india vs west indies
-
టీ20 వరల్డ్కప్లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి 38.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆరు వికెట్లతో విజృంభించగా.. రేణుకా ఠాకూర్ నాలుగు వికెట్లు నేలకూల్చింది.నిప్పులు చెరిగిన రేణుకాఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా పేసర్ రేణుకా సింగ్ నిప్పులు చెరిగింది. తొలి బంతికే ఓపెనర్ క్వియానా జోసఫ్ను ఔట్ చేసిన రేణుకా.. అదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ను క్లీన్ బౌల్డ్ చేసింది. అనంతరం రేణుకా ఐదో ఓవర్లో మరో వికెట్ పడగొట్టింది. ఈసారి ఆమె స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో వెస్టిండీస్ 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దీప్తి శర్మ మాయాజాలంవిండీస్ పతనానికి రేణుకా సింగ్ పునాది వేయగా.. ఆతర్వాత పనిని దీప్తి శర్మ పూర్తి చేసింది. దీప్తి ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. మధ్యలో షెమెయిన్ క్యాంప్బెల్ (46), చిన్నెల్ హెన్రీ (61) నిలకడగా ఆడినప్పటికీ.. ఈ ఇద్దరిని దీప్తి స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు పంపింది. విండీస్ ఇన్నింగ్స్లో క్యాంప్బెల్, హెన్రీతో పాటు ఆలియా అలెన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.సిరీస్ సొంతంమూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ భారీ తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఈ రెండు వన్డేల్లో భారత్ భారీ స్కోర్లు నమోదు చేసింది. వన్డే సిరీస్కు ముందు జరిగిన టీ20 సిరీస్ను సైతం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వడోదర వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 115 పరుగుల తేడాతో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగులు వరద పారించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (103 బంతుల్లో 115; 16 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జోరుమీదున్న ఓపెనర్ స్మృతి మంధాన (53; 7 ఫోర్లు, 2 సిక్స్లు), మరో ఓపెనర్ ప్రతీక రావల్ (76; 10 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. తద్వారా వన్డేల్లో భారత్ తమ అత్యధిక స్కోరును సమం చేసింది. 2017లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ భారత జట్టు 358 పరుగులే సాధించింది. అంతేకాకుండా మరో అరుదైన రికార్డు కూడా భారత్ తమ ఖాతాలో వేసుకుంది.తొలి జట్టుగా..మహిళల వన్డే క్రికెట్లో వెస్టిండీస్పై అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. 2011లో లీసెస్టర్ వేదికగా విండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో ఇంగ్లండ్ ఆల్టైమ్ రికార్డును మన అమ్మాయిలు బ్రేక్ చేశారు.మాథ్యూస్ సెంచరీ వృథా..359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ (109 బంతుల్లో 106; 13 ఫోర్లు) శతకం సాధించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, దీప్తి శర్మ, టిటాస్, ప్రతీక తలా 2 వికెట్లు తీశారు. కాగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే డిసెంబర్ 27న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IND vs AUS: ఆసీస్తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్? -
రెండో వన్డేలో వెస్టిండీస్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
వడోదర వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో టెస్టులో 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత అమ్మాయిలు కైవసం చేసుకున్నారు.డియోల్ సూపర్ సెంచరీ.. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.హర్లీన్ డియోల్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా వన్డేల్లో భారత్ 350కిపైగా స్కోరు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్పై కూడా సరిగ్గా 358/5 స్కోరు చేసింది. ఇక విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, జైదా జేమ్స్, క్వినా జోసెఫ్, డాటిన్ తలో వికెట్ తీశారు.మాథ్యూస్ ఒంటరి పోరాటం..అనంతరం భారీ లక్ష్య చేధనలో వెస్టిండీస్ మహిళల జట్టు 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ హీలీ మథ్యూస్ విరోచిత పోరాటం కనబరిచింది. మథ్యూస్ సూపర్ సెంచరీతో చెలరేగింది. 109 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మాథ్యూస్ 106 పరుగులు చేసింది.అయితే మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో విండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తీ శర్మ, ప్రతికా రావల్,టిటాస్ సాదు తలా రెండు వికెట్లు సాధించారు. -
భారత బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 358 పరుగులు
వడోదర వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మన అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగారు.విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన బ్యాటర్లు తమపని తాము చేసుకుపోయారు.భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. హర్లీన్ డియోల్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక విండీస్ బౌలర్లలో డొటిన్, ఫ్లెచర్, జేమ్స్, జోషఫ్ తలా వికెట్ సాధించారు. కాగా వన్డేల్లో భారత మహిళ జట్టు 358 పరుగులు చేయడం ఇది రెండో సారి. అదనంగా మరో పరుగు చేసి ఉంటే భారత్కు అత్యధిక వన్డే స్కోర్ను నెలకొల్పేది. గతంలో 2017లో ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.చదవండి: WI vs PAK: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడికి చోటు -
T20 World CUP 2025: భారత జట్టు ప్రకటన
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. మలేషియా వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు నికీ ప్రసాద్(Niki Prasad) కెప్టెన్గా వ్యవహరించనుండగా.. సనికా చాల్కే వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. వికెట్ కీపర్ల కోటాలో జి. కమలిని, భవికా అహిరే చోటు దక్కించుకున్నారు.ఇక నిక్కీ సారథ్యంలోని భారత జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు గొంగడి త్రిష(G Trisha), కేసరి ధృతి, ఎండీ షబ్నమ్ కూడా స్థానం సంపాదించారు. మరోవైపు.. స్టాండ్ బై ప్లేయర్లుగా నంధాన ఎస్, ఐరా జె, టి అనధి ఎంపికయ్యారు.పదహారు జట్ల మధ్య పోటీకాగా మలేషియాలో జరిగే అండర్-19 మహిళల ప్రపంచకప్ టోర్నీ(U19 Women’s T20 World Cup)లో మొత్తం పదహారు జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- ‘ఎ’లో భారత్తో పాటు మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో జనవరి 19న వెస్టిండీస్తో తలపడుతుంది.డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి భారత్అనంతరం.. జనవరి 21న మలేషియా, 23న శ్రీలంకతో మ్యాచ్లు ఆడుతుంది. ఇక నాలుగు గ్రూపులలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ స్టేజ్లో అడుగుపెడతాయి. ఈ దశలో రెండు గ్రూపులలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. కాగా 2023లో తొలిసారి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ నిర్వహించగా.. భారత జట్టు చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని డిఫెండింగ్ చాంపియన్ పట్టుదలగా ఉంది.అండర్ -19 మహిళల ప్రపంచకప్ 2025కి భారత జట్టునికీ ప్రసాద్(కెప్టెన్), సనికా చాల్కే(వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, జి. కమలిని(వికెట్ కీపర్), భవికా ఆహిరే(వికెట్ కీపర్), ఈశ్వరి అవసారే, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుశి శుక్లా, ఆనందితా కిషోర్, ఎండీ షబ్నమ్, వైష్లవి ఎస్.స్టాండ్ బై ప్లేయర్లు: నంధాన ఎస్, ఐరా జె, టి అనధి.చదవండి: IND W Vs BAN W: ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్.. తొలి వన్డేలో విండీస్ ఘోర పరాజయం
వడోదరా వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 211 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.సెంచరీ చేజార్చుకున్న మంధనఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది.నిప్పులు చెరిగిన రేణుకా సింగ్.. తొలి ఐదు వికెట్ల ఘనత315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. రేణుకా సింగ్ (10-1-29-5) ధాటికి 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. రేణుకా సింగ్కు కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్తో పాటు టైటాస్ సాధు (7-2-24-1), ప్రియా మిశ్రా (4.2-0-22-2), దీప్తి శర్మ (3-0-19-1) కూడా రాణించారు. విండీస్ ఇన్నింగ్స్లో క్యాంప్బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24 నాటౌట్), ఆలియా ఎలెన్ (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.తొలి వన్డేలో గెలుపుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే డిసెంబర్ 24న వడోదరా వేదికగానే జరుగనుంది. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మంధన.. టీమిండియా భారీ స్కోర్
వడోదరా వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (డిసెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో భారత టెయిలెండర్లు తడబడ్డారు. లేకపోతే టీమిండియా ఇంకా భారీ స్కోర్ చేసుండేది. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది. కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 24, 27 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. -
స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్గా
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అదరగొట్టిన మంధాన.. స్వదేశంలో వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్లోనూ అదే దూకుడు కనబరిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన మంధాన.. గురువారం జరిగిన ఆఖరి టీ20లోనూ తన బ్యాట్కు పనిచెప్పింది. ఈ మ్యాచ్లో స్మృతి విధ్వంసం సృష్టించింది. కేవలం 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మంధాన సాధించిన రికార్డులు ఇవే..👉మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 30 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ వెటరన్ సుజీ బేట్స్(29) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బేట్స్ ఆల్టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది.అత్యధిక పిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్లు వీరే..స్మృతి మంధాన (భారత్) -30సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 29బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 25స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)- 22సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 22👉అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్గా సైతం మంధాన రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 21 టీ20 ఇన్నింగ్స్లలో స్మృతి 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్లు (720 పరుగులు) పేరిట ఉండేది. -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్లో భారత మహిళా జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్తో వెస్టిండీస్ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
మంధన మెరుపు అర్ద శతకం.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసింది. వికెట్కీపర్ రిచా ఘోష్ 17 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. దీప్తి శర్మ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగెజ్ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. మంధన క్రీజ్లో ఉండగా భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. భారత ఇన్నింగ్స్లో ఉమా ఛెత్రి 4, రాఘ్వి బిస్త్ 5, సంజీవన్ సజనా 2, రాధా యాదవ్ 7, సైమా ఠాకోర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. టిటాస్ సాధు 1, రేణుకా ఠాకూర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, చిన్నెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీ కాగా, స్మృతి మంధన టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనుంది. కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. స్మృతి మంధన తొలి మ్యాచ్లో కూడా అర్ద సెంచరీతో (54) మెరిసింది. -
Ind vs WI: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.తొలి మ్యాచ్లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్లు వదిలేశారు. బౌలింగ్లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది. -
IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.కాగా, మూడు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో టీ20 మ్యాచ్లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్లకు వడోదర వేదిక కానుంది.ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ మూడు మ్యాచ్ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్పై వేటు
వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్కు ఫామ్లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ మిస్ -
కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి, రవిశాస్త్రి తనకు పునర్జన్మను ప్రసాదించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వారిద్దరి వల్లే తన రెండో ఇన్నింగ్స్ మొదలైందని.. తనను టాపార్డర్కు ప్రమోట్ చేసి ఓపెనర్గా అవకాశమిచ్చింది కూడా వారేనంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా 2013లో కోల్కతా వేదికగా వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అడుగుపెట్టాడు.అరంగేట్రంలోనే అద్భుత శతకంతొలి మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే అద్భుత శతకం(177)తో ఆకట్టుకున్నాడు. విండీస్తో నాటి సిరీస్లో జరిగిన ఈ తొలి టెస్టులో ధోని సేన ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తన రెండో టెస్టులోనూ శతక్కొట్టి వారెవ్వా అనిపించాడు. కానీ టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.దాదాపు ఆరేళ్ల పాటు చోటే కరువుఅరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు భారత టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మకు స్థానమే కరువైంది. అయితే, 2018-19లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో రోహిత్ చోటు దక్కించుకోగలిగాడు. ఈ సిరీస్లోనూ అతడు ఆరో స్థానంలోనే బరిలోకి దిగాడు.అలా రీఎంట్రీఇక ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాదినా.. టెస్టుల్లో మాత్రం రోహిత్ రాత పెద్దగా మారలేదు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత వెస్టిండీస్తో ఆడిన టెస్టు సిరీస్లో అతడిని బెంచ్కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, నాడు ఓపెనర్గా ఉన్న కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో.. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి రోహిత శర్మను ఓపెనర్గా బరిలోకి దించారు. ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్అప్పటి నుంచి రోహిత్కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్ కెప్టెన్గా ఎదగడమే గాకుండా.. భారత్ను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు చేర్చిన సారథిగానూ ఘనత సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్తో సొంతగడ్డపై టీమిండియాను గెలిపించి.. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వేటలో జట్టును నిలిపాడు.వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారుఈ నేపథ్యంలో కామెంటేటర్ జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టెస్టు కెరీర్ రెండో ఇన్నింగ్స్లో రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలకు నేను చాలా రుణపడిపోయాను. నన్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది వాళ్లే. టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపడం అంత సులువు కాదు. అయినా, వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు.తొలి బంతికే అవుటయ్యానునా ఆటను పరిశీలించేందుకు ఓ ప్రాక్టీస్మ్యాచ్ ఆడమని చెప్పారు. అయితే, అప్పుడు నేను తొలి బంతికే అవుటయ్యాను. ఇక నాకు ఓపెనర్గా ఎలాంటి అవకాశం లేదని నిరాశచెందాను. టెస్టుల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలోనైనా.. లేదంటే లోయర్ఆర్డర్లోనైనా బ్యాటింగ్కు వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యాను.నమ్మకం నిలబెట్టుకుంటూకానీ రవి భాయ్ టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపాలని భావించాడు. 2015లోనే నాకు ఈ అవకాశం వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ తర్వాత రవిభాయ్, కోహ్లి వల్ల టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లి పట్ల ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా రోహిత్ తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్తో బిజీ కానున్నాడు. చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ While @ImRo45 Rohit’s legacy in test cricket is being discussed - Here’s a little story of his comeback into test cricket .. Also a sneak peek into how @RaviShastriOfc and @imVkohli planned India’s ascendancy in tests. pic.twitter.com/LO0jVtqP7O— Jatin Sapru (@jatinsapru) October 1, 2024 -
గొప్ప మనసు చాటుకున్న ధోని
రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గత కొద్ది రోజులగా నిలకడలేమి ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరహా ఆటతో చివరకు టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు. మరోవైపు ధోని బ్యాట్ ఝుళిపించకపోయినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అతను ఆడకపోయినా ఆటలోని అతని వ్యూహాలు... మార్క్ కీపింగ్తో అభిమానులు తమ గుండెల్లో పదిలంగా ఉంచుకుంటున్నారు. వారి అభిమానాన్ని ఒక్కోలా వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్తో చివరి వన్డే సందర్భంగా కేరళ గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట 35 అడుగుల ఎత్తైన ధోని కటౌట్ను ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. (చదవండి: 35 అడుగుల ధోని కటౌట్..) ధోని కూడా వారి అభిమానులను అలరిస్తూ సంతోషపరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ధోని తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ కార్యక్రమానికి వెళ్లొస్తున్న ధోనికి ఓ చిన్నారి అభిమాని కనిపించాడు. వెంటనే ప్రొటోకాల్ను సైతం పక్కన పెట్టి ధోని కారులో నుంచే ఆ అభిమానితో ముచ్చటించాడు. షేకాండ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ధోని భాయ్ గొప్ప మనసంటూ.. అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ధోని వన్డేల్లో 10వేల పరుగుల మైలు రాయి అందుకోవడానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో ధోని 10,174 పరుగులు చేయగా.. ఇందులో వరల్డ్ ఎలెవన్ జట్టు తరపున చేసిన 174 పరుగలున్నాయి. (చదవండి: ధోని ఇక.. కబడ్డీ కబడ్డీ!) ఈ ఏడాది ధోని దారుణంగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్లాడిన ధోని కేవలం 252 పరుగులు మాత్రమే చేశాడు. ఈ తరహా ఆటతోనే టీ20ల్లో చోటు కోల్పోయాడు. ఇక ధోనిని జట్టుకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతని అభిమానులు ఆరోపిస్తుండగా.. ధోనిని పక్కనే పెట్టే ఉద్దేశం లేదని, ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కోసమే అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు సెలక్టర్లు పేర్కొన్నారు. ధోని లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటేనని హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ( చదవండి: ధోని లేకపోవడం లోటే) RT msdfansofficial: Man with Golden Heart. Just look at the way, he is adoring his little fan. msdhoni SaakshiSRawat#MSDhoni #Dhoni #mahiway pic.twitter.com/WpByIlp0hi — DASA🚩🚩 (@dasa_____) November 13, 2018 -
పాకిస్తాన్ను వెనక్కునెట్టిన భారత్
చెన్నై: వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా పొట్టి ఫార్మాట్లో తన విజయాల సంఖ్యను భారత్ మరింత పెంచుకుంది. ఈ క్రమంలోనే టీ20 విజయాల శాతంలో పాకిస్తాన్ను వెనక్కునెట్టిన భారత్ రెండో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. గత పుష్కరకాలం నుంచి చూస్తే భారత్ ఇప్పటివరకూ 107 టీ20 మ్యాచ్లు ఆడగా, అందులో 68 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. మరో 36 మ్యాచ్ల్లో ఓటమి చూడగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరో రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. దాంతో టీమిండియా విజయాల శాతం 65.23గా నమోదైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ను అధిగమించింది టీమిండియా. విండీస్తో చెన్నై మ్యాచ్లో విజయం తర్వాత పాక్ను వెనక్కునెట్టింది భారత జట్టు. టీ20ల్లో పాక్ విజయాల శాతం 65.10గా ఉండగా, దాన్ని టీమిండియా బ్రేక్ చేసింది. గత కొంతకాలంగా టీ20ల్లో పాకిస్తాన్ తిరుగులేని జట్టుగా ఎదిగిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే ఆ జట్టు ప్రస్తుతం నంబర్వన్ ర్యాంకులో కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా సాధిస్తున్న విజయాలు టీమిండియాలో నిలకడను చాటిచెబుతున్నాయి. అంతర్జాతీయ 20ల్లో విజయాల శాతంలో అఫ్గానిస్తాన్ టాప్ ప్లేస్లో ఉంది. అఫ్గానిస్తాన్ టీ20లు ఆడటం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ చూస్తే విజయాల శాతం 67.24గా ఉంది. -
పరుగుల వీరుల్లో ధావన్ పైపైకి..!
చెన్నై: వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ శిఖర్ ధావన్.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు(అంతర్జాతీయ మ్యాచ్ల్లో) సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.. విండీస్తో మూడో టీ20లో ధావన్ 92 పరుగులతో మెరిశాడు. ఫలితంగా ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో ధావన్ 572 పరుగులతో మూడో స్థానానికి ఎగబాకాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(641) టాప్ ప్లేస్లో ఉన్నాడు. 2016లో విరాట్ కోహ్లి ఈ మార్కును చేరాడు. ఆ తర్వాత స్థానంలో ఫకార్ జమాన్(576-2018) రెండో స్థానంలో ఉండగా, ధావన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను అధిగమించాడు ధావన్. ఈ ఏడాది ఇప్పటివరకూ టీ20ల్లో రోహిత్ సాధించిన పరుగులు 560. ఇక టీ20 సిరీస్ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్ను గెలవగా, పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ అప్ఘానిస్తాన్తో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూఏఈ,వెస్టిండీస్లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్లను గెలిచాయి. -
‘డబుల్ సెంచరీ’ క్లబ్లో రోహిత్
చెన్నై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల ఫోర్ల కొట్టిన ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో రోహిత్ ‘డబుల్ సెంచరీ’ ఫోర్ల్ క్లబ్లో చేరిపోయాడు. నిన్న మ్యాచ్లో రోహిత్ ఫోర్ మాత్రమే కొట్టి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక్కడ భారత తరపున విరాట్ ముందున్నాడు. విరాట్ కోహ్లి 214 ఫోర్లతో ఉండగా, రోహిత్ పేరిట 200 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్(223) ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో అఫ్గానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ షెహజాద్(218) నిలిచాడు. ఆపై వరుస స్థానాల్లో కోహ్లి, మార్టిన్ గప్తిల్, రోహిత్ శర్మలు ఉన్నారు. ఇక్కడ గప్తిల్, రోహిత్లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. చెన్నై టీ20లో భారత్ ఆఖరి బంతికి గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్ల తేడాతో ఛేదించి సిరీస్ను ఘనంగా ముగించింది. ఇక్కడ చదవండి: ఆఖరి బంతికి ముగించారు -
టి20 సిరీస్ భారత్ సొంతం
-
చెన్నై టీ20లో భారత్ విజయం
చెన్నై: చెన్నై వేదికగా వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో విండీస్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో సిరీస్ను సొంతం చేసుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్ విజయంతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ ధాటిగా ఆడింది. బ్రేవో(43 నాటౌట్), పూరన్ (53 నాటౌట్)లు చేలరేగడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లో 13 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ పాల్ బౌలింగ్లో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా17 పరుగులు చేసి థామస్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్తో కలిసి ధావన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో భారత్ పంత్(38 బంతుల్లో 58 పరుగులు), ధావన్(62 బంతుల్లో 92 పరుగులు) వికెట్లు కోల్పోయినప్పటికీ.. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. -
మ్యాచ్లో ధోని లేకపోయినా..
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని అక్కడి అభిమానులు తమ వాడిగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. పలు నగరాల్లోని ధోని అభిమానుల్లో చాలా మంది ఐపీఎల్లో ఆయన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కోరుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు తమ అభిమాన క్రికెటర్పై గల ఇష్టాన్ని పలు సందర్భాల్లో, పలు రూపాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా విండీస్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్కు హాజరైన ధోని అభిమానులు అతడిపై వారికి గల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మ్యాచ్ జరుగుతుంది చెన్నై కావడంతో.. నేటి మ్యాచ్లో ధోని లేకపోయినప్పటికీ.. చాలా మంది ధోని పేరుతో ఉన్న టీ షర్ట్లను ధరించి మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారు. -
విండీస్తో టీ20: ధావన్ హాఫ్ సెంచరీ
సాక్షి, చెన్నై : భారత్, వెస్టిండీస్ మధ్య జరగునున్న చివరి టీ-20 మ్యాచ్లో విండీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో ఇది వరకే సొంత చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగింది. సిరీస్ క్లీన్స్వీప్ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా.. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన విండీస్ చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అప్డేట్స్ : భారత ఆటగాళ్లు ధావన్, పంత్లు విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ధావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా, పంత్ కూడా ధాటిగా ఆడుతూ.. స్కోర్ను పరుగులు పెట్టిస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 52పరుగులు చేయాల్సి ఉంది. ధాటిగా ఆడుతున్న కేఎల్ రాహుల్ థామస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఫోర్లతో చెలరేగిన రాహుల్ 10 బంతుల్లో 17 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ పాల్ బౌలింగ్లో జౌటయ్యాడు. 2.3 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. చెన్నైలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. గత రెండు మ్యాచ్లను ఓడి సిరీస్ కోల్పోయిన విండీస్ జట్టు ప్రారంభం నుంచి ధాటిగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓపెనర్ ఎస్డీ హోప్ 24 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ హెట్మెయర్ 26 పరుగులకు ఔటయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన డీఎం బ్రావో ఒకవైపు నిలకడగా ఆడుతుండగా.. నాలుగో స్థానంలో వచ్చిన రామ్దిన్ 15 పరుగులు చేసి సుందర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజ్లోకి వచ్చిన నికోలస్ పూరన్ వస్తూనే ధాటిగా ఆడటం ప్రారంభించాడు. మరోవైపు బ్రావో కూడా జోరు పెంచాడు. పూరన్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 25 బంతుల్లో 53 పరుగులు చేయగా.. బ్రావో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి అజేయంగా ఐదో వికెట్కు 87 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా.. సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు. చాహల్ ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టీమిండియాకు 182 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెలరేగి ఆడిన విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ 24 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఎన్ పూరన్, బ్రావో ధాటిగా ఆడుతుండటంతో విండీస్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి కరేబియన్లు మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేశారు. ప్రస్తుతం బ్రావో 26 బంతుల్లో 30 పరుగులు, పూరన్ 14 బంతుల్లో 29 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన విండీస్.. 15 పరుగులు చేసిన రామ్దిన్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి విండీస్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రావో 15 పరుగులు, ఎన్ పూరన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రేవో 12 పరుగులతో, డీ రామ్దిన్ ఏడు పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వెస్టిండీస్ కోల్పోయిన రెండు వికెట్లను చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్, హోప్ (24) ఔట్ ఐదు ఓవర్లు ముగిసే లోపు విండీస్ స్కోర్ : 38/0. హోప్ (17), హెట్మేర్ (16) భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, దినేష్ కార్తిక్, కృనాల్ పాండ్యా, సుందర్, భువనేశ్వర్ కుమార్, కలీల్, చహల్ విండీస్ : వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్. -
రోహిత్ను ఊరిస్తున్న టీ20 రికార్డు
చెన్నై:అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్మన్ రికార్డును తన పేరిట లిఖించుకున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు సాధించడానికి రోహిత్ 69 పరుగుల దూరంలో ఉన్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం వెస్టిండీస్తో జరగబోయే ఆఖరి టీ20లో రోహిత్ ఈ రికార్డును సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్గా న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గఫ్తిల్(2271) అందరికంటే ముందు ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్(2203) కొనసాగుతున్నాడు. గత టీ20లో శతకం సాధించిన రోహిత్ శర్మ.. పలు రికార్డులను బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో గఫ్తిల్ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలంటే.. విండీస్తో ఆఖరి టీ20లో రోహిత్కు మరో 69 అవసరం. భీకరఫామ్లో ఉన్న రోహిత్ శర్మ.. ఆ రికార్డును అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక్కడ చదవండి: రోహితారాజువ్వ కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’ -
మూడో టీ20: సిద్దార్థ్ కౌల్కు అవకాశం
ముంబై : వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి భారత్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్కు అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. రంజీల్లో పంజాబ్ తరపున కౌల్ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇక భారత్ తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు, 2 టీ20లు ఆడిన కౌల్.. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన దృష్ట్యానే సిరీస్కు ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. UPDATE: Umesh Yadav, Jasprit Bumrah & Kuldeep Yadav rested for 3rd Paytm #INDvWI T20I in Chennai@sidkaul22 added to India's squad Details - https://t.co/hqzMTMT8rZ pic.twitter.com/tbdbLBfwEI — BCCI (@BCCI) November 9, 2018 -
ఉప్పల్ టెస్ట్.. టికెట్ డబ్బులు వాపస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు టికెట్లు కొనుగోలు చేసిన వారికి శుభవార్త. గత నెల 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే (అక్టోబర్–14) ముగిసింది. దీంతో 15, 16వ తేదీల్లో మ్యాచ్ వీక్షించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. కాగా... ఆ రెండు రోజుల కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని కోసం ఈ నెల 10న ఉదయం గం. 10 నుంచి సాయంత్రం గం. 6 వరకు జింఖానా గ్రౌండ్స్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. నాలుగో, ఐదో రోజు మ్యాచ్ టికెట్లు కొన్న వారు ఒరిజినల్ మ్యాచ్ టికెట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలతో కౌంటర్ వద్ద సంప్రదించాలి. ఆన్లైన్ ద్వారా కొన్న వారికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపు చేయనున్నారు. మొత్తం మ్యాచ్ వీక్షించేందుకు సీజన్ టికెట్ తీసుకున్న వారికి ఇది వర్తించదు. -
ఎయ్ పొలార్డ్.. ఏందీ తొండాట!
లక్నో: వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో విండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత స్పీడ్స్టార్ జస్ప్రీత్ బుమ్రా వేసిన 11 ఓవర్లో విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ కీరన్ పొలార్డ్ తన అతి తెలివిని ప్రదర్శించాడు. బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. అది బ్యాట్ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది. (చదవండి: అద్భుతం.. ఒకే ఓవర్లో 43 పరుగులు!) ఈ క్యాచ్ అందుకోవడానికి బుమ్రా వెళ్లగా పొలార్డ్ అతని దృష్టిని మరల్చేలా చేయిని కదిపాడు. అయినా క్యాచ్ అందుకున్న బుమ్రా పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూశాడు. అతను మాత్రం నవ్వుతూ క్రీజును వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పొలార్డ్ ఏందీ తొండాట అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ఐపీఎల్లో బుమ్రా, పొలార్డ్ ఒకే జట్టు ( ముంబై ఇండియన్స్) ఆటగాళ్లేనన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యచేధనలో తడబడ్డ విండీస్ 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రం చేయగలిగింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. (చదవండి: నా పేరు కైఫ్... కైఫ్... కైఫ్!) pic.twitter.com/kIEUHDq3ye — Mushfiqur Fan (@NaaginDance) November 6, 2018 -
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
-
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
లక్నో : భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా 71 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో విండీస్ వెనకబడింది. భారత బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. కార్లోస్ బ్రాత్వైట్ 15, ఒషానే థామస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-0 తో సొంతం చేసుకుంది. (ఆపసోపాలతో... ఐదు వికెట్లతో) -
భారత్తో రెండో టీ20.. విండీస్ లక్ష్యం 196
లక్నో : భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్మెన్ చెలరేగారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 111 (8x4, 7x6, బంతులు 61) పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 41 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్కు బాటలు వేశాడు. రోహిత్, ధావన్లు తొలి వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఫస్ట్డౌన్లో వచ్చిన రిషభ్పంత్ 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. లోకేష్రాహుల్ 26 పరుగులతో రోహిత్తో పాటు నాటౌట్గా నిలిచాడు. (చదవండి : కోహ్లి రికార్డుకు చేరువలో రోహిత్) (చదవండి : మ్యాచ్కు ముందు రోజే స్టేడియం పేరు మార్పు) -
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ జరుగుతున్న రెండో టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమించాడు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
లక్నో: భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ-20లో భారత్ విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టులో ఉమేష్ యాదవ్కు బదులుగా భువనేశ్వర్ కుమార్ ఆడుతుండగా, వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ చేరాడు. జట్ల వివరాలు : వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్. భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్(కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్. -
కోహ్లి రికార్డుకు చేరువలో రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు సిద్ధమవుతున్నాడు. మరో 11 పరుగులు చేస్తే కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమిస్తాడు. ప్రస్తుతం 2,092 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ.. వెస్టిండీస్ జరుగునున్న రెండో టీ20లో కోహ్లిని దాటే అవకాశం ఉంది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈరోజు(మంగళవారం) ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగునుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, కోహ్లి నాల్గో స్థానంలో ఉన్నాడు. -
మ్యాచ్కు ముందు రోజే స్టేడియం పేరు మార్పు
లక్నో: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగనుంది. అయితే మ్యాచ్కు ముందు రోజు సోమవారం సాయంత్రమే మ్యాచ్ జరగాల్సిన స్టేడియం పేరును మార్చేశారు. లక్నోలో కొత్తగా నిర్మితమైన ఇకానా అంతర్జాతీయ స్టేడియం పేరును దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరుమీదుగా ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చేశారు. స్టేడియం పేరు మార్పుపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ విమర్శలు చేస్తోంది. యోగి ప్రభుత్వం సొంతంగా ప్రజలకు ఏమీ చేయడం లేదని ఎస్పీ అధికార ప్రతినిధి సునిల్ సింగ్ ఆరోపించారు. ప్రజల కోసం ఏం చేయకుండా ప్రదేశాలు, నగరాల పేర్లు మారుస్తూ ఉన్నారని విమర్శించారు. -
‘మా సీనియర్ క్రికెటర్లకు సిగ్గుండాలి’
ఆంటిగ్వా: టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్కు పలువురు వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్లు గైర్హాజరీ కావడంతో ఆ జట్టు మాజీ ఆటగాడు కార్ల్ హూపర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఒక పటిష్టమైన జట్టును ఢీకొట్టేందుకు వెళ్లేటప్పుడు సీనియర్ క్రికెటర్లు డుమ్మా కొట్టడం అనేది చాలా సిగ్గుచేటన్నాడు. చాలామందికి విండీస్ తరపున ఆడాలనే ఉద్దేశం లేకపోవడంతోనే వారు ఏదొక వంకతో దూరమవుతున్నారంటూ విమర్శించాడు. ‘వెస్టిండీస్ తరపున ఆడాలనే ఉద్దేశమే వారికి లేదు. కొద్దిరోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరుతోనే అది స్పష్టమవుతోంది. దానికి వారు సిగ్గుపడాలి. సీనియర్లు జట్టులో లేకపోవడంతో టీ20ల్లో వెస్టిండీస్ని ఓడించడం భారత్కి చాలా సులువు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకి అనుభవం తక్కువ. వారు కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. కుర్రాళ్లలో ప్రతిభ ఉంది.. కానీ.. నిలకడగా మాత్రం రాణించలేకపోతున్నారు' అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టు భారత్తో వన్డే సిరీస్ ఆడే సమయంలో క్రిస్గేల్ అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. మూడేళ్లుగా వెస్టిండీస్ బోర్డు, సీనియర్ క్రికెటర్ల మధ్య జీతాల విషయమై విభేదాలు కొనసాగుతుండటంతో.. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు వారు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్లకి అసలు వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడాలనే శ్రద్ధే లేదంటూ హూపర్ తాజాగా ధ్వజమెత్తాడు. భారత్తో సిరీస్కు గేల్ దూరం -
20 పరుగుల దూరంలో ధావన్
లక్నో: ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగుల క్లబ్లో చేరేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 980 పరుగులు చేసిన ధావన్.. మరో 20 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల మైలురాయిని అందుకుంటాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా విండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన ధావన్.. ఈరోజు(మంగళవారం) జరుగనున్న రెండో టీ20ల్లో వెయ్యి పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలు మాత్రమే ఉన్నారు. ఇక భారత తరపున వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ముందువరుసలో ఉన్నాడు. ఓవరాల్గా కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి ఫాస్టెస్ రికార్డును రెండు రోజుల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అధిగమించిన సంగతి తెలిసిందే. కోహ్లి 27 ఇన్నింగ్స్ల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధిస్తే, బాబర్ అజమ్ 26 ఇన్నింగ్స్ల్లోనే ఆ ఘనతను అందుకున్నాడు. -
కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’
కోల్కతా: ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక ఆటగాడిగా తనదైన ముద్రవేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. కెప్టెన్సీలోనూ తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. ఇటీవల ఆసియాకప్ సాధించిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్.. తాజాగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అరుదైన ఘనతను సాధించాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన క్రమంలో విండీస్తో మూడు టీ20ల సిరీస్కు సారథిగా ఎంపికైన రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాల ఘనతను అందుకున్నాడు. కెప్టెన్గా తొలి పది టీ20 మ్యాచ్లకు సారథ్య వహించిన జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. విండీస్తో జరిగిన మ్యాచ్లో భారత విజయం సాధించిన తర్వాత రోహిత్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకూ రోహిత్ పది అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా అందులో తొమ్మింది విజయాలు నమోదు చేశాడు. ఫలితంగా మొదటి పది టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన లిస్ట్ ప్రకారం చూస్తే అత్యంత సక్సెస్ ఫుల్ రేసులో రోహిత్ ముందువరుసలో నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్, మైకేల్ క్లార్క్, అస్కార్ అప్ఘాన్, సర్పరాజ్ అహ్మద్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ నలుగురు తొలి పది అంతర్జాతీయ టీ20లకు గాను ఎనిమిదేసి మ్యాచ్ల్లో విజయం సాధించిన కెప్టెన్లు కాగా, వారిని రోహిత్ అధిగమించాడు. మరొకవైపు తొమ్మిది వన్డేలకు కెప్టెన్గా చేసిన రోహిత్ ఏడు విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మరో రికార్డుకు చేరువలో రోహిత్.. -
తొలి టి20లో భారత్ విజయం
-
ఎంఎస్ ధోని తర్వాత దినేశ్ కార్తీకే
కోల్కతా: టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రెండో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ నిలిచాడు. వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తీక్ మూడు క్యాచ్లను అందుకున్నాడు. ఫలితంగా టీ20ల్లో ఎంఎస్ ధోని తర్వాత అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గా దినేశ్ గుర్తింపు సాధించాడు. రామ్దిన్, హెట్మైర్, రోవ్మాన్ పావెల్ క్యాచ్లను దినేశ్ కార్తీక్ పట్టాడు. దాంతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కార(142) రికార్డును దినేశ్ కార్తీక్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్ 143 క్యాచ్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఎంఎస్ ధోని 151 క్యాచ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కమ్రాన్ అక్మల్(123), దినేశ్ రామ్దిన్(120)వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.విండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దినేశ్ కార్తీక్(31 నాటౌట్; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా(21 నాటౌట్;9 బంతుల్లో 3 ఫోర్లు)లు విజయంలో ముఖ్యభూమిక పోషించారు. -
టీ20 చరిత్రలో విండీస్ ఆరోసారి
కోల్కతా: ధనాధన్ క్రికెట్కు మరో పేరు టీ20 ఫార్మాట్. ఈ ఫార్మాట్లో క్రికెటర్లు పరుగుల దాహంతో చెలరేగితే అది అభిమానుల్లో మంచి మజాను నింపుతోంది. మరి అటువంటి టీ20 మ్యాచ్ కాస్తా ఏదో పేలవంగా సాగితే మాత్రం ఫ్యాన్స్లో తీవ్ర నిరాశను మిగుల్చుతుంది. ప్రధానంగా సిక్సర్లు కొట్టడంలో ఆటగాళ్లు సక్సెస్ కాలేకపోతే అది మరింత నిరుత్సాహపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తరహాలోనే సాగింది కోల్కతాలోని ఈడెన్లో భారత్-వెస్టిండీస్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్. ఇరు జట్లు కలిసి కేవలం రెండు సిక్సర్లే కొట్టడంతో మ్యాచ్లో ఎటువంటి జోష్ను తీసుకురాలేదు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కేవల సిక్స్ మాత్రమే కొట్టింది. 20 ఓవర్లపాటు ఆడిన విండీస్ 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు నమోదైతే, ఒకే ఒక్క సిక్స్ రావడం గమనార్హం. ఈ సిక్సర్ను పొలార్డ్ కొట్టాడు. ఇలా విండీస్ సిక్స్ మాత్రమే సాధించడం ఆ జట్టు టీ 20 చరిత్రలో ఆరోసారి మాత్రమే. అంతకుముందు న్యూజిలాండ్(2006), శ్రీలంక(2009(, జింబాబ్వే(2010), శ్రీలంక(2010), పాకిస్తాన్(2016)లతో జరిగిన టీ20 మ్యాచ్ల్లో విండీస్ ఒక్కో సిక్స్ మాత్రమే సాధించింది. కాగా, విండీస్తో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్లో కూడా సిక్స్ మాత్రమే కొట్టింది. -
వెస్టిండీస్ మరో చెత్త రికార్డు
కోల్కతా: ఇటీవల భారత్తో జరిగిన చివరివన్డేలో 104 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును నమోదు చేసిన వెస్టిండీస్ మరో అపప్రథన మూటగట్టుకుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. ఫలితంగా టీ20ల్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. 2014లో భారత్పై 129 పరుగులు చేసిన విండీస్.. తాజాగా దాన్ని సవరించింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్లో శుభారంభం చేసింది. అంతకముందు భారత్తో జరిగిన ఐదో వన్డేల సిరీస్లో భాగంగా ఆఖరి వన్డేలో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాడటంలో విఫలం కావడంతో విండీస్ 104 పరుగులకే ఆలౌటైంది. తద్వారా వన్డే ఫార్మాట్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను విండీస్ సొంతం చేసుకుంది. ఇది భారత్పై వన్డేల్లో విండీస్కు అత్యల్ప స్కోరుగా నమోదైంది. ఆ వన్డే జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే విండీస్ మరోసారి తడ‘బ్యాటు’కు గురై చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం. ఇక్కడ చదవండి: ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టాడు: రోహిత్ డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు! ఆపసోపాలతో... ఐదు వికెట్లతో... -
ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టాడు: రోహిత్
కోల్కతా: వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లతో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు ఆశించిన మేర రాణించనప్పటికీ దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యాలు ఆదుకోవడంతో భారత్ చివరకు గట్టెక్కింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కృనాల్ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో అజేయంగా 21 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, భారత్ బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం కృనాల్ అడిగి మరీ బౌలింగ్ తీసుకున్న విషయాన్ని మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ‘ విండీస్ కీలక ఆటగాడు పొలార్డ్ క్రీజ్లో ఉన్న సమయంలో నేను బౌలింగ్ చేస్తానని కృనాల్ అడిగాడు. ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టీ మరీ బౌలింగ్ చేశాడు. అలా అడిగా బౌలింగ్ చేయడమే కాదు.. పొలార్డ్ వికెట్ను కూడా కృనాల్ ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడే పొలార్డ్ను కృనాల్ దగ్గర్నుంచి గమనించడం కూడా బౌలింగ్ చేస్తానని అడగటానికి ఒక కారణం. ఒక జట్టు ఏమైతే ఆశిస్తుందో అదే కృనాల్ చేసి చూపెట్టాడు. ఇలా ప్రతీ క్రికెటర్ తమ తమ చాలెంజ్లను సమర్ధవంతంగా నిర్వర్తించేటప్పుడు కెప్టెన్కు కావాల్సింది ఏముంటుంది’ అని రోహిత్ తెలిపాడు. -
‘కోహ్లి కొట్టే ఆ షాట్లకు పెద్ద అభిమానిని’
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటను తాను ఎంతగానో ఇష్టపడతానని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. ప్రధానంగా కోహ్లి కొట్టే కవర్ డ్రైవ్స్కు తాను పెద్ద అభిమానినని సచిన్ తెలిపాడు. తాను పోలికల్ని అస్సలు ఇష్టపడనని తెలిపిన సచిన్.. ఇప్పటివరకూ కోహ్లి సాధించిన ఘనతలు అసాధారణమన్నాడు. ‘ ఒక్కో క్రికెటర్ ఏదొక షాట్తో ప్రత్యేకతను తెచ్చుకుంటాడు. ఇక్కడ విరాట్ కోహ్లి వరకూ వస్తే అతను కొట్టే కవర్ డ్రైవ్స్ చాలా అందంగా ఉంటాయి. ఆ షాట్లకు నేను పెద్ద అభిమానిని. కోహ్లిని ఎవరితోనూ పోల్చలేం’ అని సచిన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన భారత్కు చాలా ముఖ్యమైనదిగా సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా ఆసీస్ టూర్ కోహ్లికి పెద్ద సవాల్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఆసీస్ ఎప్పటికీ కఠినమైన ప్రత్యర్థిగా పేర్కొన్న సచిన్.. వారి బ్యాటింగ్ లోతును అంచనా వేయడం కష్టమన్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్తో భారత్కు గట్టి పోటీ ఉంటుందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ప్రస్తుత భారత జట్టు సమతూకంగా ఉన్న విషయాన్ని సచిన్ మరోసారి ప్రస్తావించాడు. -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్!
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అధిగమించాడు. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో బాబర్ 58 బంతుల్లో 78 పరుగులు సాధించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఈ ఓపెనర్.. అత్యంత వేగంగా ఈ ఘనతనందుకున్న క్రికెటర్గా గుర్తింపు పొందాడు. (చదవండి: సిరీస్ అందించాడు.. ర్యాంకు కొట్టేశాడు) భారత సారథి కోహ్లి 27 ఇన్నింగ్స్లో ఈ ఘనతను అందుకుంటే.. బాబర్ 26 ఇన్నింగ్స్ల్లోనే సాధించి అతని రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో పాక్ 47 పరుగులతో విజయం సాధించి 3-0తో కివీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ తన ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. విండీస్తో వన్డే సిరీస్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించిన కోహ్లి.. తాజా టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి తిరిగి బరిలోకి దిగనున్నాడు. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!) -
డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు!
కోల్కతా : వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆపసోపాలతో గట్టెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో హెట్మైర్తో సమన్వయ లోపం కారణంగా షై హోప్ రనౌటయ్యాడు. హోప్ ఆడిన షాట్ను ఫార్వార్డ్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ అందుకున్నాడు. (చదవండి: ఆపసోపాలతో... ఐదు వికెట్లతో...) కానీ అతను విసిరిన త్రో కీపర్ పైనుంచి వెళ్లిపోయినా పక్కనే ఉన్న మనీశ్ పాండే దానిని చక్కగా అందుకున్నాడు. దీంతో అయోమయానికి గురైన బ్యాట్స్మెన్ ఒకేవైపుకు పరుగెత్తారు. అనంతరం పాండే సునాయాసంగా రనౌట్ చేయడంతో హోప్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. ఇక నెటిజన్లైతే దీనికి సంబంధించిన ఫొటోలపై వింత క్యాఫ్షన్స్ ఇస్తూ విండీస్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘ఈ రేస్ హెట్మైర్ గెలిచాడోచ్.!, డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు’అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!) వీడియో కోసం క్లిక్ ఇక్కడ చేయండి Cricket pitch or a race track? #INDvWI pic.twitter.com/riepUJQEBm — Prasenjit Dey (@CricPrasen) 4 November 2018 HETMEYR WINS THE RACE....#INDvWI #Cricket pic.twitter.com/eC8VW8x7rK — 🅗 🅐 🅡 🅘 🅣 (@imharit) 4 November 2018 Dude it's cricket!! 100 metres sprint can follow. #INDvWI pic.twitter.com/iZmuplxKz5 — Ankur Nigam (@ankurnigam) 4 November 2018 ఇక ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అలెన్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ (3/13), కృనాల్ పాండ్యా (1/15) ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ముందుండి జట్టును విజయం దిశగా నడిపించాడు. మూడు టీ20ల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపు లక్నోలో రెండో మ్యాచ్ జరుగునుంది. -
అంబటి రాయుడు సంచలన నిర్ణయం
హైదరాబాద్: వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించి తనదైన ముద్ర వేసిన టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వైట్బాల్ గేమ్పై మాత్రమే దృష్టి పెట్టదల్చుకున్న రాయుడు.. ఫస్ట్క్లాస్ కెరీర్కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు లేఖ రాశాడు. ‘ నేను హైదరాబాద్కు ఆడిన ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. దాన్ని చాలా గౌరవంగా భావించాను. నాకు హెచ్సీఏ నుంచి వచ్చిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. నా సహచర ఆటగాళ్లు మద్దతు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడదలుచుకోలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ టోర్నీల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడతాను’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. అంబటి రాయుడు ఆకస్మిక నిర్ణయంతో టెస్టు ఫార్మాట్కు కూడా గుడ్ బై చెప్పినట్లయ్యింది. గురువారం నుంచి రంజీ ట్రోఫీ ఆరంభమైన తరుణంలో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కల్గించింది. 2013-14 సీజన్లో భాంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు రాయుడు ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత టెస్టుల్లో చోటు సంపాదించలేకపోయాడు. దాంతో తన కెరీర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా రాయుడు ఆడలేదు. కాగా, వన్డేల్లో కూడా నిలకడలేమితో జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రాయుడు.. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో రాయుడు నాల్గో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అతనికి కోహ్లి నుంచి కూడా భరోసా దొరికింది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్పైనే ఫోకస్ చేయదలుచుకున్న రాయుడు.. ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. -
అయోమయంలో విండీస్!
కోల్కతా: టీమిండియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఆదివారం జరుగునున్న తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఆడటం అనుమానంగా మారింది. గాయం కారణంగా వన్డేలకు ఎంపిక కాని రస్సెల్.. ఇప్పుడు మొదటి టీ20 మ్యాచ్లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. టీ 20ల కోసం ఆలస్యంగా భారత్కు వచ్చిన రస్సెల్ ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాలేదు. దాంతో ఆరంభపు టీ20 మ్యాచ్కు దూరం కానున్నట్లు సమాచారం. టీ20ల కోసం రెండు రోజుల క్రితం కెప్టెన్ బ్రాత్వైట్తో సహా ఏడుగురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్కి వచ్చారు. అయితే వారితో కలిసి విమానంలో రాని రస్సెల్ దుబాయ్ మీదుగా.. ఈరోజు భారత్కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన వెస్టిండీస్ ప్రాక్టీస్ సెషన్లో అతను పాల్గొనలేకపోయాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరపున మ్యాచ్లు ఆడిన రస్సెల్కు ఈడెన్ గార్డెన్స్ మైదానం కొట్టినపిండి. దాంతో తొలి టీ20లో అతను జట్టుకి అదనపు బలం అవుతాడని విండీస్ ఆశించింది. కానీ తాజాగా రస్సెల్ తీరుతో ఆ జట్టు ఇప్పుడు అయోమయంలో పడింది. గాయం నుంచి కోలుకున్న అతడ్ని కనీస ప్రాక్టీస్ లేకుండా ఆడించాలా? వద్దా? అని జట్టు మేనేజ్మెంట్ సమాలోచన చేస్తోంది. -
మరో రికార్డుకు చేరువలో రోహిత్..
కోల్కతా: వెస్టిండీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో రెండు భారీ శతకాలు బాదిన రోహిత్ శర్మ.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే హిట్మ్యాన్ రోహిత్ను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లోనూ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు రోహిత్. భారత్ జట్టు ఆదివారం నుంచి వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో తలపడనుండగా.. ఈ సిరీస్లో రోహిత్ శర్మ మరో 186 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలవనున్నాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లను పరిశీలిస్తే.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) 2,171 పరుగులు, బ్రెండన్ మెక్కలమ్ (న్యూజిలాండ్) 2,140 పరుగులు, విరాట్ కోహ్లి (భారత్) 2,102 పరుగులతో టాప్-4లో కొనసాగుతున్నారు. ఇక ఐదో స్థానంలో 2,086 పరుగులతో కొనసాగుతున్న రోహిత్ శర్మ.. మూడు టీ20ల్లో కలిపి 186 పరుగులు చేయగలిగితే అగ్రస్థానంలో నిలుస్తాడు. టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లి నుంచి రోహిత్ శర్మకు పోటీ లేకుండా పోయింది. మరో 16 పరుగులు చేస్తే కోహ్లి టీ20 పరుగుల రికార్డుని రోహిత్ సమం చేస్తాడు.రేపు(ఆదివారం) భారత్-విండీస్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్ మైదానంలో తొలి టీ20 జరుగనుంది. ఇక్కడ చదవండి: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.. -
‘ధోని లేకపోవడం రిషబ్కు మంచి అవకాశం’
కోల్కతా: వెస్టిండీస్తో ఆదివారం నుంచి ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్కు ఎంఎస్ ధోనికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ధోని స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రిషబ్కు ఇదే చక్కటి అవకాశం అంటున్నాడు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ. ‘కొన్నేళ్లుగా భారత జట్టులో ధోని ఒక కీలక ఆటగాడు. అయితే విండీస్తో జరగబోయే టీ20 సిరీస్కు అతని అనుభవాన్ని మిస్సవుతున్నాం. అదే సమయంలో ఈ సిరీస్ కచ్చితంగా రిషబ్ పంత్కు మంచి అవకాశమనే చెప్పాలి. పంత్తో పాటు దినేశ్ కార్తీక్కు ఇది చాలా కీలకం. వచ్చే వరల్డ్కప్కు ఏదో పరిమితమైన మౌలిక వనరులతో సిద్ధం కాదల్చుకోలేదు. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. వాటిని తగిన విధంగా వినియోగించుకోవడంపైనే ప్రస్తుత దృష్టి సారించాం. మా రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించడమే మా లక్ష్యం. ఆ క్రమంలోనే ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. మా జట్టులో చాలా కొత్త ముఖాలు న్నాయి. కేవలం 15 మందితో కూడిన జట్టే కాదు.. మరో 15 మందితో కూడిన బలాన్ని అట్టి పెట్టుకోవడమే మా ముందున్న కర్తవ్యం. ఎవర్ని అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
‘వారు ధోనితో సరితూగలేరు’
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫామ్ గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని, ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ లయ అందుకుంటాడని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. గత ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్లోనూ ధోని బ్యాట్తో పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా, ఆదివారం నుంచి వెస్టిండిస్తో ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరిస్ల నుంచి ధోనిని సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.. ‘అవును.. ఇప్పుడు టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉన్నారు. వాళ్లు గత కొద్దిరోజులుగా బాగానే ఆడుతున్నారు. కానీ.. వారు ఎప్పటికీ ధోనితో సరితూగలేరు. ఇంకా చెప్పాలంటే కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేరు. మ్యాచ్లో ధోని వికెట్ కీపింగే బాధ్యతలే కాదు. చాహల్, కుల్దీప్, బుమ్రా లాంటి బౌలర్లకి సలహాలు, సూచనలు చేస్తుంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లికి వెలకట్టలేని సాయం చేస్తున్నాడు’ అని ఆశిష్ నెహ్రా అన్నాడు. -
ధోని వేటుపై సచిన్ ఏమన్నాడంటే..
ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఛీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు ధోని టీ20 కెరీర్ ముగియలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ అంశంపై స్పందించాడు. టీమ్మేనేజ్ మెంట్ మైండ్సెట్ ఎంటో అర్థం కావడం లేదన్నాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కావడం లేదు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తనకు తెలియదు కానీ, ఏ వ్యూహం, నిర్ణయాలు తీసుకున్న దేశానికి ఉపయోగపడేలా ఉండాలి.’ అని స్పష్టం చేశాడు. దేశానికి ధోని చేసిన సేవలను సచిన్ ఈ సందర్భంగా కొనియాడాడు. ‘ఏం జరగబోతుంది.. ఏ చేయాలనే’ విషయం ఈ మాజీ కెప్టెన్ తెలుసని అభిప్రాయపడ్డాడు. (చదవండి: ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా!) ‘నేనెప్పుడు ఏ విషయంలోను ఎలాంటి తీర్పులివ్వలేదు. ప్రస్తుత సెలక్టర్ల నిర్ణయంపై కూడా తీర్పునివ్వను. అన్ని ఫార్మాట్లో ధోని అద్భుతంగా రాణించాడు. చాలా ఏళ్లుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తు వచ్చాడు. చాలా ఏళ్లుగా ఆడుతున్న ఆటగాళ్లకు ఏం జరగబోతుంది, ఏం చేయాలనే విషయం తెలుసుంటుంది. ఈ పరిస్థితుల్లో నేనైతే.. ఏం చేయాలో మొదలు తెలుసుకుంటాను. డ్రెస్సింగ్ రూంలో సహచర ఆటగాళ్లతో చర్చిస్తాను. కోచ్, కెప్టెన్ ఏం ఆశిసస్తున్నారో తెలుసుకుంటాను. ప్రస్తుతానికి ధోని చాలా రోజులు క్రికెట్ ఆడుతాడని నమ్ముతున్నాను.’ అని సచిన్ పేర్కొన్నాడు. ఇక ధోనిని వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ల నుంచి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్లు మాత్రం ధోనికి విశ్రాంతి ఇచ్చామని, ప్రత్యామ్నయ వికెట్ కీపర్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అభిమానులు మాత్రం ధోనిని తొలిగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ధోని భాయ్ అది పక్కా ఔట్! ) వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ! చదవండి: టి20ల్లో ‘విన్’డీసే -
‘మూడు వన్డేల తర్వాత పెట్రోల్ అయిపోయింది’
తిరువనంతపురం: భారత్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా పేర్కొన్నాడు. అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన తమ జట్టు.. బలమైన భారత్కు వారి దేశంలోనే గట్టిపోటీ ఇచ్చిందన్నాడు. ఈ విషయం తొలి మూడు వన్డేలను చూస్తే అర్ధమవుతుందన్నాడు. కాగా, తొలి మూడు వన్డేల తర్వాత చివరి రెండు వన్డేల్లో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందడంపై స్టువర్ట్లా చమత్కరించాడు. మూడు వన్డేలకే తమ ఆటగాళ్లలో పెట్రోల్ అయిపోయిందని సెటైర్ వేశాడు. ‘మా కుర్రాళ్లు తెలివైన వారు. నైపుణ్యం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అనుభవం వారికి రావాలి. నలభైవేల మంది అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే అత్యుత్తమ జట్టుతో తలపడడం అంత సులువు కాదు. ఆ పరిస్థితులను అనుభవిస్తే అలవాటవుతుంది. గెలవాలంటే నైపుణ్యం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మూడు వన్డేల తర్వాత మా జట్టు వైఫల్యం చెందడానికి కారణం ఆటగాళ్లలో తగినంత అనుభవం లేకపోవడమే’ అని స్టువర్ట్ లా పేర్కొన్నాడు. ఈ సిరీస్ను భారత్ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక్కడ చదవండి: ముగింపు అదిరింది ధోని భాయ్ అది పక్కా ఔట్! -
గంగూలీ, యువరాజ్ సరసన విరాట్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించాడు. అద్భుతమైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్న విరాట్.. వెస్టిండీస్తో జరిగిన అయిదు వన్డేల సిరీస్లో మూడు సెంచరీలు సాధించి (453 రన్స్) ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్లో 7 ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా విరాట్ నిలిచాడు. గతంలో ఈ ఘనత సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వివ్ రిచర్డ్ష్, రికీ పాంటింగ్, హషీం ఆమ్లా సరసన చేరాడు. (చదవండి : ముగింపు అదిరింది) కాగా, ఈ కేటగిరిలో 15 ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో నిలవగా.. 11 అవార్డులతో సనత్ జయసూర్య, 9 అవార్డులతో షాన్ పొల్లాక్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. తాజా వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి మొదటి మ్యాచ్లో 140, రెండో మ్యాచ్లో 157, మూడో మ్యాచ్లో 107 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక గురువారం కేరళలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన చివరిదైన 5 వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్ను 3–1తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (33 బంతుల్లో 25; 2 ఫోర్లు), మార్లోన్ శామ్యూల్స్ (38 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడగా, జట్టులో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (4/34) ముందుండి నడిపించగా, మిగతా నలుగురు బౌలర్లూ కనీసం ఒక మెయిడిన్ ఓవర్తో పాటు కనీసం ఒక వికెట్ తీయడం గమనార్హం. అనంతరం భారత్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. -
ధోని భాయ్ అది పక్కా ఔట్!
తిరువనంతపురం : వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డేలో భారత్ దుమ్మురేపి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో జడేజా వేసిన 16వ ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్మన్ హెట్మైర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. జడేజా అప్పీల్ చేయగా.. తొలుత అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఈ ఔట్పై నమ్మకంగా ఉన్న జడేజా రివ్యూ (డీఆర్ఎస్) కోసం ధోని, కోహ్లిలను.. ‘భాయ్ పక్కా ఔట్ భాయ్’ అంటూ పట్టుబట్టడంతో రివ్యూ కోరారు. (చదవండి: ముగింపు అదిరింది) రివ్యూలో హెట్మైర్ ఔట్ అని తేలడంతో జడేజా ‘చెప్పానా భాయ్’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే రివ్యూ కోరడంపై ధోని సుముఖంగా లేకపోవడంతో కోహ్లి తీసుకునే ధైర్యం చేయలేదు. కానీ జడేజా పట్టుబట్టడంతో తప్పక రివ్యూకెళ్లాడు. ఎందుకంటే ధోని డీఆర్ఎస్ నిపుణుడని అందరికీ తెలిసిందే. అతను రివ్యూ కోరితే అది పక్కా ఫలితాన్నిస్తోంది. చాలా మ్యాచ్ల్లో ఇది రుజువైంది. ఇక ఈ సిరీస్లో చెలరేగిన హెట్మైర్ వికెట్ను విండీస్ కోల్పోవడంతో ఆ జట్టు 104 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ను వైస్ కెప్టెన్ ( 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి ( 33 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు)లు 14.5 ఓవర్లలో విజయాన్నందించారు. ప్రతీ మ్యాచ్లో గట్టి పోటినిచ్చిన విండీస్ చివరి మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. దీంతో భారత్ 3-1 సిరీస్ను సొంతం చేసుకుంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో వన్డే టై అయిన విషయం తెలిసిందే. (చదవండి: ఉలిక్కిపడిన రోహిత్) Dhoni was not sure but Sir Jadeja says it's out. Jaddu supersedes Dhoni and it's hitting the stumps. A reluctant review pays off. pic.twitter.com/IXdINbkqQ7 — This is HUGE! (@ghanta_10) November 1, 2018 -
టీమిండియా సెలబ్రేషన్స్.. ఉలిక్కిపడిన రోహిత్
తిరువనంతపురం: వెస్టిండీస్పై వన్డే సీరిస్ నెగ్గిన అనంతరం భారత జట్టు సంబరాలు చేసుకుంది. స్టేడియం నుంచి హోటల్ చేరుకున్న టీమిండియా అక్కడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొంది. ఈ పార్టీలో జట్టు సభ్యలంతా ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకల్లో భాగంగా రోహిత్ శర్మ కేక్ కట్ చేస్తుండగా.. ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో రోహిత్ వెనకాల నిల్చున్న మిస్టర్ కూల్ ధోని, రవీంద్ర జడేజాలు అతని చెవి దగ్గర్లో బెలూన్లను పగులకొట్టారు. దీంతో రోహిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. అప్పుడు రోహిత్ రియాక్షన్ చూసి అక్కడున్న ధోనితో పాటు ఇతర ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత టీమిండియా మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Back at the team hotel after an early wrap and it is time to celebrate.🏆 #TeamIndia #INDvWI pic.twitter.com/qW7mtAoXgq — BCCI (@BCCI) 1 November 2018 -
వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా
-
విండీస్ను కొట్టేసి.. సిరీస్ పట్టేశారు
తిరువనంతపురం: వెస్టిండీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. గురువారం ఇక్కడ గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 3-1తో చేజిక్కించుకుంది. చివరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ( 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి ( 33 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు)లు మరోసారి ఆకట్టుకున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్(6) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్-కోహ్లిల జోడి మరో వికెట్ పడకుండా ఆడి భారత్కు విజయాన్ని అందించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. భారత బౌలర్ల దెబ్బకు 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగి విండీస్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. మార్లోన్ శామ్యూల్స్(24), జాసన్ హోల్డర్(25), రోవ్మాన్ పావెల్(16)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు ఎంచుకున్న వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్లో హోప్ బౌల్డ్ అయ్యాడు. ఆపై రోవ్మాన్ పావెల్-శామ్యూల్స్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. అయితే శామ్యూల్స్ మూడో వికెట్గా ఔట్ కావడంతో విండీస్ మరోసారి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్మెయిర్ నిష్క్రమించిన తర్వాత రోవ్మాన్ పావెల్, ఫాబియన్ అలెన్, హోల్డర్లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో విండీస్ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది. -
విండీస్ చెత్త రికార్డు
తిరువనంతపురం: టీమిండియాతో తొలి మూడు వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో విశేషంగా రాణించిన వెస్టిండీస్.. చివరి రెండు వన్డేల్లో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క్రమంలోనే చివరిదైన ఐదో వన్డేలో విండీస్ చెత్త రికార్డును మూటగట్టకుంది. గురువారం ఇక్కడ గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో విండీస్ 104 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా వన్డే ఫార్మాట్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను విండీస్ సొంతం చేసుకుంది. ఇది భారత్పై వన్డేల్లో విండీస్కు అత్యల్ప స్కోరు. 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారత్తో జరిగిన మ్యాచ్లో విండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. ఇది ఇప్పటివరకూ భారత్పై విండీస్కు అత్యల్ప స్కోరు కాగా, దాన్ని తాజాగా సవరించింది. ఈ మ్యాచ్లో విజృంభించిన టీమిండియా బౌలర్లు.. విండీస్ను పేకమేడలా కూల్చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ లభించింది. ఇదిలా ఉంచితే, తొలి మూడు వన్డేల్లో 926 పరుగులు చేసిన విండీస్. చివరి రెండు వన్డేల్లో కలిపి 257 పరుగుల్ని మాత్రమే సాధించి 20 వికెట్లను కోల్పోవడం గమనార్హం. -
విండీస్ను కూల్చేశారు..
తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో వెస్టిండీస్ తడబాటుకు గురైంది. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగి విండీస్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. మార్లోన్ శామ్యూల్స్(24), జాసన్ హోల్డర్(25), రోవ్మాన్ పావెల్(16)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు ఎంచుకున్న వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్లో హోప్ బౌల్డ్ అయ్యాడు. ఆపై రోవ్మాన్ పావెల్-శామ్యూల్స్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. అయితే శామ్యూల్స్ మూడో వికెట్గా ఔట్ కావడంతో విండీస్ మరోసారి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్మెయిర్ నిష్క్రమించిన తర్వాత రోవ్మాన్ పావెల్, ఫాబియన్ అలెన్, హోల్డర్లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో విండీస్ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది. -
ఆదిలోనే విండీస్కు షాక్
తిరువనంతపురు: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది విండీస్. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి ఓవర్లోనే పావెల్ వికెట్ చేజార్చుకుంది. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్లో హోప్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండు పరుగులకే రెండు ప్రధాన వికెట్లను విండీస్ కోల్పోయింది. అదే జట్టుతో టీమిండియా.. -
అదే జట్టుతో టీమిండియా..
తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. గత వన్డేలో భారీ విజయం సాధించి ఊపు మీద ఉన్న టీమిండియా సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుండగా, వెస్టిండీస్ సిరీస్ను సమం చేయాలనే యోచనలో ఉంది. ఈ మ్యాచ్లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవ్వగా, విండీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా మొత్తం పర్యటనకే దూరమైన ఆశ్లే నర్స్ స్థానంలో దేవెంద్ర బిషూ తుది జట్టులోకి రాగా, హెమ్రాజ్ స్థానంలో ఒషేన్ థామస్ను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్ను పటిష్ట పర్చుకుని, బౌలింగ్లో వైవిధ్యంతో ముంబై వన్డేలో దిగిన టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా, ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం, మాజీ కెప్టెన్ ధోని తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోవడం జట్టును కలవర పరుస్తోంది. రెండు శతకాలతో రోహిత్శర్మ, మూడు సెంచరీలతో కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్లో ఉండగా, అర్ధ శతకం, శతకంతో నాలుగో స్థానానికి నిఖార్సైన బ్యాట్స్మన్నని అంబటి తిరుపతి రాయుడు చాటుకున్నాడు. కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్ లోతును పెంచారు. ప్రారంభంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలను ఎదుర్కొనడం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేయడం భారత్కు కలిసొచ్చే అంశం. ఈ సిరీస్లో అంచనాలు మించి రాణించిన విండిస్ను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడితేనే విరాట్ సేన సిరీస్ను కైవసం చేసుకుంటుంది. తుది జట్లు భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ , అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, బూమ్రా వెస్టిండీస్: జాసన్ హోల్డర్(కెప్టెన్), కీరన్ పావెల్, సాయ్ హోప్, మార్లోన్ శామ్యూల్స్, హెట్మెయిర్, రోవ్మాన్ పావెల్, ఫాబియన్ అలెన్, బిషూ, కీమో పాల్, రోచ్, థామస్ -
‘ఖలీల్ అహ్మద్ ఒక భరోసా’
తిరువనంతపురం: టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్పై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో భారత్కు ఒక భరోసా నింపుతాడనే నమ్మకం తమకుందని కొనియాడాడు. వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో మూడు వికెట్లు సాధించడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసిన ఖలీల్కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం కూడా అతనికి కలిసొస్తుందన్నాడు. 'ఖలీల్ భవిష్యత్లో మంచి ప్లేయర్గా మారతాడు. అతను చాలా చురుకు, నైపుణ్యం బాగున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. భారత్ పేస్ బౌలింగ్ విభాగానికి ఖలీల్ ఒక భరోసా అవుతాడనే నమ్మకం ఉంది’ అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు. -
35 అడుగుల ధోని కటౌట్..
తిరువనంతపురం: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. అయితే ధోనిపై ఉన్న అభిమానాన్ని కేరళ ఫ్యాన్స్ వినూత్నంగా చాటుకున్నారు. భారీ ఎత్తుగల కటౌట్ను రూపొందించారు. ‘ఆల్ కేరళ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో వన్డే మ్యాచ్ జరగనున్న గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట 35 అడుగుల ఎత్తైన ధోని కటౌట్ను ఏర్పాటు చేశారు. కటౌట్ ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ‘తలైవా విశ్వరూపం రెడీ అవుతోంది’ అని ట్వీట్ చేసింది. ఈరోజు విండీస్-భారత్ జట్ల మధ్య ఆఖరిదైన ఐదో వన్డే తిరువనంతపురంలో జరుగనుంది. దీనిలో భాగంగానే ధోని కటౌట్ను స్టేడియం బయటం ఏర్పాటు చేశారు అభిమానులు. #Thala's Vishwaroopam getting ready at Trivandrum! #WhistlePodu #INDvWI 🦁💛 #Yellove from @AKDFAOfficial! pic.twitter.com/AL8hxZ6DWz — Chennai Super Kings (@ChennaiIPL) 31 October 2018 ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా! -
ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా!
సాక్షి, హైదరాబాద్ : మహేంద్ర సింగ్ ధోని.. భారత్కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథి. ప్రస్తుతం నిలకడలేమి ఆటతో విమర్శకుల నోట అతని పేరు ఎక్కవగా వినిపిస్తోంది. కానీ.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు (అక్టోబర్ 31 2005) విధ్వంసం సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ కొత్త అధ్యయానికి తెరలేపాడు. శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేసి విధ్వంసకరం అంటే ఎంటో ప్రపంచానికి రుచిచూపించాడు. అంతకు ముందే వైజాగ్ వేదికగా పాకిస్తాన్పై 148 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన ధోని శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తన పవరేంటో చాటి చెప్పాడు. 7 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన మూడో వన్డేలో ధోని చెలరేగాడు. (ధోని ‘మెరుపు’ చూశారా?) ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. నాటి ఓపెనర్ సచిన్ వికెట్ను త్వరగా కోల్పోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ధోని.. సెహ్వాగ్తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెహ్వాగ్తో 92, ద్రవిడ్తో 86, యువరాజ్తో 65 పరుగుల భాగస్వామ్యాలు జోడించి ఈ మ్యాచ్లో ఒంటి చేత్తో భారత్కు విజయాన్నందించాడు. ఈ విధ్వంసానికి భారత్.. నాటి మ్యాచ్లో 23 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు ధోనికి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ భారీ ఇన్నింగ్స్ ను గుర్తు చేస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది. చదవండి: ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ Throwback - On this day in 2005, @msdhoni notched his highest ODI score. KaBOOM all the way 💪🏻💥💥😎 pic.twitter.com/UM3B3aTRJy — BCCI (@BCCI) 31 October 2018 -
‘రోహిత్ కాదు.. భారత్ అనాలి’
ముంబై : టీమిండియా విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వెస్టిండీస్తో మంబై వేదికగా నాలుగోవన్డేలో జరిగిన ఓ ఘటనతో.. అతని అభిమానుల గర్వపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ అద్భుత శతకంతో హిట్మ్యాన్ పవరేంటో మరోసారి చూపించాడు. ఈ దెబ్బకు భారత్ భారీ స్కోర్ చేయడం.. విండీస్ జట్టంతా కలిసి రోహిత్ అన్ని పరుగులు కూడా చేయకపోవడం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో విస్టిండీస్ ఇన్నింగ్స్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. (చదవండి : రోహిత్ ధమాకా.. రాయుడు పటాకా) రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్లో ఉన్న అభిమానులు రోహిత్..రోహిత్..రోహిత్ అని అరవసాగారు. ఇది విన్న హిట్ మ్యాచ్ తన టీషర్టుపై ఉన్న ఇండియా అక్షరాలను చూపిస్తూ.. భారత్ అని అరవాలని సైగ చేశాడు. అతని సూచన మేరకు అభిమానులు భారత్ భారత్.. అని అరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అతని అభిమానులు.. ‘రోహిత్ అభిమానులమైనందుకు గర్వపడుతున్నాం’అని క్యాప్షన్గా పేర్కొంటున్నారు. (వాటి కోసం ఎప్పుడూ ఆలోచించను: రోహిత్) FEEL PROUD TO BE FAN OF RO-HITMAN SHARMA. RESPECT @ImRo45. 👏❤ pic.twitter.com/gbVFrvhGiy — TEAM RO-HITMAN SHARMA (@HitmanPlanet__) 30 October 2018 ఈ మ్యాచ్లో ఫీల్డింగ్లోను రోహిత్ అదరగొట్టాడు. ఫస్ట్ స్లిప్లో ఉండి ఏకంగా మూడు క్యాచ్లు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ క్యాచ్లపై మాట్లాడుతూ.. ‘ఈ రోజు స్లిప్ క్యాచ్లు అందుకున్నాను. అలాంటి క్యాచ్లు అందుకోవడం చాలా కీలకం. మాములుగా కుల్దీప్ బౌలింగ్లో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ అతన్ని చేతులను అర్థం చేసుకోవడం కష్టం. అదే నెట్స్లో సులువుగా అర్థమవుతోంది. అతను గూగ్లీ వేయబోతున్నాడని గ్రహించి స్లిప్ ఫీల్డర్గా సిద్దంగా ఉన్నాను.’ అని చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లి అభిమానులు సైతం మ్యాచ్ జరుగతుండగా.. అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుశ్క శర్మ పేరును ప్రస్తావిస్తూ అనుష్కా.. అనుష్కా అని అరవడంతో కోహ్లి థంప్సప్ సింబల్తో చూపించి ఆనందపరిచాడు.(ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ) -
ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ
కోల్కతా : టీ20లకు సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని దూరం పెట్టడంపై అతని అభిమానులు సెలక్టర్లపై భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ధోనిని దూరం పెట్టడం తనకేం ఆశ్చర్యం అనిపించలేదని, అతన్ని తీసేయడంలో తప్పులేదని అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఓ జాతీయ ఛానల్తో మాట్లాడుతూ.. ‘టీ20లకు ధోనిని ఎంపికచేయకపోవడం పట్ల నేనేమి ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే అతని ప్రదర్శన అంత గొప్పగా ఏమి లేదు. ధోని 2020 టీ20 వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటాడని అనుకోవట్లేదు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్లో ఉన్న రిషభ్ పంత్కు అవకాశం ఇస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ వరకు సెలక్టర్లు ధోనికి అవకామిస్తేనే ఎక్కువగా భావిస్తా. వెస్టిండీస్తో చివరి వన్డే అనంతరం ధోని ఆటకు చాలా గ్యాప్ వస్తుంది. అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడడు. మళ్లీ ఆసీస్, న్యూజిలాండ్లతో వన్డే సిరీస్ల్లోనే ఆడుతాడు. అతన్ని రంజీ ట్రోఫీలు ఆడామని సెలక్టర్లు సూచించాలి. దీంతో ఆటతో టచ్లో ఉంటాడు. ఇది అతని ఫామ్ తిరిగి సాధించడానికి ఉపయోగపడుతోంది. ఎంత పెద్ద ఆటగాడైనా.. రోజు ఆడకపోతే.. ఆటపై ఉన్న పట్టు కోల్పోతాడు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్లకు ధోనిని పక్కకు పెడుతు భారత జట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ ప్రమాదంలో పడింది! ధోని ‘మెరుపు’ చూశారా? -
ఐదో వన్డేకు ఫుల్ గిరాకీ!
తిరువనంతపురం : భారత్-వెస్టిండీస్ మధ్య చివరిదైన ఐదో వన్డే టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉందని కేరళ క్రికెట్ ఆసోసియేషన్(కేసీఏ) తెలిపింది. రేపు(గురువారం) తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా కేసీఏ విద్యార్థులకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. 40వేల సీటింగ్ కెపాసిటీ గల ఈ మైదానంలో మంగళవారానికే 30వేల టికెట్లు అమ్ముడుపోయాయని, మ్యాచ్ ప్రారంభమయ్యే రోజువరకు అన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కేసీఏ అధికారులు పేర్కొన్నారు. (చదవండి : ఆటలో ‘అరటిపండు’!) టికెట్ల అమ్మకాల ద్వారా రూ.3 కోట్లు ఆదాయం వచ్చిందని, విద్యార్థులు ఆఫర్లో టికెట్లు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఐడీకార్డులు తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే ఇరు జట్లు అక్కడి చేరుకోని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇది కూడా బ్యాటింగ్ పిచ్ కావడంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్లో రోహిత్, రాయుడులు సెంచరీలతో చెలరేగి భారత్కు అతిపెద్ద విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. (చదవండి: భారత క్రికెట్ ప్రమాదంలో పడింది!) ధోని ‘మెరుపు’ చూశారా? -
భారత యువ పేసర్ ఖలీల్కు మందలింపు
ముంబై: వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో అతిగా ప్రవర్తించిన టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ను మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మందలించారు. మార్లోన్ శామ్యూల్స్ వికెట్ తీసిన తర్వాత ఖలీల్ దూకుడుగా ప్రవర్తించాడు. వికెట్ తీసిన ఆనందంలో శామ్యూల్స్పైకి దూసుకెళ్లాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు వ్యతిరేకం కావడంతో ఖలీల్ను మ్యాచ్ రిఫరీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అతనికి ఒక డిమెరిట్ పాయింట్ను విధించారు. ఐసీసీ లెవల్-1 నిబంధనల్లో భాగంగా ఆర్టికల్ 2.5 కోడ్ను ఖలీల్ ఉల్లఘించాడు. ఈ ఆర్టికల్ ప్రకారం ఒక ఆటగాడిని మరొక ఆటగాడు అసభ్యంగా దూషించడం కానీ చర్యల ద్వారా కవ్వించడం కానీ చేయకూడదు. దీన్ని ఖలీల్ అతిక్రమించడంతో అతను హెచ్చరికకు గురయ్యాడు. భారత్ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 14 ఓవర్ నాల్గోబంతికి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో రోహిత్ శర్మకు స్లిప్ క్యాచ్ ఇచ్చి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఖలీల్ అతిగా ప్రవర్తించినట్లు ఫీల్డ్ అంపైర్లు ఇయాన్ గౌడ్, అనిల్ చౌదరిలు రిఫరీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఖలీల్కు ఒక డెమెరిట్ పాయింట్ విధించిన రిఫరీ.. హెచ్చరికతో సరిపెట్టాడు. తన తప్పిదాన్ని ఖలీల్ ఒప్పుకోవడంతో దీనిపై ఎటువంటి తదుపరి విచారణ అవసరం లేదని రిఫరీ బ్రాడ్ తెలిపారు. విండీస్తో నాల్గో వన్డేలో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన ఖలీల్ అహ్మద్ 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ 224 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
వాటి కోసం ఎప్పుడూ ఆలోచించను: రోహిత్
ముంబై:తాను క్రీజ్లోకి వెళ్లేటప్పుడు సెంచరీలు గురించి కానీ డబుల్ సెంచరీలు గురించి కానీ ఆలోచించనని, కేవలం సాధ్యమైనంత సేపు క్రీజ్లో ఉండాలనే ఆలోచనతోనే బ్యాటింగ్ చేస్తానని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో రోహిత్ శర్మ 162 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వన్డే ఫార్మాట్లో అత్యధికసార్లు 150కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ తన రికార్డును మరింత సవరించుకున్నాడు. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ ఐదుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. విండీస్తో నాల్గో వన్డే తర్వాత మాట్లాడుతూ.. ‘సెంచరీలు,డబుల్ సెంచరీలు గురించి నేను ఎప్పుడూ ఆలోచించిన దాఖలు లేవు. జట్టుకు ఉపయోగపడే విధంగా బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే క్రీజ్లోకి వెళతా. నేను మూడు డబుల్ సెంచరీలు సాధించిన క్రమంలో కూడా వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ మ్యాచ్లో కూడా రాయుడు నా వద్దకు వచ్చి డబుల్ సెంచరీ సాధిస్తానని చెప్పాడు. కానీ నా ఫోకస్ అంతా బ్యాటింగ్పైనే ఉంచా. అంతేతప్ప ద్విశతకం గురించి ఆలోచించలేదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మైదానంలో అంతర్జాతీయ వన్డే జరుతుండటంతో.. భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఒక మెరుగైన భాగస్వామ్యం రాయుడితో నాకు లభించింది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇక్కడ చదవండి: రోహిత్ ధమాకా.. రాయుడు పటాకా -
ధోని ‘మెరుపు’ చూశారా?
ముంబై : టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. సోమవారం వెస్టిండీస్తో జరిగిన నాలుగో వన్డేలో తన మెరుపు కీపింగ్తో ఔరా అనిపించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో విండీస్ బ్యాట్స్మన్ కీమోపాల్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సవ్వడంతో ధోనికి దొరికిపోయాడు. రెప్పాపాటులో పనిపూర్తి చేసిన ధోని.. స్టంపౌట్లో కొత్త రికార్డు నమోదు చేశాడు. ఈ స్టంపౌట్ను ధోని 0.08 సెకన్లలోనే పూర్తి చేయడం గమనార్హం. తొలుత నాటౌట్గా భావించిన జడేజా ధోని చిరునవ్వులను చూసిన బ్యాట్స్మన్ కథ ముగిసింధని గ్రహించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. (చదవండి: కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా?) ఇక మూడో వన్డేలో అద్భుత క్యాచ్ వావ్ అనిపించిన ధోని తాజా స్టంపింగ్తో తన కీపింగ్లో పసతగ్గలేదని నిరూపించాడు. ఈ స్టంపౌట్పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 0.08 సెకన్లలో స్టంపౌట్ చేసి తన రికార్డు (0.09)ను తిరగరాశాడని ఒకరంటే.. కీపింగ్లో ధోనిని మించినోడే లేడని మరొకరు కామెంట్ చేశారు. ఇక 2019 ప్రపంచకప్ లోపు ధోనిని పక్కకు పెట్టే ఆలోచనను మానేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్, తెలుగు తేజం అంబటి రాయుడుల శతకాలతో భారత్ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. (చదవండి: వారెవ్వా ధోని.. ఏం క్యాచ్) ధోని అరుదైన ఘనతకు చేరువలో.. ధోని రిటైర్మెంట్ తీసుకో Lightening stumping..💪@msdhoni 0.08 sec 😍 #MSDhoni #IndvsWi pic.twitter.com/oqk7eaX4Xt — TamilCRIC (@tamil_cric) October 29, 2018 MS dhoni is great wicketkeeper of the world Cricket ...run vi banege world cup 2019 me aur tum sab aalochna karna band karo — Vijay# Toppo (@VijayToppo17) October 29, 2018 -
అతడికి మా మద్దతు ఉంటుంది: కోహ్లి
ముంబై: వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో సెంచరీ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడిపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అంబటి రాయుడు ఒక తెలివైన బ్యాట్స్మన్ అని కోహ్లి కొనియాడాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లి.. అతనికి తమ మద్దతు అవసరమని పేర్కొన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయుడి బ్యాటింగ్పై టీమిండియా మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘ వచ్చిన అవకాశాన్ని రాయుడు రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. అతనికి మేము(జట్టు మేనేజ్మెంట్) అండగా ఉంటుంది. 2019 వరల్డ్కప్ వరకూ సాధ్యమైనన్ని మ్యాచ్లు ఆడే అవకాశాన్ని అతనికి కల్పిస్తాం. రాయుడు గేమ్ను అర్ధం చేసుకునే తీరు నిజంగా అమోఘం. నాల్గో స్థానంలో అతను బ్యాటింగ్ చేసిన విధానంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. మరొకవైపు యువ పేసర్ ఖలీల్ అహ్మద్లో కూడా అసాధారణ టాలెంట్ ఉందంటూ కొనియాడాడు. పిచ్ సహకరించిన ప్రతీసారి ఖలీల్ ప్రతిభ బయటపడుతూనే ఉందన్నాడు. రెండు వైపులకు బంతిని స్వింగ్ చేసే సత్తా ఖలీల్ అహ్మద్లో ఉందన్నాడు. కచ్చితమైన ఏరియాల్లో బంతిని సంధిస్తూ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతున్న ఖలీల్కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ(162)కు జతగా అంబటి రాయుడు(100) శతకంతో మెరిశాడు. రోహిత్ ధమాకా.. రాయుడు పటాకా కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా? -
ధోని అరుదైన ఘనతకు చేరువలో..
తిరువనంతపురం: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనతకు చేరువయ్యాడు. భారత్ తరపున వన్డే ఫార్మాట్లో పది వేల పరుగుల మార్కును చేరేందుకు ధోని పరుగు దూరంలో నిలిచాడు. వెస్టిండీస్తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నాల్గో వన్డేలో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన ధోని.. మరో పరుగు సాధిస్తే టీమిండియా తరపున పది వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకూ ధోని వన్డే ఫార్మాట్లో చేసిన పరుగులు 10, 173 కాగా, భారత్ ఆటగాడిగా మాత్రం ఆ ఘనతను చేరుకోలేదు. 2007లో ఆఫ్రికా ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో ఆసియా ఎలెవన్ తరపున ఆడిన ధోని ఆ మూడు మ్యాచ్ల సిరీస్లో 174 పరుగులు సాధించాడు. దాంతో భారత్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసేందుకు పరుగు దూరంలో నిలిచాడు ధోని. తిరువనంతపురంలో గురువారం జరుగనున్న చివరిదైన ఆఖరి వన్డేలో ధోని ఆ మార్కును చేరుకునే అవకాశం ఉంది. -
కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా?
ముంబై : మ్యాచ్ ఏదైనా తనదైన ముద్ర ఉండేలా చూసే టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లి... ముంబైలో తక్కువ స్కోరుకే ఔటైనా మెరుపు ఫీల్డింగ్తో తళుక్కుమన్నాడు. సోమవారం వెస్టిండీస్తో జరిగిన నాలుగో వన్డేలో ఆ జట్టు బ్యాట్స్మన్ శామ్యూల్స్ కవర్స్ దిశగా కొట్టిన షాట్ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్తో బంతిని నాన్ స్ట్రయికింగ్ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది. అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్ పావెల్ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ రనౌట్కు పావెల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. (చదవండి: రోహిత్ ధమాకా రాయుడు పటాకా) కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్తో మైదానంలోని భారత ఆటగాళ్లు, అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఇక నెటిజన్లు కోహ్లిని ఆకాశానికెత్తారు. ‘అరే ఏం ఫీల్డింగ్ అన్నా.. సూపర్’ అని ఒకరు.. బ్యాట్ ఝులిపించకుంటే.. ఫీల్డింగ్తో మైమరిపిస్తాడు దటీజ్ కోహ్లి అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ సిరీస్లో వరుసగా మూడు సెంచరీలతో రికార్డు సృష్టించిన కోహ్లి ఈ మ్యాచ్లో (16) నిరాశపరిచాడు. హిట్ మ్యాన్ రోహిత్, తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడుల శతకాలతో భారత్ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. (చదవండి: ధావన్.. నేను కూడా తొడగొడతా!) If not with bat, then with his fielding! @imVkohli always makes his presence felt in the field. That run out was special. #INDvsWI #IndvsWestindies #INDvsWIN #INDvWI #BattleOfSixes #ViratKohli #Virat — prakhar sachdeo (@simplyparu) October 29, 2018 #KingKohli Wow👌🏻👌🏻👌🏻 What a Fielding🤭🤭🤭🤭 #ViratKohli # — Cricket Keeda❤️ (@Surana9Naveen) October 29, 2018 -
నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం
-
నాలుగో వన్డే : విండీస్పై భారత్ భారీ విజయం
-
కదంతొక్కిన రోహిత్, రాయుడు
హిట్మ్యాన్ రోహిత్, అంబటి రాయుడు సెంచరీలతో చెలరేగిన వేళ.. బౌలింగ్లో ఖలీల్, కుల్దీప్ మెరిసిన సమయాన.. ఫీల్డింగ్లో జట్టు సమష్టి తత్వంతో.. నాలుగో వన్డేలో భారత్ జూలు విదిల్చింది. చాంపియన్ ఆటతీరుతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. 2–1తో సిరీస్లో ఆధిక్యం సంపాదించింది. ముంబై: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... ఓపెనర్ రోహిత్ శర్మ (137 బంతుల్లో 162; 20 ఫోర్లు, 4 సిక్స్లు), మిడిలార్డర్ బ్యాట్స్మన్ అంబటి తిరుపతి రాయుడు (81 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీలతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటితో పాటు ఫీల్డర్ల చురుకుదనంతో ఛేదనలో వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది 36.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్లో చివరిదైన ఐదో వన్డే గురువారం తిరువనంతపురంలో జరుగుతుంది. శుభారంభం... ఆపై అమోఘం మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కింది. రోహితే ముందుగా మొదలుపెట్టినా, కొద్దిసేపటికే జోరందుకున్న శిఖర్ ధవన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కొన్ని చక్కటి షాట్లతో అతడిని మించిపోయాడు. అయితే, కీమో పాల్ ఓవర్లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో రావ్మాన్ పాల్కు చిక్కాడు. దీంతో 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హ్యాట్రిక్ సెంచరీల ఊపులో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (16) ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో రోహిత్, రాయుడు బాధ్యత తీసుకున్నారు. కుదురుకున్న తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో అలెన్ బౌలింగ్లో ఫోర్తో రోహిత్ 21వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే రాయుడు అర్ధశతకం చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి ఫోర్లు, సిక్స్లతో ఇద్దరూ ధాటైన ఆట కనబర్చారు. కావాల్సినన్ని ఓవర్లు ఉండటం, 150 మైలురాయి (131 బంతుల్లో) కూడా అధిగమించడంతో రోహిత్ డబుల్ సెంచరీ ఖాయమని అంతా భావించారు. కానీ నర్స్ బౌలింగ్లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని కట్ చేసే యత్నంలో షార్ట్ థర్డ్మ్యాన్లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్కు 211 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రోచ్ ఓవర్లో సిక్స్ బాది 90ల్లోకి చేరుకున్న రాయుడు... కాసేపటికే మూడో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రనౌటయ్యాడు. ధోని (15 బంతుల్లో 24; 2 ఫోర్లు), కేదార్ జాదవ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు), జడేజా (4 బంతుల్లో 7; 1 ఫోర్ నాటౌట్) ఆఖర్లో తమవంతుగా జట్టు స్కోరును పెంచారు. విండీస్ ఏ దశలోనూ... అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ చందర్పాల్ హేమరాజ్(14)ను ఔట్ చేయడం ద్వారా వికెట్ల పతనానికి భువనేశ్వర్ తెర తీశాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్ ధాటికి కీరన్ పావెల్(4), షై హోప్(0) వెంట వెంటనే వెనుదిరిగారు. బౌలింగ్ మార్పులో భాగంగా బంతి అందుకున్న ఖలీల్ తొలుత హెట్మైర్(13)ను ఎల్బీడబ్ల్యూగా, ఆ తర్వాత రోమ్మెన్ పావెల్ బౌల్డ్ చేసి పెవిలియన్కు చేర్చాడు. దీంతో 47 పరుగులకే విండీస్ సగం వికెట్ల కోల్పోయింది. ఆ తర్వాత అనుభవజ్ఞుడు శామ్యూల్స్ (18) సైతం వెనుదిరగడంతో విండీస్ 100కే ఆలౌట్ అవుతుందనిపించింది. అయితే కెప్టెన్ హోల్డర్(54 నాటౌట్) పోరాడడంతో చివరికి 153 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. జడేజా, భువనేశ్వర్ తలో వికెట్ సాధించారు. చదవండి: భారత్తో నాలుగో వన్డే : విండీస్ ముందు భారీ లక్ష్యం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత్తో నాలుగో వన్డే : విండీస్ ముందు భారీ లక్ష్యం
ముంబై : వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ భారీ స్కోర్ను సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 377 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 137 బంతుల్లో 162 పరుగులతో మెరుపు సెంచరీ సాధించగా.. తెలుగు తేజం అంబటి రాయుడు (100) సెంచరీతో కదంతొక్కాడు. గత మూడు వరుస మ్యాచ్ల్లో సెంచరీలతో చలరేగిన కెప్టెన్ కోహ్లి (16) స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు. భారత్ బ్యాట్సమెన్స్లో ధావన్ (38) కోహ్లి (16), ధోని (23), జాదవ్ (16) నాటౌట్ జడేజా (6) నాటౌట్ రాణించారు. విండీస్ బౌలర్లలో రోచ్ రెండు, ఆశ్లే నర్స్, కీమో పాల్ తలో ఒక వికెట్ పడగొట్టారు. కాగా విండీస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. చదవండి : సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.. చదవండి : ధావన్.. నేను కూడా తొడగొడతా! -
సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు..
ముంబై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. వెస్టిండీస్తో నాల్గో వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా తక్కువ ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా 19 సెంచరీలు పూర్తి చేసుకున్న టీమిండియా ఆటగాడిగా రికార్డు సాధించిన కొద్ది వ్యవధిలోనే మరో రికార్డును రోహిత్ నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వన్డేల్లో సచిన్ 195 సిక్సర్లు కొట్టగా, ఇప్పుడు దాన్ని రోహిత్ సవరించాడు. పాల్ వేసిన 40 ఓవర్ ఐదో బంతిని సిక్స్ కొట్టడంతో సచిన్ సిక్సర్లు రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇక్కడ ఎంఎస్ ధోని(211 సిక్సర్లు) తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు -
రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
ముంబై: వెస్టిండీస్తో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. బ్రాబోర్న్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ 98 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం నమోదు చేశాడు. సహచర ఓపెనర్ శిఖర్ ధావన్(38)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి(16) తొందరగానే పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతుల్ని ఆచితూచి ఆడుతూ చెడ్డ బంతుల్ని బౌండరీలుగా మలిచి సెంచరీ సాధించాడు. ఇది రోహిత్ శర్మ కెరీర్లో 21వ వన్డే సెంచరీ కాగా, ఓపెనర్గా 19వ సెంచరీ. ఇక్కడ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఓపెనర్గా 19వ సెంచరీ పూర్తి చేసుకున్న క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్లు ఆడిన భారత బ్యాట్స్మన్గా రోహిత్ రికార్డు సాధించాడు. ఓవరాల్గా రెండో స్థానంలో ఉన్నాడు. 107 ఇన్నింగ్స్ల్లోనే రోహిత్ ఓపెనర్గా 19వ సెంచరీ నమోదు చేశాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా 19 సెంచరీలు పూర్తి చేసుకోగా, రోహిత్ మాత్రం సచిన్ కంటే 8 ఇన్నింగ్స్లు ముందే ఈ ఘనత నమోదు చేశాడు. ఇక్కడ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా తొలి స్థానంలో ఉన్నాడు. ఆమ్లా 102 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కును చేరగా, ఆ తర్వాత స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఇక తక్కువ ఇన్నింగ్స్ల్లో 21 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఆమ్లా(116), కోహ్లి(138), ఏబీ డివిలియర్స్(183) తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. రోహిత్ 186 ఇన్నింగ్స్ల్లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2013 నుంచి చూస్తే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి(25) తొలి స్థానంలో ఉండగా, రోహిత్(19) రెండో స్థానంలో ఉన్నాడు. -
ధావన్.. నేను కూడా తొడగొడతా!
ముంబై: వెస్టిండీస్తో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 38 వ్యక్తిగత పరుగుల వద్ద తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. కీమో పాల్ బౌలింగ్లో అనవసరపు షాట్ కోసం యత్నించిన శిఖర్ ధావన్ క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. అయితే ధావన్ ఔటైన తర్వాత కీమో పాల్ తొడగొట్టడం అభిమానులతో పాటు ధావన్కు కూడా నవ్వులు తెప్పించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ కీమో పాల్ వేసిన ఐదో బంతిని మిడ్వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా బ్యాట్కి కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పావెల్ చేతుల్లో పడింది. కాగా, ధావన్ తరహాలో తొడగొడుతూ బౌలర్ కీమో పాల్ సంబరాలు చేసుకున్నాడు. ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టిన తర్వాత ధావన్ తొడగొడుతూ సంబరాలు చేసుకోవడం అందరి సుపరిచితమే. కీమో పాల్ తనని కవ్విస్తూ తొడగొట్టినా.. ధావన్ మాత్రం నవ్వుతూ పెవిలియన్కి వెళ్లిపోయాడు. దాంతో భారత్ తొలి వికెట్ను 71 పరుగుల వద్ద కోల్పోయింది. pic.twitter.com/5PQeWmL2BP — This is HUGE! (@ghanta_10) 29 October 2018 చాహల్, పంత్ ఔట్