Heroine
-
Priyanka Mohan: నేనొక శారీ లవర్ని
బంజారాహిల్స్: ‘నాకు చీరలంటే ఎంతో ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే నేనొక శారీ లవర్ని’ అని చెప్పారు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో గ్జితి వీవ్స్లో ఏర్పాటు చేసిన నూతన కలెక్షన్లను మంగళవారం ఆవిష్కరించారు. మహిళలకు చీర అందాన్ని ఇవ్వడమే కాకుండా మరింత గౌరవాన్ని ఇస్తుందని ప్రియాంక అన్నారు. తాను నిత్యం రకరకాల కలెక్షన్లు అన్వేషిస్తూ ఉంటానని, నచ్చిన చీరను తెప్పించుకోడం.. కట్టుకొని ముచ్చట తీర్చుకోడం జరుగుతుందన్నారు. మార్కెట్లోకి ట్రెండీ డ్రెస్లకు ధీటుగా శారీలు కూడా వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్జితి వీవ్స్ ప్రతినిధులు సౌజన్య, బాబీ మాట్లాడుతూ ప్రతి అవసరానికీ ఓ చీర, ప్రతి సీజన్కు ఓ చీర అనే కాన్సెప్్టతో దేశంలోని భిన్న రకాల చేతి వృత్తుల చీరలతో పాటు డిజైనరీ చీరలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. – నటి ప్రియాంక -
మెహిందీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ : మెరిసిపోయిన అందాల భామ
పాకిస్తానీ హీరోయిన్ మావ్రా హొకేన్(Mawra Hocane) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తొలుత బుల్లితెరపై కనిపించిన మావ్రా ఆ తరువాత హీరోయిన్గా రాణించింది. ఇప్పటికే తన డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలతో ఇంటర్నెట్లో సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా తన మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాషన్ శైలికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అమీర్ గిలానీ(Ameer Gilani)ని ఇటీవల(ఫిబ్రవరి 5న) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు హాజరైన వివాహానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు మెహిందీ లగాకే రఖ్లీ అంటూ, మెహందీ వేడుక నుండి అనేక చిత్రాలను పోస్ట్ చేసింది. ఇందులో అప్సరసలా మెరిసిపోయింది. View this post on Instagram A post shared by MAWRA (@mawrellous) గోల్డెన్ టోన్ ఎంబ్రాయిడరీ మస్టర్డ్ ఎల్లో -టోన్ ఘరారా సెట్ను ధరించింది.. దీనికి చిన్న ఫ్రాక్-శైలి కుర్తాతో పాటు ఫ్లేర్డ్ ఘరారాను జత చేసింది. అంతేకాదు డబుల్-దుపట్టా లుక్ లేటెస్ట్ ట్రెండ్కు అద్దం పడింది. మెజెంటా దుపట్టా , ఇంకోటి పర్పుల్ అండ్ బంగారు రంగు దుపట్టాను లుక్ను జత చేసింది. ఇక దీనికి జతగా బంగారు ఆభరణాలు, సింపుల్ మేకప్ లుక్తోతన ఫ్యాషన్ స్టైల్ను చాటుకుంది మావ్రా. మావ్రా హొకేన్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఎంబ్రాయిడరీ చేసిన సేజ్ గ్రీన్ షరారా సెట్లో అందంగా మెరిసింది.కాగా మావ్రా 2011లో ఈ అమ్మడు ‘కిచారి సాల్స’(Kichari Salsa) బాలీవుడ్ రొమాంటిక్ మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తరువత 2016లో ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
సిల్వర్ స్క్రీన్ క్వీన్ : తోపుడు బండిపై అనాథ శవంలా!
జీవితం పట్ల అవగాహన, క్రమశిక్షణ లేకపోతే మన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, వేల కోట్ల సంపద అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి. సక్సెస్ ఒక్కటే సరిపోదు. జీవితం పట్ల స్పష్టత ఉండాలి. కీర్తి ప్రతిష్టలైనా, కోట్ల రూపాయల సంపద అయినా చివరిదాకా నిలుపుకునే కనీస అవగాహన, సత్తా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారల విషయంలో ఇది చాలా అవసరం. ఎదురు దెబ్బలు, అవమానాలు తప్పవు. మరీ ముఖ్యంగా మహిళలైతే అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి, విలాసవంతమైన జీవితాన్ని గడిపి, చివరికి అనాథలా మిగిలిన ఒక తార జీవితం గురించి తెలుసుకుందాం.ఆమె ఒక గ్లామర్ హీరోయిన్. అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కని నటన. తన అందం అభినయంతో, సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సిల్వర్ స్క్రీన్ క్వీన్ గా ఒక పేరు దక్కించుకుంది. నటిగా అనేక విజయాలు, కోట్ల ఆస్తి కట్ చేస్తే 34 ఏళ్ల వయసులోనే అనాథలా ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుంది. ఆమె బాలీవుడ్ నటి విమ్మీ (Vimi). 1943లో సిక్కు కుటుంబంలో జన్మించింది. చదువుకుంటున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు కూడా పాడేది.ముంబైలో సోఫియా కాలేజీలో సైకాలజీ చదివింది. బీఆర్ చోప్రా హాజరవుతారని తెలిసి, రవి తన కొడుకు పుట్టినరోజు పార్టీకి విమ్మీని, ఆమె భర్తను ఆహ్వానించాడు. ఈ పార్టీలో విమ్మీని చూసిన ప్రఖ్యాత ప్రముఖ నిర్మాత బీఆర్ చోప్రా ఆమెను బాలీవుడ్కు పరిచయం చేశాడు. 1967లో తీసిన హమ్రాజ్ చిత్రంలో ఆనాటి ఇద్దరు అగ్ర తారలు సునీల్ దత్ ,రాజ్ కుమార్ సరసన కొత్త హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చాలా తక్కువ సమయంలో విమ్మీ పాపులారీటీ సాధించింది. ఆబ్రూలో అశోక్ కుమార్, పతంగాలో శశి కపూర్ వంటి అగ్ర తారలతో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 1960లలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ నిలిచింది. ఒకానొక దశలో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది. మరోవైపు ముంబైలాంటి వంటి విశ్వనగరంలో పుట్టి పెరిగినప్పటికీ,పాశ్చాత్య దుస్తులు ధరించడం , మేకప్ వేసుకొని విమ్మీ సినిమాల్లోకి రావడం ఇరుకుటుంబాలకీ నచ్చలేదు. దీనికి హమారాజ్సినిమా సమయంలో భర్తతో గొడవలు ఇది విమికి భారీగా నష్టం కలిగించింది.ఆమెతో మళ్ళీ పనిచేయడానికి నిరాకరించడం ఆమెకు భారీగా నష్టం కలిగించింది. అలాగే ఆమె భర్త అగర్వాల్ జోక్యంకారణంగా దర్శక నిర్మాతలు దూరంగా ఉండేవారు. క్రమంగా ఆమె స్టార్డమ్ తగ్గడం ప్రారంభమైంది. అలా పదేళ్ల కాలంలోనే ఆమె జీవితం తారుమారైపోయింది. 1970ల ప్రారంభం నాటికి, విమ్మీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవంగా నిలిచాయి. దీంతో చిన్న చిన్న అతిధి పాత్రలు గుర్తింపు లేని నృత్య ప్రదర్శనలకు పరిమితమైపోయింది.విమ్మీ బాలీవుడ్లోకి అడుగుపెట్టే సమయానికే ఒక పారిశ్రామికవేత్త కుమారుడు శివ్ అగర్వాల్ (Shiv Agarwal)తో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క వృత్తి జీవితం చాలా హ్యాపీగా సాగుతుండగా, వ్యక్తిగత జీవితం మాత్రం చాలా బాధాకరంగా పరిణమించింది. తీవ్రమైన గృహహింను ఎదుర్కొంది. దీంతో భర్తనుంచి విడాకులు తీసుకుంది. నమ్మిన మరో మనిషి దారుణంగా మోసం చేయడంతో దయనీయ పరిస్థితులలోకి జారిపోయింది. జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధంలోకి ప్రవేశించింది. కానీ ఇది మరో పీడకలగా మారుతుందని ఊహించలేకపోయింది. బాధలో ఉన్న విమ్మీని అక్కున చేర్చుకోలేదు సరికదా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఆర్థికంగా దోచుకున్నాడు. విమ్మీ సొమ్మునంతా వాడుకోవడం మాత్రమే కాదు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడనే వార్తలు కూడా వినిపించాయి అప్పట్లో.చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!విషాదకరమైన ముగింపుఅయితే తన జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో, విమ్మీ కోల్కతాలో విమి టెక్సటైల్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. దురదృష్టవశాత్తూ అదీ విఫలమైంది. నష్టాలతో దివాలా తీసింది. మరోవైపు అప్పలు ముంచుకొచ్చాయి. ఇక లాభం లేక దాన్ని అమ్మేయవలసి వచ్చింది. ఈ అవమాన భారంతో మానసికంగా దెబ్బతింది. మద్యానికి అలవాటు పడింది. ఇదే ఆమె ఆరోగ్యాన్ని నాశనం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో 1977న ఆగస్టు 22న అతి చిన్న వయసులో, విమ్మీ కాలేయ సమస్యలలో తనువు చాలించింది. దహన సంస్కారాలు నిర్వహించే దిక్కులేదు వెండి వెలుగుల్లో అకాల కీర్తి, దాని స్వభావాన్ని విషాదాంతాన్ని గుర్తు చేసిన మరో ఉదంతం ఏమింటే..ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఒక తోపుడు బండిపై తరలించాల్సి రావడం. ఇదీ చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట -
ఫ్యామిలీతో 40వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న 'మన్మధుడు' హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
64 ఏళ్ల హీరోతో జత కడుతున్న 29 ఏళ్ల హీరోయిన్ (ఫోటోలు)
-
ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే?
ఆరెంజ్ హీరోయిన్ షాజన్ పదంసీ (Shazahn Padamsee) గుడ్న్యూస్ చెప్పింది. ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో రోకా జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. జనవరి 20న కొత్త ప్రయాణం మొదలైందంటూ '#roka #engagement' అన్న క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది నవంబర్లోనూ అశీష్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆశిష్ నటి షాజన్ వేలికి ఉంగరం తొడిగాడు. ఇకపోతే జూన్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్చరణ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు. భాస్కర్ దర్శకత్వం వహించగా హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.ఎవరీ షాజన్?పలు వాణిజ్యప్రకటనల్లో మెరిసిన షాజన్.. రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కనిమొళి అనే తమిళ చిత్రంలో నటించింది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్ఫుల్ 2 సినిమాలు చేసింది. తెలుగులో ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ప్రేయసి రూబాగా యాక్ట్ చేసింది. మసాలా మూవీలో రామ్ పోతినేని సరసన కథానాయికగా నటించింది. 2015లో సాలిడ్ పటేల్స్ (హిందీ) సినిమా చేశాక ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2023లో పాగల్పన్: నెక్స్ట్ లెవల్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.రోకా అంటే..రోకా అంటే తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఇది ఉత్తరాది సాంప్రదాయం. రోకాతోనే పెళ్లి పనులు మొదలవుతాయి. మా అమ్మాయికి.. వారి అబ్బాయికి పెళ్లి కుదిరింది అని ప్రకటించే ప్రక్రియే రోకా వేడుక. ఇరు కుటుంబాలు తొలిసారి కలుసుకుని వివాహాన్ని నిశ్చయించుకుని స్వీట్లు తినిపించుకుంటారు. కొత్త జీవితం ప్రారంభించబోయే జంటను ఆశీర్వదిస్తారు. ఇది పెళ్లికూతురి ఇంటి వద్దనో లేదా ఆమె కుటుంబ సభ్యులు ఖరారు చేసిన వేదిక వద్ద జరుపుతారు. ప్రియాంక చోప్రా- నిక్ జోనస్, హీరో రానా- మిహికా బజాజ్ పెళ్లి సమయంలో ఈ రోకా గురించి చర్చ జరిగింది. View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే! -
జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!
జీవితంపై విరక్తి చెందినవారు, ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితాన్ని కొనసాగించాలనుకునేవారు సన్యాసం బాట పడుతుంటారు. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta Kulkarni) కూడా అదే దారిలోకి వెళ్లాలని ఆశపడింది. ఇందుకోసం రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం పుచ్చుకుంది.సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. ఈ వ్యవహారంపై ట్రాన్స్జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమను మహామండలేశ్వర్గా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఏం చెప్పాలనుకుంటున్నారు?హిమాంగి సఖి మాట్లాడుతూ.. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే మహామండలేశ్వర్గా మారింది. తన గతమేంటో అందరికీ తెలుసు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చింది. సడన్గా భారత్కు రావడం.. మహాకుంభమేళాకు హాజరవడం.. ఏకంగా సన్యాసిగా మారిపోవడం ఏంటో.. దీనిపై కచ్చితంగా విచారణ జరపాలి. అలాంటి వ్యక్తికి మహామండలేశ్వర్ హోదా ఇచ్చి సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్హత లేని మనిషికి గురువు హోదా ఎందుకిచ్చారు? ఇది అనైతికం అని మండిపడింది.(చదవండి: మోనాలిసా.. ఆంటీలతో పోలిక.. ఎంత అన్యాయమన్న విశ్వక్సేన్)ఎవరీ మమతా కులకర్ణి?1990'sలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది మమతా కులకర్ణి. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోల సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. కరణ్ అర్జున్, బాజీ, ఆషిఖ్ ఆవారా, దిల్బర్, కిస్మత్, జానే జిగర్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ మూవీస్తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.వివాదంమమతా 2016లో ప్రియుడితో కలిసి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. ఏళ్ల తరబడి విచారణ జరిపిన బాంబే హైకోర్టు గతేడాది ఆగస్టులో మమతకు క్లీన్చిట్ ఇచ్చింది. అప్పట్లో టాప్లెస్ ఫోటోషూట్తోనూ వివాదాల్లోకెక్కింది.చదవండి: మాఫియా డాన్తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా? -
గ్లామర్ హీరోయిన్.. మతిస్థిమితం కోల్పోయి.. చివరి రోజుల్లో తిండి మానేసి..
అందంతో కట్టిపడేసింది. నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అందచందాలకు జనాలే కాదు సినీఇండస్ట్రీ దాసోహమైంది. తనతో పరిచయం పెంచుకోవాలని చూసినవారు కొందరైతే ప్రేమాయణం నడిపినవారు మరికొందరు. కానీ ఏ ప్రేమా పెళ్లిదాకా వెళ్లలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్స్తోనే సావాసం చేసింది. ఆఖరి రోజుల్లో మానసిక స్థితి సరిగా లేక.. అనారోగ్యంతో కన్నుమూసింది. వెండితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన ఆవిడ పేరు పర్వీన్ బాబి. నేడు (జనవరి 20) ఆమె ఇరవయ్యవ వర్ధంతి. ఈ సందర్భంగా తనపై ప్రత్యేక కథనం..పద్నాలుగేళ్లకు పుట్టిన ఆశాదీపం పర్వీన్పర్వీన్ బాబి (Parveen Babi) గుజరాత్లో పుట్టింది. పెళ్లయిన పద్నాలుగేళ్లకు పర్వీన్ పుట్టడంతో ఆ పేరెంట్స్ సంతోషపడిపోయారు. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా పెంచారు. కానీ తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి క్యాన్సర్తో చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత తల్లితో ఓ హవేలీలో నివసించింది. సైకాలజీ చదివిన పర్వీన్ మోడలింగ్లోనూ అడుగుపెట్టింది. అక్కడి నుంచి సినీపరిశ్రమవైపు అడుగులు వేసింది. క్రికెటర్ సలీమ్ దురానీ సరసన చరిత్ర మూవీలో యాక్ట్ చేసింది. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చింది దర్శకుడు కిశోర్ సాహు. వేశ్యగా నటించిన పర్వీన్తనకు గుర్తింపు ఇచ్చిన ఫస్ట్ మూవీ మజ్బూర్ అయితే సెన్సేషన్ సృష్టించింది మాత్రం దీవార్. ఈ సినిమాలో పర్వీన్.. వేశ్యగా నటించింది. తర్వా అమర్ అక్బర్ ఆంటోని, కాల పత్తర్, సుహాగ్, షాన్, నమక్ హలాల్, ద బర్నింగ్ ట్రైన్.. ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్తో ఆరు సినిమాలు చేయగా అన్నీ హిట్లు, సూపర్ హిట్లుగానే నిలవడం విశేషం. ఎక్కువగా మోడ్రన్, గ్లామర్ పాత్రలే వేస్తూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన మొట్టమొదటి బాలీవుడ్ నటిగానూ చరిత్ర సృష్టించింది.ప్రేమ- పెళ్లి?1969లో పాకిస్తాన్కు చెందిన దూరపు బంధువుతో ఎంగేజ్మెంట్ జరిగింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆ నిశ్చితార్థం పెళ్లిదాకా రాకుండానే ఆగిపోయింది. తర్వాత నటుడు, విలన్ డేనీ డెంజోంగ్పా(Danny Denzongpa)ను ప్రేమించింది. చిత్రపరిశ్రమ అంతా పర్వీన్ వెంటపడుతుంటే ఆమె మాత్రం డానీ కోసం పరితపించింది. అతడు కూడా పర్వీన్ను చూసి ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉండటం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. కానీ ఇద్దరూ సినిమాలతో బిజీ అవడంతో కాసేపు కలిసుండే సమయం కూడా కరువైంది. దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఫ్రెండ్షిప్ను కొనసాగించారు.(చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?)పెళ్లయిన వ్యక్తితో లవ్అనంతరం నటుడు, వివాహితుడు కబీర్ బేడీ (Kabir Bedi)తో ప్రేమలో పడింది. ఇటాలియన్ సీరియల్ సెట్ వీరి ప్రేమకు పునాది వేసింది. కానీ కబీర్కు యూరప్లో గ్రాఫ్ పెరగడంతో బాలీవుడ్ రాలేకపోయాడు. అటు పర్వీన్.. తను సంతకం చేసిన సినిమాల కోసం ముంబై తిరిగిరాక తప్పలేదు. రెండేళ్ల లవ్ జర్నీకి ఫుల్స్టాప్ పెట్టింది. గుండె నిండా ఆ బాధ కూరుకుపోయినప్పుడే ఉన్నప్పుడే మహేశ్ భట్ (Mahesh Bhatt) పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం.. స్నేహంగా, ప్రేమగా మారింది. కానీ అప్పటికే మహేశ్కు పెళ్లయి కూతురు (పూజా భట్) కూడా ఉంది. పర్వీన్కు పిచ్చి అభిమాని అయిన మహేశ్ కుటుంబాన్ని వదిలేశాడు. ఇల్లొదిలేసి పర్వీన్తో సహజీవనం మొదలుపెట్టాడు. మూడేళ్లు కలిసున్నారు.దిగజారిన మానసిక స్థితిఓ రోజు మహేశ్ ఇంటికి వచ్చేసరికి పర్వీన్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను చంపడానికి అమితాబ్ ఫ్యాన్లో ఏదో డివైజ్ పెట్టాడు అంటూ కత్తి పట్టుకుని నిల్చుంది. అమితాబ్ తనను కిడ్నాప్ చేయించాడంది. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడున్న శంఖంలో బాంబ్ ఉందంటూ అరిచి గోల చేసింది. తనను ఎవరో ఏదో చేస్తారని మంచం కింద దాక్కునేది. తనకు పెట్టే భోజనంలో విషం కలుపుతున్నారని అనుమానించేది. ఎవరైనా ఒక ముద్ద తింటేకానీ ప్లేటు ముట్టేది కాదు. ఇలా రోజురోజుకూ ఆమె మానసిక ఆరోగ్యం దిగజారుతుంటే మహేశ్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉన్న ఒక్క స్నేహితుడినీ గెంటేసిన హీరోయిన్సైకియాట్రిస్ట్కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. టాబ్లెట్స్తో ఫలితం లేకపోవడంతో సినిమా వాతావరణానికి దూరంగా బెంగళూరులో ఉంచారు. అక్కడ ఆమె ఎక్కువరోజులు ఉండలేక ముంబైకి తిరుగుప్రయాణమైంది. డానీ.. తనకు ఏ కాస్త సమయం దొరికినా పర్వీన్ దగ్గరకు వెళ్లి ఆమెను సరదాగా ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ ఓ రోజు డానీని ఇంట్లోకి రానివ్వలేదు పర్వీన్. నన్ను చంపేందుకు నిన్ను అమితాబ్ పంపాడు కదా.. గెటవుట్ అని అరిచింది. బిగ్బీ మనుషులు తనను చంపాలనుకుంటున్నారన్న అనుమానంతో నిద్రాహారాలకు దూరమైంది. ఒంటరిగా..మహేశ్ తన పరిస్థితి చూడలేక ఇంట్లో నుంచి వచ్చేశాడు. భార్యకు దగ్గరయ్యాడు. దీంతో పర్వీన్ ఒంటరిగానే మిగిలిపోయింది. మధుమేహం, కీళ్లనొప్పులతోనూ బాధపడింది. 2005 జనవరి 20న పర్వీన్ (50) చనిపోయింది. ఆ విషయం రెండు మూడు రోజులవరకు ఇరుగుపొరుగుకు కూడా తెలియలేదు. తిండి మానేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్తుంటారు. పర్వీన్ మరణవార్త తెలిసి పరుగెత్తికొచ్చిన మహేశ్ ఆమె అంత్యక్రియలు జరిపించాడు. పర్వీన్ తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమానంగా రాసిచ్చింది.చదవండి:ర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్గానూ నటించాడు. తన ప్రపోజల్ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.రైల్లో నుంచి నెట్టేయాలని..ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.కత్తితో బెదిరించి సంతకం..నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)అంత చెండాలంగా లెటర్ రాస్తారా?నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాఅంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా! -
పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?
హీరోయిన్ కాయడు లోహర్ (Kayadu Lohar)కు వింత అనుభవం ఎదురైంది. డ్రాగన్ సినిమా (Dragon Movie) ప్రమోషన్స్లో భాగంగా ఆమె తమిళ సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 4కు హాజరైంది. అక్కడ పాటలు పాడే ఓ బుడ్డోడు హీరోయిన్ను హత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో హీరోయిన్ పెదాలపైనా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆమె తల పక్కకు తిప్పుకుంది. ఇది చూసిన జడ్జి ఎస్పీ చరణ్ ఏమీ చేయలేక చిరునవ్వు చిందించాడు. చెడిపోతున్నారుఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో టీఆర్పీ కోసం పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు. తల్లిదండ్రులైనా పిల్లలు ఎలా నడుచుకోవాలనేది నేర్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు నవ్వడానికి బదులు లాగి పెట్టి ఒక్కటిస్తే వారే దారికొస్తారని సలహా ఇస్తున్నారు.తెలుగులోనూ యాక్ట్ చేసిన హీరోయిన్తమిళంలో ప్రసారమవుతున్న సరిగమప లిటిల్ ఛాంప్స్ నాలుగో సీజన్కు సింగర్ శ్వేతా మోహన్తో పాటు, దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ కాయడు లోహర్ విషయానికి వస్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ ముగిల్పేటె అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పతనోపాతం నూట్టండుతో మలయాళంలో ప్రవేశించింది. అదే ఏడాది శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి (2022) సినిమాతో తెలుగువారిని పలకరించింది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తోంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. 🤦♂️🤦♂️🤦♂️pic.twitter.com/KbZVlDlTU6— Christopher Kanagaraj (@Chrissuccess) January 18, 2025 చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా! -
ఆడిషన్ ఇవ్వను.. అవకాశాలు అడుక్కోనంటున్న హీరోయిన్
టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు... ప్రతీ హీరోయిన్కు తనదంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసినవారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్లు మాత్రం... ఫీల్డ్లో ఉన్నప్పటికీ... చేరుకోవాల్సిన స్థాయిల్ని చేరుకోలేక దొరికిన స్థాయితో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా (Shilpa Shetty). తెలుగులో తళుక్కుమన్న హీరోయిన్బాజీగర్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చినా శిల్పాశెట్టికి బాలీవుడ్లో స్టార్డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్లలో తక్కువ మందికే సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడా పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో అజాద్, వీడెవడండీ బాబు వంటి పలు తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి తళుక్కుమంది. ఇప్పటికీ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్... సినిమాల కంటే యోగా వీడియో ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు. బిగ్బాస్ గెలిచిన ఫస్ట్ బ్యూటీఅలాగే సినిమాలకు మరోవైపు... ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్నితెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పాశెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. భారతదేశంలో తన కుటుంబంతో కలిసి లోహ్రీ, మకర సంక్రాంతిని జరుపుకుంది. ప్రస్తుతం కన్నడ భాషలో కెడి ది డెవిల్ చిత్రంతో అరంగేట్రం చేస్తోందీ 49 ఏళ్ల నటి.ఆడిషన్స్ ఇవ్వనుబిజీ బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్డ్ ట్రిప్ని అభివర్ణించింది. బాలీవుడ్ సరే... బిగ్ బ్రదర్ ద్వారా అంతర్జాతీయంగా పేరు వచ్చినప్పటికీ తనకెందుకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదు? ఈ సందర్భంగా ఇదే ప్రశ్నను ఒక ఇంటర్వ్యూలో ఆమె ముందుంచితే... తాను అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేనని తేల్చి చెప్పింది. తాను కష్టపడి పనిచేసినందుకు తనకు దక్కినదానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. ఓపిక లేదుహాలీవుడ్ కోసమో మరో చోటో ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తన మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో బాజీగర్ (1993) వంటి కమర్షియల్ హిట్లు లైఫ్ ఇన్... ఎ మెట్రో (2007) అప్నే (2007) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించానని... ఇలా 30 ఏళ్ల పని తర్వాత, కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. నా టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే తన గత చిత్రాలను చూడమని మాత్రమే తాను చెప్పగలనని అంటోంది. కుటుంబానికే ప్రథమ స్థానంతాను సరిగ్గా సరిపోతుంటే, ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా... తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానం అని శిల్పా నొక్కి చెప్పింది. పని కోసమో మరింత పేరు ప్రతిష్టల కోసమో ఆరాటపడుతూ ఎక్కువ కాలం తన పిల్లలకు దూరంగా ఉండడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. తన ప్రాధాన్యతల గురించి శిల్పాశెట్టి చాలా స్పష్టంగా ఉందనేది నిస్సందేహం..చదవండి: ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్ -
డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా వందకోట్ల ఆస్తి..: హీరోయిన్ మాజీ భర్త
దేవిక.. అలనాటి అందాల తార. వందకుపైగా సినిమాలు చేసింది. తెలుగులో ఆడవాళ్లే అలిగితే, ఆడ బ్రతుకు, అన్నా చెల్లెలు, బాటసారి, దేశ ద్రోహులు, గాలిమేడలు, గండికోట రహస్యం, మంగళసూత్రం, రేచుక్క, నిండు మనసులు, పాపం పసివాడు, రక్త సంబంధం, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, సుగుణ సుందరి కథ, శ్రీ కృష్ణ సత్య.. ఇలా అనేక సినిమ్లాలో యాక్ట్ చేసింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ కనిపించి కనువిందు చేసింది.రియల్ లైఫ్లోనూ యాక్టింగ్1968లో దర్శకుడు దేవదాసు (Devadoss)ను పెళ్లాడింది. ఈ జంటకు పుట్టిన కూతురు కనక (Actress Kanaka) కూడా సినిమాల్లో రాణించింది. కానీ తర్వాత ఈ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. దేవిక వల్ల తన జీవితమే తలకిందులైదంటున్నాడు ఆమె మాజీ భర్త దేవదాసు. దేవిక రీల్ లైఫ్లో మాత్రమే నటించలేదని, నిజ జీవితంలోనూ యాక్ట్ చేసిందని చెప్తున్నాడు.కాళ్లమీద పడిందితాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనెప్పుడూ దేవిక (Devika) వెంట పడలేదు. తనే పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. మీకూ, నాకూ సెట్టవదండని చెప్పాను. అయినా తను వినలేదు. నా కాళ్లమీద పడి పెళ్లి చేసుకోమని బతిమాలాడింది. ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అలా తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం.. కానీ తనది నిజమైన ప్రేమ కాదని నెమ్మదిగా అర్థమైంది.నన్ను హత్య చేయించాలని..నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన దగ్గర పైసా లేదు. డబ్బు కోసం నన్ను పెళ్లాడింది. నేను పెద్ద డైరెక్టర్ అయిపోతానని దేవిక అనుకుంది. నన్ను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూసింది. కానీ నేను స్వతంత్ర భావాలున్న వ్యక్తిని. నాకు నచ్చినట్లుగానే ఉండేవాడిని. దీంతో ఆమె నన్ను మనిషిగా చూసేది కాదు. ఒకరోజు తాళిబొట్టు విసిరి నా మొహాన కొట్టింది. నన్ను చంపించాలని ట్రై చేసింది. అందుకోసం మనుషుల్ని కూడా పంపింది. అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.తల్లి సంతకం ఫోర్జరీ..నేను, దేవిక 32 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగాం. ఆ సమయంలో ఓ సంఘటన జరిగింది. దేవిక తల్లి చనిపోయేటప్పుడు వీలునామా రాయలేదు. అప్పుడు దేవిక తన తల్లి సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి తనపై రాసుకుంది. అది నేను పసిగట్టాను. తనకు చెన్నైలో ఒక ఇల్లుతో పాటు 25 ఎకరాల భూమి ఉండేది. మాకు కూతురు కనక పుట్టింది కదా.. అది కూడా దేవికకు ఇష్టం లేదు. కానీ విడాకులయ్యే సమయానికి కోర్టు కూతుర్ని తల్లికే అప్పగిస్తుందిగా.. అలా దేవిక కనకను తీసుకెళ్లింది. దేవికలాగే కూతురూ తయారైందితన మనసును మార్చేసింది. నా కూతురి దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించింది. తను నాపై వేసిన నిందలకు అందరూ నన్ను శత్రువుగా చూశారు. అందుకే దేవిక చనిపోయినప్పుడు కూడా తనను చూసేందుకు వెళ్లలేదు. తల్లిలాగే కూతురూ తయారైంది. ఇప్పుడు నేనుంటున్న ఇల్లు తనదేనని కనక నాపై కేసు పెట్టింది. తల్లిలాగే తనూ ఫోర్జరీ సంతకంతో ఈ ఇంటిని లాక్కోవాలని చూసింది. అది ఫోర్జరీ అని కోర్టులో తేలితే ఎనిమిదేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని కాంప్రమైజ్కు వచ్చింది. నీ తండ్రెవరో తెలుసా?ఈ కేసు నడుస్తున్న సమయంలో నన్ను నానామాటలన్నప్పుడు.. బయట ఉన్న మగవాళ్లతో డీఎన్ఏ టెస్ట్ చేయించుకో.. అప్పుడు నీకు నిజమైన తండ్రెవరో తెలుస్తుందన్నాను. ఇకపోతే కనక మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఇంటి ముందు అంతా అపరిశుభ్రంగా ఉండేది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని ఉండేది. ఓరోజు కనక చనిపోయినట్లు వార్త రావడంతో పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాను. ఇంటికి వెళ్తే రానివ్వలేదుఅది తప్పుడు రిపోర్ట్ అని మీడియాకు చెప్పాక ఇంటి బయట మొత్తం క్లీన్ చేశాను. కానీ కనక.. నన్ను లోపలకు రానివ్వలేదు. తన మానసిక స్థితి అస్సలు బాగోలేదని అర్థమైంది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు నేను బాధ్యుడిని కాదని ముందుజాగ్రత్తగా కోర్టుకు చెప్పాను. తనతో నాకు సత్సంబంధాలు లేవు. జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశానా? అంటే అది దేవికను పెళ్లి చేసుకోవడమే! నా మరణానంతరం దాదాపు రూ.100 కోట్ల ఆస్తి అంతా ట్రస్టుకు చెందాలని వీలునామా రాశాను అని దేవదాసు చెప్పుకొచ్చాడు.చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్ -
Pragya Jaiswal: డాకు మహారాజ్ మూవీ హీరోయిన్ అదిరిపోయే స్టిల్స్ (ఫోటోలు)
-
మన్మథుడు హీరోయిన్పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.హీరోయిన్ ఓ రేంజ్లో..ముందుగా త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్లో ఉంటుంది. ఆ హీరోయిన్ మజాకాలో హీరోయిన్గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. నేనే చెప్పా..అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ శరీరం గురించి డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.కావాలనే..ఇక ఇదే ఈవెంట్లో సెకండ్ హీరోయిన్ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్ ఇవ్వమని కొంత గ్యాప్ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్ ఓవరాక్షన్ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా ముందే చెప్పాలిగా -
చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..!
కాస్త ఆరోగ్యం బాగోలేకపోతే చాలు చాలామంది ముసుగు తన్నిపడుకుంటారు. కానీ సమంత మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఫిట్నెస్పై ఫోకస్ పక్కన పెట్టలేదు. చికెన్ గున్యాతో సతమతమవుతున్న ఆమె ఒళ్లు నొప్పులున్నా సరే జిమ్లో చెమటలు చిందిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చికెన్గున్యా నుంచి కోలుకోవడం భలే సరదాగా ఉంది అంటూ జిమ్లో వర్కవుట్స్ చేస్తోంది.చికెన్ గున్యాతో బాధపడుతున్న సామ్శరీరం సహకరించకపోయినా తను పట్టుదలతో వ్యాయామం చేస్తుండటం చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంత (Samantha) చివరగా సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ షూటింగ్లో ఓ రోజు సామ్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. దీని గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సడన్గా స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లలేదుకళ్లు తెరిచేసరికి నాకు ఎవరి పేర్లూ గుర్తు రావడం లేదు. కొద్ది క్షణాలపాటు బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నన్ను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు అనిపిస్తోంది. ఏ ఒక్కరూ హాస్పిటల్కు వెళ్దామనలేదు అని చెప్పుకొచ్చింది. కాగా సమంత కొన్నేళ్లుగా మయోసైటిస్తో బాధపడుతోంది. తను ఈ వ్యాధి బారిన పడిన విషయాన్ని 2022లో వెల్లడించింది. అది కూడా నిర్మాతల బలవంతం వల్లే చెప్పింది. (చదవండి: అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో ఊరట)బలవంతం వల్లే..2022లో శాకుంతలం సినిమా రిలీజైంది. ఆ సమయంలో సమంత ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మయోసైటిస్ తనను శారీరకంగా కుంగదీసింది. మరోవైపు సినిమా ప్రమోషన్స్ చేయాలి. నీకున్న బాధ బయటపెడితే తప్పేంటని నిర్మాతలు ఒత్తిడి తేవడంతో సామ్ మయోసైటిస్తో సతమతమవుతున్న విషయాన్ని బయటకు చెప్పింది. వారి ఒత్తిడి వల్లే నాకు మయోసైటిస్ ఉందని అందరికీ చెప్పానని, లేదంటే నిశ్శబ్ధంగానే ఆ వ్యాధితో పోరాటం చేసేదాన్ని అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సినిమాఏ మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సమంత. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో సెన్సేషన్ హీరోయిన్గా మారింది. బృందావనం, ఎటో వెళ్లిపోయింది మనసు, జబర్దస్త్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, మనం, అల్లుడు శీను, రభస, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, జనతా గ్యారేజ్, బ్రహ్మోత్సవం, రంగస్థలం, ఓ బేబీ, మజిలి, యశో, శాకుంతలం, ఖుషి.. ఇలా ఎన్నో చిత్రాలతో మెప్పించింది. పుష్ప:ద రైజ్ మూవీలో ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా అనే ఐటం సాంగ్తో పాన్ ఇండియాను ఊపేసింది.సిటాడెల్ సిరీస్ఓటీటీలో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో అలరించిన ఆమె చివరగా సిటాడెల్: హనీ బన్నీ సిరీస్లో యాక్షన్ అవతార్లో కనిపించింది. సిటాడెల్ సిరీస్ విషయానికి వస్తే.. ఇందులో సమంత ఏజెంట్గా నటించింది. సీతా ఆర్ మీనన్ కథ అందించగా రాజ్ అండ్ డీకే (Raj Nidimoru and Krishna DK) డైరెక్ట్ చేశారు. గతేడాది నవంబర్ 7న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్, కేకే మీనన్, సాఖిబ్ సలీమ్, సికిందర్ ఖేర్ ప్రముఖ పాత్రలు పోషించారు. "Recovering from Chikungunya is so fun 😌 😌 😌 The joint pains and ALL"~Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#CitadelHoneyBunny #RaktBramhand#MaaIntiBangaram pic.twitter.com/m94S1yMV8R— Samcults (@Samcults) January 10, 2025 చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు -
సినిమాలు మానేయాలనుంది, గతేడాదే ఈ పని చేయాలనుకున్నా!
మసాలా సినిమాల్లో నటించేదే లేదన్న నిత్యామీనన్ (Nithya Menen) ఇకమీదట అసలు సినిమాలే చేయనంటోంది. మొన్నటివరకు మంచి పాత్ర అయితే చాలు చిన్న సినిమా అయినా అంగీకరిస్తాన్న ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటోంది.అమ్మ వల్లే ఇదంతా..ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కాదలిక్క నెరమిళ్లై (Kadhalikka Neramillai Movie) సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడటం, డ్యాన్స్ చేయడం, యాక్ట్ చేయడం.. ఇవన్నీ కూడా మా అమ్మే చిన్నప్పటి నుంచి నాతో చేయించింది. నిజం చెప్పాలంటే నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నాను.సినిమా నన్ను వదిలేలా లేదు!సినిమాలు మానేయాలని ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఈసారి గప్చుప్గా పక్కకు వెళ్లిపోదామని ఆలోచిస్తున్నప్పుడే తిరుచిత్రంపళం మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నేను సినిమాలు మానేసినా.. సినిమా నన్ను వదిలేలా లేదు అని! ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను.(చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు )అలాంటి జీవితం కావాలినాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయట స్వేచ్ఛగా జీవించలేం. నాకు పార్క్కు వెళ్లి వాకింగ్ చేయాలనుంటుంది. కానీ అది సాధ్యపడదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. పైలట్ అవ్వాలని కోరిక.. ఇలా ఎన్నో ఉంటాయి అని చెప్పుకొచ్చింది. నిత్య సినిమాలు మానేయాలనుకోవడం కొత్తేమీ కాదు..ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది.చదవండి: తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్బాబు -
డబ్బుందన్న గర్వంతో ఎంతకైనా తెగిస్తారా? ఎంతని భరించాలి?: హనీరోజ్
డబ్బుందన్న గర్వంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది హీరోయిన్ హనీ రోజ్ (Honey Rose). కొంతకాలంగా ఓ బిజినెస్మెన్ వేధిస్తున్నాడంటోంది బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ (Movie Industry)లో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? నన్నే టార్గెట్ చేస్తున్నాడునాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు. ఇలా ఒకరిగురించి ఇష్టారీతిన మాట్లాడమనేది సంస్కారమనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్లు కలిసేవారు. తర్వాత ఇతడినీ కలిశాను. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఓ పబ్లిక్ ఈవెంట్లో నన్ను డబుల్ మీనింగ్తో పిలిచాడు. (చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు)చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్కు వెళ్లడమే మానేశాను. మళ్లీ అవే దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్ను తిరస్కరించాను. (చదవండి: 'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్పై మా అసోసియేషన్)ఇలాగే వేధిస్తే ఊరుకునేది లేదునేను కాకపోతే మరో సెలబ్రిటీని వెతుక్కుంటానన్నాడు. అలాంటప్పుడు నేను తప్పుకున్నా పెద్ద నష్టం లేదంటూ రాసుకొచ్చింది. హనీతో నువ్వు హోటల్స్లో ఉంటున్నావా? అంటూ కొందరు అతడిని పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తనిచ్చే సమాధానాలు కూడా చెండాలంగా ఉంటున్నాయి. మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు. ఇంకా ఇలాగే వేధిస్తే పోలీసులను ఆశ్రయిస్తాను అని రాసుకొచ్చింది.సినిమాకాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్! -
సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మొదట్లో బ్యాడ్మింటన్ ప్లేయర్. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంది. కానీ సడన్గా బ్యాడ్మింటన్ వదిలేసి మోడల్గా మారిపోయింది. వెంటనే సినీ అవకాశాలూ తలుపుతట్టాయి. అలా 2006లో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఇప్పుడు ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతోంది. ఇంతకీ ఇప్పుడైనా ఆ పాపాయిని గుర్తుపట్టారా? తనే దీపికా పదుకొణె.అప్పట్లో బ్మాడ్మింటన్ ప్లేయర్1986 జనవరి 5న డెన్మార్క్లో భారత సంతతికి చెందిన ప్రకాశ్ పదుకొణె దంపతులకు దీపిక (Deepika Padukone) జన్మించింది. ప్రకాశ్ ఒకప్పుడు పేరు మోసిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆమె తాతయ్య రమేశ్ మైసూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు సెక్రటరీగా సేవలందించాడు. దీపికకు ఏడాది వయసున్నప్పుడే ఫ్యామిలీ అంతా బెంగళూరులో సెటిలైంది. బ్యాడ్మింటన్ ఆటకే ఎక్కువ సమయం కేటాయించే దీపిక చిన్న వయసులోనే మోడల్గా పలు యాడ్స్ చేసింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకినెమ్మదిగా తనకు గుర్తింపు, అవకాశాలు పెరుగుతూ ఉండటంతో బ్యాడ్మింటన్ మానేసి మోడలింగ్పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. తర్వాత సినీ ఛాన్సులూ రావడం మొదలైంది. దీంతో ఆమె ముంబైకి షిఫ్ట్ అయింది. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఇది తెలుగులో వచ్చిన మన్మథుడు మూవీకి రీమేక్! ఆ మరుసటి ఏడాది ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టయింది. ఉత్తమ నటిగా మొదటి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.(చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్చరణ్)గతేడాది తల్లిగా ప్రమోషన్ఓం శాంతి ఓం చిత్రంతో దీపికా దశ తిరిగిపోయింది. బచ్నా ఏ హసీనో, లవ్ ఆజ్ కల్, హౌస్ఫుల్, కాక్టైల్, రేస్ 2, యే జవానీ హై దీవాని, చెన్నై ఎక్స్ప్రెస్, రామ్ లీలా, హ్యాపీ న్యూ ఇయర్, పీకు, బాజీరావు మస్తానీ, పద్మావత్, పఠాన్ ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగువారికీ పరిచయమైంది. ఈ బ్యూటీ ఒక్క సినిమాకు రూ.20 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ను 2018లో పెళ్లి చేసుకున్న ఈమె గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.అది కూడా ముఖ్యమేనంటూ..మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అంటూ ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ను స్థాపించింది. దీని ద్వారా భారత్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫౌండేషన్ అందించిన సేవలకుగానూ వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ 2018లో క్రిస్టల్ అవార్డు ప్రకటించింది. 82°E అనే బ్యూటీ బ్రాండ్ కూడా స్థాపించింది.చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు -
చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ.. హీరోయిన్గా దూసుకెళ్తున్న అతిరా (ఫోటోలు)
-
ఎవరూ అవకాశాలివ్వలేదు.. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా!
సినిమాలు ఎందుకు చేయడం లేదు? లైమ్ లైట్కు దూరంగా ఉన్న చాలామంది హీరోయిన్లను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నామని పలువురూ బదులిస్తుంటారు. తన విషయంలో మాత్రం అది నిజం కాదని, తనకెవరూ ఆఫర్స్ ఇవ్వకపోవడం వల్లే సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందంటోంది హీరోయిన్ అర్చన కవి (Archana Kavi). తమిళ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈమె తెలుగు(Tollywood)లో హీరోయిన్గా బ్యాక్బెంచ్ అని ఒకే ఒక్క మూవీ చేసింది. తొమ్మిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.బ్రేక్ ఇవ్వలేదు.. వచ్చింది!ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో అర్చన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా అంతట నేనుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఎవరూ నాకు అవకాశాలివ్వలేదు, అందుకే తొమ్మిదేళ్లలో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2013లో నాకు పెళ్లయింది. తర్వాత విడాకులవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నెమ్మదిగా దాన్నుంచి కోలుకున్నాక ఈ సినిమా ఆఫర్ రావడంతో చేసేశాను' అని అర్చన చెప్పుకొచ్చింది.చదవండి: దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది! -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
సీరియల్ నటి సంగీత కళ్యాణ్కుమార్ (ఫొటోలు)
-
కళ్లతోనే కవ్విస్తోన్న హీరోయిన్ అనుపమ.. ఫోటోలు
-
ఐకానిక్ లెహంగాలలో నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్స్..!
-
25 ఏళ్ల తర్వాత ఇండియాకు.. అందుకోసమే వచ్చానన్న హీరోయిన్
సెన్సేషనల్ హీరోయిన్ మమత కులకర్ణి రెండున్నర దశాబ్దాల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె ముంబైకి తిరిగి రావడంతో ఈ పుకారుకు బీజం పడింది. ఇన్నేళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టినందుకు మమత భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.అందుకోసమైతే రాలేదు25 ఏళ్ల తర్వాత నా దేశంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వడానికో, బిగ్బాస్లో పాల్గొనేందుకో రాలేదు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేందుకే వచ్చాను అని పేర్కొంది.డ్రగ్స్ కేసులో క్లీన్చిట్కాగా మమత కులకర్ణి గతంలో రూ.200 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. మమత ఏ తప్పూ చేయలేదంటూ బాంబే హైకోర్టు గత ఆగస్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. 2016లో తనపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును కొట్టివేసింది. వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, బాజీ, కరణ్ అర్జున్, దిల్బర్, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమశిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: సుష్మిత కుటుంబానికి నేనున్నా.. ఏ అవసరం వచ్చినా.: నటుడు -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్ల.. ఈమె ఎవరంటే? (ఫోటోలు)
-
వీడియో లీక్పై స్పందించిన హీరోయిన్.. జీవితం నాశనం చేస్తారా?
హీరోయిన్ ప్రగ్య నగ్ర ప్రైవేట్ వీడియో లీకైందంటూ నిన్నటినుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రియుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఇది చూసిన హీరోయిన్ ప్రగ్య నగ్ర షాక్కు గురైంది. టెక్నాలజీని వాడుకుని తనను దారుణంగా చిత్రీకరించారని వాపోయింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.పీడకల అయితే బాగుండుఇప్పటికీ నమ్మలేకున్నాను. ఇదంతా ఒక పీడకల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సాయపడాలే కానీ మన జీవితాల్ని నాశనం చేయకూడదు. దరిద్రపుగొట్టు ఆలోచనలు ఉన్న దుర్మార్గులు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో చెత్త వీడియో సృష్టించారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఎవరికీ ఇలా జరగడకూదుధైర్యంగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్నవారికి చాలా థాంక్స్. ఏ అమ్మాయికీ ఇలాంటి దారుణ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి అని రాసుకొచ్చింది. దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులను ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు నీ ధైర్యాన్ని కోల్పోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమావరళరు ముఖ్యం అనే తమిళ సినిమాతో 2022లో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది తమిళంలో ఎన్4, మలయాళంలో నదికళిల్ సుందరి యమున సినిమాలు చేసింది. ఈ ఏడాది లగ్గంతో తెలుగువారిని పలకరించింది.చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే? -
టాలీవుడ్ హీరోయిన్ వీడియో!
హీరోయిన్ ప్రగ్య నగ్ర(#pragyanagra) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు చెందినదిగా పేర్కొంటున్న ప్రైవేట్ వీడియో ఒకటి ఆన్లైన్లో లీకైంది. అందులో ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ప్రగ్య పేరు చెడగొట్టేందుకు ఎవరో దుండగులు డీప్ ఫేక్ సాయంతో ఈ వీడియో సృష్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కాగా ప్రగ్య నగ్ర.. వరలరు ముఖ్యం అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నదికలిళ్ సుందరి యమున అనే మలయాళ మూవీలోనూ నటించింది. లగ్గం సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: గౌతమ్ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్ -
నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. తెగ సంబరపడిపోతున్న హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ. గతేడాది నవంబర్లో తన ప్రియుడు జగత్ దేశాయ్ను పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అమలాపాల్.అయితే తాజాగా తన భర్తతో కలిసి మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా నది మధ్యలో తన భర్తతో కలిసి వేడుక జరుపుకుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది. నన్ను ఎంతో ప్రేమ, ఆత్మీయతలతో చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమని ఇన్స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోందన్నారు. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్లు జీవితాంతం గుర్తుంటాయని పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది.(ఇది చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)కాగా.. తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. టాలీవుడ్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో మెప్పించింది. మొదట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది. గతంలో ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ఎన్టీఆర్ హీరోయిన్ను పరిచయం చేసిన వై.వి.ఎస్.చౌదరి (ఫోటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి సెగల్ గుడ్న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోనాలి టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సోనాలి సెగల్- అశేష్ సజ్నాని దంపతులకు కూతురు పుట్టింది. ఇది వారికెంతో సంతోషకరమైన సమయం. నవంబర్ 27న సాయంత్రం సోనాలి బిడ్డకు జన్మనిచ్చింది అని రాసుకొచ్చారు.బీర్ బాటిల్స్కు బదులు పాల సీసాలుకాగా సోనాలి ఈ ఏడాది ఆగస్టు 16న తన ప్రెగ్నెన్సీని బయటపెట్టింది. బీర్ బాటిల్స్ పట్టుకునే చేతిలో ఇకపై పాలడబ్బాలు పట్టుకునే సమయం ఆసన్నమైంది. అశేష్ జీవితంలో మార్పు మొదలుకానుంది. నా విషయానికి వస్తే ఇప్పటివరకు నా ఒక్కదానికోసమే తిన్నాను, ఇప్పుడేమో ఇద్దరికోసం తింటున్నాను. గతేడాది పెళ్లిమా కుక్కపిల్ల కూడా రాబోయే బేబీతో ఎలా ఆడుకోవాలా? అని ఆలోచిస్తోంది. డిసెంబర్లో డెలివరీ డేట్ ఉంది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. కాగా హీరోయిన్ సోనాలి, రెస్టారెంట్ యజమాని అశేష్ ఐదేళ్లపాటు డేటింగ్ చేశారు. గతేడాది జూన్లో సిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే సోనాలి సెగల్.. ప్యార్ కా పంచనామా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా 2, హైజాక్, జై మమ్మీదీ, జో తేరా హై వో మేరా హై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్లాక్ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by One Communication (@one__communication) -
హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య
తొలిచూపులోనే ప్రేమ.. పరిచయమైన పదిహేను రోజుల్లోనే పెళ్లి.. ఇవన్నీ సినిమాలోనే ఉంటాయనుకునేరు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జరీనా వాహబ్ జీవితంలోనూ ఇదే జరిగింది. మతాలు వేరైనా మనసులు కలవడంతో జరీనా, హీరో ఆదిత్య పంచోలి పెళ్లి చేసుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు.36 ఏళ్ల దాంపత్యం తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీనా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ఓ సినిమా చేస్తున్న సమయంలో నిర్మల్ (ఆదిత్య పంచోలి అసలు పేరు)ను కలిశాను. అతడు నాకంటే చిన్నవాడు. మీరు నమ్ముతారో, లేదో గానీ మేము కలుసుకున్న 15-20 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకంటే ఎక్కువ కలిసుండలేరని విమర్శించారు. ఇప్పుడేమైంది? 36 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం. మా ఆయన ఉత్తమ భర్తఅయితే అతడు ఎవరితోనైనా ఎఫైర్స్ పెట్టుకునే ఛాన్స్ ఉందని నేను ముందుగానే ఊహించాను. ఇంటికి వచ్చాక నాతో ఎలా ఉంటున్నాడనేది మాత్రమే పట్టించుకున్నానే తప్ప తన ఎఫైర్స్ గురించి ప్రశ్నించేదాన్ని కాదు. అతడి మాజీ గర్ల్ఫ్రెండ్స్ అన్నట్లుగా అతడేమీ కిరాతకుడైతే కాదు. ఎన్నడూ నాపై చేయెత్తలేదు. బహుశా వాళ్లు కోరుకుంది దక్కలేదని అతడిపై నిందలు వేశారంతే! ఆదిత్య ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! అని చెప్పుకొచ్చింది.ఆదిత్యపై హీరోయిన్ల ఫిర్యాదుకాగా ఆదిత్య పంచోలి కంటే జరీనా వయసులో ఆరేళ్లు పెద్దది కావడం గమనార్హం. వీళ్ల వివాహం 1986లో జరిగింది. తర్వాత ఇతడు హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. 1993లో పూజా బేడీ.. ఆదిత్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2004లో కంగనా రనౌత్.. ఆదిత్య తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది. అత్యాచారం చేశాడంటూ 2019లో పోలీస్ కేస్ కూడా పెట్టింది.చదవండి: బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్ -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
హీటెక్కిస్తున్న కీర్తి సురేష్ (ఫోటోలు)
-
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
చీరకట్టులో కొత్త హీరోయిన్ షాజ్ఞ శ్రీ వేణున్ మెరుపులు (ఫొటోలు)
-
తెలుగు హీరోతో పెళ్లి.. రెండేళ్లకే విడాకులు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)
-
ఒక్కరు కాదు ఇద్దరు.. పుష్ప రాజ్ తగ్గేదేలే
-
హీరోయిన్లా మెరిసిపోతున్న టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫోటోలు)
-
షాపులో నగలన్నీ చిరంజీవి హీరోయిన్ ఒంటిపైనే! (ఫొటోలు)
-
సాగర తీరాన మన్మధుడు హీరోయిన్.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
-
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
రచ్చ సినిమాలో కనిపించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా..? (ఫోటోలు)
-
జగేశ్వర్ ధామ్లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
దుబాయ్లో చిల్ అవుతున్న బర్త్డే గాళ్ (ఫొటోలు)
-
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్ ఇచ్చిన హీరోయిన్తో జోడీ (ఫోటోలు)
-
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
రాంగోపాల్ వర్మ కోసం భారీ ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
చీరకట్టులో హీరోయిన్ ప్రణీత.. ఇంత అందంగా ఉందేంటి!
-
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
పూజా కన్నన్ హల్దీ ఫంక్షన్.. అందరి కళ్లు సాయిపల్లవిపైనే! (ఫోటోలు)
-
మాయలేడిని అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బెదిరింపులు!
సాక్షి, అమరావతి : బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరి జత్వానీ అత్యంత వివాదాస్పదురాలు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లు తదితరులను లక్ష్యంగా చేసుకుని ‘వలపు వల (హనీ ట్రాప్)’ వేసి...అనంతరం బ్లాక్ మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు. అందుకోసం సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతూ మరీ భారీగా ఆస్తులను కొల్లగొట్టడం ఆమె చరిత్ర. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయి. అయితే ఈ మాయలేడి బ్లాక్ మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసింది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికినకాడికి దండుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు.. ఇన్నాళ్లూ ప్రత్యర్థి పార్టీ వరకే పరిమితం చేసిన వేధింపులను తాజాగా పారిశ్రామికవేత్తలకూ వర్తింపజేశారు. ఈ పరంపరలో బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ను తాజాగా ఈ కేసులోకి లాగుతున్నారు. ఇందుకు ఎల్లో మీడియా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఊతమిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజస్ పరిశ్రమను.. వైఎస్సార్ జిల్లాలో జువారి, దాలి్మయా సిమెంటు పరిశ్రమల యాజమాన్యాన్ని సర్కారు పెద్దలు ముడుపుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను ముడుపుల కోసం వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా సరే టీడీపీ పెద్దలు బరితెగించి మరీ బాడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వ పన్నాగంగా ఉంది. దండుకునే దందా.. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వలపు వల (హానీ ట్రాప్) పేరుతో బ్లాక్ మెయిలింగ్ దందా అది పెద్ద సమస్యగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి.. అనంతరం వారీ నుంచి భారీగా డబ్బులు, ఆస్తులు కొల్లగొట్టడం ఓ మాఫియాస్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి ఓ హనీట్రాప్ కేసును వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు అత్యంత సమర్థంగా సత్వరం పరిష్కరించి శభాష్ అనిపించారు. పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసి.. న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని ముంబయి నుంచి తీసుకువచి్చ... విజయవాడ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అంతా చట్ట ప్రకారం వ్యవహరించారని అందరూ ప్రశంసించారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వ్యవహారంలో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డ ఘరానా మోసగత్తెకు వత్తాసు పలుకుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే ‘హనీట్రాప్ స్పెషలిస్ట్’ కాదంబరీ జత్వానీని అడ్డంపెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం ఐపీఎస్ అధికారులకు గురిపెట్టింది. రెడ్బుక్ రాజ్యాంగం సృష్టిస్తు న్న టెర్రర్లో మరో అంకానికి తెరతీసింది. వలపు వల.. ఆపై బ్లాక్ మెయిలింగ్ వలపు వల, బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ దందా కోసం కాదంబరీ జత్వానీ పకడ్బందీగా వ్యవహరించేవారు. పోలీసుల విచారణలో ఆమె అక్రమాలలన్నీ పూర్తి ఆధారలతో సహా బట్టబయలయ్యాయి. అవేమిటంటే.. కాదంబరీ జత్వానీకి రెండు పాస్ పోర్టులు, రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరి వద్ద ఒక్కో పేరుతో పరిచయం చేసుకునేది. ఈ పకడ్బందీ దందాలో కదాంబరీ తమ్ముడు అంబరీశ్ జత్వానీ కూడా ప్రధాన పాత్రధారే. దుబాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తన తమ్ముడికి అండర్ వరల్డ్ మాఫీయాతో సంబంధాలు ఉన్నాయని... ఆ మాఫియా ద్వారా అంతం చేస్తామని కూడా కాదంబరీ తీవ్ర స్థాయిలో బెదిరించే వారు. మాఫియాతో సంబంధాలు ఉండటమే కాదు హవాలా రాకెట్ను కూడా అతను నిర్వహించే వాడు. ఈ విధంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరులతోపాటు దేశంలోని పలు నగరాల్లోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్ మెయిలింగ్కు పాల్పడి భారీగా ఆస్తులు కొల్లగొట్టారు. ఏసియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దానీ కూడా ఆమె బాధితుల జాబితాలో ఉన్నారు. ఆయన ఫిర్యా దుతో ముంబయిలోని గమ్దేవీ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే రీతిలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్పై తప్పుడు ఆరోపణలతో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడింది. అంతా చట్టబద్ధంగానే.. తనకు అలవాటైన రీతిలోనే కాదంబరీ జత్వానీ ఓ రాజకీయ నేత కుక్కల విద్యాసాగర్పై వలపు వల విసిరి అనంతరం బ్లాక్ మెయిలింగ్కు పాల్పడింది. ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దుబాయిలోని మాఫియాతో అంతం చేయిస్తానని బెదిరించింది. విద్యాసాగర్కు చెందిన జగ్గయ్యపేటలో సర్వే నంబరు 396/2ఏ2హెచ్/1తో 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో సొంతం చేసుకుంది. ఆ భూమిని మరొకరికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసాగర్కు విషయం తెలిసింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చట్టానికి లోబడి విచారణ నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మెజిస్ట్రీట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ముంబయి వెళ్లారు. ముంబయి పోలీçసు ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే కాదంబరీ జత్వానీని అరెస్ట్ చేసి అక్కడి మేజి్రస్టేట్ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమరి్పంచిన ఆధారాలతో సంతృప్తి చెందిన మెజి్రస్టేట్.. ఆమెను ఏపీకి తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు. దాంతో కాదంబరీ జత్వానినీ పోలీసులు విజయవాడ తీసుకువచ్చి అదే రోజు స్థానిక మెజిస్ట్రీట్ ఎదుట హాజరు పరిచారు. మెజిస్ట్రీట్ రిమాండ్ విధించంతో ఆమెను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆమె కొన్నాళ్లు ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండి, తర్వాత ముంబయికి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సినీ నటి అరెస్టులో అంతా చట్టబద్ధంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆమెకు న్యాయవాదుల సహాయం అందించేందుకు పోలీసులు సంసిద్ధత చూపారు. కానీ ఆమె అందుకు తిర స్కరించి ముంబయి నుంచి తన సొంత న్యాయవాదులను రప్పించుకున్నారు. ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించారు. న్యాయస్థానాల అనుమతితో, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ పూర్తి చేశారు. దేశంలోనే ఎందరో బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్మెయిలింగ్కు పాల్పడూ మోసం చేస్తున్న కాదంబరీ నేరాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను అభినందించాల్సింది పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం.. పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలతో వేధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సర్కారే లీకులిచ్చి.. భారత రాజ్యాంగాన్ని గౌరవించం అని, తాము అమలు చేసేది లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగమేనని టీడీపీ కూటమి ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలను వేధించడమే ధ్యేయంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే కాదంబరీ జత్వానీ కేసును నేపథ్యంగా తీసుకుని పోలీసు అధికారులకు గురి పెట్టింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించి అవాస్తవాలు, అభూతకల్పనలను టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచి్చంది. తద్వారా ఆ పోలీసు అధికారులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తోంది. టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలతో కథనాలు... పచ్చ టీవీ చానళ్లలో రోజంతా చర్చలతో రాద్ధాంతం చేస్తోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి.. కాదంబరీ జత్వానీ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలపై విచారించాలని విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్ను గురువారం విచారణాధికారిగా నియమించింది. -
స్పోర్ట్స్ ప్రజెంటర్ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ..
తమ అందాన్ని కాపాడుకోవాలని జాగ్రత్తపడే తారలు కొందరైతే దాన్ని రెట్టింపు చేసుకోవాలని ఉబలాటపడే బ్యూటీలు మరికొందరు. పెద్దగా అవకాశాల్లేక, వెండితెరకు దూరంగా ఉండే ముద్దుగుమ్మలైతే రీఎంట్రీ కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీ ఆయేషా టకియా కూడా అదే కోవలోకి వస్తుంది. సూపర్ సినిమాతో తెలుగులో అదరగొట్టిన ఈ హీరోయిన్ బాలీవుడ్లో దిల్ మాంగే మోర్, టార్జాన్, సలాం ఇ ఇష్క్, వాంటెడ్, పాఠశాల వంటి హిట్ చిత్రాల్లో నటించింది.13 ఏళ్లుగా వెండితెరకు దూరం2011లో వచ్చిన మోద్ సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది ఓ మ్యూజిక్ రియాలిటీ షోలోనూ తళుక్కుమని మెరిసింది. అనంతరం సోషల్ మీడియాలో మాత్రమే అలరిస్తోంది. తాజాగా ఆమె నీలిరంగు చీర కట్టి ఓ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో వదలగా అది వైరల్గా మారింది. అందులో ఆమె పెదాలు ఉబ్బిపోయి ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు తన లుక్ ఏమీ బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు.గుర్తుపట్టలేనట్లుగా మారిపోయిందే..నువ్వు ఏడాది క్రితమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావని తెలుసు. కానీ ఈ పోస్టులో మాత్రం అస్సలు గుర్తుపట్టలేనట్లే ఉన్నావు, తను ఆయేషా టాకియా అంటే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు తన సినిమాలు చూసి ముచ్చటపడిపోయాను. ఇప్పుడేంటి, ఇలా అయిపోయింది?, ఒకప్పుడు బాలీవుడ్లో రాణిగా వెలుగు వెలిగింది.. రీఎంట్రీ కోసమే ఈ అవతారం ఎత్తిందా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా లిప్ ఫిల్లర్స్ వేయించుకున్న తర్వాత ఈ బ్యూటీ ముఖమే మారిపోయింది. View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) -
వరలక్ష్మి వ్రతం పూజలో సీనియర్ హీరోయిన్ లయ (ఫోటోలు)
-
ప్రభాస్కు జోడీగా ఈ ముద్దుగుమ్మ! ఇమాన్వీ ఎవరంటే..?
-
Samyuktha Menon: శారీలో అలా.. హారంతో ఇలా.. బింబిసార హీరోయిన్ లుక్స్ చూశారా?
-
Taapsee Pannu: పారిస్ ఒలింపిక్స్లో చీరలతో అలరిస్తున్న తాప్సీ..! (ఫోటోలు)
-
Hansika Motwani: పుట్టినరోజు జరుపుకుంటున్న హన్సికా మోత్వాని రేర్ ఫోటోలు
-
అప్పుడేమో పద్ధతి.. ఇప్పుడు హాట్నెస్.. రితిక గ్లామర్ డోస్ (ఫొటోలు)
-
నేహా శెట్టి గ్లామర్కు 'డిజె టిల్లు'తో పాటు ఎవడైనా పడిపోవాల్సిందే (ఫోటోలు)
-
అదిరిపోయే అవుట్ఫిట్తో ప్రియమణి స్టన్నింగ్స్ లుక్స్ (ఫోటోలు)
-
Digangana Suryavanshi: వావ్ అనిపిస్తున్న 'శివం భజే' హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
-
ఫ్యామిలీని పరిచయం చేసిన హీరోయిన్ నభా నటేశ్ (ఫొటోలు)
-
Anupama Parameswaran: ఉఫ్.. వర్షంలోనూ చెమటలు పట్టిస్తున్న బ్యూటీ (ఫోటోలు)
-
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ (ఫొటోలు)
-
ఆ డ్రెస్సేంటి? మెడలో ఆ నెక్సెట్ ఏంటి? వెరైటీ లుక్లో హన్సిక
-
70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్
అనూష కృష్ణ.. పేరుకు కన్నడమ్మాయే కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. పక్కింటమ్మాయిలా కనిపించే ఈమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింది. యాక్టింగ్ కోసం ఉద్యోగాన్ని మానేసింది. ఇంట్లోవాళ్లు తిట్టినా సరే ఇండస్ట్రీలో ప్రయత్నిద్దామన్న బలమైన కోరికతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పేకమేడలు సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.అవకాశాల కోసం అన్నీ చేయలేను'నేను 70కి పైగా ఆడిషన్స్కు వెళ్లాను. కన్నడలో రెండు సినిమాలు చేశాను. కానీ ఇంకా రిలీజవ్వలేదు. కొన్ని ఆడిషన్స్లో మీరిలాగే చిన్న సినిమాలు చేస్తారా? పెద్ద చిత్రాలు చేస్తారా? అని ఆప్షన్స్ ఇస్తారు. వాళ్లు చెప్పినవాటికి తలూపి పెద్ద సినిమాలు నేను చేయలేను. నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. వాటిని దాటలేను. చిన్న సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పేదాన్ని.చేదు అనుభవంఒకసారైతే భయంకరమైన సంఘటన జరిగింది. దర్శకనిర్మాతలు మాకు నచ్చేశావన్నారు. అయితే ఆ నిర్మాత వయసు సుమారు 60 ఏళ్లుంటుంది. ఆయన మీరు కాంప్రమైజ్ అయితే సినిమా చేసేద్దామన్నారు. భయంతో వణికిపోయాను. నాకు ఎంగేజ్మెంట్ అయిందని అబద్ధం చెప్పాను. అయినా పర్లేదన్నాడు. వెంటనే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయాను. నేను బోరుమని ఏడుస్తుంటే ఆ కారు డ్రైవర్ ఏమైంది మేడమ్.. అంతా బానే జరుగుతుందని ఓదార్చాడు. పేకమేడలు షూటింగ్ అయిపోయాకే ఈ సంఘటన జరిగింది' అని అనూష తెలిపింది.చదవండి: మోసపోయా.. ఇప్పటికీ నాకు పారితోషికం చెల్లించలేదు: స్టార్ హీరో -
వృద్ధాశ్రమంలో హీరోయిన్ బర్త్డే సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
30 ఏళ్లలోపు పెళ్లి.. కల నెరవేరిందంటున్న లియో నటి (ఫోటోలు)
-
Kriti Sanon: మహారాణిలా వెలిగిపోతున్న ఆదిపురుష్ హీరోయిన్ (ఫోటోలు)
-
సైకాలజీ చదివిన బ్యూటీ.. ప్రత్యేక పూజలు ఎందుకు చేయించుకున్నట్లో? (ఫోటోలు)
-
‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ స్టయిల్ చూశారా?
-
రెండో సినిమాకే రూ.100 కోట్లు.. ఎవరీ బ్యూటీ (ఫోటోలు)
-
ముంగురులతో హీరోయిన్ ప్రియాంక మోహన్.. క్యూట్నెస్ వేరే లెవల్ (ఫొటోలు)
-
Preethi Pagadala: పతంగ్ హీరోయిన్ ఎంత క్యూట్గా ఉందో! (ఫోటోలు)