Jesus Christ
-
దీపస్తంభం నుంచి వెలిగే దీపం
మనుష్యులు ఈ లోకంలో ఎలా జీవించాలి అనే విషయంలో ఏసుప్రభువు కొండమీద ప్రసంగంలో ఈ విధంగా చెప్పారు. గాంధీజీ తన ఆత్మకథలో ‘సెర్మన్ ఆన్ ది మౌంట్’ పేరుతో ప్రసిద్ధి చెందిన యేసు క్రీస్తు‘కొండమీది ప్రసంగం’ తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని రాసుకున్నాడు. ఒకసారి ప్రభువు ఆ జనసమూహాలను చూసి కొండ యెక్కి కూర్చుని ఈ విధంగా బోధించాడు.‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వాస్తవంగా మనం ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోవు మనుష్యులం. ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ దేహం మట్టి నుండి తీయబడింది. మంటిలోనే కలిసి΄ోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది. కనుక మనుష్యులు ఆత్మ విషయమై దీనులైన వారికి దైవరాజ్యం/పరలోక రాజ్యం దక్కుతుంది. దుఃఖపడువారు ధన్యులు; వారు భూలోకంలో ఓదార్చ బడుదురు. సాత్వికులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు; వారు కనికరం పొందుతారు. హృదయ శుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూస్తారు. సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులుగా పిలవబడతారు. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు; పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి మీమీద అబద్ధంగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఇలా వారు మీకు పూర్వమందున్న ప్రవక్తను హింసించారు.మీరు లోకానికి ఉప్పయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి, మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికీ పనికిరాదు. మీరు లోకానికి వెలుగై వున్నారు. కొండమీద వుండు పట్టణం మరుగై వుండ నేరదు. మనుషులు దీపం వెలిగిస్తారు. దీపçస్తంభం పైనే ఉంచుతారు. కానీ గంపకింద ఉంచరుకదా! ప్రజలు మీ సత్కార్యాలను చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని సన్నుతించడానికి మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి’ అంటూ ఆ ప్రసంగంలో ’వ్యభిచారం చెయ్యవద్దు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడు అవుతాడు’ అంటాడు. 6,7 మత్తయి సువార్త అధ్యాయాలలో మనుష్యులు లోకంలో ఎలా జీవించాలో ప్రభువు బోధించాడు.దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే సత్క్రియలను చేయడానికి సృష్టించాడు (ఎఫిíసీ 2:10), ఐక్యత కలిగి వుండటానికి సృష్టించాడు. ఈ విషయంలో దావీదు మహారాజు యాత్ర కీర్తనలో... సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతమేలు! ఎంత మనోహరం అంటూ 133: 1-3 వచనాలలో స్పష్టీకరించాడు. పడిపోయిన యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మాణ నిమిత్తం దేవుడు జెరుబ్బాబెలు అనేవాడు నియమింపబడ్డాడు. సత్క్రియలే కాదు, ఐక్యత కలిగి వుండాలి. ఐక్యత అంటే దేవునికి, మానవునికి సంబంధం కలిగి వుండాలి. అందుకోసమే ఒక బంగారు కడ్డీ నుండి ఏడు దీపస్తంభాలు, ఒక పక్క నుండి మూడు దీపస్తంభాలు, మరియొక పక్క నుండి మూడు దీపస్తంభాలు, మధ్యలో పెద్ద దీపస్తంభం మెస్సయ్యాకు సాదృశ్యంగా వున్నవి. మూడు ప్లస్ మూడు=ఆరు. దేవుడు మానవుని 6వ దినమున సృజించిన దానికి సాదృశ్యం. ఒక బంగారు కడ్డీ నుండి ఉన్న 7వ దీపస్తంభం ప్రభువైన దేవునికి సాదృశ్యం. ఏడు అనేది పరిపూర్ణ సంఖ్యకు సాదృశ్యం. నా యందు మీరు, మీ యందు నా మాటలను నిలిపి వుంచితే మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును (యోహాను 16 : 7). నూనె అభిషేకానికి సాదృశ్యం.కనుక సంఘంలో ఐక్యత కలిగి వుండాలంటే భేదాలు వుండకూడదు. ఐక్యత ఎలా కలిగి ఉండాలంటే యేసుప్రభువు వైపు చూసినప్పుడే ఐక్యత కలిగి వుంటున్నాం. మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ధైర్యం ఎవరి వలన... ఎందువలన అంటే దేవుని వైపు చూడటం వల్లనే వారికి ధైర్యం వచ్చింది. ఐక్యతతో మనం వుంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఐక్యతతో చేసే పనివలన బలం, ఆరోగ్యం అనుగ్రహింపబడతాయి. కావున ఎల్లప్పుడూ మనం దేవుని వైపు చూసేవారమై వుందుముగాక. జెకర్యాకు చూపిన దర్శనం మెస్సయ్యకు సాదృశ్యం. (జెకర్యా 4 :1 –4)– కోట బిపిన్ చంద్రపాల్ -
Christmas 2024 లోక రక్షకుడు
మానవాళి ముక్తికొరకు మనుజావతారుడైన దైవం...జగతిలో భీతి బాపేందుకు దిగివచ్చిన దైవ తనయుడు...సర్వలోకానికి శాంతి సందేశం..దివిలోనూ భువిలోనూ వేడుక...పరలోక దూతావళి పరవశించి పాడిన వేళప్రతి హృదిలో క్రిస్మస్ ఆనందం...జగతిలో పాపం నిండినప్పుడు ప్రేమతో కలిసి జీవించాల్సిన ధరణి వాసుల హృదయాలు అసూయ, ద్వేషంతో రగులుతున్నప్పుడు చీకటి జలధిలో మునిగిన వారికి, శృంఖలాల్లో మగ్గేవారికి మరణ ఛాయలో బతికే వారికి ఒక ఆశాకిరణంగా... అరుణోదయ కాంతిగా... విమోచకుడిగా... జగద్రక్షకుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు ఈ భువిపైకి అరుదెంచాడు. అదొక సుమనోహర ఘట్టం.. సర్వలోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో విశేషంగా ఆకట్టుకున్న మధుర కావ్యం. తమను రక్షించే మెస్సయ్య కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న విశ్వాసుల్లో నింపిన అంతులేని ఆనందం వెరసి స్తోత్ర గీతంగా స్తుతి గానంగా మారిన వైనం.. అందుకు యూదా దేశంలోని బెత్లెహేము వేదిక అయింది.ఆ సమయంలో రాజైన హేరోదు యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతున్నాడు. యూదా ప్రజలంతా తమను విమోచించే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ భాగ్యం కన్య అయిన మరియకు లభించింది. అప్పటికే గలిలయలోని నజరేతులో దావీదు వంశస్తుడైన యోసేపునకు మరియ ప్రదానం చేయబడింది. పరమ దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువు దూత గబ్రియేలు ద్వారా ఈ శుభ వర్తమానం అందింది. ‘దయా ప్రాంప్తురాలా!’... అంటూ గబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడే యవ్వన్రపాయంలో అడుగుపెడుతున్న మరియ ఎంతో భయపడింది.ఎందుకంటే ఆ కాలంలో దేవుడు కాని ఆయన దూతల దర్శనం అరుదుగా మారింది. ప్రవక్తలకు ప్రవచనాలు నిలిచి పొయాయి. నిశ్శబ్దకాలంగా చెప్పబడింది. అటువంటి తరుణంలో దేవుని దూత మరియ వద్దకు వచ్చి ‘భయపడకుము నీవు ధన్యురాలవు, దేవుని వలన నీవు కృప ΄పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడతాడు. అతని రాజ్యము అంతము లేనిదై వుంటుందని’ పేర్కొన్నాడు. దూత మాటలు మరింత విస్మయానికి భయానికి గురిచేశాయి. ఇది దేవాది దేవుని నుంచి వచ్చిన పిలుపుగా మరియ తెలుసుకుంది. ‘అయ్యో నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఏలాగు సాధ్యం?’ అని అడిగింది.‘మరియా! భయపడకు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడని దేవదూత చెప్పిన మాటలను బట్టి ఇది దైవకార్యంగా గ్రహించి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి దేవాది దేవుని తన గర్భంలో మోయడానికి సిద్ధపడింది. వాస్తవానికి వివాహం కాకుండా ఆ రోజుల్లో యూదా స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండేది. దేవుని దయ΄పొంది అంతులేని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి ముందుకు వచ్చింది కాబట్టే మరియ స్త్రీలందరి లో ధన్యురాలిగా కొనియాడబడింది.అయితే మరియ గర్భవతియైన సంగతి తెలుసుకున్న యోసేపు కలత చెందాడు. నీతిమంతుడు కాబట్టి ఆమెను నలుగురిలో నగుబాటు చేయకుండా రహస్యంగా విడనాడాలని నిశ్చయించుకున్నాడు. ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియ గర్భము ధరించింది ఏ పురుషుని వలన కాదని పరిశుద్ధాత్మ వలన జరిగినదని మరియను చేర్చుకొనడానికి ఏమాత్రమూ సందేహపడవద్దని పుట్టబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టాలని తన ప్రజలందరి పాపములనుండి ఆయనే రక్షిస్తాడని తెలుపడంతో యోసేపులో ఆవేదన తొలగిపొయింది. అంతేకాదు మరియ యేసుకు జన్మనిచ్చేవరకూ ఆమెను ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు.ఇదే సమయంలో ఆరు నెలలకు ముందు మరొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మరియ సమీప బంధువు రాలైన ఎలీసబెతు ఆమె భర్త జెకర్యా కురు వృద్ధులు. ఆ వయస్సులో దేవుడు వారికి సంతాన ప్రాంప్తి అనుగ్రహించాడు. దేవుని హస్తం వారికి తోడుగా వుండి ఒక మగ శిశువును దయచేసాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో బాప్తీస్మం ఇచ్చు యోహానుగా పిలువబడి యేసు ప్రభు పరిచర్యకు ముందు ఆయన మార్గం సరళం చేసే సాధనమయ్యాడు.లేఖన ప్రవచనాలు నెరవేర్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినా ఆయన ఆదిసంభూతుడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆదియు అంతమునై యున్నాడు. మొదటివాడు కడపటి వాడుగా ఉన్నవాడు. జగత్ పునాది వేయకముందే వున్న యేసు కాలం సంపూర్ణమైనప్పుడు సాతాను చెరలో చిక్కుకున్న మానవుడు పాపానికి బందీగా మారి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్న తరుణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పతనమై ఏ నిరీక్షణ లేని సమయంలో నిత్య జీవమిచ్చి తిరిగి దేవునితో ఐక్యపర్చేందుకు భూమి మీద దేవుని కుమారుడిగా క్రీస్తు అవతరించాడు.యేసు పుట్టుకను క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మీకా, యెషయా ప్రవక్తలు ప్రవచించడం విశేషం. ‘బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల బోవువాడు నీలో నుండి వచ్చును’ అని మీకా ప్రవచించగా ‘ఆలకించుడి కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును’ అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం.యేసు పుట్టుక ఆవశ్యకత గూర్చి యెషయా వివరించాడు. ‘ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢ పరచుటకు చెరలో నున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’ అని యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు తన రాక ద్వారా నిజమయ్యాయని యేసుప్రభు తనపరిచర్యలో చెప్పడం విశేషం.ప్రజా సంఖ్యలో రాయబడటానికి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. రెండింటి మధ్య 90 మైళ్ళ దూరం. రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేనిరోజుల్లో నిండు చూలాలైన మరియను వెంటబెట్టుకొని బహు ప్రయాస కోర్చి చలికాలంలో బెత్లెహేము చేరుకున్నారు దంపతులు. జన సంఖ్య కోసం ఆ గ్రామం అప్పటికే క్రిక్కిరిసి పొయి ఉండటంతో ఎక్కడా స్థలం లేక ఓ పశువుల కొట్టమే వారికి అశ్రయమైంది. అర్థరాత్రి వేళలో క్రీస్తు జన్మించడంతో పశువుల తొట్టె క్రీస్తు పాన్పుగా మారిపొయింది. పరలోకాన్ని విడచివచ్చి పశువుల కొట్టంలో బాల యేసు పరుండాల్సి వచ్చింది. అతి సామాన్య కుటుంబంలో అతి సామాన్యంగా యేసు జన్మించాడు.యేసు పుట్టుక శుభవార్త మొదట తెలిసింది సామాన్యులకే. ఊరి వెలుపల ΄÷లంలో గొఱె<లను కాచుకుంటున్న పశు కాపరుల వద్దకు ప్రభువు దూత వచ్చి వారి మధ్య నిలచినప్పుడు ప్రభువు మహిమ వారిచుట్టూ ప్రకాశించగా వారెంతో భయపడ్డారు. అందుకు దూత ‘భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తీసుకు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అంటూ శిశువు ఆనవాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూతల సమూహం ‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక’ అంటూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. యేసు పుట్టుక కేవలం యూదా ప్రాంంతానికే పరిమితం కాలేదు. యేసుక్రీస్తు జన్మవిశేషం తెలియజేస్తూ ఆకాశంలో ఓ వింత తార వెలిసింది. దాన్ని చూసిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రోజును వెతుక్కుంటూ యెరూషలేము చేరుకున్నారు. తుదకు బెత్లెహేము లో పుట్టాడని తెలుసుకొని శిశువును పూజించి తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలను సమర్పించి అత్యానందభరితులై తిరిగి వెళ్లారు. ఈ విధంగా యేసు పుట్టుక ఒక విశ్వ వేడుకగా మారింది.రక్షణ తెచ్చిన క్రిస్మస్ యేసు పుట్టుక సర్వమానవాళికి రక్షణ అందించిది. యేసు పుట్టుక పరమార్థమే అది. పాప పంకిలమైన మానవ జాతిని రక్షించడానికే యేసు జన్మించాడు. దేవుని ఆజ్ఞ మీరడం ద్వారా దేవుడు సృజించిన తొలి మానవుడు ఆదాము, అతని భార్య హవ్వ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకు వచ్చారు. ఆ పాపానికి ప్రతిఫలంగా నర జాతి మొత్తానికి మరణం సం్రపాప్తించింది. అయితే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి తద్వారా వచ్చిన మరణభయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన శిలువ యాగం ద్వారా రక్షణ ΄పొంది నిత్యజీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించింది. క్రిస్మస్ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి రక్షణార్థం పాపపరిహారార్థ బలిగా శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాప విమోచన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవుడు దేవునితో పరలోకంలో ఉండే భాగ్యం అందించడానికి దేవుడు మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. అందుకు క్రీస్తు పుట్టుక వేదికగా మారింది. అప్పుడు ఈ ధరిత్రి మీద మానవునిగా జన్మించిన యేసు ఇప్పుడూ నీవు ఆహ్వానిస్తే నీ హృదిలో ఆత్మరూపుడై వసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో నిత్యసంతోషం నింపుతాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సంతోషం... సమాధానం తెచ్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. క్రీస్తు పుట్టుక సమయంలో కురేనియ, సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు మొదటి ప్రజాసంఖ్య ప్రకటించాడు. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాలతో తెలియ చేయబడిన క్రీస్తు జననం ఒక కల్పితకథ కాదు ఒక చారిత్రాత్మక సత్యం. ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు. క్రీస్తుకు ముందు... క్రీస్తు తర్వాతగా కాలం రెండుగా విభజింపబడటయే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ.– బందెల స్టెర్జి రాజన్ సీనియర్ పాత్రికేయులు -
Christmas 2024 ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది
ఈ భూమి మీద నడిచిన కారుణ్య మూర్తులైన బుద్ధుడు, మహావీరుడు జీసస్ వంటి వారు మానవీయతను ప్రబోధించి శాంతిస్థాపనకు, సమానత్వానికై అజరామరమైన ప్రేమ తత్వాన్ని ఈ లోకానికి బోధించారు. ప్రాక్ పశ్చిమ ప్రపంచంలో నుండి జీసస్ ఒక విభిన్నమైన నైసర్గిక భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలులోని బెత్లెహాం నందు జన్మించాడు. అది తన చుట్టూ ఉన్న బాబిలోనియా, ఈజిప్ట్ గ్రీక్ దేశాల ఆధునిక, తాత్విక, వైజ్ఞానిక నాగరికతలు, సంస్కృతుల ప్రభావితం కలిగినది.మానవ జీవితంలో 14 సంవత్సరాల ప్రౌఢదశ ఒక ప్రత్యేకమైన శారీరక మానసిక పరిపక్వత గలిగే దశ ్ర΄ారంభం అవుతుంది. సరిగ్గా ఈ దశ మానవుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే జోసెఫ్కు క్రీస్తు మానవునిగా 14వ తరంగా కన్య మరియకు జన్మించిన రోజే క్రిస్మస్.క్రీస్తు అత్యంత బాహ్యాంతర సౌందర్యమూర్తి, పరిపూర్ణుడు. నీసాటి వాడు నిన్ను కోపగించుకుంటే నువ్వు ప్రతిగా వారిని కోపగించుకోకు. మళ్ళీ వారిపై క్రోధం పెంచుకుంటే వారికి నువ్వు సహాయపడ్డవాడివి అవుతావు. నీ క్రోధం వాళ్లకు బలం, నీకు బలహీనత. అదే నువ్వు వారిని సహృదయంతో మందహాసంతో స్వీకరిస్తే వారు నిశ్చేష్టులవుతారు, అందుకే జీసస్ నువ్వు నీ శత్రువుని ప్రేమించు అని చెబుతాడు. అయితే ఇక్కడ శత్రువు కన్నా పొరుగువారిని ప్రేమించటమే కొంచెం కష్టం అయినా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలి. నీలో ఉన్న అంతర్గత ప్రేమను ఒక ఆలింగనం ద్వారా బహిర్గతం చేయి. వారు ఈ పరిణామానికి తమ తార్కిక జ్ఞానాన్ని కోల్పోవాలి. అటువంటి ప్రేమలో తార్కిక విచక్షణ ఉండదు. కాబట్టి ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది. ఇలాంటి ప్రేమ మార్గానికి పరాకాష్టే జీసస్ స్వరూపం.సరిగ్గా ఈ భావన కొనసాగింపే జీసస్లో మరో ఉదాత్త అంశం నిదర్శనమైనది. అదే ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించు అనటం. అప్పుడు మరో చెంపని చూపించటం వల్ల అవతలి వాడిని ఆలోచనలో పడేస్తుంది కానీ మొదట్లో ఈ విభిన్న ప్రతిస్పందన యూదు వంశస్థులకు అర్థం అవడానికి చాలా కాలం పట్టింది. అది వారి తర్కానికి అందని దృగ్విషయం, అదొక సందిగ్ధావస్థ. ఈ దశ ప్రేమకు ముందూ, ద్వేషభావానికి తర్వాత ఉంటుంది. ఇది సంఘంలో కొంత పరివర్తనకు నాంది పలికింది. వ్యవస్థలో నెలకొన్న అమానవీయ చేష్టలకు అమూల్యమైన మానవ ప్రాణం బలి కాకూడదని సంకల్పించాడు. అందుకే జీసస్ అత్యంత దయార్ద్ర మానవతామూర్తి గా వెలుగొందాడు. క్రీస్తుకు పూర్వం ప్రజలంతా మోసెస్ న్యాయమార్గాన్ని అనుసరిస్తే ఆ తదుపరి జీసస్ సర్వత్రా తన ప్రేమ మార్గాన్ని చూపాడు.జీసస్ ప్రేమస్వరూపుడు అనటం కాదు, జీసస్ స్వయంగా ఒక ప్రేమ స్వరూపుడు. ఇక్కడ జీసస్ వేరూ ప్రేమ వేరూ కాదు. అది అత్యంత అనిర్వచనీయం. ప్రేమ ఎప్పుడూ సత్యంలాగా భాషలో పలికేది కాదు అది కేవలం వ్యక్తీకరించేది. అందుకే యేసును శిలువ వేసే సమయంలో రోమ్ సైనికాధికారి పిలాట్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే సత్యం కోసం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు, అప్పుడు పిలాతు యేసును మళ్ళీ ప్రశ్నిస్తాడు సత్యం అంటే ఏంటి? అని– ఆ ప్రశ్నకు యేసు మౌనం వహిస్తాడు. ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. అందుకే సంఘం యథార్థవాదులందరినీ లోకవిరోధులుగానే చిత్రీకరిస్తుంది. అందుకు తార్కాణంగా ప్రముఖ గ్రీకు దార్శనికుడు సోక్రటీస్కు రాజ్యం విషం ఇచ్చి మరణశిక్షను విధించింది. అలాగే భారతీయ దార్శనికుల్లో విప్లవాత్మకమైన శాంతి, సత్య తత్వాన్ని అందించిన బుద్ధుని బోధలూ, బౌద్ధం భారతదేశం నుంచి తరిమి వేయబద్దాయి. అదేవిధంగా యూదుల ఆలోచనలను సరిదిద్దే ప్రయత్నంలో జీసస్ కృషి నిరర్థకమే అయింది. వారికి సత్యం, ప్రేమల తత్వం అర్థం కాలేదు. వారు జీసస్ సత్యమార్గాన్ని చేరుకోలేక అపవాదిగా మార్చి సిలువ వేశారు. ఈ దార్శనికులంతా వారి తాత్విక సందేశాలతో సమస్త జీవకారుణ్యతతో ఎటువంటి మారణాయుధాలు లేకుండా ఒక మనిషి మరో మనిషిపై గాని, ఒక జాతి మరో జాతిపైగానీ, ఒకరి భావజాలం మరొకరి భావజాలంపై గాని, సాంస్కృతిక దురాక్రమణలు కానీ, ధర్మం పేరిట యుద్ధాలు, రక్తపాతాలు గానీ సృష్టించలేదు. కేవలం ప్రకృతి ధర్మాలను వివరిస్తూ మనుషుల మధ్య సమతను, సమానత్వాన్ని, ప్రేమ పూర్వక ప్రవచనాలతో, వాత్సల్యపు వాక్యాలతో శాంతి సామ్రాజ్యాల స్థాపనకు ప్రాణత్యాగాలు చేశారు. అందుకు కావలసింది ద్వేషాన్ని, అహంకారాన్ని విడనాడటమే. ఇవి మనలో నుండి మనపైకి అధిరోహించి మనల్ని అథఃపాతాళానికి తొక్కేస్తాయి, కానీ మనమే అహంకారాన్ని అధోపాతాళానికి తొక్కిపెడితే మనం ఆకాశానికి ఎదుగుతాం.ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. - ప్రొ. చెరుకుపల్లి వంశీధర్ -
ఈస్టర్ ఫెస్టివల్.. రన్ ఫర్ జీసస్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్లో ‘రన్ ఫర్ జీసస్ ర్యాలీ’ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి ర్యాలీని ప్రారంభించారు. కార్డినల్ పూలే ఆంథోని ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఫొటోలు.. సినీ నటుడు రాజా పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి అబిడ్స్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పూల ఆంథోని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని అన్నారు ఏసుప్రభు అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం పూల ఆంథోనికి జ్ఞాపకం అందజేశారు రాజా. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు’’ అని సీఎం పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’’ అని సీఎం జగన్ అన్నారు. -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ) -
Merry Christmas 2023: దివిలోను.. భువిలోనా... సంబరం క్రిస్మస్ పర్వదినం
క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినం.. మనుజ కుమారుడిగా ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి అరుదెంచిన అపురూప ఘట్టం. సర్వ మానవాళికి రక్షణ సౌభాగ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అందించిన శుభదినం. ► పరలోకం పరవశించిన వేళ మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమయినప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయింది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాదిదేవుడే నరరూపిగా అరుదెంచేందుకు సిద్ధపడ్డాడు. నశించిపోతున్న మానవులందరికి తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుని జననం కోసం అటు పరలోకం ఇటు భూలోకం సమాయత్తమయ్యాయి. దైవ సంకల్పం నెరవేర్చేందుకు పరలోక దూతాళి దిగివచ్చింది. గలిలయలోని నజరేతు గ్రామంలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యయైన మరియ వద్దకు పరలోకం నుంచి ముందుగా శుభవార్త తీసుకువచ్చారు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ దేవాది దేవుని కృపపొందిన నీవు ఒక కుమారుని కంటావు.. ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి నీవు భయపడాల్సిన పనిలేదు. సర్వోన్నతుని శక్తి నీకు తోడుగా ఉంటుందని అభయమిచ్చాడు. మరియతో పాటు దేవదూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదంతా దేవుని సంకల్పంతో జరుగుతుంది కాబట్టి నీ భార్యను చేర్చుకొనుటకు సందేహింప వద్దని, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి యేసు అని నామకరణం చేయాలని చెబుతాడు. ఈ విధంగా మానవ ప్రమేయం లేకుండా పరమ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి తో మరియ ద్వారా అవని మీద అవతరించడానికి మార్గం సుగమం అయింది. ► భూలోకం మైమరచిపోయిన వేళ యేసు పుట్టుక సమయంలో యోసేపు మరియను తీసుకుని తన సొంత గ్రామమైన బెత్లెహేముకు బయలుదేరతాడు. నిండు చూలాలైన మరియకు స్థలం లేకపోవడం వలన ఓ పశువు పాకే ప్రభు జన్మస్థలమైంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఓ సత్రములో పరుండి యుండుట మీరు చూచెదరన్న ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఆ రాత్రి ఊరి వెలుపల గొఱె -
హైదరాబాద్లో ఏప్రిల్ 8న రన్ ఫర్ జీసస్
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కథోలిక, ప్రొటెస్టెంట్ సంఘాలను సమీకరించి, సమైక్యపరచి యేసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్థానాల సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య, ఎక్యుమెనికల్, మహోద్యమం రన్ ఫర్ జీసెస్. అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ, పరుగెత్తుతూ, మోటర్ సైకిళ్లు, కార్లు, మొదలగు వాహనాలపై వెళ్తూ, జండాలను ఊపుతూ, "క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పురనరుత్థానుడయ్యెను" అని సంతోషంతో ఎలుగెత్తి చాటుతారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ మహాద్భుతమైన స్వార్తీక, ఎక్యుమెనికల్ ర్యాలిని ఆరాధన టీవి బృందం వారు 2011 సంవత్సరంలో రూపక ల్పన చేసి, క్రైస్తవ లోకానికి పరిచయం చేసారు. ప్రారంభంలో కేవలం 30 ప్రాంతాల్లో మాత్రమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నేడు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అలాగే విదేశా ల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. క్రైస్తవ యువత, లే లీడర్స్, పాస్టర్స్, ప్రిస్టులు, బిషప్పులు, అధ్యక్షులు అందరూ తమ తమ ప్రాంతాల్లో నిర్వహించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణ, ఇటు క్రైస్తవ సమాజం అటు క్రైస్తవ నాయకులు రన్ ఫర్ జీసస్ను తమ స్వంత కార్యక్రమంగా భావించి, వారి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మధ్యలో ఉండే శనివారం నాడు రన్ ఫర్ జీవన్ కార్యక్రమాన్ని నిర్వహించడమనేది గమనార్హం. ప్రస్తుతం ఒకే రోజున, ఒకే సమయానికి 500 ప్రాంతాల్లో రన్ ఫర్ జేసెస్ నిర్వహించనున్నారు. ఇప్పుడిది ఎవరో ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేదా సంఘానికి సంబంధించినదిగా కాక, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కార్యక్రమంగా పరిపూర్ణంగా పరిణామం చెందింది. ఏదేమైనా, వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక రన్ ఫర్ జీసస్ నాయకులతో కలిపి ఆరాధన టీవీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం, గ్రేటర్ హైదరాబాద్లో, 2023 ఏప్రిల్ 8, శనివారం వాడు ఉదయం 6 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మహాఘన పీఠాధిపతులు, కార్డినల్.. పూల ఆంథోని, మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు రైట్ రెవ. డా. పద్మారావ్, హైదరాబాద్ రీజినల్ కావ్వరెవ్ రెసిడెంట్ బిషప్ యం. ఎ. డానియేల్, ఆరాధన టీవీ చైర్మెన్ బ్రదర్ పాల్ దేవప్రియం పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ముహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొంటారు. రన్లో పాల్గొనే ప్రజలంతా మహాసంతోషంతో ముగింపు సభాప్రాంగాణాలకు చేరుకుంటారు. స్థానిక సువార్త గాయకులు స్తుతి ఆరాధనను జరిపిస్తారు. ఒక సీనియర్ పాస్టర్ ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని.. తద్వారా దేవాధిదేవునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. -
Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్: ‘నీ రాజ్యం వచ్చును గాక...’
ఆకురాలే కాలం తర్వాత చెట్లు చిగిర్చే వసంతం – ‘క్రిస్మస్ సీజన్’కు మనోహరమైన దృశ్య నేపథ్యం కావడంతో, విశ్వాసాలకు అతీతమైన భావన మన లోపలికి చేరి,’ఫీల్ గుడ్’ మానసిక స్థితికి మనల్ని చేరుస్తుంది. ఒంటరిగా ఏ చలిరాత్రిలోనో రెండు చేతులు జేబుల్లో ముడుచుకుని నడుస్తూ వెళుతుంటామా, చీకటి తెరలు చీల్చుకుంటూ ఎవరిదో బాల్కనీలో వెలుగుతూ వేలాడుతున్న ‘క్రిస్మస్ స్టార్’ కనిపిస్తుంది. అటు చూస్తూ దాన్ని మనం దాటతాం. అయితే అదక్కడ ఆగదు, దాన్ని దాటాక కూడా అది మన వెంట వస్తూ మన లోపలికి చేరి, కొంతసేపు అది అక్కడ తిష్టవేస్తుంది. ఎందుకలా? అది ‘ఫీల్ గుడ్’ సీజన్ కావడం వల్లా? అంతే కావచ్చు... ఐరోపాలో మొదలైన ఈ ‘సీజన్’ భావన ‘క్రిస్మస్’ను ప్రపంచ పండగ చేసింది. కానీ ఆసియాలోని బేత్లెహేములో అప్పట్లో జీసస్ పుట్టిన స్థలం ఏమంత పరిశుభ్రమైనదేమీ కాదు. అయినా ఆ జననం నేరుగా రాజమందిరంలో ప్రకంపనలు పుట్టించింది. చివరికి జనాభా నమోదు కోసం స్వగ్రామం నజరేతు నుంచి వచ్చిన దంపతులు తమతోపాటు ‘రాజ్యం’ జాబితాలో వారి మగ శిశువుకు కూడా ఒక ‘నంబర్’ వేయించుకుని, స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అలా చరిత్రలో క్రీస్తును రెండు శకాల మధ్య ప్రతిష్టించడం మొదలయింది. అందుకే ప్రపంచ చరిత్రలో జీసస్ ‘ఫిక్షన్’ కాలేదు. యువకుడైన జీసస్ను ప్రార్ధన చేయడం ఎలా? అని శిష్యులు అడుగుతారు. అయన చెబుతాడు– ‘పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక...’ అంటూ సాగుతుంది ఆయన చెప్పింది. మరొక రాజ్యమేదో మున్ముందు రావలసి ఉన్నది అనేది అక్కడి సారాంశం. ఆయన దృక్పథం‘రాజ్యం’ ప్రాతిపదికగా ఉంది. మరొకసారి ‘బోధకుడా జార్ చక్రవర్తికి పన్ను చెల్లించాలా?’ అని కొందరు అడుగుతారు. జీసస్ వాళ్ళ చేతిలోని నాణెం తీసుకుని– ‘దీనిమీద వున్న ఈ బొమ్మ ఎవరిది?’ అని అడుగుతాడు. ‘అది జార్ చక్రవర్తిది’ అని వాళ్ళు బదులిస్తారు. ‘అయితే, రాజుది రాజుకు, దేవునిది దేవుడికి ఇవ్వండి’ అంటాడు. ఒకపక్క తండ్రి ‘రాజ్యం’ రావాలి అంటూ ప్రార్థన నేర్పుతూనే, మరోపక్క మనకు పౌరసత్వమున్న ‘రాజ్యాన్ని’ మనం అంగీకరించాలి అంటాడు. అయితే, చరిత్రలో ఈ భావధార ఎక్కడా ఆగినట్టుగా కనిపించదు. దీనికి కొనసాగింపు అన్నట్టుగా మరొక యూదు తత్వవేత్త కార్ల్ మార్క్స్ ‘రాజ్యం అంతరిస్తుంది...’ అంటాడు. ‘రాజ్యం’పై ఆధారపడుతున్న వారు క్రమంగా తగ్గడం, అందుకు సూచిక అయితే కావొచ్చు. బాలుడైన జీసస్ పశువుల పాకలో చలి తగలకుండా గుడ్డలతో చుట్టి ఖాళీగా వున్న పశువులు నీళ్లు తాగే తొట్టెలో ఉన్నట్టుగా ‘క్రిస్మస్’ గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మల్లో చూస్తాం. మేరీ, జోసఫ్లతో పాటుగా గొర్రెల కాపరులు, తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు విలువైన కానుకలు సమర్పిస్తారు. రెండు విభిన్న సామాజిక–ఆర్థిక సమూహాలు జీసస్ వద్దకు రావడం– ‘క్రిస్మస్’తోనే సాధ్యమయిందా? నాటి వారి కలయిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదా అంటే, లేదని అనడానికి కారణాలు కనిపించవు. ప్రపంచం ‘క్రిస్మస్’ జరుపుకోవడం రెండు భిన్న సమూహాలు మధ్య దూరాలు తగ్గడంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ‘కేక్స్’ కట్ చేయడం, ఆనందోత్సాహాలను పంచుకోవడం వంటివి తరాలు మారుతూ ఉంటే అది మరింత ‘ట్రెండీ’గా మారుతున్నది. ‘క్రిస్మస్’ సీజన్లో అన్ని దేశాల్లో రిటైల్ మార్కెట్ ఊపందుకుంటుంది. దుస్తులు, ఫ్యాషన్ల ప్రకటనలు ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాం. ‘కరోనా’ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఎయిర్ పోర్టుల్లో ‘క్రిస్మస్’ సందడి నెల ముందే మొదలయింది. – జాన్ సన్ చోరగుడి -
ఆయన ప్రణాళిక అమోఘం
దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! బలము తెచ్చుకొని వెళ్ళుము... నిన్ను పంపిన వాడను నేనే (న్యాయా 6:14). కష్టించి పనిచేసిన తరువాత చేతికొచ్చిన ప్రతిఫలం కళ్ళముందే ఎవరైనా తన్నుకుపోతే ఎంత బాధ ఉంటుందో కదా? చెమటోడ్చి సంపాదించిన వాటిని శత్రువులొచ్చి తీసుకుపోతే ఎంతటి వేదన గుండెలోతుల్లో ఉంటుందో కదా? చాలా సంవత్సరాల క్రితం గిద్యోను కాలంలో కూడా ఇశ్రాయేలీయులు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. ఆ విపత్కర సమయంలో దేవుడు గిద్యోనుతో పలికిన మాటలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలం. తన ప్రజలను రక్షించడానికి గిద్యోను మీద ఉంచబడిన బాధ్యత చాలా గొప్పది. అనాది నుండి దేవుడు తన ప్రజలను కొన్ని ప్రత్యేక ఉద్దేశ్యాల కోసం పిలుస్తూనే ఉన్నాడు. మహాశ్చర్య కార్యములను నెరవేర్చుటకు తన వారిని వినియోగించుకొంటూనే ఉన్నాడు. దేవుని పిలుపు వెనుక అద్భుతమైన పరమార్థం దాగి ఉంటుంది. కాలయాపన కోసమో, అనవసరంగానో దేవుడు ఎవ్వరిని పిలువలేదు... పిలువడు కూడా. ఆ కాలంలో మిద్యానీయుల భయంతో ఇశ్రాయేలీయులంతా కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకొరకు సిద్ధపరచుకొని వాటిలో నివసించేవారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటను దోచుకొనేవారు. కష్టార్జితం ఇల్లు చేరేది కాదు. చాలాకాలం కష్టించి, శ్రమించి పండించిన పంట చేతికొచ్చే వేళ మిద్యానీయులు వచ్చి సమస్తాన్ని కొల్లగొట్టేవారు. కొన్ని కొన్నిసార్లు విత్తనములు విత్తిన తరువాత మిడతల దండంత విస్తారంగా వారిమీదకు వచ్చి పంటను పాడుచేసి గొర్రెలను, యెడ్లను, గాడిదలను, జీవనసాధనమైన వాటిని దొంగిలించి వారిని బహుగా బాధించేవారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు చేరుకున్న తరుణంలో దేవుడు గిద్యోను ద్వారా వారిని రక్షించడానికి సంకల్పించాడు. అవును! ఆయన దివ్యమైన ప్రణాళికలు ఎప్పుడూ అమోఘమైనవే. భయకంపిత వాతావరణంలో బతుకుతున్న గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉండి కొద్దిపాటి గోధుమలను దుళ్ళగొట్టి పొట్టను పోషించుకోవాలని ఆశిస్తున్న వ్యక్తిని దేవుడు ప్రజలందరికి దీవెనకరంగా మార్చాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు తమను తాము సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ దేవుని నామమును అత్యధికంగా మహిమపరిచారు. దేవుని కార్యముల కోసం పిలువబడడం, నియమించబడడం ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
సువార్త: నీకున్న విలువ గొప్పది
లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి (1 కొరింథీ 6:20). ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే పూర్వదినాల్లో కొన్ని దేశాల్లో ట్రేడ్ సెంటర్స్లో మనుష్యులను అమ్మేవారు, కొనుక్కొనేవారు. ఆఫ్రికా దేశాలనుండి మనుష్యులను తీసుకెళ్ళి సంతలో పశువులను కొనేటట్లుగా మనుష్యులను తమ ఇష్టాయిష్టాలతో పట్టింపు లేకుండా కొనుక్కొనేవారు. అలా ధనంతో కొనబడిన వ్యక్తులు జీవితాంతం వారికి సేవ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. యజమానుని మాటను జవ దాటకుండా పనిచేసేవారు. వారికి ఏ విషయంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండేవి కావు. చాలా పోరాటాల పిదప ఆ తర్వాతి కాలంలో వారికి విడుదల లభించింది. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి మనుష్యుని కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాడు. పాప బానిసత్వం నుండి, సాతాను బంధకాల నుండి విడుదల పొందాలని ఎవరు ఆశపడతారో వారిని తన నిష్కళంకమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి వారిని ధన్యజీవులనుగా చేస్తాడు. దానిని విమోచించబడడం అంటారు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషాన్ని నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు 1:18–19) అని పేతురు చెప్పిన మాటలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉన్నాయి. తన ఉచితమైన కృపద్వారా దేవుడు మనలను కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. ఆయన స్వకీయ సంపాద్యం. రక్షింపబడక పూర్వం ఒక వ్యక్తి ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు. కాని క్రీస్తు మన కోసం వెల చెల్లించటం ద్వారా మనం ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దబడ్డాము. లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. క్రీస్తు మనలను కొనుక్కున్నది మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలని. మన దేహాల ద్వారా దేవుడు ఘనపరచబడవలెనని కోరుతున్నాడు. పాప పంకిలమైన లోకంలో క్రీస్తు ప్రతినిధులుగా బ్రతుకుచూ దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలన్నది దైవ ప్రణాళిక. దేవుడు మనలను కొనుక్కున్నాడు గనుక మనమీద సంపూర్ణ అధికారం ఆయనదే. సిలువలో సంపూర్ణంగా వెలను చెల్లించాడు గనుక ఆయన కోసం మనం జీవించాలి. ఆయన పాలన నియంత పాలన వంటిది కాదు. ఆయన మనలను కొనుక్కొన్నప్పటికి మనమీద పెత్తనం చెలాయించడు. కృపామయుడైన దేవుడు ప్రేమ పూర్వకంగా ఆదేశిస్తాడు. ఆయన ఆదేశాలకు లోబడడం మనకే ప్రయోజనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు మనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించునట్లుగా, నిరీక్షణ కలుగచేయునట్లుగా సమాధానకరములైనవే గాని హానికరములు కావు. ప్రియస్నేహితా! పరిస్థితులను బట్టి ఎన్నడును కృంగిపోకు. మనుష్యులు నిన్ను తక్కువగా చూస్తున్నారని బాధపడకు. నీవు సర్వశక్తుడైన దేవుని చేతిలో చెక్కబడ్డావు. నిన్ను ఎట్టి పరిస్థితులలో చేజారనియ్యడు. అపవాది చేతికి మరలా అప్పగించడు. ధైర్యంగా ఉండు. – డాక్టర్ జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
Easter Special: లోకానికే మహోదయం క్రీస్తు పునరుత్థానం
యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని అయన ప్రేమతత్వాన్ని తాను రచించిన ఎనిమిదివేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ఠ బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది, సమాధి ఆయన్ను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్లు విడచుట మానండి. ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’ ఈ మాటలను తన హృదయాంతరంగములో నుండి రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువుచేసింది క్రాస్బీ. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణ పూరితమైన మనస్సును వేరుచేయలేము. ఆయన పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది ఒక వడ్లవాని ఇంటిలో. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యేసేపుకి అన్ని విషయాలలో సహాయం చేశాడు. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి హృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్లున్నాయి, కాని తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చినప్పుడు కుష్ఠు వ్యాధిగ్రస్తులను కౌగలించుకున్నాడు. రోగ పీడితులను పరామర్శించి తన దివ్యస్పర్శతో స్వస్థపరచాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని సయితం అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. చులకనగా వ్యవహరించిన వారిని కూడా తన ప్రేమతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. సీయస్ లూయీ అనే సుప్రసిద్ధ సువార్తికుడు ఒకసారి ఇలా అంటాడు. యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. ‘నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే’ చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధికుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతిస్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ఠ బోధలు చేసి ఉండేవాడు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, జీవన విధానం మరింత శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. మరణ విధానం కూడా సాటిలేనిది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. జీవచ్ఛవాలుగా పడివున్న ఎందరికో స్ఫూర్తినిచ్చి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు. వాస్తవానికి క్రీస్తు మరణం, పునరుత్థానం సంభవించిన సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో విశిష్ఠమైన పాఠాలు నేర్పిస్తాయి. ‘నజరేయుడైన యేసు’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తుకు సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పారు. అన్యాయపు తీర్పు తీర్చారు. భయంకరమైన కొరడాలతో విపరీతంగా కొట్టి పైశాచికానందాన్ని పొందారు. యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురి చేశారు. ప్రేమ, సమాధానములకు కర్తయైన దేవుడు వాటినన్నిటినీ ప్రేమతో సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి వ్రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందురోజు కొన్ని సంఘటనలు జరిగారు. గెత్సేమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికి యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపు బిందువులుగా మారెను. యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈనాటికీ యెరూషలేమునకు వెళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గంలో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్లు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల పొడవు ఉంటాయి. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇశ్రాయేలు మ్యూజియంలో మొదటి శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి పాదము, ఆ పాదములో దించబడిన మేకు కనబడుతుంది. దానిని బట్టి ఆ కాలంలో సిలువ విధించబడే సమయంలో ఏవిధంగా మేకులు కొట్టేవారో అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును సిలువపై ఉంచి చేతులలో కాళ్లల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగ గొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మృతినొందుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. ‘సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను’ అని బైబిల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. రోమన్లు వాడే బల్లెము లేక ఈటె పొడవు సుమారు 1.8 మీటర్లు. ఆయన దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్లు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసము, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవము. వాస్తవాన్ని పరిశీలిస్తే ‘యేసు గొప్ప శబ్దముతో కేకవేసి..’ అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుంచి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు త్రిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తము పోయింది. తలపై ముళ్లకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్లలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహంనుంచి బయటకు పోయింది. శరీరం రక్తము, ద్రవములు కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ప్రాముఖ్యమైనవి. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను’ అని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ తెలియచేశాడు. క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువు చేయబడింది. ప్రేమంటే తీసుకోవడం కాదు, ప్రేమంటే ఇవ్వడం అని క్రీస్తు తన ఆచరణతో మానవాళికి తెలియచేశారు. పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. గుడ్ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుతమైన నవకాంతులమయమైన నిర్మాణముగా మార్చివేశాయి. ప్రపంచానికి ఆయన అందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన ఆయన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత, చెక్కు చెదరనవని ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. దేవుని ప్రేమను రుచిచూచిన ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాసుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా! నా జీవితం అంకితం నీకే.’ అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను.’ యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షములోనే యేసు మేకులు కొట్టబడ్డాయి. ముళ్లకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్ను కలుసుకుంది ఇలా అడిగింది సిలువలో మరణించిన ‘క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి?’. ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది–‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరుతాడు. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’ అని బదులిచ్చాడు. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాల ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. ‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు’ (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. యెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానానికి ఆయన శిష్యులే ప్రధాన సాక్షులు. ‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలచేవారు’ అని కొందరు వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. తాము నమ్మిన ప్రభువు కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. యేసు శిష్యుడైన తోమా ఆయన తిరిగి లేచాడంటే మొదట నమ్మలేదు. నీవు అవిశ్వాసి కాక విశ్వాసివై యుండు అని ప్రభువు చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించి ‘నా దేవా నా ప్రభువా’ అని పలికాడు. అప్పటి నుండి తోమా క్రీస్తు సాక్షిగా జీవిస్తూ అనేకులను సత్యంవైపు నడిపించాడు. తోమా భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చి యేసుక్రీస్తు సువార్తను అనేకులకు అందించాడు. అనేక సంఘాలను మరియు దేవాలయాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడవబడి చనిపోయాడు. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోకి తీసుకొచ్చినా, అవేవీ వాస్తవం ముందు నిలబడలేదు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునః అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోవ్ులో జూలియస్ సీజర్ సమాధి మూయబడి ఉంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధిచేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతోంది. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా బయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తు ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమ్మును విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతనోత్తేజంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే. ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టం అనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏవిషయానికీ బెదిరిపోడు, చింతించడు. తుది శ్వాస వరకు నాభర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే లూథర్లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్లు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయ్యి పోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినను మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయాలకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినది కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ యిట్టే అవగతమవుతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సర్వోన్నతునికి.. సమాధి సంకెళ్లు వేయగలదా..?
యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండీ మానవాళి చరిత్ర ఆయన చుట్టూనే పరిభ్రమిస్తున్నది. కాలం తనకు ముందు, వెనుక క్రీస్తు నామాన్ని ధరించి సాగుతూ ఉన్నది. భూమిమీద మరణాన్ని జయించి, శత్రువు తలను చితగ్గొట్టి, పునరుత్థానుడై, నలభై దినాలు ఈ నేలమీదే సంచరించి, దేవుని రాజ్య విషయాలను బోధించి, అనేక ప్రమాణాలను చూపిన ఏకైక దైవ మానవుడు, దేవుని అద్వితీయ కుమారుడు యేసు ప్రభువు! యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు అని అర్థం. ఈ ‘రక్షకుడు’ రారాజుగా మానవజాతికి శత్రువైన మృత్యువును జయించి, నరకపాత్రులమైన మనం పోగొట్టుకున్న స్వర్గం అనబడే నిత్యానందలోకంలోకి ప్రవేశాన్ని కల్పించాడు! అందుకే .. ఆ పేర్లు! ఆయన ఆరోహణ కోసం వెళ్ళేముందు యెరూషలేములోని ఒలీవా పర్వతసానువులలో తన శిష్యులను కలసి, వారు చేయవలసిన పనులను వారికి వివరించారు. ‘పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక ముందుగా యెరూషలేములోనూ, తర్వాత యూదయ, సమరయ దేశములలో, అనంతరం భూదిగంతాల వరకునూ మీరు నాకు సాక్షులైయుందుర’ని వాళ్లతో చెప్పారు. అందుకే, భూ దిగంతాల వరకూ ఈ సత్య శుభవార్త ప్రకటింపబడుతున్నది! వాళ్లు చూస్తుండగానే ఆయన ఆరోహణమై, వాళ్ల కళ్లకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొని పోయింది. వారంతా ఆకాశము తట్టు తేరి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ‘మీ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ఏరీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.’ అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఈ వివరాలున్నాయి. క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై.. తాను జీవాధిపతి అని, నశించిన దానిని వెదకి రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చానని రుజువు పరచి ఇప్పటికి ఈ నేల మీద 2000 సంవత్సరాలకు పైగా అయింది! ఆయనకు ముందు చరిత్ర అంతా ‘క్రీస్తుకు పూర్వం’ అని, తర్వాతి కాలమంతా ‘క్రీస్తు శకం’ అని చరిత్ర నమోదు చేస్తున్నది. చరిత్రలో ప్రముఖులైన ఎందరో క్రీస్తును గురించి తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఫ్రెంచ్ అధినేత నెపోలియన్ బోనాపార్టే, ప్రపంచ దేశాల స్థాపకుల గురించి చెప్తూ ‘ఈ భూమి మీద సామ్రాజ్యాలను స్థాపించిన అలెగ్జాండర్, సీజర్ , నేను, చార్ల్ మాన్ .. యేసుక్రీస్తుతో ఏ విధముగానూ సరి పోలము .. మా మధ్య ఏ పోలికా లేదు, ఆయన ‘ప్రేమ’ పునాదిగా స్థాపించిన మహా సామ్రాజ్యం అంతమే లేనిది. ఎప్పటికీ నిలిచి ఉండేది! యేసుక్రీస్తు మానవుడు కాదు, మహోన్నతుడు!’ ‘ప్రేమ, సత్యం, త్యాగం అనే దివ్యమైన సద్గుణాలకు ఉన్నతమైన ప్రమాణాలను సాధించి, జీవించి , చూపించిన యేసుక్రీస్తును నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను?’ అన్నారు మన గాంధీజీ. అల్బర్ట్ ఐన్స్టీన్ మాటల్లో ‘నేను యూదుడనే, గానీ, ఆ నజరేయుని (క్రీస్తు) ప్రకాశవంతమైన ప్రవాహంలో మునిగి పోయాను. క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని ఏ కలమూ వర్ణించలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారెవరైనా యేసు సాన్నిహిత్యాన్ని అనుభవించాల్సిందే!’ స్వామి వివేకానంద చెప్పిన మాటలు కూడా చూద్దాం ‘యేసుక్రీస్తు దైవ కుమారుడు గనుకనే, దైవ జ్ఞానాన్ని తన మాటల్లోనూ, కార్యాల్లోనూ చూపించారు, ప్రకటించారు.’ ఇలా ఎందరెందరో క్రీస్తు ప్రభువును గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభువు చెప్పారు... ‘తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో, నేను మిమ్మును ఆలాగు ప్రేమించితిని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని నొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు.’ సిలువ మీద బలియాగం అయిన యేసు క్రీస్తు మృత్యుంజయుడై 40 దినములు ఈ భూమి మీద సంచరించి, అనేకమందికి దర్శనమిచ్చి, వాళ్లు చేయవలసిన విధివిధానాలను చెప్పి ఒలీవాల కొండ మీద తన శిష్యులతో చెప్పవలసిన మాటలు చెప్పి, దాదాపు 500 మంది యెరూషలేము వాస్తవ్యులు చూస్తూ ఉండగానే మేఘాలలోకి ఆరోహణమయ్యారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి ఆ ప్రజలకు చెప్పారు.. ‘యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు మేఘాలపై ఆరోహణమై వెళ్లారో, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తార’ని! ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారిని మేఘ వాహనం మీద తీసుకుని వెళ్తారు, తర్వాత ఆయన తీర్పు తీర్చే రోజు ఒకటి ఉన్నది. మృత్యుంజయుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోయే ఆ క్షణం కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యమైన ఆ పరలోకానికి పాత్రులమయ్యేందుకు ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుదాం. ఈ పునరుత్థాన పండుగ మనకిచ్చే సందేశం అదే. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు! దేవుడు మనందరినీ తన పునరుత్థానశక్తితో దీవించును గాక! – ఝాన్సీ కె. వి. కుమారి -
Good Friday Special: వెలుగు పూలు పూయించిన కలువరి సిలువ
మానవాళి రక్షణ కోసం మహోన్నతుని సిలువ యాగం మరణ భయాన్ని పటాపంచలు చేసింది. సాతాను కోరలు చీల్చి వేసింది. అంధకార బంధురమైన జీవితాల్లో వెలుగు పూలు పూయించింది. నిరీక్షణ లేని జీవితాల్లో వెలుతురు కిరణాలు ఉదయింపజేసింది. కరుణామయుని శిలువ యాగం గెత్సెమనే తోట నుంచే ప్రారంభమయింది. శుక్రవారం సిలువకు అప్పగించకముందే గెత్సెమనే తోటలో తన రక్తం స్వేదబిందువులుగా మారే వరకూ ప్రార్థనలో గడిపాడు. లోక పాపాన్నంతా తన వీపుపైన మోసేందుకు సిద్ధమయ్యాడు. ఓ తరుణంలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నానుండి తొలగించమని ప్రార్థించినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకే సిద్ధమయ్యాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకే ఏర్పాటు చేసిన మార్గం సిలువ మార్గం. ఒకవైపు గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థిస్తూ మానవ సాయం కోసం తన శిష్యుల వైపు చూశాడు. శోధనలో పడకుండా మెళకువగా వుండి ప్రార్థించండి అని చెప్పినా వారు నిద్రమత్తులై ఉన్నారు. అప్పుడే తాను ప్రేమించిన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా క్రీస్తు సిలువలో ప్రధాన పాత్రధారిగా మారి 30 వెండి నాణెములకు క్రీస్తును అప్పగించేందుకు మత పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని గెత్సెమనేలో ముద్దుపెట్టుకొని మరీ యేసును అప్పగించాడు. యేసును ఒక బందిపోటు దొంగమీదికి వచ్చినట్లు కత్తులతో వచ్చిన వారిని చూసి కనికరపడ్డాడు తప్ప ఒక్క మాటయినను పలుకలేదు. తన శిష్యులు తనను వదిలి పారిపోగా ఒంటరియైన యేసు ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకువచ్చి వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఇష్టము వచ్చినట్టు గుద్దారు. మరికొంతమంది అర చేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని హేళన చేశారు. ‘తన ప్రియ కుమారుని నలుగగొట్టడానికి ఆ దేవాది దేవునికి ఇష్టమాయెను’ అన్న లేఖనాలు ఈ విధంగా నెరవేరాయి. ఉదయం యేసును బంధించి అధిపతియైన పొంతి పిలాతుకు క్రీస్తును అప్పచెప్పారు. చివరకు అన్యాయపు తీర్పే గెలిచింది. యూదా మత పెద్దలకు భయపడి పొంతి పిలాతు యేసును సిలువకు అప్పగించాడు. వారు యేసును గొల్గొతా కొండకు తీసుకు వచ్చి చేతులు, కాళ్ళలో శీలలు కొట్టి సిలువకు వేలాడదీశారు. ఇరు పక్కల ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు. ‘‘దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కడతానన్నావుగా చేతనైతే నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా’’ అంటూ దూషిస్తూ ‘‘వీడు ఇతరులను రక్షించెను గానీ తన్ను తాను రక్షించుకోలేడంటూ’’ అపహాస్యం ఒకపక్క, రోమా సైనికుల కాఠిన్యం మరోపక్క యేసును బాధపెట్టినా తన తండ్రి మానవుల రక్షణ కొరకు తలపెట్టిన బలియాగంలో తాను సమి«ధగా మిగిలి పోవడానికే సిద్ధపడ్డాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సిలువ మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ వేడికి తాళలేక యేసు మూర్ఛబోయాడు. దాహం అని అడుగగా చేదు చిరకను అందించారు. కొరడాలతో, మేకులతో ఒళ్ళంతా రక్తం ధారలుగా కారుతుండగా చనిపోయాడో లేదోనని పక్కలో బల్లెంతో పొడిచారు. ఆ సమయంలో యేసు మాటలాడిన ఏడు మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తనను హింసిస్తున్న వారిని చూసి యేసు ప్రభువు ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’మంటూ చేసిన ప్రార్థన నభూతో న భవిష్యతిగా చెప్పుకుంటారు. మనలను హింసించే వారి కోసం ప్రార్థించాలి అన్న యేసు సిలువలో తనను చంపుతున్న వారి కోసం చేసిన ప్రార్థన అది సాధ్యమే అని నిరూపించాడు. తనతోపాటు సిలువ వేయబడిన కుడివైపు దొంగ, ‘ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోవాలి’ అంటే ఆ క్షణంలో రక్షణను అనుగ్రహించి నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయమొసంగిన జాలిగల ప్రభువు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఎటువంటి వారికైనా రక్షణ భాగ్యం దొరుకుతుందన్న ఆశావాదాన్ని కలిగించాడు. క్రీస్తు సిలువ మార్గం, ముక్తి మార్గం పాపంలో నశించిపోతున్న మానవాళి ముక్తి కొరకు ఒక మంచి గొర్రెల కాపరిగా తాను ప్రేమించి గొర్రెల కోసం తన ప్రాణాన్ని కలువరిపై ధారపోసి మరణ భయంతో ఉన్నవారికి నిత్యజీవం అనే వెలుగును ప్రసాదించాడు క్రీస్తు.. రెండు వేల సంవత్సరాలైనా ఆ వెలుగు పూలు అందరి మదిలో వెలుగుతూనే ఉన్నాయి. – బ్రదర్ బందెల స్టెర్జిరాజన్ -
వైభవంగా క్రిస్మస్ వేడుకలు
గుణదల (విజయవాడ తూర్పు)/అనంతపురం కల్చరల్: లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగానున్న క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీ విశేషంగా ఆకట్టుకోగా.. పశువుల పాకలో కొలువైన బాలయేసును భక్తి శ్రద్ధలతో పూజించారు. కాగా క్రైస్తవ విశ్వాసులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి చేరుకోవడంతో గుణదల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతపురంలో క్రిస్మస్ ప్రార్థనలకు హాజరైన భక్తులు రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ.. యేసుక్రీస్తు ఆచరించి చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అనంతపురం ఎస్ఐయూ చర్చిలో జరిగిన వేడుకల్లో శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. గుణదల మేరీమాత ఆలయం వద్ద భక్తుల సందడి -
ఇలపై జనించిన కరుణ కిరణం
‘చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహమందున...చెంత చేరను రండి సర్వజనాంగమా..సంతసమొందుమా!’ అని హృదయపూర్వకంగా కీర్తన పాడే సుదినం క్రిస్మస్. సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకంలో బాలునిగా జన్మించిన యేసుక్రీస్తు ఆగమనాన్ని కీర్తించే సంతస దినం క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా నేడు కోట్లాదిమంది హృదయాల్లో ఆనందం పెల్లుబికే రోజు. ఇది చారిత్రాత్మక పర్వదినం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. తన మనస్సును దేవుని ప్రేమతో నింపుకొని పరిపూర్ణ ఆరాధనలో పరవశిస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొలపాలనే ఆశతో నిండిన వ్యక్తి కలం నుండి జాలువారిన మాటలివి. ‘ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన క్రీస్తుకు నమస్కరింప రండి... నమస్కరింప రండి’. చాలా సంవత్సరాల కిందట ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్ని వేలానికి సిద్ధపరిచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని స్వంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలంలో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు అనేది లేఖన సత్యం (రోమా 2:23). పాపం దేవునికి మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపంలో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. క్రిస్మస్ దేవుడు మనకు సమీపంగా వచ్చాడన్న సందేశాన్ని జ్ఞాపకం చేస్తుంది. కన్యక గర్భవతియై కుమారుని కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని క్రీస్తు పుట్టుటకు కొన్ని వందల సంవత్సరాల ముందు యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. మనతో మనలో నివసించడానికి ప్రభువు ఇష్టపడి కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించాడు. మరియ యోసేపులు నజరేతు నుండి బేత్లెహేమునకు వచ్చినప్పుడు సత్రంలో వారికి స్థలం లేనందున యేసును కనిన తరువాత మరియ ఆయన్ను పశువుల తొట్టెలో పరుండబెట్టింది. ఊహకు అందని ఆశ్చర్యం అది. సర్వశక్తిగల దేవుడు భువిలో జన్మిస్తే ఆయన్ను పరుండబెట్టాల్సిన స్థలమా అది? అయితే ప్రభువైన దేవుడు పశువుల శాలలో మరియు తొట్టెలో పరుండబెట్టుట వలన మొదటిగా అతి సామాన్యులైన గొర్రెల కాపరులు నిర్భయంగా దర్శించగలిగారు. ఆ కాలంలో గొర్రెల కాపరులను చాలా తక్కువగా చూసేవారు. అలాంటి అభాగ్యులకు దేవుని దర్శన భాగ్యం కలిగింది. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. జీవిత ద్వారాలు తెరిచి సందేహాలు మరిచి దేవున్ని తలిస్తే దేవుని స్పర్శను అనుభవించగలము. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్టించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైక వేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ నిన్ను వీడనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు వారిని నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించ గలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్ధం వేరే వుండదు. నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు...కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు అని ఒక అపర కుబేరుడు మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. భౌతిక అవసరాలు తీర్చబడితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. క్రీస్తుకు తన హృదయంలో చోటివ్వడం ద్వారా తాను పొందిన అనుభూతిని ఒక వ్యక్తి ఇలా వర్ణిస్తాడు. ‘దేవుడే నా యిల్లు. గడచిన కాలమంతా అంతంలేని దారుల్లో అంధుడిలా నడిచాను. నాలో నేనేదో దేవులాడుకున్నాను. దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను. ఆశలు సమసి భయాలు ఆవరించినప్పుడు రక్షకుడైన క్రీస్తును దర్శించాను. ఆయన ప్రేమగల కౌగిల్లో జీవించాలని నిర్ణయించుకున్నాను. దేవుడే నాకు ఆనందంతో పాటు అన్నీ అనుగ్రహించాడు’. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'!
అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు! మనలో చాలా మందికి క్రిస్టమస్ పండుగ చాలా ప్రత్యేకం. క్రీస్తు జన్మార్ధమైన ఈ పర్వదినాన బంధుమిత్రులతో, విందు భోజనాలతో, బహుమతులతో సందడిగా ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడపాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అలాగే జరుగునుగాక! ఐతే క్రిస్టమస్ పండుగ సందర్భంగా మీ ప్రియమైనవారికి ఖరీదైన గిఫ్టులివ్వలేకపోయినా, కోట్ల విలువచేసే చిన్న పలకరింపు, చక్కని మాటలతో పేర్చిన మెసేజ్లను పంపినా వారెంతో మురిసిపోతారు. సోషల్ మీడియాలో షేర్ చేయదగిన అట్లాంటి కొన్ని కోట్స్, గ్రీటింగ్స్, మెసేజెస్లు, ఫొటోలు మీకోసం.. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!' మీ సెలవులు ఆనందంతో నిండునుగాక... క్రిస్మస్ శుభాకాంక్షలు! నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదం మనం స్వీకరించే బహుమతుల్లో ఉండదు. పండుగను ఆనందంగా మలిచే కుటుంబంలో ఉంటుంది. మీ క్రిస్మస్ అద్భుతమైన అన్ని విషయాలతో నిండుగా ఉండాలి. క్రిస్మస్ మెరిసే లైట్లు మీ హృదయాన్ని ఆశలతో నింపాలి. మీకు కావలసినవన్నీ శాంటాక్లాజ్ తేవాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరమంతా ఆనందంతో నిండి ఉండాలి. ఈ సంతోషకరమైన రోజున ఇవే మీకు నా శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్! ఈ హాలిడే సీజన్ మీకు శాంతి, శ్రేయస్సు, కోరుకున్న అన్ని బహుమతులను తెస్తుందని ఆశిస్తున్నాను! హ్యాపీ హాలిడేస్! క్రిస్మస్ మీకు ప్రేమ, ఆనందం, శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాను. మీ క్రిస్మస్ ఆనందాలతో, బహుమతులతో నిండి పోవాలి. హ్యాపీ హాలిడేస్! ఈ క్రిస్మస్ మీ ఇంటిలోని ప్రతి మూలను, మీ హృదయాన్నంతటిని ఆనందంతో నింపుతుందని ఆశిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ పండుగ ఆనందం మీ జీవితాన్ని ఆనందం, శాంతితో నింపుతుంది. చదవండి: Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్! ఆనందం, ఐశ్వర్యం, శాంతి అనే గిఫ్ట్ ఫ్యాక్లను ఈ క్రిస్మస్ రోజున మీరు విప్పాలని ఆశిస్తున్నాను! ఈ క్రిస్మస్ పర్వదినాన మీరు కోరుకునేవన్నీ శాంతా క్లాజ్ మీదగ్గరకు తీసుకురావాలి. ఈ క్రిస్మస్ రోజున మీ హృదయం ఆనందంతో పొంగిపొర్లుతుందని ఆశిస్తున్నాను. నా ప్రతి రోజును ఆనందంగా మార్చే నా ప్రియమైన ఫ్రెండ్కు క్రిస్మస్ శుభాకాంక్షలు. నా క్రిస్మస్లో హ్యాపీనెస్ను ఉంచి, నిజమైన స్నేహితుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ రోజున మీ ఆనందం పెద్దగా, మీ బిల్లులు చిన్నవిగా ఉండాలని కోరుకుంటున్నాను! మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022! ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ శుభవార్తలనే తెస్తుంది. క్రిస్మస్ మీకు మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా దేదీప్యమానంగా వెలుగుతోంది! మీలాంటి ఫ్రెండ్స్ నాతో ఉండటమే క్రిస్మస్ అందించే అత్యుత్తమ గిఫ్ట్. క్రిస్మస్ శుభాకాంక్షలు! (మీరు మీ సన్నిహితులకు మేరీ క్రిస్మస్ విషెష్ తెలియజేయండి ఇలా..) -
హృదయమనే పలక మీద దేవుడుంటే..?
నీ హృదయమను పలకమీద వాటిని రాసికొనుము. సామెతలు 7:3. ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు దేవుని రూపంలో, పోలికలో సృషించబడ్డాడు. ప్రతి మనిషికి హృదయం ఉంది. అయితే ఆ హృదయాన్ని ఎలా నిర్వచించగలము? దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం ఎలా? పరిశుద్ధ గ్రంథంలో మానవ హృదయాన్ని గురించి అనేక వచనాలు ఉన్నాయి. సామెతల గ్రంథకర్త సొలొమోను మనిషి హృదయాన్ని పలకతో పోల్చి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు. పలక తెలియనివారెవ్వరు? పూర్వదినాల్లో ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలం భద్రపరచాలనుకున్నప్పుడు వాటిని రాతి పలకల మీద రాసేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాలలో చాలా రాతి పలకలు బయటపడుతున్నాయి. వాటిమీద రాసిన విషయాలను బట్టి ఆయా కాలాల చరిత్రను, ఆ కాలంలో జరిగిన సంగతులను అర్థం చేసుకొంటున్నారు. బైబిల్ రాతలను, చరిత్రను సమర్థించే చాలా పలకలు నేటికీ ఉన్నాయి. విన్న విషయాల కన్నా చేతితో రాయబడినవి ఎక్కువ కాలం గుర్తుంటాయన్నది పెద్దల మాట. మానవ హృదయం కూడా ఒక పలకే. అనునిత్యం వాటిమీద ఏం రాసుకొంటున్నాము అనేది మన భవిష్యత్తును శాసిస్తాయి. హృదయం నిండియున్న వాటిని బట్టి నోరు మాట్లాడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది (లూకా 6:45). కొందరు తమకు హాని చేసినవారి వివరాలు హృదయమనే పలక రాసుకొని ఎప్పటికైనా వారికి ప్రతీకారం చేయాలని కనిపెడతారు. కొందరు యవ్వనస్థులు తాము ప్రేమించే వారిని వారి హృదయాల్లో చెక్కుకుంటారు. అనుక్షణం వారి కోసం జీవిస్తారు, తపిస్తారు. రోజులో ఎక్కువ సమయం వారి గురించే ఆలోచిస్తారు. ఒక్క విషయం స్పష్టంగా ఆలోచించాలి. హృదయమనే పలక మీద ఎవ్వరిని చెక్కుకుంటే, వేటిని రాసుకొంటే వారే జీవితాన్ని శాసిస్తారు. మన ఆలోచనలను, తలంపులను, అలవాట్లను పురికొల్పుతారు. ఇప్పటికిప్పుడు నీ హృదయమనే పలకను పరిశీలిస్తే తీస్తే ఎవరెవరి పేర్లు, జీవితాలు బయటకు వస్తాయి? నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. తన కోసం తాను కట్టుకున్న ఇల్లు అది. దానిని మినహాయించి నీవు దేవునికి ఏం ఇచ్చినా ఆయన సంతృప్తి చెందడు. రకరకాల రాతలు రాయబడిన నీ హృదయమనే పలకను ఒక్కసారి తుడిచేయి! యేసుక్రీస్తు అనే సుమధుర సుందర నామాన్ని లిఖించు. అద్భుతాలు చూస్తావు. ‘‘మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక మీరు’’ అని పౌలు దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని తెలియచేశాడు. రక్షింపబడిన నీవు దేవుని పత్రికవు. అనుక్షణం ప్రజల చేత చదువబడుచున్నావు. లోకం నిన్ను అడుగుడుగునా గమనిస్తుంది. నీ హృదయమనే పలక మీద క్రీస్తుకు చోటుంటే ఆయన వాక్యానికి చోటున్నట్లే. దేవుని వాక్యంతో హృదయాన్ని సంపూర్తిగా నింపుకుంటే శక్తిగల దేవుని మాటలనే నీవు వల్లిస్తావు. నిన్ను గమనించినవారంతా నీ హృదయమనే పలక మీద రాయబడిన క్రీస్తును, మహోన్నతమైన ఆయన ప్రేమను గమనిస్తారు. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు
నా రక్షణకు మహిమకు ఆధారం దేవుడే (కీర్తన 62:7). తన జీవిత అనుభవాల నుండి దావీదు ఎన్నో కీర్తనలను రచించాడు. ఆ కీర్తనలు ప్రతి విశ్వాసి జీవితానికి ఎక్కడో ఒకచోట సంబంధం కలిగి ఉంటాయి. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు దేవుణ్ణే ఆధారంగా భావిస్తూ సాగిపోయే వ్యక్తి ఖచ్చితంగా ధన్యజీవియే. జీవితయాత్రలో నిశ్చలమైన అనుభవాలతో ముందుకు సాగిపోవాలనే ప్రగాఢమైన కోరిక ప్రతి ఒక్కరికి తప్పక ఉంటుంది. దేవుని కృప ద్వారా అన్ని విషయాల్లో పైకి ఎదుగుతున్న వానికి శత్రువుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. నిలబడినవానిని కిందకు తోయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు కొందరు. ఒరుగుతున్న గోడను కంచెను ఒకడు చాలా సునాయాసంగా పడగొట్టునట్లు నిల్చున్న వారిని పడగొట్టడానికి అనేకులు ముందుకొస్తారు. లోకసంబంధమైన వారి ఆలోచనలు ఎప్పుడూ ఎదుటివారి అభివృద్ధిని ఓర్వలేనివిగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో విశ్వాసి స్పందన ఎలా ఉండాలన్న విషయాన్ని భక్తుడు నేర్పిస్తున్నాడు. మనలను సృష్టించిన దేవుని వలన మనకు రక్షణ, నిరీక్షణ, మహిమ కలుగుతున్నాయి. ఆయనను మించిన ఆశ్రయదుర్గం మనిషికి ఉండదు. మనిషి మహిమకరమైన జీవితాన్ని జీవించాలంటే మహిమాన్వితుడైన యేసుక్రీస్తును హృదయం లోనికి ఆహ్వానించాలి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు కోల్పోయిన మహిమను మనుష్యజాతికి మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. పాపం చేయుట ద్వారా మానవుడు దేవుని మహిమను యధేచ్చగా కోల్పోతున్నాడు. అందరునూ పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు (రోమా 3:23). పాపం వలన మనిషిలో భయం, ఆందోళన, కలవరం వంటివి రాజ్యమేలుతున్నాయి. ఆధ్యాత్మిక పతనం నుండి బయట పడాలంటే మానవుడు దేవుని మహిమతో మరలా నింపబడాలి. కోల్పోయిన మహిమను వెతుక్కునే ప్రక్రియలో మనిషి ఎన్నో భక్తికార్యాలు నిరంతరాయంగా చేస్తున్నాడు. దేవుని మహిమను కలిగి ఉన్నాననే నిశ్చయత నీకుందా? నీవు చేస్తున్న అవిధేయమైన కార్యాల ద్వారా నీవు కోల్పోతున్న వాటిలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని మహిమ అని గుర్తించు. నీవు దేవునికి దూరమవటం ద్వారా సాతాను శక్తులు నీమీద విపరీతంగా దాడి చేస్తున్నాయి. నిన్ను నిలువుగా కుంగదీస్తున్నాయి. దురవస్థలోనికి నిన్ను నెట్టేస్తున్నాయి. ఇప్పుడే దేవుని ప్రశస్త సన్నిధిలో వేడుకో! చీకటిని వెనుకకు నెట్టి దేవుని ప్రకాశమయ సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. లోకరక్షణార్థమై యేసుక్రీస్తు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి అనిర్వచనీయమైన తన మహిమను ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఊహించలేని వెలుగుతో, తన దివ్య మహిమతో నిన్ను నింపగలిగే ఆయన ప్రేమగల దేవుడని సిలువ మరణం ద్వారా రుజువు చేయబడింది. సర్వశక్తుని దివ్య మహిమ మనిషికి అన్ని విషయాల్లో విజయాన్నిస్తుంది. నిత్యజీవానికి మనిషిని నడిపిస్తుంది. ఆమేన్!! – డా.జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
నిన్ను నిలిపే దేవుడు ఉన్నాడు!
ఎత్తయిన స్థలములమీద ఆయన నన్ను నిలుపుతున్నాడు (కీర్తన 18:33). నిత్య జీవితంలో అనుదినం మనలో ప్రతి ఒక్కరం ఏదో పనిలో నిమగ్నమై ఉంటాము. అహర్నిశలు పని చేయడం కొందరికి ఆనందం, మరికొందరికి బాధ్యత. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చేసేస్తాం. ఇష్టం కాకపోతే సునాయాసం గా చేయగల పనులను కూడా వాయిదాలు వేస్తుంటాం. మనకు మనస్కరించని పనులకు ఏవేవో సాకులు చెబుతూ వాటిని పక్కనపెడుతుంటాం. సకల చరాచర సృష్టిని తన మహత్తయిన మాట ద్వారా సృష్టించిన దేవుడు కూడా తన సంకల్పాలను నెరవేర్చడానికి పనిచేస్తూనే ఉన్నాడు, ఉంటాడు కూడ. ఆయనకు పనిచేయడం ఇష్టం. బలీయమైన తన నిర్ణయాల నుండి ఎవ్వరూ ఆయన్ను పక్కకు తీసుకెళ్ళలేరు. తనను నమ్మినవారి యెడల తన ఉద్దేశాలను నెరవేర్చడం దేవునికి మహా ఇష్టం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు (యిర్మీ 29:11) వ్యతిరేక శక్తులు, ప్రతిబంధకాలు ఆయన్ను ఇసుమంతైనా నిలువరించలేవు. విశ్వాసంలో బలిష్టులను ఉన్నతస్థలాల్లో నిలబెట్టడం దేవునికున్న మహాశయం. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. పెంటకుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తి వారిని తన ప్రతినిధులుగా ప్రపంచానికి పరిచయం చేయడం దేవుని అలవాటు. బెత్లేహేము పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్న దావీదును ఇశ్రాయేలు రాజ్యానికి తిరుగులేని రాజుగా నిలబెట్టాడు. ఇప్పుడు పదుల సంఖ్యలో గొర్రెలను కాస్తుంటే... భవిష్యత్తులో వందల సంఖ్యలో కాచే అవకాశం ఉండచ్చు అని అందరూ అనుకొని ఉండవచ్చు. మానవ అంచనాలను పటాపంచలు చేసే శక్తి దేవునిది. ఊహలకు అందని మేళ్లు చేసే మహాఘనుడు మన దేవుడు. గొర్రెలు కాసుకొనే దావీదును ఇశ్రాయేలు రాజ్యాన్ని నలభై సంవత్సరాలు అద్భుతరీతిలో పాలించగలిగే రాజుగా నిలబెట్టాడు. రాజ్యాన్ని అప్పగించిన దేవుడు దావీదు ద్వారా ఎన్నో ప్రజోపకరమైన గొప్ప కార్యాలను నెరవేర్చాడు. ఎందరినో నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలువబెట్టడు? విశ్వచరిత్రలో కృంగిపోయినవారిని లేవనెత్తిన దేవుడు నిన్నెందుకు లేవనెత్తడు? నిరాశా నిస్పృహలో కూరుకొని ఏడుస్తున్నావా? పట్టించుకొనే వారెవరు లేరని దుఃఖిస్తున్నావా? పడిపోయిన మనిషిని నిలబెట్టడమే దేవుని పరిచర్య. ఎందుకంటే దేవుడు అందరిని అమితంగా ప్రేమిస్తున్నాడు. పాపమనే అగాథ స్థలములలో చిక్కుకుపోయిన మానవునికి తన కరుణ హస్తాన్ని అందించి వారిని ఉన్నత స్థలాలలో నిలబెట్టి తన ఔన్నత్యాన్ని ఋజువుపరచాలనే యేసుక్రీస్తు ఈ భువికేతించారు. నీవైపు తన చేతులు చాపి అన్ని విషయాల్లో నిన్ను నిలబెట్టాలని ఆశిస్తున్న దేవునికి నీ చేతిని విశ్వాసం తో అందిస్తే చాలు. ఉన్నతమైన అనుభవాలతో, ఆశయాలతో, ఆశీర్వాదాలతో నిన్ను నిలిపి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. ఆమేన్! – డా.జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
అవమానాల్లోనూ ఫలించిన కొమ్మ
‘మనుషుల్ని భూకంపాలు చంపవు, భూకంపానికి కూలే భవనాలు చంపుతాయి’ అంటారు శాస్త్రవేత్తలు. గొప్పగా నిర్మించుకున్న మన జీవితాలనే భవనాలు అనూహ్యపు తుఫానులు, భూప్రకంపనలకు తట్టుకోలేక పేకమేడల్లా కూలితే అదే పెనువిషాదం!! అనుకోకుండా ఎదురయ్యే ఆత్మీయ భూకంపాల్లోనే విశ్వాసి జీవితపు పునాదుల ‘పటిష్టత’, అతని దైవిక విలువల ‘నిబద్ధత’ నిగ్గుతేలుతుంది. యాకోబు కుమారుడైన యోసేపు జీవితం 17 ఏళ్ళ నవయవ్వన ప్రాయంలోనే భయంకరమైన ఆత్మీయ భూకంపానికి గురయ్యింది. యోసేపు చాలా భక్తిపరుడన్న అసూయతో సోదరులే అతన్ని నిర్దాక్షిణ్యంగా ఈజిప్ట్ వర్తకులకు బానిసగా అమ్మేశారు. ఈజిప్తులో తన యజమాని భార్య కుట్రతో జైలుపాలై యోసేపు ఇంకా కృంగిపోయాడు. ఇలా వరుస భూకంపాలకు అతని జీవితం నిజానికి సమసిపోవాలి. కాని అతని పునాదుల పటిష్టత, దేవుని పట్ల చెరగని అతని నిబద్ధత, ముఖ్యంగా ఎడబాయని ‘దైవకృప’ లక్షలాదిమందిని భయంకరమైన కరువు కోరలనుండి కాపాడే ఆశీర్వాద స్థాయికి అతన్ని చేర్చింది. సునామీలో కుప్పకూలవలసిన ఒక జీవితం, లక్షలాదిమంది అభాగ్యులను తెప్పరిల్ల చెయ్యడం, దేవుడే చేసిన ఒక మహాద్భుతం. ఈ లోకంలో దైవభయం లేక స్వార్ధంతో సమస్యలు కొనితెచ్చుకునేవాళ్ళుంటారు. దైవభయం వల్ల ఉన్నతవిలువలకు కట్టుబడి సమస్యల్లో పడేవాళ్ళుంటారు. మరికొంతమందైతే అతి తెలివితేటలతో గొప్ప ‘ప్లానింగ్’ చేయబోయి బోర్లా పడుతుంటారు. కాని అనూహ్యమైన ప్రతికూలతల్లోనే వారి వారి ‘పునాదుల’ పటిష్టత రుజువవుతుంది. దేవుని మాటలు విని బండ మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, దేవుని పక్కనబెట్టి ఇసుక మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు అనే రెండు తెగల విశ్వాసులుంటారని యేసుప్రభువే తన కొండమీది ప్రసంగంలో పేర్కొన్నాడు (మత్తయి 7:24–27). దేవుని హృదయపూర్తిగా నమ్మినవాడు తాత్కాలికంగా చితికినా దీర్ఘకాలంలో దీవెనలు పొందుతాడు. వేషధారులు, స్వార్థ్ధపరులు, డబ్బు మనుషులు బాగున్నట్టే కనిపిస్తూ అకస్మాత్తుగా, శాశ్వతంగా దెబ్బ తింటారు. దేవుని కోసం నిలబడి నలిగినవాళ్ళు మాత్రం, దేవుని సాధనాలుగా మారి మానవాళి కి ఆశీర్వాదకారకులవుతారంటోంది బైబిల్. యోబు, మోషే, పేతురు, గిద్యోను, పౌలు, రూతు ఇలా ఎంతోమంది జీవితాల్లో కృంగి, కూలిపోయిన అనుభవాల్లోనే ‘దేవుని కృప’ అద్భుతంగా పరిమళించి, వారికి ఆశీర్వాదాల ద్వారాలు తెరిచింది. చరిత్రలో పాప విశృంఖలత్వానికి, హేయమైన అనేక సంస్కృతులకు పుట్టినిల్లయిన ఈజిప్తు దేశంలోకి, నిష్ఠ కలిగిన యూదు వంశానికి చెందిన యోసేపు ఒక బానిసగా అడుగుపెట్టాడు. అయితే ఉగ్గుపాలతో తల్లిదండ్రులు నేర్పిన దైవిక పాఠాల ‘బైబిల్’ను గుండెల్లో భద్రంగా దాచుకొని యోసేపు తన వెంట తెచ్చుకున్నాడు. చుట్టూ బురదలోనూ తామరలాగా ఆ బలంతోనే అవిశ్వాసుల మధ్య విశ్వాసిగా రాజీపడకుండా బతికాడు. పెనువిషాదాల్లోనూ అదే అతన్ని కాపాడి గమ్యాన్నిచ్చింది. ‘దేవుని ప్రేమ మనల్ని విడువదు, ఎడబాయదు’ అని, ‘పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు’ అని బైబిల్ చెబుతోంది (ద్వితీ 31:8), (యెషయా 54:10). యోసేపు జీవితంలో ఈ వాగ్దానాలు అక్షరాలా నెరవేరాయి. కాని ఇలా అందరి జీవితాల్లోనూ ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే, ఈ వాగ్దానాలకు, ‘నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో అద్వితీయుడైన నీ దేవుని ప్రేమించాలి’ అన్న ఒక ముందస్తు షరతు ఉంది (మత్తయి 22:37–39). అంటే, బైబిల్ నమ్మే, చదివే వాళ్లందరికీ కాదు, దేవుని సంపూర్ణంగా, బేషరతుగా ప్రేమించేవారికి మాత్రమే దేవుని వాగ్దానాలు వర్తిస్తాయి. అందువల్ల, దేవుని వాగ్దానాలు నెరవేరనపుడు దేవుని ప్రేమించడంలో మనం ఎక్కడ వెనకపడ్డాము? అని ప్రశ్నించుకోవాలి. సగం లోకం లో, సగం దేవునిలో ఉంటే మనం సునామీకి సమీపంలో అన్నామని అర్థం. ఐగుప్తులో ఒక బానిసగా కాలు పెట్టింది మొదలు, యోసేపు చేసిన ఒకే ఒక పని, తాను విశ్వసించిన దేవుని సంపూర్ణంగా హత్తుకొని జీవించడమే!! అందుకే సునామీలు, భూకంపాల్లోనూ దేవుని కృప యోసేపును విడువలేదు, ఎడబాయలేదు. అతన్ని కష్టపెట్టిన అన్నలే కాదు, అన్నం లేని అనేక దేశాల లక్షలాది ప్రజలు యోసేపు ముందు తలవంచే స్థితిని దేవుడు కల్పించాడు. ‘నీటి ఊటలు, ఫలాలసమృద్ధితో గోడదాటి విస్తరించిన కొమ్మ యోసేపు’, అంటూ అతని తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన అలా అక్షరసత్యమైంది!! (ఆది 49:22). – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని ఔదార్యంతో నడిచే పరలోకరాజ్యం!!
విశ్వాసిలో స్వనీతి వల్ల అసంతృప్తి తలెత్తడం, పక్కవాడు లాభపడితే అసూయ చెలరేగటం చాలా అనర్థదాయకం. దేవుని ‘సమ న్యాయవ్యవస్థ’పై అవగాహన లోపించినపుడు ఇలా జరుగుతుంది. అందుకే దేవుని అనంతమైన ప్రేమను, అపారమైన సమన్యాయభావనను ఆవిష్కరించే ఒక చక్కని ఉపమానాన్ని యేసుప్రభువు వివరించాడు (మత్తయి 20:1–16). ఒక భూ యజమాని తన ద్రాక్షతోటలో పనికి తెల్లవారుజామునే కొందరు కూలీలను ఒక దేనారానికి (దాదాపు 220 రూపాయలు) కుదుర్చుకున్నాడు. ఆలస్యంగా 9, 12, 3 గంటలకు ముఖ్యంగా సాయంకాలం 5 గంటలకొచ్చిన కూలీల్ని కూడా ‘మీకేది న్యాయమో అదిస్తాను’ అని చెప్పి ఆయన తన తోటలో పనికి పంపాడు. పని చివర కూలీలందరికీ యజమాని సమానంగా ఒక దేనారాన్నిచ్చాడు. అయితే ఎక్కువ సేపు, ఎక్కువ పని చేసినందుకు తమకు ఎక్కువ దొరుకుతుందని ఆశించి, భంగపడిన మొదటి కూలీలు తనపై సణుగుతుంటే, ‘మీకిస్తానన్న కూలి మీకిచ్చానుకదా? అందరికీ సమానంగా ‘పూర్తికూలీ’ నేనివ్వాలనుకొంటే మీకెందుకు బాధ? ఇది నా డబ్బు, నా ఔదార్యం!!’ అన్నాడా యజమాని. అవును మరి, దేవుని ఔదార్యం ముందు ప్రపంచంలోని మానవ నిర్మిత న్యాయవ్యవస్థలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి. న్యాయవ్యవస్థలకు నేరస్థుని శిక్షించడమే తెలుసు. చాలా సమాజాలకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ మాత్రమే తెలుసు. కాని కరడుగట్టిన నేరస్థుని కూడా ప్రేమించి, క్షమించి, సంస్కరించి, తన ప్రేమతో నింపి, అతన్ని సమాజానికి ఆశీర్వాదంగా మార్చే దేవునిది ఉహలకందని ఔదార్యం అన్నది బైబిల్ బోధించే అపూర్వ సత్యం, అద్భుతమైన పాఠం. దేవుని ‘ఔదార్యమే’ పరలోకరాజ్యాన్ని నడిపే రాజ్యాంగం!! మనం దేవుని పని ఎంత కష్టపడి పనిచేస్తున్నామన్నది కాక, ఎంత ‘ఇష్టపడి’ ఆనందంగా పనిచేస్తున్నామన్నది పరలోకపు యజమాని, న్యాయమూర్తి అయిన దేవుడు చూస్తాడు, తన ఔదార్యంతో దానికి ప్రతిఫలాన్నిస్తాడు. రాగానే తమకు పని దొరికిందని ఉదయాన్నే వచ్చిన కూలీలు మొదట ఆనందించారు, కాని ఆలస్యంగా వచ్చి, తక్కువ పని చేస్తున్న కూలీలకన్నా తమకు ఎక్కువ దొరుకుతుందన్న దురాశ తో తమ ఆనందాన్నంతా ఆవిరిచేసుకొని అసంతృప్తితో ఇళ్లకెళ్లారు. కాని చివరలో, ఒక గంట కోసమే వచ్చిన కూలీలు, ఎంతో కొంత కూలీ దొరికినా చాలు, ఆ రోజుకు తమ కుటుంబానికి అన్నం పెట్టుకోవచ్చుననుకొంటుంటే, అనూహ్యంగా ఒక పూర్తి దేనారం దొరకడంతో, యజమాని ఔదార్యానికి ఉబ్బితబ్బిబ్బై పట్టరాని ఆనందం తో ఇళ్లకు వెళ్లారు. అలా, మొదటి కూలీల ఆనందాన్ని ‘దురాశ’ అసంతృప్తి గా మార్చగా. చివరి కూలీల ‘కృతజ్ఞత’ వాళ్ళ దుఃఖాన్ని, లేమిని కూడా అవధుల్లేని ఆనందంగా మార్చిందన్న ‘విశ్వాస నిత్యసత్యాన్ని’ యేసు బోధించాడు. మనకు చెందనిదాన్ని ఆశించడం దురాశేనని, విగ్రహారాధనలాగే దేవునికది హేయమైనదని బైబిల్ చెబుతోంది (కొల 3:5). ఆకాశమంత ఎత్తయిన, మహాసముద్రాలంత లోతైన దేవుని ఔదార్యాన్ని కొలవడం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి, మహామేధావులకు కూడా అసాధ్యమే. కాని దేవుని ప్రేమస్పర్శ తో పరివర్తన చెందిన ఒక పాపి, నిరక్షరాస్యుడైనా సరే, దేవుని ఔదార్యాన్ని అనర్గళం గా వివరించగలడు. దేవునిపట్ల కృతజ్ఞత విశ్వాసి ఆంతర్యంలో అనంతమైన ఆనందపు ఊటల్ని సృష్టిస్తుంది. కాని అసంతృప్తి విశ్వాసి జీవితాన్ని ఆర్పి బూడిదగా మార్చుతుంది. విశ్వాసుల జీవితాల్లో నిత్యశాంతి, కుటుంబశాంతి కరువైందంటే తప్పకుండా వాళ్లలోనే ఏదో లోపమున్నట్టే. కొళాయి విప్పి దాని కింద బిందెను తలకిందులుగా పెడితే అది నిండుతుందా? దేవుని రాజ్య మౌలిక విలువలు, దేవుని రాజ్యాంగ నిర్దేశనలు, దేవుని ఔదార్యానికి అనువుగా ఎప్పటికప్పుడు జీవితాలను ‘సరిచేసుకునే’ విశ్వాసుల్లో అందుకే ఆనందం, సంతృప్తి, జీవన సాఫల్యం సమృద్ధిగా పొర్లిపారుతుంది. ‘నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు’ అన్నాడు ప్రభువు (యోహాను 15:5). దేవుని తోటలో పని దొరికితే, కేవలం ‘అదనపు డబ్బుకు’ ప్రలోభపడి దేవునికి దూరమైన ఈ ఏశావు బాపతు వాళ్ళనేమనాలి? అయితే, తాము పూర్తి కూలి పొందే అర్హత లేనివాళ్లమని గ్రహించి ఎంతో తగ్గింపుతో, కృతజ్ఞత తో దేవుని హత్తుకున్న చివరి కూలీలతోనే దేవుడు తన రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించుకొంటున్నాడు. మనమంతా ఆ వర్గం విశ్వాసులలోనే ఉండాలన్నది దేవుని అనాది సంకల్పం. ఎందుకంటే దేవుని రాజ్యం, మన అర్హతలతో కాదు, దేవుని ఔదార్యంతో నిర్మించబడుతుంది, నడుస్తుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అరణ్యంలో మారు మోగిన సువార్త స్వరం
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల అవిధేయత, విచ్చలవిడితనం పరాకాష్టకు చేరుకున్న రోజులవి. ధర్మశాస్త్రబద్ధమైన యూదుమతం పూర్తిగా మృతమై, దేవునికి ప్రజలకు మధ్య వంతెనల్లాగా, రాయబారులుగా ఉండాల్సిన ప్రవక్తలు లేకుండా పోగా, ప్రజలు దేవుణ్ణి పూర్తిగా విస్మరించి, యథేచ్ఛగా జీవిస్తున్నారు. యెరూషలేము ఆలయంలో బలులు, ఆరాధనలు యధావిధిగానే జరుగుతున్నా, వాటిని నిర్వహించే యాజకవ్యవస్థ కూడా ఉన్నా, యూదా మతమంతా పూర్తిగా ఒక నామమాత్రపు తంతుగా మారిన అధ్వాన్నపు పరిస్థితులవి. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాలనుకున్న కాలం సంపూర్ణమైన రోజులు కూడా అవే. యెషయా ప్రవక్త యేసుప్రభువు ఆవిర్భావాన్నే కాదు, ఆయన రాకను, త్రోవను సరాళము చేసే యోహాను పరిచర్యను కూడా 700 ఏళ్ళ క్రితమే ప్రవచించాడు. యోహాను పరిచర్యను మత్తయి సువార్తికుడు కూడా ప్రస్తావిస్తూ, ‘ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన తోవలు సరాళము చెయ్యండి, అంటూ అరణ్యంలో కేక వేసే ఒకని స్వరం’ అన్న యెషయా ప్రవచనాన్ని పునరుద్ఘాటించాడు (యెషయా 40:1–5,9). యోహాను తల్లి ఎలీసబెతు, యేసు తల్లి మరియకు బంధువు. అతని తండ్రి జఖర్యా యాజక వంశానికి చెందినవాడు. తన పరిచర్య కోసం ప్రత్యేకించి ‘నాజీరు’ గా పెంచమని దేవుడే స్వయంగా అతని తండ్రి జకార్యాను ఆదేశించి, గొడ్రాలైన ఆయన భార్య ఎలీసబెతుకు యోహానును కుమారుడుగా అనుగ్రహించాడు. దేవుడు తన 400 ఏళ్ళ మౌనాన్ని అలా తానే బద్దలు కొట్టి యేసుక్రీస్తు పరిచర్యకు ఉపోద్ఘాతంగా, యేసు త్రోవల్ని సరాళము చేసే ఆంతరంగిక సేవకుడిగా యోహానును పంపించే వార్తను జఖర్యాకు ప్రకటించాడు. అందుకే స్త్రీలు కనిన వారిలో యోహానును మించిన వారు లేరని యేసుక్రీస్తే ఒకసారి ఆయన్ను శ్లాఘించాడు (లూకా 7:28). యోహాను తన పరిచర్య, ప్రసంగాలకు నిర్జన యూదాఅరణ్యాన్ని వేదికగా, ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాడు. అంటే, వేషధారణకు మారుపేరుగా మారిన పరిసయ్యులు, శాస్త్రులనే యూదుమతాధిపతులుండే యెరూషలేము పట్టణాన్ని వదిలేసి, వారికి దూరంగా యోహాను నిర్జనారణ్యంలోకి వెళ్తే, అతని ప్రసంగాలు విని, మారుమనస్సు పొంది. బాప్తిస్మము పొందేందుకు వందలాదిమంది పట్టణాలు వదిలి అతన్ని చేరేందుకు అడవిబాట పట్టారు. దేవుని అభిషేకం లేని పరిసయ్యుల ప్రసంగాలు యెరూషలేములో మారుమోగినా అవి విని ఎవరూ మారలేదు కానీ, యోహాను ప్రసంగాలు దైవస్వరంగా అరణ్యం లో ప్రతిధ్వనిస్తూ ఉంటే, అశేష ప్రజానీకం ఆయన కోసం అరణ్యానికి తరలి వెళ్లి అవి విని పరివర్తన చెందారు. అలా నిర్భయుడైన ప్రవక్తగా, దేవుడే పంపిన ప్రవక్తగా యోహానును ప్రజలు గుర్తించారు. తన సోదరుడైన ఫిలిప్పు భార్యతో అక్రమ కాపురం చేస్తున్న హేరోదు రాజు ‘అనైతిక జీవితాన్ని’ యోహాను చీల్చి చెండాడి, చెరసాల పాలయ్యాడు, చివరికి శిరచ్ఛేదనానికి కూడా గురయ్యాడు (మత్తయి 14:10). కానీ పరిచర్యలో యోహాను ఏ మాత్రం రాజీపడలేదు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలంటే, ముందుగా తాను కాలుష్యానికి దూరంగా ఉండాలన్నదే అరణ్యంలోకి వెళ్లడంలో యోహాను ఉద్దేశ్యం. అలా డబ్బు, పేరు, అధికారం, వేషధారణ, విలాసాలకు దూరంగా అరణ్యంలో అజ్ఞాతంగా బతుకుతూనే వేలాదిమంది జీవితాల్ని అక్కడికే ఆకర్షించి, వారిని మార్చి, రక్షకుడైన యేసుక్రీస్తు త్రోవల్ని నిబద్ధతతో సరాళం చేసి, యేసు చెప్పులను కూడా విప్పడానికి తాను యోగ్యుడను కానంటూ వినమ్రంగా ప్రకటించి, ఆ యేసుకే బాప్తీస్మాన్నిచ్చి, తద్వారా పరిచర్యలోకి ప్రభువును ఆహ్వానించిన అసాధారణ, విలక్షణ దైవజనుడు యోహాను. – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
మానవుడై అవతరించిన రోజు
అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. ప్రపంచంలోని క్రైస్తవులంతా మనస్ఫూర్తిగా సంతోషంతో జరుపుకునే సంబరం. వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. కరోనా విలయతాండవం సృష్టించిన ఈ సంవత్సరంలో జరుపుకుంటున్న క్రిస్మస్ మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అనుగ్రహిస్తుంది. క్రిస్మస్ మనకేం తెచ్చింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం కావచ్చు. యేసు జననం జగతికి ఏమిచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే నిస్సందేహంగా మనకు అపురూపమైన కానుకలను అందించింది. కానుకలు అందరూ నగదు రూపంలోనో, వస్తు రూపంలోనో ఇచ్చి పుచ్చుకుంటుంటారు. కానీ దేవాధిదేవుడు జగతిని, జనులను రక్షించుటకై పాపమెరుగని పరమపావన మూర్తియైన తానే బహుమతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేది క్రీస్తును గూర్చిన నిర్వచనం. వాక్కు అంటే పలుకు. వాక్కు అనేది శక్తిగల మాటల సముదాయం. పెల్లుబికే ఆ మాటల సముదాయం భావాన్ని మోసుకొస్తుంది. వాక్కు శాశ్వతం, అనంతం, జీవదాయకం, సృష్టి కారకం. వాక్కులో అపారమైన జ్ఞానముంది. అదే వెలుగు, అదే వికాసం, విజ్ఞానం మరియు సమస్తం. బ్రహ్మాండమైన ఆ వాక్కే శరీరంతో లోకానికి వచ్చాడు. ఆయనే లోకరక్షకుడు క్రీస్తు. ఒక దైవజనుడు ఇలా అంటాడు. ఓ మనిషీ! ఏమి భాగ్యం నీది? ఉన్నతుడైన దేవుడు నీ ఎముకలో ఎముకగా, మాంసంలో మాంసంగా, మానవుడుగా, నీలా జన్మించాడు. యేసుక్రీస్తు అంటే ప్రేమ మరియు శాంతి. ఆ ప్రేమే ప్రాణం పోసుకుని ఆ పరలోకం నుండి మన కోసం ఇలకు దిగివచ్చింది. మనిషిగా జన్మించి మానవతకు క్రొత్త మార్గాన్ని చూపింది. అవధులు లేని ప్రేమగా, అంతములేని కరుణగా, అపురూపమైన వాత్సల్యముగా రూపుదాల్చి మనకోసం మన విమోచన కోసం పాప బంధకములనుండి విడిపించుట కోసం శ్రమలననుభవించింది. అమ్మలాలనను, తండ్రి బాధ్యతను, స్నేహితుని తోడును మనకు అందించింది. నిజమైన నిస్వార్థమైన ప్రేమను మనకు రూచి చూపించింది. ఈ లోకంలోని అగమ్య గోచరమైన బ్రతుకులకు కాంతిని పంచే వెలుగే క్రిస్మస్. బాధలలో వేదనతో నలిగిపోయిన జీవితాలకు, కష్టాలతో కన్నీళ్ళతో కృంగిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చేదే క్రిస్మస్. ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి విడిపించి శాంతి నిచ్చేదే క్రిస్మస్. సమస్త మానవాళికీ శ్రావ్యమైన గళంతో శాంతి సందేశాన్నిచ్చేదే క్రిస్మస్. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి కంటికి వెలుగును, కాళ్ళకు మంచి మార్గాన్ని, నోటికి మంచి మాటను, హృదయానికి శాంతిని, మనిషికి మానవత్వాన్ని జగతికి రక్షణను తెచ్చింది క్రిస్మస్. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరంగాల నుండి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలోకి ఒంపుకోవాలన్నా ఘనుడైన క్రీస్తును ఆరాధించాలి. యోగ్యుడైన వానికి, అర్హత గలిగిన వ్యక్తికి ఆరాధనను అర్పించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ మన క్రీస్తే. యేసు జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదట ఝెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుండి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలకు కాసేపు ప్రక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్టు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. మనిషికి అంతకన్నా ఇంకేం కావాలి. విశాల విశ్వంలో అంతకన్నా మధురానుభూతి ఇంకేముంటుంది. రక్షకునికివ్వాలనుకున్న బహుమానాలను వారి పెట్టెలు తెరిచి ఆయన ముందు పరిచారు. ఒకాయన శుద్ధ సువర్ణాన్ని ఇచ్చాడు. మరొకడు అద్భుత సువాసన వెదజల్లే సాంబ్రాణిని, మరొక జ్ఞాని బోళమును ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. క్రీస్తు పాదాల దగ్గర పెట్టబడిన ఆ కానుకలు క్రీస్తులోని మూడు ప్రాముఖ్య లక్షణాలను తెలుపుతున్నాయి. బంగారం పరిశుద్ధతకు, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థపరిచే గుణానికి సాదృశ్యం. మనిషి దేవుని ఆరాధించుటకు ప్రధాన కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. సమస్తమును నిర్వహించే దేవుడే అపవిత్రుడైతే పరిశుద్ధంగా బ్రతకడానికి మనిషికి ఆధారం ఎక్కడుంటుంది? మనిషి పూజలందుకొనే దేవుడు కచ్చితంగా పవిత్రుడే. నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా స్ధాపించగలరా అని క్రీస్తు ప్రశ్నించాడు. జ్ఞానులు తెచ్చిన రెండవ కానుక సాంబ్రాణి. సువాసనను వెదజల్లుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సువాసనభరితం చేయగల సాంబ్రాణి క్రీస్తు ఆరాధనీయుడని తెలుపుతుంది. బోళములో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్రీస్తు మనలను స్వస్థపరచువాడు అనే సందేశాన్ని మూడవ కానుక తెలుపుతుంది. ప్రతియేటా క్రిస్మస్ను క్రైస్తవులంతా ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా పండుగగా జరుపుకొంటునప్పటికీ క్రీస్తు ప్రేమతత్త్వంలో తేలియాడే నిజక్రైస్తవునికి ప్రతిరోజూ పండుగే. ప్రతిరోజూ క్రిస్మస్సే. తేజస్సులో అమరుడైనప్పటికీ మనుజాళిని ప్రేమించి ప్రతి ఒక్కరికీ దగ్గరగా వచ్చిన క్రీస్తును ఆరాధించడానికి ఏ ఒక్కరోజు చాలదు. ఆదిమ«ధ్యాంత రహితుడైన ఆ దివ్యమూర్తిని ఆరాధించడానికి జీవితకాలం సరిపోదు. దేవుడు చేసిన సృష్టి వైభవాన్ని తెలుసుకొనే ప్రక్రియలో ఎన్నో పరిశోధనలు కొన్ని శతాబ్దాల క్రిందటే ప్రారంభించబడ్డాయి. అయితే 1969లో ఓ అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. ‘నాసా’కు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఎంతో శ్రమించి ఎట్టకేలకు ‘అపోలో–11’ అనే రాకెట్ మీద ప్రయాణం చేసి చంద్రుని మీద కాలుమోపారు. మానవుడు సాధించిన ఓ గొప్ప కార్యంగా అది అభివర్ణించబడింది. అప్పటినుండి ఇప్పటి వరకు మరికొంతమంది చంద్రగ్రహంపై కాలుమోపి తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వారిలో జేమ్స్ ఇర్విన్ ఒకరు. చంద్రునిపై కాలు మోపిన తరువాత తనకు లభించిన విశిష్టమైన గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రపంచం నివ్వెరపోయే విషయాన్ని ఇర్విన్ తెలియచేశాడు. ‘‘అశాశ్వతుడైన మానవుడు చంద్రుని మీద కాలుమోపడం కన్నా శాశ్వతుడైన దేవుడు మనిషిని ప్రేమించి ఈ భూమ్మీద కాలుమోపడం గొప్ప’’. అపుడు సృష్టికర్తయైన దేవుడు సృష్టిగా మారడం అన్ని అద్భుతాల కన్నా ఎంతో గొప్పది. పరమాత్ముడైన ప్రభువును ఆరాధించడానికి బలులు, అర్పణలు అవసరం లేదు. మంచి సమయాల కోసం వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనస్సు తెరిచి ఆయన నామాన్ని స్మరించుకొంటూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చాలు. జీవితం ధన్యమౌతుంది. ఒకసారి ఆధ్యాత్మిక చింతనతో నిండిన ఒక్క వ్యక్తి దేవుణ్ణి ‘నీవు ఎక్కడుంటావు’ అని అడిగాడట. దానికి దేవుడిచ్చిన జవాబు ‘నేను కట్టుకున్న ఆలయంలో ఉంటాను’. అదెక్కడుంది? ‘నీ హృదయమే నేను కట్టిన ఆలయం’. అపుడు దేవుడు మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. ఆయనకు హృదయంలో చోటివ్వడమే మానవ జీవిత పరమార్థం. నిండైన నీ హృదయంతో, మెండైన విశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే చాలు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా మనుష్యులకు గుండెలనిండా ధైర్యాన్నిచ్చింది. కరోనా రక్కసి సమయంలో ప్రతి ఒక్కరమూ వ్యాక్సిన్ గూర్చిన శుభవార్త కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాం. ఒక ప్రమాదం నుండి బయటపడడం ఎలా అనే వార్త మనిషికి ధైర్యానిస్తుంది. భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దూత భయంతో వణికిపోతున్న గొర్రెల కాపరులకు తెలిపింది. వారు కేవలం భౌతిక సంబంధమైన చీకటిలో మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ చీకటిలో ఉన్నారు. వారికి శుభవార్త అందింది. దేవుడు ఎప్పుడూ మనిషికి మేలు చేయువాడు. ఆయన స్వాభావికంగా మంచివాడు. మనుషులు మంచివారుగా నటిస్తారు. దేవునికి ఆ అవసరం ఉండదు. ఆయన ప్రతి ఒక్కరికీ మంచి చెయ్యాలనే ఆశిస్తున్నాడు. క్రీస్తు అంటే ధైర్యం. ఆయన ఆపదలో అండగా నిలిచే కొండ. అన్ని వేళల్లో ఆదుకునే రక్షణ దుర్గం. చెక్కుచెదరని ధీరత్వం. క్రీస్తు నీతో వుంటే నిశ్చింత, క్రీస్తు నీతో వుంటే దిగ్విజయం. క్రిస్మస్ జగతిలో జనులకందరికీ ధైర్యాన్నిచ్చింది. ఏ ఆటంకాన్నైనా.. అడ్డంకులనైనా అధిగమించే శక్తి నిచ్చింది. అడ్డుగోడలను పగలగొట్టే గుండెబలాన్నిచ్చింది. ముఖ్యంగా ఈ లోకంలో శత్రువు పన్నే కుయుక్తులను, కుతంత్రాలను ఛేదించే దుర్భేద్యమైన కోట గోడలను మన చుట్టూ నిర్మించింది. ఏ దుష్టశక్తులూ మనలను చుట్టుముట్టి అధైర్యపెట్టకుండా రక్షణ వలయాన్ని కవచాన్ని మనకు ఏర్పరిచింది. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. నీ ఎడమపక్కన వేయిమంది పడినను నీ కుడిపక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అశేష ప్రజావాహినికి ఊతమందించే అద్భుత వాగ్దానమది. క్రీస్తు, క్రిస్మస్ గుండెకు కలిగించే ధైర్యం ఇంత గొప్పగానూ. శ్రేష్ఠముగానూ వుంటుంది అనేది నిర్వివాదంశము. క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే ప్రతి ప్రతికూల పరిస్థితినీ జయించగలిగే శక్తిని, గుండెధైర్యాన్ని, బలాన్ని మనలో నింపుతాడు. నమ్ముట నీ వశమైతే సమస్తమునూ సాధ్యమే అని సెలవిచ్చిన ఆ దేవాధిదేవుడు స్వయంగా తానే గుండెచెదరిన వారిని బాగు చేయుటకు, దీనులను విడిపించుటకు, ఈ లోకానికి దిగివచ్చాడు, ధైర్యాన్ని మనకు ఇచ్చాడు. కొంతమంది జీవితాలను పరిశీలిస్తే వారు చేయగలిగినవాటిని సైతం చేయలేకపోవడానికున్న కారణాలలో భయం ఒకటి. స్వేఛ్చా స్వాతంత్యాల్రతో జీవించాల్సిన మానవుడు భయం గుప్పిట్లో బతుకుతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ల్యారీ కింగ్ను ఒకామె ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పటికే ఆయన అనేకమందిని తన వాగ్ధాటితో ఆకర్షించుకున్నాడు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశాడు. తాను అడగాలనుకున్న ఏ ప్రశ్ననైనా ధైర్యంతో అడిగేవాడు. సాహసోపేతమైన తన వృత్తిలో పాతిక సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక ప్రశ్న తన ముంగిట నిలువబడింది. ‘నీవు దేనికైనా భయపడతావా?’– ‘అవును. భయపడతాను!’– ‘దేనికి? మరణానికి!! నేను చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ప్రతి రాత్రి ఇదే భయంతో గడుపుతాను’ అని అతడిచ్చిన జవాబుకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటారు. వెంటాడుతున్న గతానికి, ఎదుర్కొనబోయే భవిష్యత్తును గూర్చి, వర్తమానంలో జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, జీవితంలో చెలరేగే తుఫానులను బట్టి భయపడుచున్న మనిషికి చెక్కుచెదరని ధైర్యానివ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ధైర్యంగా ఉంటే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండగలడనేది బైబిల్ సుబోధ. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. ఇది అక్షరాలా నిజం! జనులందరికీ అవగతమయిన సత్యం! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. ప్రస్తుతకాలంలో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమవుతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం వెదకుచున్నారు. నేటి కాలంలో ప్రాముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు, వింతైన పోకడలకు బానిసలవుతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే.. ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువవుతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవి కూడా కోల్పోతూ ఆఖరకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెలబ్రెటీలు అని గుర్తింపు పొందినవారు కూడా ఈ విషయంలో అతీతులేమీకాదు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే ఒక సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ తమ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరిచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నాడు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు. కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, ఆ పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలయందునూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసేయడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తతను పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుండి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజుల్లో విజయవాడలో అక్కడే ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాల నుండి దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్గారు. ప్రపంచ కుబేరుడైన రాక్ఫెల్లర్ ఒక సందర్భంలో ఇలా అంటాడు. ‘నేను కోట్లు కూడబెట్టాను. అవి నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు’. ప్రపంచ వ్యాపారవేత్తలో అగ్రగణ్యుడుగా, జీవితంలో ఇతనికంటూ లోటు ఏమీ లేదనిపించుకున్న ఓ కుబేరుడు ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యమైనప్పటికీ, అది వాస్తవం. ‘నువ్వు వర్షంలో ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే ‘ప్రపంచం నా నవ్వునే చూడాలి గాని నేను కూడా అందరి వలే ఏడుస్తున్నాని తెలియకూడదు’ అని జవాబిచ్చిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్ గూర్చి తెలియనివారెవరు. ‘నా కళ్ళలోనుండి కారే కన్నీళ్ళు నేను చేసే కామెడీని నిర్వీర్యం చేస్తాయ’ని చెప్పి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. నిజమైన ఆనందం బయటనుండి రాదు. భౌతిక వనరులు ఆనందాన్ని మోసుకురాలేవు. అది స్వచ్ఛమైన హృదయంలో నుండే రావాలి. అటువంటి ఆనందం అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. క్రిస్మస్ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చింది. జీవితానికి అర్థాన్ని, పరమారాధనను అన్వేషించాల్సిన బాధ్యత మనకు వుంది. ఏదో పుట్టాము. కాలాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేసి చనిపోదాం అనుకోవడం కాదు, జీవితమంటే. జీవితానికి వున్న అర్థాన్ని మొదట మనం కనుగోనాలి. పరమార్థాన్ని గ్రహించాలి. జీవితం ఎంత విలువైనదో దాని ఆవశ్యకత ఎమిటో తెలుసుకొని మెలగాలి. నువ్వెందుకు బతుకుతున్నావు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఉండాలి. ఒక తత్త్వవేత్త తనకు తెలిసిన వ్యక్తులందరికీ ఒక ప్రశ్నతో కూడిన ఉత్తరం వ్రాశాడు. తన స్నేహితులలో చాలామంది ఆస్తిపరులు, మరికొందరు విస్తారమైన జ్ఞానాన్ని ఆర్జించినవారు, మరికొందరు సమాజంలో అధికారాన్ని, పలుకుబడిని కలిగియున్నవారు. ఉత్తరాలను అందుకొన్నవారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చారు. వారిలో ఎక్కువ శాతం మంది ‘మేం ఎందుకు ఈ భూమ్మీద బతుకుచున్నామో మాకు ఇంకా అర్థం కాలేదు’ అని, ‘దాని గురించిన ఆలోచన చేయాల్సిన తీరిక మాకు లేదు’ అని, ‘నీకు తెలిస్తే మాకు కూడా చెప్పొచ్చుగా’ అని రకరకాలుగా జవాబులు పంపించారు. విచారించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలామందికి తామెందుకు బతుకుతున్నాం అనే ప్రశ్నకు జవాబు తెలియకుండా బతికేస్తున్నారు. మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? మానవ జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే మనిషిని కలుగచేసిన దేవుని దగ్గరకు రావాలి. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి మాత్రమే దానిని తయారు చేయడంలో అతని ఉద్దేశాన్ని కచ్చితంగా చెప్పగలడు. ఈ విశ్వంలో మానవ జన్మ చాలా ప్రత్యేకమైనది. సృష్టికర్త మనలను సృజించినపుడు ఆయన స్వరూపములో మనలను సృజించాడు అని బైబిల్ తెలియచేస్తుంది. ఆయన రూపంలో ఉన్న మనం ఆయన లోకానికి వారధులం. దేవుని సంకల్పాలను నెరవేర్చుటకై నియమించబడిన దేవుని ప్రతినిధులం. యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి ఏతెంచి ఓ అద్భుతమైన జీవితాన్ని జీవించి ప్రతి ఒక్కరికీ అన్ని విషయాలలో మాదిరి ఉంచారు. పశువులతొట్టెలో పవళించి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నానన్న సందేశాన్ని లోకానికి ఇచ్చారు. జగతిలో నిండివున్న అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చారు. దారీ తెన్నూ కనబడక దిశనిర్దేశం లేని జనులకు మార్గమయ్యారు. ఆయనే మార్గముగా, సత్యముగా, జీవముగా జగతిలో అవతరించారు. అగమ్యగోచరమైన బతుకులలో నడి సంద్రాన చిక్కి అల్లాడుతున్న జీవితాలలో నావను నడిపే నావికుడిగా భువిలో జన్మించారు. మనందరి జీవితాలకు ఒక గొప్ప పరమార్థాన్ని కలిగించారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’ అనే జీవన సత్యాన్ని కేవలం బోధించుట మాత్రమే కాకుండా, క్రియల్లో ఋజువుచేసి ప్రపంచాన్ని ప్రేమమయం చేశాడు యేసుక్రీస్తు. ఓ పరమార్థంతో బతికేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందడు. క్రిస్మస్ రక్షణ మార్గాన్ని ప్రబోధించింది. ఏ భేదమూ లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించుచున్న మహిమను పొందలేకపోవుచున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఒక నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఎలా రక్షణ కావాలో, కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ ఎంత అవసరమో, ఒక గనిలో చిక్కుకుపోయి మరణానికి చేరువవుతున్న వారికి రక్షణ ఎంత అవసరమో పాపంలో జీవిస్తూ శాశ్వత మరణానికి చేరువవుతున్న మనిషికి ఆత్మరక్షణ అంతకన్నా ఎక్కువ అవసరం. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్ధం. ఆయన ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించడానికి వచ్చి తన రక్తమును సిలువలో చిందించి విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహిస్తున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు (లూకా 2:11). మానవాళిని రక్షించి, తన దివ్యకాంతులతో ప్రతిఒక్కరినీ నింపి నిత్యజీవనానికి వారసులుగా చేయాలన్నదే దేవుని ఆకాంక్ష. రక్షకుని ఆగమనంతో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మానవుని ఎదురుచూపులు ఫలించాయి. ఒక పిల్లవాడు తండ్రి ఫోటో చూస్తూ, మనసు నిండా గొప్ప ఆశతో ‘మా నాన్న ఆ ఫోటోలోనుండి బయటకు వస్తే బాగుండును’ అని అనుకున్నాడు. సరిగ్గా ఇలాగే మానవులంతా ఆశించారు. ఆశిస్తున్నారు కూడా. కుల మత భాషా వర్గ విభేదాల్లేకుండా మనుష్యులంతా దేవుణ్ణి మరింత సన్నిహితం చేసుకోవాలని తపించారు. ఆయన ఎలా ఉంటాడో చూసి, ఆయనతో ముచ్చటించాలని ఆశపడ్డారు. సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం దేవుడే మనిషిగా దిగివచ్చాడు. నింగి నేల ఏకమయ్యాయి. ఈ భూమికి నడిబొడ్డున ఉన్న బేత్లేహేము అనే కుగ్రామంలో రక్షకుడు వెలిశాడు. దేవుడు మానవ శరీరం ధరించుకొని వచ్చాడు. వాస్తవ రూపం దాల్చి మనిషికి గోచరుడయ్యాడు. ఎక్కడో రాజభవనంలో పుట్టియుంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు కాడు గనుకనే పశువుల తొట్టెలో జన్మించాడు. అతి సామాన్యులైన గొర్రెల కాపరులు మొదట వెళ్ళి రక్షకుని చూశారు. భక్తి పారవశ్యంతో నింపబడి గుండెల నిండా నిరీక్షణతో ముందుకు సాగిపోయారు. క్రీస్తు్త ప్రబోధించిన రక్షణ మార్గం ఈ లోకానికీ ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి మరలించే రక్షణ మార్గమిది నీకు నీవుగా జీవించే జీవితంలో నీ కోసం నువ్వు వెదికే రక్షణను క్రిస్మస్ నీకు అందించింది. శాపాలనుండి పాపాలనుండి విడుదలను పొందే రక్షణ మార్గన్ని క్రిస్మస్ ప్రబోధించింది. చీకటి దారుల్లోకి మరలి భ్రష్టత్వంచెందే మనుష్యులను నిజమైన రక్షణ మార్గంలోనికి తరలి రమ్మని క్రిస్మస్ ప్రబోధించింది. క్రీస్తుతో సహవాసం కలిగి వుండటం, ఆయనకు హృదయాన్ని అర్పించడం ఆ అద్వితీయుని ఆరాధించడం, అయన మార్గంలో నడవడం, ఆయన బోధలను ప్రచురం చేయడం, ఆయన కోసం జీవించడమే మనం చేయవలసిన పని. ఈ సంవత్సరం కరోనా వైరస్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. ఎటుచూసినా ఏం జరుగబోతుందన్న భయంతో మనుష్యులు గతించిన కొన్ని నెలల నుండి బతుకును వెళ్ళదీస్తున్నారు. మనిషి ప్రాణం కన్నా గొప్పది ఏదీ లేదని ఋజువైంది. మన ఉద్యోగాలు, ప్రయాణాలు, విహారాలు, వ్యాపారాలు ఏవీ మన బతుకుల కన్నా గొప్పవి కావని తేలిపోయింది. కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి నిశ్చేష్టుడుగా నిలువబడడం తప్ప మరేమీ చేయలేడనే సత్యం బహిర్గతమయ్యింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. తమ వారిని కోల్పోయి విలపిస్తున్న వారు అనేకులున్నారు. జీవితం చాలా భారంగా మారినందువలన ప్రతిరోజూ దుఃఖంతో బతకాల్సిన పరిస్థితిలో చాలామంది జీవిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ధైర్యమును ప్రసాదించాలని, దేవుని వెలుగు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశించుట ద్వారా వెలుగులో ప్రజలంతా నడవాలని కోరుకుంటూ, సమసమాజ నిర్మాణంలో మనమంతా పాలిభాగస్తులమై సాగిపోవాలని ఆశిస్తున్నాను. సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
అందాల తారల క్రిస్మస్ గీతాలు
డిసెంబర్ మాసం కోసం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు. రంజాన్ మాసంలాగే నెలరోజుల నుంచే వేడుకల కోసం సిద్ధపడుతుంటారు. చర్చీలన్నీ ప్రత్యేక ప్రార్థన గీతాలతో మార్మోగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా యువతీ యువకులు సంగీత వాయిద్యాలతో ‘క్రిస్మస్ క్యారల్స్’ పేరుతో ఇంటింటికీ తిరిగి పాటలు పాడుతారు. ‘హ్యాపీ క్రిస్మస్! మెరీ క్రిస్మస్!’ అంటూ జింగిల్ బెల్స్లా ప్రతిధ్వనిస్తుంటారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెబుతారు. వాతావరణమంతా క్రిస్మస్ గుబాళింపులతో చలికాలపు రాత్రులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ధనిక దేశాలు ఉత్సవాలను ఎంత ఆడంబరంగా జరుపుకున్నా, భారతదేశంలోని దళితవాడలు కూడా ఉన్నంతలో ఘనంగానే పండుగ జరుపుకుంటాయి. తమ తమ పేటల ముందు పోటీలు పడుతూ పెద్ద పెద్ద నక్షత్రాలు అలంకరిస్తారు. వాటి ప్రభలు నలువైపులా ధగధగలాడుతూ ఉంటాయి. ఈ సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కన్నుల పండుగలా కనిపిస్తుంది. క్రిస్మస్ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది పాటలు. విశ్వమంతా క్రిస్మస్ జరుపుకునే రోజుల్లో వారి వారి భాషల్లో హుషారుగా పాటలు పాడుకుంటారు. పారవశ్యానికి లోనవుతారు. తెలుగులో కూడా గొప్ప క్రిస్మస్ సాహిత్యం ఉంది. ఏ మతానికైనా సాహిత్యమే ప్రాణాధారం. అవి భజనలు అయినా, స్తుతి గీతాలైనా భక్తుల్ని, శ్రోతల్ని ఆకట్టుకుంటాయి. క్రైస్తవమతం తెలుగు ప్రాంతాల్లో పాదం మోపాక ఇక్కడి భాష సంస్కృతులతో, సంగీతాలతో మేళవించిన ‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ ఆవిర్భవించాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణా ఏర్పడ్డాక ‘ఆంధ్ర’ శబ్దానికి బదులు, ‘తెలుగు క్రై స్తవ కీర్తనలు’ అని పేరు మార్చుకున్నారు. అయితే తొలినాటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథాన్ని 1866లో ప్రథమ విదేశీ తెలుగు వాగ్గేయకారుడు విలియం డాసన్ ప్రచురించాడు. అతడు అచ్చం పదహారణాల తెలుగువాడిలా వేషంకట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చిడతలు వాయిస్తూ భక్తి పారవశ్యంలో శ్రీకాకుళం వీధుల్లో తన స్వీయ సంకీర్తనలు పాడేవాడు. మచ్చుకి ఒక పాట వినండి. అతడి భాషా పటిమ మనల్ని అబ్బురపరుస్తుంది. విలియం డాసన్.78వ కీర్తన. పల్లవి: యేసు భజనయే మనలను ఆ సుగతికి దీయు – జనులారా దాస జనులు జేయు, పలు దోసములు మోయు చరణం: అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్షమను దీక్షన్ రెవరెండ్ విలియం డాసన్ విదేశీయుడైనప్పటికీ ఇతడి శబ్దాలంకార ప్రావీణ్యం ఆశ్చర్యపరుస్తుంది. నమ్మశక్యం కాని నిజమేమిటంటే ఇతడే తొలి తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. ఈయన తర్వాతే పురుషోత్తము చౌధరి డాసన్ దొరతో కలిసి ఎన్నో కీర్తనలు రాయడం గమనించాల్సిన అంశం. ఇద్దరూ సమకాలీనులే. అయితే, ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. ‘చౌధరి’ కులవాచకం కాదు. ‘చౌ’ అంటే æనాలుగు. ‘ధరి’ అంటే భూమి. నాలుగు పరగణాల నేలకు అధిపతిని ఉత్తరభారతంలో ‘చౌధరి’ అని పిలుస్తారు. ఉదా: బాబూ ఖాన్ చౌధరి, సలీల్ చౌధరి. అయితే పురుషోత్తముడు బెంగాలీ బ్రాహ్మడు. తెలుగువాడు కాదు. ఒడిశాకు వలస వచ్చినవాడు. బహుభాషా కోవిదుడు. క్రీస్తు భక్తుడు. ఆ తరువాత కాలంలో 1893లో విలియం డాసన్తో కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం తేవడంలో కీలక పాత్ర నిర్వహించాడు. ∙∙ ఇప్పటి ఆధునిక సంగీతపు హోరులో పాటల భావం సరిగా వినిపించడంలేదు. పాత కాలంలోనైతే క్రీస్తు జయంతి సందర్భంగా ఏ చర్చిలో విన్నా తెలుగు కీర్తనలు వినబడుతూ ఉండేవి. (109) ఎన్. డీ. ఏబెల్ గారు రచించిన ఈ కీర్తన ఎంతో ప్రసిద్ధమైనది. ‘చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వజనాంగామా సంతస మొందుమా’ బిలహరి రాగంలో త్రిపుట తాళంలో శాస్త్రీయంగా పాడుకునే ఈ కీర్తన ఈనాటికీ చెక్కు చెదరలేదు. చెవులకు ఇంపు కలిగించడం మానలేదు. అలాంటిదే మరోగీతం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల లోనిదే, వరుస సంఖ్య 112. ‘రక్షకుండుదయించి నాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారె గొల్ల బోయలార తక్షణమే బోయిమనని రీక్షణ ఫల మొందుదము చ: దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహావా మన దిక్కుచేరి చూచినాడు’ మధ్యమావతి రాగంలోఅట తాళంలో పుట్టిన ఈ ప్రఖ్యాత క్రిస్మస్ కీర్తనకారుడు పందొమ్మిదో శతాబ్దపు మోచర్ల రాఘవయ్య. మరో ప్రసిద్ధ క్రీస్తు జనన విశేష గీతాన్ని (121) కొమ్ము కృప రాసింది. ‘శ్రీ యేసుండు జన్మించె రేయిలో– నేడు పాయక బెత్లేహేము యూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున– నిమ్మాను యేలనెడి నామమందున.’ ఈ విఖ్యాత గీతం కర్ణాటక ముఖారి రాగంలోనూ అట తాళంలోనూ లయాన్వితంగా ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఇద్దరు ముగ్గురు స్త్రీ కీర్తనకారులుండడం గమనించవలసిన అంశం. ఒకరు పైగీతం రాసిన కొమ్ము కృప. మరొకరు వేశపోగు గుల్బానమ్మ (గుల్+బానో+అమ్మ). పరిశోధన దృష్టితో పరిశీలిస్తే మొట్టమొదటి క్రైౖస్తవకీర్తన రాసిన తొలి తెలుగు క్రైౖస్తవకీర్తనకారిణి వేశపోగు గుల్బానమ్మగా గుర్తించాలి. ఇక మూడవ గీత రచయిత్రి పిల్లి విజయ చార్లెస్. ఈమె పేరు ఈ మధ్యనే పరిష్కరణ ప్రతిలో చేర్చారు. ∙∙ క్రైౖస్తవమతం లేదా మార్గం తెలుగు ప్రాంతాల్లో ప్రవేశించిన తరువాత 1746లో బెంజిమన్ షుల్జ్ ‘నూరు జ్ఞాన వచనాలు’ అనే తొలి తెలుగు క్రైౖ స్తవ పుస్తకం ప్రచురించాడు. ఇదే తెలుగులో అచ్చయిన మొదటి గ్రంథం. చాలాకాలం అజ్ఞాతంగా ఉండిపోయింది. కొన్ని శతాబ్దాల తరువాత వాసిరెడ్డి పద్మ, సన్నిధానం నరసింహ శర్మ (సేకరణకర్త), ఎండ్లూరి సుధాకర్ సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది. 2006లో ఈ గ్రంథాన్ని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు రాజమండ్రి సమీపంలో ఉండే మధురపూడి విమానాశ్రయంలో ఆవిష్కరించారు. సాహిత్య చరిత్రలో అదొక మరపురాని సంఘటన.ఈ గ్రంథాన్ని కె.ఎన్. వెస్లీ ప్రచురించడం విశేషం. జర్మన్ సౌవార్తికుడు (మిషనరీ) బెంజిమన్ షుల్జ్, ఇద్దరు తెలుగు స్వర్ణకారుల చేత అచ్చులు పోయించి ‘నూరుజ్ఞాన వచనాలు’ జర్మనీ దేశంలో ప్రచురించాడు. అప్పటికింకా ప్రెస్ రాలేదు, ‘వావిళ్ళ’వారు కూడా పుట్టనేలేదు. ఈక్రమంలో విలియం కేరీ అనే మరో సౌవార్తికుడు1818లో మొట్టమొదటిసారి ‘పరిశుద్ధ గ్రంథం’ పేరుతో తెలుగు బైబిల్ తీసుకువచ్చాడు. ఆ తరువాత చాలా బైబిళ్ళు తర్జుమా చేయబడ్డాయి. ఈనాటికీ ఎంత పేద క్రైస్తవుల ఇంట్లోనైనా ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనల పుస్తకం, తెలుగు బైబిల్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవే తమ ఆస్తులుగా ఆ విశ్వాసులు భావిస్తూ ఉంటారు. ∙∙ ఎందరో గీతరచయితలు అజారమరమైన కీర్తనలు రచించి ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనలకు తెలుగు శోభను సంతరించారు. కథోలిక (కాథలిక్) గీతాలు కూడా విశేష ప్రాముఖ్యాన్ని పొందాయి. క్రిస్మస్ గీతాల వస్తురూపాలన్నీ క్రీస్తు జన్మదిన విశేషాల మీదే ఆధారపడి ఉంటాయి. అట్లా అని ఇతర ప్రక్రియలు లేవా అంటే చాలానే ఉన్నాయి. తెలుగు క్రైౖ స్తవ సాహిత్యానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రబంధాలు, కావ్యాలు, నాటక నాటికలు, గేయ మాలికలు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం గుర్రం జాషువ 1921లో ‘చిదానంద ప్రభాతము’ అనే క్రిస్మస్ నాటకం సంప్రదాయ పద్ధతిలో రాశాడు.’క్రీస్తు చరిత్ర’ (1964) అనే కావ్యం కూడా వెలువరించాడు. ఈ కావ్యానికి 1965లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అటు నాటకానికి, ఇటు కావ్యానికి దళిత క్రై స్తవుడిగా జాషువాయే ‘ఆదికవి’ అనడంలో అనౌచిత్యం లేదు. మళ్లీ క్రిస్మస్ గీతాల దగ్గరికి వస్తే తొలినాటి పాటలన్నీ జర్మన్లోంచో, ఆంగ్లంలోంచో అనువాదం చేసుకున్నవే. వీటి స్వరగతులు కూడా యథాతథంగా ఉంటాయి. అందరికీ తెలిసిన ఈ ఉభయ భాషల గీతం పరిశీలించండి. "Silent night, ho-ly night All is calm, all is bright Round you virgin mother and child Holy infant so tender and mild Sleep in heavenly peace" ‘శుద్ధ రాత్రి! సద్దణంగ నందరు నిద్రపోవ శుద్ధ దంపతులే మేల్కొనంగా బరిశుద్ధుడౌ బాలకుడా! దివ్య నిద్ర పోమ్మా! దివ్య నిద్ర పోమ్మా!! ఈ ప్రపంచ ప్రసిద్ధి పొందిన గీతాన్ని అన్ని ఖండాల ప్రజలు తమ తమ భాషల్లో భావ గాంభీర్యంతో, ఏక కంఠంతో పియానో శ్రుతులతో అత్యంత ప్రేమగా పాడుకుంటారు. క్రిస్మస్ రోజుల్లో ఏ క్రైౖస్తవ గృహాన్ని సందర్శించినా సందడే సందడి. అతిథులతో ఆత్మీయులతో, రకరకాల కేకు రుచులతో పిల్లలూ పెద్దలు క్రిస్మస్ తాతలతో కేరింతలు కొడుతూ ఉంటారు. బాలక్రీస్తు గీతాలకు తన్మయులవుతారు. ఆకాశం రంగులీనుతూ ధగధగా మెరిసిపోతున్నపుడు ఎక్కడి నుంచో ‘నడిపించు నా నావ’, ‘మార్గము చూపుము ఇంటికి/నా తండ్రి ఇంటికి’ లాంటి పాటలు రాసిన ప్రసిద్ధ గీతరచయిత రెవ.డా.ఎ.బి మాసిలామణిగారి’ అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో/ అవతార మూర్తి యేసయ్యకీర్తి అవని జాటుచున్’ అనే గీతం విన్నప్పుడు మనం కూడా ఆ ఆనందసముద్రంలో తేలిపోతుంటాం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మమత, సమత, మానవత ప్రకటించాడు. ‘నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించ’మని గొప్ప శాంతిసందేశాన్ని అందించి సిలువ మీద నెత్తుటి కొవ్వొత్తిలా కరిగిపోయాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి అత్యవసరమైనది ప్రేమ. ఆ ప్రేమమయుని జన్మదినమే క్రిస్మస్. -ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -
కోవిడ్ లోనూ క్రిస్మస్ ఆనందం!!
లోకపరమైన అభ్యున్నతిని ఆశీర్వాదంగా భావించవద్దు. అవసరాలకు మించిన డబ్బు, సంపదలు, గిడ్డంగుల నిండా ఆహారముండటమే గొప్ప జీవితమైతే, అత్యంత హేయమైన సంస్కృతులకు నిలయంగా ఉన్న బబులోను సామ్రాజ్యంలో కూడా అవన్నీ ఉన్నాయని, దేవుడు తన ప్రజల జీవితాల్లో కోరుకునేది ధర్మశాస్త్రబద్ధమైన నీతి, నియమాలు, మౌలిక విలువలు, దైవభయంతో కూడిన పరిశుద్ధజీవితమని యెషయాప్రవక్త హెచ్చరించాడు (యెషయా 1:2–31). మితిమీరిన సంపదలు, అహంకారంతో, అంధత్వంలో కూరుకుపోయిన ఇశ్రాయేలీయులకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు. అనూహ్యంగా, బబులోను సైన్యాలు చేసిన దాడిలో ఒక్క రోజులోనే వాళ్ళ జీవితాలు తలకిందులయ్యాయి. తాము పరలోకపు రాజధానిగా భావించిన యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు ధ్వంసం చేసి పాడుదిబ్బగా మార్చారు, సుందరమైన ఆలయాన్ని కొల్లగొట్టి, దానిలోని బంగారాన్నంతా దోచుకుపోయారు. తాము తిరుగులేని శూరులము, మేధావులమనుకున్న చాలామందిని బబులోనుకు బానిసలుగా చెరపట్టుకొని వెళ్లారు. వాళ్ళ కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ప్రకాశవంతమైన వాళ్ళ దేశం కాస్తా చీకటికూపంగా మారింది. అయితే దేవుడు వాళ్ళను 70 ఏళ్ళ చెర తర్వాత మళ్ళీ వెనక్కు తెచ్చినా, పూర్వవైభవం మాత్రం వాళ్లకు మళ్ళీ దక్కలేదు. ఈ సారి రోమా ప్రభుత్వ నిరంకుశ పాలన వారిని యెరూషలేములోనే మరింత అణిచివేసింది. అంధకారంలో ఉన్నవాళ్లు వెలుగు కోసం, ఆపదలో కూరుకుపోయినవాళ్లు సహాయకుని కోసం, బానిసత్వం లో మగ్గిన ప్రజలు స్వాతంత్య్రం, ఆత్మగౌరవాన్ని ప్రసాదించే విమోచకుని కోసం ఎదురు చూస్తారు. అందుకే బాధిత ప్రజల ఆక్రందనలకు జవాబుగా మానవచరిత్రనంతటినీ క్రీస్తుకు పూర్వం, క్రీస్తుశకం అనే రెండు భాగాలుగా విడదీస్తూ, రెండువేల ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన యేసుక్రీస్తులో ఒక గొప్ప వెలుగును, కృపామయుడైన సహాయకుణ్ణి, మహా విమోచకుణ్ణి, ‘దేవుని రాజ్యం’ అనే ఒక నవలోకనిర్మాతను లోకం కనుగొంది. దేవుని అద్వితీయ కుమారుడైన దైవలోకనిత్యపాలకుడే, ‘యేసుక్రీస్తు’ నామధారిగా, అతిసామాన్యమైన మానవరూపిగా, బేత్లెహేమనే కుగ్రామంలో, ఒక పశువుల శాలలో శిశువుగా ఈ భూగ్రహంపైన పాదం మోపాడు. మెస్సీయాగా దైవకుమారుడు ఈ లోకానికి వస్తాడని బైబిల్ చెబితే, మేధావులు, సంపన్నులు, పాలకుల భవంతుల్లో ఆయన జననం, ఆగమనం కోసం ఎదురుచూసిన ఆత్మీయ అజ్ఞానులైన యూదులు, ఒక నిరుపేదగా, సాదాసీదాగా జన్మించిన రక్షకుని గుర్తించలేకపోయారు. అయితే వాళ్ళు పోగొట్టుకున్నదే, సర్వలోకానికి మహా భాగ్యమైంది. ఈసారి ప్రభువు యూదులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి వరప్రదాత, సార్వజనిక విమోచకుడయ్యాడు. కటిక చీకట్లో కూడా తప్పక ఒక కాంతిరేఖ ఉద్భవిస్తుందన్న ‘ఆశల్ని’ రేకెత్తిస్తూ, విమోచకుని రాకను మరోసారి గుర్తు చేస్తూ ఈ కోవిడ్–19 విపత్తులో ‘క్రిస్మస్’ మళ్ళీ రానే వచ్చింది. దీన్ని డబ్బు దండగ చేసుకునే పండుగలా కాదు, ఆడంబరాల కోసం కాదు, దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుచేసే ఒక శుభప్రదమైన ఘడియగా గుర్తించి పదిమందికీ సాయం చేసి దేవుని ప్రేమను ప్రకటిద్దాం, ఆత్మీయానందాన్ని పొందుదాం, దేవుని ప్రేమతత్వాన్ని మనసారా అనుభవిద్దాం. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవునికి తలవంచాలి, అన్యాయాన్ని ఎదిరించాలి..
‘రాజీపడటం’ అనే మాటే బైబిల్లో ఎక్కడా కనిపించదు. కానీ క్రైస్తవంలో, చర్చిల్లో మాత్రం ఇపుడు ఎక్కడ చూసినా రాజీపడటమే కనిపిస్తోంది. ఇశ్రాయేలీయుల నాయకులైన మోషే, అహరోను, దేవుని ఆరాధించేందుకు అరణ్యంలోకి మూడు దినాల ప్రయాణమంత దూరం వెళ్ళడానికి తన ప్రజలను అనుమతించమని దేవుడు ఆదేశిస్తున్నాడని ఐగుప్తు రాజు ఫరోకు తెలిపారు. నన్ను ఆదేశించడానికి ఆ దేవుడెవరు (ఐగుప్తీయులకు ఫరోయె దేవుడు మరి)? మిమ్మల్ని పోనిచ్చేదిలేదన్నాడు ఫరో. ఆ దశలో దేవుడు ఐగుప్తు మీదికి తెగుళ్లు పంపడం మొదలుపెట్టగా, మూడు దినాల ప్రయాణమంత దూరం కాదు కానీ, కొద్ది దూరం వెళ్లి దేవుణ్ణి ఆరాధించి వెనక్కి రండంటూ ఫరో కొంత వెనక్కి తగ్గాడు. దేవుని ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, అందులో రాజీపడబోమని తాము కోరినట్టుగా తమను పంపమని మోషే పట్టుబట్టగా, దేవుడు మరికొన్ని తెగుళ్లు పంపాడు. పోనీ, పురుషులు మాత్రమే వెళ్లిరండంటూ ఫరో మరి కొంత తగ్గాడు. అలా కనీసం తమ కుటుంబాల కోసమైనా వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారని ఫరో ఆలోచన. అది కూడా కుదరదని, దేవుని ఆదేశాల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని మోషే బదులిచ్చాడు. మళ్ళీ తెగుళ్లు సోకగా, పశువులన్నీ ఇక్కడే వదిలేసి కుటుంబాలతో వెళ్ళవచ్చని ఫరో మరింత తగ్గినా, మోషే అందుకు ఒప్పుకోలేదు. ఇక ఈ సారి దేవుడు ఐగుప్తీయుల ప్రతి ఇంట్లోనూ వాళ్ళ జేష్ఠ కుమారుడు చనిపోయే భయంకరమైన విపత్తును సృష్టించాడు. దాంతో, ఫరో పూర్తిగా దిగివచ్చి, అప్పటికప్పుడు ఐగుప్తు వదిలి వెళ్లేందుకు ఇశ్రాయేలీయులను ఆదేశించాడు (నిర్గమ 8:28, 10:11, 24). అయితే దేవుడు కావాలనే, దగ్గరి దారిలో కాకుండా, ఎఱ -
బుద్ధిహీనతతో చేజారిన సువర్ణావకాశం
అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ తన ఆర్ధిక సలహాదారుడు జె.కె.గాల్ బ్రెత్ ఇంటికి ఫోన్ చేశాడు. ఆయన పడుకున్నాడని పనిమనిషి ఎమిలీ జవాబిచ్చింది. ‘నేనెవరో తెలుసా? ఆయన్ను లేపు’ అన్నాడా అమెరికా అధ్యక్షుడు. ‘నేను గాల్ బ్రెత్ గారికి పనిచేస్తున్నాను, అమెరికా అధ్యక్షునికి కాదు’ అని జవాబిచ్చి ఆమె ఫోన్ పెట్టేసింది. ఆగ్రహించాల్సింది పోయి, లిండన్ జాన్సన్ ఆమె పనితీరును మెచ్చి ఎమిలీని వైట్ హౌస్లో నియమించాడు. యజమాని మనసెరిగి, మెలిగి, ఆయన్ను మెప్పించడం అనే అంశంపైన యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు (మత్తయి 25:14–30). ఒక భూస్వామి తన ముగ్గురు దాసులను పిలిచి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఒకరికి ఐదు తలాంతులు, ఇంకొకరికి రెండు తలాంతులు, మూడవవాడికి ఒక తలాంతు ఇచ్చి మరో దేశానికి వెళ్ళిపోయాడు. ఒక తలాంతు వెయ్యిడాలర్ల విలువచేసే వెండితో సమానం. భూస్వామి చాలా కాలానికి తిరిగొచ్చి లెఖ్ఖ అడిగితే మొదటివాడు తన ఐదు తలాంతులు వాడి మరో ఐదుతలాంతులు సంపాదించానని చెప్పగా ఆయన ఎంతో సంతోషించి వాటిని కూడా అతనికే ఇచ్చేశాడు. రెండవ వాడు కూడా మరో రెండు తలాంతులు సంపాదించానని చెబితే అతనికి కూడా అదే చేశాడు. మూడవ దాసుడు మాత్రం ఆయనిచ్చిన ఒక తలాంతునూ భద్రంగా తెచ్చిచ్చి, ‘నీవు చాలా కఠినుడివి. దీన్ని పోగొడితే శిక్షిస్తావని భయపడి, గుంత తవ్వి దాన్ని భద్రంగా దాచాను. నీది నీవు తీసుకో’ అన్నాడు. యజమాని అందుకు ఆగ్రహోదగ్రుడై, అతనివన్నీ మిగిలిన ఇద్దరికిచ్చి, చీకటి గదిలో అతన్ని బంధించాడు. అసలేం జరిగింది? ఈ ముగ్గురూ నిజానికి బానిసలు. బానిసలకు స్వాతంత్య్రం ఉండదు, హక్కులుండవు. వాళ్ళ పూర్తి జీవితం, సమయం, సామర్ధ్యం పైన యజమానికే పూర్తి హక్కులుంటాయి. అలాంటిది, యజమాని వారిని నమ్మి వాళ్లకు తలాంతులిచ్చి, ఆ బానిసలను కాస్తా తన ఆస్తిలో భాగస్వాములను చేశాడు. ఆ తలాంతులతో ఏదైనా చెయ్యగలిగిన స్వాతంత్య్రాన్ని వారికిచ్చాడు. వారి సామర్థ్యాన్ని గుర్తించి వారికి తనతో సమానమైన స్థాయినిచ్చాడు. చాలా కాలం తర్వాత తిరిగొచ్చాడంటే, వాళ్ళు తమ సామర్థ్యాన్ని పెంచుకొని ప్రయోజకులయ్యేందుకు వారికి బోలెడు సమయమిచ్చాడు. అయితే మూడవ వాడు మూర్ఖుడై, అతితెలివి తేటలకు పోయి యజమాని ఉగ్రత పాలయ్యాడు. యజమాని మళ్ళీ వచ్చేదాకా దొరికిన సమయాన్నంతా సోమరితనంతో, నిష్ప్రయోజకంగా గడిపాడు. వెయ్యి డాలర్ల విలువ చేసే వెండినైతే జాగ్రత్తగా కాపాడాడు కాని, డబ్బుతో వెలకట్టలేని ఆయనిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాన్ని, గుర్తింపును, ముఖ్యంగా సమయాన్ని మాత్రం దుబారా చేశాడు. తాళం వేసి గొళ్ళెం మర్చిపోవడమంటే ఇదే. చాలా మంది విశ్వాసులు, దేవుడిచ్చిన అత్యంత విలువైన స్వాతంత్య్రాన్ని, సామర్థ్యాల్ని, సమయాన్ని దుబారా చేస్తూ, డబ్బును ఆస్తులను మాత్రం ‘జాగ్రత్తగా’ కాపాడుకోవడమే తెలివైన విధానమనుకొని, బాధ్యతారహితంగా బతుకుతారు. అలాంటి సోమరులు, పిసినారులకు జీవితంలో సుఖముండదు, సమాజంలో పరువుండదు, జీవన సాఫల్యం అసలే ఉండదు. భూస్వామి అసలు బాధ, కోపమేమిటంటే, తాను అంతటి సువర్ణావకాశమిచ్చినా, ఆ మూడవ వాడు మారలేదు, ఆత్మీయంగా ఎదగలేదు, ప్రయోజకుడు కాలేదు. పైగా యజమాని ఔదార్యాన్ని, ప్రేమను, కృపను అర్థం చేసుకోకుండా, తన దౌర్భాగ్యాన్ని తెలుసుకోకుండా, ‘నీవు విత్తని చోట కోసేవాడవంటూ’ ఆయనపైనే అభియోగం మోపాడు. రేపు పరలోకంలో మన ‘ప్రోగ్రెస్ రోపోర్టుల్లో’ ఇవే వ్యాఖ్యలుంటాయేమో జాగ్రత్త!! దేవుని మనసు, ప్రణాళికల మేరకు, పదిమందికీ ప్రయోజనం కలిగిస్తూ ఆయన్ను ఎంత మెప్పించామన్నదే మన ప్రతిభకు, విలువకు గీటురాయి. కరెన్సీ కట్టలెన్ని కూడబెట్టినా దేవుని దృష్టిలో అవి కేవలం చెత్త కాగితాల గుట్టలే!! కాబట్టే, ఆ రోజున దేవాలయంలో పెద్దమొత్తాలిచ్చిన ధనికులంతా డాంబికంతో తమ ఫలాన్ని పోగొట్టుకొని పరలోకంలో పరమ నిరుపేదలుగా మిగిలిపోతే, ఒక పేద విధవరాలు మాత్రం కేవలం రెండు కాసులిచ్చి దేవుని మనసు గెలుచుకొని పరలోకంలో అందరికన్నా ధనికురాలు, ధన్యురాలైంది. –రెవ.టి.ఏ.ప్రభుకిరణ్ -
‘ప్రాణం’ కమలాకర్ పాట ఏడు భాషల్లో..
సాక్షి, లక్డీకాపూల్: సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్ పేరు చెప్పగానే ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం.. స్వర్గమవ్వాలి వనవాసం’ పాట గుర్తొస్తుంది. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ చిత్రం ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ క్రిస్మస్ కానుకగా ‘కమనీయమైన.. రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అంటూ సాగే రెండు గాస్పల్ సాంగ్స్ (సువార్త పాటలు) కంపోజ్ చేశారు. ప్యాషన్ ఫర్ క్రైస్ట్ – జోష్వాషేక్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రాణం’ కమలాకర్ మాట్లాడుతూ– ‘‘క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన సంగీత దర్శకత్వంలో డివోషనల్ టచ్ ఉండేలా రెండు పాటలను కంపోజ్ చేశామన్నారు. ‘కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా..’ అనే పాట ఏడు భాషల్లో విడుదలైందన్నారు జోష్వా షేక్ లిరిక్స్ అందించారు. ‘రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అనే పాటను కూడా అతనే రాసినట్లు తెలిపారు. మధురై, కేరళ నుంచి రిథమ్ సెక్షన్, కేరళ నుంచి కొరియోగ్రాఫర్స్ను పిలిపించి రికార్డ్ చేసినట్లు ఆయన వివరించారు. -
చర్చి వెలిగే లైట్ హౌస్లాగా ఉండాలి
దేవుని అద్భుత సత్యాలతో కూడిన బైబిల్ ఇంట్లో ఉన్నా రోజుల తరబడి దాని జోలికి వెళ్లకుండా విశ్వాసి ఉంటున్నాడంటే, దేవుడంటే ‘ఆకలి’ మందగించిందని, ఆకలి లేక పౌష్టికాహార లోపం ఏర్పడి అతని జీవితం అన్ని రకాల అనర్థాలకూ కారణమైందని అర్థం. తాను స్థాపించిన కొరింథీ చర్చిలో అసూయలు, కలహాలు, విభేదాలు, విభజనలకు ‘ఆత్మీయపౌష్టికాహార సమస్యే’ కారణమని. ఆ చర్చికి రాసిన మొదటి లేఖలో పౌలు వాపోయాడు. ‘అప్పట్లో మీరు బలహీనులు కాబట్టి నేను మిమ్మల్ని పాలతో పోషించాను. కాని ఇంతగా ఎదిగిన తర్వాత కూడా మీరింకా పాలే తాగే స్థితిలోనే ఉన్నందువల్ల మరింత బలహీనులై, ‘నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా(పేతురు) వాడను, నేను క్రీస్తు వాడను’ అంటూ నాలుగు వర్గాలుగా చీలిపోయి శరీరసంబంధుల స్థాయికి దిగజారారు’ అని పౌలు బాధపడ్డాడు( 1:12, 3:1–9). అది కుటుంబమైనా, చర్చి అయినా, దేశమైనా ఆత్మీయ జ్ఞానం కొరవడితే ’అనైక్యత’ ప్రబలి, మానసిక శాంతి కరువై అన్ని అనర్ధాలకూ రాచబాట వేస్తుంది. పరలోకానందంతో వెలిగిపోవలసిన జీవితాలు,కుటుంబాలు, సమాజం, చర్చిల్లో అశాంతి నిండిన నరకపు చీకట్లు కమ్మడానికి దేవుడంటే ‘ఆకలి’మందగించి ఏర్పడిన ‘ఆత్మీయ పౌష్టికాహార లోపమే’ ప్రధాన కారణం. కొరింథీ పట్టణం గ్రీసులో ఏడు లక్షల మంది జనాభా కలిగిన గొప్ప వర్తకపు పట్టణం. కాని బోలెడు డబ్బున్న కొరింథీలో ప్రజలు మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకొని భ్రష్టులవుతున్నారు. అలాంటి కొరింథీలో పౌలు సువార్త ప్రకటించినప్పుడు మొదట బాగా వ్యతిరేకత ఎదురైంది. అయితే దేవుడు ’ఇక్కడ నాకు చాలా జనముంది, ధైర్యంగా మాట్లాడు’ అంటూ పౌలును బలపర్చగా, ప్రయాసపడి ఈ చర్చిని స్థాపించాడు (అపో.కా.18:5–11). ’ఈ పట్టణంలో నాకు చాలా జనముంది’ అని ఆరోజు ప్రభువంటే అక్కడొక గొప్పచర్చి అవుతుందనుకున్నాడు కాని, ’కొరింథీ పట్టణంలో భ్రష్టులైన చాలా మందికి నా అవసరం అంటే దేవుని అవసరం ఉంది, ‘కొరింథీ చర్చి’ నా ప్రతినిధులుగా వారిని సరిదిద్ది పరలోకపు ఆనందంతో నింపాలన్నదే నాటి దేవుని మాటల అంతరార్థమని పౌలుకు ఇప్పుడర్థమవుతోంది. భ్రష్టులైన వారికి వారికి వెలుగు చూపించి సరిదిద్దే లైట్ హౌస్ గా దేవుడు కొరింథీ చర్చిని నియమిస్తే, అసలు లైట్ హౌస్ లోనే చీకటి కమ్ముకున్న విషాదం కొరింథీ చర్చిది, ఈ నాటి మనందరిదీ కూడా!! గొప్ప దైవసేవకుడు, ‘సాల్వేషన్ ఆర్మీ’ సంస్థాపకుడు విలియం బూత్ ఒకసారి తన ఏడేళ్ల కొడుకు ఎడ్వర్డ్ బూత్ ను లండన్ లో ఒక బార్ కు తీసుకు వెళ్ళాడు. ‘జూదం, మద్యపానంతో నిండిన ఈ బార్ కు నన్నెందుకు తెచ్చావు నాన్నా?’ అని ఎడ్వర్డ్ అడిగితే ‘వీళ్లంతా దేవుని పిల్లలే. కాని దారి తప్పారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దే గొప్ప సేవ నీవు చెయ్యాలని చెప్పడానికే ఇక్కడికి తెచ్చాను’ అన్నాడు విలియం బూత్. తండ్రిని మించిన తనయుడుగా ఎడ్వర్డ్ బూత్ ఆ తర్వాత చేసిన అద్భుతమైన సేవ ఫలితంగా లండన్లోని బార్లు, జూదం జరిగే కేంద్రాలు మూతపడ్డాయి. లోకానికి వెలుగు చూపించాల్సిన బాధ్యత చర్చిది. కాని చర్చిలోనే చీకటి నిండితే అది వెలగని లైట్ హౌస్ లాంటిదే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మరణం మరణించిన వేళ...
నేడు ప్రపంచంలోని క్రైస్తవులంతా ఈస్టర్ పండుగను భక్తి పారవశ్యంతో జరుపు కొంటున్నారు. సమాధిని గెలిచి లేచిన క్రీస్తు శక్తిని తలపోసుకుంటూ ఆయన దివ్యనామాన్ని స్మరించుకొంటూ తరిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేదీ లేదు అంటూ ఆయన ఘననామాన్ని కీర్తిస్తున్నారు. యేసు ప్రభువును సమాధిచేసి ఎవరి గృహాలకు వారు వెళ్లిపోయారు. రోమన్ సైనికులంతా సమాధి ముందు కాపలాగా ఉన్నారు. శిష్యులు వచ్చి యేసు దేహాన్ని ఎత్తుకుపోయి మృతులలోనుండి యేసు లేచాడని ప్రచారం చేసే అవకాశానికి అడ్డుగా నిలుచున్నారు. ఆదివారం ఉదయాన్న ప్రపంచ మానవ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన ఉత్కృష్టమైన వైభవమైన కార్యం జరిగింది. అదే యేసు పునరుత్థానం. ఉత్థానము అంటే లేపబడుట. పునః అనగా తిరిగి. పునరుత్థానము అనగా మరణాన్ని జయించి తిరిగిలేచుట. యేసు పునరుత్థానము జరిగిన ఆ రోజు... ఎన్నో ఏళ్ళుగా తన కబంధ హస్తాలలో బంధించి, నిష్కర్షగా మనుషులను కబళిస్తున్న మరణం మరణించింది. మరణ మృదంగం మూగబోయింది. మనుష్యులను వారి కలలను, వారి ఆశయాలను మూసిపెడుతున్న సమాధి శాశ్వతంగా తెరవబడింది. తాండవమాడుతున్న దుష్టశక్తుల మీద ఖచ్చితంగా ఏనాటికైనా పైచేయి సాధించవచ్చని ఋజువుచేయబడింది. సకల చరాచర సృష్టిని చేసిన దేవునికి అసాధ్యమైనదేదీ ఉండదని తేలిపోయింది. సత్యాన్ని సమాధిలో పెట్టగలం కానీ దానిని ఎక్కువకాలం దానిలో ఉంచలేమన్న ద్విగుణీకృతమైన విషయం బట్టబయలైంది. నిరాశలోనుండి నిరీక్షణ యుగంలోనికి మానవజాతి అడుగుపెట్టింది. ఆవేదనాభరితమైన ప్రతి ప్రశ్నకు సర్వలోకనాథుని పునరుత్థానం అత్యున్నత సమాధానాలను అనుగ్రహించి తన భక్తులను ఆనంద పారవశ్యంతో నింపింది. అంతరంగంలో అద్వితీయమైన కాంతి వింతవింతగా నిండి బతుకంతా నిత్యనూతనమయ్యింది. మానవత్వం దైవత్వంతో నిర్విరామంగా సహవసించడానికి పునాది పడింది. నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడి చదివి యూనివర్సిటీలోనే మొదటి స్థానంలో నిలిచి తన కష్టానికి ప్రతిఫలంగా తనచేతికి అందిన సర్టిఫికెట్ను చేతపట్టుకొని తన ఆనందాన్ని కడుపు కట్టుకొని ఈ స్థానానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులతో పంచుకోవాలన్న ఆశతో గ్రామానికి ప్రయాణమయ్యాడు ఓ ఇంజనీరు. ఫోన్లు పెద్దగా అందుబాటులోనికి రాని ఆ రోజుల్లో ఎర్రబస్సెక్కి ప్రయాణం ప్రారంభించాడు. ఓ మంచి ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో హాయిగా గడుపుతున్నట్టుగా ఊహించుకొంటూ మెల్లగా నిద్రలోనికి జారుకున్నాడు. కాసేపటికి కఠోరమైన బస్సు హారన్ శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు. మామూలుగా కన్నా ఇంకొంచెం వేగంగా తన ఇంటివైపు అడుగులు వేయసాగాడు. తన తాత కట్టించిన చిన్న పెంకుటిల్లు ముందు జనాలు గుమిగూడి ఉన్నారు. చాలా కాలం తర్వాత నా కుమారుడు వస్తున్నాడని తల్లి చెప్పడం ద్వారా తనను చూడడానికి ప్రజలు వచ్చియుండొచ్చు అని అనుకుంటూ ఇల్లు సమీపించే సరికి తన ముద్దుల చెల్లి విగతజీవిలా పడివుంది. గుండెలవిసేలా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ‘‘అన్నయ్యా త్వరగా వచ్చేయి. నిన్ను చూడాలని ఉంది’’ అని చెల్లి రాసిన ఉత్తరం మూడు రోజుల క్రితమే అందింది. బరువెక్కిన గుండెతో వెక్కి వెక్కి ఏడ్చాడు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఏదో తెలియని నిశ్శబ్దం ఇంటినంతా కమ్మేసింది. తమకు తోచినట్టుగా ఆదరించిన బంధువులు ఒక్కొక్కరిగా తమను విడచి వెళ్లిపోతున్నారు. తన మనసులో కొన్ని ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్న చదువులు తన ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. తల్లిదండ్రులను అడిగాడు. వారి దగ్గర కూడా సమాధానాలు లేవు. ‘‘మనిషిని ఎవరు పుట్టిస్తున్నారు? మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు?’’ ఈ మూడు ప్రశ్నలు ఆ యువకుని తొలిచేస్తున్నాయి. కలవరంతో, భారమైన హృదయంతో, మానసిక సంఘర్షణతో ఇల్లు విడచి బయలుదేరాడు. జవాబులు తెలిస్తే తిరిగొస్తా లేకపోతే నన్ను శాశ్వతంగా మర్చిపోండి అని కన్నవారికి చెప్పి పయనమయ్యాడు. బహుశా చాలామంది ఎన్నో విషయాలను గూర్చి ఆలోచిస్తారు గాని ఈ మూడు విషయాలు గూర్చి ఆలోచించరేమో. వాటిని ఆలోచించేంత సమయం నేటి మనుష్యులకు ఉందా? వాటి సమాధానాలు తెలుసుకోవడమే పరమార్థమని గ్రహించిన యువకుడు మార్గంలో తనకు తారసపడిన ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను నిర్మొహమాటంగా ప్రశ్నించాడు. ఒక్కొక్కరి దగ్గరనుండి ఒక్కో విధమైన సమాధానం. బుర్ర వేడెక్కిపోయే విషయాలను కూడా ఓపికతో విన్నాడు. చివరకు ‘‘వీటికి ఈ భూమ్మీద సమాధానం లేదు. అందుకే ప్రపంచమంతా మాయ అంటారు కొందరు’’ అని తనలో తాను గొణుక్కొంటూ మార్గాయాసంతో అటుగా వెళ్తున్న ఓ ఎద్దులబండిని ఆపి కొంతదూరం వెళ్లడానికి సహాయపడమని అడిగి బండెక్కి కూర్చుంటాడు. ఆ బండి నడుపుతున్న వ్యక్తి ముఖంలో ఏదో తెలియని ప్రకాశం, ప్రశాంతత. ఇతడు బహుశా భౌతికంగా ధనవంతుడు కాకపోవచ్చు గాని ఇతడు విశిష్టమైన ఆధ్యాత్మిక కుబేరుడుగా ఉన్నాడు. ‘‘మీ ముఖంలో అగుపిస్తున్న ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తాను ఒకొప్పుడు సప్త వ్యసనాలకు బానిసగా ఉంటూ కుటుంబాన్ని ఛిద్రం చేసుకొంటున్న వేళలో యేసు జీవితం మరియు ఆయన మధురమైన ప్రేమ తనను ఎలా రక్షించాయో సవివరంగా వివరించాడు’’. తాను వెదకుచున్న ప్రశ్నలకు సమాధానాలు లభించే చోటు దొరికిందన్న సంతోషంతో కొన్ని రోజులు మీ ఇంటిలో ఉండవచ్చా? అని అడిగాడు. తప్పకుండా ఉండవచ్చు అన్న సమాధానం ఆ యువకునికి ఊరటనిచ్చింది. ఇంటికి చేరగానే చాలాకాలం తరువాత కడుపునిండా తృప్తిగా అన్నం తిన్నాడు. తనకున్న ప్రశ్నలను వారితో పంచుకున్నాడు. ఏదీ దాచుకోకుండా వారు తమకు తెలిసినది యువకునికి వివరించిన పిదప పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను అతని చేతిలో ఉంచారు. నీ మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యములో సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది అని వారు చెప్పడంతో రాత్రంతా దైవగ్రంథాన్ని భక్తితో ఆసక్తితో పఠించడం మొదలుపెట్టాడు. కృపకు రాజబాటలు వేసిన యేసు జనన మరణ పునరుత్థానములు తన మనసును హత్తుకున్నాయి. దేవుడు ఈ లోకానికి వచ్చి ఏవేవో చిన్న చిన్న బహుమానాలు కాదు ఇచ్చింది, తన విలువైన ప్రాణాన్నే బలిదానంగా సమర్పించి, మరణాన్ని జయించి తిరిగిలేచాడు. తాను చెప్పిన మాటలు మరియు తన బల్యర్పణ వాస్తవమైనవని ఆయన పునరుత్థానము ఋజువు చేసిందని విశ్వసించాడు. మానవుని సృష్టించినది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నాడు. ‘మానవుడు దేవుని సృష్టి. సర్వశక్తిగల దేవుడు తన రూపములో తన పోలికలో మనిషిని కలుగచేశాడు. ఆ కారణాన్ని బట్టి సృష్టిలో గ్రహాల కన్నా, నక్షత్రాల కన్నా, పాలపుంతల కన్నా మనిషే గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నియు మనిషి కోసమే సృష్టించబడ్డాయి. మానవుడు కలుగచేయబడిన విధానం చాలా విలక్షణమైనది. మహిమా ప్రభావములు అనే కిరీటాన్ని మనిషికి తొడిగి నీవు ఈ విశ్వాన్ని ఏలుబడి చేయాలని దేవుడు ఆదేశించాడు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనిషి కోతి నుండి పరిణామం చెందినవాడు కాదు. లేదా ఏదో రసాయన చర్యల ద్వారా ఉద్భవించినవాడు కాదు. దేవుని రూపంలో ఆయన దివ్య ప్రణాళికలను నెరవేర్చడానికి çసృష్టించబడినవాడు. మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? అనే ప్రశ్నకు సయితం సమాధానం కనుగొన్నాడు. మానవుడు జీవించే డెబ్బయి లేదా ఎనభై సంవత్సరాలు తనకు తాను ఏదో కూడబెట్టేసుకొని సంపాదించుకొని ఏదో ఒకరోజు మరణించడం కానేకాదు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఒక పరమార్థం ఉంటుంది. దానిని తెలుసుకొని మహోన్నతమైన దైవచిత్తానికి లోబడి పదిమందికి ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా బతకడమే ఆ పరమార్థం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే దైవాజ్ఞకు లోబడడంలోనే అమితమైన ఆనంద సంతోషాలు దాగియుంటాయి. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు? మరణం అందరికి వస్తుంది. సామంతులైనా సామాన్యులైనా, రాజులైనా రోజువారి కూలీలైనా, స్వాములైనా, సోగ్గాళ్ళైనా, ధనికులైనా, దరిద్రులైనా, అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా, స్త్రీలైనా పురుషులైనా, ఒంటిచేత్తో ప్రపంచాన్ని గడగడలాడించిన వారైనా మరణం ముందు తల వంచాల్సిందే. మరణం తర్వాత ఏం జరుగుతుంది? క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఒక మనిషి మరణించిన తరువాత కూడా జీవిస్తాడు. ఈ భూమ్మీద తాను చేసిన పాపాలకు క్షమాపణ పొంది విశ్వాసం ద్వారా దేవుని నీతితో నింపబడితే మోక్షరాజ్యంలో ప్రవేశించి యుగ యుగాలు దేవుని రాజ్యములో అమరుడుగా జీవిస్తాడు. లేని పక్షంలో తన పాపాలకు శిక్షగా నరకములో వేదనను అనుభవిస్తాడు. మరణం తరువాత ఏమి జరుగుతుందో మనుష్యులకు తెలియకపోవచ్చు గాని ఆదిమధ్యాంతరహితుడైన పరమాత్ముడు ఆ విషయాలను తెలిపినప్పుడు మనిషి నమ్మాల్సిందే. ఎంతో కాలంగా చెప్పులరిగేలా ఈ ప్రశ్నలకు సమాధానాలను వెదకుచున్న ఆ యువకుని మనసు కుదుటపడింది. పరమాత్ముని గూర్చిన సత్యం బోధపడింది. సంతోషంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన సత్యాన్వేషణ ఏవిధంగా కొనసాగిందో, సత్యాన్ని ఏవిధంగా కనుగొన్నాడో చెప్పాడు. యేసు పునరుత్థానం చెందుట వలన తన భక్తులకు విజయానికి సంబంధించిన అనిర్వచనీయమైన భరోసా దొరికింది. ఏ దేవుడైతే తమ గుండెల్లో కొలువుతీరాడో ఆయన మరణాన్ని జయించినవాడు అని జ్ఞప్తికి తెచ్చుకొన్న ప్రతిసారి జీవితం పునీతమౌతుంది. జీవితకాలం ఆయన తమతో తోడుగా ఉంటాడన్న సత్యం వారిని ఆనంద పారవశ్యంలోనికి నడిపిస్తుంది. దుఃఖం నాట్యంగా మారుతుంది. ఓటమిలాగా కనిపించిన పరిస్థితులలో దేవుడు అసాధారణరీతిలో వారికి విజయమిస్తాడనే నమ్మకం స్థిరపడుతుంది. మరణాన్నే జయించగలిగిన దేవుడు కష్టపరిస్థితుల్లో స్మరించుకుంటే పట్టించుకోకుండా ఎందుకుంటాడు? దుష్టశక్తులు కొన్నిసార్లు ఊహించని రీతిలో స్థాయిలో చెలరేగిపోతుంటాయి. అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకొనే ప్రయతాన్ని కొందరు నిర్విరామంగా చేస్తూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తుంటారు. జీవితం ముగింపు దశకు వచ్చేసిందని హేళన చేస్తారు. యేసుక్రీస్తు జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. అంతా తామనుకున్నట్టుగా జరిగించారు. అబద్ధ సాక్ష్యములు పెట్టి, న్యాయం యేసు వైపు ఉన్నప్పటికి పిలాతు మనసును తమవైపు తిప్పుకొని మరణ శాసనాన్ని లిఖించారు. ఆయన మరణాన్ని కన్నుల పండువగా వేడుకగా చూశారు. విపరీతమైన బాధను అనుభవిస్తుంటే ఏదో ఘనకార్యం చేస్తున్నామన్నట్టుగా ఉప్పొంగిపోయారు. సమాధిలో పెట్టబడినప్పుడు ఒకే ద్వారం కలిగిన సమాధిముందు బరువైన రాయిని అడ్డుగా ఉంచారు. వందలాదిమంది సైనికులను కాపలాగా ఉంచారు. అయితే చివరకు ఏమయ్యింది? వారి పన్నాగాలన్ని ఏమయ్యాయి? యేసు ప్రభంజనాన్ని సమాధిముందు ఉంచిన రాయిగాని, రాటుతేలిన రాణువవారుగాని ఆపగలిగారా? అరచేతులతో సూర్యకాంతిని అడ్డుకోవడం తేలికకాదు అనే విషయం ఆదివారం ఉదయాన్నే క్రీస్తు పునరుత్థానంతో ఋజువు చేయబడింది. పైశాచికంగా తమ నోళ్లవెంబడి వడిగా వెలువడిన మాటల పిడుగుల సవ్వడి సద్దుమణిగింది. ప్రగల్భాలు పలికిన నోళ్లు మూతలుపడ్డాయి. ఒంటరిగా మూడురోజులు సమాధిలో ఉన్న యేసు మరణ సంకెళ్ళను తెంచుకొని బయటకు వచ్చాడు. అంతవరకు విరుచుకుపడిన అల్లరిమూకలు మూర్ఛిల్లి పడిపోయారు. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. దుమ్మునిండిన మనిషి హృదయదారుల్లో విజయ ప్రవాహం పరవళ్లు తొక్కింది. బంధాలకు, అప్యాయతలకు, ప్రేమకు చోటులేని సమాజంలో మనిషి కలలు కూడా సమాధిచేయబడుతున్నాయి. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్న వారి ఆశయాలను సమాధిలో కుక్కేస్తున్నారు. యేసు పునరుత్థాన చరితను ఆకళింపు చేసుకోగలిగితే సమాధిలో కూరుకుపోయిన ఆశయాలు, ఉన్నత లక్ష్యాలు మరలా తిరిగి లేస్తాయనే భరోసా వస్తుంది. ఎంతమంది అదిమిపెట్టి పాతాళానికి తొక్కేసినా ఒకానొకరోజు అవి భూమిలోతులను చీల్చుకొని వచ్చే మహాబీజంగా శాఖోప శాఖలుగా పల్లవిస్తాయి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలగడమే నిజమైన విజయానికి నిర్వచనం. నాగలితో జీవితమనే పొలాన్ని అందరూ దున్నేసారని బాధపడడం కంటే ఆ దున్నబడిన పొలంలో విత్తనాలు వేసుకొంటూ పోవడమే సహృదయుల విశిష్ట లక్షణం. సమయం వచ్చినప్పుడు పనలు కోసుకొంటూ ముందుకు సాగిపోవడమే విజయవీరులు ప్రపంచానికి నేర్పించే పాఠం. ‘‘భయపడకుడి, ఆయన ఇక్కడ లేరు. తాను చెప్పినట్లే లేచి యున్నారు.’’ ఇదే మాట నేటికి యెరూషలేములోని యేసుక్రీస్తు సమాధిలోపల చూడగలం. ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది. ఆ ఖాళీ సమాధి కోట్లాదిమంది హృదయాలలో ఉన్న ఖాళీని పూరించింది. చీకటిని పారదోలింది. ప్రపంచ పోకడ పరుగులోనుండి పరిశుద్ధుని జాడలోనికి మానవాళిని నడిపింది. దౌర్భాగ్యపు కన్నీళ్ళు ఆనందబాష్పాలుగా పరిణామం చెందాయి. శుభప్రదమైన నిరీక్షణ విప్పారింది. డా.జాన్వెస్లీ (యువ రచయిత, వక్త) క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
పేతురును వరించిన ఆత్మీయ ఐశ్వర్యం!
నేను ఎవరినని ప్రజలు అనుకొంటున్నారని యేసుక్రీస్తు ఒకసారి తన శిష్యులను అడిగాడు. కొందరు నీవు బాప్తిస్మమిచ్చు యోహానువని, మరికొందరు నీవు ఏలీయా లేదా యిర్మీయా లేదా మరెవరైనా ప్రవక్తవని అనుకొంటున్నారని శిష్యులు జవాబిచ్చారు. ‘మరి మీరు నేనెవరినని అనుకొంటున్నారు?’అని ప్రభువు ప్రశ్నిస్తే వాళ్ళు కొంత సందిగ్ధంలో పడ్డారు. ‘ఇంతకీ ఈయన ఎవరు?’ అన్న ప్రశ్న వాళ్ళ మనస్సులో ఉందన్నది అర్థం చేసుకునే ప్రభువు ఈ ప్రశ్న వేశాడు. ‘నన్ను వెంబడించండి’ అన్న యేసుప్రభువువారి ఒక్క మాటకు లోబడి, శిష్యులు తమ వృత్తులు, కుటుంబాలు, ఆస్తులన్నీ వదిలిపెట్టి ఆయన్ను వెంబడించారు. అది జరిగి అప్పటికి మూడేళ్లకు పైనే అయ్యింది. ఆయన ప్రసంగాలను వాళ్ళు వింటున్నారు, ఆయన కృపను, కరుణను దగ్గరి నుండి చూస్తూ అనుభవిస్తున్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలకు వాళ్లంతా ప్రత్యక్షసాక్షులు. దేవునిరాజ్యం సమీపంగా ఉన్నదన్న మూలాంశంతో ఆయన చేస్తున్న ప్రసంగాలు విని, ఆ రాజ్యానికి ఆయనే రాజు అని వారు నిర్ధారించుకున్నారు. అయితే ఇటీవలే అరణ్యంలో కేవలం ఐదురొట్టెలు, రెండు చేపల్ని ఆయన ఐదువేలమందికి పైగా ప్రజలకు పంచిపెట్టినపుడు, ప్రజలంతా ఎంతో సంబరపడి ఆయన్ను రాజును చెయ్యడానికి ప్రయత్నిస్తే వారి మధ్యనుండి ఆయన తప్పించుకొని వెళ్లిపోవడం వారి సందిగ్ధాన్ని మరెక్కువ చేసింది. ఆయన ఒక రాజు కాదు, ప్రవక్త కాదు, నాయకుడూ కాదు. మరి ఆయన ఎవరు? వెంటనే పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని అన్నాడు.‘నరులు కాదు, దేవుడే నీకీ విషయాన్ని బయలుపర్చాడు. నీ ఈ విశ్వాసం మీదే నేను నా చర్చిని కడతాను’ అని యేసుప్రభువు వెల్లడించాడు. ‘క్రీస్తు’ అనేది యేసు పేరులో భాగం కాదు.‘అభిషిక్తుడు లేదా మెస్సీయా లేదా రక్షకుడు’ అన్నది దాని అంతరార్ధం. ధర్మశాస్త్రాన్నంతా ఎరిగిన పరిసయ్యులు, శాస్త్రులనే నాటి మేధావి వర్గానికి అర్ధం కాని ఈ మర్మాన్ని పామరుడు, వృత్తిరీత్యా జాలరి అయిన పేతురుకు బోధపడటం యేసు ప్రభువుకు ఆనందం కలిగించింది(మత్తయి 16:13–20). ఈ ఉదంతాన్నే యోహాను తన సువార్తలో రాస్తూ, యేసు ప్రభువు యూదులతో విశ్వాసులకు జనకుడైన అబ్రాహాముకన్నా ముందునుండే ‘నేను ఉన్నవాడను’ అంటే దేవుణ్ణి అని ప్రకటిస్తే, ఆయన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు (యోహాను 8:58). మనుషుల చంచల స్వభావానికి అద్దం పట్టే ఉదంతమిది. తాము దేవుళ్ళు కాకున్నా లేనిపోని హడావుడి, ఆర్భాటం, గారడీలు చేసే మాయల మరాఠీలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు కాని దేవుడే స్వయంగా తనను తాను తగ్గించుకొని, సాత్వికుడై పరలోకంనుండి దిగి వచ్చి సామాన్య ప్రజలతో మమేకమై వారి మధ్యే నివసించి తన మహిమల్ని, పరలోకాధికారాన్ని అంత స్పష్టంగా రుజువు చేసుకొంటున్నా ఆయన్ను దేవుడిగా విశ్వసించడానికి వెనకాడుతారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త కాదు, ఎంతోమంది ప్రవక్తలు తమ ప్రవచనాల్లో పేర్కొన్న ‘మెస్సీయా’ఆయన అన్న పరలోక మర్మాన్ని పేతురు ఒడిసిపట్టుకున్నాడు. ఆ మెస్సీయా ప్రబోధాలు, జీవితం, పాపక్షమాపణా సూత్రమే పునాదిగా చర్చిని యేసుప్రభువే స్వయంగా నిర్మించడానికి దారి తీసిన ఉపోద్ఘాతమిది. ఈ లోకసంబంధమైన విజ్ఞానం భూమి నుండి రాకెట్లో చంద్రమండలానికెళ్లడానికి పనికొస్తుంది. కాని పరలోకం నుండి భూమిపైకి దిగి వచ్చిన మెస్సీయాగా యేసును అర్థం చేసుకోవడానికి ఈ లోకజ్ఞానం ఎంతున్నా సరిపోదు. అది పరలోకజ్ఞానంతోనే సాధ్యమవుతుంది కాబట్టే పామరుడైన పేతురుకు కూడా ఆ వాస్తవం అర్ధమయ్యింది. మనిషి పుట్టుకతోనే ఆధ్యాత్మికంగా అంధుడని, అతనిలో ఆత్మీయనేత్రాలను దేవుడే తెరుస్తాడంటూ యేసుప్రభువు అత్యంత స్పష్టంగా బోధించాడు. పామరులేమో ‘ప్రభువునెరుగుతుంటే, మహాపండితులు’ఆత్మీయంగా అంధులుగా’ మిగిలిపోవడం వెనుక ఉన్న రహస్యమిదే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
రాజకీయాల కోసం కాదు: శివకుమార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 114 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ స్పందించారు. విగ్రహ ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. స్థానికులకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. కాగా శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలోని హరొబెళలో పదెకరాల భూమి కొని అతి ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ప్రతిష్టిస్తున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా విగ్రహానికి పునాది వేశారు. అయితే ఆ విగ్రహాన్ని శివకుమార్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం లేదని, అది సామాజిక అవసరాలకు ఉద్దేశించిందని రెవెన్యూశాఖ మంత్రి తెలిపారు. ఈ భూమిని శివకుమార్ కొనుగోలు చేయడంపై విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై శివకుమార్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో క్రీస్తు విగ్రహం లేనందున హరొబెళలో ఏసుక్రీస్తు విగ్రహం కావాలని స్థానికులు నన్ను కోరారు. నేను సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. ఇచ్చిన మాట ప్రకారం నేను నా పని చేశాను. ఇది రాజకీయాలకు లేదా అధికారం కోసం కాదు. జీవితంలో ఆత్మ సంతృప్తి కోసం కొన్ని పనులు చేయడానికి’ అని అన్నారు. ‘నేను గ్రామీణ నియోజకవర్గానికి చెందినవాడిని, అక్కడ ప్రజలు నాకు ప్రేమ, బలాన్ని ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను వందలాది దేవాలయాలను నిర్మించాను. మూడు ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలకు, వివిధ సంస్థలకు విరాళంగా ఇచ్చారు’ అని తెలిపారు. -
విశ్వాసమే నడిపించింది
యేసు ప్రభువు ఈ లోకాన్ని విడిచిన తరువాత శిష్యులందరినీ ప్రభువు సమదృష్టితోనే చూశాడు. అయితే పేతురు. యోహానులను ఎక్కువగా ప్రేమించాడు. వారు కూడా ప్రభువుపై అచంచల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచారు. యేసుక్రీస్తు నామంతో అద్భుతాలను చేశారు. ప్రుభువుపై ఉన్న నమ్మకమే వారిని ఆ విధంగా ప్రేరేపించింది. అంతేకాని వారు తమ శక్తి చేత ఏమీ చేయలేదు. ప్రభువు నామంలో అద్భుతం ఉందని తెలిసి కూడా ఎక్కడా వారు వృథాగా యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించలేదు. అత్యవసర పరిస్థితులలో ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు, బాధ కలిగిన ప్పుడు వారు యేసు నామాన్ని విశ్వాసంతో, నమ్మకంతో పలికేవారు. అటువంటి ఉదంతం బైబిలులో ఉంది. ఒకరోజు దేవాలయంలోనికి పేతురు, యోహాను వెళుతుండగా పుట్టుకతోనే అవిటివాడైన ఒక వ్యక్తిని కొంతమంది మోసుకు వచ్చి అక్కడ దేవాలయపు మెట్లపై కూర్చోబెట్టేవారు. ఆ కుంటివాడు వచ్చి పోయే వాళ్లను చూసి ‘‘ధర్మం చేయండి బాబూ’’ అని అడిగేవాడు. సరిగ్గా అదే సమయానికి పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తుండగా వారి చూపు ఆ కుంటివాడి మీద పడింది. తదేకంగా వారు ఆ కుంటివాణ్ణి చూశారు. కుంటి వాడు కూడా వాళ్లు ఏమైనా ఇస్తారేమోనని ఆశగా, ఆబగా వాళ్లవైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు, యోహానులు ఆ కుంటివాణ్ణి చూసి ‘‘వెండి, బంగారు మా దగ్గర లేవు. మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాము’’అన్నారు. ఆ మాటకు వాడి కళ్లు విశాలమయ్యాయి. ఏదో పెద్ద బహుమతి (కానుక) ఇస్తారులే అనుకున్నాడు. పేతురు, యోహాను ఇద్దరూ ఒకేసారి ‘‘నజరేయుడైన యేసుక్రీస్తు నామంతో చెబుతున్నాము. నీవు పైకి లేచి నడుస్తావు’’అని వాడి చేతులు పట్టుకుని విశ్వాసంతో, నమ్మకంతో ప్రకటించారు. ఆశ్చర్యం! ఆ మాటకు వాడి కాళ్ల చీలమండలలో బలమునొంది దిగ్గున లేచాడు. పరుగున దేవాలయంలోనికి వెళ్లి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించసాగాడు. నమ్మకం, విశ్వాసం దైవంపై ఉంటే ఏదైనా సాధించవచ్చనేదానికి ఈ ఉదాహరణ చాలు. (అపొ.కాం. 3:1–8) – కనుమ ఎల్లారెడ్డి -
ధన్యకరమైన విశ్వాసి దానియేలు
దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నిగో అనే నలుగురు యూదు యువకుల విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ, వాళ్ళు ‘సింహాల నోళ్లు మూశారు, అగ్ని బలాన్ని చల్లార్చారు... బలహీనులైనా బలపర్చబడ్డారు’ అని బైబిల్ పేర్కొంది (హెబ్రీ 11:33.34). విశ్వాసం బలహీనుల్ని కూడా మహా బలులను చేస్తుంది. దానియేలు యుక్తవయసులో యెరూషలేము నుండి బబులోను చెరకు బానిసగా వచ్చాడు. కానీ బబులోను చక్రవర్తి దర్యావేషు అతని విశేష ప్రతిభను గుర్తించి, అక్కడి 120 మంది ఉన్నతాధికారులపైన నియమించబడిన ముగ్గురు అత్యున్నతాధికారుల్లో ముఖ్యుడుగా అంటే ప్రధానమంత్రిగా దానియేలును నియమించాడు (దాని6:1,2). ఒక యూదు బానిసకు అన్యదేశంలో దేవుడిచ్చిన అరుదైన ఆధిక్యత, గుర్తింపు ఇది. అయితే దానియేలును ఓర్వలేకపోయిన ఆ 122 మంది అధికారులు కుట్రతో ముప్పై రోజుల పాటు దేశంలో రాజును తప్ప మరెవరినీ ఆశ్రయించకూడదన్న శాసనాన్ని తెచ్చారు. దానియేలు మాత్రం తన గది కిటికీలు తెరిచి మరీ ఆ ముప్పై రోజులూ తన దేవునికి ప్రార్థించగా, అధికారుల వత్తిడి మేరకు చక్రవర్తి ఆకలితో నకనకలాడుతున్న సింహాలున్న గుహలో అతన్ని వెయ్యగా, దేవుడు అద్భుతంగా సింహాల నోళ్లు మూసివేసి అతన్ని సజీవంగా కాపాడాడు. పిదప కుట్రదారులైన అధికారులనందరినీ చక్రవర్తి అదే గుహలో వేయగా సింహాలు వారిని తినేశాయి. దానియేలు బబులోను చక్రవర్తికి విధేయుడే. కాని అతని అత్యున్నతమైన, అంతిమమైన విధేయత మాత్రం చక్రవర్తికి పైగా ఉన్న దేవునికే!! విశ్వాసాన్ని ప్రసంగాల్లో, మాటల్లో, సిద్ధాంతాల్లో ఒలకబోస్తే ప్రయోజనం లేదు. క్రైస్తవం మాటల్లో కాదు, చేతల్లో, ఆచరణలో రుజువయ్యే విశ్వాస పథం. పాత నిబంధనలోని 39 పుస్తకాల్లోనూ దైవజనులు ఎన్నెన్నో గొప్ప విశ్వాసకార్యాలు చేశారు. కాని మొత్తం పాతనిబంధనలో ‘విశ్వాసం’ అనే మాట కేవలం రెండే రెండు సార్లు వాడారు. కాని వారి మహాకార్యాలను వివరించే హెబ్రీ 11 వ అధ్యాయంలోనే, ‘విశ్వాసం’ అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు 40 వచనాల్లో 24 సార్లకు పైగా వాడాడు. విశ్వాసమనే మాటే వాడకుండా, అంతటి మహా విశ్వాసాన్ని ఆచరణలో చూపిన పాత నిబంధన కాలపు విశ్వాస వీరుల ముందు, పొద్దున్నుండి సాయంత్రం దాకా విశ్వాసం పైనే ప్రసంగాలు చేస్తూ, విశ్వాసులమని పిలిపించుకొంటూ, విశ్వాసాన్ని ఆచరణలో మాత్రం అణువంతైనా చూపలేని నేతి బీరకాయల్లాంటి మనమెక్కడ నిలుస్తాం?? సింహాల గుహలో పడ్డాక దానియేలును రక్షించే బదులు, అసలు సింహాల గుహలో పడకుండా దేవుడతణ్ణి రక్షించలేడా? అని ప్రశ్నించొచ్చు. తప్పకుండా రక్షించగలడు, కాని సీసాలోని మాత్ర శరీరంలోకి వెళ్లి రుగ్మతను పారదోలితేనే కదా దానికి విలువ? ఆచరణలో రుజువు కాని విశ్వాసానికి ఆవగింజంత కూడా విలువ లేదు. విశ్వాసాన్ని ఆచరణలో చూపలేని పిరికివాళ్ళకు, వాళ్ళెంతటివారైనా, పరలోకంలోకి ప్రవేశం లేదు.క్రీస్తు ఆచరించి బోధించిన విశ్వాసం, ప్రబోధాలు, నీతిమాటలు, సూక్తులకు అతీతమైనది. అంతటి మహత్తరమైన విశ్వాసానికి డబ్బు రూపాన్ని, లోక సంబంధమైన ఆస్తులు, విలాసాల రూపాన్నివ్వడం భ్రష్టత్వం!! సమాజంలో ఎంత ఉన్నతస్థాయి ఉంటే, ఎంత డబ్బుంటే వాళ్ళు అంత గొప్ప పరిచారకులు, విశ్వాసులనడం దౌర్భాగ్యపు వక్రీకరణ, అది కేవలం అవకాశవాదం, ఆత్మీయావగాహనా లోపం. చైనా దేశాన్నంతా సువార్తమయం చేసిన హడ్సన్ టేలర్ ఒకానొక సమయంలో పస్తులుంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ‘నా జేబులో 25 పైసలే ఉన్నాయి, కాని నా గుండెలో మాత్రం దేవుడిచ్చిన బోలెడు వాగ్దానాలున్నాయి’ అంటూ భార్యకు రాసిన ఉత్తరం ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉంది. ఆ విశ్వాసంతోనే చైనాలో టేలర్ చేసిన మహా కార్యాలు దేవుని జీవగ్రంథంలో శాశ్వతంగా లిఖించబడి ఉన్నాయి. నా వద్ద 25 పైసలే ఉన్నాయంటూ ప్రకటించిన హడ్సన్ టేలర్ కోట్లలో తేలియాడుతున్న ఈనాటి మెగా సేవకులు, సెలెబ్రిటీ ప్రబోధకులతో పోల్చితే నిరుపేదవాడే!! అయితే కేవలం విశ్వాసంతో దేవుని వాగ్దానాలు నమ్మి చైనా నిండా సువార్తను నింపిన హడ్సన్ ముందు ఈ పరిచారకులు, ప్రబోధకులవి కుప్పిగంతులే, చిరిగిన మురికి వస్త్రాలే!!! – రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు: ఆకాశధాన్యం email:prabhukirant@gmail.com -
ప్రపంచానికి వరం పునరుత్థాన శక్తి
రెండువేల యేళ్ళనాటి ఈస్టర్ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆరోజున సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయానికి పూర్వమే చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన విశ్వాసులైన కొందరు స్త్రీలకు అక్కడ తెరువబడి ఉన్న సమాధి దర్శనమిచ్చింది. శుక్రవారం నాడు అసంపూర్తిగా మిగిలిన పరిమళ క్రియల్ని యేసు దేహానికి సంపూర్తి చేసేందుకు వాళ్ళు వెళ్లారు. సమాధికి అడ్డుగా రోమా ప్రభుత్వం ఒక పెద్దబండ రాయిని పెట్టి దానికి ముద్రవేసి అక్కడ కావలి వారిని కూడా పెట్టింది. తీరా స్త్రీలు అక్కడికెళ్తే, అడ్డు రాయి తొలగించబడి ఉంది, కావలివారు లేరు, స్త్రీలలో ఒకరైన మగ్దలీనా మరియ అది చూసి కంగారుపడి పరిగెత్తుకుని వెళ్లి పేతురు, యోహాను అనే ఇద్దరు శిష్యులకు ప్రభువు దేహాన్నెవరో ఎత్తుకెళ్లారని చెప్పి వారితోపాటు మళ్ళీ వచ్చి చూసింది. సమాధిలో ప్రభువు దేహం లేదు. సమాధి చేయడానికి ముందు శుక్రవారం నాడు ఆయనకు తొడిగిన నారబట్టలు మాత్రం సమాధిలో పడి ఉన్నాయి. ఆమెకు దుఃఖం ఆగలేదు. మగ్దలీనా మరియ అక్కడే రోదిస్తుండగా ‘అమ్మా ఏడుస్తున్నావెందుకు? ఎవరికోసం వెదుకుతున్నావు?’అని ఎంతో అనునయంగా తనను అడుగుతున్న ఒక వ్యక్తి సమాధి వద్ద కనిపించాడు. చీకట్లో అతను తోటమాలీ కావచ్చనుకొని ‘అయ్యా, నా ప్రభువు దేహాన్ని నీవేమైనా మోసుకెళ్లి ఇంకెక్కడైనా పెట్టావా?’ అనడిగింది మరియ. వెంటనే ‘మరియా’ అని ఆయన పిలువగా ఆయనే ప్రభువని గుర్తించి ‘రబ్బూనీ’ అంటే హెబ్రీ భాషలో ‘బోధకుడా’ అని ఆమె బదులిచ్చింది. మగ్దలీనా మరియకు యేసుప్రభువు ఆనాడు తనను తాను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్ నవశకం ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. పైగా అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశానిర్దేశం చేసి 40వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమేంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తి తో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాలదాకా నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తితోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధమయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మశక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీలోంచి గదిలోకి వస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. అపవిత్రత అంటకుండా జీవించడానికి ఆదిమ చర్చికి ఆ శక్తే తోడ్పడింది. తమకున్నదేదీ తమది కాదని, అదంతా సమిష్టి సొత్తని భావించి ఒకరిపట్ల ఒకరు అద్భుతమైన ప్రేమానురాగాలతో వాళ్ళు జీవించింది కూడా పరిశుద్ధాత్మ శక్తిగా ప్రభువు నిర్వచించి వారందరికీ భాగస్వామ్యాన్నిచ్చింది పునరుత్థానశక్తితోనే!! అదే శక్తిని కొన్నాళ్ల తర్వాత పొందిన అపొస్తలుడైన పౌలు కూడా ‘నాకు లోకసంబంధంగా లాభకరమైన వాటినన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాను. ఆయన పునరుత్థానబలాన్ని తెలుసుకోవడానికి సమస్తాన్ని మలంతో సమానంగా ఎంచుకొంటున్నాను’ అన్నది కూడా ఆ పునరుత్థాన శక్తితోనే (ఫిలిప్పి 3:7–11). ఈస్టర్ ఆదివారం ఉదయం నాటి ఈ పునరుత్థానశక్తి చేత కొత్త నిబంధన యుగపు విశ్వాసులంతా నింపబడాలన్నది యేసుక్రీస్తు అభిమతం. పౌలు పత్రికల్లో పౌలు ద్వారా తన ఈ అభిలాషను ప్రభువు వ్యక్తం చేశాడు. ప్రభువు పునరుత్థాన శక్తినెరుగని, ఆ శక్తిని పొందడం ఎంత అత్యవసరమో అవగాహన లేని చర్చి ఎంత పెద్దదైనా, ఆ చర్చిలో వేలు, లక్షలమంది విశ్వాసులున్నా అది నిర్జీవమైనదే, నిస్సారమైనదే. యేసు పునరుత్థానుడైన తర్వాత పేతురు తదితర శిష్యులకు ప్రభువు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే స్థైర్యం కరువయింది. ఎందుకంటే వాళ్లంతా ఆయన్ను వదిలేసి ప్రాణభయంతో పారిపోయారు. ఇపుడు ఏ మొహం పెట్టుకొని ఆయనతో మళ్ళీ జత కలుస్తారు? అందువల్ల పేతురు గలిలయ సరస్సులో చేపలు పట్టే పనికి మళ్ళీ వెళ్లిపోదామనంటే మిగిలిన శిష్యులు కూడా ఆయనతో వెళ్లిపోయారు. కాని యేసుప్రభువు ప్రేమతో వెళ్లి వారిని అక్కడే కలుసుకున్నాడు. గలిలయ సరస్సులో చేపలు పడుతున్న శిష్యులకు ముఖ్యంగా పేతురుకు ఆయన సాక్షాత్కారం అలా లభించింది. వారిని ప్రభువు మళ్ళీ తన పరిచర్యకు పిలుచుకొని ఈసారి వారిని తన పునరుత్థాన శక్తితో నింపి అజేయులను చేశాడు. దేవుని పేరుతో లోకంలోని మంచివాటిని సంపాదించుకో వడానికి మామూలు శక్తియుక్తులు చాలు. కానీ లోకాన్ని ఆయన ప్రేమ, క్షమాపణ, సమాధానంతో నింపడానికి మాత్రం చాలా త్యాగపూరితమైన జీవితం, పరిచర్య అవసరం. అది ప్రభువిచ్చే పునరుత్థానశక్తితోనే సాధ్యం. దేవుని పేరుతో ఎన్నెన్నో కూడబెట్టుకోవాలి అ నుకునేవారికి, దేవునికోసం అన్నింటినీ నష్టపర్చుకొని, వ్యయపర్చుకొని, పోగొట్టుకునేవారికి, లోకశక్తికి, పునరుత్థాన శక్తికి ఉన్నంత తేడా ఉంది. ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు పోవడానికి మాత్రం పునరుత్థాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ శక్తే!!! హ్యాపీ ఈస్టర్.... రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ email: prabhukirant@gmail.com స్కాట్లాండ్ దేశంలో జాన్ జి. ప్యాటన్ 13 మంది పిల్లలున్న ఒక నిరుపేద కుటుంబంలో 1824లో జన్మించాడు. చాలా చిన్నతనంలోనే ప్రభువును ఎరిగాడు. ప్రభువు పరిచర్య కోసం సిద్ధపడ్డాడు. ఇపుడు మనం వెస్టిండీస్ గా పిలుస్తున్న నల్లజాతీయులుండే ‘కెరీబియన్ దీవులకు’ తనను దయచేసి తనను పంపమని తన చర్చి ముఖ్యాధికారికి ఉత్తరం రాశాడు.‘నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్లిన మన మిషనేరీలను 19 ఏళ్ళ క్రితమే అక్కడి నరమాంసభక్షకులు చంపుకొని తిన్నారని నీకు తెలియదా? వెళ్లిన మరుక్షణమే నిన్ను కూడా వాళ్ళు చంపుకు తినేస్తారు జాగ్రత్త. కావాలంటే సురక్షితమైన, సుఖవంతమైన మరో స్థలానికి నిన్ను పంపుతాను’ అని జవాబిచ్చాడు డిక్సన్ అనే ఆ వృద్ధ మిషనేరీ. ‘కుదరదు. నేనక్కడికే వెళ్తాను. నా మృతదేహాన్ని భూమిలో పురుగులు తింటాయా, లేక నరమాంసభక్షకులు తింటారా? అన్నది నాకు చాలా చిన్న విషయం. చీకట్లో ఉన్న ప్రజలను దేవుని వెలుగులోకి తేవడమే నా జీవిత లక్ష్యం. అందుకు నాకు ప్రభువువారి పునరుత్థాన శక్తి తోడుగా ఉంటుంది. దయచేసి నన్ను అక్కడికే పంపండి’ అని ప్యాటన్ ఆయనకు మరో ఉత్తరం రాశాడు. ఎట్టకేలకు ప్యాటన్ 32 ఏళ్ళ వయసులో తన్నా అనే కెరీబియన్ దీవిలో తన భార్య మేరీతో సహా కాలుబెట్టాడు. అలా అనడం కంటే, కష్టాల కొలిమిలో కాలుబెట్టాడనడం ఉచితమేమో. నరమాంసభక్షకులైన దాదాపు 4000 మంది నల్లజాతీయులు ఆ దీవిలో ఉంటే, వారి నుండి తనను తాను రక్షించుకోవడమే తొలి రోజుల్లో అతనికి ప్రధాన వ్యాపకంగా ఉండేది. అయినా వారిమధ్య ధైర్యంగా తన పరిచర్య కొనసాగించాడు. వారికి బట్టలేసుకోవడం దగ్గరినుండి నాగరికతనంతా నేర్పించాడు. ఈలోగా ఆయన భార్య, కుమారుడు నిమోనియాతో వారం రోజుల వ్యవధిలో చనిపోతే తానుండే ఇంటిపక్కనే తానే స్వయంగా తవ్వి వారిని భూస్థాపన చేశాడు. ఎన్నో రాత్రులపాటు ఆ సమాధుల వద్ద ఒంటరితనంతో రోదిస్తూ గడిపాడు. ఇప్పటికైనా స్వదేశానికి వచ్చెయ్యమన్నారు పెద్దలు. కానీ అది మాత్రం జరగదన్నాడు. ఆ ద్వీపవాసులకు సువార్త చెబుతూనే వారి భాషను నేర్చుకొని వారి భాషకు లిపిని తయారుచేసి, ఆ లిపిని వారికి నేర్పించి ఆ భాషలోకి బైబిల్ను అనువదించాడు. అలా అక్షరాస్యతా ఉద్యమాన్ని అక్కడ ఆరంభించాడు. కెరిబియన్ దీవులన్నింటిలో అలా సువార్త ఉద్యమం, సాక్షరతా ఉద్యమం, నాగరికతా ఉద్యమం ఒకేసారి వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా ఆ దీవుల్లోని వాళ్లంతా నరమాంసభక్షణ మానేసి యేసుప్రభువు రక్షణలోకి వచ్చి దేవుని ఆరాధకులుగా మారారు. ఆయన మరణించేనాటికి అంటే 1907 నాటికి ఆ దీవులన్నీ, సువార్తతో, అక్షరాస్యతతో, నాగరికతతో నిండిపోయాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రభువువారి పునరుత్థాన శక్తితో నింపబడితే వచ్చిన విప్లవాత్మకమైన మార్పులివి. -
క్షమాపణా ద్వారానికి గుడ్ ఫ్రైడే
యేసుప్రభువు మరణించిన ‘గుడ్ ఫ్రైడే’ని లోకం చివరి అధ్యాయం అనుకుంది. కాని రెండు రోజులకేఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’తో మానవ చరిత్రలో ఒక నవ కృపాశకంఆరంభమయింది. అత్యంత ఆహ్లాదకరమైన, శాంతిభరితమైన వాతావరణానికి ‘క్షమాపణ’ మన జీవితంలో ద్వారం తెరుస్తుంది. యేసుప్రభువు ప్రబోధాల నిండా ఆయన ప్రేమ, క్షమాపణే నిండి ఉన్నా, సిలువ వేయబడేందుకు ముందు రాత్రి జరిగిన పస్కా విందులోనే ప్రభువు క్షమాపణా ఉద్యమం ఆచరణలో ఆరంభమైంది. ఆయన తన ద్రాక్షారసం గిన్నెలో రొట్టె ముక్కలు ముంచి తనకు ద్రోహం చేసిన ఇస్కరియోతు యూదాతో సహా శిష్యులందరికీ ఇచ్చాడు. ఇది యూదుల సామాజిక ఆచారం. ఒక వ్యక్తిని క్షమించినపుడు ఆ వ్యక్తి, అవతలి వ్యక్తిని తాను క్షమించానని తెలియ జేస్తూ ద్రాక్షారసంలో ముంచిన రొట్టెముక్కను అందరి సమక్షంలో అతనికిస్తాడు. ఆ క్షణం నుండి వారి మధ్య వైరానికి తెర పడుతుంది. మేడగదిలో జరిగిన పస్కా విందులో అదే జరిగింది అదే. లోకానికంతటికీ క్షమాపణను ప్రసాదించిన సిలువ యాగానికి ముందు యేసుప్రభువు ఆ ఉద్యమాన్ని తన శిష్యులతో ఆరంభించాడు. ఎందుకంటే కొద్దిగంటల్లోనే వాళ్లంతా తనను వదిలేసి పిరికిపందల్లాగా పారిపోనున్నారు. ఇక ఇస్కరియోతు యూదా అనే శిష్యుడైతే ముప్పై వెండినాణేలకు అమ్మేసి ప్రభువుకు ద్రోహం చేసేందుకు అప్పటికే యూదు మతాధికారులతో ఒప్పందం చేసుకున్నాడు. ఎంతైనా ఇస్కరియోతు యూదా యెరికోలోని ఒక వ్యాపారస్థుని కొడుకు కదా, తన వ్యాపార లక్షణం పోనిచ్చుకోలేదు. వస్తువులమ్ముకొని లాభం గడించినట్టే యేసుప్రభువును కూడా అమ్మేస్తే తప్పేమిటి? అన్నది అతని ‘లాజిక్’!! యూదా కుట్రమేరకు అర్ధరాత్రిపూట గెత్సేమేనే తోటలో యేసుప్రభువును నిర్బంధించిన రోమా సైనికులు ఆయన్ను మొదట ప్రధాన యాజకుడైన కయప ఇంటికి, ఆ తర్వాత తెల్లవారిన తర్వాత తీర్పు కోసం పిలాతు మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు ఒకరిద్దరు మినహా శిష్యులంతా పారిపోయారు. అయితే యేసుప్రభువు మాత్రం ఒంటరివాడు కాలేదు. అంతటి శ్రమల్లోనూ ఆయన తన పరలోకపు తండ్రితో నిరంతర సహవాసంలోనే ఉన్నాడు. అందుకే తనను హింసిస్తున్న వారినందరినీ క్షమించమంటూ సిలువలో వేలాడుతూ కూడా పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు. తనతోపాటు సిలువ వేసిన గజదొంగల్లో ఒకతను తనను క్షమించమని కోరగా అతనికి పరలోక భాగ్యాన్ని కూడా ప్రభువు ప్రసాదించాడు. యేసుప్రభువును అమ్ముకొని కూడా డబ్బు సంపాదించాలనుకున్న యూదా ఇస్కరియోతు మాత్రం ఆ రోజే ఉరివేసుకొని చనిపోయి నరకానికెళ్లాడు అందువల్ల ఆనాటి గుడ్ ఫ్రైడే ఇస్కరియోతుకు ఒక ‘బ్యాడ్ ఫ్రైడే’.. కాని చివరి నిముషంలో మారుమనస్సు పొంది ప్రభువును ఆశ్రయించి ఆయన కృపతో పరలోకానికెళ్లిన ఆ గజదొంగకు మాత్రం అది నిజంగా గుడ్ ఫ్రైడే, ప్రభువు శిష్యుడు, గొప్ప మేధావి అయి ఉండి కూడా యూదా నరకానికెళ్లడమే నాటి గుడ్ ఫ్రైడే లో నిజమైన ట్రాజెడీ,ఆనాటి యూదు మతాధికారులు, రోమా పాలకులు కసికొద్దీ యేసుప్రభువును శారీరకంగా, మానసికంగా హింసించినా, అంతటి శ్రమలో కూడా శరీరం, మనసు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన్ను చంపానని లోకం విర్రవీగింది. కానీ వాస్తవానికి ఆయనే తన ఆత్మను తండ్రికి అప్పగించడం ద్వారా స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేశాడు, యేసుప్రభువు జీవితానికి లోకం ‘గుడ్ ఫ్రైడే’ చివరి అధ్యాయం అనుకుంది.. కాని రెండు రోజులకే ఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’ తో ఒక మానవ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం, నవ కృపాశకం ఆరంభమయింది. ఒక చెంపను కొట్టిన వ్యక్తి దవడ పళ్ళన్నీ రాలగొట్టాలనే ఈ లోకపు ప్రతీకార సిద్ధాంతం ఎంత బలహీనమైనదో సాత్వికత్వం, సరళత్వం, శాంతిపథం ఎంతటి శక్తివంతమైన ఆయుధాలో యేసుప్రభువు తన బోధలు, జీవితం, సిలువత్యాగం, పునరుత్థానం ద్వారా రుజువు చేశాడు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తర్వాత తన సిబ్బందితో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్ళాడు. అక్కడ ఒక మూలన కూర్చున్న ఒక అనామక వ్యక్తిని తీసుకొచ్చి తనతోపాటు కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పాడాయన. ఆ వ్యక్తి ఎంతో భయం తో వచ్చి నెల్సన్ మండేలా కూర్చున్న టేబుల్ వద్దే కూర్చున్నాడు. తెప్పించిన ఆహారపదార్థాలన్నీ భయంతో వణికిపోతూనే మౌనంగా తిన్నాడు. ఆ తర్వాత అలా భయపడుతూనే వెళ్ళిపోయాడు. దేశాధ్యక్షుడితో కలిసి కూర్చుంటే భయపడక తప్పదు కదా అనుకున్నారంతా. కాని తాను సుదీర్ఘకాలం పాటు జైలులో ఉన్నపుడు తనను అత్యంత క్రూరంగా హింసించిన జైలు గార్డు అతనని, తనను యథేచ్ఛగా హింసించిన తర్వాత కూడా కసి తీరక కొన్నిసార్లు అతను తన మొహం మీద మూత్రం కూడా పోసేవాడని మండేలా తన సిబ్బందికి తెలియజేశాడు. తాను తనను గుర్తించానని అతనికి తెలిసింది కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటానని అతను భయపడుతున్నాడని, అయితే అతనెక్కడుంటాడో, అతని కష్టాలేంటో తెలుసుకొని అతనికి తగిన సాయం చెయ్యమని, అదే తన ప్రతీకార విధానమని మండేలా ఆదేశించాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పరమదేవుని నివాస స్థలమది
మహా గోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. మన గురించి మనమేమనుకొంటున్నామన్నదానికన్నా, మన గురించి దేవుడేమనుకొంటున్నాడన్నది చాలా ముఖ్యమైన అంశం. లవొదికయలో నున్న చర్చికి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన లేఖ ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేవుని సాన్నిధ్యానికి, దేవుని ప్రసన్నతకు, పవిత్రతకు, ముఖ్యంగా దేవుని ప్రేమకు నిలయంగా దేవుడే నిర్దేశించిన స్థలం చర్చి. ఆదిమకాలంలో దేవుని ప్రేమను యేసుక్రీస్తులో సంపూర్ణంగా చవిచూసిన ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు ఆ ప్రేమనే లోకానికి ఆచరణలో చాటడానికి, ఆయన సాన్నిధ్యంలోని అనిర్వచనీయమైన ఆనందాన్ని లోకానికి రుచిచూపించేందుకు భూదిగంతాలకు వెళ్లి అనేక ప్రాంతాల్లో స్థాపించినవే ఆ చర్చిశాఖలు. అందువల్ల చర్చి దేవుని నివాసస్థలం, ఆశ్రితులు, నిరాశ్రయులు, నిరుపేదలు, సమాజంలోని బలహీనులు అక్కడి విశ్వాసుల సహవాసంలో వారి ఆదరణను, సహాయాన్ని, అనునయాన్ని పుష్కలంగా పొంది దేవుని ప్రేమను అనుభవించే పరలోకానందానికి సాదృశ్యస్థలం. అందుకే దేవుడు లవొదికయలోని చర్చికి రాసిన లేఖలో తన బాధనంతా వ్యక్తం చేశాడు. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల ప్రాపకంలో పెరిగి పెద్దవాడై, ఉన్నతవిద్యలనభ్యసించి, ఒక గొప్పసంస్థను స్థాపించి, సమాజంలో అత్యున్నతస్థానాన్ని, పేరుప్రఖ్యాతులను సంపాదించి, తన ఔన్నత్యానికి కారకులైన తల్లిదండ్రులనే చివరికి మర్చిపోతే అదెంత విషాదకరం? లవొదికయ చర్చిలో సరిగ్గా జరిగిందదే.‘నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు అని నీవనుకొంటున్నావు కాని ఎంతోకాలంగా నేను బయట నిలబడి నీ తలుపు తడుతున్నాను కాని నీవు తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించడం లేదు’ అని దేవుడు తన లేఖలో ఆహ్వానించడం లేదన్నది ఆ చర్చిపై దేవుడు చేస్తున్న అభియోగం(ప్రక 3:14–21). మన భాషలో చెప్పాలంటే సెల్ఫోన్ అదేపనిగా మోగుతుంటే, ఎవరో అవతల మన తలుపు పదే పదే తడుతూ ఉంటే మనం స్పందించకుండా ఉండగలమా? కాని ఆ స్పందనే కరువైన చర్చి లవొదికయలోని చర్చి!! అందువల్ల ఒక కార్పొరేట్ సంస్థ స్థాయికి ‘నీవు ఎదిగినా, నీకు ఎంత ధనమున్నా నీవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవే. ఎంతో సింగారంగా దుస్తులు ధరించుకున్నా పవిత్రత లేని దిగంబరివే. నీకు లోకమంతా ఎరిగిన జ్ఞానమున్నా నీది దైవత్వాన్ని ఎరుగని అంధత్వమే !!’ అని వాపోతున్నాడు దేవుడు. లోకాన్నంతా లోపలి తెచ్చుకొని అన్నింటికీ కారకుడైన దేవుణ్ణి మాత్రం తలుపు అవతల పెట్టిన ‘దేవుడే లేని చర్చి’ అది. అంతకన్నా మరో విషాదం ఉంటుందా?ఎన్ని ఉన్నా, అది దేవుడు లేని చర్చి అయినా, కుటుంబమైనా, విశ్వాసి అయినా వాళ్ళు ఏమీ లేనివారికిందే లెఖ్ఖ!! మహాగోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. చర్చిని చందాలతో కాదు, విశ్వాసుల సాక్ష్యంతో, వారి ప్రేమపూర్వకమైన పరిచర్య, క్రియలు, త్యాగంతో నిర్మించాలి. అలాంటి చర్చి యేసుక్రీస్తు పునరాగమనానికి లోకాన్ని సిద్ధం చేస్తుంది. చర్చిని ఆదిమ అపొస్తలులు స్థాపించడంలో ఉద్దేశ్యం కూడా అదే!! యేసుక్రీస్తు ప్రేమను, త్యాగాన్ని, కృపను చర్చి తన పరిచర్య ద్వారా లోకానికి పరిచయం చేసి ఆయన రెండవ రాకడకోసం లోకాన్ని సిద్ధం చేయాలన్నదే చర్చి ముఖ్య లక్ష్యం. రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రభువా.. మన్నించు!
సాక్షి ప్రతినిధికడప: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి క్రిస్మస్ రోజున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసు వర్ధంతి రోజు క్రిస్మస్ జరుపుకుంటారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మాజీ మంత్రి వీరారెడ్డి మృతి రోజు ఏసు వర్ధంతి రోజు ఒకటేనని సెలవు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏసుక్రీస్తు జయంతి రోజున (డిసెంబర్ 25) క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. అందులో భాగంగానే మంగళవారం బద్వేల్ పట్టణంలో మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న అమాత్యుడు ఏసుక్రీస్తు చనిపోయిన రోజే మాజీ మంత్రి వీరారెడ్డి చనిపోయారని వెల్లడించారు. వాస్తవంగా ఏసుక్రీస్తు శిలువ ఎక్కిన రోజున ‘గుడ్ప్రైడే’ నిర్వహించడం క్రైస్తవుల సంప్రదాయం. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా మంత్రికి లేదా.. లేకపోతే తాను ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతోందనే థోరణా... అని పలువురు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ‘ఎస్సీలు సక్రమంగా చదువుకోరు. పరిశుభ్రంగా ఉండరు. ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా మారరంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి అయి ఉండీ ఏమిటీ తీరు ప్రశ్నిస్తున్నారు. -
మాయమ్మ చేసిన క్రిస్మస్ కేకు
పలాసకు ఆరు మైళ్ళ దూరంలో డెబ్బై గడపలున్న మా ఊళ్లో ప్రభువును నమ్ముకున్న కుటుంబం మాదొక్కటే. దసరాకీ, గౌరీపూజకీ వడపప్పు, అరిసెలు, మెత్తటి గారెలు ఇరుగూ పొరుగు పంపిస్తే తినడమేగానీ క్రిస్మస్కు, ఈస్టర్కూ ఒక కేకుముక్కో, గులాప్పువ్వో వండి పక్కింటికీ ఎదురింటికీ పంపడానికి మాయమ్మకు సేతులొచ్చేవి కాదు. ఆ సమచ్చరం క్రిస్మసుకు ముందు పలాసా చర్చీ నుండి పాదరుగారు, సిస్టర్గార్లు ఒక రాత్రి పూట జీపులోవొచ్చి ఊరంతా నిద్రలెగిసినట్లు క్రిస్మస్ పాటలు పాడి మా ఇంటికొస్తే తెల్లటి బట్టల్లోన ఉన్న పాదరు గారిని సూడ్డానికి పక్కింటి రామారావు, ఆళ్ళావిడా ఒచ్చారు. వాళ్లు పాదరు గారితో ‘ఈ మొగుడూ పెళ్లాం మీ పండగ రోజు పిల్లడ్ని పట్టుకొని చర్చీకొచ్చీడమూ, పొద్దల్లా అక్కడే ఉండిపోయి పొద్దోయికి మీరిచ్చిన పాలుగుండ, పంచదార పట్టుకొని పార్రాడమే గాని ఒక కేకో , పండో, కాయో ఎవులకీ ఇచ్చింది లేదు’ అని చెప్పగానే మాయమ్మ , నాయిన మొఖాలు సున్నం రాసినట్లయిపోయినాయి. పాదరుగారు మాయమ్మతోటి ‘సరోజినమ్మా .. పండుగంటే సంతోషం పంచుకోవటం కదా. ఇరుగూ పొరుగుకు పండగపూట ఒక తీపో, కారమో చేసి పంపాలి. ఈ సంవత్సరం కేక్ చేసి అందరికీ పంచు’ అన్నారు. ‘దానికి తరవాని పులుసు సెయ్యడమే రాదు ఇంకా కేకు ఎక్కడ సేస్తాది’ అన్న మా నాయిన మాటలకు నవ్వీసి ‘కేక్ చెయ్యక్కర్లేదు. బజార్లో దొరుకుతుంది. కొనేసి ఊరంతా పంచండి ‘ అని సెప్పీసి పాదరుగారు ఎల్లిపోయారు. దాంతో ఈసారి క్రిస్మసుకు అరిసెలు వండీసి, మిగిలిపోయిన అరిసిల పిండిలో ఇంకొంచం నీళ్లు కలిపి పొంగడాలు సేసి, దానితోటి ఒక కేకు ముక్క కూడా ఊరంతా పంచీసి ఉన్న సెడ్డపేరును సెరిపీసుకోవాలని మాయమ్మ నాయిన అనుకున్నారు. క్రిస్మస్సుకు ఊరందరికీ పంచడానికి ఎంత కేకు కావాలని మాయమ్మ మా నాయిన ఆలోచన సేస్తే సుమారు నాలుక్కేజీలు కావాలని లెక్క తేలింది.నాలుక్కేజీల కేకు రేటెంత అని అడిగితే పలాసల కోవాకొట్టు గురుమూర్తి వందరూపాయలు సెప్పినాడు. మా నాయిన బుర్ర మీద గుడ్డేసుకుని ఇంటికొచ్చి విసయం సెప్పి, వందరూపాయల అప్పు ఇచ్చెటోడు ఇప్పుడుకిప్పుడు ఎక్కడ దొరుకుతాడని మాయమ్మనడిగాడు. మాయమ్మ అప్పుడికే తను దాసుకున్న సొమ్ముతోటి మా నాయినకొక పంచి, నాకు ఎర్ర నిక్కరు, పసుపు జుబ్బా , దానికి ఒక సీర కొనీసింది.మిగిలిన డబ్బులుకి పప్పలు సెయ్యడానికి నూని కొనీసి, ఆరబెట్టిన బియ్యము మిల్లాడించేసి రడీగా ఉన్నాది. కేక్ కొనడానికి ముప్పై రూపాయలు పట్టుకెల్లిన మా నాయిన పప్పులుడకలేదు. తెల్లారితే క్రిస్మస్సు. ఇరవై నాలుగు తేదీ రాత్రి చర్చికి ఎల్లడానికి ముందే పప్పల వంట పూర్తి చేసీసింది మా యమ్మ. ఆ రాత్రి యేసయ్య పాటలతో, కొవ్వొత్తుల కాంతులతో చర్చంతా ప్రభువు పుట్టిన గడియల్ని పండుగ సేసుకున్నాం. ఊరికి బయలుదేరుతుంటే పాదరుగారు ‘కేక్ పంచుతున్నారా లేదా’ అని మా నాయినను అడిగితే మొగమాటంగా తలూపీసి ఊరికి పారొచ్చినాము. మాయమ్మ దారంతా సణుక్కోనొచ్చింది.ఇంటికొచ్చినప్పడుకి వేకువజామైపోయింది. నేను రాగానే పడుకుండి పోయినాను. పొద్దున్న నేను లెగిసినప్పుడికి మాయమ్మ , మా నాయిన ఇద్దరూ ఇంటిలోన లేరు. కానీ ఎదురుగా నల్లటి రంగులోన కొంచం మిగిలున్న కేకు కనిపించింది. అది పెద్ద అట్ట మీద ఉంది. చాలా కేకు ఎవరో తినీసినట్లు అర్థమవుతున్నది. అంత పెద్ద కేకు ఎక్కడిది, ఎవరు తెచ్చారు అని నేను ఆలోసిస్తుంటే మాయమ్మ మొకమంతా పళ్ళు చేసుకొని లోపలికొచ్చింది. ‘ఊర్ల ఒక్కిల్లు ఒగ్గకుండా పంచీసినాను. పక్కింటి రామారావు నాలుగు ముక్కలు ఒక్కడే తినీసాడు బెగ్గురోడు’ అని ‘ఇది మొత్తం నీకే నాయినా.. తినీ’ అని అన్నాది.‘డబ్బుల్లేవని నాయిన అన్నాడు కదా.. మరిప్పుడెలగ కొన్నాడమ్మా’ పెద్ద ముక్కను తెంపి నోట్లో కుక్కుకోబోతూ అడిగాను. ‘మీరు పక్షులను చూడుడు. అవి విత్తవు, కోయవు’ అని పాదరు బైబిల్లోన మాటలు సెప్తారు కదా .. ఇదీ అలగే . మన పరిస్థితి జీపు డ్రైవరు జీవరత్నము తెలిసిన నలుగురికీ సెప్పితే, చర్చిలోనే కలిగినోళ్లందరూ నాలుగు డబ్బులేసుకొని కొవాకొట్టులోన డబ్బులు కట్టి జీవరత్నము తోటే తెల్లవారినప్పుడుకి పంపించినారు. మీ నాయన అరిసిలు, కేకు ముక్క పట్టుకొని జీవరత్నంఇంటికే బయల్దేరినాడు. ఈ ఊర్ల యేసును నమ్ముకున్న ఒక్క కుటుంబము మనది. ఉన్న రెండు పండుగలూ జరుపుకోలేని జరుగుబాటు మనది. ఈ సమ్మచ్చరం మనము సక్కగా క్రిస్మస్సుసేసుకున్నట్లు సేసిన ఆల్లందరూ సల్లగుండాలని ప్రార్ధన సెయ్యు నాయినా’ అని సెప్పింది మా యమ్మ. నేను గోడకున్న ప్రభువు ఫొటో ఉన్న కాలెండర్ దుక్కు సూసి, సిలువ గుర్తు ఏసుకుని .. కళ్ళు మూసుకుని ఆమెన్ అనుకున్నాను. - కె.వి. కరుణకుమార్ -
క్రిస్మస్కు.. ఆ ఆరు ప్రాంతాలు
క్రైస్తవులు తమ దేవుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును స్మరించుకుంటూ జరుపుకునే క్రిస్మస్ వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. డిసెంబర్ ప్రారంభమవగానే చర్చ్లు, ఇళ్లు, పలు దుకాణాలు క్రిస్మస్ హడావిడితో నిండిపోతాయి. శాంటా క్లాస్ (క్రిస్మస్ తాత) దుస్తులతో, విద్యుద్దీపాలతో అలంకరించిన క్రిస్మస్ చెట్లు, వీధివీధికి రకరకాల రంగులతో నిలిచే క్రిస్మస్ స్టార్లతో (నక్షత్రాలతో), యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి గుర్తుగా తయారు చేసే పశువుల పాక వంటి వాటితో నెలంతా సందడి నెలకొంటుంది. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా, ప్రత్యేక బహుమతులను అందించి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటారు. చాలాసార్లు ఒకే చోట క్రిస్మస్ పండుగ జరుపుకొని కొత్తదనం కొరవడితే ఇండియాలోని కింది ప్రాంతాలు మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. 1. గోవా అత్యధికంగా కతోలిక క్రైస్తవులు నివసిస్తున్న ప్రాంతం కావడంతో డిసెంబర్ మొదటి వారంలో వచ్చే ఆడ్వెంట్ నుంచే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి. పట్టణమంతా క్రిస్మస్ పూలతో (పోయిన్సెట్టియా), రంగురంగుల విద్యుద్దీపాలతో, అలంకరిస్తారు. చర్చ్లు అన్నింటి మీదా పెద్ద స్టార్లను అమరుస్తారు. బీచ్ల దగ్గర హోటళ్లు, రెస్టారెంట్లు క్రిస్మస్ గంటల మ్యూజిక్తో పాటు పలు రకాల క్రిస్మస్ వంటకాలను తయారుచేస్తారు. క్రిస్మస్ ముందు రోజు రాత్రంతా చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. 2. కేరళ చర్చ్లకు పుట్టినిల్లుగా పిలిచే కేరళలో క్రిస్మస్ను ఘనంగా నిర్వహిస్తారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్ తోమాస్ రాక తర్వాత ఇక్కడ ఈ పండుగ జరపడం ప్రారంభమయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రతి వీధిలో ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. తమ ఇళ్ల మీద కూడా స్టార్లను అమర్చి అందులో రంగులను చిమ్మే లైట్లను అమరుస్తారు. చర్చ్లలో కారోల్స్ నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు ప్రత్యేక గంటలను మోగిస్తారు. ప్లమ్ కేక్స్ను క్రిస్మస్ ప్రత్యేక వంటకంగా తయారు చేసుకుంటారు. పలు హోటళ్లలో ప్రత్యేక రాయితీలను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు. 3. మనాలి మంచు కురిసే ప్రదేశంలో క్రిస్మస్ (వైట్ క్రిస్మస్) జరుపుకోవాలన్నది మీ కోరికా..! అయితే మనాలి బెస్ట్ ఛాయిస్గా నిలుస్తుంది. హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతం తెల్లని మంచుతో పండుగను వేరే దేశంలో జరుపుకున్న అనుభూతిని అందిస్తుంది. ఇక్కడకు క్రిస్మస్కు వచ్చేవారు తమ మిత్రులు, కుటుంబ సభ్యుల మీద మంచు ముద్దలు విసురుకొని ఆనందిస్తుంటారు. పండుగ అర్ధరాత్రి జరిగే ప్రార్థనల్లో పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చలికాలంలో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రిస్మస్ను జరుపుకోవాలి అనుకునే వారు ముందుగానే హోటళ్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 4. పుదుచ్చేరి గోవాలాగే పుదుచ్చేరి కూడా క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో పట్టణంతా డిసెంబర్ ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి అలుముకుంటుంది. ఈ ప్రాంతం మీద ఫ్రెంచ్వారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో సహజంగానే వారి ఆచారాలు, వంటకాలు కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇతర ప్రదేశాలతో పోలిస్తే పుదుచ్చేరిలో క్రిస్మస్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న యేసు తిరుహృదయ బసిలికా దేవాలయంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. 5. షిల్లాంగ్ ఎక్కువ తాకిడి లేకుండా ప్రశాంతంగా క్రిస్మస్ జరుపుకోవానుకుంటే షిల్లాంగ్ అనువైన ప్రదేశం. ఇక్కడ క్రైస్తవులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ పండుగను మాత్రం ఉత్సుకతతో కొనియాడుతారు. వీధులను, చర్చ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పాటలను ఆలపిస్తూ ప్రార్థనలను చేస్తారు. 6. కొచ్చి గోవా, పుదుచ్చేరిలాగే కొచ్చిలో కూడా ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. చారిత్రాత్మకమైన చర్చ్లు ఉన్నప్రాంతం కావడంతో క్రిస్మస్ను ఇక్కడ ఘనంగా కొనియాడుతారు. అన్ని ప్రాంతాల్లోలాగే ఇక్కడ కూడా చర్చ్లను, ఇళ్లను, వీధులను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. పండుగ ముందురోజు రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు హోరెత్తుతాయి. వీధుల్లోని దుకాణాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన యేసుక్రీస్తు, ఆయన తల్లి మరియమ్మ చెక్క స్వరూపాలను అమ్ముతారు. క్రిస్మస్తో పాటు స్థానికంగా జరిగే పండుగ తోడవడంతో షాపింగ్ మాల్స్ అన్నీ ప్రత్యేక రాయితీలు కల్సిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి. కుటుంబంతో కలిసి వెళ్తే షాపింగ్కు, ఆటపాటలతో ఆనందంగా గడపడానికి ఇది ఉత్తమ ప్రదేశం. -
యేసు బోధలు ఆచరణలోనే అర్థమవుతాయి
పలాయనవాదం యేసుక్రీస్తు విధానం కానే కాదు. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్న చోటికి ఎవరైనా వెళ్లాలనుకుంటారా? చూస్తూ, చూస్తూ పులి బోనులో ఎవరైనా కాలు పెడతారా? యేసు ప్రభువయితే అదే చేశాడు. తన సొంతప్రాంతమైన గలిలయను వదిలేసి 200 కిలోమీటర్ల దూరంలోని యెరూషలేముకు వెళ్లాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు (లూకా 9:52). చాందస యూదుల నాయకత్వంలో యెరూషలేము యేసుప్రభువు పట్ల పగ, ద్వేషం, కోపంతో రగిలిపోతోంది. ఆయన్ను సిలువవేసి పగతీర్చుకోవడానికి రంగమంతా సిద్ధమైంది. గలిలయ ప్రాంతంలో ఆయన్ను సవాలు చేసేవారే లేరు. అందువల్ల యెరూషలేముకెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే, గలిలయలోనే కడుపులో చల్ల కదలకుండా ఉండి బోలెడు పరిచర్య చేస్తానని యేసుక్రీస్తు అనుకోవచ్చు. ‘రిస్క్’ తీసుకోవడమనేది లోకం దృష్టిలో చాలా తెలివి తక్కువ పని. వీలైతే మనకోసం ఇతరులను ‘రిస్క్’లో పడేయడం అనేది ఎంతో తెలివైన పని కూడా. దీనికి కొద్దిరోజుల క్రితమే, తనను వెంబడించాలనుకునే వారు తమ సిలువనెత్తుకొని తనను వెంబడించాలని, తమ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొనేవారు దాన్ని పోగొట్టుకుంటారని, ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డవారు దాన్ని కాపాడుకోగలుగుతారని ప్రభువు బోధించాడు (లూకా 9:23,24). అవతలివాళ్ళ ప్రాణాలు తియ్యడం, వారిని బాధించడం హింస అని, అలా ఇతరుల జోలికి పోకపోవడం అహింస అని లోకం నిర్వచించింది. ఆ నిర్వచనాన్నే యేసు మరో మెట్టుపైకి తీసుకెళ్లి, ఇతరులను బాధించకపోవడం, వారి జోలికి పోకపోవడం కాదు, ఇతరుల కోసం ప్రాణత్యాగం చెయ్యడమే నిజమైన ‘అహింస’ అని బోధించడమే కాదు, ఆచరణలో ఆ ‘అహింస’ ను తన జీవితంలో నిరూపించాడు. ‘మరణం’ పట్ల లోకానికున్న తప్పుడు అభిప్రాయాలన్నింటినీ యేసుప్రభువు తన బోధల్లో కొట్టిపారేస్తూ మరణానికి కూడా ఆయన సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు.‘గోధుమగింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఒంటరిదే. కానీ అది భూమిలో చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది’ అని మరణాన్ని పునర్నిర్వచించి సిలువలో ఆయనే మరణించడం ద్వారా క్రైస్తవం రూపంలో ఆయన విస్తారంగా ఫలించాడు. యేసు అనుచరులు ఆయన జీవించినట్టుగా జీవిస్తేనే యేసుక్రీస్తు చేసిన ఈ బోధలు లోకానికి చేరుతాయి, అర్థమవుతాయి. యేసుక్రీస్తు బోధల లోతు, ప్రత్యేకత, కొత్తదనం నోటిమాటలతో కాదు, జీవితంలో ఆచరణరూపంలో మాత్రమే లోకానికి అర్ధమవుతుంది. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల నుండి అక్కడి సౌఖ్యాలు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన జీవన శైలిని త్యాగం చేసి ఇండియాకొచ్చి ఇక్కడి నిరుపేదలతో కలిసి బతికి అంటువ్యాధులు, అపరిశుభ్రత, పేదరికంలో భాగం జీవించిన క్రైస్తవ మిషనరీల జీవనవిధానంలో అందుకే యేసుక్రీస్తు బోధల్లోని అహింస, ప్రేమ పరిమళించింది. వాళ్ళ జీవితం, మరణం కూడా విస్తారంగా ఫలించడానికి కారణమైంది. ప్రేమతో, త్యాగంతో, సాహసంతో యేసులాగా జీవించలేకపోతే, యేసు లాగా మరణించలేరు. యేసుప్రభువులాగా మరణించకపోతే ఆయనలాగా ఫలించలేరు. ఆధునిక చర్చి, క్రైస్తవం ఈ రహస్యాన్ని అర్ధం చేసుకోవడంలో వెనకబడింది. ఫలితంగా పవిత్రత, త్యాగం, నిరుపేదల పట్ల ప్రేమ, పారదర్శకత లోపించి విలాసాలు, తీరని ధనకాంక్ష, డిజైనర్ వస్త్రాలు, ఖరీదైన కార్లు, ఆడంబరాలు అనే ‘చెరసాల’లో బందీ అయింది ఈనాటి క్రైస్తవం!! చరిత్రలో మతమే దేవునికి బద్ధ శత్రువుగా మారిన చీకటి రోజుల్లో ప్రతిసారీ ఇదే జరిగింది. దేవుని కన్నా పూజారి లేదా పాస్టర్, దేవుని పవిత్ర బోధలకన్నా, మధ్యవర్తులు కల్పించిన ఆచారవ్యవహారాలే మిన్నగా మారిన మతమే ప్రజలకు ప్రాముఖ్యమైనపుడు సమాజంలోని నిరుపేదలు, అభాగ్యులు తీవ్రంగా నష్టపోయారు. దేవుణ్ణి వెనక్కి నెట్టి మతం ముందుకు దూసుకెళ్తున్న అత్యంత విషాదకరమైన ఇలాంటి నేపథ్యంలోనే, యేసు తన జీవితం ద్వారా, దేవుని నిష్కళంకమైన ప్రేమను బయలుపర్చి బలహీనులు, నిరుపేదలు, సామాన్యులకు చేరువయ్యాడు, మతపెద్దలకు బద్ధశత్రువయ్యాడు. ఇదంతా తెలిసి కూడా ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. నేడు క్రైస్తవం ముందున్న కర్తవ్యం కూడా ముందుకు వెళ్లడమే, తనను సంస్కరించుకొని దేవునికోసం విస్తారంగా ఫలించడమే. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
నింపాల్సింది హుండీలను కాదు... పేదల కడుపులను
అపొస్తలుడైన పౌలు తన శరీరంలో ఉన్న ఒక ముల్లును తీసెయ్యమంటూ మూడుసార్లు దేవుని ప్రార్థించాడు. అయితే దేవుడు ఆ ముల్లు తీసెయ్యలేదు కాని నా కృపను నీకిస్తాను, అదే నీకు చాలు’ అని జవాబిచ్చాడు (2 కోరి12:8,9). ప్రార్థిస్తే్త దేవుడు దేన్నైనా అనుగ్రహిస్తాడన్న అభిప్రాయం చాలామందిది. జీవితాల్లో ముళ్లు లేని వాళ్ళంటూ ఎవరున్నారు? కుదుటబడని ఆరోగ్యం, తీరని ఆర్థిక సమస్య, సఖ్యత కొరవడిన దాంపత్యం, స్థిరపడని పిల్లలు, పైకి అన్నీ ఉన్నట్టే ఉన్నా ఏదో కరువైనట్టున్న వెలితి, కుటుంబంలో అశాంతి... ఇలా ఆ ముల్లు ఏదైనా కావచ్చు. కాని ప్రార్థించినా దాన్ని తీసివేయడంలో దేవుడు జాప్యం చేస్తున్నపుడు, ఒక విశ్వాసిగా మన ప్రతిస్పందన ఏమిటి? నా ముల్లునే గనుక దేవుడు తీసేస్తే, ఇంకెంతో గొప్పగా దేవుని పరిచర్య చేసి ఉండేవాడినని అనుకొంటున్నారా? సువార్త వ్యాప్తిలో, ఆదిమ చర్చిల స్థాపనలో, కొత్తనిబంధన బైబిల్ భాగాలు రాయడంలో అగ్రగణ్యుడు పౌలు. పౌలు మూడు మిషనరీ యాత్రలతోపాటు మరెన్నో ప్రయాణాలు చేశాడు. ‘ఈ ముల్లొకటి దేవుడు తీసేస్తే ఇంకా మరెన్నో ప్రయాణాలు చేసి సువార్తను మరిన్ని వేలమందికి ప్రకటిస్తాను, ఇంకెన్నో కొత్త చర్చిలు స్థాపిస్తాను’ అని పౌలు ఒకవేళ భావించినా అందులో తప్పేముంది?. కానీ అతని ముల్లును తీసేయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఆ ముల్లే అతనిని నలుగగొట్టి ఒక విశిష్టమైన విశ్వాసిగా తీర్చిదిద్దుతుందని దేవునికి తెలుసు, దేవుడిచ్చిన కృప ద్వారా పౌలుకు కూడా కాలక్రమంలో అది అర్థమయింది. అదే దేవుని సార్వభౌమత్వం అంటే. మనం ఏమి చెయ్యగలం? ఏమి చేస్తున్నాం? అన్నదానికన్నా మనం ఏమిటి, మన సాక్ష్యం ఏమిటి, మనం ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నామన్నదే దేవుడు మనలో నిశితంగా చూసే విషయం. విలియం కేరీ (1761–1834) మహా భక్తుడు. ఇంగ్లాండ్ దేశాన్ని వదిలేసి ఇండియాకొచ్చి ఇక్కడి భాషలు నేర్చుకొని బెంగాలీ, ఒరియా, అస్సామీస్, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లోకి పూర్తి బైబిల్ను, తెలుగులోకి కొత్త నిబంధన బైబిల్ను తర్జుమా చేయడమే కాదు, ఆయన రామాయణాన్ని కూడా హిందీలోకి అనువదించాడు.ఇండియాలో క్రైస్తవం వ్యాప్తి చేసిన మిషనేరీలకు పితామహుడు విలియం కేరీ. మనం ఏం చేశామని కాదు, మనం ఏమిటి? అన్నది దేవుడు ప్రధానంగా పరిశీలిస్తాడు.దేవుని ఈ కొలబద్ద సంక్లిష్టమైనదే కాదు, చాలా సరళమైనది కూడా. దేవుని మెప్పించడం కష్టమే కానీ దేవుని హృదయ స్పందనను తెలుసుకోగలిగితే మాత్రం అది చాలా సులువు. పొరుగునే ఆకలితో అలమటిస్తున్న పేదకుటుంబానికి పచ్చడి మెతుకులతో కనీసం చద్దన్నమైనా పెట్టకుండా, వంద మంది పాస్టర్లను పిలిచి వాళ్లకు విందు చేస్తే దేవుడు ప్రసన్నుడై మన ‘పరలోకపు అకౌంట్’లో బోలెడు పుణ్యం జమ చేస్తాడనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే!! కడుపారా తిని విలాసాలు అనుభవిస్తున్న వారికి దేవుని పేరిట పరమాన్నం పెట్టి, బెంజి కార్లు కొనివ్వడం కన్నా, ఒక పేదవాడి కడుపు నింపడానికి కాసింత గంజి పొయ్యడమే దేవుని దృష్టి్టలో అత్యంత విలువైన విషయం, అదే విశ్వాసికి ఆశీర్వాదాలు తెచ్చే మహా పుణ్యకార్యం. ఉన్నవాడికి ఇంకా ఇంకా తోడిపెట్టడం, దాన్ని దేవుడు హర్షిస్తాడనుకోవడం పూర్తిగా అవివేకం. చర్చిల్లో, ఆలయాల్లోని హుండీలను బంగారం, వెండి, వజ్రాలతో నింపేందుకు అత్యుత్సాహ పడే విశ్వాసులు చాలా మంది ఉంటారు, దేవునితో కాక తోటిప్రజలతో శభాష్ అనిపించుకోవడానికే వాళ్ళ తాపత్రయమంతా!! యేసుప్రభువు చెప్పిన ఉపమానంలో, గాయాలతో రోడ్డు పక్కన నిస్సహాయంగా పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి కూడా, పరామర్శించకుండా తమ దేవాలయ బాధ్యతలే ముఖ్యమనుకొని ముఖం తిప్పుకొని వెళ్లిపోయిన ఒక యాజకుడు, ఒక లేవీయుడు దేవుని ప్రసన్నతకు పాత్రులు కాలేదు (లూకా 1010:25–37). పొరుగువాడిని ప్రేమించకుండా, దేవుని కోసం మాత్రం గొప్ప కార్యాలు చేశామంటూ విర్రవీగిన చాలామంది ‘గొప్పవాళ్ళ’ పేర్లు దేవుని జీవగ్రంథంలో కనిపించకపోతే మనం పరలోకంలో అవాక్కైపోతామేమో జాగ్రత్త!! పౌలు ముల్లును దేవుడు తీసెయ్యలేదు కానీ అతనికి తన కృపను సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడు ఏ విషయాల్లో ప్రసన్నుడవుతాడన్నది, దేవుని విశిష్ట హృదయ స్పందన ఏమిటన్నది దేవుని కృప తమ జీవితాల్లో సమృద్ధిగా నిండి ఉన్నవారికి ఎప్పటికప్పుడు అర్థమవుతుంది. మన జీవితాలు దైవజ్ఞానంతో కన్నా, దేవుని కృపతో నిండినవైతే అదే నిజమైన ఆశీర్వాదం. అంతేకాదు, దేవుని ప్రసన్నుని చేసే కార్యాలు చేపట్టేందుకు దేవుని కృప వారికి శక్తినిస్తుంది. అందుకే ‘హుండీలు కాదు, పేదల కడుపులు, జీవితాలు నింపండి’ అన్నదే దేవుని నినాదం, అభిమతం. దైవకృపలో, విశ్వాసంలో ఎదిగే కొద్దీ దేవుని ఈ హృదయం విశ్వాసికి స్పష్టంగా అర్థమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మరణాన్ని జయించిన రోజు
యెరూషలేము పట్టణం శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి కూడా నిద్రపోలేదు. ఎంతో సౌమ్యుడు, సాధుజీవి, సద్వర్తనుడైన యేసుక్రీస్తును అత్యంత పైశాచికంగా సిలువకు మేకులు కొట్టి, రక్తం ఏరులై పారేలా కొరడాలతో కొట్టి చంపిన తరువాతి రాత్రులవి. అయితే ఆదివారం తెల్లవారు జామునే ఆయన పార్థివ దేహానికి సుగంధద్రవ్యాలు పూసే ఒక యూదు తంతును పూర్తిచేసేందుకు సమాధి వద్దకు వెళ్లిన మగ్దలేనే మరియ తదితర స్త్రీలకు ఆయన దేహం కనిపించలేదు. రోమా ప్రభుత్వం యూదు మతపెద్దల అభ్యర్థన మేరకు యేసును ఉంచిన సమాధికి రాజముద్రవేసి కావలి వారిని కూడా నియమించింది. ఆయన దేహాన్ని ఎవరైనా దొంగిలించుకు పోయారా? అని అంతా భయపడుతూ వుండగా, అంతలోనే యేసుప్రభువు మగ్దలేనే మరియకు కనిపించి ఆమె పేరు పిలిచి మరీ పలకరించాడు. అక్కడ సమాధిలో ఒక దూత కూడా యేసు తిరిగి సజీవుడయ్యాడన్న ‘బ్రేకింగ్ న్యూస్’ను ప్రకటించింది. యెరూషలే మంతటా ఈ వార్త దావానలంలా వ్యాపించింది. అంతా యేసు సమాధి వైపే పరుగెత్తడం ఆరంభించారు. అంతటా ఎంతో ఆశ్చర్యం, మహదానందంతో నిండిన వాతావరణం వ్యాపించింది. ఆనందం పట్టలేక పట్టణస్థులంతా ముఖ్యంగా నిరుపేదలు, సామాన్యులు, బలహీనులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆడవారికైతే వారి ఆనందానికి హద్దే లేదు. అదే ఈస్టర్ ఆదివారంగా క్రైస్తవ లోకంలో ప్రాచుర్యం పొందింది. మానవ చరిత్రలో ఆ శుక్రవారం, ఆ ఆదివారం కూడా ఎన్నటికీ మరపురానివి. మనిషిలోని దుర్మార్గం, అతని చేతిలో అసత్యంగా రూపాంతరం చెందిన ఒకప్పటి ‘సత్యం’, యేసుక్రీస్తును సిలువవేసి చంపడం ద్వారా విజయం సాధించిన రోజు శుక్రవారమైతే, యేసుక్రీస్తు అన్ని కుట్రలు, దుర్మార్గమూ, దౌర్జన్యాన్ని పటాపంచలు చేసి సమాధిని, మరణాన్నీ గెలిచి సజీవుడు కావడం ద్వారా దీనులు, పాపులు, నిరాశ్రయులందరికీ నవోదయాన్నిచ్చిన దినం ఆ ఆదివారం... యేసుక్రీస్తు మానవరూప ధారియైన రక్షకుడుగా ఈ లోకానికి తన పరమ తండ్రి ఆదేశాలు, సంకల్పాలను అమలు పర్చడానికి విచ్చేసిన దైవకుమారుడు, అంటే అన్నివిధాలా దేవుడే!!!. అలాగైతే జననానికి, మరణానికి, పునరుత్థానానికి దేవుడు అతీతుడు కదా... మరి ఇదంతా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న తప్పక రావాలి. నాలుగేళ్ల ఒక బాలుడు నీళ్లు పెద్దగాలేని ఒక బావిలో పడ్డాడు. అయ్యో అంటూ బోలెడు జనం బావి చుట్టూ గుమి కూడారు. అంతా ఎవరికి తోచినట్టు వారు వాడికి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సలహాలిస్తున్నారు. వాడసలే భయకంపితుడై ఉన్నాడు. పైగా పసితనం, అంతా గందరగోళం.. గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంతలో ఒకాయన బావి వద్దకొచ్చి లోనికి తొంగి చూచాడు. వెంటనే అక్కడున్న ఒక తాడు తన నడుముకు కట్టుకొని అక్కడున్నవారితో తనను లోనికి దించమన్నాడు. అతన్ని చూసి పిల్లాడు మహదానందంతో డాడీ అని గట్టిగా అరిచి తండ్రిని కరిచి పట్టుకున్నాడు. తండ్రి కూడా వాడిని చంకకేసుకొని గట్టిగా కరుచుకొని, తమను పైకి లాగమన్నాడు. పిల్లాడు బావిలో పడిపోతే అందరికీ సానుభూతే!! కాని పర్యవసానాలోచించకుండా చనిపోయేందుకు కూడా తెగించి కొడుకును కాపాడుకునే శక్తి ఒక్క తల్లి, తండ్రి ప్రేమకు మాత్రమే ఉంటుంది. శుక్రవారం నాడు సిలువలో అదే జరిగింది. పాపిని కాపాడేందుకు పరమతండ్రి కుమారుడిగా, రక్షకుడుగా చనిపోయేందుకు కూడా సిద్ధపడి యేసుప్రభువు బావిలోకి దూకాడు. నేను చనిపోయినా ఫరవాలేదు, నా కొడుకు బతికితే చాలు అనుకునేదే నిజమైన తండ్రి ప్రేమ. పరమతండ్రిలో ఆయన అద్వితీయ కుమారుడు, కుమారునిలో పరమ తండ్రి సంపూర్ణంగా విలీనమైన అపారమైన ప్రేమ ఆ దైవత్వానిది. బావిలోనుండి కొడుకుతో సహా బయటికొచ్చిన సమయమే యేసు మరణాన్నీ గెలిచి సజీవుడైన ఈస్టర్ ఆదివారపు నవోదయం. యేసు సజీవుడయ్యాడన్న వార్త యెరూషలేములో ప్రకంపనలు రేపింది. యేసుమరణంతో విర్రవీగి రెండు రోజులపాటు మీసాలు మెలేసిన చాందస యూదుమతాధిపతులకు ఇపుడు ఏం చేయాలో తోచడం లేదు. యేసు శిష్యులు ఆయన మృతదేహాన్ని దొంగిలించారంటూ డబ్బిచ్చి వదంతులు సృష్టించబూనారు. అయితే ఎప్పుడూ సత్యం ముందు అసత్యం వెలవెల బోతుంది. ఆయన సజీవుడైన రోజు తర్వాత సరిగ్గా 50 రోజులకు పెంతెకొస్తు అనే పండుగ నాడు వందలాదిమంది తన అనుచరులు చూస్తుండగా యేసుప్రభువు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అలా యేసు సిలువలో చనిపోవడం, మూడవనాడు సజీవుడు కావడం, మళ్ళీ పెంతెకొస్తు నాడు ఆయన ఆరోహణుడు కావడం కళ్లారా చూసిన అనుభవంతో ఆయన అనుచరుల జీవితాలు సమూలంగా పరివర్తన చెందాయి. ఆయన సజీవుడైన దేవుడు అన్న నిత్యసత్యం వారి జీవితాల్లో లోతుగా ప్రతిష్ఠితమై వారంతా ఒక బలమైన చర్చిగా శక్తిగా ఏర్పడి, ఆ తర్వాత సువార్త సత్యం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు సంసిద్ధమయ్యే ధైర్యాన్ని వారికిచ్చింది. యేసుప్రభువు దీన్నంతా ఒక చిన్న ఉదాహరణతో వివరించాడు. గోధుమగింజ ఫలించాలంటే, అది నేలలో ముందుగా చావాల్సి ఉంటుందని యేసు ఒకసారి అన్నాడు (యోహాను 12 :24 ). మొక్కగా పునరుజ్జీవనం పొందే ముందు విత్తనం నేలలో అనుభవించే ప్రక్రియను ఆయన మరణంతో పోల్చాడు. మొలకెత్తి పెద్దదైన తర్వాత నేలను తవ్వి చూసినా ఆ విత్తనం కనిపించదు. విత్తనంగా అది తన గుర్తింపును కోల్పోవడం ద్వారా ఒక మొక్కగా రూపించబడి ఎన్నో ఫలాలిచ్చే ఆశీర్వాదస్థితికి చేరుతుంది. మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్ అనుభవం. యేసుప్రభువు నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని అని కూడా ప్రకటించి, తానన్నట్టే చనిపోయి తిరిగి లేవడం ద్వారా తానే జీవాన్నని రుజువు చేసుకున్నాడు. తనలాగే విశ్వాసులు కూడా పురుత్థానం చెంది పరలోకంలో తమ దేవుని సహవాసంలో నిత్య జీవితాన్ని పొందుతారని ప్రభువు బోధించాడు. మొక్కగా పునరుజ్జీవనం పొందే ముందు విత్తనం నేలలో అనుభవించే ప్రక్రియను ఆయన మరణంతో పోల్చాడు. మొలకెత్తి పెద్దదైన తర్వాత నేలను తవ్వి చూసినా ఆ విత్తనం కనిపించదు. విత్తనంగా అది తన గుర్తింపును కోల్పోవడం ద్వారా ఒక మొక్కగా రూపించబడి ఎన్నో ఫలాలిచ్చే ఆశీర్వాదస్థితికి చేరుతుంది. మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్ అనుభవం. – రెవ.డా.టి.ఎ.ప్రభు కిరణ్ -
క్రీస్తుపై చెక్కుచెదరని గాంధీ లేఖ.. భారీ డిమాండ్
వాషింగ్టన్ : జీసస్పై భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు మహాత్మాగాంధీ రాసిన లేఖకు భారీ డిమాండ్ పెరగనుంది. అమెరికాలోని పెన్సిల్వానియాలో ఇప్పుడు ఆ లేఖను వేలానికి పెట్టారు. దానికి ఇప్పుడు దాదాపు రూ. 32,63,250.00 (50 వేల డాలర్లు) రానున్నాయి. గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు 1926, ఏప్రిల్ 6న మహాత్మాగాంధీ ఈ లేఖ రాశారు. ఒక రకమైన ఇంకుతో పెద్ద అక్షరాల్లో ఆయన ఈ లేఖను రాశారు. ఆయన సంతకం కూడా ఆ లేఖలో ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. పెన్సిల్వానియాకు చెందిన రాబ్ కలెక్షన్ అనే సంస్థ ఈ లేఖను సేకరించింది. ఈ లేఖలో ఏసు క్రీస్తు గురించి గాంధీ ఒక్క వాక్యంలో 'సహృదయంగల బోధకులందరిలో కెల్లా క్రీస్తు గొప్ప బోధకుడు' అని గాంధీ పేర్కొన్నారు. ఆయన ఈ లేఖను అమెరికాలోని తన మిత్రుడు మిల్టన్ న్యూబెర్రీ ఫ్రాన్ట్జ్కు రాశారు. గాంధీ రాసిన లేఖల్లోనే ఇది అత్యుత్తమమైన లేఖ అని రాబ్ కలెక్షన్ సంస్థ పేర్కొంది. -
లెంట్లో దేవునితో సాన్నిహిత్యం
యేసుక్రీస్తుకు ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఉంది. ‘దేవుడు మనకు తోడు’ అని దానర్థం. దేవుడెప్పుడూ భక్తులకు తోడుగానే ఉంటాడు కదా! యేసుకు ప్రత్యేకంగా ఆ పేరు ఎందుకొచ్చింది? ‘తోడు’ అంటే విశ్వాసికి ఎంతో చేరువలో ఉండే దేవుడని అర్థం. విశ్వాసులకు, భక్తులకూ దూరంగా అక్కడెక్కడో ఉండే దేవుడు యేసురూపంలో మానవాళికి అత్యంత చేరువగా వచ్చి, వారితోనే కొద్దికాలం నివసించి, వారికష్టసుఖాల్లో పాలు పంచుకొని వారిలాగే అన్ని కష్టాలూ అనుభవించిన దైవకుమారుడని ఆయనకు పేరు. దేవుడిలా మనిషికి చేరువ కావడం పక్కన పెడితే, విశ్వాసి దేవునికి దగ్గరయ్యే కొన్ని మార్గాలను బైబిలు సూచించింది. ఈ నలభై రోజులూ చాలామంది క్రైస్తవులు ఎంతో నిష్ఠగా, పవిత్రంగా ఆచరించే ‘లెంట్’ అంటే ఉపవాస దీక్ష అందుకు ఉద్దేశించినదే!! ఈ ఉపవాస దీక్షను ఎంత కఠోరంగా, ఎంత నిష్ఠగా ఆచరించామని కాకుండా, దీక్ష కారణంగా దేవునికి ఎంత దగ్గరమయ్యామన్నది ప్రాముఖ్యం. ఎక్కడో అమెరికాలో ఉంటున్న కొడుకు తమ దగ్గరికి వచ్చేస్తున్నానని చెబితే తల్లిదండ్రులు ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోతారో, ‘లెంట్’ అసలు ఉద్దేశ్యం నెరవేరే విధంగా ఆ దీక్షను ఆచరిస్తే, విశ్వాసి ఆ విధంగా తనకు చేరువ కావడం చూసి దేవుడు కూడా అంతే ఆనందిస్తాడు. సొంతింటికి రావడంలో కొడుకు ఉద్దేశ్యం ‘అమ్మానాన్నా నాకు మీరే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులు’ అని చెప్పడమే కదా! ‘లెంట్’లో చేసే ఉపవాస దీక్ష కూడా దేవునికి అదే మాట చెప్పకనే చెబుతుంది. కొన్ని గంటల కోసం ఆహార పానీయాలు మానడమే, మాంసాహారాన్ని తాత్కాలికంగా త్యజించడమే ఉపవాసమనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. ‘లెంట్’ కాలంలో దేవుని వాక్యాన్ని చదవడం కాదు, శ్రద్ధతో ధ్యానం చేయాలి. లోకంలో నిమగ్నమై లోకానందం కోసం అప్పటిదాకా చేసిన పనుల స్థానంలో దేవుని కోసం చేసే పనులు చేపట్టాలి. ఎవరితోనైనా మనస్పర్థలు, పగలు, కోపాలుంటే అవి అలాగే పెట్టుకొని ఉపవాసం చేయడం వ్యర్థమైన పని. గిన్నెను శుభ్రంగా తోమకుండా ఎంగిలి గిన్నెలోనే వంట చేయడంతో సమానమది. క్షమాభావం, పొరుగు వారు, పేదల పట్ల ప్రేమ వ్యక్తం చేసే రోజులుగా లెంట్ దినాలుండాలి. ఎంత భోజనాన్ని దేవుని కోసం వదిలేస్తామో అందుకు పదిరెట్ల భోజనం మన కారణంగా నిరుపేదలు తినగలిగితే, దేవునికి మనం నిజంగా చేరువైనట్టే! ఉపవాస దీక్షను ఒక తంతులాగా, ఆచారంగా కాదు, ఎంతో నిష్ఠ, దేవుని పట్ల ప్రేమతో చేస్తే దేవునికి చేరువవుతాం. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆత్మసౌందర్యాన్ని ఆస్వాదించే దేవుడు
యేసుక్రీస్తు ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్లాడు. ‘దేవాలయపు రాళ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అక్కడి అలంకరణలు చూడండి’ అంటూ అంతా దేవాలయ సౌందర్యాన్ని ప్రభువుకు వర్ణించి చెబుతున్నారు. దేవాలయం గొప్పదనాన్ని దేవునికే వర్ణించి చెబుతున్న కొందరు భక్తుల సాహసమిది. కాని ఎంత గొప్పది, అందమైనదైనా దేవాలయం దేవునికన్నా గొప్పదెలా అవుతుంది? యేసు వారికి జవాబు చెబుతూ, ‘ఈ దేవాలయమంతా ధ్వంసమై పాడుదిబ్బగా మారే రోజొకటి రాబోతోంది, అప్పుడు ఇంత అద్భుతమైన రాళ్లూ ఒకదాని మీద మరొకటి నిలవకుండా పడదోయబడ్తాయంటూ ప్రవచనం చెప్పాడు. ఆ తర్వాత దాదాపుగా 45 ఏళ్లకు అంటే క్రీస్తు శకÆ 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి దేవాలయన్నాంతా ధ్వంసం చేశాడు. దేవాలయ నిర్మాణంలో భక్తి కొద్దీ రాయికీ రాయికీ మధ్య బంగారాన్ని కరిగించి నింపగా, టైటస్ చక్రవర్తి ఒక్కొక్క రాయీ తొలగించి రాళ్లమధ్యలో ఉన్న బంగారాన్నంతా వెలికితీయించి దోచుకుపోయాడు. యేసు చెప్పిన మాటలు అలా అక్షరాలా నెరవేరాయి (లూకా 21:5–9). దైవకుమారుడైన యేసు సౌందర్యాన్ని ఆస్వాదించడా? ఆయన సృష్టించేదీ, ఆస్వాదించేదీ బాహ్యసౌందర్యాన్ని కాదు, ఆత్మసౌందర్యాన్ని. ఇది జరగడానికి ముందు ఆయన దేవాలయంలో కానుకల పెట్టె దగ్గర కూర్చొని, అందులో పెద్దమొత్తాల్లో కానుకలు వేసి అక్కడి యాజకుల ద్వారా గొప్పదాతలుగా ప్రకటనలు చేయించుకుంటున్న చాలామంది భక్తుల డాబూదర్పాన్ని, వేషధారణను, పైకి ఎంతో గౌరవంగా కనిపిస్తున్నా ఆంతర్యంలో గూడుకట్టుకొని ఉన్న వారి మాలిన్యాన్ని, పాపపు కంపును ఆయన అర్థం చేసుకున్నాడు. అంతలో ఒక పేద విధవరాలు తన వద్ద ఉన్న రెండే రెండు కాసులనూ ఎంతో రహస్యంగా వేసి నిశ్శబ్దంగా వెళ్లిపోగా ఆమె ఆత్మసౌందర్యం, అంతరంగంలో దేవుడంటే ఆమెకున్న ప్రేమ యేసును ముగ్ధుణ్ణి చేసింది. ఆమె అందరికన్నా అధికంగా కానుక వేసిందని, అయినా తమ సమృద్ధిలో నుండి దేవునికి అర్పిస్తే, తానే లేమిలో ఉండి కూడా ఆమె తనకు కలిగినదంతా దేవునికిచ్చిందని ప్రభువు శ్లాఘించాడు (లూకా 21:1–4). భక్తులకూ, ఆయన శిష్యులకూ దేవాలయపు రాళ్లలో, అలంకరణల్లో సౌందర్యం కనిపిస్తే, యేసుకు ఒక పేద భక్తురాలి త్యాగంలో ఆమె వేసిన చిరుకానుకలో ‘ఆత్మసౌందర్యం’ కనిపించింది. గొప్ప కానుకలు వేసిన వారికి యాజకుల మన్ననలు, మెప్పు లభించాయి. రెండే కాసులు వేసిన పేద విధవరాలికి ఏకంగా దేవుని ప్రశంసే లభించింది. గొప్ప కానుకలు వేసిన భక్తులు, వారిని ప్రశంసించిన యాజకులూ కాలక్రమంలో చనిపోయారు, దేవాలయమే కొంతకాలానికి ధ్వంసమైంది. కాని ఆ పేద విధవరాలి చిన్న కానుక మాత్రం క్రీస్తు ప్రశంస కారణంగా చరిత్రపుటల్లోకెక్కి ఇన్నివేల ఏళ్ళుగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. దేవుణ్ణి మెప్పించేది అనిత్యమైన కానుకలు కాదు, శాశ్వతమైన ఆత్మసౌందర్యమన్నది మరోసారి రుజువైంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చేతి రాతతో బైబిల్...
విశ్రాంత జీవితానికి కొత్త అర్థాన్ని చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓరుగల్లు వాసి వడ్డేపల్లి గోపాల్. చేతి రాతతో తెలుగులో బైబిల్ రాసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇత్తడి రేకులపై చేతితో బైబిల్ను తెలుగులో రాస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రచయితగా, గాయకుడిగా, శిల్పిగా, చిత్రకారుడిగా కూడా రాణిస్తున్నారు. వరంగల్లోని రంగంపేటకు చెందిన వడ్డేపల్లి కనకయ్య–పార్వతమ్మ దంపతుల కుమారుడు గోపాల్ 1948లో జన్మించారు. రంగంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకు చదువుకు న్నారు. 1982లో వరంగల్ కేఎంసీలో అటెండర్గా చేరారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లా మహాముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా 2006లో ఉద్యోగ విరమణ పొందారు. క్రైస్తవుడైన గోపాల్ బైబిల్ను పలుసార్లు పఠనం చేయడం ప్రారంభించారు. దీంతో చేతితో బైబిల్ను రాయాలనే సంకల్పించారు. 18 నెలలు..1,029 పేజీలు.. 1,029 పేజీల బైబిల్ను పలుమార్లు చదివిన తర్వాత చేతితో రాయాలని నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ను చిరిగిపోకుండా తీసుకుని.. చదివే వీలుగా బట్టర్ పేపర్ను మధ్యలో ఏర్పాటుచేశారు. సుమారు 20 కిలోల బరువుతో 1,029 పేజీల పుస్తకాన్ని ప్రత్యేకంగా బైండింగ్ చేయించారు. 2011 జనవరిలో బాల్పాయింట్ పెన్నుతో రాయడం ప్రారంభించి.. 2012 జూన్ 13న బైబిల్ను పూర్తి చేశారు. యేసు క్రీస్తు మాటలు ఎరుపు రంగు, కీర్తనలు ఆకుపచ్చ రంగు, ప్రకటన గ్రంథం నీలి రంగు, రాజుల మొదటి గ్రంథం నలుపు రంగు, దిన వృత్తాంతం వయిలెట్, హీజ్కీయా గ్రంథం ముదురు నీలి రంగులో అందించారు. గోపాల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో 626 పాటలు, 26 మంది రచయితలను పరిచయం చేశారు. ఇత్తడి రేకులపై బైబిల్.. ఎగ్జిక్యూటివ్ పేపర్తో రూపొందించిన బైబిల్ కాలగమ నంలో పాడైపోతుందని భావించిన గోపాల్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నీళ్లు, నిప్పులో పడినా పాడైపోకుండా ఉండేందుకు ఇత్తడి రేకులపై బైబిల్ రాయాలని నిర్ణయించారు. 2017 జూన్ నుంచి ఇత్తడి రేకులపై బాల్పాయింట్ పెన్నుతో బైబిల్ను రాస్తున్నారు. గోపాల్ రాసిన గ్రంథాలు.. గోపాల్ సంఖ్యల ప్రాధాన్యత అనే పుస్తకాన్ని 2010లో రచించారు. యేసేబు కన్నకలలు ఇతి వృత్తంతో 2014 లో కలవరం అనే పుస్తకానికి నాంది పలికారు. 2015లో నయమాను కుష్టు రోగి, 2016లో ప్రార్థన మరియు కృప అంశాలు అనే పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం ఆత్మ అనే పుస్తకాన్ని రాస్తున్నారు. – కాజీపేట అర్బన్ భవిష్యత్ తరాల కోసం.. భవిష్యత్ తరాల కోసం ఇత్తడి రేకులపై బైబిల్ను రాస్తున్నా. చేతితో బైబిల్ను రాయడం దైవ సంకల్పం. చేతితో రాసిన బైబిల్ను వీక్షించేందుకు వరంగల్లోని రంగంపేటను సందర్శించవచ్చు, వివరాలకు 9491065030లో సంప్రదించవచ్చు. – గోపాల్, చేతిరాత బైబిల్ సృష్టికర్త -
జీసస్ బోధనల పురాతన ప్రతి లభ్యం
లండన్: ఏసుక్రీస్తు తన సోదరుడు జేమ్స్కు చేసిన రహస్య బోధనలకు సంబంధించి అసలైన గ్రీకు ప్రతుల్ని పరిశోధకులు కనుగొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆర్కైవ్స్లో వీటిని గుర్తించారు. ఈ పురాతన రాత ప్రతుల్లో పరలోక రాజ్యము, భవిష్యత్తు సంఘటనలు, జేమ్స్ అనివార్య మరణం గురించి ఏసుక్రీస్తు బోధనలున్నాయి. అయితే బైబిల్ కొత్త నిబంధన కూర్పు సమయంలో అందులోని 27 అధ్యాయాల సరసన వీటిని చేర్చలేదు. 1945లో ఎగువ ఈజిప్టులో తవ్వకాల్లో కాప్టిక్(ఈజిప్టు) భాషలో ఇలాంటి ప్రతులే దొరికినా... ప్రస్తుతం గ్రీకు భాషలో అసలైన ప్రతులు లభ్యమైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఐదు, ఆరు శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్న వీటిని ఈ ఏడాది ప్రారంభంలోనే గుర్తించారు. -
‘యేసుక్రీస్తు ఫొటో తీసేసి.. జిన్ పింగ్ ఫొటో పెట్టుకోండి..’
బీజింగ్ : ప్రభుత్వం పేదలకు అందించే ప్రయోజనాలు కావాలంటే ఇంట్లో గోడకు ఉన్న యేసుక్రీస్తు ఫొటోను తీసేసి.. ఆ స్థానంలో అధ్యక్షుడు జిన్ పింగ్ ఫొటోను పెట్టుకోవాలంటూ దేశంలోని క్రిస్టియన్లకు చైనా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు చైనాలోని యుగాన్ కౌంటీలోని క్రిస్టియన్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు ‘యేసుక్రీస్తు మిమ్మల్ని పేదరికం నుంచి బయటకు తేలేరు. కేవలం చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. మిమ్మల్ని ధనికులుగా మార్చుతుంది. మీ అవసరాలను తీర్చగలుగుతుంది. కాబట్టి అందరూ మీ ఇళ్లలో ఉన్న యేసుక్రీస్తు ఫొటోలను తీసేసి.. జిన్ పింగ్ ఫొటోను ఆ స్థానంలో పెట్టండి.’ అని సూచనలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 11 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. అందులో సింహభాగం(10 శాతం) మంది క్రిస్టియన్లే. దీన్ని అదనుగా తీసుకున్న చైనా ప్రభుత్వం.. క్రిస్టియన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వారిని పేదరికం నుంచి బయటకు తెస్తామని, యేసుక్రీస్తు ఫొటోలను ఇళ్లలో నుంచి తొలగించి జిన పింగ్ ఫొటోలు పెట్టుకోవాలని కోరుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనతో ఇప్పటికే 624 క్రిస్టియన్ కుటుంబాలు ఇళ్లలో నుంచి జీసస్ ఫొటోలను తొలగించాయి. అందులో 453 కుటుంబాలు క్రీస్తు ఫొటోలను ఉంచిన స్థానంలో జిన్ పింగ్ ఫొటోలను పెట్టినట్లు చైనా పత్రికలు ప్రచురించాయి. లక్ష్యం పేరుతో : 2020 కల్లా దేశంలో పేదరికాన్ని సమూలంగా అంతమొందించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందుకోసం చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన నేతలు దేశవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగమే ఈ ఫొటోల మార్పిడి. క్త్రైస్తవ ప్రభావం ఎక్కువ కలిగిన ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ నేతలు విస్తృతంగా తిరుగుతున్నారు. హ్వాన్జిబూ అనే ప్రాంతంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్వి యాన్ అనే నాయకుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నుంచి ఈ పేదరిక నిర్మూలనకు క్రైస్తవ ప్రభావం కలిగిన ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ పేదరికాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలను క్రైస్తవులకు వివరిస్తునట్లు తెలిపారు. ముఖ్యంగా జిన్ పింగ్ పేదరికంలో మగ్గుతున్న క్రిస్టియన్లను ధనికులుగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఈ విషయం స్థానిక క్రిస్టియన్లకు అర్థం అయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫొటోల మార్పిడి దేనికి.. చైనా తొలి నాయకుడు మావో జెడాంగ్. ఆయన ఫొటో లేని ఇళ్లు దాదాపు చైనాలో ఎక్కడా కనిపించవు. అచ్చూ అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో తన ఫొటో ఉండేలా చేయడానికి ‘పేదరికం’ అంశాన్ని జిన్ పింగ్ పావుగా వాడుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, మావో జెండాంగ్ తర్వాత అంతటి బలీయమైన నాయకుడిగా నిలదొక్కుకునేందుకు దేశంలోని గ్రామాలను జిన పింగ్ టార్గెట్ చేసుకున్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. -
మియా-మలాల.. మార్ఫింగ్ ఫోటో రగడ
సాక్షి, సినిమా : మియా ఖలీఫా.. యూత్కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అడల్ట్ చిత్రాల్లో నటించే ఈ నటి చుట్టూ వివాదాలు కూడా ముసురుకుంటూనే ఉన్నాయి. బుర్ఖా ధరించి నీలి చిత్రాల్లో నటించటంతో ఐసిస్ ఈ లెబనీస్ అమెరికన్ స్టార్ను చంపుతామని బెదిరించటం తెలిసిందే. దీంతో పోలీసులు కొంత కాలం ఆమెకు భద్రతా కూడా కల్పించారు. ఈ మధ్య తన ఆదాయంలో 5వేల డాలర్లను హర్వే తుఫాన్ విరాళంగా ఇవ్వగా.. అదీ వివాదాస్పదం అయ్యింది. ఇక ఇప్పుడు మరో మతపరమైన వివాదం ఆమె మెడకు చుట్టుకుంది. వర్జిన్ మేరీ ఫోటోలో ఆమె ముఖం ఎడిట్ చేసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేసింది. ఓ న్యూస్ అవుట్లెట్ పొరపాటున మలలా స్థానంలో తన ఫోటోను ఇలా ముద్రించిందంటూ సందేశం ఉంచింది. జీసస్ తల్లి మేరీ మాతగా తనను తాను చూపించుకోవటంపై మియాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. గత వారం పాక్ ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాల యూసఫ్ఝై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరగతులకు జీన్స్.. హైహీల్స్ ధరించి హాజరుకాగా.. ఆమె మలాలనా? లేక మియా ఖలీఫానా? అంటూ కొందరు కామెంట్లు చేయటం చూశాం. మరి ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఫోటోకు ఏ స్థాయిలో తిట్లు పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
శిక్షించడం కాదు... క్షమించడమే దేవుడి శక్తి
యేసుక్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యలు ఒక స్త్రీని తెచ్చి ఆయన ముందు నిలబెట్టి, ‘ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంటోంది. మరి నీవేమంటావు? అని ప్రశ్నించారు. ఆనాటి సమాజంలో పరిసయ్యలు, శాస్త్రుల దౌర్జన్యం అంతా యింతా కాదు. రానున్న కొద్దిరోజుల్లో వాళ్లు తనకు కూడా వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి సిలువ శిక్ష వేయించనున్న ఘనులని యేసుకు తెలుసు. ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమన్న స్త్రీని క్షమించమని ప్రభువంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ చేస్తున్నారంటూ ఆయన మీద నేరారోపణ చేయాలని, రాళ్లతో కొట్టి చంపండని తీర్పు చెబితే, మరి అందర్నీ క్షమించాలన్న నీ బోధ మాటేమిటని నిలదీయాలన్నది వారి పన్నాగమని ప్రభువుకర్థమైంది. అందుకే వారికి చిక్కనివిధంగా ప్రభువు జవాబిచ్చాడు. ‘‘రాళ్లతో కొట్టండి కాని ఎన్నడూ పాపం చేయనివాడు మొదటి రాయి వేయాలని ప్రభువు ఆదేశించడంతో అంతా బిత్తరపోయి ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ‘‘నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక ముందు పాపం చేయకుండా జీవించు’’ అని చెప్పి ఆ స్త్రీని ప్రభువు పంపించాడు (యోహాను 8:1–11). ఈ సంఘటన తర్వాతే ‘నేను లోకానికి వెలుగును’ అన్న అద్భుతమైన ప్రకటనను ప్రభువే చేశాడు (8:12). ప్రభువు వెలుగు కాబట్టే, ఆయన వెలుగులో ఆ స్త్రీ చేసిన పాపం మాత్రమే కాదు, ఆమె పాపి అంటూ రాళ్లతో కొట్టేందుకు సిద్ధమైన వారందరి పాప జీవితం బట్టబయలయింది. ‘తీర్పు’ చెప్పేవాడు అన్నివిధాలా నిర్దోషిగా, ఆదర్శప్రాయమైనవారిగా ఉండాలన్న కనీస సూత్రాన్ని పాటించని నాటి సమాజం, నేటి సమాజం కూడా యేసుక్రీస్తు వెలుగులో దాని డొల్లతనమంతా బట్టబయలవుతోంది. ఎంతటి కఠినమైన తీర్పైనా చెప్పగల పాపరహితుడైన యేసుక్రీస్తు, శిక్షించడానికి కాకుండా పాపిని రక్షించడానికి, అలా అతన్ని సంస్కరించి లోకానికి ఆశీర్వాదంగా మార్చడానికి సమర్థుడన్నది చరిత్ర చెప్పే సత్యం!!! అలా యేసుక్రీస్తు ‘క్షమాశక్తి’ చేత సంపూర్ణంగా నింపబడిన ఒకనాటి పాపులు, పామరులు, అణగారిన వర్గాలవారే చరిత్రను తిరగరాశారు. ‘దేవుని శక్తి’కి కేంద్రాలయ్యారు. ‘మేమింత గొప్పవాళ్లం కదా, పాపులమెలా అవుతాం?’ అన్న భావనతో ఉన్నవారికి దేవుని శక్తి అర్థం కాదు. మన జీవితాల్లో దేవుని శక్తి నిరూపణ, దేవుని క్షమాపణతోనే ఆరంభమవుతుంది. దేవుని క్షమాపణ పొందకుండా దేవుని ద్వారా గొప్పగా వాడబడటం అసాధ్యం. దేవుడు క్షమించిన విశ్వాసి దేవుని చేత గొప్పగా వాడబడకుండా ఉండటం అసాధ్యం. రాళ్ల కుప్పలకింద శవంగా మారవలసిన నాటి స్త్రీ, ఆ తర్వాత ప్రభువు పరిచారికగా మారి ఎందరికో ఆశీర్వాదంగా మారడం దేవుని శక్తికి నిదర్శనమే కదా!! – రెవ. టి.ఎ.ప్రభుకిరణ్ -
పేదల గుండెచప్పుడు వినిపించాలి!
సువార్త ఆలోచనల ఉత్పత్తి కేంద్రం, యంత్రం మెదడు. అందుకు అదివాడే ముడిసరుకు ‘స్వార్థం’!! తాను ఆరంభించిన దైవరాజ్య నిర్మాణాన్ని అందుకే మెదడుతోగాక, దేవుడిచ్చే ‘పరిశుద్ధాత్మ శక్తి’తో జరపాలని యేసుక్రీస్తు తన అనుచరులను ఆరోహణ సమయంలో ఆదేశించాడు. (అపొ 1:1–8). మెదడెప్పుడూ ‘నీగురించే ఆలోచించుకో’ అంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో పని చేశారు కాబట్టి ఆదిమ అపొస్తలులు ఆస్తులు, డబ్బు జోలికి పోలేదు, అధికారాది ప్రలోభాలకు లోను కాలేదు. చివరికి హతసాక్షులయ్యేందుకూ వెనకాడలేదు. దేవునికి, ప్రజలకు మధ్య అనుసంధాన వ్యవస్థగా దేవుడు లేవీయులను యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులుగా నియమిస్తే కాలక్రమంలో అది పూర్తిగా దిగజారి దౌర్జన్యపూరితమైంది. అందుకే యేసుప్రభువు వారిలాగా ఉండవద్దని, అగ్రస్థానాలు, పీఠాలు, కోరుకోకుండా తమను తాము పూర్తిగా తగ్గించుకొని సాత్వికత్వం, పవిత్రత, నిస్వార్థత కలిగిన పరిచారకులై ప్రలోభాలకు అతీతంగా ఉంటూ పేదలకు సేవచేయాలని ఆదేశించారు (మత్త 23:12). విషాదమేమిటంటే, యేసుక్రీస్తు ఆనాడు ఖండించిన యాజక వ్యవస్థలాగే, ఈనాటి పరిచారకుల వ్యవస్థ లోనూ విలువలు లోపిస్తున్నాయి. పరిచారకులు పేదలు, బలహీనుల పక్షంగా నిలబడవలసింది పోయి, డబ్బు, విలాసాలు, డాంబికాల వేటలో వారికందనంత ఎత్తుకు ఎదగడమే విజయమని భావిస్తున్నారు. పేదవిశ్వాసులను నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టి, పెద్దకార్లలో వచ్చే ధనికులైన విశ్వాసుల కారు తలుపులు తెరిచే సంస్కృతికి తెర తీశారు. నిరంతరం పేదలు, బలహీనులు, నిర్భాగ్యుల కోసమే తపించి అలమటించిన యేసుక్రీస్తు ‘ఆరాధనాస్థలాలు’ ఇవి ఎలా అవుతాయి? యేసు పేదల ప„ý పాతి అన్నది బైబిలు చెప్పే సత్యం కదా! ఇది అరణ్యఘోష కాకూడదు మిత్రులారా! ఇలా ఆత్మీయంగా, సామాజికంగా కూడా నిర్వీర్యం కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది. పరిచారకుల్లో బోధకుల్లో పవిత్రత, ఆత్మీయ పోరాట పటిమ లోపిస్తే విశ్వాసులు అందుకు పూనుకుని తీరాలి. వేలు, వందలకోట్ల రూపాయలు వేళ్లతో లెక్కపెట్టగలిగినంత మంది దుర్బోధకుల బ్యాంకుల్లో, ఇళ్లలో, లాకర్లలో పేరుకుపోవడం కాదు; కులమత వివక్ష లేకుండా పరిచర్యం చేయగలిగిన వందలాది అనాథాశ్రమాలు, ఆశ్రయకేంద్రాలు, ఉపాధి కేంద్రాలు, ఉచిత విద్యాబోధనా సంస్థలు, ఉచిత ఆసుపత్రులు ఆరంభమయ్యేందుకు ఆ డబ్బు ఉపకరించాలి. చర్చి ఆదివారం నాడు ఆరాధనాస్థలంగానే కాదు, సోమవారం నుండి శనివారం దాకా పేదలు, బలహీనుల పరిచర్య కేంద్రంగా ఉండాలి. ఇది ఎవరో చెప్పేది కాదు, యేసుప్రభువే నిర్దేశించిన విధానం (మత్త 25:31–40). విశ్వాసులంతా ఒకటైతే ఈ దేశంలో పేదరికం అంతర్థానమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మనమడిగింది కాదు...దేవుడిచ్చేదే ఆశీర్వాదం!
యేసుక్రీస్తు శిష్యుల్లోని యాకోబు, యోహానుల తల్లి ఒకసారి ప్రభువును కలుసుకొని నా కుమారులిద్దరినీ నీ రాజ్యంలో నీ కుడి ఎడమ పక్కన కూర్చోబెట్టుకోమని అర్థించింది. తాను పొందిన శ్రమలన్నీ వాళ్లు కూడా పొందాలనడానికి సాదృశ్యంగా, నేను తాగిన గిన్నెలోది వారు తాగగలరా? అని ప్రభువు ప్రశ్నించి, ఆమె అభ్యర్థన తన తండ్రి వశంలోనిది తప్ప తన వశంలోనిది కాదని జవాబిచ్చాడు. ప్రతి విశ్వాసి పట్లా దేవునికి అత్యంత నిర్దిష్టమైన సంకల్పాలున్నాయి. దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసే పరిణామాలే విశ్వాసి జీవితంలో సంభవిస్తుంటాయి. తన రాజ్యంలో యాకోబు, యోహానుల స్థానమేమిటో దేవుడు నిశ్చయించాడు. అందువల్ల ఆ విషయంలో దేవుని సంకల్పమే నెరవేరుతుంది తప్ప, వారి తల్లి ప్రార్థన ఫలించదు. యేసుకు కుడి ఎడమల స్థానాల్లో కూర్చోవడం గొప్ప విషయమనుకుంటుంది వారి తల్లి. కాని అంతకన్నా ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన స్థానాలను దేవుడు వారికివ్వదలచుకున్నాడు (మత్త 21–24). ఎంతో లోతైన, మర్మయుక్తమైన భావాలున్న సంఘటన ఇది. అదే మత్తయి సువార్తలో ‘అడగండి మీకిస్తాను’ అన్నాడు యేసు (మత్తయి 7:7). ఇప్పుడేమో నీవడిగింది నేనివ్వలేనంటున్నాడు ఆ శిష్యుల తల్లితో యేసు. దేవుడు ఏదడిగినా ఇస్తాడు. ఆయన్నడగటం మన హక్కు, మనం పిల్లలం గనక మనమేదడిగితే అదివ్వవలసిన బాధ్యత దేవునిది అన్న ధోరణిలో సాగుతున్న కొందరి ప్రసంగాలు ఈనాడు చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సువార్త సంపదలు సాధించి పెట్టే సాధనమన్నది వారి సిద్ధాంతం (ప్రాస్పరిటీ గాస్పెల్). బైబిలులోని కొన్ని వాక్యాలను వాటి నేపథ్యం నుండి విడదీసి వాటికి చెప్పే వక్రభాష్యం వల్ల వచ్చే చిక్కు ఇది. విశ్వాసి ప్రార్థనలు దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసేవిగా ఉంటే ఆయన అవి తప్పక ఆలకిస్తాడు. ఎందుకంటే, విశ్వాసికి అత్యంత శ్రేష్టమైన, పర సంబంధమైన వరాలనివ్వాలని ఆశిస్తాడు (యాకోబు 1:17). తాను అత్యుత్తమమైనవి ఇవ్వాలనుకుంటున్నప్పుడు, విశ్వాసి అంతకన్నా తక్కువది ఆశించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన తప్పక విఫలమవుతుంది. మనం దుర్బుద్ధితో అడిగినా, అజ్ఞానం వల్ల శ్రేష్టమైనవి కానివి అడిగినా దేవుడివ్వడానికి ఇష్టపడడు. మన జీవితాల్లో చాలా ప్రార్థనలు ఫలించకపోవడానికి కారణం అదే. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఫలించని ఆ ప్రార్థనల వల్ల కురిసిన ఆశీర్వాదాలూ అర్థమవుతాయి. మనమడిగింది ఇవ్వాలా వద్దా అన్న దేవుని ‘విచక్షణ’ వెనుక మన క్షేమం, దేవుని ఆశీర్వాదం ఉంటాయి. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
ప్రేమకు పునరుత్థానం
విశ్వమంతా దాదాపు 36 గంటలపాటు నెలకొన్న నిశ్శబ్దానికి, విశ్వాన్ని ముంచెత్తిన విషాదానికి ఆదివారం తెల్లవారుజామున తెరపడింది. సూర్యోదయ కిరణాలు అవనిని తాకడానికి ముందే సూర్యుని సృష్టికర్త, బైబిలులో నీతిసూర్యుడుగా పిలువబడిన రక్షకుడైన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి పునరుత్థానుడయ్యాడు. చీకటి పొరలను చీల్చి చెండాడుతూ దేదీప్యమానంగా ఉదయించాడు. అదే ఈస్టర్ మహాపర్వదినం, మహోదయం! సిలువలో మరణించడానికి కొన్ని రోజుల ముందు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన బోధ చేశాడు. విత్తనం భూమిలో పడి చనిపోతేనే మొలకెత్తి మహావృక్షమవుతుందని ఆయన బోధిస్తే, చాలామందికి అది అర్థం కాలేదు. మరణం అన్నింటికీ మహా అంతమన్నది చాలామందికున్న అవగాహన. అలాంటి అత్యంత విషాదభరితమైన, దుఃఖపూరితమైన, నిరాశావహమైన మరణానికి తన జీవితంలోనే ఒక కొత్త నిర్వచనమిచ్చాడు యేసు. ఆయన ఒక విత్తనంలాగే శుక్రవారంనాడు మరణించాడు. మూడోరోజు పునరుత్థానం ద్వారా మొలకెత్తి అచిరకాలంలోనే ఆయన పేరిట స్థాపించ బడిన చర్చిలు, ఆరంభించబడిన క్రైస్తవ ప్రేమ, క్షమాపణోద్యమం మహావృక్షంగా పెరిగి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. ఈ రెండు వేల ఏళ్లలో క్రైస్తవోద్యమం ఎదుర్కోని పెను సవాళ్లు లేవు. శత్రువుల అణచివేతలో ఈ ఉద్యమం నిలువెల్లా గాయపడింది. కాని బలహీనపడలేదు. ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేయాలన్నదే యేసు పునరుత్థానం పునాదిగా ఆరంభమైన క్రైస్తవోద్యమ ప్రధాన ధ్యేయం. ప్రేమను, క్షమాపణను తీసేస్తే క్రైస్తవోద్యమంలో ఇక మిగిలింది ఏమీ లేదు. పరిపాలకులకు, రాజులకు వ్యతిరేకంగా క్రైస్తవం హింసాత్మకంగా ఎదురు తిరిగి వారిని ధిక్కరించిన దాఖలాలు చరిత్రలో లేవు. ఒకటో రెండో ప్రాచీన యూరోప్లో అలాటి సంఘటనలు జరిగినా వాటి ప్రభావం ఉద్యమం మీద లేదు. అహింస, క్షమాపణలతో కలసి ఉన్న క్రైస్తవ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పడంలో అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని ఒడుదొడుకులేర్పడ్డా, ఉద్యమం అద్భుతంగా విస్తరించింది. అలా చనిపోయాక మూడవ నాడు పునరుత్థానుడైన యేసుప్రభువు మొట్టమొదట సమాధి వద్దే మగ్గలేనె మరియకు కనబడి తాను సజీవుడనయ్యానన్న విషయాన్ని తన శిష్యులకు, ఇతర అనుచరులకూ తెలియజేయమని ఆదేశించాడు. యాకోబు తల్లి అయిన మరియకు, సలోమీ, యెహన్నా అనే స్త్రీలకు ఆయన కనిపించాడు. ఆ తర్వాత భోజనానికి కూర్చున్న తన 11మంది శిష్యులకూ కనిపించాడు. కావాలంటే నా గాయాల్లో వేలు పెట్టి చూసి ఆ తర్వాతే తనను విశ్వసించమని నిత్యశంకితుడైన తోమా అనే తన శిష్యునితో ప్రభువన్నాడు. ఒకచోట ఆయన శిష్యులతో సహా దాదాపు ఐదొందలమంది అనుచరులు కూడి ఉండగా యేసు వారి మధ్య సాక్షాత్కరించాడు (1 కొరింథి 15:6). పునరుత్థానుడైన తర్వాత అలా యెరూషలేము, గలలియ ప్రాంతాల్లో పలువురికి 40 రోజులకు పైగా తనను తాను కనబరచుకొని తాను సజీవుడనయ్యానని రుజువు చేసుకున్నాడు. పిదప వాళ్లంతా చూస్తుండగా 40వ రోజున ఒలీవల కొండ మీదినుండి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ముష్కరులు హీనాతిహీనంగా అతి దారుణంగా చంపిన తమ రక్షకుడు మళ్లీ సజీవుడయ్యాడన్న తిరుగులేని విశ్వాసంతోనే క్రైస్తవోద్యమ వ్యాప్తికి ఆయన అనుచరులంతా ప్రపంచం నలుమూలలకూ ఆ సువార్తను తీసుకెళ్లారు. ఆయన శిష్యులందరిలోకీ అనుమానాల పుట్ట అయిన తోమా ఇండియాకు సువార్త తీసుకొచ్చాడు. ఇండియాలోనే గత సాక్షి అయ్యాడు. ఆయన మలబారు తీరం (ఇప్పటి కేరళ)లో స్థాపించిన చర్చి ఈనాటికీ ఉంది. తోమా సమాధి చెన్నైలో మౌంట్ ఆఫ్ థామస్గా పిలువబడే కొండ మీద ఉంది. శ్రమల్లో యేసును వదిలి పారిపోయిన శిష్యులు, అనుచరులంతా ఆ తర్వాత చనిపోవడానికి కూడా సిద్ధపడి సువార్తను భూ దిగంతాలకు తీసుకెళ్లడానికి ప్రోద్బలాన్ని, నైతిక, ఆత్మీయ సై్థర్యాన్ని ఇచ్చిన ఒకే ఒక అంశం ఆయన పునరుత్థానం!! ఆయన శుక్రవారం నాడు ఏకాకిగా, నిస్సహాయుడిగా సిలువలో మరణించడం వాళ్లంతా చూశారు. ఆ కళ్లతోటే ఆదివారం ఉదయం నుండి 40 రోజులపాటు ఆయన్ను సజీవంగా చూశారు. ఆయనతో మాట్లాడారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆయనిచ్చిన ఆజ్ఞలన్నీ అర్థం చేసుకున్నారు. నేను మళ్లీ వస్తానని వాగ్దానం చేసి, పరలోకానికి 40వ రోజున ఆరోహణుడు కావడాన్నీ చూశారు. అయితే శత్రువుల కుట్రలు సాగుతూనే ఉన్నా, క్రైస్తవోద్యమ వ్యాప్తి అంతటా ఊపందుకుంది. యేసు నిజానికి చనిపోలేదు, ఆయన స్థానంలో మరొకరు చనిపోయారని, ఆయన దేహాన్ని శిష్యులు మాయం చేసి ఆయన పునరుత్థానుడయ్యాడనే పుకార్లు లేపారని, యేసు సమాధిలోనుండి తప్పించుకొని ఇండియాలోని కాశ్మీర్కు వచ్చి ఇక్కడే స్థిరపడి చనిపోయాడని, ఆయన పేరుతో కాశ్మీర్లో సమాధి కూడా ఉన్నదని శత్రువులు గాలి వార్తలు పుట్టించారు. యేసు సమాధికి రోమా ప్రభుత్వ చక్రవర్తి సీలు వేసి, రోమా భటులు 24 గంటలూ కావలి ఉంటే, ఆంత గాయపడ్డ యేసుకు వారినెదిరించి సమాధినుంచి పారిపోయే శక్తి ఉంటుందా? యేసును సిలువ వేయడంతోనే పిరికివారుగా తమ ప్రాణాల కోసం పారిపోయిన శిష్యులకు రోమా సైనికులనెదిరించి, సమాధి తెరిచి ఆయన దేహాన్ని దొంగిలించే ధైర్యం ఉంటుందా? ఒకే ఒక్క సత్యానికున్న బలం, కోటి అసత్యాలకు కూడా ఉండదు. యేసు పునరుత్థానుడై, మళ్లీ సజీవుడై, పరలోకానికి ఆరోహణమైన దేవుడని, ఆయన సజీవుడని బైబిలు చెబుతోంది. విశ్వాసులు నమ్ముతున్నారు. అదంతా సత్యమని చరిత్ర సాక్ష్యం చెబుతోంది. అందరికీ ఈస్టర్ శుభాభినందనలు. -
విశ్వమంతా నిశ్శబ్దం... చీకటి!?
హోలీ వీక్ చీకటి శక్తుల కుట్రలు ఫలించాయి. దైవకుమారుడైన యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పునిచ్చి అత్యంత క్రూరంగా సిలువ వేశారు. కొరడాదెబ్బలు, తిట్లు, అవహేళనలు, ఈసడింపులు, అబద్ధాలదే రాజ్యమైంది. సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వైశ్వరుడైన యేసుక్రీస్తు నిస్సహాయంగా, మౌనంగా తలవంచుకొని అన్నీ భరిస్తూ, తనను సిలవ వేస్తున్న వారేమి చేస్తున్నారో వారికి తెలియదు గనక వారిని క్షమించమని ప్రార్థిస్తూ పొద్దున్నుండి సాయంత్రం దాకా వేలాడి తనువు చాలించాడు. నిన్ను క్షణకాలం కూడా వదిలే ప్రసక్తి లేదంటూ ప్రగల్భాలు, బింకాలు పలికిన శిష్యులంతా తమ బోధకుణ్ణి వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. అరిమలై యేసేపు, నికోదేము అనే ఇద్దరు యూదుమత చాందసులు ఆయన అంత్యక్రియల బాధ్యత వహించారు. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే వారు ఒక రాతి సమాధిలో ఆయన్ను ఖననం చేశారు. ఇక యేసుక్రీస్తు చరిత్ర ముగిసినట్టేనని శత్రువులు జబ్బలు చరిచారు. విశ్వమంతా నిశ్శబ్దం ఆవహించింది. దేవదూతల కోలాహలంతో ఎప్పుడూ సందడిగా ఉండే పరలోకం చిన్నబోయి విషాదమయమైంది. చెడు ముందు మంచి శాశ్వతంగా ఓడినట్టేనా? వెలుగును చీకటి మింగేసినట్టేనా? నవ్వును ఏడుపు పూర్తిగా ఓడించినట్టేనా..? ఈ ప్రశ్నలు మారుమోగుతున్నాయి. మరి జవాబు? వేచిచూద్దాం... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని స్వచ్ఛమైన ప్రేమకు శిలువ
హోలీవీక్ చేయి తిరిగిన చిత్రకారుడు రంగులు, కుంచెతో కేన్వాస్ ముందు నిలబడి చిత్రపటం గీస్తున్నప్పుడు అతని రంగులకు, గీతలకు అర్థం తెలియదు. సంపూర్తిౖయె ప్రదర్శనలో పెట్టినప్పుడే అదెంత అద్భుతమైన కళాఖండమో తెలుస్తుంది. దేవుని ప్రేమ కూడా అంతే! ఆ ప్రేమతో తడిసి తాదాత్మ్యం చెందిన వ్యక్తికే సంపూర్ణంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు సిలువ దేవుని ప్రేమకు ప్రతీక. మానవుడు కోల్పోయిన నిత్యత్వాన్ని, దేవునితో నిత్య సహవాసాన్ని, సంపూర్ణంగా తిరిగి అందించేందుకు దేవుడు చిట్టచివరి ప్రయత్నంగా చేసిన మహా యాగమది. కరడుగట్టిన నేరస్థులను ప్రజలంతా చూస్తుండగా అత్యంత పాశవికంగా చంపి తద్వారా తమ చట్టం, పాలన పట్ల ప్రజల్లో భయాన్నీ, విధేయతను పెంపొందించడానికి రోమా పాలకులు రూపొందించిన మరణ శిక్ష ‘సిలువ’. అవమానానికి, ఓటమికి, ఖైదీ నిస్సహాయతకు, పాలకుల దుర్మార్గానికి చిహ్నమది. కాని దేవుడు మానవాళిపట్ల తన ప్రేమను వ్యక్తం చేయడానికి దాన్నే సాధనంగా ఎంపిక చేసుకున్నాడు. తద్వారా సిలువ దేవుని ప్రేమకు, సాత్వికతకు, క్షమాపణకు, పాపంపైన మానవుని విజయానికి చిహ్నంగా మారింది. తన సిలువ మరణం ద్వారా మానవాళికి పాపవిముక్తిని ప్రసాదించాలన్న తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తూ దైవకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాడు. దాంతో మానవ చరిత్రలో అప్పటిదాకా సాగిన దౌష్ట్యపు రక్తపు మరకల పుటలు సమసిపోయి ప్రేమ, క్షమాపణ, సాత్వికత ఇతివృత్తాలుగా కొత్త భావాలు, కార్యాల తాలూకు అభివర్ణనతో కూడిన కొత్త పుటలు ఆరంభమయ్యాయి. ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంత గొప్పగా మీ పొరుగు వారిని ప్రేమించండి’ అన్న యేసుక్రీస్తు ప్రబోధం నాడు, నేడు కూడా సాటిలేనిది. ‘మీ శత్రువుల్ని క్షమించండి’ అన్న ఆయన మరో ప్రబోధం నాటి సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శత్రువు చేజిక్కితే చాలు, అతన్ని వెంటాడి మరీ క్రూరంగా చంపాలన్న నాటి సంస్కృతికి, నమ్మకాలకు పూర్తిగా భిన్నమైనది యేసుక్రీస్తు బోధ. అది ఆచరణలో కాలపరీక్షకు నిలుస్తుందా లేక కేవలం ప్రబోధంగానే మిగిలిపోతుందా? అంటూ నొసలు ముడివేసిన నాటి పెద్దల సందేహానికి ఆయనే స్వయంగా సిలువలో వేలాడుతూ తనను అన్యాయంగా సిలువలో అత్యంత పాశవికంగా బలి చేస్తున్న శత్రువులందరినీ క్షమిస్తూ ప్రార్థించడమే సమాధానమైంది. ‘తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. గనుక వీరిని క్షమించండి’ అన్న యేసుక్రీస్తు సిలువ ప్రార్థన ఆనాటినుంచి లోకంలో ప్రతిమూలనా ప్రతిధ్వనిస్తోంది. క్షమాపణ బలహీనుడి వైఖరి కాదు, బలవంతుడి ఆయుధమని యేసుక్రీస్తు సిలువలో రుజువు చేశాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అంజూరపు చెట్టుకు యేసు శాపం!
యెరూషలేము వెళ్తూ ఆకలిగొన్న యేసు పండ్లు కోసుకొని తినేందుకు ఒక అంజూరపు చెట్టు వద్దకు వెళ్లాడు. నిండా ఆకులే తప్ప ఒక పండూ లేని ఆ చెట్టును యేసు శపించగా అది వెంటనే వాడిపోయింది. ‘పరిశుద్ధ వారం’లో ఈ ఉదంతాన్ని ధ్యానిస్తూ ఉంటాము. మానవుడు మంచి పనులు చేసినందుకు మెచ్చి దేవుడు రక్షణనివ్వడు. దేవుడు తన ఉచితమైన కృపతో రక్షించిన మానవుడు విశ్వాసిగా దేవుని విశ్వాసం, సహవాసం, ప్రేమలో ఎదుగుతూ సత్కార్యాలు చేస్తేనే దేవుడు మెచ్చి ఆశీర్వదిస్తాడని బైబిలు చెబుతోంది. దాన్నే యేసు ప్రభువు ఫలించడం అన్నాడు. అంజూరపు చెట్టు ఆకులు అత్యంత ఆకర్షణీయమైనవి, దాని పళ్లు మాత్రం అంత అందంగా ఉండవు. ఆకులతో ఆకర్షించిన అంజూరపు చెట్టు బాటసారికి పళ్లివ్వకపోతే దానికసలు విలువేముంది? క్రైస్తవమంటే ప్రసంగాలు, నీతి బోధలు చేయడం, సిద్ధాంతాలు వల్లించడం కాదు. తనను వలే తన పొరుగు వారిని ప్రేమించడమని యేసు చాలా స్పష్టంగా బోధించాడు. స్వార్థానికి దురాశకు, అసూయకు, దుర్మార్గతకు, కుతంత్రాలకు విశ్వాసిలో చోటు లేదు. ప్రభువులో వేరు పారి ఎదుగుతూ, పొరుగువారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ వారి పక్షంగా నిలబడటమే నిజమైన క్రైస్తవమని, అలా ఫలించని చెట్టులాంటి విశ్వాసులకు చాలా ‘కఠినమైన తీర్పు’ తప్పదని యేసు బోధించాడు (యోహాను 15:1–11). యేసు తన ముప్ఫై మూడున్నరేళ్ల ఈ లోకజీవితంలో ప్రసంగాల ద్వారా కన్నా తన జీవితం ద్వారానే అందరినీ ప్రభావితం చేశాడు. తన ప్రేమనంతా ఆచరణలోనే చూపించాడు. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
భారతదేశం చాలా గొప్పది – యూకె ఎంపీ బాబ్ బ్లాక్మేన్
‘‘భారతదేశం చాలా గొప్పది. శాంతికి చిహ్నమైన భారతావనిలో ఏసుక్రీస్తు కథతో సినిమా తీయడం గర్వకారణం. ఈ సినిమా వేడుకలకు ఇండియా వస్తా’’ అన్నారు యునైటెడ్ కింగ్డమ్ ఎంపీ బాబ్ బ్లాక్మేన్. జీసస్ జీవిత చరిత్ర ఆధారంగా సీహెచ్ బ్రహ్మం దర్శకత్వంలో చంద్రశేఖర్ చంద్ర నిర్మిస్తున్న ‘లోక రక్షకుడు’ లోగోను లండన్ పార్లమెంట్లో బాబ్ బ్లాక్మేన్ విడుదల చేశారు. ‘‘ప్రజల్లో శాంతి నింపే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాది క్రిస్మస్కు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చంద్రశేఖర్ చంద్ర అన్నారు. ‘లండన్ జీయర్ ట్రస్ట్’కు చెందిన వింజమూరి రాఘసుధ, ‘యూకే తెలుగు ఎన్నారై ఫోరమ్’ సంస్థ సభ్యులు శేఖర్ వేమూరి, సూర్యదేవర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏకే రిసాల్ సాయి, సమర్పణ: చంద్ర పర్వతమ్మ. -
దేవుని కోసం బతికి, దేవుని కోసమే చనిపోయిన స్తెఫను!
సువార్త నమ్మిన సత్యాన్ని ఆచరించి నిర్భయంగా ప్రకటించకపోతే దానికి విలువేముంది? స్తెఫను అనే దైవ పరిచారకుడు తన విశ్వాసాన్ని ఆచరించి ప్రకటించి హతసాక్షి అయ్యాడు. ప్రత్యేకంగా సామాజిక సేవ కోసం ఆదిమ అపొస్తలులు నియమించిన ఏడుగురు పరిచారకుల్లో స్తెఫను ప్రధముడు (అపొ.కా. 6:5) అయితే స్తెఫను పరిచర్య, ప్రసంగాలు, అద్భుతాలు ఛాందసవాదుల దృష్టిల్లో పడ్డాయి. వివరణ కోసం వారతన్ని సర్వోన్నత యూదు మహాసభకు పిలిచారు. లోతైన విశేషణతో స్తెఫను ఆనాడు చేసిన ప్రసంగం ఒక మచ్చుతునకగా మిగిలింది (అపొ.కా. 7). దేవుని కన్నా మిన్నగా మారిన దేవాలయం, దాని విధి విధానాలను, యూదుల ఆ మత మౌఢ్యాన్ని స్తెఫను నిర్భయంగా ఎండగట్టాడు. మోషే కాలపు ప్రత్యక్ష గుడారమైనా, సొలొమోను నిర్మించిన యెరూషలేము దేవాలయమైనా, ఆయా దశల్లో అప్పటి ప్రజల ఆత్మీయావసరాలు తీర్చినవే తప్ప, దేవదేవుని సర్వసంపూర్ణ ప్రత్యక్షతను నిరూపించినవి కావని, అందుకవి సరిపోవని స్తెఫను తేల్చి చెప్పాడు. అది విని యూదులు అట్టుడికిపోయారు. కాని దేవుని సర్వోన్నత సంపూర్ణ ప్రత్యక్షతను తాను ఆకాశంలో దేవునికి కుడివైపున కూర్చున్న యేసుక్రీస్తులో ఇపుడు చూస్తున్నానంటూ స్తెఫను ఆత్మవశుడై పలికిన చివరి మాటతో రెచ్చిపోయి అతని వాదనతో ఏకీభవించలేక, విశ్లేషణను జీర్ణించుకోలేక ఆయన్ను రాళ్లతో కొట్టి చంపారు. దైవద్రోహం చేసిన వారికి విధించే మరణశిక్షను అలా ఒక దైవపరిచారకునికి వారు అన్యాయంగా విధించి చంపారు. అయితే స్తెఫను మరణం వృధా కాలేదు. దీనంతటికీ సారథ్యం వహించిన సౌలు అనే మరో యూదు ఛాందసుని అంతరంగంలో స్తెఫను కనపర్చిన అచంచల విశ్వాసం, అతనిలో గుభాళించిన సైద్ధాంతిక విశ్వేషణ, స్పష్టత, మృత్యుముఖంలో కూడా అతనిలో చెదరని ఆత్మీయానందం, వాడని క్షమా పరిమళం సౌలుపై చెరగని ముద్ర వేసింది. అతని అంతరంగంలో కల్లోలం రేపింది. ఫలితంగా కొన్నాళ్లకే అతను పౌలుగా క్రీస్తు పరిచారకుడుగా మారి అద్భుతమైన సేవ చేసేందుకు బీజాలు వేసింది. దేవుని కోసం నిర్భయంగా బతికేవారే, నిర్భయంగా దేవుని కోసం చనిపోగలరు. అలా కేవలం రెండధ్యాయాల్లో ముగిసిన స్తెఫను ఉదంతం ఈ రెండు వేల ఏళ్లుగా క్రైస్తవోద్యమానికి స్ఫూర్తినిస్తూనే ఉంది. – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
మహాత్ముడు కరుణించిన మరో ప్రపంచం!
ఈ లోకాన్ని పరలోకంగా మార్చే ప్రయత్నాలు చరిత్రలో ఎన్నో జరిగాయి. అడపాదడపా కనిపించే మార్పులే తప్ప అవేవీ సఫలం కాలేదు. అయితే ఒక మహా ప్రయత్నాన్ని దేవుడే పూనుకొని రెండువేల ఏళ్ల క్రితం బెత్లెహేమునే ఆరంభ కేంద్రంగా చేశాడు. మరియ, యోసేపు అనే నిరుపేద జంటకు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వరంగా బెత్లెహేములో జన్మించాడు. యేసు జననంతో ‘స్వార్థం’, ‘భయం’ అనే రెండు రెక్కలతో విస్తరిస్తున్న చీకటి రాజ్యం రెక్కలు విరిచినట్లయింది. ‘ప్రేమ’, ‘క్షమాపణ’ ప్రాతిపదికగా యేసు ఆరంభించిన వెలుగు రాజ్యపు పరలోక సౌధపు పునాదులు ఆ రోజున బెత్లెహేములోనే పడ్డాయి. చీకటి శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోమా నిరంకుశ పాలకుల పునాదుల్ని యేసు స్థాపించిన ప్రేమ సామ్రాజ్యం నామరూపాలు లేకుండా చేసింది. ఈ లోకంలో యేసుది ముప్ఫై మూడున్నరేళ్ల జీవితం! సరళమైన పదజాలంతో సాగినా, లోతైన భావజాలం కలిగిన ఆయన బోధలు, బోధలకు భిన్నంగా లేని ఆయన ఆదర్శప్రాయమైన జీవితం – నాటి ప్రజలను ప్రభావితం చేశాయి. ఆయనకు లభ్యమవుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక యూదు సమాజం, రోమా ప్రభుత్వం కలిసి కుట్ర చేసి, అత్యంత కర్కశంగా ఆయనను సిలువ వేసి చంపాయి. అయితే ఆయన తిరిగి మూడవనాడు సజీవుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇదంతా కళ్లారా చూసిన ఆయన శిష్యులు 12 మంది,కొందరు అనుచరులు కలిసి ఈ ‘సువార్త’నూ, ఆయన బోధల్నీ ప్రపంచం నలుమూలలకూ చేరవేశారు. నిత్యనూతనం ఆ సందేశం! ఇండియాకు కూడా ఆయన శిష్యుల్లో ఒకరైన తోమా ఆ కాలంలోనే సువార్త తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసే క్రిస్మస్లో ఎన్నటికీ వాడని నూతనత్వం ఇమిడి ఉంది. ఆ నూతనత్వానికి కారణం – ఎన్ని ప్రయత్నాలు చేసినా, ‘ఎన్నాళ్లు ఉతికినా’ బాగు కాని మానవనైజం! మనిషి మారనంత వరకూ క్రీస్తు బోధలు, జీవితం తాలూకు సుగంధం మళ్లీ మళ్లీ ప్రతి ఏడాదీ పరిమళిస్తూనే ఉంటుంది. స్వార్థం, కుట్రలు, పదవీకాంక్ష, బలహీనుడిపై బలవంతుని పెత్తనం, శ్రమ దోపిడీ, డబ్బే సరికొత్త దేవుడుగా మనుషుల పూజలనందుకొంటున్న వైనం – ఇవన్నీ యేసు ప్రేమ సందేశాన్ని మరింత కొత్తదిగా చేస్తున్నాయి. యేసు ప్రకటించిన యుద్ధంలో హింసకూ, మారణాయుధాలకూ, రక్తపాతానికీ తావు లేదు. దౌర్జన్యానికి అసలు విలువే లేదు. ఎవరైనా ఒక చెంప మీద కొడితే, మరో చెంప మీదా దెబ్బ వేయించుకునే దాసులే యేసు సైనికులు! పొరుగువారిని ప్రేమిస్తే సరిపోదన్నాడు ప్రభువు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, చలితో ఉన్నవాడికి దుప్పట్లు కప్పి ఫొటోలు వేయించుకొని ప్రచారం చేసుకోవడంలో డొల్లతనాన్నీ, దౌర్భాగ్యాన్నీ యేసు ఎండగట్టాడు. ఇది పేదల కోసం... ప్రేమ ఉద్యమం! రెండువేల ఏళ్ల క్రితం ఈ ప్రేమ విప్లవం, క్షమాపణ ఉద్యమం బెత్లెహేములో ఆరంభమైంది. బెత్లెహేములో ఆరంభమైన ‘మార్పు ఉద్యమమే’ కాలక్రమంలో చరిత్ర గతినీ, మానవజీవిత పరిస్థితుల్నీ మార్చి రాజకీయ మార్పులు తెచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పడింది కూడా క్రీస్తు ఆరంభించిన ప్రేమ ఉద్యమంతోనే! పేదల పక్షాన నిలబడి పోరాడి, ప్రాణాలర్పించిన వేలాది ఆత్మీయ సైనికులను క్రీస్తు ఉద్యమం లేవనెత్తింది. క్రీస్తు కలలు కన్న పరలోక రాజ్యస్థాపన, క్రీస్తు బోధల్ని ఈసారి క్రిస్మస్ మళ్లీ గుర్తు చేస్తోంది. దుర్మార్గం విస్తరించి, స్వార్థం పెచ్చరిల్లి మనిషి ఒంటరివాడైన ప్రతిసారీ ఆయనే మనకు ‘ఇమ్మానుయేలు’! అంటే ‘దేవుడే మనకు తోడు’ అని క్రిస్మస్ గుర్తు చేస్తుంది. విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్! – రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
క్రీస్తు పాద స్పర్శతో పులకించిన పుడమి
కవర్స్టోరీ 1969 జూలై 20న మానవుడు తొలిసారిగా చంద్రునిపై కాలు మోపాడు. నాసా శాస్త్రజ్ఞులు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్ అపొలో 11 అనే రాకెట్లో రెండు లక్షల ఇరవై వేల మైళ్ల దూరం ప్రయాణించి ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయానికి తెరతీశారు. ఎన్నో ఏళ్లుగా మనిషి మస్తిష్కంలో మెదులుతున్న కోరిక నెరవేర్చబడింది. మానవ చరిత్రలో ఓ అపురూప ఘట్టంగా సుస్థిరంగా నిలిచిపోయిన ఆ రోజు మనిషి జ్ఞానానికి ప్రబల తార్కాణంగా ఆవిష్కరించబడింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలుమోపిన తొలిమానవుడుగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాడు. ఉద్విగ్నభరితంగా కొన్ని గంటలు చంద్రునిపై గడిపి క్షేమంగా భూమ్మీదకు తిరిగొచ్చారు. ఘనచరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలచిన వారికి లభించిన స్వాగతం అంతా ఇంతా కాదు. దేవుని అద్భుత సృష్టిని కన్నులారా వీక్షించిన ఆ శాస్త్రవేత్త దేవుని నామస్మరణలో మమేకమైపోయాడు. ఆ తర్వాత కొంత కాలానికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇశ్రాయేలు దేశాన్ని దర్శించాడు. సృష్టికర్త సంచరించిన ప్రాంతాలను, ఆయన దివ్యపాదాలు తాకడం ద్వారా పావనమైన పుడమిని కన్నులారా చూచి పరవశించిపోయాడు. అతనిలో ఉన్న ఆత్మగుణాలు మేల్కొల్పబడ్డాయి. గుండె గుడిలో దైవిక చైతన్యం ప్రతిధ్వనించింది. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించి అడుగడుగునా దైవిక ప్రసన్నతను అనుభవించిన ఆ వ్యక్తి తన మనస్సులోని ఆనందాన్ని ఇలా వర్ణించాడు. ‘‘క్రీస్తు నడచిన ప్రాంతాల్లో అడుగు పెట్టినప్పుడు నేను పొందిన అమితమైన ఆనందం, పారవశ్యాన్ని సుదూర ప్రయాణం చేసి చంద్రునిపై కాలు మోపినప్పుడు కూడా పొందుకోలేదు.’’ హృదయంలో నుండి వచ్చిన ఆ గొప్ప అనుభూతితో ప్రతి ఒక్కరూ ఏకీభవించక తప్పదు. యేసుక్రీస్తు ఈ భూమ్మీద సంచరించాడు అనేది ఓ గొప్ప చరిత్ర. శాశ్వతుడైన దేవుడు ప్రతీ మనిషిని రక్షించడానికి నరావతారిగా ఏతెంచాడు. అది నిరాపేక్షమైన దైవకార్యము. విశాలమైన సృష్టిని తన మహత్తయిన మాట చేత కలుగచేసిన సర్వశక్తుడు ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకొని రావడం ద్వారా తన పోలికలో, రూపములో చేయబడిన ప్రతీ మానవుని హృదయ ప్రాంగణములోనికి రావాలన్నది ఆయన దివ్య ప్రణాళిక. భౌతికంగా ఈ పుడమిపై 33 1/2 సంవత్సరాలు జీవించిన క్రీస్తు సమసమాజ నిర్మాణానికి బాటలు వేశాడు. మనుష్యుల మధ్య వేళ్లూనుకుపోయిన సామాజిక సంఘర్షణను నివారించడానికి ప్రేమ పునాదులు వేశాడు. మహోన్నతమైన తన బోధల ద్వారా మనిషిలోని అంతర చైతన్యాన్ని రగిలించాడు. అమోఘమైన పరిచర్య చేసిన పిదప లోకరక్షణార్థమై నిష్కళంకమైన తన రక్తాన్ని చిందించి మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. క్రీస్తు పాదాలు ఇశ్రాయేలు దేశంలోని అనేక ప్రాంతాలను పావనపరిచాయి. ప్రజల్లో ఉన్న మానసిక సంఘర్షణను అణిచివేశాయి. దేవుని ఆశీర్వాదాలను అశేష ప్రజావాహినికి పంచిపెట్టాయి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి పాదాలు స్వర్గ వీధుల్లో విహరించాలనే ఆశతో క్రీస్తు ప్రభువు పాదాలు కఠిన నేలను తాకాయి. ఇశ్రాయేలు దేశాన్ని యూదయ, గలిలయ, సమరయ అను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. క్రీస్తు పుట్టుక నుండి దివ్యలోకానికి వెళ్లిపోయే వరకు ఇశ్రాయేలులోని వివిధ ప్రాంతాల్లో సంచరించి మహోన్నతమైన ప్రేమతత్వాన్ని చాటి చెప్పాడు. ఒక్కొక్క ప్రాంతాన్ని దర్శించినపుడల్లా ప్రజోపకరమైన కార్యాలు ఎన్నింటినో చేపట్టుట ద్వారా చీకటి బతుకులు వెలుగుమయం చేయబడ్డాయి. బరువెక్కిన ఎన్నో గుండెలు తేలికయ్యాయి. యేసుక్రీస్తు సంచరించిన ప్రాంతాలు, వాటిలో జరిగిన అద్భుతకార్యాలు, వాటి చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక సత్యాలు మనిషి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడతాయన్నది నిస్సందేహం. బేత్లెహేము ఇది యూదయ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామము. పూర్వము దీనిని ఎఫ్రతా అని పిలిచేవారు. ఇశ్రాయేలు యొక్క మూలపురుషులలో ఒకడైన యాకోబు భార్య రాహేలు ఇక్కడే పాతిపెట్టబడింది. మోయాబుకు చెందిన రూతు తన అత్తతో ఈ ప్రాంతానికి చేరుకొని బోయజు అనే సంపన్నునికి భార్యగా చేయబడింది. రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. పాతనిబంధన చరిత్రలో ఓ గొప్ప స్థానాన్ని అలంకరించిన దావీదు మహారాజు ఈ ప్రాంతానికి చెందినవాడే. దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు బేత్లెహేము పొలాల్లో గొర్రెలు కాచుకొనేవాడు. ఆ అనుభవమే ఇశ్రాయేలు ప్రజలను నలభై వసంతాలు పాలించడానికి సహాయపడింది. లోకరక్షకుడైన క్రీస్తు అద్భుత చరిత్ర కలిగిన బేత్లెహేములో జన్మించాడు. క్రీస్తు ఇక్కడ జన్మిస్తాడని ఏడువందల సంవత్సరాలకు పూర్వమే మీకా అనే ప్రవక్త ప్రవచించాడు. ‘‘బేత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును (మీకా 5:2). ప్రపంచ చరిత్రను రెండు భాగాలుగా చేసిన క్రీస్తు యొక్క పాదాలు పుడమిని తాకిన ప్రాంతం ఇదే. బేత్లెహేము అనగా రొట్టెల గృహము. సస్యశ్యామలమైన ప్రాంతం. మనిషి ఆకలిని తీర్చే స్థలము. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతము చుట్టూ ద్రాక్షవనములు, ఒలీవ తోటలు, అంజూరపు చెట్లు అధికంగా కనిపిస్తాయి. జీవాహారము నేను అని తన్ను తాను ప్రకటించుకొనిన యేసు ఈ ప్రాంతంలో పుట్టడం అర్థరహితం కాదు కదా! ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఆకర్షిస్తున్న ‘చర్చ్ ఆఫ్ నేటివిటి’ బేత్లెహేములో ఉంది. యేసు పుట్టిన స్థలాన్ని దర్శించి తమ జీవితాలను పావన పరచుకుంటున్న వారు కోకొల్లలు. ఆ స్థలములో ఒక నక్షత్రం ఉంచబడింది. దానిని ‘స్టార్ ఆఫ్ బేత్లెహేమ్’ అంటారు. క్రీస్తు శకము 135వ సంవత్సరంలో రోమా చక్రవర్తిౖయెన ఆడ్రియన్ క్రీస్తుకు సంబంధించిన గుర్తులన్నింటిని తుడిచివేయబడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఆ తర్వాతి కాలంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి యొక్క తల్లి సెయింట్ హెలెనా కోరిక మేరకు క్రీస్తు పవళించిన పశువులశాల మీద ఓ గొప్ప దేవాలయం కట్టబడింది. 614వ సంవత్సరంలో పర్షియా వారు ఆ దేవాలయాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని ఓ సుందర దృశ్యం అడ్డుకుంది. యేసు జన్మించినప్పుడు ఆయన యెదుట సాగిలపడి, ఆరాధించి, కానుకలు సమర్పించిన ముగ్గురు జ్ఞానుల్లో ఒకడు వారి దేశానికి సంబంధించినవాడుగా ఆ దృశ్యంలో ఉండుటయే దానికి కారణం. ఆ చర్చిలోనికి ప్రవేశించడానికి ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానిని ‘డోర్ ఆఫ్ హ్యుమిలిటి’ అంటారు. ఎంత గొప్పవాడైనా తలవంచి లోపలికి వెళ్లాల్సిందే. దేవుణ్ణి దర్శించడానికి మనకు కావాల్సింది దీనమనస్సు, తగ్గింపు స్వభావము. దైవదర్శనానికి హృదయశుద్ధి, ఆత్మలో దీనత్వం అత్యవసరం. యేసుక్రీస్తు బేత్లెహేములో పుట్టాడన్నది చరిత్ర. ఆయన మానవ హృదయంలో పుడితే ఆ జీవితానికి మహోదయం. బేత్లెహేము స్వల్పగ్రామమైననూ క్రీస్తు దానిలో జనియించుట ద్వారా అది ప్రపంచ దృష్టిని నేటికీ ఆకర్షిస్తుంది. నజరేతు యేసుక్రీస్తు తన జీవితంలో ఎక్కువ కాలం నివశించింది ఇక్కడే. బాల్యము నుండి పరిచర్య ప్రారంభించేంత వరకు నజరేతులోనే పెరిగాడు. ఇది గలిలయలోని ఓ కుగ్రామం. మరియ, యోసేపులు నివసించిన ప్రాంతం. ఇక్కడి నుండి కర్మెలు పర్వతాన్ని స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ సుమారుగా లక్షమంది నివసిస్తున్నారు. వారిలో కొందరు అరబ్బులు, మరికొందరు క్రైస్తవులు. విశ్వవ్యాప్తంగా అసంఖ్యాక యాత్రికులు ఈ పట్టణాన్ని కూడా దర్శిస్తుంటారు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఇక్కడ ఒక సమాజ మందిరం ఉండేది. దానికి 80 మెట్లు ఉండేవి. క్రీస్తు తన రాక యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ బహిర్గతపరిచాడు. ‘‘ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’’ అని ప్రవక్త ౖయెన యెషయా ద్వారా పలుకబడిన వచనాలను చదివి నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని చెప్పెను (లూకా 4:18–21). క్రీస్తు చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలు ఈ ప్రాంతంలో లభించాయి. క్రీస్తు రహస్య సంవత్సరములు అని పిలువబడిన పన్నెండు నుండి ముప్ఫై సంవత్సరాల వరకు ఇక్కడే పెరిగాడు. వడ్లవాడైన యోసేపుకు అన్ని విషయాల్లో సహాయపడెనని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతము ఈ పట్టణాన్ని ఎన్–నసీరా అని పిలుస్తారు. మరియ దూత ద్వారా రక్షకుని ఆగమనము గూర్చి తొలిసారిగా వినిన ఇంటిపై ఓ గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. దానిని ‘చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్’ అంటారు. యేసుక్రీస్తు నజరేతులో నివసించిన కారణాన ఆయనకు ‘నజరేయుడు’ అనే పేరు ఉంది. ‘నెచెర్’ అనే మూలభాషా పదం నుండి ఆ పేరు వచ్చింది. నెచెర్ అనగా చిగురు అని అర్థం. బైబిల్లో అనేకులు క్రీస్తును నజరేయుడు అని పిలవడం ద్వారా ఆయన మీద ఉన్న భక్తి భావాన్ని చాటుకొని పునీతులయ్యారు. ఎండిపోయిన జీవితాలను వికసింప చేయగలడు క్రీస్తు. మోడుబారిన బ్రతుకులను చిగురింప చేయగల శక్తి దేవునికి పుష్కలంగా ఉంది. బీటలు తీసిన నేలపై ఆశీర్వాదపు వర్షాన్ని కురిపించగల కరుణామయుడు క్రీస్తు. ఎండిన ఎడారుల్లో నీటిని ప్రవహింపచేసి, బండ నుండి నీటి ఊటలు పుట్టించి, ఎందరినో చిగురింప చేసిన ఘనత యేసుకు దక్కింది. కపెర్నహూము ఇది గలిలయలోని మరో చారిత్రక ప్రదేశము. ప్రపంచంలో సుమారుగా నాలుగు వేల నాలుగొందల పట్టణాలున్నాయని అంచనా. కపెర్నహూముకు ‘యేసు పట్టణము’ అని విశిష్ట నామం కలదు. పురాతన పట్టణ ప్రవేశ ద్వారం నుంచి దానిని చూడవచ్చు. ప్రవక్త తన స్వంత ప్రాంతంలో ఘనుడు కాదు అన్నట్లుగా నజరేతు ప్రజలు యేసును తిరస్కరించుట ద్వారా ఆయన ఇక్కడ నివసించాడు. పాతనిబంధన కాలంలో నహూము అనే ప్రవక్త పేరు ఈ పట్టణానికి పెట్టబడింది. సువార్తికులు ప్రస్తావించిన చారిత్రక ఆధారాలనుబట్టి క్రీస్తు అనేక అద్భుతాలను ఈ పట్టణంలో జరిగించాడు. ఆశ్చర్యకరుడు అనే నామం సార్థకమయ్యింది. ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంతం గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఉంది. యేసు తన శిష్యుడైన పేతురు అత్తను తీవ్ర జ్వరం నుండి విడిపించాడు. రోమన్ శతాధిపతి దాసుడు మరణశయ్యపై ఉండగా క్రీస్తు తన శక్తి ద్వారా లేవనెత్తాడు. ఈ సంగతులను బైబిల్లో చదువుచున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. క్రీస్తు ఈ ప్రాంతంలో అసంఖ్యాకమైన అద్భుతాలు చేసి ప్రజలను దీవించాడు. దేవునికి అద్భుతాలు చేయడం చాలా తేలికైన పని. కపెర్నహూములో ఓ అరుదైన సంఘటన జరిగింది. పక్షవాయువుగల ఒక మనుష్యుని తన స్నేహితులు మోసికొని వచ్చినప్పుడు యేసు బోధిస్తున్న ఇల్లు ప్రజలతో కిక్కిరిసి యుండగా ఇంటి పెంకులు విప్పి మంచముతోనే ఆయన యెదుట దింపగా క్రీస్తు వారి విశ్వాసమునకు ముగ్ధుడై ఆ వ్యక్తిని క్షమించి, స్వస్థపరిచాడు. క్రీస్తు చేసిన అసాధారణ కార్యాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ పట్టణం నిలిచింది. ప్రస్తుతం ఇక్కడ సమాజమందిర శిధిలాలు, మొదటి శతాబ్దపు ప్రజలు నివసించిన గృహాల సముదాయం కలవు.గలిలయలోని మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నాయి. ధన్యతల కొండపై క్రీస్తు చేసిన ప్రసంగం ప్రపంచంలోని అనేకులను నేటికీ ప్రభావితం చేస్తుంది. కానా ఊరిలో నీటిని ద్రాక్షరసంగా మార్చడంలాంటి అద్భుతాలు గలిలయలో చోటు చేసుకున్నాయి. సమరయ క్రీస్తు పాదాలు తాకడం ద్వారా పునీతమైన మరొక ప్రాంతం సమరయ. దీని అసలు పేరు షోమ్రోను. పాతనిబంధనలో చరిత్ర కలిగిన పట్టణము. ఇది ఒక కొండమీద కట్టబడినది. అష్షూరు వారు ఇశ్రాయేలును చెరపట్టే సమయం వరకు ఇది ఇశ్రాయేలు రాజ్యానికి రాజధానిగా ఉంది. క్రీ.పూ. 3వ శతాబ్దంలో అలెగ్జాండరు ద్వారా ఈ పట్టణం నాశనం చేయబడింది. ఆ తదుపరి రోమన్లు దీనిని స్వాధీనపరచుకొని హేరోదు చేతిలో పెట్టారు. అతడు సీజర్ అగస్టస్కు కానుకగా ‘సెబాస్టే’ అను ప్రాంతాన్ని నిర్మించాడు. అష్షూరు పాలనలో వీరు దేవుని నుండి వేరైపోయారు. ఆ కారణాన యూదులచే తీవ్రంగా ద్వేషించబడ్డారు. ‘గెరీజీము’ అను కొండపై దేవాలయాన్ని నిర్మించుకొని దైవారాధన చేయడం ప్రారంభించారు. యూదయ నుండి గలిలయ వెళ్లడానికి సమరయ ద్వారా త్వరితగతిగా వెళ్లగలిగినప్పటికి యూదులు చుట్టు తిరిగి వెళ్లేవారు. వారిలో ఉన్న ఏహ్యభావానికి ఇది అద్దం పడుతుంది. సమరయులు యూదుల ద్వారా అతి తీవ్రంగా ద్వేషించబడుతున్న సమయంలో క్రీస్తు ఆ ప్రాంతంలో అడుగుపెట్టి వారి మధ్యనున్న శత్రుత్వాన్ని రూపుమాపాడు. తనకు మనుష్యులంతా ఒక్కటే అని నిరూపించాడు. ఎన్నో ఏళ్లుగా కట్టబడిన ఎడబాటు గోడలను నిట్టనిలువుగా కూల్చివేశాడు. అశేష ప్రజావాహినికి ప్రయోజనాత్మకమైన ఆనంద కల్పనయే తన లక్ష్యమని నిరూపించాడు. సమరయలోని సుఖారను ప్రాంతంలో ఓ స్త్రీతో క్రీస్తు సాగించిన సంభాషణ జనాదరణీయమైనది. ఆమె మొదట క్రీస్తును యూదునిగా, ఆపై ప్రవక్తగా, చివరకు మెస్సీయాగా గుర్తించింది. మెస్సీయా అనగా ప్రజలను రక్షించే అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు యొక్క సార్వభౌమాధికారాన్ని, అసామాన్య జ్ఞాన సంపదను గుర్తించి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా’’ అని చెప్పి గ్రామస్థులకు క్రీస్తును పరిచయం చేసింది. వారితో క్రీస్తు బస చేసిన కొన్ని గంటల్లోనే వారి మనోనేత్రాలు తెరువబడి క్రీస్తును లోకరక్షకుడని గుర్తించారు. బేతనియ నిర్దిష్ట చారిత్రక వాస్తవికతలో జీవించిన క్రీస్తు అడుగుపెట్టిన ప్రాంతాల్లో మరో అద్భుత ప్రాంతం బేతనియ. ఆ పేరుకు ‘ఖర్జూర పండ్ల గృహము’ అని అర్థం. ఒలీవ కొండ అంచున ఉన్న ఆహ్లాదకరమైన ప్రాంతం ఇది. యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే మార్గంలో ఈ గ్రామం కనబడుతుంది. క్రీస్తు కొన్నిసార్లు ఈ ప్రాంతంలో బసచేశాడు. ఇక్కడ నివసించే ఒక కుటుంబం యేసుకు చాలా ఇష్టం. మార్త, మరియ, లాజరు అను ముగ్గురు యేసుకు చాలా ప్రియమైన వారు. ప్రాపంచిక అనైతికత్వము నుండి ఆధ్యాత్మిక దిశగా మనిషిని నడిపించిన క్రీస్తు దివ్యబోధలు మారుమోగిన ప్రాంతం ఇది. సీమోను అను కుష్టువ్యాధిగ్రస్తుడు ఇక్కడ ఉండేవాడు. ఆ కాలంలో ప్రతివిధమైన చర్మవ్యాధిని కుష్టువ్యాధిగా పరిగణించేవారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా వారిని సమీపించేవారు కాదు. ప్రజల చేత, సమాజం చేత చీదరించబడిన వ్యక్తిని యేసు చేరదీశాడు. తన దివ్యహస్తాలతో ముట్టి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. మరణబంధకాల్లో చిక్కుకుపోయిన లాజరును క్రీస్తు తన మానవాతీత శక్తితో బతికించాడు. శరీరంలో జీవక్రియలు ఆగిపోయిన నాలుగు రోజుల తర్వాత కూడా క్రీస్తు పలికిన శక్తిగల మాట ద్వారా లాజరు మరణ బంధకముల నుండి విడిపించబడి సజీవుడుగా బయటకొచ్చాడు. పునరుత్థానమును, జీవమును నేను అని సగర్వంగా ప్రకటించిన క్రీస్తు దివ్య శక్తి బేతనియలో రుజువు చేయబడింది. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ‘ఎల్–అజరియా’ అని పిలుస్తారు. ‘లాజరు ఊరు’ అని దాని అర్థం. ‘లాజరు’ మృతమైపోయిన మనిషి కలలకు సాదృశ్యం. ఒక వ్యక్తి యొక్క కలలను కొన్నిసార్లు మనుష్యులందరూ అదిమిపెట్టి సమాధిలో పెట్టేస్తారు. దేవుడొక్కడే వాటిని తిరిగి బతికించగలడు. ‘నీ కలలు తిరిగి జీవిస్తాయి’ అన్న నిరీక్షణ క్రీస్తు దగ్గర ఉంది. చనిపోయిన లాజరును బతికించిన క్రీస్తు మృతమైపోయిన నీ కలలను తిరిగి బతికించగలడు. యెరూషలేము యెరూషలేము పట్టణము ఇశ్రాయేలు దేశానికి ‘గుండు’లాంటిది. విశాలమైన చరిత్ర దీనికుంది. ‘యెరూషలేము’ అనగా ‘సమాధానమును దేవుడే చూచుకొనును’ అని అర్థం. యెరూషలేము పట్టణము కొండలమీద కట్టబడినది. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును ఇక్కడే బలివ్వడానికి సిద్ధపడ్డాడు. దావీదు మహారాజు ఇశ్రాయేలు దేశాన్ని ఇక్కడ నుండే దిగ్విజయంగా పాలించాడు. ఎన్నో విశిష్టతలు కలిగిన పట్టణము గనుకనే అనేకసార్లు శత్రువుల చేతికి చిక్కింది. ప్రపంచ చరిత్రలో 17 సార్లు పూర్తిగా, 13 సార్లు పాక్షికంగా ఈ పట్టణం నాశనం చేయబడింది. సర్వలోకనాథుడైన క్రీస్తు ఈ పట్టణంలో అనేక అద్భుతాలు చేయడంతో పాటు తన అద్వితీయశక్తిని కనుపరిచాడు. మట్టల ఆదివారం రోజున యేసుగాడిదపై ప్రయాణం చేసుకుంటూ ఈ పట్టణంలో ప్రవేశించాడు. ‘హోసన్నా జయం’ అనే కేకలు మారుమోగాయి. చరిత్రలో ఎందరో ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రవేశించారు గాని క్రీస్తు ఆ పట్టణంలో లోకరక్షణార్థం తన రక్తాన్ని కార్చడానికి, సిలువలో మరణించడానికి వెళ్లాడు.క్రీ.పూ. 955లో సొలొమోను ద్వారా ఓ అద్భుత దేవాలయం కట్టబడింది. అయితే మొదటి శతాబ్దంలో క్రీస్తు ద్వారా హృదయం అనే దేవాలయం కట్టబడింది. ఇకపై దేవుడు గుడి గోడల్లో కాదు నివసించేది గుండె గుడిలో అని క్రీస్తు ఉద్బోధించాడు. యెరూషలేము చారిత్రకంగా చాలా ప్రసిద్ది చెందింది. ఇది మూడు రకాల ప్రజలకు పవిత్ర స్థలం. క్రైస్తవులు, మహ్మదీయులు, యూదులు పవిత్రస్థలంగా భావిస్తారు. క్రీస్తు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చాయి. పన్నెండు గుమ్మములుగల యెరూషలేము ప్రాకారము, సీయోను కొండమీద ఉన్న మేడగది, క్రీస్తు ప్రార్థించిన గెత్సేమనె తోట, వయా డొలొరొసా అని పిలువబడిన సిలువ మార్గము. సిలువ వేయబడిన కల్వరి కొండ, మరణాన్ని జయించి తిరిగిలేచిన ఖాళీ సమాధి ఇవన్నీ యెరూషలేములో సందర్శించదగ్గ ప్రాంతాలు. రక్షకునిగా ఏతెంచి, ఉన్నత వ్యక్తిత్వాన్ని మాదిరిగా చూపి, సర్వజనుల పాపపరిహారార్థం కలువరి సిలువపై మరణించి, మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శం. నిత్యరక్షకుడైన ఆ ప్రభువును హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు శాంతి, సమాధానం, ఆత్మరక్షణ మన సొంతమవుతాయి. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
పరిశుద్ధ లేఖనాల్లోని ప్రవచనాల సమాహారం
ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి, మనం దేవుని ప్రేమించామని కాదు, ఆయనే మనలను మొదట ప్రేమించారు. అందుకే మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన కుమారుని పంపారు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాం. ఈ లోకంలో మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవైనా, రాబోయేవైనా, అధికారులైనా, ఎల్తైనా, లోతైనా, సృష్టింపబడినదేదైనా మన ప్రభువునైన క్రీస్తు యేసునందలి ప్రేమ నుంచి మనలను దూరం చేయవు. దేవుడికి ఏ ఒక్కరూ నశించిపోవుట ఇష్టం కాదు. నశించిన దానిని వెదికి రక్షించటానికే మనుష్య కుమారుడు వచ్చాడు. ఎందుకంటే దైవత్వం సర్వ సంపూర్ణ శరీరంగా క్రీస్తులో నివసిస్తోంది. ఆయన శిలువ మీద మన పాపాలన్నింటినీ మోసి వెల చెల్లించాడు. దేవునికి మానవునికి సంధి చేశాడు. దేవుడు తన సొంత కుమారుని అనుగ్ర హించటానికి వెనుకదీయకుండా మన అందరి కోసం ఆయనను అప్పగించాడు. అదీ... ఆయనకు మనమీద ఉన్న ప్రేమ! పాప క్షమాపణ యేసు రక్తము జయము. అపవాది క్రియలకు లయము. పాపము చేయని మనిషంటూ ఉండడు. తెలిసో తెలియకో ఏదో ఒక పాపం మనవల్ల జరుగుతూనే ఉంటుంది. అందుకే మన కోసం ఆ ప్రభువు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. మన పాపాల నుంచి మనకు విముక్తి కలిగించడానికే దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మన కోసం ప్రాణత్యాగం చేశాడు. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ కలుగదు కనుక, మన పాపాల కోసం క్రీస్తు శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం మనలను కడిగి పరిశుద్ధ పరచడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచితే... ఆయన నామం మూలంగా మనం తప్పకుండా పాప క్షమాపణను పొందుతాం. మనం పాప క్షమాపణ పొందినప్పుడే అపవాదిని జయించగలుగుతాం. ఆ విజయాన్ని సొంతం చేసుకోవాలంటే మన పాపాలకు క్షమాపణను మనం పొంది తీరాలి. అది క్రీస్తును విశ్వసించి, ఆయన మార్గంలో నడవడం ద్వారానే సాధ్యపడుతుంది. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు! చాలామంది తమను తాము అధికులుగానే భావిస్తారు. ఇతరులు తమను అలాగే చూడాలని హెచ్చులకు పోతుంటారు. అది ప్రభువుకి ఏమాత్రం నచ్చని విషయం. అందుకే ఆయన తగ్గించుకుని బతకమని ఆదేశించాడు. తన్ను తాను హెచ్చించు కొనువాడు తగ్గించబడతాడని, తన్ను తాను తగ్గించుకొనేవాడు హెచ్చింపబడతాడని ఆయన చెప్పాడు. అలా తగ్గించుకోవడం ద్వారానే మనం దేవుని కృపను పొందగలుగుతాం. నిజానికి దైవ కుమారుడే ఎంతో తగ్గించుకున్నాడు. మన కోసం ఓ సాధారణ మనిషిలా పశువుల పాకలో జన్మించాడు. ఈ లోకములోనే పెరిగి, పాపుల మధ్యన మసిలి, తన నిరాడంబరతను చాటుకున్నాడు. సిలువ మరణాన్ని పొందాడు. తాను చేసిన ప్రతి పనిలోనూ తనను తాను ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని పోలికతో పుట్టిన నరులమైన మనం కూడా మనలను మనం తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు మనలను హెచ్చిస్తాడు. విశ్వాసం! దేవునిపై విశ్వాసం ఉన్ననాడే దేవుని అడుగు జాడల్లో నడవగలుగుతాం. అందుకే మనం కచ్చితంగా ఉత్తమ విశ్వాసిగా ఉండి తీరాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ విశ్వాస వీరులుగా ఉండాలి. పరిశుద్ధులు విశ్వాసం ద్వారా గొప్ప సాహసోపేతమైన కార్యాలు చేశారని పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. వాళ్లందరూ ఘనపరచబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి గురించి పాత నిబంధన ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. మనమూ అటువంటి విశ్వాసులమై ఉండాలి. అప్పుడే మనం మనలను బలహీనపరిచే దురాత్మలతో పోరాడగలం. ఆ పోరాటంలో విజయమూ సాధించగలం. కాబట్టి దేవునియందు విశ్వాసం కలిగి జీవిద్దాం. ఆ విశ్వాసం మనకు జయాన్ని తెస్తుంది. మనలను విజేతలుగా నిలబెడుతుంది. ఆ విజయం ఎంతో గొప్పది. అది లోక సంబంధితమైన విజయం కాదు. పరలోకంలో మనకు స్థానం కల్పించే గొప్ప విజయం! ఇచ్చేవారు ధన్యులు! ‘పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము’ అన్నాడు ప్రభువు. దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. మన అవసరతలన్నీ తీర్చాడు. అవి లేనివాళ్లు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వారికి మనకున్నదానిలో కాస్తయినా ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, బట్టలు లేనివారికి బట్టలిస్తే నాకు ఇచ్చినట్టే, అవసరంలో ఉన్నవారికి మీరు చేసే ప్రతి సాయం నాకు చేసినట్టే అని ప్రభువు చెప్పాడు. నీ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి అడిగితే లేదని అనవద్దు అని కూడా లేఖనాల్లో స్పష్టం చేశాడు. తన బిడ్డలకు దాతృత్వం ఉండి తీరాలి అన్నదే ఆయన అన్న మాటలకు అర్థం. మనకన్నీ ఇచ్చే మన ప్రభువు మనలో దాతృత్వాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. అది మనలో ఉంటే మనం ధన్యులమైనట్టే! స్వస్థపరచువాడు! మన దేవుడు స్వస్థపరుచువాడు. అంతే కాదు, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలలో ఏదీ కూడా మనకు రానివ్వనని ఆనాడే ఆయన వాగ్దానం చేసివున్నాడు. ఆయనే మనకు రక్ష. ఆయన వ్యాధిని తొలగించువాడు మాత్రమే కాదు. మంచి ఆరోగ్యము ఇచ్చేవాడు కూడా! మన ప్రభువు మన పాపములను క్షమించువాడు. శాపములను తొలగించువాడు. వ్యాధులను స్వస్థపరుచువాడు. చేదైన జీవితమును మధురమైనదిగా మార్చువాడు. ‘‘మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ’’ అని పరిశుద్ధ లేఖనం మనకు స్పష్టం చేస్తోంది. కేవలం మన కోసమే ఆయన శిక్షను అనుభవించాడు. మన జీవితాలను బాగు చేసేందుకే తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయనే మనలను కాపాడువాడు. ఆయనే మనకు నిత్యజీవాన్ని అనుగ్రహించువాడు. సమస్తం అనుగ్రహించువాడు! దేవుడు తన సొంత కుమారుడినే మన కోసం బలి చేశాడు. మరి మనం ఆయన మార్గంలో నడిస్తే మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు! ఎంత గొప్ప ప్రేమ ఆయనది! యేసయ్య తన రక్తమాంసములను మాత్రమే కాక లోకము ఇవ్వలేని తీసుకోలేని దైవిక సమాధానాన్ని, రక్షణను మనకు అనుగ్రహించాడు. జీవకిరీటాన్ని, నిత్య నివాస స్థలాన్ని మనకు ఇచ్చాడు. మనం చేయవలసినదంతా కేవలం మన హృదయాన్ని ఆయనకు ఇవ్వడమే! ‘కుమారుడా, కుమార్తే... నీ హృదయమును నాకిమ్ము’ అని ఆయన నోరు తెరిచి మనల్ని అడుగుతున్నాడు. యేసు తన రక్తము ద్వారా మనలో నిబంధన చేసుకున్నాడు. పాపాలను క్షమించడమే కాకుండా, శాప ప్రభావాన్ని కూడా తొలగించి దేవుని ఉగ్రత నుండి కాపాడాడు. సాతాను తలను చితక త్రొక్కి మన వ్యాధిని స్వస్థపరిచియున్నాడు. మన కోసం సమస్తం చేసిన మన ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుని తీరాలి. ఆదరణ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఈ లోకంలో ఎటు చూసినా దుఃఖమే కనిపిస్తోంది. కానీ ఆయన సన్నిధి మనల్ని కాపాడుతోంది. లోకులు మన çహృదయాన్ని గాయపరుస్తుంటే... ఆయన మనల్ని ఓదార్చి బలపరుస్తున్నాడు. ఆయన హస్తములు మనల్ని ప్రేమతో దగ్గరకు తీసుకుంటున్నాయి. ప్రభువు కన్నీటిని తుడుచువాడు, రోగ పీడితులను స్వస్థపరుచువాడు, చనిపోయినవారిని లేవనెత్తువాడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించువాడు అన్న విషయం ఎప్పుడో నిరూపణ అయ్యింది. ఎలాంటి శ్రమలో ఉన్నా, దాన్ని తొలగించి ఆయన శక్తిని ఇస్తున్నాడు. ఆదరించి అక్కున చేర్చుకుంటున్నాడు. కష్టాలు చుట్టుముట్టిన సమయంలో కావలి ఉంటున్నాడు. కంటికి రెప్పలా కాపాడి కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. ఆ ఆదరణ ఎంతో గొప్పది. ఆయన ఆదరణే మనల్ని ఈ లోక సంబంధిత శ్రమల నుంచి, అపనిందలు అష్టకష్టాల నుంచి విముక్తుల్ని చేస్తున్నది. క్షమాపణ మీ ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము (మత్తయి 6:12) అంటూ పరలోక ప్రార్థనలో మనకు నేర్పించాడు యేసయ్య. మేము మాకచ్చియున్న ప్రతిదానిని క్షమించియున్నాము గనుక మా పాపములను క్షమింపుము అని లూకా సువార్తలో కూడా ఉంది. అయితే కొందరు దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, జవాబు ఇవ్వడం లేదు, ముఖం తిప్పుకున్నాడు అని బాధ పడుతూ ఉంటారు. కానీ ఆయన మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం మనలో ఉన్న క్షమించలేని గుణమే. మన హృదయంలో కోపం, వైరాగ్యం ఉన్నప్పుడు మన పట్ల దేవుని ప్రసన్నత ఉండదు. ఎదుటివారిని మనఃపూర్వకముగా క్షమించని యెడల మనమూ క్షమాపణ పొందలేం. మీకు విరోధమేమైన యున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును’’ అన్నాడు ప్రభువు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాలంటే, ముందు మనం ఇతరుల్ని క్షమించాలి. భయం పరిశుద్ధ గ్రంథంలో ‘భయపడకుము’ అన్న మాట 366 సార్లు రాయబడివుంది. మనము ప్రతిదినం ప్రభువును నమ్ముకొనుట వలన భయాన్ని జయిస్తాము. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. ధైర్యం చెప్పి మనలను బలపరుస్తున్నాడు. కాబట్టి ‘‘భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము’’ (కీర్తన 46:2–3). దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొడుతుంది (1 యోహాను 4:18). లోక రక్షకుడు మనకు అండగా ఉండగా మనకేమి భయము? కాకపోతే భయమును జయించు విశ్వాసము మనలో ఉండాలి. యుగసమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి భయాన్ని వీడి ధైర్యంగా జీవించాలి. విజ్ఞాపన ప్రార్థన మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోబు విషయంలో అదే జరిగింది. అతడు ఎన్నో కష్టాలు పడుతూ కూడా తన కోసం ప్రార్థించలేదు. తన స్నేహితుల కోసం, తనను అవహేళన చేస్తున్నవారి కోసం కూడా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టం. స్వార్థపూరితమైన ప్రార్థన దేవుని చెవులను చేరదు. దీన మనస్సుతో చేసిన ప్రార్థన అత్యంత వేగంగా ఆయన వద్దకు చేరుతుంది. అంతే వేగంగా ఆయన ఆశీర్వాద ఫలము కూడా మనలను వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఇతరుల కోసం ప్రార్థించాలి. ఇతరుల సంతోషం కోసం, వారి సుఖ సౌఖ్యాల కోసం ప్రార్థన చేయాలి. వై.ఎస్. విజయలక్ష్మి -
ఎవడు నిజమైన సంపన్నుడు?
సువార్త ధనబలంతో దేవుణ్ణి కూడా కొనవచ్చుననుకున్నారు వాళ్లంతా! కానీ తన చిరుకానుకను దేవుడు మెచ్చితే చాలనుకుంది ఆ పేద విధవరాలు!డబ్బే సర్వస్వమై అది చివరికి ధర్మాన్నీ, దేవాలయ విధివిధానాన్నీ కలుషితం చేస్తున్న నేపథ్యంలో యేసుక్రీస్తు ఒక నిజమైన మహాదాతను లోకానికి పరిచయం చేశాడు. ఆలయంలోని కానుకల పెట్టెలో తనకున్న రెండు కాసుల్నీ వేసి ఆనందంగా ఇంటికెళ్లిన నిరుపేద విధవరాలు ఆమె. ఆమె చిరుకానుకను యేసు ఆకాశానికెత్తి కీర్తించారు. అప్పట్లో అది సంచలనం! అంతా తమ కలిమిలో నుండి ఇచ్చారు. కానీ, ఆమె తన లేమిలో నుండి ఇచ్చిందని యేసు వివరించాడు (మార్కు 12:41-44). ధన, బలప్రదర్శనకు దాతృత్వాన్ని వాడుకొంటున్న స్వార్థపరులైన దాతల సరసన యేసు ఆమెను నిలబెట్టలేదు. తన కానుకతో దేవుణ్ణే మెప్పించి ఆశీర్వాదాలు పొందిన అరుదైన వర్గంలో ఆమెను చేర్చాడు. ‘పరలోకరాజ్యం’ తర్వాత యేసు ప్రభువు ఎక్కువగా బోధించిన అంశం ‘ధనం’. మనిషి ‘డబ్బు’ పట్ల అనుసరించే వైఖరితోనే పరలోకాన్ని పొందడమో, పోగొట్టుకోవడమో జరుగుతుంది. అది గ్రహించి యేసు ఎన్నో హెచ్చరికలు చేశాడు. ‘ధనసమృద్ధి’ అనేది శీలదారిద్య్రానికి తావిచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ధనికులు తమ వైఖరి వల్ల పరలోకరాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని కూడా చెప్పాడు (లూకా 18:24). డబ్బుకున్న ‘విధ్వంసకశక్తి’ని అందరి కన్నా ముందే యేసు పసిగట్టి అందుకు విరుగుడు విధానాల్ని తన బోధల్లో చేర్చాడు. తల్లితండ్రుల నుండి పిల్లల్ని వేరు చేసి, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అడ్డుగోడల్ని సృష్టించే శక్తి ధనానిది. దాని ప్రభావం మనిషిని అవలీలగా దేవుని నుండి పరలోకరాజ్యం నుండి దూరం చేయగలదని యేసు ముందే గ్రహించాడు. అందుకే, దాతృత్వం ధనంతో కాదు మనిషి స్వభావం, హృదయంతో ముడిపడిన అంశం అన్నాడాయన. మనిషి దాతృత్వానికి దేవుని పట్ల అతనికున్న విధేయత, విశ్వాసం, ప్రేమ పునాదిగా ఉంటే అది లోకకల్యాణం అవుతుందని ప్రభువు అన్నాడు. అలాంటి ‘ఇవ్వడం’ వల్ల విశ్వాసి మరింత బలపడతాడు. అయితే స్వార్థపూరితమైన ఆలోచనలతో, ఇంకేదో ఎక్కువగా రాబట్టుకోవాలన్న వ్యూహంతో ‘ఇచ్చే’ కానుకలు అతణ్ణి మరింత బలహీనపరుస్తాయి. కొంత దాచుకోకుండా అంతా ఖర్చు చేయడం ఎంత అవివేకమో, ధనశక్తితో నిరుపేదలను, నిరాశ్రయులను ఆదుకోకుండా, వారికివ్వకుండా అంతా దాచుకోవడం అంతకన్నా అవివేకం! (మత్తయి 6:9-20). ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలన్న దురాశతో మనిషి ‘బంగారు పంజరం’లో చిక్కుకున్నాడు. సొంతంగా ఏరి తెచ్చుకున్న పుల్లలతో కట్టుకున్న గూట్లో పక్షికున్న హాయి, వెచ్చదనం, ఆనందం... పంజరంలోని పక్షికెక్కడిది? అందుకే తన వద్ద ఉన్న రెండు కాసుల్నీ దేవునికిచ్చి, రేపటి అవసరాన్ని దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసంతో ఆనందంగా తన గూటికి వెళ్లిపోయింది - పేద విధవరాలు. పోటీలు పడి ఒకర్ని మించి మరొకరు అత్యధికంగా కానుకలు వేసిన ప్రముఖులంతా ఇంకా ఎక్కువగా సంపాదించే తాపత్రయంలో బంగారు పంజరంలో చిక్కి, శాంతిని పోగొట్టుకున్న పక్షులయ్యారు. నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడం కాదు... ఈ లోక ధనాన్ని పరలోక ధనంగా మార్చుకొనే వాడే నిజమైన సంపన్నుడు! కొంత దాచుకోకుండా అంతా ఖర్చు చేయడం ఎంతో అవివేకం. ఇక, ధనశక్తితో నిరుపేదలనూ, నిరాశ్రయులనూ ఆదుకోకుండా, వారికివ్వ కుండా అంతా దాచుకోవడం అంతకన్నా అవివేకం! (మత్తయి 6:9-20). రెవ. డాక్టర్ టి.ఎ.ప్రభుకిరణ్ -
క్రిస్మస్ కానుకగా...
యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. ప్రభువు పాత్రలో పీడీ రాజు నటించారు. జె.జాన్బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ వచ్చిన యేసుక్రీస్తు చిత్రాల్లో ఎవరూ చూపించని అంశాలనూ, కోణాలనూ ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. కీలక సన్నివేశాలను జీసస్ పుట్టిన ఇజ్రాయిల్లోని జెరూస లెమ్తో పాటు ఈజిప్టు దేశాల్లో చిత్రీకరించాం. ఆర్పీ పట్నాయక్గారు మంచి పాటలి చ్చారు. క్రైస్తవ సమాజంతో పాటు ఇతర వర్గాల వారి నుంచి కూడా మా చిత్రానికి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కథ మేము అనుకున్నదానికంటే బాగా వచ్చింది. ఆర్పీ సంగీతం హైలైట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా పాటలు రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. -
ఆ పీడితుడు... ఇప్పుడు... దైవారాధకుడు
సువార్త గలిలయ సముద్రానికి అవతల ఉన్న గెరాసేనుల దేశానికి యేసుక్రీస్తు ఒకసారి వెళ్లాడు. అత్యంత హేయమైన పూజా విధానాలు, ఆచారాలున్న ఆ ప్రదేశానికి యూదులు వెళ్లడం నిషిద్ధం. కానీ అక్కడున్న ఒక దురాత్మల పీడితుణ్ణి బాగు చేయడానికి ప్రభువు వెళ్లాడు. అతడక్కడ అందరిపై దాడి చేస్తూ, గాయపరుస్తూ, అరుపులు కేకలతో హడలెత్తిస్తూ, నగ్నంగా తిరుగాడుతూ, సమాధుల్లో నివాసం చేస్తూ, అందరికీ బెడదగా మారాడు. యేసు అతణ్ణి కలుసుకోగానే స్వస్థపరచాడు. అంతే... అతను ఒక్కసారిగా సాధువైపోయి ఆయన పాదాల వద్ద కూర్చుండిపోయాడు. యేసు ఆజ్ఞతో అతణ్ణి వదిలిన ఎన్నో దుర్మాత్మలు అక్కడున్న రెండు వేలకు పైగా పందుల్లో దూరాయి. అవి తాళలేక పర్వతం పై నుండి సముద్రంలోకి దూకి చనిపోయాయి. కానీ అంతకాలం అన్ని దురాత్మల విధ్వంసక శక్తికి నిలయంగా ఉన్న ఆ వ్యక్తి మాత్రం స్వస్థచిత్తుడయ్యాడు. ఆ ప్రాంతవాసులంతా అది చూసి నివ్వెరపోయారు. యేసుక్రీస్తు కోరి మరీ నిషిద్ధ ప్రాంతానికి సైతం వెళ్లి అంతా ఈసడించుకున్న అతణ్ణి బాగుపరిచి నూతన జీవితాన్నివ్వడం దేవుని అసమాన ప్రేమకు అద్భుతమైన నిదర్శనం! మనం దేవుణ్ణి చూడకున్నా ఆయన మనల్ని చూస్తున్నా డనీ, చాలా ఈవులు (వరాలు) ఆయన మనం అడక్కుండానే మనకు అనుగ్రహిస్తున్నాడనీ అనడానికి అది ఒక ఉదాహరణ. దేవుని ప్రేమ తాకిడితో అతను సమాధులు వదిలి, దేవుని పాదాల వద్దే నివసిస్తున్నాడు. అరుపులు, కేకలు మాత్రమే ఎరిగిన వ్యక్తి ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. నగ్నంగా పరుగులు తీసినవాడు ఇప్పుడు నవీన వ్యక్తిగా మారి నిశ్చలంగా, నిర్మలంగా దేవుని వద్ద కూర్చున్నాడు (మార్కు 5:1-20). లోకం వెలివేసిన వారినీ, పాపులనూ దేవుడు దగ్గరికి తీసి వారికి నూతన జీవితాన్నీ, నిత్యత్వాన్నీ ప్రసాదిస్తాడు. వారితోనే చరిత్రను తిరగరాయించి, లోకానికి వారిని ఆశీర్వాదంగా మారుస్తాడు. అదే దేవుని అద్భుతమైన ప్రేమ. అలాంటి యేసుక్రీస్తును ఆ వ్యక్తి స్వీకరించాడు కానీ, అక్కడి ప్రజలు తృణీకరించారు. తమ దేశాన్ని వదిలి వెళ్లమని అక్కడి ప్రజలు యేసును వేడుకోవడం ఆశ్చర్యం. ఎందుకంటే ఇస్రాయేలులోని యూదులకి పంది మాంసం నిషిద్ధం. కానీ అక్కడ రోమా అధికారులకీ, రోమా సైనికులకేమో అది అత్యంత ప్రీతిపాత్రం. అందువల్ల గెరాసేను ప్రజలు పందుల్ని పెంచి, మాంసాన్ని రోమీయులకు విక్రయించే లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. ఆ కారణం వల్ల దురాత్మల పీడితుడు బాగయ్యాడని ఆనందించే బదులు, రెండు వేల పందులు చనిపోయాయని బాధపడ్డారు. యేసు అక్కడే ఉంటే మరిన్ని పందులు చనిపోతాయని భయపడ్డారు. దేవుడు అష్టకష్టాల కోర్చి, అన్నీ నష్టపోయి, పరలోకాన్ని కూడా వదిలేసి వచ్చి, పాపుల్ని రక్షించడానికి పూనుకుంటే - యేసు రాక వల్ల తాను ఎంత నష్టపోయానో లెక్కలేసుకుంటోంది ఈ లోకం. లోకపు లాభనష్టాల భాషకు దేవుని సర్వోన్నతమైన, అమూల్యమైన ప్రేమ విలువ అర్థమవుతుందా? దేవుని కన్నా మనుషుల కన్నా పందులనే ప్రేమించి వాటికే విలువనిచ్చే అక్కడి ప్రజల మధ్య తానుండలేనని గ్రహించిన ఆ వ్యక్తి తాను వెంట వస్తానని యేసును బతిమాలాడు. కానీ అక్కడే ఉండి పరిచర్య చేయమన్నాడు ప్రభువు. అతడా ప్రాంతంలో దివ్యమైన పరిచర్య చేసి ఎంతోమందిని ప్రభువు మార్గంలోకి నడిపించాడని చరిత్ర చెబుతోంది. - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
తొలిసారి జీసస్ సమాధి తెరిచారు
జెరూసలెం: చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. ఈ సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సమాధిపై ఉన్న రాయిని పలువురు చర్చి మతపెద్దల సమక్షంలో పరిశోధకులు అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత క్రీ.శ.1555 నుంచి ఈ పవిత్ర చలువరాతిని ఏనాడు కదిలించలేదు. అయితే, తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పరిశోధకులు తొలిసారి దీనిని తెరిచారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఫ్రెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ 'క్రీస్తును ఉంచి సమాధి పైభాగాన్ని కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశాం. దాని కింద ఉన్న వస్తువులు చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం' అని చెప్పారు. 'చాలా సుదీర్ఘకాలంగా జరిగిన విశ్లేషణ అనంతరం క్రీస్తు సమాధిపై ఉంచిన అసలైన చలువరాయిని ఎట్టకేలకు ఇప్పుడు అందరం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. దీని కిందే క్రీస్తును ఉంచారు' అని కూడా ఆయన తెలిపారు. క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించగా దాని మధ్యలో సమాధి చుట్టూ ఒక చిన్న నిర్మాణం ఉంది. దీనిని ఎడిక్యుల్ అంటారు. అతి సుందరంగా నిర్మించిన ఇందులో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో 1808, 1810 మధ్య పునరుద్ధరించారు. ఆ సమయంలో నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ పరిశోధకులు ఆ పనులు పూర్తి చేశారు. కాగా, తాజాగా మరోసారి పునరుద్ధరించనున్నారు. -
తొలిసారి జీసస్ సమాధి తెరిచారు
-
ప్రతి భయానికీ విశ్వాసమే విరుగుడు!
సువార్త గలలియ సముద్రం మధ్యధరా సముద్రానికి 700 అడుగుల దిగువన ఉంటుంది. అకారణంగా యేసుక్రీస్తు భీకరమైన గాలులు చెలరేగిసముద్రం పొంగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ఒకసారి తన శిష్యులను దోనెలో అద్దరికి పంపి తాను ఏకాంత ప్రార్థన కోసం కొండల్లో ఉండిపోయాడు. మార్గమధ్యంలో శిష్యుల దోనె పెనుగాలులలో చిక్కి పొంగుతున్న సముద్రంలో మునిగే ప్రమాదం ఏర్పడింది. పైగా అది అర్ధరాత్రి. శిష్యులు ప్రాణభయంతో గడగడలాడుతుండగా, యేసు అలల మీద నడుస్తూ వారి వద్దకు వస్తుండగా, ఆయన్ను చూసి భూతమనుకొని మరింత భయపడ్డారు. యేసు ‘నేను, భయపడకండి’ అని చెప్పడంతో వారు ఊరట చెందారు. దోనెలోని పేతురు అనే శిష్యుడు ‘‘అయితే నీ వద్దకు నేను రానా?’’ అనడిగితే ప్రభువు రమ్మన్నాడు. మరుక్షణం పేతురు అలలమీదున్నాడు. కాని, గాలికి భయపడి మునిగిపోతుంటే యేసు ఆయన్ని కాపాడి అతని అవిశ్వాసాన్ని గద్దించాడు. యేసు దోనెలోకి రాగానే గాలి నెమ్మదించింది. నీవు నిజంగా దేవుని కుమారుడంటూ శిష్యులాయనకు మొక్కి ఆరాధించారు (మత్త 14:22). ఆపదకన్నా, దొంగలకన్నా, అనుకోని అవరోధం కన్నా అత్యంత దుర్మార్గమైన, ప్రమాదకరమైన శత్రువు భయం. ఆ రాత్రి తుఫాను గాలులకు శిష్యులు భయపడ్డారు. ప్రభువున్నాడన్న విశ్వాసంతో నీళ్లమీద నడిచి సముద్రాన్నే జయిద్దామనుకున్న పేతురు, గాలికి భయపడి డీలా పడ్డాడు. అలల మీదే నడిచే నాకు ఈ గాలి ఎంత అనుకోవలసింది పోయి, అయ్యో, ఇంత గాలిని తట్టుకోగలనా? అని అవిశ్వాసపడ్డాడతను. అప్పుడు శిష్యులు, ఇప్పుడు మనుషులంతా ఏదో ఒక భయం, బాధితులే! ఈ శిష్యులంతా ఒకప్పుడు జాలరులు. వారికి సముద్రపుగాలులు, పడవ ప్రమాదాలు, వాటి భయాలు కొత్తకాదు. కానీ ఇప్పుడు తాము గాలిని, సముద్రాన్ని, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన, శాసించగలిగిన దేవుని శిష్యులుగా, దేవుణ్ణి తాకలేని ఏ భయమూ, ప్రమాదమూ తమను కూడా తాకలేదన్న అత్యున్నత స్థితిలో తామున్నామని శిష్యులు గ్రహించలేకపోయారు. ప్రతి భయానికీ, విశ్వాసమే విరుగుడు. అర్ధరాత్రిపూట పెనుగాలులు చెలరేగినప్పుడు యేసు తమతో లేడన్న భావనే వారిని భయానికి గురి చేసింది. ‘మేము దోనెలో, సముద్ర మధ్యలో, యేసు అక్కడెక్కడో కొండల్లో ఉన్నాడు. ఇప్పుడెలా అన్నదే వారి భయానికి మూలమైంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో సుదూరంగా ఆకాశంలో ఉన్న, వుండే దేవుడు కాడని, ఆయన విశ్వాసితోనే, విశ్వాసిలోనే సదాకాలం ఉంటాడన్న విశ్వాసంలోకి, వారింకా ఎదగలేదు (మత్తయి 28:20). విశ్వాసంలో ఒక్కొక్క మెట్టూ మనం ఎక్కేకొద్దీ భయాలు ఒక్కొక్కటే దూరమైపోతాయి. దేవునికి తెలియని ఏ పరిస్థితీ, ప్రమాదమూ విశ్వాసి దరిదాపుల్లోకి కూడా రాదు. విశ్వాసిని ఏ పరిస్థితుల్లోనైనా, ఏ గడ్డుకాలంలో అయినా గట్టెక్కించే బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. మన చేయి ఎట్టి పరిస్థితుల్లోనూ, పరలోకపు తండ్రియైన దేవుని చేతిలోనే ఉంటుందన్న విశ్వాస స్థాయికి ఎదగడమే అన్ని భయాలనూ జయించే ఏకైక మార్గం!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
పేదలను ఆదుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది!
సువార్త కొందరు అన్నీ ఉన్నా అసలైనది సాధించలేరు. ఒక యువకుడు, ప్రముఖుడు ఒకసారి యేసుక్రీస్తు వద్దకు పరిగెత్తుకొచ్చి మోకరించి నిత్యజీవం పొందడానికి నన్నేం చేయమంటావని అడిగాడు. దైవాజ్ఞలన్నీ పాటించమని ప్రభువు చెబితే బాల్యం నుండి అవన్నీ తు.చ తప్పకుండా పాటిస్తున్నానన్నాడు. ‘అయితే నీకొకటి కొదవగా ఉంది, నీ ఆస్తంతా అమ్మి బీదలకు పంచి వచ్చి నన్ను వెంబడించు’ అన్నాడు యేసుప్రభువు. ఎంతో ధనవంతుడైన ఆ వ్యక్తి ప్రభువు మాటలకు చిన్నబుచ్చుకుని వెనుదిరిగి వెళ్లిపోయాడని బైబిలు చెబుతోంది (మార్కు 10:17-28). అంతా నిరాశా నిస్పృహలతో ప్రభువు వద్దకొచ్చి ఒడినిండా ఆశీర్వాదాలు నింపుకొని ఆనందంగా తిరిగి వెళుతుంటే, ఆయన్ను ఆశ్రయించి వట్టి చేతులతో వెళ్లిపోయిన నిర్భాగ్యుడితను. ఆసక్తి, తె లివి, తెగింపు, యవ్వనం, ధనం, విద్య, సామాజిక స్థాయి, భక్తి, ప్రభువు ఎదుట మోకరించే అణకువ ఇలా చేతినిండా జీవితముంది. లేనిదల్లా నిత్యజీవమే! నిత్యజీవానికి దూరంగా ఉన్నానన్న గ్రహింపు కూడా అతనికుంది కనుకనే ప్రభువు వద్దకు పరుగెత్తాడు. ప్రభువతన్ని ప్రేమించి నీకొకటి కొదవగా ఉందంటూ అతని సమస్యను విశ్లేషించాడు. అంటే నూటికి 99 ఉన్నాయి కానీ అసలైనదొకటే లేదన్నాడు ప్రభువు. నీ ఇంట్లో వైరింగ్, రంగురంగుల బల్బులు, స్విచ్చులు, ప్లగ్గులు, టీవీలు, ఏసీలు, ఫ్యాన్లు, కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి సరే, అవి నడిచే కరెంటు ఒక్కటే లేదని చెప్పడం ప్రభువు మాటల తాత్పర్యం. నిత్యజీవ ప్రదాత అయిన యేసు నాశ్రయించి కూడా ఆయన చెప్పిన మాట వినక జీవితాన్ని నిరర్థకం చేసుకొని పరలోకభాగ్యాన్ని పోగొట్టుకున్న దురదృష్టకరమైన వ్యక్తి అతను. ధనాన్ని దేవునికన్నా, చుట్టూ ఉన్న ప్రజలకన్నా మిన్నగా ప్రేమించడం దేవుని దృష్టిలో ఎంత మహాపరాధమో ఇతని ఉదంతం వివరిస్తుంది. మనిషి తన స్వేచ్ఛను, ఆధిక్యతలను పొందేముందు ప్రధానంగా తన సృష్టికర్తయైన దేవుణ్ణి తన పట్ల ఆయన సంకల్పాల్ని తెలుసుకోవాలి. మనిషిని దేవుడు సంఘజీవిగా సృష్టించాడు. అంటే తన అభ్యున్నతి కోసం సమాజం నుండి ఎంత లబ్ధి పొందుతాడో, సమాజానికి కూడా ప్రతిఫలంగా అంతే లబ్ధినివ్వాలి. ఇది కేవలం సామాజిక స్పృహ మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా విశ్వాసుల ఆత్మీయ బాధ్యత కూడా!ై దైవసంకల్పంతో నిమిత్తం లేకుండా సాగిన సామాజిక పరిణామాల పర్యవసానమే నేడు సమాజానికి మచ్చగా మారిన పేదరికం. దాన్ని రూపుమాపే బాధ్యత పూర్తిగా మనదే! నిష్ట కలిగిన యూదులు జీవితంలో 613 కఠిన నియమాలను తు.చ తప్పక పాటించడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాని నిరుపేదలకు అండగా నిలబడటం దేవుని ప్రసన్నం చేసుకోవడానికి దగ్గరి దారి అని యూదువాదం, సిద్ధాంతాలకు భిన్నంగా యేసుక్రీస్తు ఆచరించి బోధించాడు (మత్తయి 25:40) తోటి మనుషుల మేలుకోరకుండా దేవుని మాత్రమే కోరుకోవడం మతం. నిరుపేదల్లో దేవుని చూడాలనుకోవడం నిజమైన ఆత్మీయమార్గం. మతం ఒక మంచుశిల. దానికి మానవత్వం అనే వెచ్చదనం సోకి కరిగి నీరై ప్రవహిస్తే అదే ఆత్మీయం. మంచుగా గడ్డకట్టినప్పుడు నీరు తన ప్రయోజకత్వాన్ని కోల్పోతుంది. అదే కరిగి పారినప్పుడు లోక కల్యాణ కారకమవుతుంది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని భయమూ ఉండాలి!
పాస్టర్గారు చర్చిలో ప్రసంగం చేస్తున్నారు. చర్చి బయట గుమ్మానికి ఒకవైపు యేసుక్రీస్తు బొమ్మలు, మరోవైపు సాతాను బొమ్మలు పెట్టి ఆ రెండింటిలో ఒకటి పట్టుకొమ్మంటే మీరు దేన్ని తీసుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు. యేసుప్రభువు బొమ్మ.. కావాలన్నారంతా! ‘ఒకవేళ యేసుక్రీస్తుది చెక్కబొమ్మ, సాతానుది బంగారం బొమ్మ అయితే దేన్ని తీసుకుంటారు?’ అని అడిగారాయన. చర్చిలో అంతా నిశ్శబ్దం. జవాబు అర్థమైంది. దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17). ధనప్రలోభంతో విశ్వాస భ్రష్టులైన ఆదిమ కాలపు భార్యాభర్తలు అననీయ, సప్పీర. యేసు ఉంటే చాలనుకున్న నాటి చాలామంది విశ్వాసులు తమ ఆస్తులమ్మి ఆ డబ్బంతా తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెడుతున్న రోజులవి. అననీయ, సప్పీర కూడా తమ పొలం అమ్మారు. కాని దాంట్లో కొంత దాచుకొని మిగిలిన మొత్తం తెచ్చిచ్చారు. పొలాన్ని మీరింతటే అమ్మారా అని పేతురు ప్రశ్నిస్తే అంతకే అమ్మామంటూ ఇద్దరూ కూడబలుక్కొని మరీ అబద్ధమాడారు. అంతే! దేవుని ఉగ్రతకు లోనయ్యారు. దేవుడంటే భక్తి మాత్రమే కాదు. దేవుని భయమూ ఉండాలి. దేవుని కోసం వారు పొలం అమ్మి తమ భక్తిని చాటుకున్నారు. కాని అందులో కొంత దొంగిలించి తమది దేవుని భయం కరువైన దొంగభక్తి అని రుజువు చేసుకున్నారు. అర్పణలు, ఆరాధనలు, పాటలు, ప్రార్థనలు, ప్రసంగాలు, సాక్ష్యాలు ఇవన్నీ భక్తితో ముడిపడిన అంశాలు. అయితే జీవితంలో యథార్థత, సచ్ఛీలత దేవుని భయంతో ముడిపడిన అంశాలు. కుటుంబావసరాల కోసం పొలం అమ్మి ఉంటే అందులో దేవునికి మేమేమీ ఇవ్వలేమని తెలిసి ఉంటే అసలు సమస్యే లేదు. కాని ఆదిమ సంఘంలో దేవునికి ధారాళంగా ఇస్తున్న చాలామంది కంటే ఆత్మీయంగా తాము తక్కువేమీ కాదని గొప్పలు చెప్పుకునేందుకు పొలం అమ్మగా వచ్చిన డబ్బంతా ఇస్తున్నామని అబద్ధం చెప్పారు. కాని ‘ఆత్మీయత’ను నటించబోయి, తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు వారు. దేవునికి ఎంతో హేయమైననది వేషధారణ! కరడుకట్టిన పాపుల పట్ల కూడా యేసుక్రీస్తు కరుణ చూపించాడు. కాని పరిసయ్యల వంటి వేషధారులను సున్నం కొట్టిన సమాధుల్లారా! అంటూ ఎంతో పరుషమైన పదజాలంతో సంబోధించాడు. అననీయ, సప్పీరా లేని ఆత్మీయతను చూపించుకునే గొప్పలకు పోయి చరిత్రహీనులయ్యారు. సమాజంలోని అన్ని రంగాల్లోనూ పదార్థవాదం (మెటీరియలిజం) ప్రబలి డబ్బే కేంద్రంగా సాగుతున్న ‘అధర్మయుగం’లో మనం జీవిస్తున్నాం. దేవుడు మనను చూడడులే అనుకున్నారు వారిద్దరూ. దేవుడు చూడటమే కాదు అక్కడికక్కడ తక్షణ తీర్పునిచ్చి తన ఉగ్రతను బయలుపర్చాడు! ధనంతో నిమిత్తం లేని నిష్కల్మషమైన దేవుని ప్రేమ బీద, గొప్ప తేడా లేకుండా అందరినీ తన వద్దకు ఆకర్షిస్తుంది. ఇది తిరుగులేని వాస్తవం. దేవుని పట్ల యథార్థత కలిగిన విశ్వాసులు, కుటుంబాలు, చర్చిలు ధనాపేక్షకు, ప్రలోభాలకు అతీతంగా ఉంటారు. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
కుటుంబ వ్యవస్థను నిర్మించింది దేవుడే!
సువార్త కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడే!! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే! యేసుక్రీస్తు చెప్పిన ఉపమానమిది. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు బుద్ధిమంతుడు. చిన్నవాడు వ్యసనాల పుట్ట, అవిధేయుడు. చిన్నవాడు తండ్రిపై తిరుగుబాటు చేసి తన వంతు ఆస్తి రాబట్టుకొని దూర దేశం వెళ్లి విచ్చలవిడిగా జీవించి అంతా దుబారా చేశాడు. చివరికి పూట గడవని స్థితిలో పందులు మేపుతూ అవి తినే పొట్టుతో కడుపు నింపుకొంటున్నాడు. తన తండ్రి వద్ద ఉన్న పనివాళ్లు తనకన్నా గౌరవంగా బతుకుతున్నారన్న కనువిప్పు ఒకరోజు కలిగి, కొడుకుగా కాదు ఒక పనివానిగా తనను చేర్చుకొమ్మని ప్రాధేయపడేందుకు అతను తండ్రి వద్దకొచ్చాడు. కాని కుమారుని పునరాగమనంతో పరవశించిపోయిన తండ్రి అతనికి ప్రశస్తవస్త్రాలు, ఉంగరం తొడిగించి బంధుమిత్రులకు గొప్ప విందు చేశాడు. తన కొడుకు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడంటూ తండ్రి మహదానందపడ్డాడు (లూకా 15:11-25). సర్వోన్నతుడైన దేవుడు మానవాళిని కన్నతండ్రిలా ప్రేమిస్తున్నాడని వివరించేందుకు యేసుక్రీస్తు చేసిన అద్భుత ప్రయత్నమిది. ఉపమానంలో తండ్రి తన వద్ద ఉన్నపుడూ, తనమీద తిరుగుబాటు చేసినపుడూ కూడా చిన్న కొడుకును ప్రేమిస్తూనే ఉన్నాడు. అతని రాక కోసం ప్రేమతో ఎదురు చూశాడు. తిరిగొచ్చిన మరుక్షణం అతన్ని ఆలింగనం చేసుకొని పూర్వస్థితికన్నా వైభవ స్థితిని అతనికిచ్చాడు. కాని తండ్రితో ఉండగా ఒక యువరాజుగా వెలుగొందిన వాడు తండ్రిని వదిలి వెళ్లి పందుల పొట్టు తిని బతికే భ్రష్టత్వాన్ని తెచ్చుకోవడం మాత్రం కేవలం అతని స్వయంకృతమే!! అందులో తండ్రి ప్రమేయం ఏమీ లేదు. ఆ విధంగా దేవుడు స్వచ్ఛమైన ప్రేమకు, త్యాగానికి, ప్రేమకు, నిస్వార్థానికి ప్రతిరూపమైన తల్లిదండ్రుల స్థానంలో తనను నిలబెట్టుకొని తన ప్రేమ మానవాళికి అర్థమయ్యే విధంగా పరమతండ్రిగా వివరించాడు. కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడే!! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే! మనిషిని ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, చెల్లెలిగా, తమ్ముడిగా సృష్టించి ఆ బంధాల్లో ఇమిడ్చి పెట్టిన దేవుడు, ఆ బంధాల్లో అతను అనురాగభరితంగా జీవించాలని ఆశించిన దేవుడు అవే బంధాలను ఆధారం చేసుకొని తన ప్రేమను వ్యక్తీకరించడం అసమానం. కాని ఈనాడు వాస్తవానికి ఏం జరుగుతోంది? పెచ్చరిల్లిన వాణిజ్య సంస్థలు, పాశ్చాత్య పోకడలు కుటుంబ బంధాలను కూడా కలుషితం చేసి కకావికలం చేసి దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థనే బలహీనపర్చి కూలదోస్తున్నాయి. విధేయతతో సంకెళ్లను, విచ్చలవిడితనంతో స్వేచ్ఛను ఈతరం చూడటమే అత్యంత ప్రధానమైన సమస్య. అంతా కళ్లు తెరవాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కుటుంబ బంధాలకు అతీతంగా మనిషి బతకలేడు. ఆప్తుల చావు వల్లో, ఆప్తులతో సమస్యలతో ఒంటరితనంతో అలమటిస్తున్న వారిని దేవుడే సాకుతాడంటూ ఎప్పుడైనా భరోసా ఇచ్చారా? ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు అతనికి నేనున్నానులే అనుకోకుండా అతని సహజీవనానికి మరో మనిషిని అంటే హవ్వను సృష్టించాడని గుర్తుంచుకోండి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
యేసు పునరుత్థానం... జగానికే అభయం!
నిత్య జీవితంలో మనిషికి ఎందరో శత్రువులుంటారు. వ్యాధులు, అప్పులు, నిందలు, అవమానాలు, మానసిక సంఘర్షణలు, నిరాశ... ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మనిషిని సవాలు చేస్తుంటాయి. లోకంలో పుట్టిన వ్యక్తి గెలుపు ఆటలో అప్రతిహతంగా దూసుకుపోవాలని ఆకాంక్షిస్తుంటాడు. సమాజంలో తనకు ఓ విశిష్ట గుర్తింపు పాదాక్రాంతం కావాలని ఆశిస్తూంటాడు. అన్ని శక్తులూ కూడగట్టుకుని గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే శత్రువులలోకెల్లా ప్రధాన శత్రువు మరణం అనేది నిర్వంద్వం. మరణం ముందు ఎన్నో ఘనతర లక్ష్యాలు నిలువునా నీరోడాయి. ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన విజేతల నుండి అతి సామాన్యంగా జీవితాన్ని నెట్టుకొస్తున్న వారి వరకు ఎందరో మరణం ముందు తలలు వంచారు. జీవితంలో ఎక్కడైనా హెచ్చుతగ్గులు ఉన్నాయేమో గాని మరణం దగ్గర ఆ అవకాశం లేదు. నిర్మొహమాటంగా లాక్కెళ్లిపోతుంది. అందుకేనేమో మతాల కతీతంగా, కులాలకతీతంగా, ప్రాంతాల కతీతంగా మరణం ప్రతి ఒక్కరి ముందు శత్రువులా నిలబడింది. ఈ సువిశాల విశ్వంలో ఓ అద్భుత కార్యం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది. అదే క్రీస్తు ‘పునరుత్థానం’. ‘పునః’ అంటే తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట అని అర్థం. యేసుక్రీస్తు మరణాన్ని జయించి, మరణపు ముల్లును విరిచి, మరణపు మెడలు వంచి తిరిగి లేచిన శుభదినం! ప్రపంచమంతా దివ్య వెలుగుతో, నవ్యమయమైన కాంతులతో విరాజిల్లిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే... మరణం మరణించిన రోజు!అప్పటి వరకు ఎందరో మరణం ముందు తల వంచారు కానీ ఆ రోజు మరణం దేవుడి ముందు తల వంచింది. అప్పటి వరకు ఎందరో మరణం గుప్పిట్లోకి వెళ్లిపోయారు కానీ ఆ రోజు మరణం దేవుడి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అసాధ్యం అన్న చోటనే సాధ్యం అనే మాట ఉంది అని నిరూపితమయింది. ఓ భక్తుడు ఇలా అంటాడు. ‘‘యేసుక్రీస్తు ఖాళీ సమాధి... క్రైస్తవ విశ్వాసానికి పునాది.’’ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరిత్రకు మూలరాయి.దురవస్థలో ఉన్న మనిషిని రక్షించి, పాపబంధకముల నుండి వ్యవసనముల నుండి విడుదల చేసి, నవ్యపథ నిర్దేశం చెయ్యాలన్న సర్వోత్తమ లక్ష్యంతో యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, నిందలు కృంగదీసినా తాను చెయ్యాలనుకున్న పనిని పూర్తి చేశాడు. అవిధేయత ద్వారా పాపం, పాపం ద్వారా మరణం మనిషిని కబళించినప్పుడు యజ్ఞ బలిపశువుగా సిలువలో తన ప్రాణమును అర్పించి మానవ పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రపంచంలోని మనుషుల భాషలు వేరైనా భావం మాత్రం ఒక్కటే. పాపం నుండి, శాపం నుండి మరణం నుండి విడుదల పొంది పుణ్య లోకాలకు, నిత్యరాజ్యానికి వెళ్లాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక. మనిషి మనోభీష్టాన్ని నెరవేర్చడానికే సృష్టికర్త సృష్టిగా మార్పు చెందాడు. సమాజ పునర్వికాసానికి పెద్ద పీట వేసి... ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న బోధతో మానవీయ వ్యవస్థను నిలబెట్టాడు. ఔను! దేవుడు ప్రేమామయుడు గనుకనే మనకందరికీ ప్రేమను గూర్చి విదశీకరించాడు. ఈ రోజుల్లో ప్రస్తుత నవతరానికి ‘ప్రేమ’ అనే మాట సరిగా అర్థం కాలేదనిపిస్తుంది. ప్రేమకు అర్థం తెలిస్తే, ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు ఎందుకు జరుగుతాయి? బ్లేడుతో గొంతుకలు ఎందుకు కోస్తారు? ఆయుధాలతో పిచ్చెక్కినట్టు ఎందుకు రెచ్చిపోతారు? హేయమైన దురాకృతాలతో ప్రజల గుండెల్లో భయాందోళనలను ఎందుకు పెంచుతారు? ‘‘ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ప్రేమ అంటే ఇతరుల కోసం బలైపోవడం.’’ ఇది యేసు చెప్పిన నిర్వచనం. తాను చెప్పడం మాత్రమే గాక చేసి చూపించాడు. ఈ సుందర, సువిశాల భూమ్మీద మధ్య ప్రాంతంలో కలువరి సిలువలో క్రీస్తు మరణించి ప్రేమ పతాకాన్ని ఎగురవేశాడు. ప్రేమ పతాకం పక్కనే విజయ పతాకం కూడా రెపరెపలాడుతుంది. ఇది ఓ అద్భుతమైన జీవిత సత్యం. ప్రేమతోనే ఏదైనా సాధించగలం అనే వాస్తవాన్ని ఏ ఒక్కరూ విస్మరించకూడదు. ‘‘క్రీస్తు ప్రేమను వ్యక్తీకరించాడు గనుకనే మరణాన్ని జయించగలిగాడు. ప్రేమ ముందు ఏదైనా తలవంచవలసిందే అనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఫ్రెంచ్ సైన్యాధిపతియైన నెపోలియన్ బోనాపార్టే కూడా ఇదే విషయాన్ని చెప్పాడు... ‘‘నేను కత్తి ద్వారా ప్రపంచాన్ని జయించాను గానీ క్రీస్తు ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు’’ అని. సాటి వ్యక్తి బాధలను అర్థం చేసుకొని మదర్ థెరిస్సా ‘‘కేవలం ప్రేమతోనే ప్రపంచాన్ని జయించవచ్చు’’ అని చాటి చెప్పారు. ఔను... ‘ప్రేమ పతాకం ఎగురని చోట విజయ పతాకం ఎగురదు.’ పునరుత్థానం... దివ్యపాఠం! ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన క్రీస్తు పునరుత్థానం వలన మనకు కలిగే ప్రయోజనమేమిటి? క్రీస్తు పునరుత్థానం నుండి మనం సంగ్రహించగలిగే దివ్య పాఠాలు ఏమిటి? సమాధి అయిన కలలను ప్రభువు బతికిస్తాడు. యూదులందరూ క్రీస్తును రోమన్ గవర్నర్ ముందు నిలబెట్టి, అబద్ధాలు చెప్పి ‘అన్యాయపు తీర్పు’ను తీర్చారు. ఏ చేతులతోనైతే క్రీస్తు పంచిన రొట్టెలు తిన్నారో అవే చేతులతో ఆయనను పిడిగుద్దులు గుద్దారు. సుమారుగా 80 కేజీల బరువైన సిలువను ఆయనపై మోపి, యెరూషలేము వీధుల్లో తిప్పి ఆఖరుకు సిలువ వేశారు. హృదయ విదారకంగా క్రీస్తు సిలువలో వ్రేలాడుతుంటే... ‘క్రీస్తు జీవితాన్ని సమాప్తి చేసేశాం! ఇక లేవలేడు! ముగింపు పలికాం!’ అని వికృతంగా నవ్వుకున్నారు. క్రీస్తును ఒకే ద్వారం ఉన్న రాతి సమాధిలో ఉంచారు. ఈస్టర్ రోజున... అనగా ఆదివారపు తెల్లవారు ఝామున అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ క్రీస్తు మరణ బంధకాలను తెంచుకుని బయటకు వచ్చాడు. ఆశ్చర్యం! అద్భుతం! ఔను! ఈ మాటలు చదువుతున్న నీ జీవితంలో నీ కలలు సమాధి చేయబడ్డాయా? కొన్ని కొన్నిసార్లు జీవితంలో ‘నా అనుకునేవాళ్లే’ మనలను సమాధిలో పెట్టేస్తారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్న నిన్ను నిందలతో అవమానాలతో కృంగదీస్తారు. మానసికంగా వేధిస్తారు. నీవు ఏమీ సాధించలేవు అని పదే పదే చెబుతూ నిన్ను పాతాళానికి తొక్కివేయడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి సందర్భాల్లో క్రీస్తు పునరుత్థాన ఘట్టాన్ని నెమరు వేసుకో! ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా, సిలువ వేసినా, బంధకాలతో బంధించినా క్రీస్తు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. సమాధిని జయించాడు. కర్తవ్య దీక్షతో, బుద్ధి కుశలతతో ముందుకు సాగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమాధి అయిపోయిన నీ కలలను తిరిగి బతికిస్తాడు. సమాధి పొరలను చీల్చుకొంటూ నీ దర్శనం బయటకు వస్తుంది. చీకటి అధ్యాయాన్ని చీల్చుకుంటూ ‘వెలుగు’ కిరణం పయనం ప్రారంభిస్తుంది.ఓటమితో కృంగిపోయావా? ఏమీ సాధించలేనన్న ఆత్మన్యూనతా భావం నిన్ను ఏలుబడి చేస్తుందా? సంకల్ప దీక్షతో, దైవబలంతో ముందుకు సాగిపో! నిన్ను నిలువరించే శక్తి ఎవ్వరికీ లేదు. 18 నెలల ఓ బాలిక జ్వరంతో చూపు, వినికిడి కోల్పోయింది. నిశ్చేష్టురాలై పడిపోయింది. అందరూ ఆమెను చూసి ఏడ్చారు! విధి వంచించింది అని బాధపడ్డారు. ఓ పక్క నిశ్శబ్దం, మరోపక్క చీకటి. అవి తప్ప ఆమెకు ఏమీ తెలియదు. ఎదిగిన తర్వాత తనేంటో తాను తెలుసుకొంది. దేవుడు తనను సృష్టించాడు గనుక ఆ దేవునికే తన జీవితాన్ని అప్పగించుకుంది. కృంగదీసే పరిస్థితులు చుట్టూ ఎన్నున్నా లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయింది. ఆమె ఎవరో కాదు... ‘హెలెన్ కెల్లర్’. ప్రపంచంలో ఈమె పేరు తెలియనివారు లేరు. ‘నా జీవిత గాథ’ అనే పుస్తకం ద్వారా ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఎవరో ఆమెను అడిగారట... ‘ప్రపంచంలో నిజమైన గుడ్డివారు ఎవరు?’ అని. ‘‘ఓ దర్శనం లేకుండా, దాన్ని సాధించకుండా బతికేవాడే నిజమైన గుడ్డివాడు’’ అని ఆమె సమాధానమిచ్చింది. క్రీస్తే జయము! క్రీస్తు మరణాన్ని జయించాడు గనుక ఆయన నీకు కూడా జయమివ్వగలడు. త్రికరణ శుద్ధితో దైవాన్ని వేడుకుంటే సత్ఫలితాలు వస్తాయి. దేవుని మీద భక్తి, సత్ ప్రవర్తన మంచి విలువలతో కూడిన జీవితానికి బాటలు వేస్తాయి.క్రీస్తు మరణాన్ని జయించి ‘భయపడకుడి’ అనే అభయాన్ని ఇచ్చాడు. ఔను! నీవు జయించువాడవైతే నీ దగ్గర అభయముంటుంది. అనేకులను ధైర్యపరచగలవు. నీ దగ్గర సముచిత ప్రోత్సాహం ఉంటుంది. క్రీస్తు తెలిపిన సత్యం! నీవు ఏవిధమైన నేరం చెయ్యకపోయినా సమాజం నిన్ను నిందిస్తోందా? ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజం చెయ్యాలని ప్రయత్నిస్తోందా? అయితే విను! సత్యాన్ని ఏ ఒక్కరూ కూడా శాశ్వతంగా సమాధి చెయ్యలేరు! అది ఎవ్వరి తరం కాదు. సత్యమైన క్రీస్తును సమాధిలో ఉంచారు. కానీ ఎక్కువకాలం ఉంచలేకపోయారు. అసత్యాన్ని, అబద్ధాన్ని చీల్చుకుని సత్యం బయటకు వచ్చింది. ఈ లోకంలో పాపాత్ముల విజయం కొంతకాలమే. శాశ్వత విజయం మాత్రం సత్యవంతులదే! ఈ రోజుల్లో ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ విశ్వసనీయత లేదు. నమ్మకత్వం, యధార్థత, నిజాయతీ రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. సాటి మనిషిని నమ్మలేని దుస్థితి ఏర్పడుతోంది. ఎందరో మహానుభావులు కలలుకన్న సుందర భారతావనిని చూడాలంటే ప్రతి ఒక్కరూ సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చిన మాట మీద నిలబడడం, వాగ్దానాలు నిలబెట్టుకోవడం వల్ల సమసమాజం నిర్మితమవుతుంది.దేవునికున్న విశిష్టమైన లక్షణాల్లో ఒకటి, ‘ఆయన సత్యం చెప్పి నిన్ను గాయపరుస్తాడే గానీ అబద్ధాన్ని చెప్పి నిన్ను ఆదరించడు.’’సత్యం డాక్టరు చేతిలో కత్తిలాంటిది... అబద్ధం అనేది రౌడీ చేతిలో కత్తిలాంటిది. రెండూ గాయపరుస్తాయి. కానీ ఉద్దేశాలు మాత్రం వేరు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ‘‘నేనే మార్గము, సత్యము, జీవము’’ అని తెలియచేశారు. పాపము లేనివానిగా పుట్టి, జీవించి, పాపుల కొరకు మరణించి, మూడవ రోజున సజీవంగా తిరిగి లేచి... తెరవబడిన హృదయాల్లో నివసించాలనే ఆశపడుతున్నాడు. నిజదేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న నీదైతే... ‘మానవ హృదయంలో’ అనేది నా జవాబు. పునరుత్థానుడైన క్రీస్తు మీ అందరికీ గొప్ప ధైర్యాన్ని, ప్రేమను, శాంతి సమాధానాలను, మోక్షరాజ్య ప్రాప్తిని అనుగ్రహించును గాక. ‘‘ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ప్రేమ అంటే ఇతరుల కోసం బలైపోవడం.’’ ఇది యేసు చెప్పిన నిర్వచనం. తాను చెప్పడం మాత్రమే గాక చేసి చూపించాడు. ఈ సుందర, సువిశాల భూమ్మీద మధ్య ప్రాంతంలో కలువరి సిలువలో క్రీస్తు మరణించి ప్రేమ పతాకాన్ని ఎగురవేశాడు. -
ఏసుక్రీస్తు జీవిత కథ
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా నిర్మించిన తాజా చిత్రం ‘తొలికిరణం’. పీడీ రాజు ప్రధాన పాత్రలో జె. జాన్బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇటీవల కీలక సన్నివేశాలను శ్రీశైలం అడవుల్లో చిత్రీకరించాం. ఏసుక్రీస్తు సమాధి నుంచి వచ్చిన తర్వాత భూమిపై 40 రోజులు తిరిగారు. అప్పుడు జరిగిన అద్భుతాల్ని ఇప్పటి వరకూ ఎవరూ చూపలేదు. ఏసుక్రీస్తు తిరిగొచ్చిన అనంతరం ఏం చేశారు? ఎవర్ని కలిశారు? మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటి? అన్నదే ఈ చిత్ర కథాంశం. భానుచందర్ ముఖ్యపాత్రలో నటించారు. ఆర్పీ పట్నాయక్ పాటలు ప్రధానాకర్షణ. గుడ్ ఫ్రైడే కానుకగా ఈనెల 25న రిలీజ్కు సన్నా హాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
జీసస్ హిందువు,మాతృభాష తమిళం
ముంబై: 70 ఏళ్ల క్రితం ప్రచురించిన ఓ పుస్తకాన్ని ముంబైకి చెందిన హిందూ సంస్థ తిరిగి వెలుగులోకి తెస్తూ వివాదాలకు తెరలేపింది. జీసస్ క్రీస్తు పుట్టుక, మనుగడకు సంబంధించి అనేక వివాదాస్పద అంశాలను దీనిద్వారా వెలుగులోకి తెస్తోంది. జీసస్ క్రీస్తు తమిళనాడుకు చెందిన హిందువని, హిమాలయాల్లో సంచరించాడని స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ (వీర్) సావర్కర్ పెద్దన్న గణేష్ దామోదర్ (బాబారావు) పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన గణేష్ ..క్రీస్తు పుట్టుక, ఆయన పెరిగిన వాతావరణం, మాతృభాషకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 1946లో ఆయన రాసిన క్రీస్తు పరిచయ్ అనే పుస్తకాన్ని మరాఠీ భాషలో ఈ నెల 26న దీన్ని విడుదల చేస్తోంది. క్రీస్తు జన్మస్థలం గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటకీ ఈనాటి పాలస్తీనా, అరబ్ భూభాగాలు హిందూభూభాగంలో భాగమని అలా క్రీస్తు భారతదేశానికి పయనించినట్టు స్పష్టం చేస్తోంది. జీసస్ విశ్వకర్మ బ్రాహ్మిణ వర్గానికి చెందినవాడంటోంది. దీంతోపాటు కొన్ని కీలక అంశాలను ఇందులో పేర్కొన్నారు. జీసస్ తమిళ హిందువు. పేరు కేశవ్ కృష్ణ, నల్లగా ఉండే అతని మాతృభాష తమిళం. అతను 12 ఏళ్ళ వయసులో బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం క్రీస్తు కు ఉపనయన వేడుక జరిగింది. భారతీయ సంప్రదాయ ప్రకారం అతని వస్త్రధారణ ఉండేది. క్రీస్తు తన జీవితంలో చివరి దశలో హిమాలయాలలో గడిపారు. అరేబియా ఒక హిందూభూమి. యూదులు హిందువులు. అరబిక్ అనేక సంస్కృత, తమిళ పదాలను కలిగి ఉంది, పాలస్తీనా యొక్క అరబీ భాషా తమిళ భాష యొక్క ఒక వెర్షన్. యోగ మరియు ఆధ్యాత్మిక శాస్త్రం క్రీస్తు అభ్యసించాడని, ఆరోగ్య కూడగట్టుకునేందుకు హిమాలయాల దిగువ ప్రాంతాల్లో క్రీస్తు ఒక మఠాన్ని స్తాపించి, మూడేళ్లపాటు శివుడిని ఆరాధించి, శివ దర్శన భాగ్యాన్ని పొందాడాని వాదిస్తోంది. ఆయన చివరి దశలో ఔషధ మూలికలద్వారా చికిత్స జరిగిందని ఈపుస్తకంలో పేర్కొన్నారు. అతను తన భౌతిక శరీరం వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నపుడు ఉన్నప్పుడు క్రీస్తు 49 ఏళ్లు. అతను ఒక యోగ భంగిమలో కూర్చుని లోతైన సమాధి లోకి వెళ్ళిపోయాడని ఈ పుస్తకంలో రాశారు. క్రిస్టియానిటీ ఎప్పటికీ ఒక ప్రత్యేక మతం కాదని...హిందూ మతంలోని శాఖను ఒక సిద్ధాంతంగా క్రీస్తు పరిచయం చేశాడని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలోని అంశాలపై అప్పుడే దుమారం మొదలైంది. ఇదంతా అసత్యాలను ప్రచారం చేసి, దాన్నే చరిత్రగా చూపే కుట్రలోభాగమని విమర్శలు చెలరేగుతున్నాయి. -
మహనీయుల మాటల్లో క్రీస్తు
అత్యుత్తమ గురువు! మానవాళికి లభించిన అత్యుత్తమ గురువుల్లో యేసు క్రీస్తు ఒకరు. భగవంతునితో క్రీస్తుకు గల సామీప్యానికి ఆయన జీవితమే నిదర్శనం. భగవంతుని సంకల్పాన్నీ, శక్తినీ యేసు బహిర్గతం చేసినట్లు వేరెవరూ చేయలేదు. అందుకే నేను ఆయనను దేవుని కుమారునిగా భావిస్తాను. - మహాత్మాగాంధీ ప్రతి మనిషీ క్రీస్తే! నేను మనిషిని మనిషిగా విశ్వసిస్తాను. అందుకే నాకు ప్రతి మనిషీ సాక్షాత్తూ యేసుక్రీస్తే. - మదర్ థెరిసా ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు! అలెగ్జాండర్, సీజర్, నేను పెద్ద పెద్ద సామ్రాజ్యాలను స్థాపించాం. అయితే, మేమంతా దేనిపై ఆధారపడ్డాం? బలప్రయోగంపై. కానీ క్రీస్తు అలా కాదు, ప్రేమ పునాదుల పైనే తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. - నెపోలియన్ బోనాపార్టే దేవుడే మనిషిగా అవతరించాడు! యేసుక్రీస్తు దేవుడు. సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడు. ఆయన తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడు. ఆ రూపాలనే మనం ఆరాధిస్తాం. మానవ రూపంలో అవతరించినందుకే మనం యేసును ఆరాధిస్తాం. - స్వామి వివేకానంద అత్యంత ప్రభావం కలవాడు! నేను చరిత్రకారుడిని. విశ్వాసిని కాదు. నజరేతుకు చెందిన ఈ ప్రబోధకుడు చరిత్రకు తిరుగులేని కేంద్రంగా మారాడు. యేసు క్రీస్తు చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. - హెచ్.జి.వెల్స్, అమెరికన్ చరిత్రకారుడు దేవుడు అందరివాడు! ఒకే ప్రదేశానికి అనేక మార్గాలుంటాయి. అలాగే, మనకన్నా గొప్ప శక్తి, అతీతమైన శక్తి ఉంది. ఇలాంటి నమ్మకాలే మనల్ని కలుపుతున్నాయి. దేవుడు ప్రపంచంలోని అయిదింట నాలుగువంతుల ప్రజల్ని నరకానికే పరిమితం చేస్తాడని నేను నమ్మను. భారతదేశంలో క్రైస్తవ మత విశ్వాసంతో ఎన్నడూ సంబంధం పెట్టుకోనంత మాత్రాన హిందువుల బిడ్డను శాశ్వతంగా దహించివేస్తాడనీ అనుకోను. అలా అనుకోవడం నా ధార్మిక దృక్పథానికి విరుద్ధం. మా ఇంట్లో బైబిల్, ఖురాన్, భగవద్గీత మూడూ మా పుస్తకాల అరలో గ్రీకు, నార్వే, ఆఫ్రికన్ పురాణ గ్రంథాల పక్కనే ఉంటాయి.’’ - బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు -
నేలకు దిగిన నక్షత్రాలు
యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, యేసు చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశం లోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టుని ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి. ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకుంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్నో ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకునే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకు, ముగ్గురు జ్ఞానులకు ఆయన దగ్గరకు వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం, క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగు తోందనేది అందరి నమ్మకం. -
క్రీస్తును చూసిన పరమహంస
దేవుడొక్కడే! సత్యం ఒక్కటే! కానీ, అక్కడకు చేరుకోవడానికి అనేక మార్గాలు. ‘ప్రపంచంలో మతాలెన్నో మార్గాలన్ని!’ అని శ్రీరామకృష్ణ పరమహంస అన్నది అందుకే. ఆయన అన్ని రకాల మార్గాలలో ఆధ్యాత్మిక సాధన చేశారు. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, జైన, సిక్కు మత సంప్రదాయాలన్నిటి పట్ల విశ్వాసం చూపారు. ఆ క్రమంలో ఆయన జరిపిన క్రైస్తవ మత సాధన చాలా ప్రత్యేకమైనది. సంవత్సరం, సమయం, సందర్భంతో సహా శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు రికార్డు చేసి, రాసిన జీవితచరిత్రలో ఆ సంఘటన నమోదైంది. ఆ అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి పూర్వాపరాలలోకి వెళితే... అప్పటికే, తంత్రశాస్త్రాలు నిర్దేశించిన 64 సాధనలు, వైష్ణవ సంప్రదాయంలోని శాంత - దాస్యాది పంచభావాల ఆధారంగా భక్తిసాధనలు, మహమ్మదీయ మత సాధన - ఇలా అన్నిటినీ శ్రీరామకృష్ణులు అనుష్ఠించారు. 1873 మే 25న సాక్షాత్తూ శారదాదేవినే అమ్మవారిగా భావిస్తూ జరిపిన షోడశీ పూజతో ఆయన సాధన వ్రతం పూర్తి అయింది. షోడశీ పూజ జరిగిన ఏడాది తరువాత 1874లో... శ్రీరామకృష్ణుల్లో మరో సాధనామార్గం ద్వారా దైవాన్ని దర్శించుకోవాలనే ఆకాంక్ష కలిగింది. అప్పటికి, ఆయనకు శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవాడు. అలా ఆయనకు ఏసుక్రీస్తు పావన జీవితం, క్రీస్తు స్థాపించిన మతం గురించి తెలిసింది. క్రైస్తవ సంప్రదాయ మార్గంలో సాధనలు చేయాలనే కోరిక ఆయన మనస్సులో మెదిలింది. దక్షిణేశ్వరంలోని కాళికాలయానికి దక్షిణ దిక్కులో యదుమల్లిక్ ఉద్యానగృహం ఉంది. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అక్కడ వ్యాహ్యాళికి వెళుతుండేవారు. యదుమల్లిక్కూ, అతని తల్లికీ శ్రీరామకృష్ణులంటే చాలా భక్తి. కాబట్టి, వాళ్ళు ఉద్యానగృహంలో లేని సమయంలో కూడా శ్రీరామకృష్ణులు అక్కడికి వెళితే, సిబ్బంది తలుపులు తెరిచి, అక్కడ కూర్చొని విశ్రమించమని కోరేవారు. ఆ గదిలో గోడలకు చక్కని చిత్రపటాలు ఉండేవి. తల్లి ఒడిలో ఉన్న బాలక్రీస్తు చిత్రపటం అందులో ఒకటి. ఒకరోజు శ్రీరామకృష్ణులు ఆ గదిలో కూర్చొని, ఆ పటాన్నే తదేక దృష్టితో చూడసాగారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చిత్రం సజీవమై, దివ్యకాంతితో ప్రకాశించసాగింది. పటంలోని ఆ తల్లి, బాల ఏసు దేహాల నుంచి కాంతిపుంజాలు వెలువడ్డాయి. అవి శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రవేశించాయి. అంతే! ఆయన మానసిక భావనలన్నీ పరివర్తన చెందాయి. జన్మసిద్ధమైన హైందవ సంస్కారాలన్నీ మారుమూల ఒదిగిపోయాయి. పూర్తిగా భిన్నమైన సంస్కారాలు ఉదయించాయి. తనను తాను నియంత్రించుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు. ‘అమ్మా! నాలో ఏ వింత మార్పులు తీసుకువస్తున్నావు?’ అంటూ జగజ్జననిని హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించారు. కానీ, ఉపయోగం లేకపోయింది. ఏసుక్రీస్తు పట్ల, క్రైస్తవ సంప్రదాయం పట్ల భక్తి విశ్వాసాలు శ్రీరామకృష్ణుల హృదయంలో పాతుకున్నాయి. క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఏసుక్రీస్తు మూర్తి ఎదుట ఫాదిరీలు ధూపదీపాదులు అర్పించిన దృశ్యాలు ఆయనకు దర్శనమయ్యాయి. తరువాత శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగి వచ్చారు. మనసులోని ఆ భావాలు, కదలాడిన దృశ్యాల చింతనలో లీనమైపోయారు. కాళికాలయానికి వెళ్ళి, జగజ్జననిని దర్శించుకోవాలనే విషయం కూడా మర్చిపోయారు. అలా మూడు రోజుల పాటు ఆ భావతరంగాలు ఆయన మనస్సును ఆక్రమించేశాయి. అది మూడో రోజు... చీకటి పడింది. శ్రీరామకృష్ణులు ‘పంచవటి’ గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అప్పుడు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఉజ్జ్వలమైన గౌరవర్ణుడైన అద్భుత దివ్య మానవుడు ఒకరు తదేకదృష్టితో ఆయనను చూస్తూ, ఆయన వైపు రాసాగారు. ఆ వ్యక్తి విదేశీయుడనీ, విజాతీయుడనీ చూసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులకు అర్థమైంది. ఆతని కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఆతని ముఖారవిందానికి వింత శోభను సంతరిస్తున్నాయి. ఆతని ముక్కు ఒకింత చప్పిడిగా ఉంది. కానీ, ఆతని అందానికి అదేమీ కొరత కాలేదు. ఆతని ముఖంలో అద్భుతమైన దివ్య భావప్రకటన తొణికిసలాడుతోంది. అదంతా చూసి, శ్రీరామకృష్ణులు ‘ఇతనెవరా?’ అని అబ్బురపడ్డారు. ఆ దివ్యమూర్తి దగ్గరకు వచ్చాడు. ఆ క్షణంలో శ్రీరామకృష్ణుల హృదయం లోలోపల నుంచి ‘‘ఏసుప్రభువు! దుఃఖయాతనల నుంచి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారో... ఆ ఏసుప్రభువు!’’ అన్న మాటలు వెలువడ్డాయి. అంతర్వాణి అలా పలుకుతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు, శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన దేహంలో లీనమైపోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులై, బాహ్యచైతన్యాన్ని కోల్పోయారు. అలా శ్రీరామకృష్ణులు సాక్షాత్తూ ఏసుక్రీస్తు దర్శనం పొందారు. కనిపించిన రూపమే...! ఇది జరిగిన చాలాకాలం తరువాత ఒకరోజు స్వామి శారదానంద సహా పలువురు ప్రత్యక్ష శిష్యులతో శ్రీరామకృష్ణులు ఏసుక్రీస్తు ప్రస్తావన తెచ్చారు. ‘‘నాయనలారా! మీరు బైబిల్ చదివారు కదా! ఏసుక్రీస్తు భౌతిక లక్షణాల గురించి దానిలో ఏం రాసి ఉంది? ఆయన ఎలా కనిపించేవాడు?’’ అని అడిగారు. దానికి శిష్యులు, బైబిల్లో ఎక్కడా ఆయన భౌతిక వర్ణన తాము చూడలేదనీ, కానీ యూదుడుగా జన్మించడం వల్ల క్రీస్తు మేనిఛాయ ఉజ్జ్వల గౌరవర్ణంలో ఉంటుందనీ, విశాలనేత్రాలు, చిలుక లాంటి కొక్కెపు ముక్కు ఉండడం ఖాయమనీ జవాబిచ్చారు. కానీ, శ్రీరామకృష్ణులు మాత్రం ‘‘ఆయన ముక్కు ఒకింత చప్పిడిదై ఉండడం చూశాను. ఆయనను ఎందుకలా చూశానో తెలియడం లేదు’’ అన్నారు. విచిత్రం ఏమిటంటే, భావసమాధిలో శ్రీరామకృష్ణులు చూసిన స్వరూపం, ఏసుక్రీస్తు వాస్తవమూర్తితో సరిపోలింది. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం ఏసుక్రీస్తు శరీర నిర్మాణం గురించి మూడు విభిన్న వర్ణనలు ఉన్నాయనీ, ఆయన ముక్కు ఒకింత చప్పిడిగా ఉండేదనే వర్ణన వాటిలో ఒకటి ఉందనీ శ్రీరామకృష్ణుల శిష్యులు తెలుసుకొని అబ్బురపడ్డారు. శ్రీరామకృష్ణులకు దర్శనమైంది స్వయంగా క్రీస్తే అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇవాళ్టికీ రామకృష్ణ మఠంలో... క్రిస్మస్! దేశవిదేశాల్లో వ్యాపించిన శ్రీరామకృష్ణ మఠాలన్నిటిలో, బుద్ధ భగవానుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీచైతన్య, శ్రీశంకరుల జన్మదినోత్సవాలు ప్రతి ఏటా చేస్తారు. అది శ్రీరామకృష్ణ మఠ సంప్రదాయం. విశేషం ఏమిటంటే, శ్రీరామకృష్ణుల క్రైస్తవ ఆధ్యాత్మిక సాధన, పైన చెప్పిన సంఘటనను పురస్కరించుకొని - క్రిస్మస్ సందర్భంగా ‘క్రిస్మస్ ఈవ్’ (డిసెంబర్ 24) నాడు ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని కూడా మఠంలో శ్రద్ధాభక్తులతో చేస్తారు. ముఖ్యంగా మఠ కేంద్రస్థానమైన కోల్కతాలోని బేలూరు రామకృష్ణ మఠంలో క్రీస్తు పూజ, బైబిల్ పారాయణ, భక్తి సంగీత గానం మొదలైనవి జరుపుతారు. రామకృష్ణ మఠం, మిషన్ సెంటర్లలో జరిపే పండుగల్లో హైందవేతర ఉత్సవం ఇదొక్కటే! ఇప్పటికీ ఈ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతోంది. - రెంటాల జయదేవ