Festive season
-
Sankranti 2025 : భోగి ‘మంట నూనెలు’ పిండి వంటలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంతకూ తగ్గమంటున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. పిండివంటల నూనెలు మండిపోతున్నాయి. ఇక రోజూ వంటల్లో సరిపడా నూనె వాడేందుకే ఒకటికి, రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో రోజుకు వందల టన్నుల వంటనూనెల అమ్మకాలు జరుగుతున్నాయి. గృహ అవసరాలకే కాకుండా హోటల్స్, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధరకాల వంట నూనెలు భారీగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి పండుగ రావడంతో నగరంలో వంట నూనెల డిమాండ్ మూడింతలు ఎక్కువైంది. దీంతో నూనె ధరలు ఆమాంతం పెరిగాయి. హోల్సెల్ మార్కెట్ అన్ని రకాల నూనెలపై ధర రూ.5 నుంచి రూ.8 పెరిగింది. రిటైల్, బహిరంగ మార్కెట్లో ప్రతి లీటరు నూనెపై రూ.12 నుంచి రూ.15 పెరిగింది. అన్ని రకాల నూనెల ధరలు భగ్గుమంటున్నాయి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్, వేరుశనగ, రైస్బ్రాన్.. ఇలా అన్ని రకాల నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెలకు సంబంధించి హోల్సేల్ ధరలు, రిటైల్ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హోల్సేల్ మార్కెట్లో పామాయిల్ కిలో ధర రూ.100 నుంచి రూ.105కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ.115కు చేరింది. సన్ఫ్లవర్ ఆయిల్ హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.130 నుంచి రూ.140 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.145–150 పలుకుతోంది. కిలో వేరుశనగ నూనె ధర నెల క్రితం రూ.150 ఉండగా, ఇప్పుడు రూ.165కు పెరిగింది. వీటితోపాటు రైస్బ్రాన్ ఆయిల్ ధర రూ.140 నుంచి రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. ఈ స్థాయిలో వంటనూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే ముడి ఆయిల్పై సుంకాన్ని 5–10 శాతం నుంచి ఏకంగా 45 శాతానికి ప్రభుత్వం పెంచిందని, అందుకే ధరలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. వంటనూనెల ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వంటనూనెలపై దిగుమతి సుంకం పెరగడం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. పాత స్టాక్ను గోడౌన్లలో దాచేసి ధరలు పెంచి అమ్ముతున్నారు.ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే -
అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్
కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారికి జియో ఓ శుభవార్త చెప్పింది. 2024 డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య 'జియో పేమెంట్స్ బ్యాంక్' (Jio Payments Bank)లో కొత్త సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసిన కస్టమర్లకు రూ. 5,000 విలువైన రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది.మెక్డొనాల్డ్స్, ఈజ్మైట్రిప్(EaseMyTrip), మ్యాక్స్ ఫ్యాషన్ (Max Fashion) ప్రముఖ బ్రాండ్ల కూపన్లను.. జియో పేమెంట్స్ బ్యాంక్ రివార్డులలో భాగంగా అందించనుంది. డిజిటల్ ఫస్ట్ విధానానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్యాంకులో కస్టమర్లు కేవలం ఐదు నిమిషాలలోపు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే - ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.ఆన్లైన్ విధానం➤గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో జియో మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించి జియో మనీ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.➤రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా మీ ఖాతాను ధృవీకరించండి.➤ధ్రువీకరించిన తరువాత మీ వ్యక్తిగత వివరాలు, చిరునామాతో పాటు.. ఇతర అవసరమైన సమాచారంతో అప్లికేషన్ ఫామ్ను పూరించండి.➤అప్లికేషన్ ఫామ్ పూరించిన తరువాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి.➤తరువాత యూజర్ నేమ్, పాస్వర్డ్ను క్రియేట్ చేసుకుని.. మీ ఖాతాను సెటప్ చేయండి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించి మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.ఆఫ్లైన్ విధానం➡సమీపంలోని జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి.. జియో రిప్రెజెంటేటివ్ను కలవని.➡జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ తీసుకుని, అవసరమైన వివరాలను ఫిల్ చేయండి. ➡మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను అందివ్వండి. ➡ఇవన్నీ పూర్తయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను ధృవీకరించండి.➡యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి వాటిని సెట్ చేసుకోవడం ద్వారా మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.అవసరమైన డాక్యుమెంట్స్ & అర్హతలు● జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్) వంటివి అవసరమవుతాయి.● 18 సంవత్సరాలు నిండి, చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగిన భారతీయులు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. -
మూడు నగరాలు.. ఆరు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు దృష్టి సారించాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్కు డిమాండ్ పెరగడంతో.. అటువైపు ఈ సంస్థలు దృష్టికేంద్రీకరిస్తున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల విస్తరణ సవాళ్లతో కూడుకున్నది.అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు ఈ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అంతబాగా లేకపోవడం, వాతావరణంలో మార్పులు, విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇతర సౌకర్యాల పెంపునకు ఈ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో తదితర ఈ –కామర్స్ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఇటీవల ‘ద బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2,800 చిన్న పట్టణాలు, కమలాపురం, వాడర్, సిహోర్, బన్సాతర్ ఖేడా, వెరంగ్టే, భోటా (టయర్–4 సిటీస్ తో సహా) వంటి ప్రాంతాల్లో వాల్యూ–కామర్స్ ప్లాట్ఫామ్ షాప్ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరిచింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా ఈ –కామర్స్ విక్రయాల పెరుగుదలను బట్టి అవగతమౌతోంది.గ్రామీణ ప్రాంతాల నుంచే ఎలక్ట్రాన్రిక్స్, ఫ్యాషన్, మొబైల్, హోం, సౌందర్య సాధనాలకు అధిక డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయా సంస్థలు గుర్తించాయి. మొత్తం సెల్ఫోన్ అమ్మకాల్లో 75 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి ఉండడంతో.. అక్కడే ఈ సంస్థలు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఇదే సమయంలో.. చిన్నపట్టణాలు, నగరాల్లో ఈ–కామర్స్ సర్వీసులు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్థానికంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో.. ఫ్లిప్కార్ట్ సంస్థ తొమ్మిది నగరాల్లో 11 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. 40 ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు స్థానికంగా ఉంటున్న వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి. ఇవి ప్రధానంగా రవాణా, ప్యాకేజింగ్, రిటైల్ రంగాల్లో వృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్–2024లో భాగంగా (సెపె్టంబర్ 27న మొదలై నెలపాటు సాగింది) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా వెల్లడైంది. అమెజాన్ ద్వారా ‘నో–కాస్ట్ ఈఎంఐ’ లావాదేవీలు 40 శాతానికి పైగా పెరిగినట్టు స్పష్టమైంది.మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వీడియో గేమ్ల వంటి వాటికి మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తేలింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే 75వ శాతానికి పైగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడైంది. అందులోనూ అన్ని ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు 70 శాతం (రూ.30 వేలకు పైగా) జరిగాయి. చిన్ననగరాలు, పట్టణాల నుంచి 80 శాతం టీవీ కొనుగోలు ఆర్డర్లు వచి్చనట్టు తెలుస్తోంది.అమెజాన్ తన రెండువేల డెలివరీ స్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాలను చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రమట్టానికి 1,372 మీటర్ల ఎగువనున్న ఉత్తరాఖండ్ గజోలిలోని మహరిషీ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన మొట్టమొదటి ఈ–కామర్స్ ప్లాట్ఫామ్గా అమెజాన్ రికార్డ్ను నెలకొల్పడం విశేషం. ఈ సంస్థ తన వస్తు సరఫరాను అండమాన్ నికోబార్ దీవులకు కూడా విస్తరించింది. భారత రైల్వేలు, ఇండియా పోస్ట్ల భాగస్వామ్యంతో అమెజాన్ ఎయిర్ సరీ్వస్ను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు మీషో సంస్థ కూడా తన మెగా బ్లాక్బస్టర్ సేల్తో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. -
82,000పైకి బంగారం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పటిష్ట ధోరణికితోడు దేశంలో పండుగల సీజన్ బంగారం ధరకు ఊతం ఇస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర మొదటిసారి రూ.82 వేల మైలురాయిని దాటి రూ.82,400ను తాకింది. మంగళవారం ముగింపుతో పోలి్చతే ఏకంగా రూ.1,000 పెరిగింది. 99.5 స్వచ్ఛత ధర సైతం రూ.1,000 పెరిగి రూ.82,000కు ఎగసింది. గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ (రూ.61,200) నుంచి పసిడి ధర ఏకంగా 35 శాతం పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.1,300 పెరిగి రూ.1,01,000కు ఎగసింది. గడచిన ఏడాది కాలంలో రూ.74,000 నుంచి ఈ మెటల్ విలువ 36 శాతం పెరిగింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) 20 డాలర్లు పెరిగి ఆల్టైమ్ రికార్డు 2,801.65 డాలర్లను చేరింది. ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో కూడా దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతుండడం గమనార్హం. ఇందుకు అనుగుణంగానే దేశీయ ఫ్యూచర్స్లో గరిష్ట స్థాయి ధరల్లో పసిడి ట్రేడవుతోంది. -
ఫ్లిప్కార్ట్ సరికొత్త రికార్డ్: పండుగ సీజన్లో..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ పండుగ సీజన్లో (సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 28 వరకు) 720 కోట్ల సందర్శనలను నమోదు చేసి భారీ కస్టమర్ ఎంగేజ్మెంట్ పొందింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్ 2 నగరాలలోని ప్రజలు ఎక్కువగా ఫ్లిప్కార్ట్ను సందర్శించినట్లు సమాచారం.కస్టమర్లు ఎక్కువగా షాపింగ్ అవసరాల కోసం ఫ్లిప్కార్ట్ సైట్ విజిట్ చేరారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏట పెరిగిన భాగస్వామ్యం, మెరుగైన ఆఫర్లు వంటివి అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని సాధించేలా చేశాయి. అంతే కాకుండా ఈ సారి సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల కస్టమర్లు ఉన్నారు.ఎక్కువ మంది పండుగ సీజన్లో ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్, అప్లయెన్సెస్, బ్యూటీ, జనరల్ మర్చండైజ్ వంటి కేటగిరీలలో ఉత్పత్తుల కోసం సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ల్యాప్టాప్లు, టాబ్లెట్ల కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సెర్చింగ్ విషయంలో కూడా ఈ ఏట 17 వృద్ధి నమోదైంది.సమర్థ్ సేల్ ఈవెంట్పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ సమర్థ్ సేల్ ఈవెంట్ ఎనిమిదవ ఎడిషన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇందులో వందలాది మంది కళాకారులు, చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో 25,000కు పైగా ప్రత్యేకమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ 18 లక్షల ప్రజల జీవనోపాధిపై సానుకూలంగా ప్రభావం చూపింది. ఇది ఆర్థిక వృద్ధిని దోహదపడింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా శక్తివంతమైన ఈ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ సాధించిన వృద్ధి గురించి కంపెనీ గ్రోత్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ విభిన్న ఆఫర్లతో పండుగ సీజన్ను ప్రారంభిస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మా పరిధిని విస్తరించడం ద్వారా మారుమూల ప్రాంతాలలోని కస్టమర్లకు కూడా సేవలందించాము. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించగలిగామని అన్నారు.ఇదీ చదవండి: భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్లక్షకు పైగా ఉద్యోగాలుపండుగ సీజన్లో కస్టమర్లకు వేగవంతమైన డెలివరీలను అందించడానికి ఫ్లిప్కార్ట్ లక్ష కంటే ఎక్కువ జాబ్స్ (గిగ్ వర్కర్స్) సృష్టించింది. ఈ సీజన్లో ఫ్లిప్కార్ట్.. కస్టమర్లకు మాత్రమే కాకుండా, అమ్మకందారులు, లక్షలాది మంది ఎంఎస్ఎంఈలకు, కళాకారులు, కిరానా భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చడంపై దృష్టి సారించింది. -
బీఎఫ్ఎస్ఐలో జోరుగా నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా వ్యక్తిగత రుణాలతో పాటు టూవీలర్లు, కార్లు మొదలైన వాహన రుణాలకు డిమాండు 12 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్లో వినాయక చవితితో మొదలై నవంబర్ వరకు కొనసాగే పండుగల సీజన్లో కార్యకలాపాలను సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆర్థిక సంస్థలు ఈ బిజీ వ్యవధిలో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు అందించగలిగే, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించగలిగే నైపుణ్యాలున్న సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. స్టాఫింగ్ సేవల సంస్థ టీమ్లీజ్ నివేదిక ప్రకారం బీఎఫ్ఎస్ఐ రంగంలో రిటైల్ రుణాలు, సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), పేమెంట్ సేవల విభాగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి. పండుగ సీజన్ దన్నుతో జూలై–నవంబర్ మధ్య కాలంలో ఈ విభాగాల్లో కొలువులు సంఖ్య 12,000 నుంచి 19,000కు పెరిగే అవకాశం ఉందని టీమ్లీజ్ పేర్కొంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడం, చిన్న మొత్తాల్లో రుణాలివ్వడంపై మైక్రోఫైనాన్స్ ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో ఎంఎఫ్ఐ సరీ్వసులకు డిమాండ్ 25 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, పేమెంట్ సరీ్వసుల్లో హైరింగ్ 41 శాతం పెరుగుతుందని, క్రెడిట్ కార్డుల విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ 32 శాతం పెరుగుతాయని టీమ్లీజ్ వివరించింది. కొత్త నైపుణ్యాల్లో సిబ్బందికి శిక్షణ .. ఆర్థిక సేవల సంస్థలు కేవలం సిబ్బంది సంఖ్యను పెంచుకోవడమే కాకుండా బిజీ సీజన్లో మార్కెట్ డిమాండ్కి తగ్గ సేవలందించేలా ప్రస్తుత ఉద్యోగులకు కూడా కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపైనా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఎప్పుడైనా సరే పండుగ సీజన్లో బీఎఫ్ఎస్ఐపై అధిక ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ ఏడాది నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అసాధారణంగా పెరిగింది. రిటైల్ రుణాల నుంచి పేమెంట్ సేవల వరకు ఈ పరిశ్రమలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా డేటా ప్రకారం కంపెనీలు కూడా పరిస్థితులకు తగ్గట్లే స్పందిస్తున్నాయి. కీలకమైన ఈ సీజన్లో నిరంతరాయ సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకుంటున్నాయి. అలాగే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతున్నాయి’’ అని టీమ్లీజ్ సర్వీసెస్ వీపీ కృషే్ణందు చటర్జీ తెలిపారు. -
స్విగ్గీ కొత్త ఫీచర్: విదేశాల్లో ఉంటూనే..
పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ 'ఇంటర్నేషనల్ లాగిన్' పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యూఏఈతో సహా 27 దేశాలలోని వినియోగదారులు ఫుడ్ డెలివరీ, కిరాణా షాపింగ్ వంటి వంటివి చేయడానికి అనుమతిస్తుంది.భారతదేశంలోని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు అవసరమైన వస్తువులు లేదా బహుమతులను ఆర్డర్ చేయడానికి లేదా పంపడానికి స్విగ్గీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్లు, యూపీఐ ఎంపికలతో డబ్బు చెల్లించవచ్చు.స్విగ్గీ ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్ ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కిరాణా లేదా నిత్యావసర వస్తువులను ఇంటికి పంపించడానికి పనికొస్తుంది. అంతే కాకుండా.. కుటుంబ సమావేశాలకు, ముఖ్యంగా పండుగల సమయంలో ఫుడ్, గిఫ్ట్స్ వంటివి చాలా అవసరం. అయితే విదేశాల్లో నివసిస్తున్న వారు నేరుగా గిఫ్ట్స్, ఫుడ్ ఇవ్వలేరు. కాబట్టి ఇంటర్నేషనల్ లాగిన్ ద్వారా ప్రత్యేక సందర్భాలలో తమ ప్రియమైన వారికి ఇలాంటివి స్విగ్గీ ద్వారా అందించి ఆశ్చర్యపరచవచ్చు.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంస్విగ్గీ గురించి2014లో ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉంటూ సుమారు 600 కంటే ఎక్కువ నగరాల్లో రెండు లక్షల కంటే ఎక్కువ రెస్టారెంట్లతో సహకరిస్తోంది. 43 నగరాల్లో పనిచేస్తున్న స్విగ్గీ ఇన్స్టామార్ట్ కేవలం 10 నిమిషాల్లో 20 కంటే ఎక్కువ కిరణా, ఇతర నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తోంది. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా స్విగ్గీ ముందుకు సాగుతోంది. -
పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు
ఈ పండుగ సీజన్లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో కార్ల తయారీ సంస్థలు స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేశాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా, జీప్, రెనాల్ట్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన స్పెషల్స్ ఎడిషన్స్ ఏవనే వివరాలు తెలుసుకుందాం.స్పెషల్ ఎడిషన్స్ ➺మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్➺మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్➺మారుతి గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్➺మారుతి బాలెనో రీగల్ ఎడిషన్➺టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా రూమియన్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్➺మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్➺జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్➺రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్➺ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్➺క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్పెషల్స్ ఎడిషన్స్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే పొందినట్లు సమాచారం. వీటికి అదనంగా యాక్ససరీస్ ఫ్యాక్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. ధరలు కొనుగోలుదారు ఎంచుకునే యాక్ససరీస్ ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని కార్లు ఈ నెల చివర వరకు మాత్రమే విక్రయానికి ఉండనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీ సమీపంలోనే కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్ఫామ్ ఫీజు
జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజును పెంచిన తరువాత.. స్విగ్గీ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. ఇప్పటికే 7 రూపాయలుగా ఉన్న ప్లాట్ఫామ్ ఫీజును రూ. 10లకు చేసింది. అంటే మూడు రూపాయలు పెంచిందన్నమాట. కాబట్టి ఇకపైన స్విగ్గీ ప్రతి ఆర్డర్ మీద రూ. 10 ఫీజు వసూలు చేస్తుంది.జొమాటో ప్లాట్ఫామ్ ఫీజులను పెంచిన తరువాత స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటికే యాప్లో కనిపిస్తున్నాయి. పండుగ సమయంలో సేవలను నిర్వీరంగా అందించడానికి ఈ ఫీజులను పెంచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇప్పుడు జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు కూడా రూ. 10లకు చేరింది.ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్ఫామ్ ఫీజులను పెంచడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఉచిత డెలివరీతో ప్రారంభమైంది, ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్ఫారమ్ ఫీజు ఇలా భారీగా పెంచేశారు అని వెల్లడించారు. డెలివరీ చార్జీలకంటే కూడా ప్లాట్ఫారమ్ ఫీజు భవిష్యత్తులో ఎక్కువవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.🚨 Swiggy Also Increased Platform Fee To ₹10This Happened Right After Zomato’s HikeFood Ordering Started With Free Delivery, Now GST, Delivery & Packing Charges, Platform FeeZomato & Swiggy Does 3.5 Million Orders Daily— Ravisutanjani (@Ravisutanjani) October 23, 2024 -
ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!
గులాబీలంటే అందరికీ ఇష్టమే. ఒకలాంటి మత్తు వాసనతో కూడిన మృదువైన శృంగార భరిత పువ్వులు. రోజెస్ కేవలం అలకరణకు మాత్రమే కాదు సౌందర్య సంరక్షణలో కూడా అమృతంలా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల నుంచి తీసిన రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చర్మం, జుట్టు రక్షణలో వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలోదీన్ని విరివిగా ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన రోజ్ వాటర్తో అద్భుతమైన ప్రయోజనాలు, ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి!మార్కెట్లో దొరికే రోజ్ వాటర్కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తయారీ చాలా సులువు కూడా.రోజ్ వాటర్ ఉపయోగాలు అన్ని రకాల చర్మాలకు చక్కగా పనిచేస్తుంది.చర్మాన్ని చల్లబర్చి ,మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి, పీహెచ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.చర్మాన్ని తేమగా ఉంచి, ఫ్రెష్గా, మెరిసేలా చేస్తుంది. సన్ బర్న్స్ తగ్గిస్తుంది.విటమిన్ ఏ సీ పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది. చర్మంపై మచ్చలు కాలిన గాయాలను నయం చేసే అద్భుత సామర్థ్యం రోజ్ వాటర్లో ఉంది. కలిగి ఉంటాయి.ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలిచీడ పీడ లేని తాజా గులాబీరేకులను శుభ్రంగా నీటిలో బాగా కడగండి. ఒక గిన్నెల నీళ్లు తీసుకొని బాగా మరిగించడం. ఆ నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులను నీటిలో వేసి, తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కనీసం 4-5 గంటలు అలానే పక్కనపెట్టండి. దీంతో గులాబీ రేకుల్లోని లక్షణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. బాగా చల్లారిన తరువాత చక్కగా వడబోసుకుని తడిలేని గాజు సీసాలోకి తీసుకోవాలి. మంచి సువాసనతో ఉన్న ఈ రోజ్ వాటర్ను ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. ఎలా వాడాలి?రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజ్ వాటర్లో ముంచిన కాటన్ బాల్స్ను ప్రతిరోజు ఉపయోగిస్తే నల్ల వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంగా మెరిసేలా చేస్తాయి. ముల్తానా మట్టి, ఇతర ఫేస్ప్యాక్లలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపితే మరింత ఫ్రెష్లుక్ వస్తుంది. -
ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలో ఓ మంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని కొందరు ఆలోచించవచ్చు. అలాంటి వారు ఏ కారు కొనాలి? దాని ధర ఎంత ఉంటుందనే సమాచారం కోసం వెతికే అవకాశం ఉంది. ఇలాంటి వారి సందేహాలకు సమాధానమే ఈ కథనం..ఎంజీ విండ్సర్ ఈవీఇటీవల భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎంజీ విండ్సర్' పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.13.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని 38 కిలోవాట్ బ్యాటరీ 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.ఎంజీ కామెట్ ఈవీప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.99 లక్షలు. అయితే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. పరిమాణంలో చిన్నదిగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 230 కిమీ రేంజ్ అందిస్తుంది.టాటా టియాగో ఈవీటాటా కంపెనీకి చెందిన టియాగో ఈవీ నాలుగు వేరియంట్లు, రెండు బ్యాటరీ ప్యాక్లతో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ప్రీమియం అనుభవం కోసం హర్మాన్ సౌండ్ సిస్టమ్తో కూడిన టెక్-ఫార్వర్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా పొందుతుంది.టాటా పంచ్ ఈవీదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ ఈవీ కూడా పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 265 కిమీ మరియు 365 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని ధరలు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.ఇదీ చదవండి: మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..సిట్రోయెన్ ఈసీ3ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఈసీ3 ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.2 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. -
స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన జీప్.. పూర్తి వివరాలు
భారతదేశంలో జీప్ కంపెనీ తన ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'కంపాస్ స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 25.26 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. కొత్త కాస్మొటిక్ డిజైన్స్ అన్నీ కూడా దీనిని స్పెషల్ ఎడిషన్ కారుగా గుర్తించడానికి సహకరిస్తాయి.కొత్త జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ బానెట్పై డ్యూయల్-టోన్ డికాల్తో పాటు ఆరవ గ్రిల్ స్లాట్పై వెల్వెట్ రెడ్ కలర్ ఉండటం చూడవచ్చు. లోపలి భాగంలో కూడా ఎక్కువ భాగం ఎరుపు రంగులోనే ఉండటం చూడవచ్చు. ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 43000 ఎక్కువ ధర వద్ద లభిస్తోంది.ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?కొత్త జీప్ స్పెషల్ ఎడిషన్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ తప్పా.. ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి కంపాస్ యానివర్సరీ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 350 న్యూటన్ మీటర్ టార్క్, 170 హార్స్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
బంగారం, వెండికి పండుగ డిమాండ్
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు పండుగల డిమాండ్ తోడయ్యింది. ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.200 పెరిగి ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ.78,300కు చేరింది. స్టాకిస్టులు, రిటైల్ కస్టమర్ల నుంచి పసిడికి డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ పేర్కొంది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.665 ఎగసి రూ.93,165కు చేరింది.మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కమోడిటీ మార్కెట్లు బుధవారం పనిచేయని సంగతి తెలిసిందే. నవరాత్రి ప్రారంభంలో డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ మెరుగ్గా మారిందని, హిందూ పురాణాల ప్రకారం కొత్త వస్తువులను ముఖ్యంగా విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన వారమని వ్యాపారులు తెలిపారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో రూ.200కుపైగా లాభంతో రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ధర రూ.400కుపైగా పెరిగింది. వెండి సైతం రూ.1,000కిపైగా లాభంతో రూ. 92,453 వద్ద ట్రేడవుతోంది. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఈ బైక్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్..
పండుగ సీజన్ మొదలవుతోంది. దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించేసాయి. ఈ తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన రైడర్ 125 మీద తగ్గింపులను ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 84,869కే లభిస్తుంది.టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ 130 మిమీ డ్రమ్ బ్రేక్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ అదే 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.2 న్యూటన్ మీటర్ టార్క్, 11.4 హార్స్ పవర్ అందిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఆఫర్స్ అందిస్తున్న కంపెనీల జాబితాలో టీవీఎస్ మాత్రమే కాకుండా.. చాలా కార్ల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రాబోయే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలను పెంచడానికి, కస్టమర్లను ఆకర్శించడానికి ఈ ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలు వీటి గురించి పూర్తిగా కనుక్కున్న తరువాత కొనుగోలు చేయడం ఉత్తమం. -
పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్: ఇవి గుర్తుంచుకోండి
దసరా, దీపావళి ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తున్నాయ్. ఈ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం మొదలుపెట్టేస్తాయి. ఇదే అదనుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు కూడా తమదైన రీతిలో దోచుకోవడానికి సిద్దమైపోతారు. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలి.. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా.. అధికారిక వెబ్సైట్లలోనే సెర్చ్ చేయాలి. తక్కువ రేటుకు లభిస్తున్నాయి కదా.. అనుకుని అనధికార వెబ్సైట్లలో బుక్ చేయడం వంటివి చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే డబ్బు చెల్లించిన తరువాత బహుశా డెలివరీ రాకపోవచ్చు. ఒకవేళా వచ్చిన నాణ్యమైనవి వస్తాయనే గ్యారంటీ ఉండదు. కాబట్టి మీరు ఎంచుకునే వెబ్సైట్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి.మెసేజ్ అలర్ట్ లేదా ఈ-మెయిల్ అలర్ట్.. ఈ పండుగ సీజన్లో గుర్తు తెలియని నెంబర్స్ నుంచి భారీ ఆఫర్స్ అనే విధంగా మెసేజిలు లేదా ఈ మెయిల్ అలర్ట్ వంటివి వస్తుంటాయి. ఇలాంటి వాటికి స్పందించకపోవడమే ఉత్తమం. తెలియని నెంబర్ల నుంచి వచ్చే సందేశాలను క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.పిన్ నెంబర్ ఉపయోగించడంలో జాగ్రత్త వహించడం.. మీరు ఆన్లైన్ షాపించి చేసేటప్పుడు ఒక్కో పోర్టల్కు ఒక్కో పాస్వర్డ్ ఉపయోగించడం ఉత్తమం. అన్ని పోర్టల్లకు ఒకటే పాస్వర్డ్ ఉపయోగిస్తే.. ఎవరైనా హ్యాక్ చేసే సమయంలో అన్ని అకౌంట్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.సాఫ్ట్వేర్ అప్డేట్స్.. ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లలో మీ డేటాను రక్షించడానికి సులభమైన మార్గాలలో ఒకటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం. ఇది మీ డేటా భద్రతకు సహాయపడతాయి. ఇది సైబర్ దాడుల నుంచి కూడా రక్షిస్తుంది. పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్ అవసరం ఉంటే తప్ప ఇవ్వకూడదు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఫ్రీ హాట్స్పాట్ల వాడకం.. పబ్లిక్ ప్రదేశాల్లో.. ఉచితంగా అందుబాటులో ఉండే హాట్స్పాట్లను ఉపయోగించే షాపింగ్ చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. ఇలాంటి సమయంలోనే హ్యాకర్స్ ఎక్కువగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది.యాప్స్ డౌన్లోడ్.. మీకు అవసరమైన లేదా డౌన్లోడ్ చేయాలనుకునే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ వంటి వాటిలో ఉన్నాయా? లేదా? అని నిర్థారించుకోండి. ఎందుకంటే.. కొంతమంది ఫేక్ యాప్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాంటివి డౌన్లోడ్ చేస్తే అనుకోని నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. -
దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో.. ఈ కామర్స్ సంస్థలు భారీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో మీషో చేరింది. ఇప్పుడు తాగాజా అమెజాన్ అడుగుపెట్టింది.అమెజాన్ ఇండియా 1.1 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో మహిళలు, వికలాంగుల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.దేశంలోని అన్ని ప్రాంతాల కస్టమర్ల అవసరాలను సకాలంలో తీర్చడానికి అమెజాన్ ఈ ఉద్యోగాలను సృష్టించింది. పండుగ సీజన్లో.. భారతదేశం అంతటా 1 లక్షకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న అమెజాన్ చర్య ప్రశంసనీయమైన కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' పేర్కొన్నారు.ప్రాజెక్ట్ ఆశ్రయ్అమెజాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశ్రయ్ వంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా నగరాల్లో డెలివరీ అసోసియేట్ల కోసం ప్రత్యేక విశ్రాంతి పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. ఇవి ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంఅమెజాన్ సుశ్రుత అనే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా ట్రక్ డ్రైవర్లకు ముందస్తుగా గుర్తించడం, రోగనిర్ధారణ చేయడం, ఎంచుకున్న ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ఆన్సైట్ వైద్య సదుపాయాల వంటి వివిధ సౌకర్యాలను అందజేస్తుంది. -
పండుగల సీజన్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా, దీపావళి పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు (07442) ప్రత్యేక వారాంతపు రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం నడవనుంది. అదే విధంగా శ్రీకాకుళం రోడ్డు–తిరుపతి (07443) రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం నడవనుంది. రెండు మార్గాల్లో ఈ రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంది. -
పండగల వేళ : చందమామలా మెరిసిపోవాలంటే!
వరుస పండుగల సీజన్ వచ్చేస్తోంది. వినాయక చవితి మొదలు తెలుగుముంగిళ్లు దసరా, దీపావళి,సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. అంతేనా ఆడబిడ్డలు పట్టుచీరలు, కొత్త నగలు అంటూ షాపింగ్తో సందడిగా ఉంటారు. దీనికి తోడు గృహిణులు, కొత్తకోడళ్లు, కొత్త పెళ్లి కూతుళ్లు తమ అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో బిజీబిజీగా ఉంటారు. మరి ముఖం, చర్మం, మెరుస్తూ చందమామలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. అవేంటో ఒకసారి చూద్దాం.చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే, చక్కటి ఆహారం తీసుకోవాలి. పండగల సందడిలో స్వీట్లు వగైనా ఎక్కువగా తినేస్తాం కాబట్టి ఒంటికి కాస్తంత పని చెప్పాలి. కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్, యోగా లాంటి వ్యాయామం తప్పని సరి. అలాగే రోజుకు సరిపినన్ని నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ఒక ఆరోగ్య సంరక్షణ, ముఖ సౌందర్య విషయానికి వస్తే... కొవ్వు పదార్థాలకు దూరంగా, అప్పుడప్పడు కొన్ని ఆరోగ్యమైన ద్రవాలను తాగుతూఉండాలి. అందమైన చందమామ లాంటి ముఖం కోసం సహజంగా దొరికే వస్తువులో ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఫేస్ మాస్క్రోజ్ వాటర్తో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. రోజ్ వాటర్, కలబంద, తేనె సహాయంతో మంచి మాస్క్ వేసుకుంటే ముఖం కొత్త కళతో మెరిసిపోతుంది. రోజ్ వాటర్లో మరికొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి ఆరోగ్యకరమై ఫేస్ మాస్క్లను తయారు చేసుకోవచ్చు. ఇంకా చర్మాన్ని బట్టి పసుపు, శెనగపిండి, పెరుగు, అలోవెరా మిశ్రమాలతో ప్యాక్ వేసుకొని, ఆ తరువాత ఐస్ ముక్కలతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.కీరా, పైనాపిల్ జ్యూస్కీరదోసలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సహజత్వాన్ని కాపాడతాయి ఇక పైనాపిల్లో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వాపులను తగ్గిస్తుంది.కీర, పైనాపిల్ ముక్కలు, తాజా పుదీనా ఆకులు వేసి జ్యూస్ చేసుకొని, దీనికి రుచుకోసం నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని తాగితే చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా మారుతుంది.ముఖంపై మంగు మచ్చులాంటివి కూడా తగ్గుతాయి. క్యారెట్, బీట్రూట్ యాపిల్ జ్యూస్ (ఏబీసీ)ఆపిల్, బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. యాపిల్, క్యారెట్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటే బీట్ రూట్ పోషకాలు మయం.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కంటి , చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇంకాజంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. పచ్చని ప్రకృతిలోగడిపితే ఆరోగ్యానికి ఆరోగ్యం మానసిక వికాసం కూడా. అంతేకాదు స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతితో డీ విటమిన్ అందుతుంది. అందమైన చర్మం కోసం ఇది చాలా అవసరం. -
దీపావళి ఆఫర్స్.. ఇప్పుడు కొంటే మంచి బెనిఫిట్స్!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించడానికి మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ సమయం కోసం ఎదురు చూసే చాలామంది కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు. మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఇప్పటికే ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా వంటి కార్ డీలర్లు తమ లైనప్లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం ఏ కారుపై ఎంత వరకు బెనిఫిట్ హ్యుందాయ్ వెర్నా - రూ. 30,000 మారుతి సుజుకి డిజైర్ - రూ. 40,000 హోండా అమేజ్ - రూ. 70,000 స్కోడా స్లావియా - రూ. 75,000 ఫోక్స్వ్యాగన్ వర్టస్ - రూ. 80,000 హోండా సిటీ - రూ. రూ. 90,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
పండుగల జోష్.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ మొదటి 15 రోజుల్లో అమ్మకాలు తగ్గగా.. తర్వాతి 15 రోజుల్లో గణనీయంగా పెరిగాయి. దీంతో విక్రయాల్లో నికర వృద్ధి నమోదైంది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ అక్టోబర్లో 3 శాతం అధికంగా 2.87 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. డీజిల్ అమ్మకాలు 5 శాతం పెరిగి 6.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అక్టోబర్ మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 9 శాతం తగ్గగా, డీజిల్ విక్రయాలు 3.2 శాతం క్షీణతను చూడడం గమనార్హం. తిరిగి దసరా నవరాత్రుల సమయాల్లో వీటి విక్రయాలు బలంగా పుంజుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ తొలి 15 రోజుల్లో పెట్రోల్ విక్రయాలు 1.17 మిలియన్ టన్నులుగా ఉంటే, తర్వాతి 15 రోజుల్లో దీనికంటే 44 శాతం అధికంగా 1.70 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు అక్టోబర్ మొదటి భాగంలో 2.99 మిలియన్ టన్నులుగా నమోదు కాగా, ద్వితీయ భాగంలో 3.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్లో డీజిల్ అమ్మకాలు 5.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు అక్టోబర్ నెలకు 6,21,200 టన్నులుగా ఉన్నాయి. 2021 అక్టోబర్ విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 6.9 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో అమ్మకాలు 6,03,600 టన్నులతో పోల్చి చూసినా 3 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఎల్పీజీ విక్రయాలు 5 శాతం వృద్ధితో 2.49 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
మరింత మెరిసిన బంగారం! దసరా అమ్మకాలు అదుర్స్..
Dussehra Gold Sales: పండుగ వేళ బంగారం మరింత మెరిసింది. ఓ వైపు గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్లో పండుగ సీజన్లో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, పీఎన్జీ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ జ్యువెలర్స్ ఈ దసరా-నవరాత్రి సమయంలో అమ్మకాలు గతేడాది కంటే 30 శాతం వరకు పెరిగినట్లుగా పేర్కొన్నాయి. ధరలు పెరుగుతున్నా.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం చెలరేగినప్పటి నుంచి బంగారం ధరలు 5.5 శాతం పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఇక అధిక్ మాసం కాలం (జులై-ఆగస్టు) నుంచి వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హమాస్ దాడులకు ముందు రూ.57,415 ఉన్న 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో రూ.60,612కి చేరింది. శ్రాద్ధ మాసం నుంచి బంగారం అమ్మకాలలో పురోగతి కనిపిస్తోందని, నవరాత్రుల సమయంలో మరింత జోరందుకుందని పీఎన్జీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు ఆయన అంచనా వేశారు. టైటాన్ ఆభరణాల విభాగం జులై నుంచి సెప్టెంబరు వరకు అమ్మకాలలో 19 శాతం పెరుగుదలను చూసింది. ఈ దసరా సందర్భంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అమ్మకాలు పెరిగాయని మలబార్ గోల్డ్ నివేదించింది. బలమైన వినియోగదారుల డిమాండ్, స్థిరమైన రిటైల్ విస్తరణ ఈ వృద్ధికి కారణమని మలబార్ గోల్డ్ చైర్మన్ అహమ్మద్ చెప్పారు. ధరల సున్నితత్వం ఉండే తూర్పు ప్రాంతాల్లో సెంకో గత దసరాతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధిని సాధించింది. వజ్రాభరణాల అమ్మకాలు 20 శాతం పెరిగాయని సెన్కో మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ తెలిపారు. ఇదీ చదవండి: Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్కే బంగారం ధరలు! -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు - కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది. 2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది. నెలవారీగా పెరుగుతూ.. నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది. 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న ఫ్లిప్కార్ట్
Flipkart The Big Billion Days: భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఈ పండుగ సీజన్ ఫ్లిప్కార్ట్కు (Flipkart) ఎలా కలిసొచ్చింది, ఎలాంటి లాభాలు వచ్చాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఫ్లిప్కార్ట్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' (TBBD) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మిలియన్ల మంది కస్టమర్ల నుంచి గొప్ప రెస్పాన్స్ పొందింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్ కేవలం 7 రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను సాధించింది. ఈ ఏడాది ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు & గృహోపకరణాల (Home Appliances) వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. థర్డ్ పార్టీ పార్టనర్లు, బ్యాంకుల సహకారంతో కొనుగోలుదారులందరికీ సంస్థ మంచి సువర్ణావకాశం అందించింది. మునుపటి కంటే ఎక్కువ అండమాన్, హయులియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), చోగ్లాంసర్ (లడఖ్), కచ్ (గుజరాత్) & లోంగేవాలా (రాజస్థాన్) ప్రాంతాలకు కూడా ఫ్లిప్కార్ట్ తన సేవలను విజయవంతంగా అందించింది. మునుపటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రెస్పాన్స్ పొందినట్లు తెలుస్తోంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను డెలివరీ చేయడం గమనార్హం. అమ్మకాల పరంగా గొప్ప వృద్ధిని సాధించిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మార్కెట్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు ఆరు రెట్లు ఎక్కువయ్యాయిన కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. బిగ్ బిలియన్ డేస్ 2023 సమయంలో సంస్థ అనేక రకాల ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్స్టంట్ సేవింగ్స్, అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ ఆఫర్ల ద్వారా కూడా అమ్మకాలు పరిగాయి. అంతే కాకుండా ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా 4 రెట్లు, ప్రీ-ఫెస్టివ్ పీరియడ్తో పోలిస్తే ఈఎమ్ఐ ద్వారా 7 రెట్లు కొనుగోళ్లు పెరిగాయి. 60 శాతం మెంబర్షిప్ ఫ్లిప్కార్ట్ వీడియో కామర్స్ ఆఫర్ ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల గంటల వీక్షణను పొందినట్లు సమాచారం. ఇది గత TBBDతో పోల్చితే 16 రెట్లు ఎక్కువ. మెంబర్షిప్లలో కూడా 60 శాతం పెరుగుల రావడం గమనార్హం. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో భారతీయులు అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కొలంబో, ఫుకెట్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. భారతదేశంలో అయితే గోవా, కొచ్చి, జైపూర్ వంటివి ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం! ది బిగ్ బిలియన్ డేస్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భమగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'కళ్యాణ్ కృష్ణమూర్తి' (Kalyan Krishnamurthy) మాట్లాడుతూ.. ఈ ఏడాది TBBD ఊహకందని ఆదరణ పొంది, అమ్మకాల్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలిపాడు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆన్ టైమ్ డెలివరీ చేయడానికి ఏకంగా ఒక లక్ష ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించాడు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
లగ్జరీ కార్ల అమ్మకాల్లో జోష్.. పండుగల సీజన్పై ఆశలు
న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కార్లకు పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుందని మెర్సెడెజ్ బెంజ్, ఆడి, లెక్సస్ భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగల సందర్భంగా ఇంతకుముందెన్నడూ లేనంతగా విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్ ఎంతో ఆశావహంగా కనిపిస్తున్నట్టు మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ఈ సీజన్ను సానుకూలంగా ప్రారంభించాం. అమ్మకాల పరంగా సానుకూలంగా ఉన్నాం’’అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన మోడళ్లు ఇందుకు మద్దతుగా నిలుస్తాయన్నారు. ఇక లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ ఇక ముందూ వృద్ధి నమోదు చేస్తుందన్నారు. డిమాండ్ ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అధిక ధనవంతులు పెరుగుతుండడం, మిలీనియల్స్, ఖర్చు పెట్టే ఆదాయం పెరగడం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని నడిపిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. గతేడాదికి మించి అమ్మకాలు ‘‘2022 అమ్మకాలను మేము ఇప్పటికే దాటేశాం. రెండో త్రైమాసికంలో మాదిరే రానున్న పండుగల్లోనూ మెరుగైన విక్రయాలు కొనసాగుతాయి. తాజా బుకింగ్లు బలంగా ఉన్నాయి’’ అని ఆనంద్ సోనీ తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కూప్, ఎల్సీ 500 హెచ్ను ఈ సంస్థ ఇప్పటికే ప్రవేశపెట్టింది. న్యూ జనరేషన్ ఎల్ఎం మల్టీపర్పస్ వెహికల్కు కూడా బుకింగ్లు ప్రారంభించనుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెల్లలో 3,474 యూనిట్లను విక్రయించినట్టు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 97 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. ‘‘మా ఎస్యూవీలు 217 శాతం అధిక అమ్మకాలు నమోదు చేశాయి. కార్ల పనితీరులో 127 శాతం వృద్ధి నెలకొంది. పండుగల సమయంలోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని అనుకుంటున్నాం’’అని సింగ్ వెల్లడించారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5 మోడళ్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు చెప్పారు. -
బంపర్ ఆఫర్.. రూ. 24900 ఎయిర్పాడ్స్ కేవలం రూ. 16749కే..
భారత్లో ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి ప్రొడక్స్ మీద కనీవినీ ఎరుగని విధంగా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకెండ్ జెన్పై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఎయిర్పాడ్స్ ప్రో 2 ధర రూ. 24,900 వరకు ఉంది. అయితే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో మాత్రం రూ. 18,499కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డుల మీద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఫలితంగా ఫ్లిప్కార్ట్లో రూ. 16,999 & అమెజాన్లో రూ. 16,749కి కొనుగోలు చేయవచ్చు. ఇదీ చదవండి: రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!! 2022లో విడుదలైన యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఈ ఏడాది సెప్టెంబర్లో వండర్లస్ట్ ఈవెంట్లో ప్రో 2 గా విడుదలైంది. ఇది లాస్లెస్ ఆడియో విత్ అల్ట్రా-లో లేటేన్సీ పొందుతుంది. ఇందులో హెచ్2 చిప్సెట్ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రోలో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. మొత్తం మీద ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్తో బడ్జెట్ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు!
పండుగ సీజన్ అనగానే వ్యాపారాలు పెరుగుతాయని అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తాయి. ఇందులో భాగంగానే ‘మీషో’ (Meesho) దాదాపు 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈకామ్ ఎక్స్ప్రెస్, డీటీడీసీ, ఎలాస్టిక్ రన్, లోడ్షేర్, డెలివరీ, షాడోఫ్యాక్స్, ఎక్స్ప్రెస్బీస్ వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కొలాబరేషన్ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఇందులో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు టైర్ 3, 4 ప్రాంతాల్లో రానున్నట్లు సమాచారం. పండుగ సీజన్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎక్స్పీరియన్ష్ సీఎక్స్ఓ సౌరభ్ పాండే అన్నారు. ఇదీ చదవండి: గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫిదా అవుతున్న నెటిజన్లు! మీషో సెల్లర్స్ పండుగ సీజన్లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్ను నియమించుకుంటారు. మీషో 80 శాతం మంది విక్రేతలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి, ఫ్యాషన్ యాక్ససరీస్, పండుగ అలంకరణ వంటి కొత్త కేటగిరీలను వెంచర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెరిగిన డిమాండ్ను ఆర్గనైజ్ చేయడానికి మీషో అదనపు స్లోరేజ్ స్పేస్ అద్దెకు తీసుకోవడంపై ద్రుష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ నియామకాలు గిగ్ జాబ్లలో గణనీయమైన వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు టీమ్లీజ్ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతోపాటు టైర్ 3 నగరాల్లో కార్యకలాపాలను మరింత పెంచడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: భారత్లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఇప్పటికే వాల్మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవల తన సప్లై చైన్లో 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్కు ముందు, పండుగ సీజన్లో కస్టమర్ డిమాండ్ను తీర్చడానికి ఫ్లిప్కార్ట్ తన పాన్-ఇండియా సప్లై చెయిన్లో మిలియన్ల కొద్దీ సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవాలని చూస్తోంది. -
పండుగ సీజన్ కోసం 2.5 లక్షల ఉద్యోగాలు.. అట్లుంటది అమెజాన్తోని!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ( Amazon) పండుగ సీజన్ కోసం యూఎస్లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. కస్టమర్లకు ఉత్పత్తులు కొనుగోలు చేసిన మరుసటి రోజే డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 2,50,000 యూఎస్ వర్కర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించింది. ఇది గత రెండేళ్లలో నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య కంటే 67 శాతం ఎక్కువ. హాలిడే సీజన్ కోసం అమెజాన్ దూకుడుగా వెళ్తుంటే మరోవైపు యూఎస్లోని ఇతర రిటైలర్ల ప్రణాళికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 2023 సంవత్సరంలో అమ్మకాలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో తమ స్టోర్లు, వేర్హౌస్లలో నియామకాలను తగ్గించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ సంవత్సరం హాలిడే అమ్మకాలు గత సంవత్సరం కంటే సగానికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) అమెరికన్ రిటైల్ సంస్థ ‘టార్గెట్’ అంచనా ప్రకారం, అమెజాన్ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 1,00,000 మంది ఉద్యోగులను నియమించుకుంటోంది. టార్గెట్ సంస్థ కూడా అక్టోబర్లో కస్టమర్లకు డిస్కౌంట్లను అందించాలని ప్లాన్ చేస్తోంది. కాగా మరో యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఇంకా హాలిడే హైరింగ్ ప్లాన్లను ప్రకటించలేదు. 2022లో ఈ కంపెనీ 40,000 మంది సీజనల్ వర్కర్లను నియమించుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. సేమ్ డే డెలివరీల దిశగా అమెజాన్ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్లో 50 కొత్త ఫిల్ఫుల్మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 10-11 తేదీల్లో ‘ఫాల్ ప్రైమ్’ ఈవెంట్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి భారీ నియామక ప్రణాళిక రావడం గమనార్హం. (Amazon Jobs: అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్తోపాటు జాబ్స్..) అమెజాన్ నియమించుకునే కొత్త సీజనల్ వర్కర్లను ఆర్డర్ల ఎంపిక, క్రమబద్ధీకరణ, ప్యాకింగ్, షిపింగ్ పనులకు వినియోగిస్తారు. వీరికి ఎంపిక చేసిన ప్రదేశాలలో 1,000 నుంచి 3,000 డాలర్లు సైన్-ఆన్ బోనస్గా చెల్లించనున్నారు. సీజనల్ వర్కర్లకు వారి పని, లొకేషన్ను బట్టీ సగటున గంటకు 17 నుంచి 28 డాలర్లు చెల్లించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
షాకిస్తున్న బంగారం ధర: కొనగలమా? నవంబరు నాటికి..!
Today Gold and Silver prices రికార్డు స్థాయి నుంచి కిందికి దిగివచ్చినట్టే వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న పండుగల సీజన్లో బంగారానికి డిమాండ్ పెరనున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో వెండి బంగారం మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 55,000కి చేరుకున్నాయి .అలాగే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60వేల దిశగా కదులుతోంది.(జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 54,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220పెరిగి రూ. 59,890 వద్ద ఉంది. అటే వెండి కూడా లాభాల్లోనే ఉంది. రూ. 700రూపాయలు ఎగిసి కిలోవెండి ధర రూ. 78,200 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ ఉండే బ్యాక్-టు-బ్యాక్ పండుగల నేపథ్యంలో సెప్టెంబరు- నవంబర్ త్రైమాసికంలో పసిడి మెరుస్తూనే ఉంటుందని,ఈ నవంబర్ 2023 చివరి నాటికి 62 వేలకు దాటవచ్చనేది అంచనా. యూఎస్ ఆర్థిక డేటా , డాలర్ , ముడి చమురు ధరలలో పెరుగుదలో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఔన్సు 2,090డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ముగిసింది. ఏది ఏమైనా బంగారం ధరలు యూఎస్ ఫెడ్ ధోరణి, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కరెన్సీ డాలరు కదలికల ఆధారంగా మారుతూ ఉంటాయి అనేది గమనార్హం. (భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు) -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్కార్ట్ మాతృ సంస్థ వాల్మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
పండుగల సీజన్లో కార్ల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల సీజన్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా సగటున 23–26 శాతంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మంగళవారం జరిగిన సియామ్ సదస్సులో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి 40.5–41 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని చెప్పారు. ఇందులో పండుగల సీజన్ వాటా 10 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 2021లో అత్యధికంగా పండుగల సీజన్లో 9.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయని వివరించారు. ఆ రెండూ జరగకపోతేనే.. ఓనమ్ విక్రయాల్లో 24 శాతం వృద్ధి సాధించామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది 3.55 లక్షల యూనిట్లతో పోలిస్తే 2023 సెపె్టంబరులో 3.61 లక్షల యూనిట్ల హోల్సేల్ అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ సెంటిమెంట్ను ప్రభావితం చేసే అధిక వడ్డీ రేట్లు, రుతుపవనాల లోటు వృద్ధికి అడ్డుకట్ట అని తెలిపారు. ఇవి రెండూ జరగకపోతే ఉపశమనం లభిస్తుందని అన్నారు. ‘వడ్డీ రేట్లు పెరగకూడదు. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అవి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనస్ 8 శాతంగా నమోదవుతున్న వర్షపాతం కారణంగా గ్రామీణుల మనోభావాలు దెబ్బతినకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. హుందాయ్ వృద్ధి 9 శాతం.. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో 9 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈ ఏడాది అర్ధ భాగం విక్రయాల్లో ఎస్యూవీల వాటా 54 శాతం నమోదైందన్నారు. ఎక్స్టర్ రాకతో జూలై, ఆగస్ట్లో ఇది 64 శాతానికి ఎగసిందని చెప్పారు. వెయిటింగ్ పీరియడ్ తగ్గిందని, తద్వారా సమయానికి డెలివరీలు అందించేందుకు వీలవుతోందని చెప్పారు. బలమైన తాజా డిమాండ్ రాబోయే కాలానికి మంచి సూచిక అన్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వివరించారు. -
గుడ్ న్యూస్ చెప్పిన ఫ్లిప్కార్ట్: ఏకంగా లక్ష ఉద్యోగాలు
వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్ రాబోయే పండుగ సీజన్లో నిరుద్యోగులకు భారీ ఉపశమనం కలిగించనుంది. రానున్న ఫెస్టివ్ సీజన్లో కస్టమర్ డిమాండ్ను తీర్చే లక్ష్యంతో తన సప్లయ్ చెయిన్లో లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. కిరాణా డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా పండుగ ఈవెంట్లో 40శాతం కంటే ఎక్కువ షిప్మెంట్లను డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. అలాగే పండుగల సీజన్లో వేలాది మందికి నైపుణ్యం , శిక్షణ అవకాశాలు కల్పించినట్టు చెప్పింది. ప్రధానంగా ఈ ఉద్యోగాలు తమ సప్లై చెయిన్లో ఉంటాయని కంపెనీ పేర్కొంది, ఇందులో ఫుల్ఫెల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ సెంటర్లు, డెలివరీ హబ్లు ఉన్నాయి. అంతేకాకుండా, లాజిస్టిక్స్కు సహాయం చేయడానికి డెలివరీ భాగస్వాముల జాబ్స్ కూడా ఉంటాయి. సరఫరా గొలుసులో లక్షకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తున్నమని ఫ్లిప్కార్ట్ గ్రూప్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ రీకామర్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , సప్లై చెయిన్ హెడ్ హేమంత్ బద్రీ తెలిపారు. ఇందులో భాగంగా హ్యాండ్హెల్డ్ పరికరాలు, PoS మెషీన్లు, స్కానర్లు, వివిధ మొబైల్ యాప్స్ నిర్వహరణలో తమ సిబ్బంది శిక్షణ పొందారని కంపెనీ పేర్కొంది. (కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?) ఉద్యోగాల కల్పనతో పాటు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అంతటా 19 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని జోడించాలని యోచిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తమ గుర్తింపును మరింత బలోపేతం చేయడం ద్వారా ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి నైపుణ్యం కలిగిన కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ హబ్లు, పెద్ద-స్థాయి నెరవేర్పు కేంద్రాలు, టైర్-III నగరాలు, బయట కూడా మరింత బలపడనున్నామనే సంకేతాలందించారు. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!) -
పనిమంతులకు ‘పండుగే’.. హైదరాబాద్, విజయవాడల్లో డిమాండ్
► పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. – లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న పండుగల సీజన్ వివిధ రంగాల్లో అవకాశాలకు తలుపులు తెరుస్తూ ఉద్యోగార్థుల్లో నయాజోష్ ను నింపుతోంది. ఈ నెలాఖరులో ‘రక్షాబంధన్’తో మొదలై కొత్త ఏడాది, ఆపై కాలం వరకు సుదీర్ఘ ఫెస్టివల్ సీజన్ జోరు కొనసాగనుంది. ఈ సీజన్ను దృష్టిలో పెట్టుకుని... వివిధ వర్గాల వినియోగదారుల పండుగ మూడ్ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు, సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వివిధ రంగాల్లో సేవలందించే ఉద్యోగులకు కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్టుగా పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఇదీ అధ్యయనం..: రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని గడిచిన ఏప్రిల్ నుంచి ఈనెల ఆగస్టు వరకు స్టాఫ్ డిమాండ్ 23 శాతం పెరిగినట్టుగా ప్రముఖ బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ సంస్థ క్వెస్ తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ కాలంలోనే 32 వేల ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడడంతో పాటు ఏడాది చివర్లో పండుగల సీజన్ ముగిసే దాకా ఈ– కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్ తదితరాల్లో ప్రతీనెల 5 వేల చొప్పున ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, టెలికం తదితర రంగాలు, విభాగాల్లో అవకాశాలు పెరిగినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు మధ్యకాలంతో పోల్చితే ఈ ఏడాది అదే కాలంలో ‘మాన్యుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్ సెగ్మెంట్’లో 245 శాతం మేర వృత్తినిపుణుల డిమాండ్ పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. రిక్రూట్మెంట్ విషయానికొస్తే...దసరా, దీపావళి పండుగల సందర్భంగా అత్యధికంగా వాహనాల కొనుగోలుకు మొగ్గు నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ ముందంజలో (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ను తట్టుకునేందుకు వీలుగా) ఉంది. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా... బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ (బీఎఫ్ఎస్ఐ)కి సంబంధించి మ్యాన్పవర్ కోసం 27 శాతం డిమాండ్, టెలికాం రంగంలో 14 శాతం డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్ సహా మెట్రోలు, విజయవాడల్లో డిమాండ్ ఈ పండుగల సీజన్ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల సేవలు, నూతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో, తదనుగుణంగా అవసరమైన ‘మ్యాన్పవర్’అందించడంలో హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోనగరాలతో పాటు నోయిడా, పుణె నగరాలు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నట్టు క్వెస్ పరిశీలన వెల్లడించింది. వీటికి ఏమాత్రం వెనకబడకుండా విజయవాడ, కోయంబత్తూరు, జంషెడ్పూర్, రాంఛీ వంటి నగరాల్లోని వివిధరంగాలకు చెందిన వర్క్ఫోర్స్కు మంచి ఉద్యోగ అవకాశాలున్నట్టు తెలిపింది. ఏ ఉద్యోగాలకు డిమాండ్ అధికం అంటే.. ప్రొడక్షన్ ట్రైనీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్ బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్హౌస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ–కామర్స్, లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో దాదాపు మూడులక్షల దాకా ఉద్యోగులకు అవకాశాలు కల్పించే అంచనాలతో ముందువరసలో నిలుస్తోంది. ఇందులో భాగంగానే వేర్హౌస్, డెలివరీ ఆపరేషన్స్ వంటివి కూడా అంతర్భాగంగా ఉంటాయి. పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. –లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ -
పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?
Bank holidays in Septembe 2023: సెప్టెంబరులో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా పండుగ సీజన్ కావడంతో ఆగస్టు లో 14 సెలవులతోపోలిస్తే సెప్టెంబరులో 16కు పెరిగాయి. వీటిల్లో శని, ఆదివారాలతో పాటు వివిధ పండుగల సెలవులు కూడా ఉన్నాయి. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులకు తమ తమ బ్యాంకు పనులును చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చు. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను చూద్దాం. 2023 సెప్టెంబర్లో బ్యాంక్ సెలవులు సెప్టెంబర్ 3: ఆదివారం సెప్టెంబర్ 6 : శ్రీ కృష్ణ జన్మాష్టమి, కొన్ని ప్రాంతాల్లో సెలవు. సెప్టెంబర్ 7: జన్మాష్టమి సెప్టెంబర్ 9: రెండో శనివారం. సెప్టెంబర్ 17: ఆదివారం సెప్టెంబర్ 18: వినాయక చవితి(కొన్ని ప్రాంతాల్లో) సెప్టెంబర్ 19: వినాయక చవితి కొన్ని ప్రాంతాల్లో సెలవు సెప్టెంబర్ 20: వినాయక చవితి రెండో రోజు, నౌఖై (ఒడిశా) సెప్టెంబర్ 22: శ్రీ నారాయణ గురు సమాధి డే సెప్టెంబర్ 23: నాలుగో శనివారం, మహారాజ హరి సింగ్ జయంతి సెప్టెంబర్ 24: ఆదివారం ప్టెంబర్ 25: శ్రీమత్ సంకరాదేవ జయంతి సెప్టెంబర్ 27: ఈద్-ఈ- మిలాద్ సెప్టెంబర్ 29: ఇంద్రజాత్ర, జమ్ముకశ్మీర్లో సెలవు -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్తో, బెస్ట్ ఇంటీరియర్తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
పండుగ సీజన్లో 10 లక్షల కార్లు కొంటారు! పరిశ్రమ అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్లో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (కార్లు మొదలైనవి) అమ్మకాలు 10 లక్షల మార్కును దాటేయవచ్చని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనా వేస్తోంది. వీటిలో యుటిలిటీ వాహనాల విక్రయాలు అత్యధికంగా ఉండొచ్చని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈసారి ఆగస్టు 17న మొద లయ్యే పండుగల సీజన్ నవంబర్ 14 వరకు 68 రోజుల పాటు కొనసాగనుంది. సాధారణంగా వాహన విక్రయాల్లో దాదాపు 22–26 శాతం వాటా పండుగ సీజన్దే ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది ప్యాసింజర్ వాహన విక్రయాలు 40 లక్షల స్థాయిలో ఉండొచ్చని, అందులో 10 లక్షల యూనిట్లు పండుగ సీజన్వి ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
సెప్టెంబర్ క్వార్టర్లో 78 వేల కొలువులు
న్యూఢిల్లీ: పండుగల సీజన్, వివిధ రంగాల్లో డిమాండ్ తోడ్పాటుతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమలో కొత్తగా 78,000 కొలువులు వచ్చాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ఫ్లెక్సీ స్టాఫింగ్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జనరల్ స్టాఫింగ్, ఐటీ స్టాఫింగ్ కలిపి ఈ గణాంకాలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. నిర్దిష్ట కాలానికి లేదా ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడాన్ని ఫ్లెక్సీ స్టాఫింగ్గా వ్యవహరిస్తారు. నివేదిక ప్రకారం ఐటీ కాకుండా మిగతా విభాగాల్లో (ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్, తయారీ, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఆతిథ్య, పర్యాటక, బీమా, మౌలిక సదుపాయాల కల్పన మొదలైనవి) నియామకాలు జులై–సెప్టెంబర్లో 7.3 శాతం పెరిగాయి. అటు ఐటీలో మాత్రం ఒక మోస్తరుగా 2.2 శాతమే వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో మందగమన ప్రభావాన్ని సూచిస్తూ దేశీ ఐటీ సంస్థలు కూడా కొత్త నియామకాలను తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నాలుగు త్రైమాసికాలు.. 2.32 లక్షల ఉద్యోగాలు .. నివేదిక ప్రకారం 2022 అక్టోబర్ నుండి 2023 సెప్టెంబర్వరకూ నాలుగు త్రైమాసికాల్లో ఐఎస్ఎఫ్లో సభ్యత్వం ఉన్న 110 పైచిలుకు కంపెనీలు 2.32 లక్షల కొలువులు ఇచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో ఇవి 90 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. లాక్డౌన్లు పూర్తిగా తొలగించాక వచ్చిన తొలి పండుగ సీజన్లో ఉద్యోగులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని స్టాఫింగ్ పరిశ్రమ ముందుగానే ఊహించిందని, తదనుగుణంగానే ఆయా సంస్థలకు సిబ్బందిని సమకూర్చగలిగిందని ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం వృద్ధి చెందిందని ఆయన చెప్పారు. -
రెండంకెల స్థాయిలో ఇంధన విక్రయాల వృద్ధి
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో కార్యకలాపాలు మరింత పుంజుకోవడం, వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరగడంతో నవంబర్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. రెండంకెల స్థాయిలో పెరిగాయి. గతేడాది నవంబర్తో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్ టన్నులకు, డీజిల్ విక్రయాలు 27.6 శాతం వృద్ధి చెంది 7.32 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. కోవిడ్ కష్టకాలమైన 2020 నవంబర్తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 10.7 శాతం, కోవిడ్ పూర్వం 2019 నవంబర్తో పోలిస్తే 16.2 శాతం పెరిగాయి. అటు డీజిల్ విక్రయాలు 17.4 శాతం (2020 నవంబర్తో పోలిస్తే), 9.4 శాతం (2019 నవంబర్తో పోలిస్తే) పెరిగాయి. జూన్ నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. పంటల సీజన్ కావడంతో డీజిల్కు డిమాండ్ గణనీయంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాగు నీటి పంపులు, ట్రక్కుల్లో ఇంధనాల వినియోగం ఎక్కువగా పెరిగిందని వివరించాయి. విమాన ప్రయాణాలు కూడా పుంజుకుంటూ ఉండటంతో విమాన ఇంధన (ఏటీఎఫ్) విక్రయాలు సైతం గత నవంబర్తో పోలిస్తే ఈసారి 21.5 శాతం పెరిగి 5,72,200 టన్నులకు చేరాయి. అయితే, కోవిడ్ పూర్వం నవంబర్ (2019)తో పోలిస్తే మాత్రం 13.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశీయంగా విమాన ప్రయాణాలు కోవిడ్ పూర్వ స్థాయులకు చేరినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాల ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఏటీఎఫ్ ధర తగ్గింపు .. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో ప్రభుత్వ రంగ చమురు రిటైల్ కంపెనీలు ఏటీఎఫ్ రేటును గురువారం 2.3 శాతం తగ్గించాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం వరుసగా ఎనిమిదో నెలా సవరించకుండా, యథాతధంగా ఉంచాయి. తాజా తగ్గింపుతో ఏటీఎఫ్ రేటు ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 2,775 తగ్గి రూ. 1,17,588కి చేరింది. గత నెల కూడా ఆయిల్ కంపెనీలు విమాన ఇంధనం రేటును 4.19 శాతం (రూ. 4,842) తగ్గించాయి. విమానయాన కంపెనీల నిర్వహణ వ్యయా ల్లో 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపులు వాటికి కొంత ఊరటనివ్వనున్నాయి. ఏటీఎఫ్ రేటును ఆయిల్ కంపెనీ లు ప్రతి నెలా 1వ తారీఖున సమీక్షిస్తాయి. పెట్రో ల్, డీజిల్ రేట్లను అవి ఏప్రిల్ 6 నుండి సవరించలేదు. విండ్ఫాల్ లాభాలపై పన్ను సగానికి తగ్గింపు డీజిల్ ఎగుమతుల లెవీపై ఊరట అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదలతో, దేశీ చమురు ఉత్పత్తి దారులకు వచ్చే భారీ లాభాలపై (విండ్ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. అలాగే, డీజిల్ ఎగుమతులపైనా లెవీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓఎన్జీసీ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే టన్ను చమురుపై ప్రస్తుతం రూ.10,200గా ఉన్న పన్నును రూ.4,900కు తగ్గించింది. లీటర్ డీజిల్ ఎగుమతిపై లెవీని 10.5 నుంచి 8కి తగ్గించింది. ఏటీఎఫ్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు రూ.5గా కొనసాగనుంది. మొదట పెట్రోల్ ఎగుమతులైనా కేంద్రం లెవీ విధించగా, తర్వాత దాన్ని ఎత్తివేయడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా యు ద్ధం తర్వాత అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయి, ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిణా మం దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చేందుకు దారితీసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ పన్నును ప్రవేశపెట్టడం తెలిసిందే. -
పండుగల్లో తారాజువ్వలా ఈ కామర్స్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో (అక్టోబర్లో) ఈ కామర్స్ సంస్థ అమ్మకాలు జోరుగా సాగాయి. కస్టమర్ల డిమాండ్తో అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని చూశాయి. రూ.76,000 కోట్ల అమ్మకాలు నమోదైనట్టు మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ వెల్లడించింది. పండుగల సీజన్ తొలి వారానికి తాము వేసిన అంచనాలకు అనుగుణంగానే ఈ కామర్స్ కంపెనీల విక్రయాలున్నట్టు రెడ్సీర్ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి చెప్పారు. ‘‘రూ.83,000 కోట్ల అమ్మకాలు ఉంటాయని మేము అంచనా వేశాం. చివరికి గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (విక్రయించిన ఉత్పత్తుల విలువ) రూ.76,000 కోట్లుగా నమోదైంది. మా తొలి అంచనాల కంటే 8–9 శాతం తక్కువ. అయినప్పటికీ ఈ మొత్తం కూడా చెప్పుకోతగ్గ గరిష్ట స్థాయి. గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే 25 శాతం అధికం’’అని ఉజ్వల్ చౌదరి వివరించారు. ఫ్లిప్కార్ట్ గ్రూపు (మింత్రా, షాప్సీ సహా) రూ.40వేల కోట్ల విక్రయాలతో 62 శాతం వాటా ఆక్రమించినట్టు రెడ్సీర్ నివేదిక తెలిపింది. ఆ తర్వాత అమెజాన్ వాటా 26 శాతంగా ఉంది. ఫ్యాషన్ ఉత్పత్తులు 32 శాతం, మొబైల్ ఫోన్లు 7 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు (గృహోపకరణలు సహా) 13 శాతం, ఇతర విభాగాల్లో అమ్మకాలు 86 శాతం చొప్పున పెరిగాయి. మొబైల్ ఫోన్లు అధిక మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాభం ఐదింతలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం ఐదింతలు పెరిగి రూ.29 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 50 శాతం పెరిగి రూ.3,075 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5 కోట్లు, ఆదాయం రూ.2,054 కోట్ల చొప్పున ఉన్నాయి. ‘‘కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఈ కామర్స్ విక్రయాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి సాయపడింది. మార్కెటింగ్పైనా పెట్టుబడులు పెరిగాయి. బ్రాండ్ల బలోపేతం, వినియోగదారులను చేరుకోవడంపై దృష్టి సారించాం. పెద్ద ఎత్తున స్టోర్ల నెట్వర్క్ విస్తరణ చేపట్టాం. పాంటలూన్ బ్రాండ్ కింద 21 స్టోర్లు, బ్రాండెడ్ వ్యాపారంలో 85 స్టోర్లు ప్రారంభించాం’’అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. విభాగాల వారీగా.. ► మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,109 కోట్లుగా నమోదైంది. ► ప్యాంటలూన్స్ ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,094 కోట్లకు చేరింది. ► ఈ కామర్స్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఎబిట్డా మార్జిన్లు కరోనా ముందున్న స్థాయిని అధిగమించాయి. ► కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.243 కోట్లకు తగ్గింది. -
పండుగ వేళ సామాన్యుడి నెత్తిన మరో పిడుగు
సాక్షి,ముంబై: ద్రవ్యోల్బణం, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఆహార ధరలతో కష్టాలు పడుతున్న సామాన్య జనానికి పండుగ సీజన్లో మరో షాక్ తగిలింది. అమూల్ పాల ధర లీటరుకు 2 రూపాయలు పెరిగింది. అకస్మాత్తుంగా శనివారం ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.61 నుంచి రూ.63కి పెరిగడంతో షాకవ్వడం వినియోగదారుల వంతైంది. ఈ మేరకు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ధరల పెంపును నిర్ణయించినట్టు తెలుస్తోంది. పశువుల పెంపకంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పశుగ్రాసం, ఇతర ఖర్చులతో ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతూ వస్తోంది. అయితే అమూల్ను మరో ఐదు సహకార సంఘాలతో విలీనం చేసి బహుళ-రాష్ట్ర సహకార సంఘం (ఎంఎస్సిఎస్) ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అమిత్ షా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. మరోవైపు శుక్రవారం విడుదలైన టోకు ద్రవ్యోల్బణం డేటా ప్రకారం పశుగ్రాసం ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. టోకు ద్రవ్యోల్బణం పశుగ్రాస ద్రవ్యోల్బణం రేటు 25 శాతానికి పైగానే ఉంది. కాగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్ బ్రాండ్తో మార్కెట్ చేస్తుంది. సేకరణ ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో అమూల్, మదర్ డెయిరీలు ఆగస్టులో 2 రూపాయలు చొప్పున పాలధరను పెంచిన సంగతి తెలిసిందే. మార్చిలో కూడా పాల ధరలు పెరిగాయి. -
ఫెస్టివ్ సీజన్: దూసుకెళ్లిన ప్యాసింజర్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సీజన్ డిమాండ్తో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు 3,07,389 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 92 శాతం అధికం కావడం గమనార్హం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2021 సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 13 శాతం అధికమై 17,35,199 యూనిట్లు నమోదైంది. వీటిలో మోటార్సైకిల్స్ 18 శాతం ఎగసి 11,14,667 యూనిట్లు, స్కూటర్స్ 9 శాతం పెరిగి 5,72,919 యూనిట్లు ఉన్నాయి. జూలై–సెప్టెంబర్ కాలంలో అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు 51,15,112 నుంచి 60,52,628 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ వాహనాలు 38 శాతం అధికమై 10,26,309 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 13 శాతం పెరిగి 46,73,931 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 39 శాతం దూసుకెళ్లి 2,31,880 యూనిట్లు సాధించాయి. -
స్మార్ట్ఫోన్ల పండగ వచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ పండుగల సీజన్లో 5.17 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. వీటి విలువ రూ.1.44 లక్షల కోట్లు ఉంటుందని టెక్నాలజీ మార్కెట్ రిసర్చ్ కంపెనీ టెక్ఆర్క్ వెల్లడించింది. 2022లో స్మార్ట్ఫోన్ విక్రయాల ద్వారా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో ఇది 43 శాతానికి సమానం. యూనిట్ల పరంగా చూస్తే అమ్ముడయ్యే మొత్తం పరిమాణంలో వీటి వాటా 31.9 శాతం. 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 58.7 శాతం యూనిట్లు రూ.6–12 వేల ధరల శ్రేణి మోడళ్లు ఉంటాయి. ఈ విభాగంలో ఆదాయం అత్యధికంగా రూ.12–25 వేల శ్రేణిలో నమోదు కానుంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ మార్కెట్ప్లేస్, ఈ–కామర్స్ స్టోర్లు అత్యధికంగా 65–68 శాతం చేజిక్కించుకోనునున్నాయి. ఏడు కంపెనీలదే.. ఇక 5జీ స్మార్ట్ఫోన్లు 30.2 శాతం వాటాతో 1.56 కోట్ల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళతాయని టెక్ఆర్క్ అంచనా. సీజన్లో కంపెనీలు అందుకునే ఆదాయంలో వీటి వాటా ఏకంగా 66.7 శాతం ఉండనుంది. 5జీ విషయంలో పరిమాణం పరంగా రూ.25–50 వేల ధరల శ్రేణి మోడళ్ల వాటా 37.8 శాతం, విలువ పరంగా రూ.50 వేలు ఆపైన ధర కలిగిన మోడళ్ల వాటా 66.9 శాతం ఉండే చాన్స్ ఉంది. అమ్ముడయ్యే మొత్తం స్మార్ట్ఫోన్లలో యాపిల్, శామ్సంగ్, వన్ప్లస్, వివో, ఒప్పో, రియల్మీ, షావొమీ కలిపి 90 శాతం పరిమాణం కైవసం చేసుకుంటాయి. మేకిన్ ఇండియా ఫోన్లు.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్లో మేకిన్ ఇండియా ఫోన్లు 4.4 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని కౌంటర్పాయింట్ రిసర్చ్ తెలిపింది. ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఈ స్థాయి వృద్ధికి కారణం. స్మార్ట్వాచ్, ట్రూ వైర్లెస్ స్టీరియో, నెక్బ్యాండ్, ట్యాబ్లెట్ పీసీ వంటి ఉత్పత్తుల తయారీ సైతం అధికం అయింది. మేకిన్ ఇండియా స్మార్ట్ఫోన్లలో 24 శాతం వాటాతో ఒప్పో అగ్రస్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. థర్డ్ పార్టీలు సైతం.. స్మార్ట్ఫోన్ విభాగంలో కంపెనీలు సొంతంగా తయారు చేసినవి 66 శాతం కాగా, మిగిలినది థర్డ్ పార్టీ కంపెనీలు రూపొందించినవి. స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ఎఫ్ఐహెచ్, డిక్సన్, డీబీజీ కంపెనీలు థర్డ్ పార్టీ విభాగంలో ముందు వరుసలో ఉన్నాయి. 75 శాతం స్మార్ట్వాచ్లను ఆప్టీమస్ ఉత్పత్తి చేయడం విశేషం. ట్యాబ్లెట్ పీసీల్లో వింగ్టెక్, శామ్సంగ్, డిక్సన్లు టాప్–3లో ఉన్నాయి. టీవీల విభాగంలో డిక్సన్, రేడియంట్, శామ్సంగ్, ఎల్జీ కంపెనీల వాటా 50 శాతం. -
అజియో ‘ఆల్స్టార్స్ సేల్’ ఆఫర్..ఇంకా చాలా సర్ప్రైజెస్!
బెంగళూరు: ఆన్లైన్ ఈ-ఫ్యాషన్ రీటైలర్ ఆజియో ఫెస్టివ్ సీజన్లో ‘ఆల్స్టార్స్ సేల్’ పేరుతో సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్స్కు చెందిన 10 లక్షలకు పైగా భిన్న వస్త్రాలపై 50శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు తొలిసారి యాప్ సైన్ అప్ ద్వారా రూ.500 తక్షణ క్యాష్బ్యాక్ను పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. చదవండి : iphone14: గుడ్ న్యూస్.. భారీ ఆఫర్ ఎక్కడంటే? Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ -
వారికి అమెజాన్ పండుగ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ‘అమెజాన్ ఇండియా’ ముఖ్యమైన పండుగల ముందు విక్రేతలకు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. తన ప్లాట్ఫామ్పై విక్రయాలు నిర్వహించినందుకు చెల్లించాల్సిన ఫీజును 50 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది. కొత్త వెండర్లకు ఇది వర్తించనుంది. అమెజాన్ ప్లాట్ఫామ్లో విక్రయించే ప్రతీ ఉత్పత్తి విలువలో (కొనుగోలు దారు చెల్లించే) నిర్ణీత శాతం మేర ఫీజుగా వర్తకులు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొత్త అమ్మకందారులు ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ ప్రయాణాన్ని వెంటనే ఆరంభించేందుకు వీలుగా.. అమెజాన్.ఇన్పై ఆగస్ట్ 28 నుంచి అక్టోబర్ 26 మధ్య నమోదు చేసుకుని.. తదుపరి 90 రోజుల్లోపు అమ్మకాలు మొదలు పెట్టడం ద్వారా అమ్మకం ఫీజులో 50 శాతం రాయితీ పొందొచ్చు’’అని అమెజాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వర్తకులు ప్రస్తుత పండుగల డిమాండ్ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘‘భారత్ వ్యాప్తంగా మాకు మిలియన్ విక్రేతలు ఉన్నారు. పండుగల సీజన్లో వారంతా తమ ఉత్పత్తులను వినియోగదారుల ముందు ప్రదర్శించే అవకాశం మా వేదిక ద్వారా ఉంటుంది’’అని అమెజాన్ ఇండియా డైరెక్టర్ వివేక్ సోమారెడ్డి వెల్లడించారు. అమెజాన్కు దేశవ్యాప్తంగా 60 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, 1850 వరకు స్టేషన్లు (సొంతంగా, భాగస్వాముల ద్వారా) ఉన్నాయి. -
హైరింగ్ అలర్ట్: 16వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ఫ్యాషన్ ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ మింత్రా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగ సీజన్లో దాదాపు 16వేలమందికి ఉపాధికల్పించనుంది. డెలివరీ, వేర్హౌస్ హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్లో వివిధ స్థానాల కోసం 16,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ దాదాపు 11,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. ఫ్లిప్కార్ట్ యాజమాన్యంలోని ఈ కంపెనీ మింత్రా ప్రకటించిన ఈ 16 వేలు ఉద్యోగాలలో 10 వేల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కాగా, 6 వేలు పరోక్షంగా ఉంటాయి. పండుగ సీజన్లో నియామకాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికమని మింత్రా హెచ్ఆర్ హెడ్ నూపూర్ నాగ్పాల్ తెలిపారని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ సంవత్సరం నియామకాలు సార్టింగ్, ప్యాకింగ్, పికింగ్, లోడింగ్, అన్లోడింగ్, డెలివరీ, రిటర్న్ ఇన్స్పెక్షన్ అలాగే కార్గో ఫ్లీట్ మేనేజ్మెంట్ ఇలా పలు విభాగాల్లో ఉంటాయి. తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత కొత్త బ్యాచ్లోని సప్లై చైన్ మేనేజ్మెంట్ సిబ్బందిలో దాదాపు సగం మందికి ఉద్యోగాల్లో కొనసాగనుండగా, కాంటాక్ట్ సెంటర్ సిబ్బంది వారి ఒప్పందం మేరకు పనిచేస్తారు. -
ఫెస్టివ్ సీజన్: గుడ్న్యూస్ 75 వేల ఉద్యోగాలు
ముంబై: సరుకు రవాణా సేవల్లో ఉన్న డెలివరీ (Delhivery) సీజనల్ ఉద్యోగాల కోసం వచ్చే ఒకటిన్నర నెలలో 75,000 మందిని నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్ కంపెనీ తరఫున డెలివరీ గేట్వేస్, గిడ్డంగులు, డెలివరీ విభాగాల్లో 10,000 మంది ఉంటారు. పండుగ సీజన్లో పార్సెల్, ఎక్స్ప్రెస్ పార్ట్–ట్రక్ లోడ్ వ్యాపారం రెండింటిలోనూ ఆశించిన అధిక డిమాండ్ను చేరుకోవడం లక్ష్యంగా కొత్త వారిని చేర్చుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో పార్ట్-ట్రక్లోడ్ సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించేందుకు వ్యక్తిగత బైకర్లు, స్థానిక రిటైలర్లు, వ్యాపార భాగస్వాములు, రవాణాదారులను నియమించుకోవడం ద్వారా భాగస్వామ్య కార్యక్రమాలను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. (PAN India 5G: కీలక విషయాలు వెల్లడించిన టెలికాం మంత్రి) అధిక కస్టమర్ డిమాండ్ నేపథ్యంలో పాన్-ఇండియాలో పార్శిల్ సార్టింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1.5మిలియన్ షిప్మెంట్లు లక్క్ష్యంగా పెట్టుకున్నామని డెలివరీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ పాయ్ అన్నారు. (jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) -
పండుగ సీజన్: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో రుణ డిమాండ్ను ఎదుర్కొనేందుకుగాను నిధుల సమీకరణ బాటలో బ్యాంకింగ్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రిటైల్ డిపాజిటర్లను (రూ.2 కోట్ల లోపు) ఆకర్షించడానికి పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్సహా పలు బ్యాంకులు నిర్దిష్ట కాలానికి వర్తించేలా తమ డిపాజిట్ రేట్లను ఆరు శాతం ఆపైకి పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని బ్యాంకులు రేట్ల పెంపునకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే... (చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ►ఎస్బీఐ: 1000 రోజుల కాలపరిమతికి సంబంధించి డిపాజిట్ రేటును 6.10 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును పొందుతారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 30 వరకూ ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని తెలిపింది. ►కెనరా బ్యాంక్: 666 రోజుల కాలపరిమితికి రేటును 6 శాతానికి పెంచింది. ►బ్యాంక్ ఆఫ్ బరోడా: బరోడా తిరంగా డిపాజిట్ పథకం పేరుతో ప్రత్యేక రిటైల్ టర్మ్ ప్లాన్ను ఆఫర్ చేసింది. 2022 డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉండే విధంగా 444 రోజులు, 555 రోజుల రెండు కాలపరిమితులతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 444 రోజులకు 5.75 శాతం వడ్డీ, 555 రోజులకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. ►పంజాబ్ నేషనల్ బ్యాంక్: 1,111 రోజులు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకూ కాలపరిమితికి సంబంధించి 5.75 శాతం రేటుతో డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తోంది. ►ఐసీఐసీఐ, హెడ్డీఎఫ్సీ బ్యాంక్లు: ప్రైవేటు రంగంలోని ఈ దిగ్గజ బ్యాంకులు పదేళ్ల వరకూ కాలపరిమతితో 5.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తూ, డిపాజిట్ పథకాన్ని వెలువరించాయి. ►యాక్సిస్ బ్యాంక్: 18 నెలల వరకూ డిపాజిట్పై 6.05 శాతం వడ్డీ ఆఫర్తో డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది. (ఇదీ చదవండి: Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ఆర్బీఐ రేటు పెంపు నేపథ్యం... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను అరశాతం పెంచుతూ (5.40 శాతానికి అప్) ఈ నెల 5వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్సహా పలు రుణసంస్థలు తమ డిపాజిట్ రేట్లను పెంచాయి. డిపాజిట్రేట్లతో పాలు పలు బ్యాంకులు రుణ రేట్ల పెంపును కూడా ప్రారంభించాయి. వడ్డీరేట్లకు సంబంధించి సవాళ్లను నిర్వహించే స్థితిలో ప్రస్తుతం బ్యాంకింగ్ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, ‘‘రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాలవు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపాజిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది’’ అని బ్యాంకింగ్కు స్పష్టం చేయడం గమనార్హం. -
ఝన్ఝన్వాలా జాక్పాట్:టైటన్ మెరిసెన్
న్యూఢిల్లీ: ఆభరణాలు, వాచ్లు, కళ్లద్దాలు తదితర వేరబుల్ ఉత్పత్తుల విక్రయంలోని ప్రముఖ కంపెనీ టైటాన్ జూన్ త్రైమాసికంలో పనితీరు పరంగా మెప్పించింది.దేశంలోని అతిపెద్ద బ్రాండెడ్ ఆభరణాల తయారీదారు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 13 రెట్లు పెరిగి రూ.790 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా మూడు రెట్ల వృద్ధితో రూ.9,487 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.18 కోట్లు, ఆదాయం రూ.3,519 కోట్ల చొప్పున ఉన్నాయి. జ్యుయలరీ విభాగం ఆదాయం రూ.8,351 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.3,050 కోట్లుగా ఉంది. వాచ్లు, వేరబుల్ కేటగిరీ ఆదాయం రూ.293 కోట్ల నుంచి రూ.786 కోట్లకు వృద్ధి చెందింది. కళ్లద్దాల విభాగం నుంచి ఆదాయం రూ.183 కోట్లకు పెరిగింది. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ మొదటి త్రైమాసికంపై కరోనా మహమ్మారి ప్రభావం ఉందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్లో సాధారణ వ్యాపార కార్యకలాపాలు ఉండడం మెరుగైన పనితీరుకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. కాగా Trendlyne ప్రకారం, జూన్ 30 నాటికి ఝన్ఝన్వాలా, ఆయన భార్య రేఖ టైటాన్ ఎన్ఎస్ఇలో 0.38 శాతం 5.05 శాతం వాటాను కలిగి ఉన్నారు, దీని విలువ శుక్రవారం నాటికి రూ. 10,937 కోట్లు కావడం విశేషం. -
‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'!
అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు! మనలో చాలా మందికి క్రిస్టమస్ పండుగ చాలా ప్రత్యేకం. క్రీస్తు జన్మార్ధమైన ఈ పర్వదినాన బంధుమిత్రులతో, విందు భోజనాలతో, బహుమతులతో సందడిగా ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడపాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అలాగే జరుగునుగాక! ఐతే క్రిస్టమస్ పండుగ సందర్భంగా మీ ప్రియమైనవారికి ఖరీదైన గిఫ్టులివ్వలేకపోయినా, కోట్ల విలువచేసే చిన్న పలకరింపు, చక్కని మాటలతో పేర్చిన మెసేజ్లను పంపినా వారెంతో మురిసిపోతారు. సోషల్ మీడియాలో షేర్ చేయదగిన అట్లాంటి కొన్ని కోట్స్, గ్రీటింగ్స్, మెసేజెస్లు, ఫొటోలు మీకోసం.. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!' మీ సెలవులు ఆనందంతో నిండునుగాక... క్రిస్మస్ శుభాకాంక్షలు! నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదం మనం స్వీకరించే బహుమతుల్లో ఉండదు. పండుగను ఆనందంగా మలిచే కుటుంబంలో ఉంటుంది. మీ క్రిస్మస్ అద్భుతమైన అన్ని విషయాలతో నిండుగా ఉండాలి. క్రిస్మస్ మెరిసే లైట్లు మీ హృదయాన్ని ఆశలతో నింపాలి. మీకు కావలసినవన్నీ శాంటాక్లాజ్ తేవాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరమంతా ఆనందంతో నిండి ఉండాలి. ఈ సంతోషకరమైన రోజున ఇవే మీకు నా శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్! ఈ హాలిడే సీజన్ మీకు శాంతి, శ్రేయస్సు, కోరుకున్న అన్ని బహుమతులను తెస్తుందని ఆశిస్తున్నాను! హ్యాపీ హాలిడేస్! క్రిస్మస్ మీకు ప్రేమ, ఆనందం, శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాను. మీ క్రిస్మస్ ఆనందాలతో, బహుమతులతో నిండి పోవాలి. హ్యాపీ హాలిడేస్! ఈ క్రిస్మస్ మీ ఇంటిలోని ప్రతి మూలను, మీ హృదయాన్నంతటిని ఆనందంతో నింపుతుందని ఆశిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ పండుగ ఆనందం మీ జీవితాన్ని ఆనందం, శాంతితో నింపుతుంది. చదవండి: Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్! ఆనందం, ఐశ్వర్యం, శాంతి అనే గిఫ్ట్ ఫ్యాక్లను ఈ క్రిస్మస్ రోజున మీరు విప్పాలని ఆశిస్తున్నాను! ఈ క్రిస్మస్ పర్వదినాన మీరు కోరుకునేవన్నీ శాంతా క్లాజ్ మీదగ్గరకు తీసుకురావాలి. ఈ క్రిస్మస్ రోజున మీ హృదయం ఆనందంతో పొంగిపొర్లుతుందని ఆశిస్తున్నాను. నా ప్రతి రోజును ఆనందంగా మార్చే నా ప్రియమైన ఫ్రెండ్కు క్రిస్మస్ శుభాకాంక్షలు. నా క్రిస్మస్లో హ్యాపీనెస్ను ఉంచి, నిజమైన స్నేహితుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ రోజున మీ ఆనందం పెద్దగా, మీ బిల్లులు చిన్నవిగా ఉండాలని కోరుకుంటున్నాను! మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022! ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ శుభవార్తలనే తెస్తుంది. క్రిస్మస్ మీకు మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా దేదీప్యమానంగా వెలుగుతోంది! మీలాంటి ఫ్రెండ్స్ నాతో ఉండటమే క్రిస్మస్ అందించే అత్యుత్తమ గిఫ్ట్. క్రిస్మస్ శుభాకాంక్షలు! (మీరు మీ సన్నిహితులకు మేరీ క్రిస్మస్ విషెష్ తెలియజేయండి ఇలా..) -
Coronavirus: ముప్పు తొలగినట్లేనా ?
న్యూఢిల్లీ: రోజుకో కొత్త రకం వేరియంట్తో భారత్ను ముప్పతిప్పలు పెట్టిన కరోనా నుంచి భారత్కు ఉపశమనం లభించినట్లేనా? సెకండ్ వేవ్తో జనజీవనాన్ని ఛిద్రం చేసిన కోవిడ్ మహమ్మారి దేశంలో ఇక తగ్గుముఖం పట్టినట్లేనా? అంటే వైద్య నిపుణులు అవుననే అంటున్నారు. పట్ట పగ్గాల్లేని కరోనా దూకుడుకు ఫుల్స్టాప్ పడినట్లేనన్న ఆరోగ్యరంగ నిపుణుల అంచనాలతో దేశ ఆర్థిక రంగం మళ్లీ పట్టాలెక్కనుందనే శుభసూచనలు కనిపిస్తున్నాయి. దీపావళి పర్వదినం తర్వాత గడచిన మూడు వారాలుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్యే ఇందుకు మేలిమి ఉదాహరణ. దసరా, దీపావళి, కాళీపూజ తదితర పండుగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్ కాలంలో వైరస్ విజృంభణతో దేశంలో పరిస్థితి అదుపుతప్పవచ్చని అంతటా భయాందోళనలు పెరిగాయి. అయితే, ఆ గండం నుంచి గట్టేకేశాం. పండుగల సీజన్ ముగిశాక కూడా కొత్త కేసులు అత్యల్ప స్థాయిల్లోనూ నమోద వుతున్నాయి. సెకండ్ వేవ్ కాలంలోనే దేశ జనాభా లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అయితే 98.32 శాతం రికవరీ రేటుతో దాదాపు అందరూ కోలుకున్నారు. కోవిడ్ను జయించిన వీరందరి లోనూ కరోనా యాంటీబాడీలు పెరిగాయి. మరోవైపు భారత్లో కోవిడ్ టీకా కార్యక్రమం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 117.63 కోట్ల డోస్లను ప్రభుత్వం అందజేసింది. దీంతో కోవిడ్ టీకా తీసుకున్న కోట్లాది మందిలో కరోనా యాంటీబాడీలు పెరిగాయి. ఒక వైపు కోవిడ్ను జయించి, మరోవైపు వ్యాక్సినేషన్ ద్వారా రెండు రకాలుగానూ వయోజనుల్లో కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో టీకా తీసుకోకమునుపే ‘హైబ్రిడ్ ’ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా రాని వారు టీకా తీసుకుంటే పెంపొందే యాంటీబాడీల కంటే హైబ్రిడ్ ఇమ్యూనిటీ మరెంతో మెరుగ్గా వైరస్ను ఎదుర్కోగలదు. ఇలా ‘హైబ్రిడ్’ ఇమ్యూనిటీని సంతరించుకున్న భారత్లో కరోనా మూడోవేవ్ పొద్దు పొడవక పోవచ్చని వైద్య నిపుణులు ధీమాగా చెబుతున్నారు. అయితే, కొత్త వేరియంట్ ముప్పు, శీతాకాలంలో దట్టంగా కమ్మేసే చలి వాతావరణం వంటి సవాళ్లు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాయని, సరైన జాగ్రత్తలతో ఆ ప్రమాదాన్ని ముందే నివారించవచ్చని ఆరోగ్యరంగ నిష్ణాతులు హెచ్చరిస్తున్నారు. వారికి గతంలోనే కరోనా సోకింది ‘దేశంలో డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి పెరిగాక కూడా తక్కువ కేసులు నమోదయ్యాయంటే ..అప్పటికే జనాభాలో ఎక్కువ మందికి కరోనా సోకి, తగ్గిపోయిందని అర్ధం. దేశవ్యాప్తంగా పలు సీరో సర్వేల్లో తేలింది ఇదే’ అని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్)– ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయోలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ స్పష్టంచేశారు. ప్రస్తుతం భారత ‘పరిస్థితి’ బాగానే ఉందని, భవిష్యత్లో వెలుగుచూసే తేలిగ్గా లొంగని వైరస్ వేరియంట్లతో పరిస్థితిలో ‘మార్పు’లు రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్ నుంచి కోలుకోవడం, వ్యాక్సినేషన్ వల్లే దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గుతోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మరో పరిశోధకురాలు వినీతా బాల్ అన్నారు. డిసెంబర్–ఫిబ్రవరిలో అప్రమత్తత అవసరం చుట్టేస్తున్న చలి, కొత్త వేరియంట్లు ఉద్భవిస్తే డిసెంబర్–ఫిబ్రవరి కాలంలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, అయితే సెకండ్ వేవ్ నాటి దుర్భర పరిస్థితులు ఉండబోవని సోనిపట్లోని అశోకా విశ్వవిద్యాలయ బయోలజీ విభాగం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ విశ్లేషించారు. ‘ వ్యాక్సినేషన్ భారీ ఎత్తున కొనసాగుతున్న ఈ తరుణంలో వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండబోదు. ఆస్పత్రిలో చేరడం, మరణం సంభవించే స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఉండవు. కోవిడ్ నుంచి కోలుకున్నాక టీకా తీసుకున్న వారికి రెండోదఫా కోవిడ్ నుంచి గణనీయమైన రక్షణ లభిస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జులైలో ఐసీఎంఆర్ నాలుగో జాతీయ సీరో సర్వే ప్రకారం దేశజనాభాలో 67.6 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయి. వయోజనుల్లో 82 శాతం మంది తొలి డోస్ తీసుకున్నారు. 43 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది మూడో వేవ్ వచ్చి, వెళ్లింది! చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ సితభ్ర సిన్హా వాదన మరోలా ఉంది. ‘ యూరప్లోని థర్డ్ వేవ్కు భారత్లోని రెండో వేవ్కు చాలా సారూప్యత ఉంది. నా ఉద్దేశం ప్రకారం భారత్లో మూడో వేవ్ సెప్టెంబర్ మధ్యలోనే వచ్చి, అంతర్థానమైంది’ అని ఆయన అంచనావేశారు. కాగా, ముంబై, పుణె, చెన్నై, కోల్కతా నగరాల్లో ఆర్–వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటోందని ఆయన హెచ్చరించారు. 543 రోజుల కనిష్టానికి కేసులు దేశంలో గత 24 గంటల్లో అత్యల్పంగా 7,579 కరోనా కొత్త కేసులు నమోద య్యాయి. గత 543 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,45,26,480కు పెరిగింది. మరో 236 మంది కోవిడ్తో కన్నుమూశారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,66,147కు పెరిగింది. ఇప్పటిదాకా 3,39,46,749 మంది కోవిడ్ కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584కు తగ్గింది. ఇంత తక్కువ యా క్టివ్ కేసులుం డటం గత 536 రోజుల్లో ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 0.79శాతానికి చేరుకుంది. మరణాల రేటు 1.35 శాతంగా నమోదైంది. -
ఇంటి బడ్జెట్కు ఇంధన సెగ..
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు, నిత్యావసరాల ధరలు ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో చాలా మటుకు కుటుంబాలు (సుమారు 60 శాతం) ఖర్చులు చేస్తున్నప్పటికీ.. కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. తమ బడ్జెట్ దాటిపోకుండా, పెట్టే ఖర్చుకు కాస్తంత ఎక్కువ విలువ దక్కేలా చూసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫాం లోకల్సర్కిల్స్ టాప్ 10 నగరాల్లో నిర్వహించిన ‘వినియోగదారుల ధోరణులు‘ అనే సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో సుమారు 61,000 కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వే ప్రకారం వినియోగదారుల సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడింది. పండుగ సీజన్లో ఖర్చు చేయాలని భావిస్తున్న కుటుంబాల సంఖ్య సెప్టెంబర్లో 60 శాతానికి చేరింది. ఈ ఏడాది మే లో ఇది 30 శాతం. గడిచిన నాలుగు నెలల్లో కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం. గడిచిన 30 రోజులుగా టాప్ 10 నగరాల్లోని కుటుంబాలు.. పెరిగిపోతున్న ఇంధనాలు, నిత్యావసరాల ధరల గురించి ఆందోళన, ఈ పండుగ సీజన్లో షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్కు ప్రాధాన్యం ఇవ్వనుండటం గురించి వివిధ ఆన్లైన్ కమ్యూనిటీల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు లోకల్సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా తెలిపారు. టాప్ 10 నగరాల్లోని ఏడు నగరాల ప్రజలు.. షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ వెల్లడించినట్లు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆన్లైన్కు హైదరాబాదీల మొగ్గు.. టాప్ 8 నగరాల్లోని వారు తమ పండుగ షాపింగ్కు సంబంధించి ఆన్లైన్లో ఆర్డర్లివ్వడం లేదా లోకల్గా హోమ్ డెలివరీ పొందడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ముంబై, కోల్కతా నగరాల్లో చాలా కుటుంబాలు ప్రత్యేకంగా స్టోర్స్, మార్కెట్కు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాయి. కానీ హైదరాబాద్ (75 శాతం), నోయిడా (72 శాతం), పుణె (67 శాతం), చెన్నై (60 శాతం) నగరాల్లో అత్యధిక శాతం మంది స్టోర్ట్స్, హైదరాబాద్, నోయిడాకు చెందిన కుటుంబాలు .. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై ఆసక్తిగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న హైదరాబాదీ కుటుంబాలన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, సాంప్రదాయ స్వీట్లు, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు మొదలైనవి కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. -
తాత్కాలిక పనివారికి డిమాండ్ !
ముంబై: పండుగల నేపథ్యంలో తాత్కాలిక పనివారు, ఉద్యోగుల కోసం నియామకాలు పెరిగాయి. మూడవ త్రైమాసికంలో నియామకాలు 400 శాతం వృద్ధి చెందాయి. ‘ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాపారాలు పూర్తి స్థాయిలో నడవలేదు. దీంతో వృద్ధి నమోదు కాలేదు. ఏప్రిల్–జూన్ నుంచి సానుకూల వాతావరణం మొదలైంది. మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు త్వరితగతిన నియామకాలు పూర్తి చేసే క్రమంలో తాత్కాలిక పనివారు, సిబ్బందికి భారీ డిమాండ్ ఉంది. ఎడ్టెక్, ఫిన్టెక్, మొబిలిటీ, ఈ–కామర్స్, ఫుడ్టెక్, రిటైల్ రంగాల్లో బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, మార్కెటింగ్, ఆన్బోర్డింగ్, ఆడిటింగ్, రిటైల్, వేర్హౌజ్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ప్రధానంగా డిమాండ్ ఉంది.జనవరి–జూన్తో పోలిస్తే మూడవ త్రైమాసికంలో వీరి వేతనాలు 1.25–1.5 రెట్లు అధికం అయ్యాయి’ అని క్వెస్ కార్ప్ అనుబంధ కంపెనీ టాస్్కమో కో–ఫౌండర్ ప్రశాంత్ జానాద్రి తెలిపారు. ఈ–కామర్స్ రంగంలోనే సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఫస్ట్మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ గ్రూప్ సీఈవో సుధాకర్ బాలకృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుత త్రైమాసికంలో చాలా కంపెనీలు నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయన్నారు. ఈ–కామర్స్ రంగంలో 50 శాతం, ఈ–ఫార్మా, సరుకు రవాణా 30–40, ఫుడ్ డెలివరీలో 50 శాతం రిక్రూట్మెంట్ పెరగనుందని చెప్పారు. -
బీభత్సం, స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సెమి కండక్టర్ల కొరతే అయినా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ ప్రకారం..ఈ పండుగ సీజన్లో దేశంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 7.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,858 కోట్లు) చేరువలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ రిటైల్ సగటు అమ్మకపు ధర 14 శాతం వృద్ధితో 230 డాలర్ల (దాదాపు రూ. 17,200)కు చేరింది. మిడ్,ప్రీమియం విభాగాలలోని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని తాజాగా విడుదలైన కౌంటర్ పాయింట్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్పాయింట్ సీనియర్ విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ మాట్లాడుతూ..దసరా,దీపావళి ఫెస్టివల్ సీజన్లో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉందని, అందుకే భారత్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం ఉండడంతో $200 కంటే (ఇండియన్ కరెన్సీలో రూ.14,974.98) ఎక్కువ ధర ఉన్న ఫోన్ అమ్మకాలు పెరగడానికి కారణమైందన్నారు. ఈ సేల్స్ ఇలాగే కొనసాగితే పండుగ సీజన్లో దాదాపు 7.6 బిలియన్ డాలర్ల విలువైన, లేదంటే అంతకంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు అమ్మకాలు జరుగుతాయనే అంచనా వేశారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. 2021 పండుగ సీజన్లో మార్కెట్ విలువలో 1శాతం పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ..యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం సంవత్సరానికి 14 శాతం పెరిగిందని చెప్పారు. ఇక ఈ పండగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉందన్నారు. చాలా మంది వినియోగదారులు చేసిన సేవింగ్స్లో వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ ధోరణి పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్లకు అప్గ్రేడ్ అయ్యేందుకు వీలుపడిందని అన్నారు. చదవండి: అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్పై అదిరిపోయే డిస్కౌంట్స్ -
పండుగ సీజన్ మార్కెటింగ్కు రూ.100 కోట్లు: పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత పండుగ సీజన్లో ప్రచార కార్యక్రమాల కోసం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. క్యాష్బ్యాక్ ఆఫర్లు, యూపీఐపరమైన ప్రోత్సాహకాలు, ’బై నౌ, పే లేటర్ (ఇప్పుడు కొనుక్కోండి, తర్వాత కట్టండి)’ వంటి ఆఫర్లు మొదలైన వాటికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 14 దాకా ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతూ ’పేటీఎం క్యాష్బ్యాక్ ధమాకా’ ఆఫర్ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. ‘పండుగ సీజన్ డిమాండ్ తారాస్థాయిలో ఉన్నప్పుడు ప్రతి రోజు 10 మంది లక్కీ విన్నర్లు తలో రూ. 1 లక్ష గెల్చుకోవచ్చు. అలాగే 10,000 మంది విజేతలు రూ. 100 క్యాష్బ్యాక్, మరో 10,000 మంది యూజర్లు రూ. 50 క్యాష్బ్యాక్ అందుకోవచ్చు. ఇక దీపావళి దగ్గరపడే కొద్దీ (నవంబర్ 1–3) యూజర్లు రోజూ రూ. 10 లక్షల దాకా గెల్చుకోవచ్చు‘ అని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్, బ్రాడ్బ్యాండ్ డీటీహెచ్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్, ట్రావెల్ టికెట్ల బుకింగ్, కిరాణా దుకాణాల్లో చెల్లింపులు మొదలైన లావాదేవీలకు క్యాష్బ్యాక్ ఆఫర్లు అందుకోవచ్చు. -
స్మార్ట్ఫోన్ల జాతర.. వరుస కట్టిన కొత్త ఫోన్లు
పండగ సీజన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీలు రెడీ అయ్యాయి. దసరా మొదలు న్యూ ఇయర్ వరకు ఉన్న ఫెస్టివ్ సీజన్లో వరుసబెట్టి ఫోన్లు రిలీజ్ చేసేందుకు స్పెషల్ ఈవెంట్లను వేదికగా చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఫోన్ల ధర ఎంత, వాటిలో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి గ్యాడ్జెట్ లవర్స్లో పెరిగిపోతుంది. యాపిల్తో మొదలు స్మార్ట్ఫోన్ ప్రపంచలో యాపిల్ది ప్రత్యేక స్థానం, మెటల్బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, యాప్స్టోర్, టాప్నాచ్ ఇలా ఒక్కటేమిటీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫీచర్లలో సగానికి సగం యాపిల్ పరిచయం చేసినవి లేదా యాపిల్ వల్ల పాపులర్ అయినవే ఉన్నాయి. అందువల్లే యాపిల్ ఈవెంట్ అంటే ప్రపంచమంతటా ప్రత్యేక ఆసక్తి. మొబైల్ టెక్నాలజీలో కొత్తగా ఏం పరిచయం చేయబోతున్నారనే కుతూహలం నెలకొంటుంది. ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా అక్టోబరు 18న యాపిల్ ఆన్లీషెడ్ ఈవెంట్ జరగనుంది. గూగుల్ సైతం ప్రపంచంలో ఎనభై శాతం స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫార్మ్ మీదనే రన్ అవుతున్నా.. మార్కెట్ లీడర్ అనదగ్గ ఒక్క ఫోన్ రిలీజ్ చేయలేదనే వెలితి గూగుల్ని పట్టి పీడిస్తోంది. నెక్సస్, మోటో, పిక్సెల్ తదితర బ్రాండ్ నేమ్లతో పదేళ్లుగా గూగుల్ మొబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అక్టోబరు 19న పిక్సెల్ 6 మొబైల్ని రిలీజ్ చేయనుంది. ఇందులో కొత్తగా టెన్సర్ చిప్సెట్ని ఉపయోగిస్తోంది గూగుల్. ఈసారైనా ఈ టెక్ దిగ్గజ కంపెనీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. మరో సిరీస్లో వన్ప్లస్ హైఎండ్ ఫీచర్లు అతి తక్కువ ధరలో అనే కాన్సెప్టుతో వచ్చి శామ్సంగ్, యాపిల్కు చుక్కలు చూపించింది వన్ ప్లస్ బ్రాండ్. కేవలం దీని వల్లే హై ఎండ్బ్రాండ్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ పరంపరలో 9 సిరీస్కి సంబంధించిన వివరాలు అక్టోబరు 19న వెల్లడించనుంది వన్ప్లస్. మేము వస్తున్నాం యాపిల్, గూగుల్లకి పోటీగా అన్ ప్యాకెడ్ ఈవెంట్ని ప్రకటించింది శామ్సంగ్. అక్టోబరు 20న జరగబోయే ఈ సమావేశంలో తమ సంస్థ నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కి సంబంధించి గ్యాడ్జెట్లను శామ్సంగ్ పరిచయం చేయనుంది. మళ్లీ వస్తోన్నఎక్స్పీరియా అక్టోబరులోనే కొత్త ఎక్స్పీరియా ఫోన్ని పరిచయం చేసేందుకు సోనీ రెడీ అవుతోంది. ఒకప్పుడు స్మార్ట్ఫోన్ మార్కెట్లో చెలరేగిన సోని.. గత ఐదేళ్లుగా గప్చుప్గా ఉంది. కాగా మరోసారి ఇండియన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా అక్టోబరు 26న ఎక్స్పీరియా ఈవెంట్ నిర్వహిస్తోంది. సోనితో పాటే ఇదే నెలలో ఒప్పో, ఆనర్, హువావే, ఐక్యూ కంపెనీలు సైతం కొత్త ఫోన్లు మార్కెట్లోకి తేబోతున్నాయి. ఏడాది చివరినాటికి బడ్జెట్ ఫోన్లతో దేశంలో సగం మార్కెట్ని ఆక్రమించిన రెడ్మీ, రియల్మీ సంస్థలు సైతం రాబోయే నెలల్లో కొత్త ఫోన్లు తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు వీటి సబ్సిడరీ కంపెనీలైన ఆనర్, పోకోలు ధరల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు కొత్త మోడళ్లతో మార్కెట్ను ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. చదవండి:6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
పండగ సెలవులంటే ఫ్లైట్ కావాల్సిందేనంట!
దసరా దీపావళి పండగలు మన దగ్గర ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు సొంతూళ్లకు వెళితే మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్తారు. ఇక సంపన్నులైతే విదేశీ టూర్లకు వెళ్తుంటారు. అయితే ఈసారి ఇలా విదేశాలకు వెళ్తున్న వారితో ఛార్టర్ ఫ్లైట్స్కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ ఆంక్షలు దేశీయంగా చాలా ప్రాంతాల్లో టూరిస్టులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్, ఉత్తర్ఖండ్, కశ్మీర్, లదాఖ్ ఇలా టూరిస్టులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో ఎటువంటి ఆంక్షలు లేని యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు, మాల్దీవ్స్, థాయ్లాండ్, రష్యా వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఛార్టర్ ఫ్లైట్స్ విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న సంపన్న వర్గాలు సాధారణ ప్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది సీట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేట్ ఫ్లైట్స్ ఎక్కువగా బుక్ అవుతున్నాయని ప్రైవేట్ జెట్ ఆపరేటర్స్ అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా రెగ్యులర్ ఫ్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఫుల్ డిమాండ్ విదేశీ టూర్లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్కి గిరాకీ పెరిగింది. ఇప్పటికే అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు వీకెండ్లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దసరా , దీపావళి పండగ సెలవు రోజుల్లో రెట్టింపు ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియాకు వస్తున్నారు ఇక వ్యాపారం, ఉద్యోగ పనుల నిమిత్తం దుబాయ్లో ఉండిపోయిన భారతీయుల్లో ఎక్కువ మంది పండగని తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలనే సెంటిమెంట్ని ఎక్కువగా పాటిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా పండగ జరుపుకోలేకపోయిన వారు ఈ సారి ఇండియా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీరు సైతం ప్రైవేటు ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ జెట్ ఫ్లైట్లకు జరుగుతున్న బుకింగ్స్లో 35 శాతం వరకు విదేశాల నుంచి ఇండియాకి వచ్చే వారికే ఉంటున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని -
PM Modi: వ్యాక్సిన్ ఒక సురక్ష చక్రం
న్యూఢిల్లీ: దసరా, దీపావళి దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో కోవిడ్–19 నిబంధనలు అందరూ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్కీ బాత్ 81వ ఎడిషన్లో ఆయన మాట్లాడారు. పండుగలొస్తున్న సమయంలోనే కోవిడ్–19పై పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలన్నారు. ‘‘భారత్ వ్యాక్సినేషన్లో ప్రతీ రోజూ ఒక సరికొత్త రికార్డు సాధిస్తోంది. అంతర్జాతీయ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. కరోనా నుంచి రక్షణనిచ్చేది వ్యాక్సిన్ మాత్రమే’’అని మోదీ అన్నారు.‘వ్యాక్సిన్ అన్నది ఒక సురక్ష చక్రం వంటిది. మీ చుట్టు పక్కల వారికి టీకా వేయించాల్సిన బాధ్యత మీదే. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’అని ప్రధాని చెప్పారు. ఈసారి మోదీ ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నదుల పరిశుభ్రత, డిజిటల్ లావాదేవీలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలపై మాట్లాడారు. మోదీ అమెరికా పర్యటనకు ముందే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రికార్డు చేశారు. టెక్నాలజీతో అవినీతికి అడ్డుకట్ట నిరుపేదల కోసం టాయిలెట్లు నిర్మించి స్వచ్ఛభారత్ కోసం ఎలా పోరాడామో ఆర్థిక రంగం స్వచ్ఛంగా ఉండేలా, నిరుపేదల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండడానికి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జన్ధన్ ఖాతాల్లో లబి్ధదారులకు నేరుగా డబ్బు జమ అవుతూ ఉండడంతో దిగువ స్థాయిలో అవినీతిని కట్టడి చేశామన్నారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో కూడా ప్రతీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వంటి టెక్నాలజీతో యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారని చెప్పారు. ఆగస్టు నెలలో 355 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగాయని వెల్లడించారు. రోజుకి సగటున 6 లక్షల కోట్ల నగదు లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయని, డిజిటల్ ఎకానమీ పారదర్శకత, స్వచ్ఛతకు ప్రతీక అని అన్నారు. సెంట్రల్ విస్టా సందర్శన కొత్త పార్లమెంటు నిర్మాణ స్థలాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. పనుల్లో నిమగ్నమై ఉన్న కారి్మకులతో మాట్లాడి, నిర్మాణం సాగుతున్న తీరును తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంటులో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంటు భవనంతో పాటు ప్రధాని, ఉపరాష్ట్రపతుల నివాసాలు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. -
పండుగ సీజన్లో బాదుడు?..వీటి ధరలు పెరగనున్నాయ్!
ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్లో విడుదలైన ప్రాడక్ట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి.డిమాండ్కు తగ్గట్లు ఆయా కంపెనీలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకుంటుంటాయి. అయితే ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఉత్పత్తుల ధరల్ని 8 శాతం పెంచేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయంటూ ఎకనమిక్ టైమ్స్ ఓ నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజనల్ సందర్భంగా కార్స్, బైక్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్ ప్రాడక్ట్ల ధరల్ని పెంచనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో తెలిపింది. వీటిలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 8శాతం వరకు, టూవీలర్లరపై 1 నుంచి 2శాతం వరకు పెరగనున్నాయి. బాష్, సిమెన్స్, హిటాచీ బ్రాండ్లు ధరలను 3 శాతం నుంచి 8 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని సంస్థలు ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నాయి. ఈ సందర్భంగా ఐడిసి ఇండియా(ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఇండియా) రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ..కొన్ని కంపెనీలు వచ్చే నెల ప్రారంభంలో టీవీలు(టెలివిజన్లు), ఎయిర్ కండిషనర్లు,రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు,మైక్రోవేవ్ ఓవెన్ల వంటి గృహోపకరణాల ధరల్ని 3శాతం నుంచి 7శాతం ధరల్ని పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఆటోమొబైల్ కేటగిరిలో పెరిగిన ధరలు ఈ ఏడాదిలో ఇప్పటికే ఆటోమొబైల్ రంగానికి చెందిన టూవీలర్లు, కార్ల ధరలు పెరిగాయి. ఆయా మోడల్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న కార్ల ధర రూ.50వేల నుంచి రూ.2.5లక్షల వరకు పెరిగింది. అదే సమయంలో టూవీలర్ ధరలు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచాయి. ఇక గత 12 నుంచి 18నెలల కాలంలో ఆయా సీజన్లను బట్టి కార్, టూవీలర్లపై అందించే ఇన్స్టాల్మెంట్స్ 10 నుంచి 15శాతం వరకు పెరిగాయి. అయితే పెరుగుతున్న ధరల్ని బట్టి కొనుగోలు దారులు మైండ్ సెట్ మారిపోయిందని, ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అత్యధికంగా అమ్ముడైన పది కార్ల మోడళ్ల ధర ఐదు సందర్భాల్లో మారిందని కన్సల్టెన్సీ జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి భాటియా చెప్పారు. వీటితో పాటు స్టీల్ ధర రెట్టింపు అయ్యింది. అల్యూమినియం, రాగి ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. సెమీకండక్టర్ కొరతతో చిప్ ధరలు 25 శాతం నుంచి 75శాతానికి పెరిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. అన్నింటికీ మించి సరుకు రవాణా వ్యయాలు 2 నుంచి 3 రెట్లు పెరగడంతో దిగుమతులకు మరింత భారంగా మారింది. ఇక మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల మోడళ్ల విడుదల పెరిగిపోవడంతో పలు సంస్థలు స్మార్ట్ఫోన్ ధరల్ని 3నుంచి 5శాతం పెంచగా.. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
పండక్కి వచ్చేస్తోంది... సరికొత్త రూపంలో హోండా యాక్టివా!
స్కూటర్ విభాగానికి యాక్టివా రూపంలో పవర్ని పరిచయం చేసిన హోండా సంస్థ పండక్కి కొత్త కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది. సక్సెస్ ఫుల్ మోడల్ యాక్టివాతో పాటు డియో నుంచి కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్లు మార్కెట్లోకి తేబోతుంది. పండక్కి రిలీజ్ ఇటీవల హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తమ కంపెనీ రాబోతున్న కొత్త మోడళ్లకు సంబంధించి డాక్యుమెంట్లను ఆర్టీఏ కార్యాలయం ఢిల్లీలో సమర్పించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం హోండా 6జీ మోడల్తో పాటు డియోలో కొత్త మోడల్స్ని మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నట్టు పేర్కొంది. రాబోయే పండగ సీజన్లోనే ఈ కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎల్ఈడీ సొబగులు హోండా యాక్టివాకు సంబంధించి మార్కెట్లో ప్రస్తుతం 5జీ వెర్షన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుండగా తాజాగా 6జీ వెర్షన్ను తెచ్చేందుకు హోండా సిద్ధమైంది. హోండా 6జీ, హోండా 6జీ ఎల్ఈడీ వెర్షన్లలో రెండు స్కూటర్లు మార్కెట్లోకి రాబోతున్నట్టు హోండా డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం హోండా యాక్టివాకు స్టీల్ వీల్స్ ఉండగా 6జీ నుంచి ఎల్లాయ్ వీల్స్ని పరిచయం చేయనుంది. డియో నాలుగు వెర్షన్లలో యాక్టివాతో పాటు హోండా డియోకు సంబంధించి మొత్తం 4 వెర్షన్లను మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో కాంపోజిట్కాస్ట్ వీల్స్, డిజిటల్ స్పీడోమీటర్, కాంపోసిట్కాస్ట్వీల్స్, 3డి ఎంబ్లెమ్ వేరియంట్లలో మార్కెట్లోకి తేబోతున్నట్టు తెలుస్తోంది. 110 సీసీ హోండా త్వరలో మార్కెట్లోకి తేబోతున్న 6జీ యాక్టివా, డియో మోడల్స్ రెండింటి ఇంజన్ సామర్థ్యం 109.51 సీసీ సింగిల్ సిలిండర్గా ఉంది. యాక్టివా 5జీ 7.68 హెచ్పీతో 8,000 ఆర్పీఎం శక్తిని విడుదల చేయనుంది. ఇక డియోకు సంబంధించి 7.65 హెచ్పీతో 8,000 ఆర్పీఎంని రిలీజ్ చేస్తుంది. చదవండి : పలు కార్లపై బంపర్ ఆఫర్ను ప్రకటించిన హోండా..! -
థర్డ్ వేవ్ ముప్పు.. పండగలొస్తున్నాయ్ జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్ వేవ్ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్చరికలు చేసింది. అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని, ఆ రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్్కఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది పండగల సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా తిరగడం పెరుగుతుందని తద్వారా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్ అన్న మాట వాడకుండానే పాల్ కరోనా కేసులపై మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటిస్తూ, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ‘అయితే దేశంలో పెద్దవాళ్లలో దాదాపుగా 62% మంది సింగిల్ డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరోనా మొదటి, రెండు వేవ్ల స్థాయిలో తీవ్రంగా మూడో వేవ్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా సోకితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ అయ్యే అంశంలో ప్రజలకు తగినంత అవగాహన రావడంతో మళ్లీ కరోనా కేసులు విజృంభించినా అంత ప్రమాదమేమీ ఉండడు’ అని వీకే పాల్ ధైర్యం చెప్పారు. చదవండి: ఆరోగ్యానికి కేరాఫ్ పనస ప్రస్తుతానికి బూస్టర్ డోసు ఆలోచన లేదు కోవిడ్ బూస్టర్ డోసు ఇవ్వాలన్న ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని, ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. కరోనా రెండు డోసులు ఇవ్వడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. బూస్టర్ డోసు గురించి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య వ్యవస్థలో ఎలాంటి చర్చ జరగడం లేదని ఆయన స్పష్టంచేశారు. -
Realme: ఫెస్టివల్ సీజన్.. టార్గెట్ బిగ్సేల్స్!
న్యూఢిల్లీ: పండగ సీజన్గా పేర్కొనే సెప్టెంబరు–అక్టోబర్లో 60 లక్షల పైచిలుకు స్మార్ట్ఫోన్ల విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. ట్యాబ్లెట్ పీసీల్లో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు వివరించారు. ల్యాప్టాప్స్ తయారీ కోసం మూడు కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలో వీటి తయారీ ప్రారంభం అవుతుందన్నారు. ట్యాబ్లెట్ పీసీలు సైతం దేశీయంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. 2020లో భారత్లో 1.9 కోట్ల యూనిట్ల రియల్మీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. చిప్సెట్ల ఎఫెక్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా చిప్సెట్ కొరత నెలకొన్నా... దాని ప్రభావం ఈ పండుగల సీజన్లో తమ కంపెనీపై ఉండబోదని రియల్మీ స్పష్టం చేసింది. భారత్లో తమ కంపెనీ ఈ ఏడాది 2.4–2.7 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదికి సైతం సరిపడ చిప్సెట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. భారత మార్కెట్ విషయంలో చిప్సెట్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. రియల్మీ ప్యాడ్.. రూ.13,999 ధరలో రియల్మీ ప్యాడ్ను కంపెనీ గురువారం భారత్లో విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్, 10.4 అంగుళాల స్క్రీన్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. 3/4 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే రియల్మీ 8ఎస్ 5జీ, రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్లను సైతం ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధరలు రూ.13,999 నుంచి మొదలవుతున్నాయి. చదవండి: వన్ప్లస్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్..! -
పండుగ సీజన్పై ఆటో కంపెనీల ఆశలు
న్యూఢిల్లీ: చిప్ల కొరతతో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్లో అమ్మకాలు మరింత మెరుగ్గానే ఉండవచ్చని ఆటోమొబైల్ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఓనంతో మొదలైన పండుగ సీజన్ నవంబర్లో దీపావళితో ముగియనుంది. ఇప్పటిదాకానైతే డిమాండ్ బాగానే ఉండటంతో, అక్టోబర్లో సీజన్ తారస్థాయికి చేరితే సన్నద్ధంగా ఉండటం కోసం డీలర్లకు సరఫరా పెంచేందుకు వాహన కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్ మోటర్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. బుకింగ్లు, ఎంక్వైరీలు, రిటైల్ విక్రయాలు గణనీయంగానే ఉంటున్నాయని.. సరఫరా తరఫునే కొన్ని సమస్యలు ఉండగా, వాటిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. పండుగ సీజన్లో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగవచ్చని, ప్యాసింజర్ వాహనాల విభాగంలో వీటి అమ్మకాల వాటా సగం దాకా ఉండవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో వీజే నక్రా పేర్కొన్నారు. ఆరి్థక రికవరీ, వ్యక్తిగత రవాణా వాహనాల అవసరం పెరగడం, కొత్త వాహనాల ఆవిష్కరణ వంటి అంశాలతో రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత మెరుగుపడొచ్చని టయోటా కిర్లోస్కర్ మోటర్ అసోసియేట్ జీఎం వి సిగమణి తెలిపారు. -
తప్పదనుకుంటే టీకాలూ తప్పనిసరే
న్యూఢిల్లీ: పండగల సీజన్లో వైరస్ వ్యాప్తి ఉధృతిని అడ్డుకునేందుకు పౌరులు తమ వంతు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ హితవు పలికింది. పర్వదినాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలని భావించే వారు ఖచ్చితంగా రెండు డోస్లు(ఫుల్ వ్యాక్సినేషన్) తీసుకోవాలని కేంద్రం సూచించింది. మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమనిబంధనలను పాటించాలని సలహా ఇచ్చింది. వారపు పాజిటివిటీ రేటు కాస్తంత తగ్గినా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించింది. ఆగస్ట్ చివరి రోజుల్లో వారపు పాజిటివిటీ రేటు 39 జిల్లాల్లో ఇంకా ఏకంగా 10 శాతం పైనే నమోదైందని ఆందోళన వ్యక్తంచేసింది. మరో 38 జిల్లాల్లో 5–10 శాతానికి చేరుకుందని పేర్కొంది. ‘వచ్చే పండగల సీజన్లో కరోనా మూడో వేవ్ ముంగిట మనం ఉండబోతున్నామనే భయాలు ప్రజల్లో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసందోహం ఉండే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లడాన్ని ప్రజలు మానుకోవాలి. ఖచ్చితంగా వెళ్తామని నిర్ణయించుకునే వారు రెండు డోస్లు తీసుకోవాలి. సమూహాలకు ప్రాధాన్యతనివ్వకుండా వారి వారి ఇళ్లల్లోనే పండగలు చేసుకుంటే ఉత్తమం’ అని కేంద్రం హితబోధ చేసింది. దేశంలో దాదాపు 300కుపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా కేంద్రం గుర్తుచేసింది. -
ప్రజలు గుమికూడటాన్ని నివారించండి
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మార్గదర్శకాల అమలును మరో నెలపాటు, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అందుకే, రానున్న పండగల సీజన్ సమయంలో ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జనసమ్మర్ధం ఉన్నచోట్ల కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కోవిడ్ టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. -
సర్వే, ఆ 'కంఫర్ట్' కోసం ఏం చేస్తున్నారో చూడండి
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో వినియోగదారులు భారీ కోనుగోళ్ళ ఉద్దేశ్యంతో ఉన్నట్టు డెలాయిట్ తౌషే తోమట్సు ఇండియా నిర్వహించిన ‘గ్లోబల్ స్టేట్ ఆఫ్ కన్జ్యూమర్ ట్రాకర్’ సర్వేలో వెల్లడైంది. భారత్లో అన్ని రకాల వయసు వారు మరింత ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ సంస్థ గడిచిన 30 రోజుల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గత మే నెలలో నిర్వహించిన సర్వేలో ఆందోళన స్థాయి 45 శాతం ఉంటే, తాజా సర్వేలో అది 39 శాతానికి తగ్గినట్టు ఈ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం విస్తృతం కావడం ప్రజల్లో ఆందోళన తగ్గడానికి కారణంగా పేర్కొంది. కార్యాలయం నుంచే పని విధానానికి తిరిగి మళ్లడాన్ని కార్పొరేట్ ఇండియా మదింపు వేస్తోందని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. సర్వేలో అంశాలు.. ► 87% వినియోగదారులు సౌకర్యం కోసం మరింత ఖర్చుకు సానుకూలంగా ఉన్నారు. ► స్టోర్స్కు వెళ్లి కొనుగోళ్లు చేసుకోవడం కాస్త సురక్షితమేనని 61 శాతం మంది భావిస్తున్నారు. ► వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరయ్యే ఉద్దేశ్యంతో 51 శాతం మంది ఉన్నారు. ► 79 శాతం వినియోగదారులు తమ శారీరక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే.. 85 శాతం తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. ► 55 ఏళ్లపైన ఉన్న వారితో పోలిస్తే 47 ఏళ్లలోపు వయసున్న వారు ఎక్కువ పొదుపు చేస్తున్నారు. ► 35 ఏళ్లు ఆపైన వయసున్న వారు విహార యాత్రల పట్ల ఆసక్తిగా ఉంటే.. 58 శాతం మంది వినియోగదారులు తాము హోటళ్లలో బస చేయడం పట్ల సౌకర్యంగా ఉన్నామని చెప్పారు. ► ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణానికి ఎక్కువ మంది అనుకూలంగా లేరు. 79 శాతం మంది ప్రస్తుత వాహనాన్నే దీర్ఘకాలం పాటు వాడాలన్న దృఢ నిర్ణయంతో ఉన్నారు. -
ప్రయాణికులపై 'ప్రైవేట్' బాదుడు
సాక్షి, అమరావతి: ఎప్పటిలాగే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ పండుగ సీజన్లోనూ దోపిడీకి తెగబడ్డారు. సంక్రాంతికి సొంతూరుకు వెళ్దామనుకునే వారికి రెండ్రోజులుగా చార్జీలు పెంచి చుక్కలు చూపిస్తున్నారు. డిమాండ్ ఉన్న తేదీల్లో అయితే మరీ బాదేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆర్టీసీ టికెట్ ధర రూ.900 ఉంటే, ప్రైవేటు ట్రావెల్స్లో మాత్రం రూ.1,500 వరకు వసూలుచేస్తున్నారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో హైదరాబాద్నుంచి గుంటూరుకు రెగ్యులర్ సర్వీసుల్లో రూ.530 వరకు ఉంది. అదే స్పెషల్ బస్సు అయితే రూ.795 వసూలుచేస్తున్నారు. కానీ, ప్రైవేటు బస్సులో ఏకంగా రూ.1,130–1,200 వరకు తీసుకుంటున్నట్లు ఆన్లైన్లో ఉంచారు. నాన్ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో ఇదే మార్గంలో రెగ్యులర్ సర్వీసులకు రూ.418 అయితే, స్పెషల్ బస్సుల్లో రూ.568 వసూలుచేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో నాన్ ఏసీ టికెట్ల ధరలు రూ.850–రూ.950 వరకు ఉన్నాయి. ప్రయాణికుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం టికెట్ రిజర్వేషన్లు చేసే రెడ్బస్, అభీబస్ల నిర్వాహకులతో ఇప్పటికే మాట్లాడాం. ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టినా.. అధిక రేట్లకు విక్రయించినా.. ట్రావెల్స్ నిర్వాహకులపైనే కాదు.. బస్ టికెట్ కంపెనీలపై కూడా కేసులు నమోదు చెయ్యొచ్చు. నేటి నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తాం. ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు తమ బస్సుల్లో ‘రవాణా అధికారులు ఎక్కడైనా తనిఖీలు చేస్తారు.. వారికి సహకరించాలి’ అని బోర్డులు పెట్టుకోవాలి. – ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రైవేట్ దోపిడీపై రవాణా శాఖ కన్ను ఇలా ప్రయాణికుల్ని దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్, టికెట్ బుకింగ్ వెబ్సైట్లపై రవాణా అధికారులు దృష్టిసారించారు. మోటారు వెహికల్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. అంతేకాక.. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే భారీ జరిమానాలు విధించనున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ మొదలుకావడంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రైవేటు బస్సులను తనిఖీలు చేసేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినా తీరు మార్చుకోకపోతే వాటిని సీజ్ చేయనున్నారు. అలాంటి ట్రావెల్స్ నిర్వాహకులకు రూ.25 వేల వరకు జరిమానాలు విధించనున్నారు. కేసులు నమోదు చేసిన ట్రావెల్స్ వివరాలను అన్ని చెక్పోస్టులకు పంపించాలని కమిషనరేట్ అధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం కేసుల నమోదు విషయంలో మినహాయింపులేదని రవాణా శాఖాధికారులు స్పష్టంచేశారు. మరోవైపు.. టికెట్ల ధరలు తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు గతేడాది హామీ ఇచ్చినప్పటికీ ఈ ఏడాది కూడా అధికంగానే వసూలుచేయడం గమనార్హం. -
వారికి మహీంద్రా స్పెషల్ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: పండుగ సీజన్లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రభుత్వ ఉద్యోగులకోసం ప్రత్యేకమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇప్పటికే ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తున్న సంస్థ తాజాగా కార్ల కొనుగోలుపై వీరికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సర్కార్ 2.0 ప్రోగ్రాం కింద నగదు తగ్గింపులు, సులభమైన ఈఎంఐ, తక్కువ వడ్డీ రేట్లు లాంటి ఆఫర్లను అందిస్తోంది. మహీంద్రా కారును కొనుగోలు చేసే విధానాన్ని మరింత సులభతరం చేసేలా తాజా స్పెషల్ డీల్స్ను కంపెనీ ప్రకటించింది. యుటిలీటీ వెహికల్ కోనుగోలపై లక్ష రూపాయలకు గాను రూ. 799వద్ద సులభ ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఇందుకోసం వివిధ బ్యాంకులతో తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని, మరిన్ని వివరాలకు కొనుగోలుదారులు దగ్గరలోని తమ డీలర్లను సంప్రదించాలని కంపెనీ తెలిపింది. కాంటాక్ట్లెస్ చెల్లింపు సౌలభ్యాన్ని కూడా అందబాటులో ఉంచామని ఎం అండ్ ఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్లు ఈ ఆఫర్ కింద ఎం అండ్ ఎం ప్రభుత్వ ఉద్యోగులకు రూ .11,500 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. అంతేకాదు కారు లోనును ముందస్తుగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. వడ్డీరేట్లు 7.25 శాతం నుంచి ప్రారంభం. -
ఆఫ్లైన్ కస్టమర్లకూ పేటీఎం ఆఫర్లు
హైదరాబాద్/న్యూఢిల్లీ: భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ పేటీఎం ఈ పండుగ సీజన్లో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. తన ఆల్ ఇన్ వన్ పీఓఎస్ పరికరాల ద్వారా చిన్న దుకాణదారులకు ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈఫెస్టివ్ సీజన్లో వ్యాపారులు అమ్మకాలను పెంచడానికి, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందుకోసం వివిధ బ్యాంకులు, వివిధ బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకుంది. ఈమేరకు పేటీఎం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారులు నో కాస్ట్ ఆఫర్లు, అగ్ర బ్యాంకుల నుంచి వందకు పైగా క్యాష్బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నామని ఇందులకు,చిన్న వ్యాపారాలకు అధికారం ఇస్తున్నట్లు ప్రకటించింది. పీవోఎస్ పరికరాలతో 2 లక్షలకు పైగా ఆఫ్లైన్ వ్యాపారాలు ఇందులో పాల్గొంటాయని పేటీఎం ప్రకటించింది. తద్వారా ఇ-కామర్స్ సంస్థలు, పెద్ద రిటైలర్ల మాదిరిగానే ఆఫ్లైన్ వ్యాపారులు కూడా తమ కస్టమర్లకు కూడా నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్బ్యాక్ ఆఫర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం యాక్సిస్, సిటీబ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా టాప్ 15 బ్యాంకులతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే ఎల్జీ, ఒప్పో, వివో, రియల్మి, ఆసుస్, హైయర్,వోల్టాస్, వోల్టాస్ బెకో,డైకిన్,బాష్, సిమెన్స్ వంటి ప్రధాన బ్రాండ్లతోడీల్ కుదర్చుకుంది. నిబంధనల ప్రకారం వినియోగదారులకు రూ .20,000 వరకు తగ్గింపును అందించనున్నాయి. స్మార్ట్ పీఓఎస్ డివైస్ల ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డ్ స్వైపింగ్, క్యూఆర్ కోడ్ లాంటి అన్ని చెల్లింపులను అంగీకరించి, వారి కార్యకలాపాలను సమర్ధవంతంగా నడిపించి వారిని శక్తివంతం చేయనున్నాని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రేణు సత్తి వెల్లడించారు. ముఖ్యంగా టైర్ -2, టైర్ -3, మిగిలిన భారత నగరాలలో ఆఫ్లైన్ వ్యాపారులు, చిన్న దుకాణదారులతో విస్తృతంగా పనిచేస్తున్నట్లు పేటీఎం తెలిపింది. అలాగే మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.అలాగే డిజిటల్ ఇండియా మిషన్కి అవసరమైన డిజిటలైజేషన్ మద్దతును అందిస్తున్నామని ఆయన చెప్పారు. -
ఎస్బీఐ బొనాంజా..!
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన గృహ రుణాలకు సంబంధించి అవలంబిస్తున్న వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షలకుపైగా రుణం, సిబిల్ స్కోర్, బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా రాయితీ వర్తిస్తుందని బుధవారం విడుదలైన బ్యాంక్ ప్రకటన తెలిపింది. ప్రకటనకు సంబంధించి మరిన్ని అంశాలను పరిశీలిస్తే... ► రూ. 30 లక్షలకుపైబడి, రూ.2 కోట్ల వరకూ గృహ రుణాలపై క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రాయితీ ఇప్పటి వరకూ 10 బేసిస్ పాయింట్లు ఉంది. ఇకపై ఈ రాయితీని 20 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ► ఎనిమిది మెట్రో నగరాల విషయంలో రూ.3 కోట్ల రుణం వరకూ ఇదే క్రెడిట్ స్కోర్ ఆధారిత వడ్డీరేటు విధానం అమలవుతుంది. యోనో ద్వారా దరఖాస్తుచేస్తే, అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. ► ప్రస్తుతం బ్యాంక్ రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై 6.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.30 లక్షలుపైబడితే ఈ రేటు 7 శాతంగా ఉంది. ఈ విషయంలో మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ ఉంది. ► ఎస్బీఐ ‘యోనో’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ 100 శాతం మాఫీ చేస్తోంది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తోంది. ► కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా అందిస్తోంది. ► వ్యక్తిగత రుణాలపై 9.6% నుంచి వడ్డీ రేటు ఉంటోంది. ► ఎస్బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. డిమాండ్ వృద్ధిపై విశ్వాసం: ఎస్బీఐ కాగా అధిక ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధి్దకి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదని బ్యాంకింగ్ పరిశ్రమ పేర్కొంటోంది. రుణ వృద్ధి పలు సంవత్సరాల కనిష్టస్థాయి 6 శాతం వద్దే కొనసాగుతుండడం గమనార్హం. అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనీ, వినియోగ విశ్వాసం, డిమాండ్ మెరుగుపడుతుందనీ, ప్రత్యేకించి ఎస్బీఐ ఇస్తున్న గృహ రుణ ఆఫర్లు ఈ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని విశ్వసిస్తున్నామని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల పోటీ... పండుగల సీజన్లో డిమాండ్ను సొంతం చేసుకోడానికి ప్రైవేటు బ్యాంకులూ ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. యస్బ్యాంక్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణాలు, తక్కువ వ్యయ ఈఎంఐలు, గిఫ్ట్ వోచర్ల విషయంలో ప్రాసెసింగ్ ఫీజు రద్దుసహా పలు ఆఫర్లను ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ‘ఖుషియోంకీ కరే జిమ్మెదారి సే తయారీ’ పేరిట ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది. 100 శాతం ఆన్–రోడ్ ధరతో 7.99 శాతం నుంచి కారు రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 72 నెలల అత్యధిక కాలవ్యవధితో 10.45 శాతం ప్రారంభ వడ్డీకి రూ.50 లక్షల వరకూ వ్యక్తిగత రుణం పొందే సౌలభ్యం ఉన్నట్లు వివరించింది. రూ.799 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 శాతానికి పడిసి రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు ఇప్పటికే 7 శాతానికి తగ్గింది. పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రుణ ప్రాసెసింగ్ ఫీజు రద్దు, వేగవంతమైన ఆన్లైన్ ఆమోదాలు వంటి ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కారు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహన, నిర్మాణ పరికరాల రుణాలకు ప్రాసెసింగ్ ఫీజ్ తగ్గింపు అమలవుతుంది. బ్యాంకులో కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తే, రూ.250 వోచర్ కూడా లభిస్తుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోళ్లకు ఈ వోచర్ను వినియోగిచుకోవచ్చు. ఇక యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతానికి గృహ రుణ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
షాపింగ్కు సై!
సాక్షి, హైదరాబాద్: పండుగల సీజన్ షాపింగ్ కళను సంతరించుకోనుంది. కరోనా భయంతో గత ఆరేడు నెలలుగా బయటకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు రానున్న పండుగల కోసం బయటకు వచ్చేందుకు ఉత్సుకతతో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్లాకింగ్ ప్రక్రియ మొదలై కొన్ని మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఆన్లైన్తో పాటు ప్రత్యక్షంగా షాపింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలోనే మొదలుకానున్న పండుగల సీజన్లో 80 శాతం భారతీయ వినియోగదారులు వివిధ వస్తువుల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్లు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్), లిట్మస్ వరల్డ్ (లిట్మస్ వరల్డ్ పీపుల్ పల్స్ ఇనిషియేటివ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అన్లాకింగ్ ఇండియన్ కన్జూమర్ సెంటిమెంట్ పోస్ట్ లాక్డౌన్’సర్వేలో వెల్లడైంది. సుదీర్ఘ కాలం పాటు ఇళ్లకే పరిమితం కావడంతో స్నేహితులు, బంధువులకు ఇచ్చేందుకు కానుకలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నా పండుగ కోసం వస్తువులు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. సర్వే చేసిన వారిలో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రథమ శ్రేణి (టైర్–1) నగరాల్లోని 80 శాతం మంది, ఆగ్రా, అమృత్సర్, చండీగఢ్ తదితర టైర్–2 సిటీల్లో 12 శాతం మందిని, ఔరంగాబాద్, జోధ్పూర్, గ్వాలియర్ తదితర టైర్–3 సిటీల్లో 8 శాతం మంది ఉన్నారు. సర్వేలో ముఖ్యాంశాలు.. ►3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు 62 శాతం, ఆ తర్వాత కొనుగోలు చేసేందుకు 38 శాతం మొగ్గు ►టైర్–2, టైర్–3 సిటీల్లోని 75 శాతం మంది 3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఏవి కొంటారు? ►53% మంది దుస్తులు, వస్త్రాలు, ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొనుగోళ్లు ►31 శాతం మంది కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్స్ కొనుగోలు ►25 శాతం మంది బ్యూటీ, వెల్నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ►24 శాతం మంది పాదరక్షలు, బూట్లు వంటివి కొనుగోలు ►18 శాతం స్పోర్ట్స్ గూడ్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్, బుక్స్ ►17% ట్రావెల్/లీజర్/లైఫ్ స్టైల్ వస్తువులు ►12 శాతం ఫర్నిచర్, ఫర్నిషింగ్ ►9 శాతం బంగారం, వాచ్లు, ఇతర వ్యక్తిగత వస్తువులు కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు ►ఆన్లైన్లో కొనేందుకు 70 శాతం మంది మహిళల మొగ్గు ►స్వయంగా రిటైల్ స్టోర్లకు వెళ్లి కొంటా మంటున్న 60 శాతం పురుషులు ఆన్లైన్ ప్రక్రియ మొదలయ్యాక షాపింగ్ ఇలా.. ►45 ఏళ్లకు పైబడిన వారు 67 శాతం మంది ఆఫ్లైన్లో షాపింగ్ చేసేందుకు సిద్ధం ►64 శాతం పురుషులు ఆఫ్లైన్లో, 60 శాతం మహిళలు ఆన్లైన్లో కొనుగోళ్లు ►టైర్–2, టైర్–3 నగరాల్లో 75 శాతం మంది ఆఫ్లైన్లో కొనుగోలు ►టైర్–1 సిటీల్లోని వారు ఆన్లైన్, ఆఫ్లైన్లలో సమానంగా షాపింగ్ చేస్తామని వెల్లడి వివిధ వస్తువుల కొనుగోళ్లు ఇలా... ►జ్యూవెల్లరీ, వాచ్లు, ఇతర వస్తువులను రిటైల్ స్టోర్లలోనే కొనుగోలు చేస్తామన్న 70 శాతం మంది ►బ్యూటీ, వెల్నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్లను ఆన్లైన్లో కొంటామంటున్న 60 శాతం మహిళలు ►అన్ని నగరాలు, వయసుల వారు రిటైల్ స్టోర్లకే వెళ్లి బూట్లు, పాదరక్షలు కొనుగోలు చేస్తామన్న 70 శాతం ►స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్ ఆన్లైన్లో కొంటామన్న 67 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లకు వెళ్తామన్న 62 శాతం పురుషులు ►ఫర్నిచర్, ఫర్నిషింగ్లను ఆన్లైన్లో కొనుగోలుకు 64 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు 61 శాతం పురుషులు సుముఖత. -
ఉపాధికి పండుగ సీజన్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఈ–కామర్స్ కంపెనీలు, డెలివరీ సేవల సంస్థలు గణనీయంగా తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, రవాణా భాగస్వామ్య సంస్థలు, ప్యాకేజింగ్ వెండార్లు, డెలివరీ భాగస్వాములు, అమెజాన్ ఫ్లెక్స్ పార్ట్నర్స్, హౌస్కీపింగ్ ఏజెన్సీల ద్వారా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగినట్లు తెలిపింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిపై పెట్టుబడులు కొనసాగించడం ద్వారా 2025 నాటికి భారత్లో 10 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యసాధనకు ఇవి తోడ్పడనున్నాయని అమెజాన్ తెలిపింది. ‘ఈ పండుగ సీజన్లో దేశం నలుమూలలా ఉన్న కస్టమర్లకు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను చేర్చడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం‘ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. డెల్హివెరీలో ఇలా... సరఫరా సేవల సంస్థ డెల్హివెరీ కూడా వచ్చే కొద్ది వారాల్లో వివిధ విభాగాల్లో 15,000 పైచిలుకు సీజనల్ సిబ్బందిని తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో దాదాపు 6.5–7.5 కోట్ల ప్యాకేజీలను హ్యాండిల్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 100% అధికమని వివరించింది. ‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. గడిచిన ఏడాది కాలంలో బిలాస్పూర్, బెంగళూరు, భివండి వంటి ప్రాంతాల్లో మెగా ట్రక్ టెర్మినల్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే 18–24 నెలల్లో విస్తరణపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం‘ అని డెల్హివెరీ ఎండీ సందీప్ బరాసియా వెల్లడించారు. మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు : రెడ్సీర్ ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ సంస్థల ద్వారా దాదాపు మూడు లక్షల పైచిలుకు ఉపాధి అవకాశాల కల్పన జరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ అంచనా వేస్తోంది. వీటిలో 30 శాతం ఉద్యోగాలు లాజిస్టిక్స్ సంస్థల్లో ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్లో ఆన్లైన్లో అమ్ముడయ్యే ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 7 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటుందని రెడ్సీర్ అంచనా. గతేడాది ఇది 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ మొదలైన ఉత్పత్తులకు గణనీయంగా డిమండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఫెస్టివ్ సీజన్ : త్వరలో ఐఫోన్12
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఐఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నతరుణంలో మార్కెట్లో అనేక ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పటినుంచో ఎపుడెపుడా అని ఊరిస్తున్నయాపిల్ ఐఫోన్12 ఆవిష్కారానికి రంగం సిద్ధమవుతోంది. యాపిల్ తన రాబోయే స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 12 త్వరలోనే లాంచ్ చేయనుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యాపిల్ లాంచ్ ఈవెంట్ను అక్టోబర్ 13 న నిర్వహించనుందని, ఈ సందర్భంగానే దీన్ని ఆవిష్కరించనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో భారతీయ వినియోగదారులకు ఐఫోన్ సిరీస్ లో భాగంగా కొత్త ఐఫోన్12 మినీ, ఐఫోన్12 రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. (యాపిల్ ఆన్లైన్ స్టోర్ : బంపర్ ఆఫర్లు) ప్రస్తుతానికి కొత్త ఐఫోన్ కోసం ప్రణాళికలను యాపిల్ ధృవీకరించలేదు. సాధారణంగా యాపిల్ తన ఫోన్ లాంచ్ ఈవెంట్ను సెప్టెంబర్లో నిర్వహిస్తుంది. అయితే కోవిడ్-19, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇటీవల వర్చువల్ గా నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ లో యాపిల్ వాచ్ సిరీస్, ఐపాడ్ లాంటి ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా యాపిల్ ఐఫోన్ 12 పై ఒక ప్రకటన ఉంటుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఐఫోన్ లాంచ్ గురించి యూట్యూబర్ జోన్ తాజా సమాచారం ఐఫోన్ 12 లాంచ్ కార్యక్రమం అక్టోబర్లో జరగనుంది. మూడు రెగ్యులర్ వేరియంట్లలో తీసుకురానుంది. అంతేకాదు అక్టోబర్ 16 నుండి ప్రీ ఆర్డర్లను ప్రారంభించవచ్చట. 6.1 అంగుళాల స్క్రీన్ 256వరకు స్టోరేజ్ , 5.4 అంగుళాలు 64జీబీ స్టోరేజ్ తో రానుంది. 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్ తో రూపొందిస్తున్న ఐఫోన్ 12 ప్రో, ప్రో మాక్స్ స్క్రీన్ పరిమాణాలు వరుసగా 6.1 అంగుళాలు, 6.7 అంగుళాలుగా ఉండవచ్చని మరో అంచనా. -
రుణాలపై ఎస్బీఐ పండుగ ఆఫర్లు
ముంబై: పండుగల సీజన్ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం మాఫీ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వివరించింది. ఇక, క్రెడిట్ స్కోర్, గృహ రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) దాకా రాయితీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఒకవేళ యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ పొందవచ్చని పేర్కొంది. కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా ఇస్తున్నట్లు ఎస్బీఐ వివరించింది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ రేటు ఉంటోందని పేర్కొంది. ‘ఎకానమీ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. పండుగ సీజన్లో కొనుగోలుదారుల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాం‘ అని ఎస్బీఐ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగం) సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్ ద్వారా కారు, పసిడి రుణాల దరఖాస్తులకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఎస్బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. పండుగ సీజన్ అమ్మకాలపై ఆటో డీలర్ల ఆందోళన: ఇక్రా ఈ పండుగ సీజన్లో వాహన విక్రయాల వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని ఆటోమొబైల్ డీలర్లు అంచనా వేస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. స్థూల ఆర్థికవ్యవస్థలోని సవాళ్లతో పాటు కరోనా ప్రతికూల ప్రభావాలు అమ్మకాలపై కనిపించే అవకాశం ఉందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ఇక్రా జరిపిన సర్వే ప్రకారం... ఈ పండుగ సీజన్లో 58శాతం మంది డీలర్లు వార్షిక ప్రాతిపదికన కేవలం 5శాతం వృద్ధిని అంచనా వేస్తున్నారు. ఏ ఒక్క డీలర్ కూడా కనీసం 10శాతం విక్రయాల వృద్ధిని అంచనా వేయలేకపోయారు. ప్యాసింజర్ వాహన విక్రయ డీలర్లలో కొంత ఆశాభావ అంచనాలు నెలకొన్నాయని, కమర్షియల్ వాహన డీలర్లలో ఒత్తిడి కొనసాగుతుందని ఇక్రా సర్వే తెలిపింది. -
టాటా కార్లపై పండుగ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్ తన కార్లపై మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రానున్న ఫెస్టివ్ సీజన్ కారణంగా కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. డిస్కౌంట్ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా బీఎస్-6 ఇంజీన్ఎస్యూవీ టాటా హ్యారియర్ కారుపై 80 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కన్స్యూమర్ స్కీమ్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. బీఎస్6 కార్లకు మాత్రమే అందుబాటులోఉంచిన సంస్థ నెక్సాన్, టైగోర్, టియాగో, హారియర్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్బ్యాక్లో డిస్కౌంట్లను ప్రకటించలేదు. టాటా హ్యారియర్ :80 వేల దాకా తగ్గింపు 25 వేల క్యాష్ డిస్కౌంట్, 15 వేల రూపాయల అదనపు కార్పోరేట్ ఆఫర్, 40 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఉంది. టాటా హ్యారియర్ మోడల్లోని ఆటోమేటిక్ వేరియంట్లైన డార్క్ ఎడిషన్ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ఏ ప్లస్ మినహా అన్నిమోడళ్లకు తగ్గింపు ధరలను అందిస్తోంది. హారియర్ 2-లీటర్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది. 170 పిఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -స్పీడ్ ఆటోమేటిక్ , మాన్యువల్ ట్రాన్మిషన్లలో లభ్యం. ఎస్యూవీ ధర 13.84 లక్షలు బీఎస్-6 టాటా టియాగో 32,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. కన్స్యూమర్ స్కీమ్ 15వేలు, 7 వేల వరకు కార్పొరేట్ తగ్గింపు, 10 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కలిపి మొత్తం ప్రయోజనం 32 వేలు. అయితే కార్పొరేట్ ఆఫర్ టాటా గ్రూప్ , టీఎంఎల్ ఉద్యోగులు, టాటా ట్రస్ట్ ఇండియా, టాటా గ్రూప్ ఎస్ఎస్ఎస్ రెఫరల్, టాప్ 10 , టాప్ 20 కార్పొరేట్స్ తోపాటు, కోవిడ్-19 యోధులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది. బీఎస్- 6 టాటా నెక్సాన్ టాటా మోటార్స్ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్ మోడల్ పై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఇచ్చింది. అయితే డీజిల్ వేరియంట్లో మాత్రమే, డీజిల్ డెరివేటివ్ను ఎంచుకునే వినియోగదారులకు 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ఆఫర్లు ఉన్నప్పటికీ చాలా స్వల్పం. -
ఈసారి ఈ–కామర్స్కు పండుగే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ఈ కామర్స్ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడ్సీర్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గతేడాది ఈ–కామర్స్ కంపెనీలు సాధించిన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు. ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ ఇందుకే.. కోవిడ్–19 తర్వాత కస్టమర్లు గతంలో కంటే సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రీతిలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్ సంస్థలు అలాంటి సదుపాయాల కల్పనను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వీడియో, వాట్సాప్ ఆధారిత షాపింగ్ విధానంతో ఈ కామర్స్ కంపెనీలు కొత్త షాపింగ్ విధానానికి తెరతీశాయి. మా సర్వేలో అధిక శాతం కస్టమర్లు ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు’’ అని రీసెర్చ్ సంస్థ తెలిపింది. కస్టమర్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, షాప్క్లూస్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఉత్పత్తులను భారీ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది పండుగ సీజన్ తొలి రోజుల్లోనే గతేడాది మొత్తం ఆన్లైన్ కస్టమర్ల సంఖ్యను అధిగమించవచ్చని సర్వే అంచనా వేస్తుంది. కోవిడ్–19తో పెరిగిన డిజిటల్ లావాదేవీలు: మాల్స్, రిటైల్ అవుట్లుక్ లాంటి అధిక సంచారం కలిగిన ప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేసేందుకు ఇప్పటికీ ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ఆఫ్లైన్ అమ్మకాల రికవరీ ఇంకా బలహీనంగా నే ఉన్నట్లు సర్వే తెలిపింది. కిందటేడాది ఆన్లైన్ ద్వారా 40–50 మిలియన్ మంది షాపింగ్ చేశారు. కోవిడ్–19 డిజిటల్ లావాదేవీలను మరింత పుంజుకునేలా చేసింది. సంప్రదాయ ఆఫ్లైన్ వినియోగదారుల్ని, ఆన్లైన్కు మళ్లించింది. ఫలితంగా ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ వినియోగదారులు ఏకంగా 70శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని అంశాలు.. బలమైన జాతీయవాద మనోభావంతో కేంద్రం ఇచ్చిన ఆత్మనిర్భర్ నినాదంతో ఎలక్ట్రానిక్స్, మొబైల్ వంటి విభాగాల్లో కస్టమర్లు ‘‘బ్రాండ్’’ను పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వే తెలిపింది. లాక్డౌన్తో ఉత్పత్తి ఆగిపోవడంతో మొబైల్, అప్లికేషన్లు గతేడాదితో పోలిస్తే డిమాండ్ కాస్త తక్కువగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. గృహోపకరణాలకు డిమాండ్ ఉంటుదని సర్వే చెబుతోంది. -
పండుగ సీజన్ : అమెజాన్ కీలక అడుగు
సాక్షి, ముంబై: రానున్న పండుగ సీజన్ కు అనుగుణంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా సిద్ధమవుతోంది. అయిదు కొత్త కేంద్రాలతో తన సార్ట్ సెంటర్ నెట్వర్క్ విస్తరణను అమెజాన్ ప్రకటించింది. తద్వారా పండుగ సీజన్కంటే ముందే వినియోగదారులకు, అమ్మకందారులకు డెలివరీ వేగాన్ని, కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తున్నామని అమెజాన్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం, ఫరూఖ్ నగర్, బెంగళూరు, అహ్మదాబాద్ ముంబైలో వీటిని ప్రారంభించనుంది. అలాగే ప్రస్తుతమున్న ఎనిమిది సార్టింగ్ గిడ్డంగులను కూడా విస్తరిస్తున్నట్లు ఈకామర్స్ మేజర్ తెలిపింది, కొత్త కేంద్రాలతో పాటు, అమెజాన్ ఇండియా 19 రాష్ట్రాలలో మొత్తం సార్టింగ్ ప్రాంతాన్ని 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెంచుతుంది. ఈ కేంద్రాలు అమెజాన్కు ప్యాకేజీలను సమీకరించడంలో సహాయపడతాయనీ అవి స్థానిక డెలివరీ స్టేషన్లనుంచి వినియోగదారులకు చేరతాయని తెలింది. కస్టమర్లకు ప్యాకేజీ స్థానం రవాణా విధానం ఆధారంగా విభజన చేసి సార్ట్ స్లైడ్స్, ఆటో సార్టర్స్ టెక్నాలజీ ఆటోమేషన్ద్వారా ఎండ్-టు-ఎండ్ సార్టింగ్ చేసి వేగంగా డెలివరీ చేయనున్నామని తెలిపింది. ఈ విస్తరణ వ్యక్తులు, సహాయక పరిశ్రమలకు ముఖ్యంగా దేశంలో ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఉన్న ఈ సమయంలో వందలాది అవకాశాలను సృష్టిస్తుందనీ, అమెజాన్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ తెలిపారు. కాగా జూలై 2020లో, అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ను విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్తగా 10 సెంటర్లతోపాటు ఇప్పటికే ఉన్న 5 భవనాల ద్వారా ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ ను విస్తరిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పండుగ సీజన్పైనే ఆశలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ పరిణామాలతో దెబ్బతిన్న వాహనాల మార్కెట్ పండుగ సీజన్ నాటికి పుంజుకోగలదని కియా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ విభాగం హెడ్ మనోహర్ భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికి మూడో కారు సోనెట్ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. లాక్డౌన్ సమయంలోనూ 3,500 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయని తెలిపారాయన. అనంతపురంలోని తయారీ ప్లాంటును మరింతగా విస్తరించేందుకు ఇటీవలే 54 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. వాహన విక్రయాలపై కరోనాపరమైన ప్రభావాలు ఎలా ఉన్నాయి? పరిశ్రమపై కరోనాపరమైన ప్రతికూల ప్రభావ తీవ్రతను గణాంకాలపరంగా ఇంతని ప్రస్తుతం చెప్పలేము. ఏప్రిల్లో అమ్మకాలు సున్నాకి పడిపోవడమనేది ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో పరిశ్రమ చిక్కుకున్నది తెలియజేస్తోంది. అయితే, మరికొద్ది నెలల్లోనే మార్కెట్ తిరిగి పుంజుకోగలదని ఆశావహంగా ఉన్నాం. సరఫరాలు, మార్కెట్ స్థిరపడటానికి కాస్త సమయం పడుతుంది. మా ఉత్పత్తులన్నీ మేడ్–ఇన్–ఇండియానే కావడం, స్థానికంగానే మెజారిటీ విడిభాగాలను కొనుగోలు చేస్తుండటం వల్ల మాపై ప్రతికూల ప్రభావం కాస్త తక్కువే. మేం మరింత వేగంగా పుంజుకోగలమని ధీమా ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలెంత స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడే ముందస్తుగా ఏమీ చెప్పలేము. ఇకపై అమ్మకాల ధోరణి ఎలా ఉండవచ్చు? అంతర్జాతీయంగా ధోరణులు చూస్తుంటే ప్రయాణాల కోసం ఇకపై ప్రజా రవాణా సాధనాల కంటే వ్యక్తిగత వాహనాలకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కార్ల అమ్మకాలను పెంచుతుంది. కరోనా నియంత్రణలోకి వచ్చాక మార్కెట్ వేగం పుంజుకోవచ్చు. అయితే, దేశీయంగా ఇంకా పరిస్థితులు స్థిరపడాల్సి ఉంది. కాబట్టి విక్రయాలు ఎగిసేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. పండుగ సీజన్ .. అంటే ఈ ఏడాది మూడో క్వార్టర్లో అమ్మకాలు పుంజుకోవచ్చని ఆశిస్తున్నాం. ప్రస్తుతం కంపెనీ ఆర్డరు బుక్ ఎలా ఉంది? లాక్డౌన్లో కూడా 3,500 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయి. బుకింగ్స్ రద్దయిన సంఖ్య చాలా తక్కువే. ప్రస్తుతం సెల్టోస్, కార్నివాల్కు సంబంధించి బుక్ అయిన 25,000 పైగా వాహనాలు డెలివరీ కావాల్సి ఉంది. దశలవారీగా మా టచ్ పాయింట్స్లో 94 శాతం పాయింట్స్ను ప్రారంభించాం. మే నెలలో 1,600 యూనిట్లు విక్రయించాం. ఆన్లైన్ బుకింగ్ ధోరణుల విషయానికొస్తే.. వాహనాల కొనుగోళ్లను కస్టమర్లు ఆన్లైన్లోనే జరిపేలా చూడటం ఆటోమొబైల్ సంస్థలకు కాస్త సవాలుతో కూడుకున్నదే. ఎందుకంటే.. మిగతా ఉత్పత్తులతో పోలిస్తే కారు కొనుగోలు చాలా భిన్నమైనది. డిజిటల్గా కాకుండా కారును భౌతికంగా చూసి, నడిపి, సంతృప్తి చెందిన తర్వాతే నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడతారు. అయితే, డిజిటల్ షోరూమ్లు భవిష్యత్లో అమ్మకాలు పెంచుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడగలవు. ఈ నేపథ్యంలో ఇటు డిజిటల్, అటు ఫిజికల్ షోరూమ్ల మేళవింపుతో కంపెనీలు ముందుకెళ్లాల్సి ఉంటుంది. మా విషయానికొస్తే.. మేం ముందునుంచే అమ్మకాల ప్రక్రియను డిజిటైజ్ చేసేందుకు గణనీయంగా ఇన్వెస్ట్ చేశాం. ప్రస్తుతం కొనుగోలు నుంచి హోమ్ డెలివరీ దాకా సేవలు అందిస్తున్నాం. మా మొత్తం వాహన విక్రయాల్లో 7–8 శాతం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. మరిన్ని కొత్త మోడల్స్ ప్రవేశపెట్టబోతున్నారా? మా మూడో ఉత్పత్తయిన కియా సోనెట్ (కంపాక్ట్ ఎస్యూవీ)ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పండుగ సీజన్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2020 ఆటో ఎక్స్పోలో అంతర్జాతీయంగా సోనెట్ను ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. కరోనా పరిణామాలతో వ్యయ నియంత్రణ చర్యలేమైనా తీసుకున్నారా? ముందునుంచే మా భాగస్వాములు, ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారులు అంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఈ కష్టకాలంలో కూడా అదే ధోరణి కొనసాగింది. కాబట్టి పెద్దగా వ్యయ నియంత్రణ చర్యలేమీ తీసుకోలేదు. కొత్త నియామకాల ప్రణాళికలేమైనా ఉన్నాయా? మా వెండార్ పార్ట్నర్లతో కలిపి కియా మోటార్స్ ఇండియా సిబ్బంది సంఖ్య మొత్తం 13,000 పైచిలుకు ఉంటుంది. మా సిబ్బందిలో చాలా మంది సమీప ప్రాంతాలు, రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. ప్రస్తుతానికి తగినంత స్థాయిలో సిబ్బంది ఉన్నారు. అనంతపురంలోని ప్లాంటును మరింత విస్తరించేందుకు, ఉత్పత్తి పెంచేందుకు ఇటీవలే 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనకు కూడా దీనితో ఊతం లభించగలదు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? దేశంలోనే తొలిసారిగా కార్లకు ఉచితంగా శానిటైజేషన్ కార్యక్రమాన్ని ఇటీవలే కియా కేర్ ప్రచార కార్యక్రమం కింద ప్రకటించాం. ముందుగా సంప్రతించినవారికి ఈ సర్వీసులు అందిస్తున్నాం. ఇక కియా కేర్ కింద వాహనాలకే కాకుండా, సర్వీస్ సెంటర్లు, డీలర్షిప్లలో కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి తగు భద్రతా చర్యలు అమలు చేస్తున్నాం. ఇక కస్టమర్లకు కియా లింక్ యాప్ ద్వారా వాహనాల పికప్, డ్రాప్, మొబైల్ వర్క్షాప్ల వంటి సేవలు అందిస్తున్నాం.