fishermen
-
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భారత జాలర్లపై శ్రీలంక జవాన్ల కాల్పులు
న్యూఢిల్లీ: శ్రీలంక సరిహద్దు సముద్రజలాల సమీపంలో చేపలవేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుల(Indian Fishermen)పై శ్రీలంక నావికాదళ సభ్యులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జీవనోపాధి కోసం వచ్చిన జాలర్లపై గస్తీదళాల కాల్పుల ఘటనను భారత్ సీరియస్గా తీసుకుంది. మిత్రదేశ పౌరులపై శత్రువుల తరహాలో కాల్పులు జరపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి శ్రీలంక రాయబారిని పిలిపించి ఆయన ఎదుట తీవ్ర నిరసన వ్యక్తంచేసింది.‘‘క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాసరే బలగాలు ఆయుధాలకు పనిచెప్పడం లాంటి అసాధారణ చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఇలాంటివి పునరావృతమైతే శ్రీలంకతో సత్సంబంధాల కొనసాగింపుపై మేం మరోసారి తీవ్రంగా సమీక్ష జరపాల్సి ఉంటుంది’’ అని భారత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.అసలేం జరిగింది?మంగళవారం తెల్లవారుజామున శ్రీలంక సమీపంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీప సముద్రజలాల్లో 13 మంది భారతీయ జాలర్లు చేపలు పడుతుండగా అక్కడికి శ్రీలంక నావికాదళంలోని గస్తీ బృందం చేరుకుంది. ఇక్కడ చేపలు పట్టే అధికారం భారతీయులకు లేదంటూ ఆ జాలర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన జాలర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గర్లోని జాఫ్నా టీచింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెల్సుకున్న జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి జాలర్ల ఆరోగ్యం గురించి వాకబుచేశారు. అత్యుత్తమ చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. -
పెన్షనర్ల ప్యారడైజ్లో.. జల పుష్పాల జాక్పాట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్ల ప్యారడైజ్గా పేరొందిన కాకినాడలోని గంగపుత్రులు జల పుష్పాలతో జాక్పాట్ కొడుతున్నారు. అరుదైన ట్యూనా(tuna fish) చేపలను పట్టడంలో చేయితిరిగిన మత్స్యకారులు కాకినాడ తీరానికే సొంతం. ఇక్కడి సముద్ర తీరానికి 175–300 నాటికల్ మైళ్ల దూరంలో ట్యూనా చేపల సందడితో గంగపుత్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మునుపెన్నడూ లేనిరీతిలో తొలిసారి రికార్డు స్థాయిలో ట్యూనా చేపలు చిక్కుతూ వారికి సిరుల వర్షం కురిపిస్తున్నాయి.మూడు రకాల ట్యూనా చేపలలో అరుదైన జాతి స్కిట్జాగ్. వీటికి మరోపేరు నామాలు. వాడుక భాషలో మాత్రం తూర చేపలని పిలుస్తుంటారు. మత్స్యకారుల వలలకు చిక్కుతున్న ట్యూనాల్లో స్కిట్జాగ్ జాతి చేపలే అధికంగా ఉంటున్నాయి. వీటితోపాటు ఎల్లో ఫిన్ ట్యూనా, వైట్ ట్యూనా రకాల చేపలు కూడా విరివిగా లభిస్తున్నాయి. స్కిట్జాగ్ రకం కిలో రూ.70, వైట్ ట్యూనాలు కిలో రూ.105, ఎల్లో ఫిన్ ట్యూనాలు కిలో రూ.95 ధర పలుకుతున్నాయి. జాలర్ల పంట పండుతోంది జనవరి రెండో వారం నుంచే ట్యూనాలు విరివిగా లభిస్తుండటంతో మత్స్యకారుల పంట పండుతోంది. కాకినాడ తీరం నుంచి నిత్యం 25 నుంచి 30 బోట్లలో సముద్ర లోతుల్లోకి వెళ్లి ట్యూనాలు వేటాడుతున్నారు. ఒకసారి వేట (వాజీ)కి వెళితే దొరికే చేపలను బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వస్తే గొప్పగా చెప్పుకుంటారు. అటువంటిది ప్రస్తుతం ఒక ఫైబర్ బోటులో రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలు విలువైన ట్యూనాలు పడుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. ఎల్లో ఫిన్ ట్యూనా రోజుకు ఐదారు టన్నులు వస్తుంటే అత్యధికంగా నామాలుగా పిలిచే (స్కిట్జాగ్) ట్యూనాలు 20 నుంచి 25 టన్నులు ఉంటున్నాయి.కాకినాడ తీరానికి నిత్యం 250 నుంచి 300 టన్నుల ట్యూనాలు వస్తున్నాయి. ఫైబర్ బోటుపె మేస్త్రీ, కళాసీలు కలిసి మొత్తం ఆరుగురు వేటకు వెళుతుంటారు. సముద్రంపై 10 రోజులపైనే ఉంటే తప్ప రూ.2 లక్షల విలువైన మత్స్య సంపద దొరికేది కాదు. ప్రస్తుతం వారం రోజులు గడవకుండానే రూ.నాలుగైదు లక్షల విలువైన ట్యూనాలతో తిరిగొస్తున్నామని మత్స్యకారులు సంతోషంగా చెబుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగి ట్యూనాలు మార్చి నెలాంతం వరకు దొరుకుతాయనిఅంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఈ సీజన్లో ట్యూనాలతో ఆర్థికంగా స్థిరపడతామనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.పరిహారం ఎగ్గొట్టినా ట్యూనాలే ఆదుకుంటున్నాయికాకినాడ, ఉప్పాడ కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేట ఆధారంగా సుమారు 300 ఫైబర్ బోట్లను మత్స్యకారులు నడుపుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధ సమయం. వేట నిషేధంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది కలగకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేట నిషేధ పరిహారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక వేట నిషేధ పరిహారం కొండెక్కింది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా మత్స్యకారులకు నిరాశనే మిగిలింది. సంక్రాంతి పండుగ కూడా సంతోషం లేకుండా గడచిపోయిందనే ఆవేదన చెందుతున్నారు. వేటకు వెళ్లినా వలకు సరైన చేపలు చిక్కక కొన్ని సందర్భాల్లో ఫైబర్ బోటు నిర్వహణ వ్యయం రూ.లక్ష కూడా చేతికొచ్చేది కాదు. ఈ తరుణంలో సముద్రంలో లభిస్తున్న ట్యూనా చేపలు మత్స్యకారులకు ఊపిరిపోస్తున్నాయి.ట్యూనాలకు కేరాఫ్ కాకినాడ కాకినాడ తీరం ట్యూనా చేపలకు ప్రసిద్ధి. ఇక్కడి మత్స్యకారులు ఎంతో నైపుణ్యంతో సముద్రంలో సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లి ట్యూనా చేపలను వేటాడతారు. మూడు రకాల ట్యూనాలు లభ్యమవుతున్నాయి. వేట నిషేధ సమయం తరువాత ఆరు నెలలపాటు ట్యూనా చేపలు ఎక్కువగా లభిస్తాయి. జనవరి నెలలో ట్యూనా దిగుబడి బాగా వచ్చింది. గతంతో పోలిస్తే 10 శాతం ధర పెరిగింది. దీంతో మత్స్యకారులు ఆర్థిక పరిస్థితి బాగుంది. – అనురాధ, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, హార్బర్ పేట, కాకినాడ కాకినాడ తీరానికి అభిముఖంగానే ట్యూనాలు కాకినాడ తీరం ఎదురుగా విశాఖ, చింతపల్లి ప్రాంతంలో సుమారు 175 నాటికల్ మైళ్ల దూరంలో ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయి. ఈ సీజన్లో జనవరి నెలలో మత్స్యకారుల వలలకు ట్యూనా చేపలు భారీగా చిక్కాయి. దీంతో వేట కోసం ప్రతి మత్స్యకారుడు సముద్రంలో వేట కొనసాగిస్తున్నారు. – మల్లే కొండబాబు, మత్స్యకారుడు, సూర్యారావుపేట -
మత్స్యకారుల ఉపాధికి గండి
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి మత్స్యకారుల కడుపు కొట్టింది. గద్దెనెక్కిన మరుక్షణమే జీవో 217 రద్దు చేసి మత్స్యకార సొసైటీల్లోని సభ్యుల జీవనోపాధికి గండికొట్టింది. రిజర్వాయర్లలో చేప పిల్లలు విడుదల చేయకుండా చేతులెత్తేసి వారికి ఉపాధిని దూరం చేసింది. సహజ మత్స్య సంపదను వృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా మంచినీటి వనరుల్లో పెద్దఎత్తున చేప పిల్లలను వదులుతుంటుంది. రాష్ట్రంలో 2.22 లక్షల ఎకరాల్లో భారీ రిజర్వాయర్లు, 70 వేల ఎకరాల్లో మధ్యతరహా రిజర్వాయర్లు, 3.75 లక్షల ఎకరాల్లో చిన్నతరహా రిజర్వాయర్లు ఉన్నాయి. వీటితో పాటు 2.25 లక్షల ఎకరాల్లో కొల్లేరు మంచినీటి సరస్సుతో పాటు 11,514 కిలోమీటర్ల మేర నదులు, కెనాల్స్ ఉన్నాయి. వీటిపై ఆధారపడి రాష్ట్రంలో 2,536 మత్స్యకార సొసైటీల్లోని 3.10 లక్షల మంది జీవనోపాధి పొందుతారు. రూ.7–10 కోట్ల ఖర్చుతో 6–9 కోట్ల చేప పిల్లలను ప్రధాన రిజర్వాయర్లలో ఏటా జూలై–ఆగస్టు నెలల్లో వదులుతుంటారు. 3–6 నెలల తర్వాత ఈ మత్స్యసంపదను పట్టుకుని మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతుంటారు.మంచినీటి వనరుల నుంచే 55 శాతం మత్స్య దిగుబడులు రాష్ట్రంలో మత్స్య దిగుబడులు 51.58 లక్షల టన్నులు వస్తుండగా.. వాటిలో 55 శాతం మంచినీటి వనరుల నుంచి లభిస్తున్నాయి. ‘ఇన్ల్యాండ్ క్యాచ్మెంట్ వాటర్ రిసోర్సెస్’లో చేపల్ని పెంచడం ద్వారా మత్స్యకార సొసైటీల పరిధిలోని మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా గడచిన ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఏటా క్రమం తప్పకుండా ప్రధాన రిజర్వాయర్లలో బొచ్చలు, రాగండి, మోసు చేప పిల్లలను వదులుతూ సహజ మత్స్యసంపద వృద్ధికి ఇతోధికంగా కృషి చేసింది. గిరిజన ప్రాంత మత్స్యకారులకు సైతం చేప పిల్లలను అందజేసేది.2022–23 నుంచి చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను కూడా ఈ రిజర్వాయర్లలో వదలడం మొదలుపెట్టింది. ఫలితంగా 2018–19లో 13.42 లక్షల టన్నులున్న ఈ దిగుబడులు గడచిన ఐదేళ్లలో గరిష్టంగా 29.32 లక్షల టన్నులకు పెరిగింది.ఈ ఏడాదంతా అస్తవ్యస్తంచేప పిల్లల కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని డీపీసీ (జిల్లా కొనుగోలు కమిటీ) ద్వారా మే, జూన్లలో టెండర్లు పిలిచే వారు. తక్కువ ధరకు చేప పిల్లలను సరఫరా చేసే వారిని ఎంపిక చేసి చేప పిల్లల్ని కొనుగోలు చేసేవారు. వాటిని ఎంపిక చేసిన రిజర్వాయర్లు, మంచినీటి చెరువుల్లో క్రమం తప్పకుండా ఆగస్టులో వదిలేవారు. ఈ ఏడాది చేప పిల్లల్ని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రహసనంగా మార్చారు. ఇందుకోసం కేంద్రం మంజూరు చేసిన రూ.12 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించగా.. చేపపిల్లల సరఫరాపై కనీస అవగాహన లేని మత్స్య శాఖ కమిషనర్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు మత్స్యకారుల కడుపు కొడుతున్నాయి. తనకు పదవి కట్టబెట్టిన మంత్రి అనుచరులకు మేలు చేయడమే లక్ష్యంగా జిల్లాస్థాయి టెండరింగ్ విధానం స్థానంలో రాష్ట్రస్థాయి టెండరింగ్, ఈ ప్రొక్యూర్మెంట్ అంటూ హడావుడి చేశారు. చివరకు కొటేషన్ పద్ధతిలో అప్పగించాలనే యోచన కూడా చేశారు. పైగా గతంలో రూ.1.20కే చేప పిల్లను సరఫరా చేయగా, ఈసారి రూ.2వరకు సరఫరా చేసేలా మార్గదర్శకాల్లో మార్పు తీసుకొచ్చారు. ఇదంతా అడ్డగోలు దోపిడీ కోసమేనన్న విమర్శలొచ్చాయి. ఇలా తరచూ నిబంధనలు మారుస్తూ 45 రోజుల పాటు కాలయాపన చేశారు. ఈలోగా కేంద్రం మంజూరు చేసిన రూ.12 కోట్ల నిధులు మురిగిపోయాయి. దీంతో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది.ఆశగా ఎదురు చూశాం సోమశిల ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని నిల్వ చేసే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్పై ఆధారపడి మా సొసైటీ సభ్యులు జీవనోపాధి పొందుతుంటాం. 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లో చేపల పట్టుబడి ద్వారా ఏటా రూ.30–40లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఏడాది మత్స్యశాఖ చేప పిల్లలు విడుదల చేస్తుందని ఆశగా ఎదురు చూశాం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్లోనూ ఒక్క పిల్ల కూడా వదలలేదు. – వట్టికాల బాలయ్య, ప్రధాన కార్యదర్శి, మత్స్యకార సొసైటీ, సోమశిల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెల్లూరు జిల్లా మత్స్యకారులకు తీరని నష్టం సొసైటీ మత్స్యకారులకు మేలు చేకూర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచి్చన జీవో 217పై ఎన్నికల్లో కూటమి నేతలు లేనిపోని దు్రష్పచారం చేశారు. అధికారంలో రాగానే ఈ జీవోను రద్దుచేసి మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీశారు. మంచినీటి వనరుల్లో చేప పిల్లలు వదిలే విషయంలో చేతులెత్తేయడంతో మత్స్యకారులకు అపార నష్టం వాటిల్లే అవకాశం ఉంది. – కొండూరు అనిల్బాబు, కో–ఫిషర్మెన్ ఫెడరేషన్, మాజీ చైర్మన్ -
బందరు తీరంలో భారీ చేప.. బరువు తెలిస్తే షాకే..
సాక్షి, కృష్ణా జిల్లా: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బందరు తీరంలో వలకు భారీ టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది.ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.కాగా, బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతుంటారు. -
భారత మత్స్యకారులను పట్టుకున్న శ్రీలంక
తమిళనాడు తీరంలో రెండు పవర్ బోట్లతో పాటు తొమ్మిది మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకుంది. ఆ మత్స్యకారులు భారత సరిహద్దు దాటి చేపల వేట సాగిస్తున్నారని శ్రీలంక ఆరోపిస్తోంది. 535 బోట్లలో మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మన్నార్లో చేపల వేటకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా విదేవిధంగా శ్రీలంక భారత జాలర్లను పట్టుకుంది.జూలై ఒకటిన రామేశ్వరం ద్వీపం సమీపంలోని పాల్క్ బే సముద్ర ప్రాంతంలో పాంబన్ నుంచి చేపల వేటకు వెళ్లిన 26 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక నావికాదళానికి చిక్కారు. గత నెలలోనే శ్రీలంక నావికాదళం తమ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో 18 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. మూడు మత్స్యకారుల బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికిముందు కూడా శ్రీలంక నేవీ నలుగురు భారతీయ జాలర్లను అరెస్టు చేసి, వారి పడవను స్వాధీనం చేసుకుంది.ఈ ఏడాది జనవరిలో శ్రీలంక నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు శ్రీలంక 180 మందికి పైగా భారత జాలర్లను అరెస్టు చేసింది. గత ఏడాది 240 నుంచి 245 మందిని అరెస్టు చేసిన నేపధ్యంలో భారత్-శ్రీలంక సంబంధాల్లో వివాదాలు తలెత్తాయి. -
సముద్రంలో తిరగబడిన బోటు
వేటపాలెం: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, పొట్టిసుబ్బయ్యపాలెం మత్స్యకారులకు సంబంధించిన బోటు సముద్రంలో సోమవారం రాత్రి బోల్తాకొట్టింది. అందులో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కొండూరు రాములు, పెద్ద కుమారుడు కొండూరు గోవిందు, చిన్నకుమారుడు చిట్టిబాబు, కఠారివారిపాలేనికి చెందిన కఠారి శ్రీను నలుగురు కలిసి సోమవారం సాయంకాలం బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో వేట సాగించేటప్పుడు అలల తాకిడికి బోటులోకి సముద్రం నీరు పెద్ద మొత్తంలో చేరుకొని తిరగబడింది. అందులో ఉన్న నలుగురు సముద్రం నీటిలో పడిపోయారు. వీరి పై వేట సాగించే వల పడింది. నలుగురు సముద్రం నీటిలోపలకు వెళ్లి వలను తప్పించుకొని ఈతకొట్టుకొంటూ తిరగబడిన బోటు పై భాగానికి ఎక్కి కూర్చున్నారు. వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు నీటిలో పడిపోవడంతో సమాచారం ఇవ్వడానికి వీలు పడలేదు. ఆరు గంటల పాటు తిరగబడిన బోటు పైనే కూర్చున్నారు. చిన్నగంజాం మండలం, చిన్నంగారివారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన బోటు పై భాగంలో కూర్చొని ఉన్న నలుగురిని గమనించారు. వెంటనే వారిని తమ బోటులో ఎక్కించుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రం నీటిలోనే ఉండిపోయామని మత్స్యకారులు తెలిపారు. వల, బోటు, ఇంజన్లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రూ.6.50 లక్షలు నష్ట పోయామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
చేప పిల్లలా? చేయూతా?
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మే నెల చివరికి వస్తున్నా ఈ పథకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా? లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది. మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించడానికి ఏ విధమైన పథకాన్ని తీసుకువస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. చేప పిల్లల పంపిణీపై గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న ఆందోళన మత్స్యకారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని మత్స్యకారులు కోరుతున్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 26,700 చెరువుల్లో 90 కోట్ల ఉచిత చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను వదిలారు. అందుకోసం ఏప్రిల్లోనే టెండర్లు పిలిచి.. జూన్లో టెండర్లు ఖరారు చేశారు. ఈ పథకం అమలు విషయంలో గతంలో అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీంతో విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందా? లేక మత్స్యకారులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందా అన్న చర్చ మత్స్యకార సంఘాల్లో జరుగుతోంది. సమయం సరిపోదన్న భావనలో... గతంలోలాగా పథకాన్ని కొనసాగిస్తే ఈసారి రూ. 100 కోట్లు అవసరం అవుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చేప పిల్లల సమీకరణకు కనీసం రెండు నెలల సమయం పడుతుందంటున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిస్తే చేపపిల్లల సేకరణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, మత్స్యకారులకు చేయూతనిచ్చే అంశాన్ని పరిశీలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో పలు ఆరోపణలు... ఉచిత చేప పిల్లల పథకంపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. చెరువుల్లో అధికశాతం నాసిరకం చేప పిల్లలను వదిలారన్న విమర్శలు ఉన్నాయి. నాణ్యతలేని చేపపిల్లలను వదిలి తప్పుడు రికార్డులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పలు గ్రామాల్లోని మత్స్యకారులు తమ చెరువుల్లో చేప పిల్లలు వదలొద్దని స్పష్టం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పథకం కింద సరఫరా చేసిన చేపలు సరిగా ఎదగలేదని అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సైతం తిరస్కరించడం గమనార్హం. ఉచిత చేప పిల్లల కంటే చేయూత ఇవ్వడం మంచిది. మత్స్యకార సంఘాలకు నేరుగా డబ్బులు డిపాజిట్ చేస్తే నచ్చిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ఇలా చేయడం వలన నాణ్యతతో పాటు ఏ చెరువులో ఎన్ని చేప పిల్లలను వదులుకోవాలనే నిర్ణయం కూడా మాదే ఉంటుంది. – శంకర్, మత్స్యకారుడు -
ఎన్నో విశేషాల ‘బోర మెత్తళ్లు’
సింగరాయకొండ: బోర మెత్తళ్లు చేప..తైల వర్ణంలో ఉంటుంది. ఇది వేసవిలోనే లభిస్తుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. వేటాడాలంటే సన్న కన్నుల వలను వినియోగించాలి. దాని ఖరీదు రూ.లక్ష పైమాటే. ఈ చేప ప్రకాశం జిల్లా సింగరాయకొండ, బాపట్ల జిల్లా చిన్నగంజాం, నిజాంపట్నం తదితర తీర ప్రాంతాల్లో లభ్యమవుతుంది. ఇది తీరానికి అర కిలోమీటర్ దూరంలో దొరుకుతుంది. దీనిని వేటాడే సమయం కూడా భిన్నంగా ఉంటుంది.అర్ధరాత్రి ఒంటి గంటకు వెళ్లి ఎక్కడ ఉందో గుర్తిస్తారు. దాని గమనాన్ని బట్టి ఆ ప్రాంత మత్స్యకారులు వేటాడుతారు. వేకువజామున 4 గంటల నుంచి వేట మొదలుపెడతారు. ఉదయం 8 గంటలకు తీరానికి తీసుకువస్తారు. మామూలు చేపలైతే పడవల్లోనే వల నుంచి వేరు చేస్తారు. దీనిని అలా వేరుచేసేందుకు కుదరదు. తీరానికి తీసుకువచ్చి ఒడ్డుకు చేరిన తర్వాతే వల నుంచి వేరు చేస్తారు. ఒక్కసారి వేటకు వెళితే టన్ను వరకూ లభ్యమవుతుంది. వేసవి, వేట నిషేధ సమయంలో దొరికే ఈ చేపను కర్రతెప్పల్లో మాత్రమే వేటాడుతారు. ఇక్కడ దీని ధర కేజీ రూ.100. కేరళలో ఇది కేజీ రూ.300–500 మధ్యలో ధర పలుకుతుంది. మే, జూన్ల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ చేపలను ప్రత్యేక వాహనాల్లో కేరళకు పంపుతారు. -
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
కొచ్చి: ఇరాన్లో చేపలుపట్టే పని చేసేందుకు వెళ్లిన భారతీయులను యజమాని వేధించాడు. సరైన జీవన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో యజమాని సయ్యద్ అన్సారీ నుంచి తప్పించుకోవాలని ఆరుగురు కన్యాకుమారికి చెందిన మత్స్యకారులు డిసైడయ్యారు.ఇంకేముంది చేపలు పట్టేందుకు యజమాని ఇచ్చిన బోట్లోనే ఇరాన్ నుంచి పారిపోయి సముద్రంలో ప్రయాణించి భారత్లోని కొచ్చి తీరాని వచ్చారు. కొచ్చి తీరానికి వీరి బోట్ చేరుకున్న వెంటనే తీరంలోకి కోస్ట్గార్డ్ గుర్తించి అడ్డుకున్నారు. ఆరా తీస్తే ఇరాన్ యజమాని తమను మోసం చేశాడని,అందుకే పారిపోయి వచ్చామని మత్స్యకారులు చెప్పారు. -
AP: విరామ వేళ.. వలకు భరోసా
సాక్షి, మచిలీపట్నం: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 61 రోజులు బ్రేక్.. సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. వేట విరామ భృతి.. సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేట విరామ భృతిని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఉండగా దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలకు పెంచి, వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 2019 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది కూడా సాయం అందించేందుకు మత్స్యశాఖ అధికారులు చేపల వేట సాగించే బోట్లకు ఫొటోలు తీసుకుని, లబి్ధదారుల వివరాలు నమోదు చేసే చర్యలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా వివరాలు.. ♦ సముద్ర తీరప్రాంత మండలాలు: మచిలీపట్నం, నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు ♦ సముద్ర తీరం: సుమారు 111 కిలోమీటర్లు ♦ మత్స్యకార ఆవాసాలు : 64 ♦ మత్స్యకారుల జనాభా: 85వేలు ♦ సముద్రంలో చేపల వేట సాగిస్తున్న వారు: 12వేలు ♦మొత్తం బోట్లు : 2,256 ♦ వీటిలో మెకనైజ్డ్ బోట్లు : 92 ♦ మోటరైజ్డ్ బోట్లు: 2,091 ♦ సంప్రదాయ బోట్లు : 73 ♦ ఏటా మత్స్య సంపద టర్నోవర్: 40,600 టన్నులు చేపలు, 11,390 టన్నుల రొయ్యలు ♦ మత్స్య సంపద విలువ: సుమారు రూ.510కోట్లు సాయం చేసేందుకు గుర్తింపు.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకూ పొడవు ఉన్న మెకనైజ్డ్ బోట్కు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులను అర్హులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ సాయం పొందేందుకు బోట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ నంబర్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తించే చర్యలు చేపట్టాం.. నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. మత్స్యకార భరోసా సాయం అందించేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వేట నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ మెరైన్ రెగ్యులేషన్ చట్టం–1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం. చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. తీరంలో చేపలు అమ్మకాలు, ప్యాకింగ్ చేయరాదు. వేట నిషేధంపై మత్స్యకారులు, వ్యాపారులకు నోటీసులు అందించాం. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. – వి. శివ సాంబరాజ్యం, జిల్లా మత్స్యశాఖ అధికారి(జేడీఎఫ్), కృష్ణా జిల్లా -
మత్స్యకారులకు అండగా..చంద్రబాబు చేయలేనిది చేసి చూపించిన సీఎం జగన్
-
మత్య్సకారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్లైన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్లైన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్లోనే కోల్డ్ చైన్, ఐస్ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్షాపులు, గేర్షెడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది. -
సీఎం జగన్ నిర్ణయంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
-
ఫిష్ ఆంధ్ర సూపర్
ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అని చేపల ప్రియులు ఆస్వాదించే వార్త..కష్టపడి వేటాడిన మత్స్యసంపదకు చక్కని మార్కెట్ లభించడంతో గంగపుత్రులు ఆనందించే సందర్భం..జిల్లాలో ఇప్పటికే 85 ఫిష్ ఆంధ్ర మినీ ఔట్లెట్లను ప్రారంభించిన మత్స్యశాఖ.. త్వరలో నాలుగు సూపర్ షాప్లకు శ్రీకారం చుట్టనుంది. మరో రెండు లాంజ్లను ఏర్పాటు చేయనుంది. మినీ ఔట్లెట్లలో చేపలు విక్రయించగా.. కొత్తగా ప్రారంభించనున్న సూపర్ షాప్లలో లైవ్ ఫిష్తోపాటు చేపలతో తయారు చేసే వంటకాలను విక్రయిస్తారు. లాంజ్లు రెస్టారెంట్లుగా భోజన ప్రియులకు ఆతిథ్యమివ్వనున్నాయి. అచ్యుతాపురం: మత్స్యకారులకు అండగా ఉంటూ.. మత్స్య సంపదను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వేలాదిమంది మత్స్యకారుల తలరాత మారుతోంది. అంతేకాకుండా ఆహారంలో కీలక పోషకాలు ఉన్న చేపల ఉత్పత్తి, అమ్మకాలకు మరిన్ని మంచి రోజులు వస్తున్నాయి. ఫిష్ ఆంధ్ర నినాదంతో ఇప్పటికే మినీ ఔట్లెట్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉండగా.. అదనపు హంగులతో చేపల షాపులను ఏర్పాటు చేసే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలో 31 మత్స్యకార గ్రామాలు, 12 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 11 వేల 116 మందికి పైగా మత్స్యకారులు జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో చేపల వేటపై ఆధారపడిన వారికి మేలు చేకూరనుంది. విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్న మత్స్యసంపద మార్కెటింగ్కు సంబంధించి మరిన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో నాలుగు సూపర్ షాపులు అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపల విక్రయానికి ఏర్పాటు చేస్తున్న ఫిష్ మినీ ఆంధ్ర షాపులు జిల్లాలో 85 ఉన్నాయి. దీంతో సముద్ర తీరప్రాంతాల్లోనూ, రిజర్వాయర్, నదులు, సరస్సులు, చెరువుల్లో లభించే వివిధ రకాల చేపలకు చక్కని మార్కెటింగ్ సదుపాయం దక్కింది. ఈ క్రమంలోనే జిల్లాలో సూపర్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో షాపును నెలకొల్పేందుకు రూ.20 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం 40 శాతం సబ్సిడీని భరిస్తుంది. ముందుగా అచ్యుతాపురంలో ఒక షాపును, చోడవరంలో మరో షాపును ఏర్పాటు చేయనున్నారు. ఇక సూపర్ షాపులకు దీటుగా లాంజ్లను సైతం రూ.50 లక్షలతో జిల్లాలో రెండు ఏర్పాటు చేయనున్నారు. వీటిని అనకాపల్లి హైవేలో ఏర్పాటు చేయనున్నారు. వేల్యూ యాడ్ చేసి హైజనిక్గా చేపల విక్రయం చేపట్టనున్నారు. దిగువ స్థాయి ప్రజల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వారికి అవసరమైన 10 రకాల చేపలు సూపర్, లాంజ్లలో దొరకనున్నాయి. ‘సూపర్’ ప్రత్యేకతలివే... సముద్ర, చెరువు చేపలకు సంబంధించిన శీలావతి, పచ్చబోసు, సముద్ర రకాలు చందువ, కోనాలు, వంజరం వంటి చేపలను లైవ్లో అమ్ముతారు. ఇక్కడే ఐస్ తయారీ వ్యవస్థ ఉన్నందున చేపలు ఫ్రెష్గా ఉంటాయి. అవసరమైతే ప్యాక్ చేసిన చేపలను అమ్ముతారు. చేపల కట్లెట్లు, ఫ్రైలు విక్రయిస్తారు. రెస్టారెంట్గా లాంజ్లు... లాంజ్లు దాదాపు రెస్టారెంట్ తరహాలో ఉంటాయి. చేపలకు సంబంధించిన అన్ని వంటకాలు ఇక్కడ విక్రయిస్తారు. చేపల స్టార్టర్లు, పులుసులు, చేపల బిర్యానీ, చేపల అన్నం, చేపలతో కూడిన అన్ని రకాల ఆహార పదార్థాలను ఇక్కడ రెస్టారెంట్ తరహాలో వినియోగదారునికి అందిస్తారు. అందుబాటులో విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు జిల్లాలో ఫిష్ మినీ ఆంధ్రాలకు తోడు మరో నాలుగు సూపర్ షాపులను ఏర్పాటు చేయనున్నాం. అచ్యుతాపురంలో ఒకటి, చోడవరంలో మరొకటి నెలకొల్పుతున్నాం. రూ.20 లక్షలతో ఏర్పాటు చేసే సూపర్ షాప్లతో ఫిషింగ్ వేల్యూ యాడ్ చేస్తాం. షాపు ఏర్పాటులో మత్స్యకారునికి 40 శాతం సబ్సిడీ ఇస్తాం. –ప్రసాదరావు, జిల్లా మత్స్య శాఖ ఏడీ -
AP: తీరం మనదే.. వేటా మనదే
జువ్వలదిన్నె సిద్ధం మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ల్యాండింగ్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. సాక్షి, అమరావతి: మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వలస వెళ్లాల్సి వస్తోంది. పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారికి స్థానికంగానే ఉపాధి కల్పించేలా ఫిషింగ్ హార్బర్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.3,520.56 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జువ్వలదిన్నె హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించనున్నారు. మరో మూడు హార్బర్ల పనులు 60 నుంచి 70 శాతం పూర్తి కాగా సెప్టెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అదనంగా మత్స్యకారులు బోట్లను నిలుపుకొని చేపలు దింపుకునే విధంగా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద సమకూరుతుందని, వీటి ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9 వేల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్లో ఏర్పాటు చేసిన షెడ్లు హార్బర్ ఆధారిత పరిశ్రమలు.. హార్బర్ల ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులను ఏపీ మారిటైమ్ బోర్డు నెలకొల్పుతోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద సమకూరనుంది. వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా హార్బర్ వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, 5 ఎకరాల విస్తీర్ణంలో బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. కొత్త బోట్లకు డిమాండ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లల్లో 10,521 బోట్లను నిలుపుకునే సామర్థ్యం ఉండటంతో కొత్త బోట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడనుంది. 9ఎం ఎఫ్ఆర్పీ రకం, 12 ఎం గిల్ నెట్టర్, 15ఎం ట్రావలెర్, 24ఎం టూనా లాంగ్ లైనర్ లాంటి అత్యాధునిక బోట్లు అవసరం కానున్నాయి. అన్ని హార్బర్ల వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కూలీల నుంచి యజమానులుగా.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ పని కోసం చెన్నై, మంగళూరు వలస కూలీలుగా వెళ్లాం.ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఫిషింగ్ హార్బర్, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15 వేల మందికిపైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా హార్బర్ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) సురక్షితంగా ఒడ్డుకు బోట్లు ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో ఆటు పోట్లు వల్ల ఈ ఇబ్బంది అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలుపుకోవచ్చు. – పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నం. పర్యాటక ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ముఖ్యమంత్రి జగన్ ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించేలా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున నెలకొల్పుతున్నాం. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. హార్బర్ల వద్ద పర్యాటక ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీ మారిటైమ్బోర్డు, వీసీఎండీ ఏపీఐసీసీ. మినీ పోర్టు స్థాయిలో ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక అవస్థలు ఎదుర్కొన్నాం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తేవడంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ -
మత్స్యకార ‘పథకాల’ అమలులో ఏపీ సహకారం భేష్
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల అమలుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ఏపీ ప్రభుత్వ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల కృషి అభినందనీయమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ప్రశంసించారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు భాగస్వామ్యులు కావాలని సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి హార్బర్ వద్ద సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం మత్స్యకారులు, ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కాగా, నందివాడ మండలం రామాపురానికి చెందిన దావీదు, పెదలింగాలకు చెందిన తుమ్మల రామారావు, రవీంద్రబాబు, ప్రవీణ్లు కేంద్ర మంత్రికి పరిశ్రమల్లో ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలను వివరించారు. మత్స్యరైతుల ఉత్పత్తిదారుల సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్ర మంత్రి సతీమణి సవితబెన్ రూపాల, కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతుకుమార్ ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, కలెక్టర్ పి.రాజాబాబు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్
వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్ఫోర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే... సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్ఫోర్సుకు చెందిన రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్ మిస్సైల్తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్ఫోర్సు అధికారులకు అప్పగించారు. -
నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు
కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు. తక్షణమే లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్. ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్గార్డ్ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు. భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి. ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు. రిలయన్స్ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు. కోస్ట్గార్డ్ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్ చార్లీ–438 ఫిప్ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వాస్ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృత్యుంజయులు వీరే... బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు -
మాకు కష్టం వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆదుకున్నారు
మహారాణిపేట: మత్స్యకారులకు కష్టం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డెడ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ చెప్పారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జానకీరామ్ ఆధ్వర్యాన శనివారం విశాఖలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మత్స్యకారులు, బోటు యజమానులు క్షీరాభిషేకం చేశారు. జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారులంటే సీఎం జగన్కు ఎనలేని అభిమానమని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అతి తక్కువ సమయంలోనే బాధిత మత్స్యకారులకు రూ.7.11 కోట్లు పరిహారం చెల్లించి సీఎం తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అసోసియేషన్ నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, మైలపల్లి నరసింహులు, జి.దానయ్య, దూడ పోలయ్య, గనగళ్ల పోతయ్య, మున్నం బాలాజీ, యాగ శ్రీనివాసరావు, ఎస్.రాము, బోటు యాజమానులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం! -
మత్స్యకారుల జీవితానికి చుక్కానిగా...
చేపల వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులు సామాజికంగానూ, ఆర్థికంగానూ అత్యంత వెనుకబడి ఉన్నారు. ఆటువంటి వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నివిధాలా ఆదుకొంటున్నారు. రాజ్యాధికారంలో వాటాను పంచారు. ఆర్థికంగా చేయుత నిచ్చారు. పార్లమెంటు మెట్లే ఎక్కని మత్స్య కార వర్గం నుంచి తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపారు. దేశ అత్యున్నత చట్ట సభలో మత్స్య కారుడికి అవకాశం కల్పించిన ఘనత జగన్కే దక్కింది. ఎప్పుడూ లేని విధంగా మత్స్యకార వర్గానికి 4 ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మత్స్యకార సామా జికవర్గంలోని 14 ఉప కులాలను విభజించి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. జగన్ సీఎం అయ్యే వరకు టీటీడీ బోర్డులో మత్స్యకారులకు చోటే దక్క లేదు. తొలిసారిగా మొదట మల్లాడి కృష్ణారావుకూ, రెండవసారి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్కూ టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో మత్స్యకారుల సామాజిక వర్గానికి అత్యధిక పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో సముద్రంపై వేటకు వెళ్లే 1.23 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 మధ్య కాలంలో ఈ కుటుంబాలవారు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ. 123.52 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అలాగే ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23.45 వేల మత్స్యకార కుటుంబాలకు దాదాపు రూ. 108 కోట్ల సాయాన్ని సీఎం జగన్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం ద్వారా అందించిన సాయం రూ. 538 కోట్లుగా ఉంది. ఏటా రూ. 10 వేల చొప్పున మత్స్యకార భరోసా పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 50 వేల లబ్ధి చేకూరింది. సముద్రంపై వేటకు వెళ్లే మత్యకారుల స్థితిగతు లను బాగు చేయడంతో పాటు వలసలను అరికట్టే లక్ష్యంతో రూ. 3.7 వేల కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు మరింత ఊతమిచ్చేందుకు 4 ఏళ్ళలోనే సుమారు రూ. 16 వేల కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అర్హత, నైపుణ్యం గల మానవ వన రులను తయారు చేసేందుకు తద్వారా మెరుగైన ఫిషింగ్ చేసుకునే పరిజ్ఞానం పెరిగేలా పశ్చిమ గోదా వరి జిల్లా నరసాపురంలో ‘ఆంధ్రప్రదేశ్ ఫిషరీష్ విశ్వ విద్యాలయం’ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆర్బీకేలలో ఫిషరీస్ అసిస్టెంట్స్ నియామకాన్ని చేపట్టారు. మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకే తిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. మత్స్య సాగుబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు విస్తరణ సేవలు, పంట సలహాలు అందిస్తున్నారు. ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50లకే సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020 అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందించడానికి తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటివరకూ ఎవరూ చేయని విధంగా జగన్ మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తూ వారి బతుకు నావకు చుక్కాని అయ్యారు. అందుకే ఆయన రుణం తీర్చు కోవడానికి వారంతా ఎదురుచూస్తున్నారు. బందన పూర్ణచంద్రరావు వ్యాసకర్త జాతీయ మత్స్యకార సంఘం వైస్ చైర్మన్ మొబైల్: 90102 01616 (నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం) -
మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారత చాటుకున్నారు. వారికి కనీవినీ ఎరుగని రీతిలో సహాయం ప్రకటించారు సీఎం జగన్. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదస్తలికి మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ను పంపి మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ‘ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ. వారి జీవితాను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా సాయం ఉండాలి. బోట్లకు బీమా లేదనో.. మరో సాంకేతిక కారణాలను చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు. కష్టకాలంలో ఉన్న మత్స్యకారులకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సురెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలి. జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికితీయాలి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ? -
మత్స్యకారుల పంట పండింది ఈ చేప ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు
-
మత్స్యకారులకు మరింత మేలు
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల పెంపు, మత్స్యకారులు చేపల వేటకు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తప్పించడం, వారికి అధిక ఆదాయ మార్గాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. ఇందుకు సుమారు రూ.3,500 కోట్లు వ్యయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు హార్బర్ల ఆధారంగా పనిచేసే పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.1,522.80 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తున్నాయి. దీంతో ఈ హార్బర్ల నుంచి వచ్చే మత్స్య సంపద ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తికావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డ్లను ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేస్తోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ఇలా వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. దీనికి అనుగుణంగా హార్బర్కు వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. వార్షిక ఆదాయంలో వాటా లేదా వార్షిక ప్రీమియం రూపంలో ఆదాయం పొందే పద్ధతిలో ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదించింది. 30 ఏళ్ల కాలపరిమితి, ఆపైన పొడిగించుకునే విధంగా బిడ్లను ఆహ్వానించింది. బోట్ తయారీ, మరమ్మతులు కూడా.. 1,250 బోట్లు నిలుపుకునే విధంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 9ఎం ఎఫ్ఆర్పీ రకం బోట్లు 1,000, 12 ఎం గిల్ నెట్టర్ బోట్లు 100, 15ఎం ట్రావెలర్ 100 బోట్లు, 24ఎం టూనా లాంగ్ లైనర్ బోట్లు 50 నిలుపుకునేలా హార్బర్ను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే బోట్లు తయారీ, మరమ్మతుల యూనిట్ను ఏర్పాటు చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదించింది. ఇందుకోసం 5 ఎకరాల్లో బోట్ బిల్డింగ్ యార్డ్ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. దీన్ని కూడా 30 ఏళ్ల కాలపరిమితికి లీజు రూపంలో ఇవ్వనుంది. 555 గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి రాష్ట్రంలో మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే అవసరం లేకుండా సీఎం వైఎస్ జగన్ ఏకకాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. వీటి ద్వారా రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా పట్టిన చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించే విధంగా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డ్లతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్తోపాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. ఈ హార్బర్ను నవంబర్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే హార్బర్ల వద్ద పర్యాటకంగా ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు, వీసీ–ఎండీ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ -
మత్స్యకారులకు కష్టాలుండవిక
సాక్షి, అమరావతి: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల కష్టాలను తీర్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో ఆరు ఫిష్ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ.3,500 కోట్లతో మినీ ఓడరేవులను తలపించేలా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మత్స్యకారులు వారి బోట్లను సురక్షితంగా నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకునేలా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర మత్స్య శాఖ ఏపీ మారిటైమ్ బోర్డుకు బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోని మత్స్యకారులు తమ పడవలను బీచ్ల్లోనే నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాన్లువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పడవలు, వలలు కొట్టుకుపోయి పేద మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. పడవలను నిలుపుకొనేందుకు ఒక జెట్టీ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి చేపలను సురక్షితంగా మార్కెట్కు తరలించుకునేలా వీటిలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్లలో భారీ మెకనైజ్డ్ బోట్ల కోసం బ్రేక్ వాటర్ వంటివి ఉండాలని, కానీ ఫిష్ల్యాండింగ్ సెంటర్లలో స్థానిక మత్స్యకారులు చిన్న నాటు పడవలు, మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఏపీ కోస్టల్జోన్ మేనేజ్మెంట్ అథారిటీల నుంచి అనుమతులు పొందడానికి కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఆరు ప్రాంతాల్లో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు, సముద్రపు ఒడ్డున ఎన్ని పడవలు నిలుపుతున్నారన్న అంశాలపై అధ్యయనం చేశామని, దీనికి అనుగుణంగా ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ఆరు చోట్ల 1,732 బోట్లు నిలుపుతున్నారని, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో బోట్లను నిలిపేలా వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వీరంతా అనధికారికంగా చేపల వేట చేపడుతుండటంతో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటయితే ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. -
‘ఆలివ్రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
మత్స్యకారులకు తప్పిన పెను ముప్పు
రణస్థలం: చేపల వేట కోసం గుజరాత్లోని వీరావల్ తీర ప్రాంతానికి వెళ్లిన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు పెను ముప్పు తప్పింది. వేట కోసం తీరం నుంచి సముద్రంలోకి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లిన వారి పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. తోటి మత్స్యకారులు, కోస్ట్గార్డ్ సిబ్బంది సకాలంలో స్పందించి పడవలో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించారు. రణస్థలం మత్స్యశాఖ అధికారి గంగాధర్, జీరుపాలెం సర్పంచ్ ఎం.రాముడు తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ ప్రాంతానికి వేట కోసం రాష్ట్రం నుంచి మత్స్యకారులు బృందాలుగా ఏర్పడి వెళుతుంటారు. సుమారు మూడు నెలలు అక్కడ వేట సాగించి తర్వాత స్వగ్రామాలకు వస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం వీరావల్ తీర ప్రాంతంలో ఉంటున్న రణస్థలం మండలంలోని జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం కొర్లయ్య (పడవ డ్రైవర్), కేశం పండువాడు, సూరాడ చిన్న, అంబటి రాముడు, పుక్కల్ల అసిరయ్య, ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామానికి చెందిన బడి తోటయ్య, కాకినాడకు చెందిన టి.వీరబాబు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస బర్రి అప్పన్న వేట కోసం పడవలో గురువారం తెల్లవారుజామున సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లాక బోటు సైడ్లు విరిగిపోయాయి. అనంతరం ఇంజిన్ పాడైపోయింది. క్రమంగా పడవ మునిగిపోతోంది. దీంతో ప్రమాదం గురించి పడవ డ్రైవర్ కేశం కొర్లయ్య తమతోపాటు మరో రెండు పడవల్లో సముద్రంలో వేట సాగిస్తున్న జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం అప్పన్న, అమ్మోరు, మైలపల్లి పెద్దయ్యతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. జీరుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎనిమిది మందిని కాపాడారు. మునిగిపోతున్న పడవలో ఉన్నవారిని తాడు సాయంతో తమ పడవల్లోకి తీసుకువచ్చి రక్షించారు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ప్రమాద స్థలాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు అందరూ గురువారం సాయంత్రానికి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారి స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్కు ఉండే సిగ్నల్స్పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
వలలెన్ని వేసినా.. పులస జాడ లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరిలో సీజనల్గా దొరికే పులసలు ఈ ఏడాది జాడ లేకుండా పోయాయి. గోదావరికి వరదలు రావడంతోనే వలస వచ్చే పులసల సీజన్ ప్రారంభమవుతుంది. ఏటా గోదావరికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు వరద ప్రవాహం వస్తుంది. సాధారణంగా ఆగస్టు నెలలో వరదలు ఎక్కువ వస్తాయి. ఈ ఏడాది జూలైలోనే వరదలు వచ్చి వెళ్లిపోయాయి. వరదల సమయంలో సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతూ పునరుత్పత్తి కోసం గుంపులు గుంపులుగా పులసలు వస్తుంటాయి. కానీ.. ఈ సీజన్లో పులసలు మొహం చాటేశాయి. గోదావరి తీరంలో అక్కడక్కడా ఒకటి, రెండు పులసలు వలలో పడ్డా వేలకు వేలు పెట్టి పులస ప్రియులు ఎగరేసుకుపోతున్నారు. ‘క్వీన్ ఆఫ్ ఫిష్’గా పేరు గోదావరిలో లభించే పులస ‘క్వీన్ ఆఫ్ ఫిష్’ గా ప్రపంచంలోనే పేరుంది. 2015 గణాంకాల ప్రకారం ప్రపంచంలో హిల్షా ఉత్పత్తిలో 50–60 శాతంతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. మయన్మార్ 20–25 శాతంతో రెండో స్థానంలోను, 15–20 శాతంతో మన దేశం మూడో స్థానంలో ఉన్నాయి. గోదావరిలో పుట్టిన పులస పిల్లలే సముద్రంలోకి వెళ్లి ఇలసలుగా వృద్ధి చెందుతాయి. సముద్రంలో ఉండే ఇలస రుచిగా ఉండకపోవడానికి అవి కొవ్వుతో ఉండటమే కారణం. ఏటా వరదల సమయంలో సముద్రంలోని ఇలసలు పునరుత్పత్తి కోసం సముద్రంలో 11వేల నాటికల్స్ ప్రయాణించి గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల పులసలో ఉండే కొవ్వు కరిగిపోయి ఎరుపు, గోధుమ రంగులోకి మారి పోషకాలు కలిగిన కొత్త శక్తితో స్మార్ట్గా మారుతుంది. కొన్ని రోజులు గోదావరిలోనే ఉండి గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటుంది. ఇలా గోదావరిలోకి వచ్చిన పులసల్ని ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. అర కేజీ దొరకడమే గగనం పులస గతంలో కేజీ నుంచి మూడు కేజీలు వరకు లభించేవి. మూడు కేజీల బరువున్న పులసలు నాలుగైదు చిక్కాయంటే వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండినట్టే. మూడు కేజీల తూకం ఉండే పులస రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలికేది. ప్రస్తుత సీజన్లో అరకిలో పులస దొరకడమే గగనమైపోతోంది. ఆ అరకిలో పులసే ఐదారువేలు పలుకుతోంది. గోదావరి జిల్లాల్లో యా నాం, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావు లపాలెం, సిద్ధాంతం, నరసాపురం తదితర తీర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా దొరికే పులసలు అరకొరగానే పడుతున్నాయి. సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక తిప్పలు పెరగడం, గోదావరిలోకి సల్ఫర్, అమ్మోనియా, లెడ్ తదితర కర్బనాలు కలిసిపోతుండటం, విచక్షణా రహితంగా సాగే వేట ఈ జాతి రాక తగ్గడానికి కారణంగా పేర్కొంటున్నారు. పులసలు సంతానోత్పత్తి జరిగే సమయంలో వేట సాగడం తగ్గిపోవడానికి మరో కారణం. పులసల మనుగడకు ‘సిఫ్రీ’ కృషి పులస చేప జాతిని పరిరక్షించే దిశగా కోల్కతాలోని సిఫ్రీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిస్ట్యూట్) కృషి చేస్తోంది. పులస సీడ్ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెడుతోంది. ఈ ప్రయత్నం వల్లే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పులసలు లభిస్తున్నాయంటున్నారు. కానీ.. గోదావరిలో లభించే పులసలకున్నంత రుచి ఆ ప్రాంతంలో పులసలకు ఉండదు. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త పులసల రాక తగ్గిపోతోంది పులసలు రాక క్రమంగా తగ్గిపోతోంది. గతంలో జూలై, ఆగస్టు నెలల్లో మాకు పండగలా ఉండేది. వందలాది పులసలు మా వలల్లో చిక్కేవి. అటువంటిది ఈ సీజన్లో పులసలు జాడ కనిపించడం లేదు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. – ముదే హరిచంద్ర, మత్స్యకారుడు, యానాం -
జాలరి పాత్రలో చైతూ.. మత్స్యకారులతో కలిసి!
‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాకుళం, గుజరాత్ నేపథ్యంలోని మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఈ సినిమా కథ ఉంటుందట. ఇందులో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు వైజాగ్ వెళ్లారు నాగచైతన్య, చందు మొండేటి, ‘బన్నీ’ వాసు. మూడు రోజుల ΄ాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అలాగే సముద్ర యానం కూడా చేయాలను కుంటున్నారు. ఇక ఈ మూవీకి ‘తండెల్’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు టాక్. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్ అని పిలుస్తారట. -
అమ్మ తర్వాత గంగమ్మే..!
ఏళ్ల తరబడిగా చేపలు ప ట్టే వృత్తిని కొనసాగిస్తూ గోదావరి తో ఎనలేని బంధాన్ని పె నవేసుకున్నారు మత్స్యకారులు. ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే గంగమ్మ ఒడిలోనే ఎక్కువ సేపు జీవనాన్ని గడుపుతుంటారు. డొంకేశ్వర్ మండల పరిధిలోని గ్రామాలన్నీ దాదాపుగా గోదావరికి ఆనుకుని ఉన్నాయి. అన్నారం, సిర్పూరం, న డ్కుడ, గాదెపల్లి, చిన్నయానం, నూత్పల్లి, నికాల్పూర్, డొంకేశ్వర్, దత్తాపూర్, మారపంల్లి, గంగసముందర్ గ్రామాల్లో గంగపుత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గ్రామాల న్నీ కలిపి మండలంలో మొ త్తం వెయ్యికి పైగా మ త్స్యకార కుటుంబాలున్నాయి. ఇందులో 60 శాతం మంది మత్స్యకారులు ఆయా గ్రామాలకు ఆను కుని ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్ళి చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. సూర్యోదయానికి ముందే లేచి.. మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లోని గంగపుత్రుల జీవన విధానాన్ని చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. చేపల వేటకు వెళ్లడానికి ఒకరోజు ముందే గ్రూప్లుగా ఏర్పడుతారు. మరుసటి రోజు తెల్లవారక ముందే ఉదయం 4 గంటలకు లేచి ఇళ్ల నుంచి బైక్లపై కలిసికట్లుగా పయనమవుతారు. సూర్యుడు ఉదయించక ముందే గోదావరి తీరాలకు చేరుకుంటారు. ప్రస్తుతం వేసవి కావడంతో బ్యాక్ వాటర్ లోపలికి వెళ్లిపోయింది. దీంతో 11 కిలోమీటర్లు గోదావరి పచ్చిక బయళ్లలోనే ప్రయాణం చేసి ఉదయం 5 గంటల ప్రాంతానికల్లా గమ్యానికి చేరుతారు. వెంటనే దుస్తులు మార్చుకుని తెప్పల సాయంతో గంగలోకి దిగుతారు. తిరిగి మధ్యాహ్నం, లేదా సాయంత్రం ఇంటిబాట పడుతారు. ఇలా గోదారిలో చేపలు పట్టేవారి సంఖ్య దాదాపుగా 230కి పైనే ఉంటుంది. గంగమ్మ వెనక్కి తగ్గితేనే చేపలు చిక్కేది.. సాధారణంగా గోదావరిలో నీళ్లు ఎక్కువగా ఉంటే మత్స్యకారులకు చేపల వేట ఇబ్బందిగానే ఉంటుంది. అలలు, గాలులు తీవ్రంగా ఉంటే గంగలోకి దిగ డానికి సాహసించరు. అయితే, వర్షా, చలికాలాల కంటే వేసవిలోనే చేపలు ఎక్కువగా దొరుకుతా యని గంగపుత్రులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో బ్యాక్వాటర్ ఎండిపోయి నీళ్లు త గ్గుతాయి. తద్వారా చేపల వేట సులభమవుతుంది. ఒక్కోసారి చేపలు దొరకని పక్షంలో సాహసం చేసి నీటిలో రెండు కిలో మీటర్ల లోపలికి వెళ్తారు. అప్పటికీ చేపలు పడకపోతే ఆ రోజు ఆ కుటుంబానికి ఉ పాధి లేనట్లే. వాహనాల్లో పెట్రోల్ పోసుకుని దూర ప్రాంతానికి వచ్చి చేపలు పడకపోతే గంగపుత్రుల కళ్లల్లో సంతోషం కనిపించదు. ఎందుకంటే చేపలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే కుటుంబాల పోషణ జరిగేది. దళారులకే విక్రయించాల్సిన పరిస్థితి.. పడిన చేపలను విక్రయించడానికి మత్స్యకారులకు దళారులే దిక్కయ్యారు. ప్రభుత్వం కొను గోలు చేసి ఇతర ప్రాంతాల ఎగుమతి చేయడం లేదు. దీంతో వీరే కలకత్తా, నాగ్పూర్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలను ఎగుమతి చేసి అమ్ముతున్నారు. తద్వారా తక్కువ రేటు వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రమాద బీమాను పెంచి, చేపలను నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీలను, విక్రయించడానికి చేపల మార్కెట్లను నిర్మించివ్వాలని కోరుతున్నారు. -
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు
-
మత్స్యకారులకు మేలు కలిగేలా స్మార్ట్ కార్డుల జారీ
-
ప్రాణాలు అర చేతిలో.. రెండు రోజులుగా నడి సంద్రంలోనే!
సాక్షి, చైన్నె: పడవ మరమ్మతులకు గురి కావడంతో రెండు రోజుల పాటు ముగ్గురు జాలర్లు నడి సముద్రంలో బిక్కుబిక్కు మంటూ కాలం గడిపారు. ఎట్టకేలకు గురువారం ఉదయం అటు వైపుగా వచ్చిన మరో పడవలోని వారు ఆ ముగ్గురు జాలర్లను రక్షించారు. వివరాలు.. నాగపట్నం జిల్లా వేదారణ్యం సమీపంలోని ఆరుకాట్టు దురై గ్రామానికి చెందిన పరమ శివం, వేదయ్యన్, పన్నీరు అనే జాలర్లు చేపల వేట నిమిత్తం సోమవారం అర్ధరాత్రి సమయంలో సముద్రంలోకి వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం సమయానికి వీరి పడవ ఒడ్డుకు చేరాల్సి ఉంది. అయితే రాలేదు. దీంతో జాలర్ల కుటుంబాలలో ఆందోళన నెలకొంది. బుధవారం మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ పరిస్థితులలో గురువారం ఉదయం ముగ్గురు జాలర్లు వెళ్లిన పడవను మరో పడవలోని జాలర్లు ఒడ్డుకు చేర్చారు. వేటకు వెళ్లిన ఈ ముగ్గురు జాలర్లు ఉన్న పడవ మంగళవారం మధ్యాహ్నం సమయంలో మరమ్మతులకు గురైంది. ఫలితంగా నడి సముద్రంలో వారు సాయం కోసం ఎదురు చూస్తూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని ఎదురు చూశారు. తమ వద్ద ఉన్న సమాచార పరికరాలు పనిచేయక పోవడంతో విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తమ వద్ద ఉన్న నీటిని, ఆహారాన్ని పొదుపుగా వాడుకున్నారు. బుధవారం కూడా సముద్రంలోనే కాలం గడిపారు. గురువారం వేకువ జామున అటు వైపుగా ఓ పడవ రావడంతో ఈ ముగ్గురిలో ఆనందం వెల్లివిరిసింది. తమ దీనావస్థను మరో పడవలో ఉన్న వారి దృష్టికి జాలర్లు తీసుకెళ్లారు. దీంతో వారు స్పందించి తమ వద్ద ఉన్న తాళ్ల సాయంతో ఆ పడవను ఒడ్డుకు తీసుకొచ్చారు. తర్వాత బాధిత జాలర్లను ఆసుపత్రికి తరలించారు. వారికి కావాల్సిన ఆహారం అందజేశారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు, జాలర్ల సంఘాల ప్రతినిధులు బాధితులను పరామర్శించారు. -
వేటకు వేళాయె..రా!
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం. వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. కోనసీమకు ఎందుకు వలస అంటే.. గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోంది. స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచే వేట.. నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్కతా, హైదరాబాద్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా.. మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ. – దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మత్స్య సంపద ఎక్కువ ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. – సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మేం పెట్టుబడి పెడతాం నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకారులకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. – బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
మత్స్య సంపద మురిపిస్తోంది.. ఎగుమతుల్లో నాలుగో స్థానం
నూట పది కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగిన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మత్స్య సంపదలో గణనీయ ఆదాయం సాధిస్తూ పురోగమిస్తోంది. జిల్లాలో సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో వివిధ రకాలైన చేపలు పెరుగుతుంటాయి. వాటిని కొన్ని పేద కుటుంబాలు పట్టుకుని జీవనం సాగిస్తుంటాయి. ఇక సముద్ర తీరంలో ఉన్న 98 మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రధానంగా పడవలు, బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి రోజుల తరబడి అక్కడే ఉండి చేపలు, రొయ్యలు వేటాడి తీసుకొస్తుంటారు. వాటిని వ్యాపారులకు విక్రయించి ఆదాయం పొందుతుంటారు. ఇవే కాక జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. బ్రాకిష్ వాటర్లో సాగుచేసే చెరువుల నుంచి ఏడాదికి దాదాపు 90 వేల టన్నుల రొయ్యలు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ జిల్లా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. – సాక్షి, నెల్లూరు డెస్క్ జిల్లాలో అధికారికంగా సుమారు 8 వేల ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. అనధికారికంగా ఇది ఇంకా ఎక్కువే ఉంటాయని సమాచారం. వీటిలో ఏటా దాదాపు రెండు లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం టన్ను చేపల ధర రూ.1.50 లక్షలు ఉంది. ఈ లెక్క ప్రకారం వాటి విలువ రూ.3,000 కోట్లు. పట్టుబడిన చేపల్లో కొంత జిల్లాలో వినియోగం అవుతుండగా, ఎక్కువ సరుకు ఇతర రాష్ట్రాలకు, పొరుగు జిల్లాలకు ఎగుమతి అవుతోంది. ఇవి కాకుండా జిల్లాలో సహజసిద్ధంగా ఏర్పడిన సాగునీటి చెరువులు, కాలువలు, నదుల్లో కూడా మత్స్యసంపద దొరుకుతోంది. భారీగా రొయ్యల చెరువులు జిల్లాలో దాదాపు 24 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటిలో 80 శాతం బ్రాకిష్ వాటర్ (సెలెనిటీ తగినంతగా ఉన్నవి) చెరువులే. రొయ్యల ఉత్పత్తి జిల్లాలో ఏటా లక్ష టన్నులకు పైగానే ఉంటోంది. ఇందులో 90 వేల టన్నులు రాష్ట్రం నుంచి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం టన్ను రొయ్యల ధర రూ.2.50 లక్షల వరకు ఉంది. ఈ ప్రకారం లెక్కిస్తే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల విలువ రూ.2,500 కోట్లు. ఆదాయం భారీగా ఉండటంతో రైతులు కూడా ఎక్కువమంది రొయ్యలు సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఎగుమతులు ఎక్కడెక్కడికి.. బ్రాకిష్ వాటర్లో పెంచే రొయ్యలతోపాటు సముద్ర చేపలు ఎక్కువ భాగం జిల్లా నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంత వరకు చెన్నై, ముంబై, కోల్కతా, కొచ్చి, గుజరాత్కు కూడా ఎగుమతి అవుతున్నాయంటే జిల్లాలో సముద్ర ఉత్పత్తులు ఎంత మేరకు లభిస్తున్నాయో అర్థమవుతుంది. శీతలీకరణ వాహనాల (ఇన్సులేటెడ్ వెహికల్స్) ద్వారా కూడా రోడ్డు మార్గాన పొరుగు రాష్ట్రాలకు చేపలు, రొయ్యలను పంపుతున్నారు. ఆక్వా ఉత్పత్తులలో జిల్లా గణనీయ ప్రగతి సాధిస్తోందని అధికారులు వివరించే లెక్కలు తెలియజేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు జిల్లాలో 9 తీర ప్రాంత మండలాల్లో 98 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 1,98,000 మంది జనాభా ఉన్నారు. వీరంతా సముద్రంలో చేపలు, రొయ్యలు వేటాడి బతుకుతున్నారు. కుటుంబంలోని మగవారు సముద్రంలోకి వేటకు వెళతారు. ఒక్కోసారి చేపలు పట్టడానికి వారం రోజులు కూడా పట్టవచ్చు. అందుకే వేటకు వెళ్లే ముందు తగినంత ఆహారం కూడా తమతోపాటు తీసుకెళ్తారు. వేటాడి తెచ్చిన మత్స్యసంపదను వీరు వ్యాపారులకు విక్రయించి తమ కుటుంబాలను పోషించుకుంటారు. జిల్లా స్థానం ఇదీ ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. సముద్రంలో, ఆక్వా చెరువుల్లోనే కాకుండా నదులు, కాలువలు, సాగునీటి చెరువులు తదితర వాటితో కలిపి జిల్లాలో ఏటా 3.50 లక్షల టన్నుల మత్స్య సంపద దొరుకుతోంది. ఇంత కంటే ఎక్కువ సంపదతో ముందు వరుసలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. ప్రభుత్వ పరంగా ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తుండటం, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా చేస్తుండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వ సహకారం ఆక్వా సాగు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై విద్యుత్ను అందిస్తోంది. చేపలు, రొయ్యలకు ఫీడ్ కూడా నాణ్యమైనది అందించేలా శాఖా పరంగా చర్యలు తీసుకుంది. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఏటా సుమారు రూ.2,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందుకు జిల్లా రైతులూ తమవంతుగా తోడ్పాటు అందిస్తున్నారు. సాగును ఇంకా ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా రైతులకు తోడ్పాటు అందిస్తున్నాం. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ రూ.1.50కే యూనిట్ విద్యుత్ గతంలో ఆక్వా సాగుకు యూనిట్ ధర రూ.4.86 ఉండేది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.2కే విద్యుత్ను అందిస్తామని చెప్పడంతో అధికారంలో ఉన్న చంద్రబాబు రూ.2కు యూనిట్ కరెంట్ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆక్వా జోన్లోని రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందిస్తోంది. – ఫణీంద్రనాయుడు, ఆక్వారైతు, గంగపట్నం సబ్సిడీతో రైతులకు ఊరట రొయ్యల చెరువులకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ వల్ల లాభం పొందుతున్నాం. నేను పది రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా. ఈ ఏడాది మొత్తం చూస్తే మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏడాదికి మూడుసార్లు సాగు జరుగుతుంది. గతేడాది మేలో వేసినప్పుడు రొయ్యల రేటు బాగుంది. 100 కౌంట్ రూ.280, 70 కౌంట్ రూ.340 వరకు పలికింది. సెప్టెంబర్లో రేటు భారీగా తగ్గి 100 కౌంట్ రూ.160 పలికింది. ఈ సమయంలో నష్టపోయాం. ప్రస్తుతం 100 కౌంట్ రూ.240 పలుకుతోంది. ప్రభుత్వం విద్యుత్పై యూనిట్కు రూ.1.50 పైసలు సబ్సిడీ ఇస్తుండటంతో నష్టపోయే పరిస్థితి లేదు. – ఆవుల సోమయ్య, పెదపట్టపుపాళెం, రొయ్యల సాగు రైతు -
జగనన్న సంకల్పం.. ప్రారంభానికి జువ్వలదిన్నె రెడీ! వారికి మంచి రోజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైనవి వాస్తవ రూపం దాలుస్తున్నాయి. వీటి రాకతో ఇక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని వేలాది మంది మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళ్లి, ఎప్పటికప్పుడు ఇంటికొస్తూ.. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే రోజులు అతి త్వరలోనే రానున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వారికి ఆ కష్టాలను దూరం చేయాలని భావించి, అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. ప్రధానంగా డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, ప్రీకాస్ట్ వంటి పనులు దాదాపు పూర్తయినట్టే. కొద్ది రోజుల్లో మిగతా ఐదు శాతం పనులు పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పట్టిన చేపలు వేలం వేసుకోవడానికి హాలు, కోల్డ్ స్టోరేజ్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వంటి భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.288.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ హార్బర్లో 1,250 బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది. తద్వారా 6,100 మంది మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 9 హార్బర్లతో 60,858 మందికి ఉపాధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూ.3,520.56 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలి దశ కింద రూ.1522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఇందులో జువ్వలదిన్నె ప్రారంభానికి సిద్ధం అవుతుండగా, నిజాంపట్నంలో 75 శాతం పనులు పూర్తయ్యాయి. మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు కూడా 40 శాతం పూర్తయ్యాయి. రెండో దశ కింద రూ.1,997.76 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఈ హార్బర్లన్నీ అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60,858 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అందుబాటులోకి వస్తుందని అంచనా. మత్స్యకారులకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా హార్బర్ల వద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు కసరత్తు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కింద జువ్వలదిన్నె వద్ద 50 ఎకరాల్లో ఈ పార్క్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మత్స్య ఉత్పత్తులే కాకుండా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రాసెస్ చేసేలా ఈ పార్క్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే ఉపాధి లభిస్తుంది చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ హర్బర్ వస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందొచ్చు. ఇక్కడ అరుదైన మత్స్య సంపద ఉన్నా, హర్బర్ లేకపోవడంతో తమిళనాడు మత్స్యకారులు దొంగతనంగా వచ్చి వేటాడుతున్నారు. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఆ సమస్య ఉండదు. ఈ హార్బర్ వద్ద ఇతరత్రా మౌలిక వసతులు కూడా కల్పిస్తుండటం సంతోషం. ► బుచ్చింగారి చిట్టిబాబు, మత్యకారుడు, ఆదినారాయణపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా త్వరలో ప్రారంభం తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్ను ప్రారంభించనున్నాం. రెండో దశ హర్బర్లకు సంబంధించి డిజైన్లు ఖరారు దశలో ఉన్నాయి. అవి ఖరారు కాగానే పనులు మొదలు పెడతాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హర్బర్ లేదా ఓడరేవు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ► షాన్ మోహన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు జువ్వలదిన్నెలో పనుల పురోగతి ఇలా.. ► 2021 మార్చి 19న పనులు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ► భారీ మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఆగడానికి వీలుగా కాలువను తవ్వడం కోసం ఏకంగా 10.5 లక్షల టన్నుల ఇసుకను తవ్వి పక్కన పోశారు. ఈ బ్రేక్వాటర్ ఛానల్ తిరిగి పూడిపోకుండా ఉండటం కోసం 3.20 లక్షల టన్నుల రాతిని వినియోగించారు. ఉత్తరం వైపు బేక్ వాటర్ 835 మీటర్లు, దక్షిణం వైపు 620 బ్రేక్ ఛానల్స్ను రాతితో నింపే ప్రక్రియ పూర్తయింది. ► అలల ఉధృతిని తట్టుకునే విధంగా సిమెంట్తో నిర్మించిన 9,176 ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉండే సిమెంట్ దిమ్మెలు–టెట్రాపాడ్స్ అని కూడా అంటారు) పేరుస్తున్నారు. ఇందులో ఇప్పటికే 6,919 ట్రైపాడ్స్ను అమర్చారు. 1,250 బోట్లు నిలుపుకోవడానికి 909 మీటర్ల జెట్టీ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందుకోసం 312 ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ (సముద్రం లోపలికి సిమెంట్తో కూడిన ఇనుప దిమ్మెలు) ఏర్పాటు చేశారు. ► వీటిని ఒడ్డుతో అనుసంధానం చేసే సిమెంట్ జెట్టీ నిర్మాణం 672 మీటర్లు ఇప్పటికే పూర్తయింది. మిగిలింది పది రోజుల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఇది పూర్తయితే బోట్లు ఇక్కడికి వచ్చి ఆపుకోవచ్చు. చేపల వేటను ప్రారంభించవచ్చు. ► ఇక కేవలం ఉపరితలం మీద నిర్మించే అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే చాలా భవనాలు శ్లాబు దశ దాటాయి. మిగిలినవి శ్లాబు దశకు చేరుకున్నాయి. ఇంతకాలం ఉపాధి కోసం కుటుంబాలను వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి వస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. దశాబ్దాల మా కల ఇప్పుడు నిజమవుతోంది. బుచ్చింగారి చిట్టిబాబు, మత్స్యకారుడు, ఆదినారాయణపురం, నెల్లూరు జిల్లా -
అలల సాగరంపై బతుకు విన్యాసం.. కడలి పుత్రుల జీవనం విలక్షణం
కడలే వారికి అమ్మ ఒడి. అలల సవ్వడులు వారికి జోలపాట. సాగరంలో వేటే జీవనంగా సాగుతున్న మత్స్యకారుల జీవనశైలి అంతా విభిన్నం. ఇల్లు వదిలి సముద్రంలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ నిత్యం ఆటుపోటుల మధ్య సాగే వీరి జీవనం ఓ సమరం. గంగమ్మ చెంత మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచే ఆరంభమవుతుంది. నడి సంద్రం సాక్షిగా వీరు సాగించే జీవన తెరను ఒక్కసారి తెరిస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. వీరు వినియోగించే వల దగ్గర నుంచి సాగరంలో సాగించే వేట వరకూ అన్నీ విభిన్నం..విలక్షణమే.. ఇంకెందుకాలస్యం సముద్ర తీరానికి పోదాంపదండి... సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరం. ఇక్కడ చిన్నా..పెద్దా, ఆడ..మగా అనే తేడా లేకుండా అందరూ వేట పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది తెల్లవారుజామునే వేటకు వెళితే.. మరికొంత మంది రేపటి కోసం వలలను సిద్ధం చేస్తూ కనిపించారు. మరికొందరు పడవలను శుభ్రం చేస్తున్నారు. వేటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగొచ్చిన విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు భోజనాలతో తీరానికి వస్తారు. అక్కడే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఇక్కడ జీవనం సాగిస్తున్న గంగపుత్రులను పలకరిస్తే వారి బతుకుల్లో విలక్షణత కనిపించింది. కడలిలో వందల కిలోమీటర్లు రోజుల తరబడి వీరు చేస్తున్న సాహసం తెలుస్తుంది. చేపల వేటే జీవనంగా మార్చుకున్న గంగపుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే మత్స్యకారుల బతుకు ప్రకృతి విపత్తుల మధ్య పెనుసవాలే.. అంతా విలక్షణం... అందరిదీ ఒక్కటే మాట..బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెద్దకాపు తీసుకున్న నిర్ణయమే శాసనం. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికీ వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఊరంతా అనుసరించాల్సిందే. వల..వలకూ ప్రత్యేకమే... మత్స్య సంపదను వేటాడటానికి రకరకాల వలలు వినియోగిస్తారు. చేపలు, రొయ్యలు, పీతలు ఒక్కొక్కదానికి ఒక్కో వలను వేటకు వాడతారు. ఏ వల కొనుగోలు చేయాలన్నా రూ.లక్షల్లోనే మరి. వేట సరిగ్గా సాగితే అది పెద్దలెక్కలోదేమీ కాదు. సంప్రదాయ మత్స్యకారులు వాడే వలలు పులసల వల, నరంవల, బాడీవల, సన్నకన్నుల వల, ఐలావల, రింగుల వల, కొనాము వల. వీటిల్లో అత్యంత ఖరీదైంది ‘ఐలా వల’. దీని ఖరీదు దాదాపు రూ.రెండు లక్షలు ఉంటుంది. అంటే ఒక్కో వల అతి తక్కువ పొడవు అంటే ఒక కిలో మీటరు. ఇక పొడవు పెరిగే కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. దీనితో సముద్రం ఒడ్డున ఉండి మరీ వేట సాగిస్తారు. ఈ వలను సముద్రంలో రెండుమూడు పడవల్లో వేసుకుని ఎంత పొడవు ఉంటే అంత దూరంలో సముద్రంలో వదులుకుంటూ వెళ్తారు. ఒడ్డున ఉండి మత్స్యకారులు ఒక చివర పట్టుకుని ఉంటే.. రెండో చివర మరో పక్కన ఒడ్డునే ఉండి మరికొంతమంది మత్స్యకారులు పట్టుకుంటారు. సముద్రంలో వదిలిన వలను రెండు అంచులు పట్టుకుని లాగుతారు. ఐలా, రింగుల, కొనాము వలను లాగడానికి దాదాపు 50 మందికిపైగా మత్స్యకారులు కావాలి. కాకినాడ నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులను తీసుకొచ్చి వేటకు వెళ్తారు. సుదూర ప్రాంతం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వలల యజమానికి అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. మత్స్య సంపద పడితే ఊపిరి పీల్చుకుంటాడు. లేకుంటే మళ్లీ రెండో ప్రయత్నమే మరి. పీతలు, చిన్నచేపలు, రొయ్యల కోసం ముందు రోజు లంగరు వేసి తర్వాత రోజు ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లి మత్స్యసంపద తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన మత్స్య సంపదను ఊర్లో ఉన్న వ్యాపారులకు ఇస్తారు. వారు సరుకును బట్టి ప్రత్యేక వాహనాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఒడిస్సా పంపిస్తుంటారు. పడవలోనే వంటా వార్పూ... సుదూర ప్రాంతాలకు వేట కోసం వెళ్లేవారు ముందుగానే పడవలో వంట సరుకులు తీసుకువెళ్తారు. అందులోనే వంటా వార్పూ. తమ వెంట తీసుకెళ్లిన పప్పులు, కూరగాయలతోనే కాకుండా సముద్రంలో లభించే చేపలు, రొయ్యలను సైతం వండుకుని తింటారు. అంతేకాదు వీరికి ప్రత్యేక భాష ఉంటుంది. తమిళం కలిపి వీరు మాట్లాడుతుంటారు. ఎంతో మార్పు... రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వేట విరామ సమయంలో గత ప్రభుత్వాలు అరకొరగా.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. ప్రస్తుతం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్ల పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడితో పిల్లలు చదువుకు వెళ్తున్నారు. విరామ సమయంలో... వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్కు, వ్యవసాయ, ఉపాధి పనుల్లో కూలీలుగా వెళ్తారు. మరికొందరు రొయ్యల చెరువుల్లో రొయ్యలు పట్టడం, ప్యాకింగ్ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో ఆటలతో కాలక్షేపం చేస్తుంటారు. చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ ఉదయం ఆరు గంటలకు చేపల వేటకు బోటులో ఇద్దరం వెళ్లాం. ప్రస్తుతం పీతలు మాత్రమే పడ్డాయి. పీతలు పెద్దసైజు అయితే కేజీ రూ.150 ఉండగా, చిన్న సైజు కేజీ రూ.60 మాత్రమే. పీతలు పడితే చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ. – అల్లారి లక్ష్మణ్, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల శాపంగా తమిళనాడు బోట్లు... చేపల వేట ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. సముద్రంలో చాలా దూరం వెళ్లి వలలు వేస్తేనే చేపలు లభిస్తున్నాయి. ఈలోగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కడలూరు జాలర్లు సోనా బోట్లతో నిబంధనలు అతిక్రమించి తీరానికి సమీపంలో చేపల వేట చేయడంతో లక్షలాది రూపాయల విలువ గల వలలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నాం. చెన్నై బోట్లు తీరంలో వేటాడకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. – ప్రళయ కావేరి రోశయ్య, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల రోజూ రూ.200 సంపాదన ఇంటింటికి తిరిగి చేపలు అమ్ముకుంటూ జీవిస్తాను. చేపల వేట సాగించి తీరానికి వచ్చిన బోట్ల మత్స్యకారులకు బఠానీలు వంటి తినుబండారాలు ఇచ్చి వారి వద్ద నుంచి చేపలు తీసుకెళ్లి అమ్ముకుంటాను. రోజుకు 150 నుంచి 200 రూపాయలు సంపాదిస్తాను. నాకు వృద్ధాప్య పింఛన్ రూ.2,750 వస్తుంది. – వాటిపల్లి పోలేరమ్మ, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల చదవండి: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
Srikakulam: జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో సరికొత్త వెలుగులు
అటు నీళ్లు.. ఇటు కన్నీళ్లు.. దశాబ్దాలుగా సిక్కోలు మత్స్యకారుల బతుకు చిత్రమిది. కంటి ముందు అనంతమైన సముద్ర సంపద ఉన్నా పొట్ట చేత పట్టుకుని పారాదీప్ నుంచి వీరావల్ వరకు వలస వెళ్లేవారు. ఉన్న చోట బతుకు లేక, కుటుంబంతో బతకలేక కాసింత అదనపు సంపాదన కోసం అయిన వారందరినీ వదిలి ఎక్కడో అజ్ఞాతవాసం చేసేవారు. పండక్కో పబ్బానికో ఇంటికి వచ్చి కన్నవారిని, కట్టుకున్న వారిని చూసుకునేవారు. పొరపాటున అక్కడేదైనా జరిగితే ఆఖరి చూపు కూడా ఉండదు. జిల్లాలో ఒక్క పోర్టు ఉన్నా, ఒక్క ఫిషింగ్ జెట్టీ నిర్మించి ఉన్నా ఇలాంటి యాతన ఉండేది కాదు. ఇంతకాలానికి సిక్కోలు తీరానికి మణిహారంలా ఓ పోర్టు రాబోతోంది. ఇన్నాళ్లకు గంగపుత్రుల బెంగ తీరేలా జెట్టీలు కట్టబోతున్నారు. ఈ ఆలోచన వెనుక ఉన్న పేరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడలి బిడ్డల బతుకులు మార్చేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాలుగా ఉపన్యాసాలు మాత్రమే వింటున్న సిక్కోలు మత్స్యకారులకు ఇప్పుడు పని కనిపిస్తోంది. హామీలు మాత్రమే తెలిసిన గంగపుత్రులకు నాయకుడి పనితనం అర్థమవుతోంది. భావనపాడు పోర్టు, మంచినీళ్ల పేటలో ఫిషింగ్ జెట్టీ, జిల్లాలో ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులు ఇన్నాళ్లూ హామీలుగానే ఉండేవి. సీఎం వైఎస్ జగన్ చొరవతో వీటి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇవి పూర్తయితే మన గంగపుత్రులు వలస వెళ్లి బతకాల్సిన అగత్యం ఇక ఉండదు. జాతీయ స్థాయిలో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటా ఎక్కువే. కానీ మౌలిక వసతులు లేకపోవడంతో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అభివృద్ధి చెందలేదు. జిల్లాలో 11 మండలాల పరిధిలో 145మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. స్థానికంగా వేటకు అనుకూలత లేక పొట్ట చేత పట్టుకుని వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల బతుకుల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని భావిస్తోంది. పోర్టుకు ఫుల్ సపోర్టు జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. పోర్టుకు అవసరమైన భూములను మూలపేట గ్రామంలో ఎకరాకు రూ. 25లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి ద్వారా నిర్వాసితులకు ప్రత్యేకంగా పునరావాస కాలనీ కోసం కె.నౌపడలో ఎకరా రూ.26లక్షలు వెచ్చించి అవసరమైన భూమిని కొనుగోలు చేసి సిద్ధం చేసింది. మొత్తంగా భావనపాడు పోర్టు కోసం 675.60ఎకరాలను సేకరించింది. ఇందులో ప్రైవేటు భూములు 433.71ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89ఎకరాలు ఉన్నాయి. రూ.3200కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్న భావనపాడుకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. టెక్కలిలో ప్రపంచ ప్రఖ్యాత నీలి గ్రానైట్ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ఈ గ్రానైట్ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది. అదే విధంగా జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సరాసరి లక్షా 95వేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద లభిస్తోంది. ఈ విధంగా ఒకవైపు మత్స్య సంపదకు మంచి మార్కెట్ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు వినియోగమవుతోంది. అడుగడుగునా అడ్డంకులు.. భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వేకు, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్లో కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టు పూర్తయితే తమకెక్కడ పుట్టగతులుండవని కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పికొట్టి భూసేకరణ పూర్తి చేసింది. మంచినీళ్లపేట జెట్టీకి శ్రీకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగా స్థానికంగా వనరులు, ఉపాధి పరిస్థితులు సమకూర్చాలని ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగానే వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేటలో రూ.11.95కోట్లతో జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తుండగా.. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో కూడా రూ. 365 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. దీని కోసం 42 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరికొంత భూమిని కూడా సేకరిస్తోంది. త్వరలోనే దీనికి కూడా శంకుస్థాపన చేయనుంది. జరిగిన మేలు.. 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు వీరావల్లో సముద్ర వేటలో ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు పట్టుబడ్డారు. వీరు 13 నెలలు పాకిస్తాన్ కరాచీ జైలులో గడిపారు. పాక్ జైల్లో ఉన్న 20మంది మత్స్యకారుల విడుదల కోసం గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక మార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ మంతనాలు ఫలించి 2020 జనవరి 6న 20మంది విడుదలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 3064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. (క్లిక్ చేయండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు..) -
బ్రాండింగ్ ‘చేప’ట్టిన సర్కారు.. ‘ఫిష్ ఆంధ్ర’కు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ’ఫిష్ ఆంధ్ర’ బ్రాండింగ్ను మరింతగా ప్రోత్సహించేందుకు మత్స్య శాఖచర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులతో ఆక్వా రంగంలో తరచూ తలెత్తుతున్న సంక్షోభం దృష్ట్యా కేవలం ఎగుమతులపైనే ఆధారపడకుండా స్థానిక వినియోగంపైనా దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగం పెంచడం.. తద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో లభించే సముద్ర, రైతులు పండించే మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట హబ్లు, అవుట్లెట్స్, కియోస్క్ల ద్వారా మత్స్య శాఖ విక్రయిస్తోంది. వీటిని బ్రాండింగ్ చేసేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్తో పాటు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రమోట్ చేయనుంది. డోర్ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్ను డిజైన్ చేయనున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ (సీఆర్ఎంఎస్) ద్వారా వినియోగదారులు ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ నియమించనున్నారు. ఆసక్తి కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) కోరుతూ బుధవారం మత్స్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు www.fisheries.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా టెండర్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వచ్చే నెలాఖరులోగా apfisheriestender@gmail.comలో దరఖాస్తు చేసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు కోరారు. -
క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు
కొత్తపట్నం/చీరాల టౌన్: బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుపోగా.. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆదివారం సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న ఏడుగురు మత్స్యకారుల బృందం ఓడరేవు గ్రామం నుంచి గరికన కృష్ణ, మల్లె బంగారయ్య, మెరుగు శివ, కుక్కల మహేష్, మరద పౌలు, దాసరి పంపోజీ, మెరుగు ప్రసాద్ (డ్రైవర్) సముద్రంలో నెల్లూరు జిల్లా వైపు బయలుదేరారు. 4 రోజుల పాటు వేట కొనసాగించారు. ఆ సమయంలో మాండూస్ తుపాను హెచ్చరికలు వెలువడటంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం వీరి మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోగా.. కాసేపటికే ఆ బోటులోని ఒక ఇంజన్ చెడిపోయింది. అలల ఉధృతికి బోటు ముందుకు సాగలేదు. దీంతో వారు నడిసంద్రంలోనే బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా ముందుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం మొబైల్ సిగ్నల్స్ పనిచేయడంతో టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తాము ఆపదలో ఉన్నామని అధికారులకు సమాచారమిచ్చారు. యంత్రాంగం అప్రమత్తం సమాచారం తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మెరైన్, మత్స్యశాఖ, స్పెషల్ బ్రాంచ్, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులతో ఫోన్లో సంప్రదించగా.. రాకాసి అలలు ఉధృతంగా వస్తున్నాయని బోటు తిరగబడే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపట్నం సమీపంలోని గుండమాల రేవుకు వెళ్తామని అధికారులకు చెప్పగా.. చీరాల మత్స్యశాఖ జేడీ పి.సురేష్, ఇతర అధికారులు కొత్తపట్నం బీచ్కు చేరుకున్నారు. అనంతరం మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడి.. వారిని గుండమాలకు వెళ్లొద్దని, కొత్తపట్నం బీచ్కు రావాలని, తాము ఇక్కడే ఉన్నామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వారంతా శనివారం రాత్రి 9 గంటలకు కొత్తపట్నం సమీపానికి వచ్చారు. అలలు ఉధృతంగా ఎగిసిపడటంతో ముందుకు రాలేమని చెప్పి బీచ్కు 500 మీటర్ల దూరంలో లంగర్ వేసుకుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగం కొత్తపట్నం బీచ్కు చేరుకుని వేరే బోటును తీసుకెళ్లి వారిని తీసుకొచ్చారు. -
తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!
సోన్: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) -
మత్స్యకారులకూ రూ. 5 లక్షల బీమా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: రైతుల మాదిరిగానే మత్స్యకారులకూ రూ.5లక్షల బీమా పథకం అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారు(ముదిరాజ్)లను బీసీ–ఏలో చేరుస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీభవన్లో ఫిషరీ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, కానీ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని, తెలంగాణలోని మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా? అని ప్రశ్నించారు. నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేసి పేదలను దోచుకుంటున్నారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ చేపపిల్లల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమేనని, తమ హయాంలో మత్స్యకార సంఘాల ద్వారా డిపార్ట్మెంట్ నుంచే పంపిణీ జరిగేదని గుర్తు చేశారు. ప్రచారం చేసుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని, కానీ టీఆర్ఎస్ అన్నీ తానే తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. గన్పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూప రూపకర్త పద్మశ్రీ ఎక్కా యాదగిరిరావుని ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ఎక్కా యాదగిరిరావును పిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి పాల్గొన్నారు. -
చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులు
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులున్నాయని, దళారుల పెత్తనాన్ని సహించేది లేదని మత్య్స, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. చేపల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని సోమవారం బేగంపేట హరిత ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు, చేపల చెరువుల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా చేయూతనిస్తుందని చెప్పారు. అన్ని వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని చెరువుల వల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. వివిధ మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మధ్య విభేదాల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలకు మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసి.. 18 ఏళ్లు నిండిన మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం ఆరు ఉత్తమ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మెమెంటోలు, 15 నూతన సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు. -
World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నరసాపురంలో నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదవండి: ఏసీ.. మేడిన్ ఆంధ్రా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కడలి పుత్రులందరికీ శుభాకాంక్షలు. సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నేడు నరసాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2022 -
మత్స్యకారుల జీవితంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
నాలుగేళ్లుగా నాన్న కోసం.. సముద్రంలో దారి తప్పి పాకిస్థాన్లో బందీలుగా..
అమలాపురం టౌన్: అది 2018 నవంబర్ 29వ తేదీ. మంగళూరు సముద్ర తీరం నుంచి 22 మంది మత్స్యకారులతో అరేబియా సముద్రంలో చేపల వేటకు బోటు బయలుదేరింది. వీరిలో 20 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు. మిగిలిన ఇద్దరూ మన జిల్లా వారు. వారు చేపల వేట సాగిస్తున్న బోటు అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి అనుకోకుండా ప్రవేశించింది. చదవండి: హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత! అలా ఆ దేశ సముద్ర సరిహద్దు గస్తీ పోలీసులకు ఈ 22 మంది మత్స్యకారులూ పట్టుబడ్డారు. ఆ దేశంలో బందీలుగా మారిపోయారు. ఆ 22 మందిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది గుర్తింపు కార్డులూ సక్రమంగా ఉండటంతో ఆ దేశ చెర నుంచి కొద్ది నెలలకే విడుదలయ్యారు. మన జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన పెమ్మాడి నారాయణరావు, కాట్రేనికోన మండలం గచ్చకాయలపొరకు చెందిన మూదే అన్నవరం ఇంకా ఆ దేశంలో బందీలుగానే మగ్గిపోతున్నారు. వీరికి వేట బోట్ల పరంగా గుర్తింపు కార్డులు లేకపోవడంతో నాలుగేళ్లుగా కరాచీ జైలులో మగ్గుతున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. హిందీలో ఉత్తరాలు రాయిస్తూ.. ఆధార్ కార్డులో తప్ప నారాయణరావు, అన్నవరం ఫొటోలు తీయించుకున్న సందర్భాలు కూడా అంతగా లేవు. దీంతో వారి పాత ఫొటోలనే చూసుకుంటూ ఆయా కుటుంబ సభ్యులు తమ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. నారాయణరావు, అన్నవరం ఉత్తరాలు రాసేంత అక్షరాస్యులు కూడా కారు. నారాయణరావు మాత్రం హిందీ భాషలో ఎవరితోనో చాటుగా ఉత్తరం రాయించి చివర సంతకాలు చేసి పోస్టు చేయిస్తున్నాడు. అప్పుడప్పుడూ వస్తున్న ఆ ఉత్తరాలను ఇక్కడ హిందీ భాష తెలిసున్న వారితో చదివించుకుని, అతడి కుటుంబీకులు కొంత తృప్తి పడుతున్నారు. మరో మత్స్యకారుడు అన్నవరం నుంచి అతడి కుటుంబీకులకు అటువంటి ఉత్తరాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల అన్నవరం ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోందని, అతడి పరిస్థితి చూస్తే బాధనిపిస్తోందని తోటి బందీ నారాయణరావు తన కొడుకు దుర్గాప్రసాద్కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అన్నవరానికి కుమార్తె మాత్రమే ఉంది. ఆమె ముమ్మిడివరం మండలం కొత్తలంకలో ఉంటోంది. ఆమె కూడా తన తండ్రి కోసం తల్లడిల్లుతోంది. రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు రాష్ట్ర రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ‘రిలేషన్ ఫ్యామిలీ లింక్స్’ కార్యక్రమంలో భాగంగా పాక్లో బందీ అయిన నారాయణరావుతో కోనసీమలోని అతడి కుటుంబీకులకు ఉత్తరం రాయించి, ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ ద్వారా ఇక్కడి వారికి అందే ఏర్పాటు చేసింది. అలాగే నారాయణరావు కుమారుడు దుర్గాప్రసాద్ కూడా తన తండ్రికి రాసిన ఉత్తరాన్ని రెడ్క్రాస్ సొసైటీ పాక్ చెరలో ఉన్న నారాయణరావుకు పంపించే ఏర్పాటు చేసింది. నారాయణరావుకు భార్య, కుమారుడు దుర్గా ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. దుర్గా ప్రసాద్ కుటుంబం ఉపాధి నిమిత్తం సొంతూరు పశువుల్లంక నుంచి హైదరాబాద్కు వలస వెళ్లింది. అక్కడే అతడు వడ్రంగి మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. ఆ దేశం నుంచి తండ్రి రాసిన ఉత్తరం చూసి, ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమవుతున్నాడు. పాక్ చెర నుంచి తమ వారిని విడిపించి, తమకు అప్పగించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్కు, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. ఎదురు చూస్తున్నాను నాన్న నారాయణరావు సముద్రంలో బోట్లపై ఇతర రాష్ట్రాల్లోకి కూడా వెళ్లి కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. 2018లో వెళ్లిన నాన్న నెలలు గడస్తున్నా ఇంటికి చేరుకోలేదు. ఆరా తీస్తే పాకిస్థాన్కు బందీగా చిక్కుకుపోయాడని ఆరు నెలల తర్వాత తెలిసింది. చాలా బాధపడ్డాం. అప్పటి నుంచీ నాలుగేళ్లుగా నాన్న కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూ అప్పుడప్పుడు నాన్న మాత్రం అక్కడి నుంచి ఉత్తరాలు రాస్తున్నాడు. ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాను. తగిన ఆధారాలు సమర్పించాను. – పెమ్మాడి దుర్గాప్రసాద్, పాక్ బందీ నారాయణరావు కుమారుడు, వడ్రంగి మేస్త్రి, హైదరాబాద్ -
చంద్రబాబును ఓడించేది మత్స్యకారుడే..
వజ్రపుకొత్తూరు రూరల్: ‘అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను తొక్క తీస్తాం.. తోలు తీస్తాం... అంటూ కించపరిచిన చంద్రబాబును గంగపుత్రులు ఎన్నడూ మర్చిపోరు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓ మత్స్యకారుడే కుప్పంలో ఓడిస్తారు...’ అని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని, అందువల్లే ఆ పార్టీని ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారని చెప్పారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఈ నెల 22న వైఎస్సార్ చేయూత సొమ్ము జమ కానుందని తెలిపారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. నువ్వలరేవు జెట్టీ పనులు, రూ.700 కోట్లతో ఇంటింటికీ తాగునీటి ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయన్నారు. -
Whale Vomit: వాంతి విలువ రూ.28 కోట్లు!
తిరువనంతపురం: ఛీ.. ఏంటిది? నిజమేనా.. వాంతికి కోట్లు పలకడం ఏమిటని అవాక్కవుతున్నారా? ఏదైనా పడనిది.. పనికిరానిది తిన్నప్పుడు వాంతి రావడం సహజమే.. శరీరమే విసర్జించిన దాంట్లో విలువైనది ఏముంటుందబ్బా అని తెగ ఆలోచిస్తున్నారా? అంత బుర్రబద్దలు కొట్టుకోకండి.. ఎందుకంటే ఇది మనుషుల వాంతి కాదు.. ఓ భారీ తిమింగలానిది. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని వంజిమ్లో కొందరు జాలర్లు తాజాగా సముద్రంలో చేపల వేటకు వెళ్లగా వారి వలకు ఏదో చిక్కింది. దీంతో సంబరపడ్డ వారు వలను లాగి చూడగా అందులో ఏకంగా 28.4 కిలోల బరువైన స్పర్మ్ వేల్ వాంతి కనిపించింది! అంతరించే దశలో ఉన్న ఈ జాతి తిమింగలాలకు చెందిన పదార్థాలను విక్రయించడాన్ని కేంద్రం వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద నిషేధించడంతో జాలర్లు పోలీసులకు అప్పగించారు. వారు దాన్ని అటవీ అధికారులకు ఇవ్వగా ఆ అధికారులు అది తిమింగలం వాంతా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు రాజీవ్గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి తరలించారు.పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగించే తిమింగలం వాంతి కిలో ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. కోటి వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన జాలర్లకు దొరికిన తిమింగలం వాంతి విలువ రూ. 28 కోట్లకుపైనే ఉంటుందని లెక్కగట్టాయి. ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
చేపల చెరువుల్లో కాసుల వేట
ఇది జనగామ జిల్లాలోని తరిగొప్పుల చెరువు. ఇందులో వల వేస్తే దొరికే చేపల్ని ఏరడానికి రెండు చేతులూ చాలవంటారు ఇక్కడి మత్స్యకారులు. కానీ సంవత్సరం క్రితం వదిలిన చేపపిల్లలు ఇప్పటికీ పిల్లలుగానే ఉన్నాయని, బరువు పెరగలేదని దోసిలి చిన్నబోతోందని అంటున్నారు. మెదక్ చెరువులో ఎదిగీ ఎదగని చేపపిల్లల్ని చూపుతున్న వీరిద్దరు గంగారాం, వెంకటేశ్. ఏడాది పాటు పిల్లల్ని పోసి పెంచితే..చేపలు అరకిలో మేరకైనా బరువు పెరగలేదని, దోసిలైనా నిండలేదని వాపోతున్నారు. ఏడాదిశ్రమ వృథా అయిందని వీరంటున్నారు. శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) చేపా చేపా ఎందుకు ఎదగలే అంటే.. పూర్తిగా ఊపిరి పోసుకోకుండానే పంపిణీ చేశారు.. అదను దాటాక నన్ను చెరువులోకి పంపారంటోంది. మండు వేసవిలోనూ కృష్ణా, గోదావరి నీళ్లతో కళకళలాడే 28,704 నిండు చెరువులు, కుంటల ద్వారా నీలి విప్లవం సాధన దిశగా ప్రభుత్వం వేసిన అడుగులను ఇంటి దొంగలే దారి మళ్లించారు. ఎక్కడికక్కడ నిబంధనలకు తిలోదకాలిచ్చి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఫలహారంలా పంచుకుతిన్నారు. చెరువును, చేపను నమ్ముకున్న వారిని వంచన చేశారు. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు లాభపడితే, నెలల తరబడి శ్రమించిన గంగపుత్రులు, ముదిరాజ్లు దగాపడ్డారు. కూలీ కూడా గిట్టుబాటు కాలేదు రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత (100 శాతం సబ్సిడీ) చేపపిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2021–22 వార్షిక సంవత్సరానికి గాను సుమారు రూ.93 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని మత్స్య సహకార సంఘాలకు 89.09 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశారు. అయితే విత్తన చేపల్లో 40 శాతానికి పైగా చెరువుల్లో వేయగానే మరణించగా, ప్రాణంతో మిగిలిన చేపలను ఎంతో జాగ్రత్తగా పెంచినా ఎక్కడా ఒక్క చేప కూడా 500 గ్రాములకు మించి బరువు పెరగలేదు. ఫలితంగా ఏడాదంతా కష్టపడిన మత్స్యకారులకు కూలీ కూడా గిట్టుబాటు కాకపోగా, అనేక చోట్ల ఎదగని చేపలను పట్టకుండా చెరువుల్లోనే వదిలేశారు. చచ్చిన పిల్లలకూ లెక్కలు చేప పిల్లల పంపిణీని జూన్ – జూలై మాసాల్లో మొదలు పెడితే చెరువులు, కుంటల్లో నీళ్లు తగ్గే మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఎదిగిన చేపలు పట్టేందుకు అనుకూలమైన సమయం. ఆ తర్వాత వర్షాలు వస్తే చెరువులు, కుంటలు పొంగి పొర్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే గత ఏడాది చేప విత్తనాల (పిల్లల) కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం నుంచే కొందరు పెద్దలు, అధికారులు కాసుల వేట ప్రారంభించారు. రాష్ట్రంలోని చెరువుల్లోనే చేప పిల్లలను ఉత్పత్తి చేయాలనే నిబంధన పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్టు దక్కేలా చూసే క్రమంలో ఏకంగా ఆరుసార్లు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టులు పొందిన ఇతర రాష్ట్రాల వారు డ్రమ్ములు, ట్యాంకర్ల ద్వారా విత్తనాలు సరఫరా చేశారు. తీరిగ్గా సెప్టెంబర్, అక్టోబర్లో చెరువుల్లో వదిలారు. అప్పటికే అనేక చేప పిల్లలు మృత్యువాత పడ్డా వాటిని కూడా చెరువుల్లో కలిపేసి లెక్కలు రాసుకున్నారు. సైజు, నాణ్యతలోనూ రాజీ విత్తన చేప పిల్లలను 35– 40 (చిన్న చెరువులు, కుంటలకు), 80–100 (పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు) మిల్లీమీటర్ల (పొడవు) చొప్పున రెండురకాల సైజుల్లో కొనుగోలు చేయాలని నిర్ణయించినా ఎక్కడా నిబంధనలు అమలు కాలేదు. పైగా సైజుతో పాటు పిల్లల నాణ్యతలో కూడా రాజీ పడిపోయారు. ఓ వైపు కాలం దాటాక చెరువుల్లో వేయటం, చిన్న సైజు.. సరిగ్గా అభివృద్ధి చేయని విత్తనాలను (నాణ్యత లేని చేప పిల్లలు) చెరువుల్లో వదలటం వల్ల ఆశించిన దిగుబడిలో సగం కూడా లేదని మత్స్య సహకార సంఘాలు వాపోతున్నాయి. అదను దాటినా నాణ్యమైన చేప పిల్లలను వదిలితే 6–8 మాసాల్లోనే ఒక్కో చేప కిలో నుండి కిలోంబావు వరకు తూకం వచ్చేది. కానీ సగటున 450 గ్రాములు కూడా తూగటం లేదు. వాస్తవానికి గతంలో ప్రభుత్వమే చేప పిల్లలను ఉత్పత్తి చేసి సంఘాలకు ఇచ్చేది. కానీ గత కొన్నేళ్లుగా విత్తనాల పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీని వెనుక కూడా భారీ మతలబు ఉందనే ఆరోపణలున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రు కొండ మంగలి కుంట చెరువులో గతేడాది ఆగస్టు నెలలో బంగారు తీగ, బొచ్చ, రవ్వ రకాల చేప పిల్లలను వదిలారు. ఒక్కో చేప కేవలం 100 నుంచి 150 గ్రాములు మాత్రమే పెరిగింది. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో వేసిన 7.20 లక్షల చేప పిల్లల్లో 50 శాతం మాత్రమే బతికాయి. భారీగా ఎదిగిన ‘ప్రైవేటు’ పిల్లలు మా తపాలఖాన్ చెరువులో గత సెప్టెంబర్లో 80 వేల చేపపిల్లలు (బొచ్చ, బంగారుతీగ, రవ్వ) వదిలారు. అన్నీ బాగా ఉంటే ఆర్నెల్లలో కిలోకు పైగా తూగాలి. కానీ ఈ రోజుకు 100 గ్రాములకు కూడా పెరగలేదు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసినా మాకు ఏ ప్రయోజనం లేదు. మేము జగిత్యాల నుండి సొంత ఖర్చుతో ప్రైవేటు వ్యక్తుల నుండి తెచ్చిన పిల్లలు భారీ సైజు వచ్చాయి. – బాలయ్య, తున్కిఖల్సా, వర్గల్, సిద్దిపేట జిల్లా -
విశాఖ: మత్స్యకారుల వలకు భారీగా చిక్కిన చేపలు (ఫొటోలు)
-
దివ్య ఔషధం.. 'కచిడి'.. 25 కిలోల చేప ఖరీదు రూ.4 లక్షలు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కచిడి’.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో, ఖరీదైన వైన్ను శుభ్రం చేయ డంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. అదృష్టవంతులకే ‘గోల్డ్ ఫిష్’ తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి, అద్దరిపేట నుంచి సఖినేటిపల్లి, పల్లిపాలెం, పశ్చిమగోదావరి జిల్లాలోని పేరుపాలెం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులలో అదృష్టవంతుల వలకే కచిడి చేప చిక్కుతుందంటుంటారు. ఈ కచిడి చేపను బ్లాక్ స్పాటెడ్ (క్రోకర్) లేదా సీగోల్డ్, గోల్ ఫిష్గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం.. ప్రోటోనిబియా డియాకాన్తస్. ఇండో ఫసిఫిక్, బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే కచిడీ జీవిస్తోంది. ఈ రకం చేపలకు ప్రకృతి ప్రసాదించిన వాయుకోççశం (ఎయిర్ బ్లాడర్) ఉండటంతో సముద్రాలను ఈదడంలో ఇవి మహా నేర్పరులు. కచిడీ కోసం ఎగుమతిదారుల క్యూ.. ఈ చేపలను కాకినాడ, ఓడలరేవు, ఉప్పాడ, పల్లిపాలెం తదితర ప్రాంతాల్లో స్థానిక మార్కెట్కు తీసుకువస్తున్నారు. ఈ చేపలకున్న డిమాండ్ దృష్ట్యా వీటి కొనుగోలుకు అటు ఉత్తరాంధ్ర.. ఇటు నెల్లూరు జిల్లా నుంచి ఎగుమతిదారులు స్థానిక మార్కెట్ల్లకు క్యూ కడుతున్నారు. ఈ చేప 40 కిలోల వరకు బరువు ఉంటోంది. 10 కిలోలు దాటితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. బాగా తక్కువలో తక్కువగా అంటే రూ.50 వేలు ఉంటుంది. 25 కిలోల మగ చేప రూ.4 లక్షలకు అమ్ముడుపోయిందంటే వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. శస్త్రచికిత్సల్లోనూ.. కచిడీ చేపలో కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి రుచి, వాసన ఉండదు కానీ ఘనపదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది. దీనిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే శ్రేష్టమైన జెలాటిన్ను ఆహార ఉత్పత్తులు, మందుల తయారీ, కాస్మెటిక్స్, విలువైన పదార్థాల ప్యాకింగ్లో వినియోగిస్తున్నారు. అలాగే కాప్యూల్స్ (మందు గొట్టాలు) పైన ఉపయోగించే ప్లాస్టిక్లాంటి పదార్థంలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. విదేశాల్లో పొట్ట భాగంలో శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు వినియోగించే దారం తయారీ, ఖరీదైన వైన్ను శుభ్రం చేసేందుకు కూడా వినియోగిస్తున్నారు. మగచేప కండ, శరీర భాగాలు, పొట్ట భాగం, పొలుసుకు కూడా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. చెన్నై, కోల్కతాల నుంచి విదేశాలకు ఎగుమతి కచిడీ చేపలను మన రాష్ట్రం నుంచి చెన్నై, కోల్కతా రేవులకు తరలించి.. అక్కడ ప్రాసెసింగ్ చేసి యూరప్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, జపాన్, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఈ చేపల విక్రయాలకు ముందే (ఆడ, మగ) గ్రేడింగ్ చేస్తారు. మగ చేప పొట్ట భాగాలను ఎగుమతికి అనుగుణంగా ప్యాకింగ్ చేస్తారు. మగ చేప చిన్న రెక్కలతో గరుకుగా, బంగారు రంగులో ఉండటంతో వాటిని విదేశాలకు పంపుతారు. పొట్ట భాగం ఆడ చేప కంటే మగ చేపకు గట్టిగా ఉంటుంది. ఈ లక్షణాలున్న చేపలను ఎగుమతి కోసం వేరు చేస్తారు. ఔషధ గుణాలతోనే డిమాండ్ కచిడీ చేపకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో యూరప్ తదితర దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ చేప సముద్రపు లోతుల్లో ఎక్కువగా ఉంటుంది. కచిడీలో సహజంగా ఉండే కొలాజిన్తోపాటు పొట్ట, వాయుకోశాలను పలు ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. మగ చేపల్లో వాయుకోశం పెద్దవిగా ఉండటంతో కచిడీ చేపలకు డిమాండ్ ఎక్కువ. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కోనసీమ పులసలను మించి.. గోదావరి జిల్లాల్లో వరదలప్పుడు సీజనల్గా వచ్చే పులస చేపలను ఈ కచిడి చేప అధిగమిం చేస్తోంది. అద్భుతమైన రుచిని ఇచ్చే కచిడి చేపను ధనవంతులు కూడా కొనలేరంటే అతిశయోక్తి కాదు. ఇక మగ చేప ఖరీదు వింటే గుండె గుభేల్మనడం ఖాయం. మగ చేపలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అటువంటివి మరి. అందుకే విదేశాల్లో ఈ చేపకు విపరీతమైన డిమాండ్. ఎన్ని లక్షలైనా లెక్క చేయకుండా మగ చేపను కొనుక్కుపోతున్నారు. మగ, ఆడ చేపల మధ్య ధరల్లో, డిమాండ్లో చాలా వ్యత్యాసం ఉంది. సముద్రపు లోతులే కచిడి చేపల ఆవాసం. -
Eel Fish: పాము చేపను ఎప్పుడైనా చూశారా..?
కొమ్మాది(విశాఖపట్నం): సాగర్నగర్ తీరంలో పాము ఆకారంలో ఉన్న ఈల్ చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయి. వీటిని చూసిన పర్యాటకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఇవి పాము ఆకారంలో ఉండే చేపలని వీటిని ఈల్ అని పిలుస్తారని, ఇవి తినేందుకు కూడా ఉపయోగిస్తారని మత్య్సకారులు చెప్పడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: యూట్యూబ్ వీడియోలు చూసి.. అర్ధరాత్రి ఏంచేశాడంటే? -
మత్స్యకారులకు మంచి రోజులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయి. మత్స్య సంపదను మార్కెట్కు తరలించే సందర్భంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా దళారులకు చెక్ పెట్టేందుకు ఐస్ ప్లాంట్లు, హేచరీలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో ఇటీవలే సాత్వా, ఢిల్లీ నుంచి అవస్థాపన బృంద సభ్యులు దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లోని పలు తీర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో నాబార్డు నిధులతో కొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. మత్స్య సంపదే కీలకం కృష్ణా జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో మత్స్య సంపదపైనా ఆధారపడి 1,12,977 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో 111 కిలోమీటర్ల మేర సముద్రంలో చేపల వేట సాగుతోంది. 2020–21 నివేదిక ప్రకారం కృష్ణా జిల్లా నుంచి 13.83 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తీరప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు నాబార్డుకు అనుబంధంగా పనిచేస్తున్న సాత్వా, ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) బృందాల సభ్యులు దివిసీమలోని తీర గ్రామాలైన నాగాయలంక, కోడూరు మండలాల్లో ఇటీవల పర్యటించారు. నాబార్డు, సాత్వా బృంద సభ్యులు నీల్, అభిషేక్, పీఎంఎఫ్ఎంఈకి సంబంధించి కార్తికేయరెడ్డితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం కోడూరు మండలం బసవానిపాలెం, పాలకాయతిప్ప, నాగాయలంక మండలం జింకపాలెం, నాచుగుంట్ల గ్రామాల్లో పర్యటించింది. తొలగనున్న సమస్యలు 35 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించేందుకు నాబార్డు ముందుకొచ్చినట్టు బృంద సభ్యులు చెప్పారు. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, హేచరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అవనిగడ్డతోపాటు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోనూ వీటి అమలుకు చర్యలు తీసుకుంటామని బృందాల ప్రతినిధులు చెప్పారు. ఇవి కార్యరూపం దాలిస్తే జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. -
వాసాలతిప్పలో ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేప!
సాక్షి, తూర్పుగోదావరి: ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో మనిషి ముఖంతో పోలిన రూపంతో ఉన్న అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. సోషల్ మీడియాలో ఈ చేప వైరల్గా మారింది. విచిత్రం ఏమిటంటే.. తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా ఉబ్బుతుంది. అందుకే దీన్ని బెలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ తదితర పేర్లతోనూ పిలుస్తారు. ఇది చూసేందుకు మూములుగానే ఉంటుంది. కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా (ఉబ్బుతుంది)మారిపోతుంది. అందుకే బెలూన్ ఫిష్ అంటారు. చేప అలా ఉబ్బిపోగానే.. దాన్ని తినడానికి వచ్చిన జీవులు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతాయి. టెట్రాడాంటిడీ జాతికి చెందిన ఈ చేప శాస్త్రీయ నామం టెట్రాడాన్ ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపగా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. జపాన్కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’. జపాన్లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో దీన్ని ఎక్కువగా వండుకుని తింటారు. జపాన్, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్లు ఈ చేపలతో టేస్టీ ఆహారం సిద్ధం చేస్తారు. ఈ చేపను వండాలంటే సుమారుగా పదేళ్ల అనుభవం, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలి. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ విషం వల్ల ప్రాణాలకే ప్రమాదకరం. -
మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం
సాక్షి, అమరావతి: మత్స్యకారులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయి. మత్స్యకారులే కాదు.. వివిధ సామాజికవర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో రెట్టింపు ఆదాయం ఆర్జనే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు కేంద్ర సముద్ర మత్స్య ఉత్పత్తుల పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతిపెద్ద సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రంలో సముద్ర సాగును విస్తరించేందుకు అపార అవకాశాలున్నాయని సీఎంఎఫ్ఆర్ఐ గుర్తించింది. ఆ దిశగా కల్చర్ చేయతగ్గ జాతుల సంఖ్య, విత్తనోత్పత్తి పెంపొందించడంతో పాటు ఆదాయం పెరిగేలా సాంకేతికతను జోడిస్తోంది. మెరైన్, మారీ కల్చర్లో పరిశోధన, శిక్షణపై ప్రత్యేకదృష్టి సారించింది. సంప్రదాయ వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కేజ్ కల్చర్ను ప్రోత్సహిస్తోంది. అందుబాటులో ఉన్న ఉప్పునీటి ప్రాంతాల్లో కేజ్ కల్చర్ ద్వారా ఎక్కువ దిగుబడులను సాధించేలా సాంకేతికను అభివృద్ధి చేసింది. కేజ్ కల్చర్ ద్వారా ఇండియన్ పాంపినో, ఆసియన్ సీ బాస్, ఆరంజ్ స్పాటెడ్ గ్రూపర్ వంటి సముద్ర మత్స్య ఉత్పత్తులను ఎస్సీ, గిరిజన సబ్ ప్లాన్ కార్యక్రమాల ద్వారా మత్స్యకారులతో పాటు భూమిలేని ఆక్వా రైతులకు పరిచయం చేసింది. తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్టుబడితో రైతులకు రెట్టింపు ఆదాయం (డీఎఫ్ఐ)పై ప్రత్యేక ప్రొటోకాల్ రూపొందించి శిక్షణ ఇస్తోంది. సముద్రపు ఫిష్ల కేజ్ కల్చర్పై సాంకేతిక పరిజ్ఞానం, కేజ్ ఫాబ్రికేషన్, ఇన్స్టలేషన్ సహా కేజ్ కల్చర్, దాణా, వ్యాధులు, తెగుళ్లు, ఆర్థిక వనరుల నిర్వహణపై ఇస్తున్న శిక్షణ సత్ఫలితాలనిస్తోంది. సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతికతతో సముద్ర జలాల్లో చేపల పెంపకం ద్వారా ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో వేలాది కుటుంబాల జీవనప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో గుర్తించారు. గతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఆదాయంతో వారిలో పొదుపు, కొనుగోలు శక్తిసామర్థ్యాలు పెరిగినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు సీఎంఎఫ్ఆర్ఐ అభివృద్ధి చేసిన సాంకేతికతతో తమ రాష్ట్రాల్లో మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో తీరప్రాంత రాష్ట్రాలు సీఎంఎఫ్ఆర్ఐతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయి. అప్పులన్నీ తీర్చేశాం మాది ఉమ్మడి కుటుంబం. యానాది (ఎస్టీ) తెగకు చెందిన వాళ్లం. చేపలు పట్టడం తప్ప మాకు ఏమీ చేతకాదు. ఇంటిల్లపాది ఇదేపని చేస్తాం. తీర ప్రాంతంలో ఉప్పునీటి కయ్యల్లో చేపలు పట్టుకుని జీవిస్తుండేవాళ్లం. ఎంత కష్టపడినా నెలకు రూ.ఏడెనిమిది వేలకు మించి వచ్చేది కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు సీఎంఎఫ్ఆర్ఐ వారిచ్చిన శిక్షణ వల్ల నేడు రెండు బోనుల్లో పండుగప్ప (సీ బాస్) సాగుచేస్తున్నాం. 10 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. కిలో రూ.300 చొప్పున అమ్మగా రూ.మూడు లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.రెండు లక్షలు మిగిలాయి. మా ఆదాయం ఏకంగా మూడింతలు పెరిగింది. అప్పులన్నీ తీర్చేశాం. చాలా ఆనందంగా ఉంది. – గంధం నాగరాజు, కాంతమ్మ, పెద్దింటమ్మ, లక్ష్మీపురం, కృష్ణాజిల్లా రూ.3 లక్షలు మిగులుతున్నాయి నేనో రియల్ ఎస్టేట్ వ్యాపారిని. బాగుంటే నాలుగు డబ్బులొచ్చేవి. లేకుంటే నెలల తరబడి ఖాళీగా ఉండాల్సి వచ్చేది. చేపల సాగుపై నాకు ఎలాంటి అవగాహన లేదు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం, సీఎంఎఫ్ఆర్ఐ అందించిన సాంకేతిక సహకారంతో సముద్రపు చేపల చెరువుల పెంపకంపై దృష్టిసారించా. కేజ్ కల్చర్లో ఇండియన్ పాంపినో సాగుచేస్తున్నా. ఏటా రూ.తొమ్మిది లక్షలు ఆర్జిస్తున్నా. ఖర్చులు పోను రూ.మూడు లక్షలు నికరంగా మిగులుతున్నాయి. – ఎస్.టి.కృష్ణప్రసాద్, కొమరిగిరిపట్నం, తూర్పుగోదావరి రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నారు సీఎంఎఫ్ఆర్ఐ అభివృద్ధి చేసిన సాంకేతికతను ప్రభుత్వ సహకారంతో క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం. ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని తీరగ్రామాల్లో వందలాది మంది మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాం. సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతికతతో సాగుచేస్తున్న రైతులు రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నట్టుగా మా అధ్యయనంలో గుర్తించాం. – డాక్టర్ సుభదీప్ ఘోష్, హెడ్, సీఎంఎఫ్ఆర్ఐ -
Fishermen: నూక తాతకు వింత మొక్కులు
నక్కపల్లి(పాయకరావుపేట): వింత ఆచారాలు.. వినూత్న సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి. వాటి వెనుక ఉన్న చరిత్ర ఆసక్తి కలిగిస్తుంది. ఈ కోవకే చెందుతుంది నూకతాత పండగ. రాజయ్యపేటలో కనీవినీ ఎరుగని వింత ఆచారంతో ఏటా ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాదీ మత్స్యకారులంతా భక్తి శ్రద్ధలతో.. ఘనంగా ఈ పండగ నిర్వహించారు. చదవండి: అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి మత్య్సకారులు అధికంగా ఉండే రాజయ్యపేటలో మహా శివరాత్రి మరుసటి రోజు నూకతాత పండగ జరుగుతుంది. నూక తాతను గంగపుత్రులు తమ కులదైవంగా భావిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కొనసాగించారు. బుధవారం నూకతాత విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకెళ్లారు. తిరిగి ఆలయానికి విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో భక్తులు రోడ్డుపై పడుకున్నారు. వీరి పై నుంచి విగ్రహాలను చేతపట్టిన పూజారులు దాటుకుంటూ వెళ్లారు. ఇలా పడుకుని మొక్కులు చెల్లించుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరుతాయనేది ఇక్కడి మత్య్సకారుల నమ్మకం. నూకతాత పండగలో జంతు బలి నిషేధం. రక్తం చిందించడాన్ని నూకతాత ఒప్పుకోడని మత్య్సకారులు చెబుతారు. ఈ పండగ పురస్కరించుకుని గ్రామంలో పెద్ద తిరునాళ్లు జరిగింది. భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. బాణసంచా సంబరాలు మిన్నంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అదిరిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా నూకతాత పండక్కి రాజయ్యపేట చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో గంగపుత్రుల ఇళ్లన్నీ సందడిగా మారాయి. -
Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే?
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం కచ్చిడి చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఓ వ్యక్తి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇదే తీరంలో ఈ నెల 5న ఓ కచ్చిడి చేపను రూ.4.30 లక్షలకు ఓ వ్యాపారి కొన్నాడు. నెల వ్యవధిలోనే మరో చేప అదే స్థాయిలో ధర పలకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం -
ఆ జీవోపై పవన్కు అవగాహన లేదు
కాశీబుగ్గ/రేపల్లె రూరల్: జీవో 217 వల్ల మత్స్యకారులకు మరింత లాభం కలుగుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. జీవో 217కు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎటువంటి సంబంధం లేదన్న విషయం కూడా తెలియని అజ్ఞాని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అని ధ్వజమెత్తారు. ఈ జీవోను ఎందుకు తప్పుపడుతున్నారో, దానివల్ల మత్స్యకారులకు జరిగే నష్టం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నరసాపురంలో జరిగింది మత్స్యకార సభ కాదని, సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల సమస్యలపై అవగాహనలేని పవన్సినిమా స్క్రిప్టులు, చంద్రబాబు స్క్రిప్టు చదువుతూ మభ్యపెడుతున్నారని చెప్పారు. మంత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలోను, ఎంపీ గుంటూరు జిల్లా రేపల్లెలోను ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇంతకుముందు ఇన్ల్యాండ్ వాటర్ బాడీస్లో మత్స్యకారుల పేరుచెప్పి అధికారపార్టీ దోపిడీ చేసేదని, వారికి రూపాయి కూడా దక్కేది కాదని చెప్పారు. మత్స్యకారుల నోటికాడ తిండిని పెట్టుబడిదారులు, దళారులు కొట్టేసి ఏడాదికి రూ.300, రూ.వెయ్యి చేతిలో పెట్టేవారన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు, మత్స్యకార సొసైటీలో ప్రతి సభ్యుడికి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా చూసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 217 జీవో తీసుకొచ్చారని చెప్పారు. ఈ జీవోను పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్నామని, 27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లామని తెలిపారు. వాస్తవంగా తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయని, వేల ఎకరాల చెరువులు, ట్యాంక్లు సొసైటీల పరిధిలో ఉండటం లేదని చెప్పారు. దీంతో వాటిపై వచ్చే ఆదాయం దళారీ వ్యవస్థకే చెందుతోందన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి ఆ ఫలసాయాన్ని సొసైటీల ద్వారా మత్స్యకారులకు అందించేందుకు ఈ జీవో ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. దీనిపై అవగాహనలేని పవన్కల్యాణ్ ఆ జీవోను చించేశానంటున్నాడని ఎద్దేవా చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బతుకులు మార్చేందుకు చేపల అవుట్ లెట్లతో విక్రయాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మత్స్యకారులకు మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేయడం తగదన్నారు. ఊరి చివర ఈగల మధ్యలో విక్రయాలు చేసే అవస్థ రాకుండా మత్స్యకార యువకులకు శిక్షణ ఇచ్చి, సబ్సిడీ రుణాలు అందించి అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. యువకులకు ఉపాధి కల్పిస్తుంటే ప్రభుత్వం చేపలు అమ్ముతోందని ఎద్దేవా చేయడం సబబు కాదన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించే వారెవరైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యల గురించి అప్పట్లో చంద్రబాబుకు విన్నవిస్తే.. తొక్కతీస్తామన్నారని, ఆ సమయంలో పవన్ స్పందించలేదని గుర్తుచేశారు. పవన్ అవగాహన లేకుండా 215, 217 జీవోలపై జెట్టి, గంగమ్మ పూజలు, ఫిషింగ్ హార్బర్ అంటూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మత్స్యకారులు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. -
సాగునీటి వనరుల్లో మత్స్య సిరులు
సాక్షి, అమరావతి: సాగునీటి వనరుల్లో సహజ మత్స్య సంపద క్రమేపీ పెరుగుతోంది. ఏడేళ్లలో సహజ మత్స్య దిగుబడులు రెండున్నర రెట్లు పెరిగాయి. 2014–15లో సహజ మత్స్య దిగుబడి 12 లక్షల టన్నులు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2020–21 నాటికి 29.75 లక్షల టన్నులకు పెరిగింది. దీనిని మరింతగా పెంపొందించేందుకు మత్స్యకార సొసైటీలను బలోపేతం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అపారమైన వనరులు రాష్ట్రంలో ఉన్న మంచినీటి వనరుల్లో చేపల, రొయ్యల పెంపకం (ఆక్వా కల్చర్) 11 శాతం కాగా.. పంచాయతీ, మైనర్ ఇరిగేషన్ చెరువులు 11 శాతం, రిజర్వాయర్లు 9 శాతం, నదులు, కాలువలు 63 శాతం మేర విస్తరించి ఉన్నాయి. పంచాయతీ చెరువులు మినహాయిస్తే 1,24,151 హెక్టార్లలో రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం 74,491 హెక్టార్లు (60%) విస్తీర్ణంలో మాత్రమే సహజ మత్స్య సిరులు లభ్యమవుతున్నాయి. హెక్టారుకు 100 కేజీల చొప్పున ఏటా 7,449 టన్నుల సహజ మత్స్య సిరులను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కేవలం 2,555 టన్నులు మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఇక మధ్యస్థ, పెద్ద రిజర్వాయర్ల ప్రాంతం 1,60,907 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 161 హెక్టార్లలో మాత్రమే సహజ మత్స్య ఉత్పత్తి లభిస్తోంది. అందుబాటులో ఉన్న రిజర్వాయర్ విస్తీర్ణాన్ని బట్టి ఏటా మరో 1,93,088 టన్నుల ఉత్పత్తిని ఒడిసిపట్టే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. 1,771 సొసైటీలు.. 1.72 లక్షల మంది మత్స్యకారులు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పంచాయతీ చెరువులు, సాగునీటి చెరువులు, రిజర్వాయర్లలో మేత, మందులు వేయకుండా సహజ మత్స్య పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలుగా ఏర్పడిన స్థానిక యువతకు లీజు పద్ధతిన పంచాయతీల ద్వారా చెరువులను కేటాయిస్తారు. వీటిలో చేప పిల్లలను సహజసిద్ధంగా పెంచుకొని జీవనోపాధి పొందేలా అవకాశం కల్పిస్తారు. కాగా, జల వనరుల శాఖ అధీనంలో ఉన్న సాగు నీటి చెరువులను మత్స్య శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించి ఎంపిక చేసిన వారికి లీజు పద్ధతిలో కేటాయిస్తుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో 1,771 మత్స్యకార సహకార సంఘాల్లో 1,72,141 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. వీరిలో 601 మహిళా మత్స్యకార సహకార సంఘాలు కూడా ఉన్నాయి. వాటి పరిధిలో 32,826 మంది సభ్యులున్నారు. ఆక్వా హబ్లతో సొసైటీలు బలోపేతం మత్స్యకార సొసైటీలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ గ్రామంలో ఎన్ని సొసైటీలున్నాయి, వాటి పరిధిలో ఎంతమంది మత్స్యకారులు, నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారో గుర్తిస్తున్నారు. ఆ వివరాలను మత్స్య శాఖ వెబ్సైట్లో పొందుపరుస్తోంది. సొసైటీలకు అవసరమైన ఆర్థిక చేయూత ఇవ్వడంతో పాటు సాగులో మెళకువలపై మత్స్య సాగు బడిలో శిక్షణ ఇస్తోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సొసైటీల్లో ఉండే మత్స్యకారులకు అవసరమైన వలలు, ఇతర పరికరాలను అందిస్తోంది. సహజ మత్స్య సంపదను ఆక్వాహబ్ల ద్వారా రిటైల్ అవుట్లెట్స్, కియోస్క్లకు సరఫరా చేసేందుకు మ్యాపింగ్ చేస్తోంది. గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సొసైటీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. వీరిలో ఆసక్తి చూపే వారికి మినీ ఫిష్ అవుట్ లెట్స్, కియోస్క్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక చేయూత ఇస్తోంది. -
వివాదానికి తెర.. మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేత
-
విశాఖ రింగు వలల వివాదం పరిష్కారంపై సమావేశం
-
విశాఖ: మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేత
సాక్షి, విశాఖపట్నం: రింగు వలల వివాదం పరిష్కారానికి మత్స్యకార సంఘాల నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు ఆదివారం చర్చలు జరిపారు. సంప్రదాయ కారులు, రింగు వలల మత్స్యకార సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని గడువు పెట్టామని తెలిపారు. రేపటి నుంచి సంప్రదాయ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొచ్చాన్నారు. సముద్రంలో 8 కి.మీ తర్వాత రింగు వలలు వాడొచ్చని పేర్కొన్నారు. అధికారులు, మత్సకార సంఘాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో రేపటి నుంచి 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: 'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది' ఇటీవల రింగు వలల వినియోగం విషయంపై సముద్రంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో మత్స్యకార సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఇరు వర్గాల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వీటిపై అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు ఈ దశలో సాంప్రదాయ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు తేల్చారు. అలాగే రింగు వలల వినియోగంపై లైసెన్స్ ఉన్న మత్స్యకారులు తీరం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో చేపలవేట కొనసాగించవచ్చని కూడా అధికారులు నిర్ణయించారు అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపలవేట సాగించినట్లయితే ఎలాంటి మత్స్య సంపద లభించదని రింగు వలల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిర్ణీత ప్రాంతంలో చేపల వేట కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను మత్స్యకారులు కోరారు. అలాంటి అనుమతులు చట్టబద్ధంగా ఇవ్వడానికి అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు కొందరు అధికారులతో కలిసి కమిటీగా ఏర్పడి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీలోగా ఈ సమస్యపై గ్రామ పెద్దల మధ్య చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రులు సూచించగా.. ఇరు గ్రామాల ప్రజలు కూడా సమ్మతించారు మరోవైపు ఉద్రిక్తతల నడుమ కొనసాగిస్తున్న 144 సెక్షన్ కూడా ఎత్తి వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మత్స్యకారులు సమన్వయంతో చేపల వేటను రేపటినుంచి కొనసాగించవచ్చని మంత్రులు ప్రకటించారు. -
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
-
విశాఖపట్నం: అట్టుడికిన తీరం..
-
విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వల వివాదం
-
ఆంధ్రా మత్స్యకారులపై తెలంగాణ అధికారుల దాడి
విజయపురిసౌత్ (మాచర్ల): పొట్టకూటి కోసం సొంత ఊరు వదిలి సుదూర ప్రాంతంలో చేపల వేట చేస్తోన్న నిరుపేద మత్స్యకారులపై తెలంగాణ అటవీ అధికారులు దాడి చేసి రూ.30 లక్షల విలువైన వలలు, పుట్టీలను దగ్ధం చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కృష్ణా నది సమీపంలో జెండాపెంట వద్ద జరిగింది. స్థానికులైన మత్స్యకారులు జీవనం కోసం కృష్ణా పరివాహక ప్రాంతమైన జెండాపెంట, పెద్దచెరువు తదితర ప్రాంతాల్లో చేపల వేట చేస్తుంటారు. ఇటీవల మార్కాపురం డీఎఫ్వో విఘ్నేశ్వర్, తెలంగాణకి చెందిన ఎఫ్డీవో రోహిత్తో పాటు పలువురు అధికారులు అనుపు జలాశయం వద్ద మత్స్యకారులతో సమావేశం నిర్వహించి కృష్ణా జలాశయంలో సాగర్ నుంచి 45 కి.మీ లోపే చేపల వేట చేయాలని సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులతో పాటు ఇతర జంతువులు సంచరిస్తున్నాయని వాటి సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినట్లు పేర్కొన్నారు. తమ 1,000 కుటుంబాలు 40 ఏళ్లుగా సాగర్లో చేపల వేట పైనే బతుకుతెరువు సాగిస్తున్నామని, కొంత పరిధిలోనే వేటను సాగిస్తే ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు– అధికారులు మధ్య చర్చలు విఫలం అవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొందరు ఫారెస్ట్ అధికారులు మత్స్యకారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అకస్మాత్తుగా అటవీ శాఖ బోటులో జెండాపెంట, పెద్దచెరువు తదితర ప్రాంతాలకు చేరుకొని మత్స్యకారులపై దాడి చేశారు. పెట్రోల్తో వలలు, పుట్టీలను దగ్ధం చేశారు. బాధిత మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన చేస్తామని తోటి మత్స్యకారులు హెచ్చరించారు. -
Andhra Pradesh: హార్బర్లు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. వర్షాలు, తుపాన్లు తగ్గడంతో పనులు ఊపందుకున్నాయి. దేశ చరిత్రలో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం రూ.3,622.86 కోట్ల పెట్టుబడి అంచనాతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మారుస్తుందని, ముఖ్యంగా మత్స్యకారుల జీవన ప్రమాణాల్లో పెనుమార్పులు తెస్తుందని ఆర్థికవేత్తలు, మత్స్యకారులు విశ్వసిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.1,509.8 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,204.56 కోట్ల విలువైన పనుల కోసం పిలిచిన టెండర్లను ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ గతేడాది డిసెంబర్లో చేజిక్కించుకుంది. ఏపీ మారిటైమ్ బోర్డుతో ఈ ఏడాది మార్చి 18న ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఈ హార్బర్ల నిర్మాణానికి అన్ని అనుమతులు రావడంతో ఈ ఏడాది జూన్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించింది. హార్బర్ నిర్మాణంలో కీలకమైన భారీ మర పడవలు తిరిగే విధంగా సముద్రం లోతును తవ్వే డ్రెడ్జింగ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తిరిగి వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. 2023 ప్రారంభం నాటికి ఈ నాలుగు హార్బర్లను అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు వారంలో మరో 5 హార్బర్లకు టెండర్లు ► రెండో దశ కింద రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా బుడగట్ల పాలెం, విశాఖపట్నం పూడిమడక, ప్రకాశం జిల్లా వోడరేవు, కొత్తపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పల్లో రూ.2,113.06 కోట్ల పెట్టుబడి వ్యయంతో హార్బర్ల నిర్మాణానికి తాజాగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ► ఈ ఐదు హార్బర్ల నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లను జ్యూడిషియల్ ప్రివ్యూకు పంపి, వచ్చే ఏడాది ప్రారంభంలో పనులు మొదలు పెట్టనున్నట్లు మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఐదు హార్బర్లు రెండేళ్లలో అందుబాటులోకి రానున్నాయి. ► మొత్తంగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా మూడు లక్షల టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్ల ద్వారా 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు దీనికి అనేక రెట్లు పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ హార్బర్ల ద్వారా మరో 10,000 మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే సామర్థ్యం లభిస్తుంది. సాకారమవుతున్న మరో హామీ ► హార్బర్ల నిర్మాణం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ సాకారమవుతోంది. ► రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ చేపల వేటకు సరైన వసతులు లేక అనేక మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోసం పశ్చిమ తీరానికి వలసపోతూ.. అక్కడ పొరపాటుగా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి బందీలుగా మగ్గుతున్న వైనాన్ని పాదయాత్ర సందర్భంగా మత్స్యకారులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మరికొంత మంది రోజువారీ కూలీలుగా వలసపోతున్నారు. ► మత్స్యకారుల కష్టాలను గమనించిన జగన్.. ముఖ్యమంత్రి కాగానే వలసలకు అవకాశం లేకుండా స్థానికంగానే ఉపాధి లభించే విధంగా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు రికార్డు స్థాయిలో తొమ్మిది హార్బర్ల నిర్మాణం చేపట్టడంపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తీరంపై ఈ స్థాయి పెట్టుబడులు ఇదే తొలిసారి తీరప్రాంత అభివృద్ధి కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల కోసం మూడేళ్లలో సుమారు రూ.25,000 కోట్లు వ్యయం చేయనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయి. మరో ఐదు హార్బర్ల నిర్మాణం కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మిస్తున్న తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, మూడు పోర్టులు అందుబాటులోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు ఇదో పెద్ద సంస్కరణ నిర్ణయం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చే పెద్ద సంస్కరణ నిర్ణయమిది. దేశ వ్యాప్తంగా అత్యంత దీనమైన జీవన ప్రమాణాలు కలిగిన వారిలో మత్స్యకారులు ఒకరు. ఈ హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకార మహిళలకు అందించే నిజమైన చేయూతగా చెప్పవచ్చు. – ప్రసాదరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఎకనామిక్స్ ఆచార్యులు ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకార సమ్మేళనంలో మాకు మాట ఇచ్చిన ప్రకారంగా అధికారంలోకి వచ్చిన వెంటనే హార్బర్ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. మేము ఇక్కడ మినీ హార్బర్ అడిగితే ఏకంగా మేజర్ హార్బర్ నిర్మాణం చేపట్టారు. హార్బర్ల నిర్మాణం వల్ల లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి. – కారే శ్రీనివాసరావు, మత్స్యకార నాయకుడు, కొనపాపపేట, తూర్పుగోదావరి జిల్లా వలస వెళ్లక్కర్లేదు మా వద్ద ఉన్న సముద్ర జలాల్లో చేపలు సరిగా దొరకడం లేదు. కుటుంబ పోషణ కోసం కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న షిషింగ్ హార్బర్లకు వెళ్లి బోట్లలో కూలీలుగా పని చేస్తున్నాం. కుటుంబానికి దూరంగా ఉంటున్నాం. జువ్వలదిన్నె షిషింగ్ హార్బర్ కడితే ఇక్కడే బోట్లు అందుబాటులో ఉంటాయి. ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన అవసరం ఉండదు. – కొమారి రాజు, మత్స్యకారుడు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా ఇక అన్నీ మంచి రోజులే ప్రస్తుతం ఉన్న ఫిషింగ్ హార్బర్లో ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. మా సమస్యను గత టీడీపీ ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారుల పట్ల ప్రేమతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేస్తే బోట్ల రాకపోకలకు ఇబ్బందులుండవు. మత్స్యకారులకు ఇక అన్నీ మంచి రోజులు రాబోతున్నాయి. – లంకే వెంకటేశ్వరరావు, మెకనైజ్జ్ బోట్స్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు -
World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ‘‘మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇక పైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.’’ అని సీఎం ట్వీట్ చేశారు. చదవండి: ఆ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుండి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇకపైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.#MatsyakaraDinotsavam — YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2021 -
ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద!
గుప్త నిధుల వేట గురించి జానపద కథల్లో చదివి ఉంటారు. కానీ చాలా అరుదుగా మత్రమే నిజజీవితంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అచ్చం కథల్లో మాదిరి.. ఇండోనేషియా మత్స్యకారులకు తాజాగా ఓ వెలకట్టలేని నిధి దొరికింది... ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ఐదేళ్లగా వేట.. ఎట్టకేలకు దొరికిన నిధి.. ఇండోనేషియా ద్వీపమైన సుమత్రాలోని పాలెంబాంగ్ సమీపంలో ఉన్న మూసీ నదిలో మొసళ్లు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి. ఇటువంటి ప్రమాదకర నదిలో గత ఐదేళ్లుగా బంగారం ద్వీపం కోసం వెదుకుతున్నారు అక్కడి మత్సకారులు. ఈ సుమత్రా దీవికి బంగారం ద్వీపం అనేపేరు కూడా ఉంది. అక్కడి ఇతిహాసాలు ఇటువంటి ఒక గుప్త నిధికి సంబంధించిన దీవి ఉన్నట్లు చెబుతున్నాయట. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. ఐతే ఇది కథకాదని నిజమని రుజువుచేసే విధంగా విలువైన రత్నాలు, నాణెలు, బంగారు ఉత్సవ ఉంగరాలు, కాంస్య గంటలు.. వంటి అరుదైన సంపదతో నిండిన ద్వీపాన్ని నిధిరూపంలో మత్స్యకారులు కనుగొన్నారు. అంతేకాకుండా 8వ శతాబ్దానికి చెందిన రత్నాలతో అలంకరించబడిన బుద్ధుని విగ్రహం కూడా ఈ నిధిలో బయటపడింది. దీని విలువ మిలియన్ల పౌండ్లు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కనుగొనబడిన అత్యంత విలువైన నిధుల్లో ఇది ఒకటని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. శ్రీవిజయ నాగరికతకు చెందినవే.. ‘ది గార్డియన్’ అనే బ్రిటీష్ డైలీ న్యూస్ పేపర్ నివేదిక ప్రకారం ఈ గుప్త నిధి శ్రీవిజయ నాగరికతకు సంబంధించింది. క్రీ.శ. 7 నుంచి 13వ శతాబ్ధం వరకు శ్రీ విజయ సాంమ్రాజ్యం ఎంతో వైభవంతో విలసిల్లింది. ఐతే కేవలం ఒక శతాబ్ధకాలంలో ఈ సామ్రాజ్యం హఠాత్తుగా కనుమరుగైపోయింది. కారణాలు ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియరాలేదు. మనదేశంతో కూడా ఈ సాంమ్రాజ్యానికి చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు పేర్కొంది. చదవండి: 'నీ అఫైర్ గురించి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’ శ్రీవిజయ సామ్రాజ్యం కల్పితం కాదు..ఆధారాలివిగో.. బ్రిటీష్ మరైన్ ఆర్కియాలజిస్టు డా. సీన్ కింగ్స్లే ప్రకారం.. ఈ సామ్రాజ్యం ఒకప్పుడు 'వాటర్ వరల్డ్' గా ప్రసిద్ధిగాంచింది. కేవలం చెక్కపడవలపై ఇళ్ళు, రాజభవనాలు, దేవాలయాలు నిర్మించారట. ఈ నాగరికత అంతరించినప్పుడు ఈ నిర్మాణాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయట. ఇప్పటికీ అక్కడి ప్రజలు చెక్క పడవలు తయారు చేసి వాడుతున్నారు. శ్రీ విజయ సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. ఈ నాగరికత ఆవిష్కరణ గురించి తెలుసుకోవడానికి థాయ్లాండ్ నుండి భారతదేశం వరకు వివిధ బృందాలు ప్రయత్నించాయి. కానీ ఇప్పటికీ విజయవంతం కాలేదు. ఐతే గత ఐదేళ్లలో అసాధారణ విషయాలు తెరపైకి వస్తున్నాయి. అన్ని కాలాలకు చెందిన నాణేలు, బంగారం, బౌద్ధ శిల్పాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. శ్రీవిజయరాజ్యం కల్పితం కాదనడానికి ఆధారాలు ఇవే. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! వీటితోపాటు ఆనాటి పాత్రలు,టేబుల్వేర్ వస్తువులు భారతదేశం, పర్షియా, చైనాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరి కాలంలో కాంస్య, బంగారు బౌద్ధ ఆలయాలు ఉండేవి. 20 వేల సైనికులు, వెయ్యి మంది బౌద్ధ సన్యాసులు, 800 వడ్డీ వ్యాపారులు ఈ సాంమ్రాజ్య రాజధానిలో ఉండేవారట. దీనిని బట్టి జనాభా కూడా అధికంగానే ఉండి ఉంటుందని తెలుస్తోంది. వీటితోపాటు రాహువు శిరస్సు విగ్రహం కూడా దొరికింది. భారతీయ హిందు ధర్మానికి సంబంధించిన అనేక ఇతర కళాఖండాలు కూడా బయటపడ్డట్టు కింగ్స్లే పేర్కొన్నారు. అది ఇప్పటికీ రహస్యమే.. శ్రీవిజయ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది అనేదానికి ఎవరి దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇండోనేషియా అగ్నిపర్వతాలవల్ల గానీ లేదా వరద కారణంగా గానీ ఈ సామ్రాజ్యం కూలిపోయి ఉండవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
టీడీపీ X మత్స్యకారులు
భానుగుడి (కాకినాడ సిటీ) : టీడీపీ వైఖరిపై మత్స్యకారులు మండిపడ్డారు. తమ కులాన్ని, తమ మత్స్యకార వృత్తిని అవమానించారంటూ నిప్పులు చెరిగారు. ఇష్టానుసారం వ్యాఖ్యలతో వారి రాజకీయ లబ్ధి కోసం తమను పావుగా వాడుకోవడం దారుణం అని ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా బోట్ల ద్వారా మాదక ద్రవ్యాల దిగుమతి జరుగుతోందని ఏ విధంగా చెబుతారని నిలదీశారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మిరెడ్డి పట్టాభి కళ్లతో చూసినట్లు మాట్లాడటం దుర్మార్గమని, ఆయన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పట్టాభి పాత్రికేయుల సమావేశం ముగిసిన కొద్ది సేపటి తర్వాత వారు ఆయన వ్యాఖ్యల పట్ల కలత చెంది.. పార్టీలకతీతంగా కాకినాడ బోటు ఓనర్స్, మత్స్యకారులు పెద్దసంఖ్యలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ కులాన్ని, వృత్తిని అవమానపరుస్తూ అవాకులు చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పట్టాభి, టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులంతా పెద్ద ఎత్తున ఉద్యమించి తీరుతామని బోటు ఓనర్స్ అసోషియేషన్ పేర్కొంది. పట్టాభీ.. మీరు చూశారా? విజయవాడలో ఉన్న పట్టాభి.. కాకినాడలో బోటు తగలబడితే అందులో మాదకద్రవ్యాలు ఉన్నాయని ఏవిధంగా చెబుతారని మత్స్యకార సంఘం నేతలు నిలదీశారు. ఆ సమయంలో పట్టాభి అక్కడికి వచ్చి బోటు లోపలికి తొంగి చూశారా? అని మండిపడ్డారు. గాలిమాటలతో రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘ఈ విధంగా మాట్లాడాలని మీకు చంద్రబాబు చెప్పారా? లేక పేరు కోసం ఇలా గాలి మాటలు మాట్లాడావా? అని ధ్వజమెత్తారు. తగలబడినప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసు రక్షణలోనే బోటు ఉందని, ఆ విషయాలేవీ తెలుసుకోకుండా ఇలాంటి ప్రేలాపనలకు దిగడం విడ్డూరమని అన్నారు. పట్టాభిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి డిపాజిట్లు రాకుండా చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, మత్స్యకారులతో టీడీపీ కాకినాక పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే కొండబాబు చర్చించే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పట్టాభి పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాలేదు. అంతలో పోలీసులు అక్కడికి చేరుకుని, ఉద్రిక్తతలు పెరగకుండా పట్టాభిని అక్కడి నుంచి పంపించేశారు. -
చేప పడితేనే చేవ వచ్చేది..
ఆకలికి ఎవరూ అతీతం కాదు.. అంతా సమానమే. తినే తిండి వేరు కావొచ్చు.. కానీ కడుపు నింపుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ తిన్నాం.. రేపు తినక్కర్లేరు అనేది ఉండదు. ఈ విషయం ఆకలికి కూడా తెలీదు. ఆకలి మనల్ని బతికిస్తుంది అనేది ఎంత వాస్తవమో.. కొన్ని సందర్భాల్లో అదే ఆకలి చంపేస్తుంది కూడా. ఆకలి గురించి చెప్పుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. ఆకలి అనేది మనకు కనిపించదు.. అలానే ఆకలికి కనికరం కూడా ఉండదు. ఆకలి తీర్చుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది. అందుకేనేమో కోటి విద్యలు కూటి కోసం అన్నారు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంలో ఇటు జాలర్లు, అటు కొంగలు ఆకలి తీర్చుకోవడం చేపల వేటలో నిమగ్నం కావడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రకాశం బ్యారేజి దిగువన వల సహయంతో చేపలు కోసం జాలర్లు వేటాడుతుండగా, అదే సమయంలో కొంగలు కూడా చేపల కోసం తమ ముక్కుకు పదును పెడుతున్నాయి. ఈ దృశ్యంలో ఇద్దరి ప్రథమ లక్ష్యం చేపలే అంతిమ లక్ష్యం ఆకలి తీర్చుకోవడమనేది స్పష్టంగా కనిపిస్తోంది. -
‘మత్స్యకారులకు ఆదాయం రావడం టీడీపీకి ఇష్టం లేదా?’
సాక్షి, తాడేపల్లి: చెరువులపై ఆధారపడి జీవించే వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వం ఆశించిందని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల ద్వారా చెరువుల నిర్వహణ చేపట్టామని, అందుకోసం వందల ఎకరాలు పైబడిన చెరువలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో చెరువులపై ఆధారపడి జీవించే వారి కోసం జీవో 217 తీసుకొచ్చామని తెలిపారు. 100 హెక్టర్స్ పైనున్న 28 చెరువులను దీని కిందకు తీసుకొచ్చాన్నారు. వాటిని అధ్యయనం చేసి సొసైటీ సభ్యులకు కనీసం రూ.15000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాను ఆ జీవో కింద తీసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారని ప్రతిపక్షం గ్లోబల్ ప్రచారం చేస్తోందని మోపిదేవి మండిపడ్డారు. ఇది నెల్లూరు జిల్లాకు మాత్రమే వర్తిస్తుంది అని జీవోలో స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. అక్కడ అమలు చేసి మంచి ఫలితాలు వస్తే అప్పుడు ఆలోచించాలని భావించామని చెప్పారు. మత్సకారులకు ఆదాయం రావడం సంతోషమా కాదా అనేది టీడీపీ వారు చెప్పాలని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఏపీలో మత్స్యకారులకు అనేక పథకాలు పెట్టామని అన్నారు. లబ్ధిదారుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. డీజిల్ టీడీపీ హయాంలో రూ. 6 సబ్సిడీ ఉంటే తాము రూ. 9 చేశామని, ఎవరైనా మత్స్యకారుడు దురదృష్ట వశాత్తు చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ కూడా వచ్చేది కాదని, ఇప్పుడు వెంటనే 10 లక్షలు అందిస్తున్నామని మోపిదేవి తెలిపారు. ప్రతి జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించారని తెలిపారు. ఫేజ్ 1 కింద 5 హార్బర్లు పనులు జరుగుతున్నాయని, ఫేజ్ 2 కింద కూడా మిగతావి ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పశ్చిమ గోదావరిలో మెరైన్ యూనివర్సిటీకి స్థలం కూడా కేటాయించారని తెలిపారు. -
డ్రెయిన్లోకి దూసుకెళ్లిన కారు.. వైద్య విద్యార్థి దుర్మరణం
బాపట్లటౌన్: గుంటూరు జిల్లా బాపట్ల వద్ద పేరలి డ్రెయిన్లోకి ఆదివారం ఉదయం కారు దూసుకుపోయిన ప్రమాదంలో వైద్యవిద్యార్థి బీదవోలు శ్రీనిధిరెడ్డి (22) మృతిచెందారు. మరో ఏడుగురు వైద్యవిద్యార్థులు గాయపడ్డారు. వారిని మత్స్యకారులు రక్షించారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు యర్రబల్లి సాయికేశవ్ (కూకట్పల్లి, హైదరాబాద్), బీదవోలు శ్రీనిధిరెడ్డి (ఎల్బీనగర్, హైదరాబాద్), గునుపాటి ఉదయ్కిరణ్రెడ్డి (గుంటూరు), గంధం లీలాశంకర్ బ్రహ్మయ్య (భీమవరం), వీరమాచి భానుప్రకాష్ (నాగపూర్, మహారాష్ట్ర) ఒక గదిలో ఉంటున్నారు. వీరికి సీనియర్లయిన చింతపట్ల కీర్తిరావు, దేవరకొండ నిహారిక, కంబంపాటి సాయితులసి మరో గదిలో ఉంటున్నారు. వీరంతా సూర్యలంక బీచ్లో ఉదయించే సూర్యుడిని చూడాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి యర్రబల్లి సాయికేశవ్కు చెందిన కారులో శనివారం అర్ధరాత్రి 1.15 గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు సూర్యలంక తీరానికి చేరుకున్నారు. కొంతసేపు అక్కడున్నారు. విజయవాడలో మరో కార్యక్రమం ఉండటంతో తిరుగుపయనమయ్యారు. సూర్యలంక నుంచి బాపట్ల వైపు వస్తుండగా ఆదర్శనగర్ సమీపంలోని పేరలి డ్రైయిన్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. బీదవోలు శ్రీనిధిరెడ్డి నడుపుతున్న కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి డ్రెయిన్లోకి దూసుకెళ్లింది. ఆ సమీపంలోని హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఆదర్శనగర్కు చెందిన మత్స్యకారులు కొక్కిలిగడ్డ నాగశ్రీను, సంగాని శేషు, చింతా లక్ష్మణ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే డ్రెయిన్లోకి దూకి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చారు. గాయపడిన ఎనిమిదిమందినీ 108 సహాయంతో చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే శ్రీనిధిరెడ్డి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కారును క్రేన్తో బయటకు తీయించిన రూరల్ సీఐ కె.శ్రీనివాసరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో రెండు సెల్ఫోన్లు, ఒక బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురి ప్రాణాలు కాపాడిన మత్స్యకారులను సీఐ అభినందించారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన సరదా..
సింగరాయకొండ: సముద్రస్నానం సరదా ఇద్దరి ఉసురు తీసింది. ఈ ఘటనతో వినాయకచవితి పండుగ రోజు ఓ పెళ్లింట విషాదం నిండింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్లో శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపూడి మండలం చిమట గ్రామంలో గురువారం మోయిడి మాధవ కూతురు వివాహం జరిగింది. ఆ వివాహానికి చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన అబ్బాయి తరఫు వారు హాజరయ్యారు. పెళ్లి తర్వాత రోజు వినాయక చవితి పండుగ కావడంతో పూజ ముగించుకుని సరదాగా సమీపంలోని పాకల బీచ్కు బైకులపై ఆరుగురు కలిసి వెళ్లారు. మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన పెళ్లికుమార్తె అన్న మోయిడి శాంతిరాజు (20), మోయిడి కోటేష్, కొమ్ము లాజర్, కొమ్ము పాల్, చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన జెన్నిపోగు తేజ (18), జెన్నిపోగు యాప్రాయం సముద్రంలోకి దిగారు. అలల తాకిడి తక్కువగా ఉండడంతో కాస్త లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో శాంతిరాజు, తేజ, యాప్రాయం సముద్రంలో గల్లంతయ్యారు. గమనించిన మిగతా యువకులు పెద్దగా కేకలు వేయడంతో ఒడ్డున ఉన్న మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు. శాంతిరాజు, యాప్రాయంను ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేశారు. చికిత్స చేస్తుండగానే శాంతిరాజు ప్రాణాలొదిలాడు. యాప్రాయం మాత్రం స్పృహలోకి వచ్చి తేరుకున్నాడు. తేజ మృతదేహం కొద్దిసేపటికి అలలపై తేలుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చారు. మృతుల్లో శాంతిరాజు పెళ్లికూతురు అన్న. అప్పటివరకు సరదాగా ఉన్న పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి. సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్ పాకల బీచ్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ ఎల్.సంపత్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మత్స్యకారుల హక్కులకు భంగం కలగనీయం
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన మత్స్యకారుల సమన్వ య కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సమన్వయ కమిటీ సభ్యులు కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో పర్యటించి అక్కడ గుర్తించిన సమస్యలపై సమావేశంలో వివరించారు. నిబంధనలకు అనుగుణం గా ఉన్న సమస్యల పరిష్కారానికి వెం టనే చొరవ చూపాలని మంత్రి శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆదే శించారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నీటి వనరులను కూడా మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర పాల్గొన్నారు. -
వీడిన మిస్టరీ: నీటి కుంటలో శవమై తేలిన జయశీల్రెడ్డి
నల్లగొండ క్రైం: సోమవారం తన వ్యవసాయ క్షేత్రంలో అదృశ్యమైన దేవిరెడ్డి జయశీల్రెడ్డి (42) మంగళవారం నీటి కుంటలో శవమై తేలారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బాబాయ్ కుమారుడు జయశీల్రెడ్డి నల్లగొండ మండలంలోని మేళ్లదుప్పలపల్లి గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించేందుకు వచ్చి అక్కడే కుంటలో కాలుజారి పడి మృతిచెందారు. మంగళవారం జాలర్ల వలకు అతడి మృతదేహం చిక్కింది. జయశీల్రెడ్డి సోమవా రం హైదరాబాద్ నుంచి తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చా రు. కుంటపైనుంచి వ్యవసాయ క్షేత్రంలోకి మట్టి రోడ్డు ఉంది. కట్టపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వర్షం కారణంగా కాలు జారి నీటి కుంటలో పడిపోయా రు. ఈత రాకపోవడంతో నీటిలో నుంచి బయటికి రాలేక ప్రాణాలు విడిచారు. కుంటలోనుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించినట్లుగా మృతదేహం కాళ్లకు, చేతులకు బురద అంటి ఉంది. నీటిలో నుంచి పైకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బంక మట్టి కావడం, కాళ్లకు బూట్లు ఉండటంతో నీటిలో నుంచి పైకి అడుగు వేయలేకపోయినట్లుగా భావిస్తున్నారు. నీటి బుడగలతో గుర్తించారు.. జయశీల్రెడ్డి కోసం కుంటలో, పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో సోమవారం నుంచి గాలించారు. జాలర్లు చేపలు పట్టే తెప్పతో గాలిస్తుండగా కట్టకు సమీపంలో నీటి బుడ గలు పైకి వస్తుండటంతో అనుమానం వచ్చి వల విసిరా రు. తల భాగం వలకు చిక్కి పైకి కనిపించడంతో మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. జయశీల్రెడ్డి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం హైదరాబాద్లోని విద్యానగర్కు తరలించారు. ఎల్బీనగర్ ఎమ్మె ల్యే సుధీర్రెడ్డి, జయశీల్రెడ్డి తల్లిదండ్రులు సునంద, జగదీశ్వర్రెడ్డి, కుటుంబ సభ్యులంతా రెండు రోజులుగా వ్యవసాయ క్షేత్రం వద్దనే ఉన్నారు. అమెరికా వెళ్లాల్సిన కుమారుడు విగతజీవిగా కనిపించడంతో వారు గుండెలవిసేలా రోదించారు. మృతదేహానికి నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో మత్స్యకారులకు చేసిందేమీ లేదని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల పట్ల చంద్రబాబుకు ఉన్న ద్వేషాన్ని ఎప్పటికీ మరచిపోమని.. ఆయనను రాష్ట్రంలోని మత్స్యకారులెవరూ నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారులు నిరసనలు చేస్తున్న సమయంలో ‘మీ తోలు తీస్తా.. మీ అంతు చూస్తా’నన్న చంద్రబాబు మాటలను మత్స్యకారులెవ్వరూ మర్చిపోలేదన్నారు. మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల వల్లే రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు. ఒక్క వైఎస్సాఆర్ చేయూత పథకం కింద నాలుగేళ్లలో సుమారు రూ.19 వేల కోట్లు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.1,600 కోట్లు ఇచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.1,600 కోట్లు ఎక్కడ.. ఒక్క చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఖర్చు చేస్తున్న రూ.19 వేల కోట్లు ఎక్కడని ప్రశ్నించారు. జీవో 217పై తప్పుడు ప్రచారం జీవో 217పై చంద్రబాబు తప్పుడు ప్రచారంతో మత్స్యకారులను చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ జీవో ద్వారా నీటి వనరులను మత్స్యకారుల నుంచి ప్రభుత్వం లాగేసుకుంటోందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 28 రిజర్వాయర్లలో చేపల్ని వేటాడుకునేందుకు లైసెన్సులు ఇచ్చామన్నారు. 2,833 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు సొసైటీల చేతుల నుంచి దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో 2 హార్బర్లు ఉంటే.. తమ ప్రభుత్వం తీర ప్రాంతంలో జిల్లాకో హార్బర్ను కానుకగా ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే 4 హార్బర్లకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించగా.. మరో 4 హార్బర్లకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. కోవిడ్ కష్ట కాలంలోనూ ఆక్వా రంగం నిలబడిందంటే అది సీఎం జగన్ ఇచ్చిన చేయూత వల్లేనని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు. ‘పాడి’ అభివృద్ధికి రుణ సాయం చేయండి రాష్ట్రంలో ఏపీ అమూల్ ప్రాజెక్టును మరింత సమర్థంగా అమలు చేయడానికి, 10 వేలకు పైగా ఉన్న మహిళా పాల ఉత్పత్తి సంఘాల బలోపేతానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా రూ.1,362 కోట్ల రుణాన్ని మంజూరు చేయాలని సీదిరి అప్పలరాజు కేంద్రాన్ని కోరారు. కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీ నుంచి జరిగిన జాతీయ స్థాయి వర్చువల్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏపీలో కొత్తగా రూ.50 కోట్లతో తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఏర్పాటు చేయనున్న పశు వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రానికి అనుమతులు మంజూరు చేయాలని, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) ద్వారా గొర్రెలు, మేకలు, పందుల పెంపకానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టుగానే పాడి పశువులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఎ, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈవో టి.దామోదర్ నాయుడు పాల్గొన్నారు.