎంట్రీ లెవల్ థార్ 4x4 వేరియంట్ – AX (AC). ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న AX (O) వేరియంట్ కంటే తక్కువగా స్థాయిలో త్వరలో రాబోయే మారుతి సుజుకీ జిమ్నీ కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మహీంద్రా థార్ 4x4 AX (AC) వేరియంట్లో రెండు వరుసల సీట్లు ముందు వైపు రెండు, వెనుకవైపు రెండు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది 2 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ మోడల్లలో వస్తుందని పుకార్లు వచ్చాయి. -
విజయ్ దేవరకొండ గ్యారేజీలో కాస్ట్లీ కార్లు..
తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఫోర్డ్ మస్టాంగ్: ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ గత సంవత్సరం భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జిఎల్సి విజయ్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని యితడు ఇతర కార్లకంటే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్లలో లభిస్తుంది. వోల్వో ఎక్స్సి 90: విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు వోల్వో ఎక్స్సి 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం. రేంజ్ రోవర్: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్: విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బిఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి. -
వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ!
మద్యం తాగితే తెలియని కిక్ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరలు వింటే మాత్రం ఎక్కిన కిక్కు కూడా దిగిపోతుంది. ప్రపంచంలో ఖరీదైన ఆల్కహాల్ బ్రాండ్లు ఎవరు ఎక్కువగా వినియోగిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే కొంతమంది ఎంత ఖరీదైన పర్లేదు గానీ ఈ కాస్ట్లీ లిక్కర్ను ఒక్కసారైన తాగాలని ఆసక్తి చూపుతారట. దీంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాలపై ఓ లుక్కేద్దాం! టెకీలా లీ 925 (Tequila Lee .925) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మద్యాన్ని సేవిస్తే ఎంత మత్తు ఎక్కుతుందో తెలీదు దీన ధర వింటే మాత్రం తాగింది దిగిపోతుంది. దీని ధర దాదాపు రూ. 25 కోట్లట. ఈ లిక్కర్ ఎందుకంత ఖరీదంటే.. సీసాలో 6400 వజ్రాలు పొదిగినవి ఉండడమే. హెన్రీ IV డుడోగ్నే కాగ్నాక్ ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్. ఈ బ్రాండ్ మద్యం బాటిల్ ఖరీదు 56 లక్షల 93 వేల రూపాయలు. దాని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం అమరిక ఉండగా దీన్ని ప్లాటినంతో తయారు చేస్తారట. దీంతో ఈ తరహావి.. మద్యం లేకపోయినా కేవలం ఖాళీ సీసాలు కూడా ఎక్కువ ధరకే పలుకుతాయట. ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ అంటే.. అమండా డి బ్రిగ్నాక్ మిడాస్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు ఉంటుంది. అత్యంత ఖరీదైన రెడ్ వైన్ ధర తెలిస్తే షాక్ అవుతారు. పెన్ఫోల్డ్స్ ఆంపౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్. ఈ బ్రాండ్ రెడ్ వైన్ ఒక బాటిల్ రేటు వచ్చేసి కోటి రూపాయలు పై మాటే ఉంటుందట. ఈ ఖరీదైన మద్యం ధరలు వింటే మద్యం మత్తులో ఉన్న జనం షాక్ అవ్వాల్సిందే. -
లగ్జరీ బైక్పై హీరోయిన్ సందడి, లుక్స్లో ఎక్కడా తగ్గేదెలే!
గత నెలలో టూ వీలర్ లైసెన్స్ టెస్టుకు హాజరై వార్తల్లో నిలిచిన మంజు వారియర్, తాజాగా రూ. 21 లక్షల బైక్ కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి. తునివు సినిమాలో అజిత్ సరసన నటించిన ఈ మలయాళీ భామ ఆయన స్ఫూర్తితోనే ఖరీదైన 'బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్' బైక్ కొనుకోలు చేసింది. ఈ విషయాన్ని మంజు వారియర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందులో బైక్ డెలివరీ తీసుకోవడం, రైడింగ్ చేయడం వంటి దృష్ట్యాలు చూడవచ్చు. బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్ బైక్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటి. అజిత్ వంటి సెలబ్రిటీలు ఈ బైక్ కొనుగోలు చేశారు. బహుశా ఇంతటి ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన మొదటి సినీ నటి మంజు వారియర్ కావచ్చు. ఇప్పటికే ఈమె వద్ద ల్యాండ్ రోవర్, మారుతి బాలెనొ కార్లతో పాటు మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బైక్స్ రూపొందించబడ్డాయి. ఈ బైక్ ట్విన్-సిలిండర్ 1254సిసి ఇంజన్ 134 బిహెచ్పి పవర్ 143 ఎన్ఎమ్ టార్క్ని జనరేట్ చేస్తుంది. ఇది 20 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది. డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ తనకు తానే సాటిగా ఉంటుంది. A tiny step of courage is always a good place ❤️ P.S : Got to go a looooong way before I become a good rider, so if you see me fumbling on the roads, please be patient with me 😊🙏 Thank you for being an inspiration to many like me #AK #AjithKumar sir ❤️🙏#bmw #gs1250 #bmwkochi pic.twitter.com/XoiB9vZUVO — Manju Warrier (@ManjuWarrier4) February 17, 2023 -
టయోటా లగ్జరీ కారు సొంతం చేసుకున్న ఫస్ట్ సెలబ్రిటీ: ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: ఖరీదైన వాహనాలను కొనాలని అందరికి ఉంటుంది. కానీ అది చాలా వరకు పారిశ్రామిక వేత్తలకు, సెలబ్రటీలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల పంజాబీ సింగర్ 'గురుదాస్ మాన్' టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 ధర రూ. 2.1 కోట్లు. ఇది వైట్ పెర్ల్, సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, ఆల్టిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ మైకా కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. ఇందులో గురుదాస్ మాన్ ఆల్టిట్యూడ్ బ్లాక్ కలర్ కారుని డెలివరీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 కోసం రూ. 10 లక్షల టోకెన్తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మొత్తం అమ్ముడైపోవడం గమనార్హం. ఇది 3.3-లీటర్, టర్బోచార్జ్డ్, V6 డీజిల్ ఇంజిన్ కలిగి 309 పిఎస్ పవర్ & 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ల్యాండ్ క్రూయిజర్ LC300లో 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. గురుదాస్ మాన్ పంజాబ్కు చెందిన సింగర్, రచయిత కూడా. ఇతడు 1980లో దిల్ దా మామ్లా హై అనే పాటతో ఒక్కసారిగా పేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ 2013 లో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ల్యాండ్ క్రూయిజర్ డెలివరీ సమయంలో కూడా పంజాబీ పాటతో అలరించాడు. -
MBA Chai Wala: అపుడు టీ బిజినెస్తో కోట్లు, ఇపుడు మళ్లీ వార్తల్లోకి..విషయం ఏమిటంటే..!
సాక్షి, ముంబై: కష్టపడి పనిచేసేవారు బాగుపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అది ఏ రంగంలో అయినా కావచ్చు, నీకున్న నిబద్దత నిన్ను తప్పకుండా గొప్పవాడిగా ఎదిగేలా చేస్తుంది అనటానికి 'ప్రఫుల్ బిల్లోర్' అలియాస్ 'MBA చాయ్ వాలా' మంచి ఉదాహరణ. ప్రఫుల్ బిల్లోర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 'ఎంబీయే చాయ్ వాలా' అంటే మాత్రం ఎక్కువ మందికి తెలుసు. MBA మధ్యలోనే ఆపేసి IIM అహ్మదాబాద్ వెలుపల ఎనిమిది వేల రూపాయలతో టీ స్టాల్ ప్రారంభించి ఈ రోజు రూ. 90 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు. అసలు ఎవరీ MBA చాయ్ వాలా మధ్యప్రదేశ్లో బీకామ్ పూర్తి చేసిన 'ప్రఫుల్ బిల్లోర్' ఎంబీఏ చేయాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ మంచి ర్యాంక్ రాకపోవడంతో ఉపాధికోసం అంట్లు తోమే పనిలో చేరాడు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే పట్టుదల అతణ్ణి నిద్ర పోనీయలేదు. అంతే...తాను ఎంబీఏ చేయాలనుకున్న క్యాంపస్ పక్కెనే టీ స్టాల్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ కోట్ల బిజినెస్ను సాధించాడు. తనలాంటివారికి ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచాడు. అలా చిన్న టీ స్టాల్ తో ప్రారంభమైన ప్రఫుల్ దేశవ్యాప్తంగా ‘ఎంబీయే చాయ్ వాలా’ పేరుతో పాపులర్ అయ్యాడు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నాడు. అంతేకాదు ఎంబీఏ చాయ్వాలా అకాడమీని ప్రారంభించి ఆంట్రప్రెన్యూర్షిప్లో స్పెషల్ కోర్స్ అందిస్తూ.. పెద్ద పెద్ద కాలేజీల్లో స్టూడెంట్స్కి సైతం క్లాసులు కూడా చెబుతున్నాడు. అలాగే మోటివేషనల్ స్పీకర్గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. తాజాగా అతను ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. కేవలం ఎనిమిది వేలతో ప్రారంభమైన ప్రఫుల్ ప్రయాణం ఈ రోజు మెర్సిడెస్ బెంజ్ GLE 300డి కొనుగోలు చేసే స్థాయికి చేరింది. GLE 300d అనేది బ్రాండ్ హై-ఎండ్ మోడల్, ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కారులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 245 పిఎస్ పవర్ & 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగాన్ని అందుకుంటుంది. View this post on Instagram A post shared by Prafull Billore (@prafullmbachaiwala) -
బడ్జెట్ 23: పొగరాయుళ్లకు ఝలక్, భారీగా పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక సర్వేను కూడా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి మార్గం సుగమం చేసే అనేక కొత్త పన్ను సంస్కరణలు ,రాయితీలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు పొగాకు, దాని ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా అలాగే సిగరెట్లపై ప్రత్యేక పన్నును శాతాన్ని పెంచ నున్నారనీ , ఇది ధరలలో పెరుగుదలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ 2023లో పెట్రోల్, డీజిల్ ధరలు,యూపీఐ, డిజిటల్ రూపాయికి సంబంధించిన ఇన్సెంటివ్లు ,తదితర పన్ను సంబంధిత స్కీమ్లపై ఎక్కువగా అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటన్నిటితో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులపై పన్నుపెరగుతుందనేది ఒక అంచనా. ముఖ్యంగా దాదాపు గత రెండేళ్లుగా సిగరెట్ ధరలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణను జీఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే,ఈ సంవత్సరం బడ్జెట్ 2023లో కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై జాతీయ విపత్తు ఆకస్మిక సుంకం (ఎన్సీసీడీ) పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో వాటా 10 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దానిని పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై ఎన్సీసీడీ సాధారణంగా ఐటీసీ లాంటి తయారీ కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ ఎన్సీసీడీ భారీ పెంపు వైపు కేంద్రం మొగ్గు చూపితే, అనివార్యంగా ఆ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి. -
ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు!
టర్కీకి చెందిన ప్రముఖ చెఫ్ నుస్రెత్ గోక్సె.. 'సాల్ట్ బే'గా చాలామందికి సుపరిచితమే. రెస్టారెంట్లో ఆహార పదార్థాలపై మోచేతి పైనుంచి ఉప్పుచల్లే ఈయన తీరుతో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు దేశాల్లో రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో ధర కాస్త ఎక్కువే. గతేడాది లండన్లో ఈయన రెస్టారెంట్లోని ధరలు చూసి అందరూ అవాక్కయ్యారు. మరీ ఇంత ఎక్కువా అని వాపోయారు. ఇప్పుడు అబుధాబిలోని సాల్ట్ బేకు చెందిన నుస్రే-ఈటీ రెస్టారెంట్లో ఓ బిల్లు చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ బిల్లు మొత్తం 6,15,065 దిర్హాంలు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. అక్షరాలా రూ. కోటి 30 లక్షలు. మొత్తం 10 మంది కలిసి అబుధాబిలోని సాల్ట్ బే రెస్టారెంట్కు వెళ్లారు. ఎక్కువగా ఆల్కహాలే ఆర్డర్ చేశారు. అందులో చాలా ఫేమస్ అయిన పిట్రస్ వైన్ కూడా ఉంది. 2009 నాటి ఈ వైన్కే దాదాపు రూ.కోటి రూపాయల బిల్లు అయింది. ఇతర ఫుడ్, వ్యాట్తో కలిపి మొత్తం రూ.1.3 కోట్ల బిల్లు అయింది. ఈ బిల్లు రషీదును స్వయంగా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు సాల్ట్ బే. 'నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు'ని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. మరీ ఆ రేంజ్లో ధరలు ఏంటని సాల్ట్బేను కొందరు ఏకిపారేశారు. కొంతమందైతే అతడ్ని అన్ఫాలో కూడా చేశారు. ఎందుకంత ధర..? అయితే ఈ బిల్లులో ఫ్రెంచ్ ఫ్రైస్ ధర 45 డాలర్లు(రూ.3,600)గా ఉంది. దీంతో ఓ నెటిజన్.. బంగాళాదుంపలు ఏమైనా చంద్రుడిపై కాస్తున్నాయా? ఎందుకంత ధర అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైన్కీన్ బీరు ధర కూడా 55 డాలర్లుగా ఉంది. ఇది ఒక్క బీరు ధరా? లేక 12 బీర్ల ప్యాక్కా? అని ఓ యూజర్ సెటైర్లు వేశాడు. మరో నెటిజన్ అయితే.. సాల్ట్ బేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవ్వు పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి స్వతహాగా ఈ స్థాయికి చేరుకున్నావు. నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. కానీ నీ రెస్టారెంట్లో ధరలు ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి. కేవలం సంపన్నుల కోసమేనా. నువ్వు చెఫ్ కాదు చీప్ అంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు సాల్ట్ బే మాత్రం ఈ బిల్లుపై వస్తున్న విమర్శలు అసలు పట్టించుకోలేదు. తన స్టయిల్లోనే ముందుకు సాగుతున్నాడు. ఓ స్టీక్కు(కాల్చిన మాంసం ముద్ద) గోల్డ్ కోట్ చేసి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఫెడరల్ బ్యాంక్ 24 క్యారట్ల బంగారంతో ఈ స్టీక్కు కోటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు మరోసారి షాక్ అయ్యారు. చదవండి: కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా..