Kanna Laxminarayana
-
‘కన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. మాది కూడా గుంటూరు జిల్లానే’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణగదొక్కబడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబును ప్రజలు బహిష్కరించే పరిస్థితి వస్తుంది. నోరు ఉంది కదా అని ఎలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుందనుకోవడం చంద్రబాబు భ్రమ. చంద్రబాబు బ్రతుకే హింసాత్మకమైనది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. కన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. మాది కూడా గుంటూరు జిల్లానే. అసలు కన్నా లక్ష్మీనారాయణ ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటి అని ప్రశ్నించారు. కన్నా ఆటలు మా దగ్గర సాగవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ.. సోము వీర్రాజుపై ఎఫెక్ట్ ఎంత?
సాక్షి, ఢిల్లీ: ఏపీ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి నేతలు ఒక్కసారిగా తమ గళం వినిపించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు కాషాయ నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. వివరాల ప్రకారం.. ఏపీ బీజేపీ నేతల పంచాయితీ ఢిల్లీకి చేరింది. దాదాపు 30 మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా సోము వీర్రాజు తమకు వద్దంటూ ఇంఛార్జ్ వద్ద మొరపెట్టుకున్నారు. నూతన అధ్యక్షుడు కావాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించారని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. అయితే, ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక, ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు. ఇకపై రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ తమకు హామీ ఇచ్చారని స్థానిక నేతలు చెబుతున్నారు. -
వీర్రాజు Vs కన్నా.. ఏపీ బీజేపీలో లుకలుకలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలయిక నేపథ్యంలో రెండు రోజులుగా సోము వీర్రాజునుద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ‘పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయంలో మా రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. గతంలో ఇలాంటి పార్టీ విషయాలపై రెండు నెలలకోసారి అందరమూ కూర్చొని మాట్లాడే వాళ్లం. ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే ఇవన్నీ చూస్తున్నారు. ఎవరితోనూ చర్చించడంలేదు. చివరకు కోర్ కమిటీలో కూడా చర్చకు రావడంలేదు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో మాకు తెలియడంలేదు’ అని వ్యాఖ్యానించారు. పవన్తో సమన్వయ లోపాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, ఆ బాధ్యతను జాతీయ నాయకుడు మురళీధరన్కు అప్పగించినట్లు తెలిసిందని చెప్పారు. అయితే, 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అధిష్ఠానం స్పష్టం చేసిందని.. అందువల్లే ఆసంతృప్తితో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోము వీర్రాజు మద్దతుదారులు అంటున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ కూడా రాష్ట్రంలో సోము వీర్రాజు నాయకత్వంలోనే పార్టీ వచ్చే ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరోవైపు.. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కన్నా కొట్టిపారేస్తున్నారు. తాను బీజేపీలో చేరిన నాటి నుంచి ఇలాంటి ప్రచారమే జరుగుతోందని అన్నారు. బుధవారం తాను ఎలాంటి కార్యకర్తల సమావేశం నిర్వహించలేదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం వీర్రాజు ఢిల్లీ నుంచి రాగానే గన్నవరం ఎయిర్పోర్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడతారని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే, ఆయన విజయవాడకు రాలేదు. నేరుగా బెంగళూరుకు వెళ్లారని పార్టీ నాయకులు తెలిపారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సోము వీర్రాజును నియమించారంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వీర్రాజుకు గతంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా భావించినా.. పార్టీలోనే కొందరు నేతలు మోకాలడ్డినట్టు విమర్శలు వచ్చాయి. మండల నాయకుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు.. సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన సోము సూర్యారావు, గంగమ్మ దంపతులకు 1957లో జన్మించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన ఆయన బీఎస్సీ చదివారు. వృత్తి వ్యాపారం. వీర్రాజు మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. – 1978లో జనతా యువమోర్చానగర ప్రధాన కార్యదర్శిగా అరంగేట్రం చేశారు 1980లో యువమోర్చా తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1982–1984 వరకు బీజేపీ జిల్లా కార్యదర్శిగా, 1987–90 వరకు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1991–94 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1994–96 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, 1996–2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 2003 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2006–10 వరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010–13 తిరిగి రెండోసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు మొదటిసారి, 2014 నుంచి ఇప్పటి వరకు రెండోసారి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్గా పనిచేశారు. – ప్రస్తుతం ఏపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2015 నుంచి 2018 వరకు ఆయన శాసనమండలి బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు. శుభాకాంక్షలు తెలిపిన జీవీఎల్ బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తి ఎదుగుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏళ్లపాటు వివిధ పదవుల్లో ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీర్రాజు నాయకత్వంలో పార్టీ బలమైన రాజకీయ పార్టీగా ముందుకు వెళుతుందని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. పార్టీ నిర్ణయానికి సర్వదా కృతజ్ఞుడను. ప్రధాని నరేంద్ర మోదీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్షాలు పార్టీకి, రాష్ట్రానికి ఒక మంచి దిశను అందించారు. – సోము వీర్రాజు -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కత్తెరు గ్రామం సోము వీర్రాజు స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన.. దశాబ్దాలుగా సంఘ్ పరివార్లో కొనసాగారు. గతంలోనే సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి.. చేతికి అందినట్టే అంది చేజారింది. ప్రస్తుతం ఆయన ఏపీ మండలిలో సభ్యునిగా కొనసాగుతున్నారు. -
ప్రపంచానికి మోదీ ఆదర్శం
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ తన పాలనా సామర్థ్యంతో ప్రపంచానికే ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి కన్నా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంలో మోదీ పారదర్శకమైన పాలనతో వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేశారని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ను నియంత్రిస్తుండటమే కాకుండా.. దేశం స్వయం సమృద్ధితో ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్న గొప్పనాయకుడిగా ప్రజల నుంచి మన్ననలు పొందారని అన్నారు. రమేష్ కుమార్ను కొనసాగించండి హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునరుద్ధరించాలని కన్నా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మరింత సాగదీస్తే రాష్ట్రానికున్న మంచి పేరు పోవడమే కాకుండా, న్యాయవ్యవస్థ పట్ల రాష్ట్రానికున్న గౌరవాన్ని కూడా తగ్గించినట్టవుతుందని పేర్కొన్నారు. -
కన్నా కోడలి మృతిపై వీడని గుట్టు
సాక్షి,హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మరణించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక(38) మృతి ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సుహారిక మృతిలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. దీంతో ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసు విచారణలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు సుహారిక నివాసంతో పాటు, ఆమె పార్టీకి వెళ్లిన స్నేహితుల ఇళ్ల పరిశీలనతోపాటుగా పలువురిని ప్రశ్నించనున్నారు. (కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి) సుహారిక వయస్సు చిన్నదే కావటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకపోయినా ఆమెకు గుండెపోటుకు దారితీసిన కారణాలపై పోలీసు విచారణ కొనసాగనుంది. అయితే, ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ రఫీ మీడియాతో మాట్లాడుతూ.. సుహారిక మరణానికి గుండెపోటు కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, జూబ్లిహిల్స్లోని మహా ప్రస్థానంలో కన్నా కుటుంబసభ్యుల సమక్షంలో సుహారిక అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుహారిక భౌతికకాయానికి పోస్ట్మార్టం నిర్వహించారు. -
కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్లో గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం మృతికి గల కారణాలు తెలియనున్నాయి. సుహారిక తల్లి, భర్త ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
'ఈ సమయంలో రాజకీయాలు చేయడం తగదు'
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విపత్కర సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం క్షమించరాని నేరమని ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీలు అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డి పై నీచమైన కామెంట్లు చేసినందుకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారన్నారు. బీజేపీకి అండగా అండగా ఉంటున్న జనసేనతో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రపంచంలో భారత దేశం ముందుంటే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని జాతీయ మీడియా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతమైన పాలన చూసి ఓర్వలేకనే చంద్రబాబు సహా ఇతర టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రికి నివేదించానంటూ కొట్ట సత్యనారాయణ పేర్కొన్నారు. అంతకముందు తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన వాణిజ్య, వ్యాపార, డ్వాక్రా మహిళలు తదితర వర్గాలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరాటానికి మద్దతుగా ఇచ్చిన విరాళాలను బుధవారం అమరావతిలో సీఎంను కలిసి రూ. 2 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. మంచి సమాజం రావాలంటే అందరూ సహకరించాలి అలా సహకరించాలని పేర్కొన్నారు. -
పార్టీ నిధులకు కన్నం..!
-
కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?
సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తారా అంటూ కన్నా విసిరిన సవాలుపై స్పందిస్తూ.. తాను దేవుడిపై ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానని విజయసాయిరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే కన్నా, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిలు కూడా ప్రమాణం చేస్తారా అని నిలదీశారు. తాజాగా కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్ అంటూ కన్నా లక్ష్మీ నారాయణను విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. అలాగే కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో రూ. 30 కోట్లు నొక్కేశాడని ఎన్నికల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం చేసినట్టు అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలను విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. స్థానికంగా సమీకరించిన విరాళాలు కూడా దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు అందాయని తెలిపారు. కన్నాతో పాటుగా కొత్తగా చేరిన నేతలు.. ఈ నిధులను పంచుకున్నట్టు బీజేపీ పెద్దలకు తెలుసునని పేర్కొన్నారు. మరో ట్వీట్లో ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చీమ కుడితే.. బీజేపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి.ఎప్పుడు ఏ విధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుంది’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్...? @klnbjp — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు. pic.twitter.com/B3sUlBrwUC — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 చంద్రబాబుకు చీమ కుడితే బిజెపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి. ఎప్పుడు ఏవిధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుంది. — Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2020 చదవండి : ‘కన్నా’పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా -
కన్నా మాట్లాడుతోంది బిజెపి లైనా?.. టిడిపి లైనా?
-
‘నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు’
సాక్షి, విశాఖపట్నం : గతి భారతి ఫౌండేషన్ ద్వారా కొందరు స్నేహితుల సహాయంతో ప్రజలకు సహాయం చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. డబ్బుల కోసం తాము ఫౌండేషన్ నడపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనెప్పుడూ అసత్య ఆరోపణలు చేయ్యలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇందుకు ఏ ఆలయం వద్దనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ఎప్పుడూ తెలిసి అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేసి చెప్పారు. (పోలీసుల కోసం ఉన్నంతలోనే ఉదారత.. ) ప్రస్తుతం కొన్ని బ్యాంకులు విలీనం చెయ్యడం.. ఆర్థికంగా చితికి పోవడం లాంటి దుస్థితి సుజనా చౌదరి లాంటి వ్యక్తుల వల్లే జరుగుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. సుజనా చౌదరి రింగ్ ఎంట్రీలు చేసి ఎలా బోగస్ కంపెనీలు సృష్టించారో ఆధారాలతో సహా రుజువు చేయగలనని స్పష్టం చేశారు. కేంద్రంతో రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉన్నా.. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు కన్నా లక్ష్మీనారాయణ ఎంత వరకు దుర్వినియోగం చేశారో తాను లెక్కల్లో చెప్పగలనని అన్నారు. రూ.20 కోట్లకు కన్నా అమ్ముడు పోయారని చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. (జర్నలిస్ట్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి: కవిత) కేంద్రం ఇచ్చిన ఎన్నికల నిధులు గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఎంత దారి మల్లించారో తన దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారంతా బీజేపీకి నష్టం కలిగిస్తున్నారని, కళ్లు ముసుకొని పిల్లి పాలు తాగి ఎవరూ చూడలేదని అనుకుంటుందని.. సుజనా, కన్నా లాంటి అవినీతి పరులు ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా ) -
‘వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి!’
సాక్షి, తాడేపల్లి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖ నిరాధారితంగా ఉందని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయించిన ధర ఎంతో కూడా తెలియకుండా కన్నా లేఖ రాశారని అన్నారు. సోమవారం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కావాలని బురదజల్లేందుకు ప్రయత్నించడం మంచిది కాదు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటల కొనుగోలులో కేంద్రం సహకారం అందించేలా ప్రయత్నించాల్సిన వ్యక్తులు ఇలా విమర్శలకు దిగడం సరికాదు. ( కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? ) టీడీపీ నేతలు చేసినట్లు ఆరోపణలు చేయవద్దు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఇప్పటికే ఆదుకుంటోంది. మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఓ లక్ష టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేలా ప్రయత్నించండి. కేంద్రం, రాష్ట్రం వేరు కాదు.. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేస్తున్నామని గుర్తించండ’’ని అన్నారు. -
కన్నా లేఖలోని అంశాలు.. పచ్చి అబద్దాలు
సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,550 కల్పించాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖలోని అంశాలన్ని పచ్చి అబద్ధాలని మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,760 మాత్రమే అని గుర్తుచేశారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి డబ్బు చెల్లించదన్నారు. ప్రజా పంపిణీ కోసం కొనుగోలు చేస్తేనే రూ.1760 మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. వాస్తవాలు కాకుండా అవాస్తవాలను కన్నా ప్రచారం చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కేవలం విమర్శలు చేయాలనే ఉద్దేశంలోనే కన్నా ఇలాంటి లేఖలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
కమలానికి కొత్త సారధి..?
-
‘పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఆయనొక’
విశాఖపట్నం: ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడే నైతిక హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. కరోనా భయాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తే పవన్ అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ పవర్ స్టార్ కాదని, ఆయనో పిరికి స్టార్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితం ఒకటే వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకు జరిగిందో అలాగే ఉంటుందని, మిగిలిన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ చెప్పిన విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ రికార్డు పవన్ పేరిటే ఉంది.. జనసేన ఆరు ఏళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకుని రికార్డు ఘనత సాధించిందని ఎమ్మెల్యే అమర్నాథ్ చురకలంటించారు. పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో రెండు చోట్ల ఓడిపోయిన రికార్డు కూడా పవన్ పేరిట ఉందని ఎద్దేవా చేశారు. భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రూట్మ్యాప్ సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. నిన్న కన్నా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. భూకబ్జా జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా అని కన్నాని సూటిగా ప్రశ్నించారు. ఆయన భూములు సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఇష్టం లేకనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి బీజేపీ తోక పార్టీలా మారిందని, దానికి జనసేన ఈక పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలో టీడీపీతో జనసేన లోపకారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. -
అప్పుడు ‘కన్నా’ ఏమైపోయారు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందు మతాన్ని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడో చిన్న ఘటనలు జరిగితే వాటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాగా నెల్లూరు జిల్లా రథం కాల్చివేసిన ఘటనపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దేవాలయాలు ఎవరూ కూలదోసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చారించారు. ఏపీ గవర్నర్ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాగా.. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల్లో వేల కోట్ల రూపాయలను దోచుకున్నప్పుడు, విజయవాడలో దేవాలయాలను కూల్చివేసినప్పుడు.. కన్నా ఏమైపోయారని మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీని కన్నా తెలుగుదేశం జనతా పార్టీగా మార్చివేశారని.. దానికి అధ్యక్షుడిగా సుజనా చౌదరి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరిల డైరెక్షన్లో ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో సదావర్తి భూములను దోచుకుంటే ఆయన ఎందుకు ప్రశ్నించ లేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో అమరావతి భూములను వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మేనిఫెస్టో కన్నాకు కనిపించడం లేదా అని విమర్శించారు. -
ఏపీ గవర్నర్ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
సాక్షి, విజయవాడ: మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను రాజ్భవన్లో సోమవారం ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో రథం తగలబెట్టి, దేవాలయాలను కూల్చివేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదే విధంగా పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)పై పార్లమెంటులో చట్టం చేసినప్పటీ నుంచి కాంగ్రెస్, వామపక్షాలు క్షేత్రస్థాయిలో ప్రజల్ని రెచ్చగొడుతున్నాయన్నారు. భారతదేశంలో ఎన్ఆర్సీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నోసార్లు స్పష్టం చేశారని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై మార్పు చేయడం జరగదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో పడ్డాయని మండిపడ్డారు. ఎన్ఆర్సీ లేదని చెబుతున్నా అసదుద్దీన్ ఒవైసీ గుంటూరులో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఓవైసీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇక ఈ కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల భారతదేశంలో ఏ ఒక్క ముస్లింలకు అన్యాయం జరగదని కన్నా పేర్కొన్నారు. -
‘కన్నా.. వాస్తవాలు తెలుసుకోండి’
సాక్షి, అమరావతి: జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ శాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నట్టుగా పోలీస్ శాఖలో ప్రస్తుతం 80 మంది డీఎస్పీలు వెయింటింగ్లో ఉన్నారన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14 మంది డీఎస్పీలు మాత్రమే.. శాఖాపరమైన కారణాలతో వెయిటింగ్లో ఉన్నారని పేర్కొంది. వెయిటింగ్లో ఉన్న పోలీసు అధికారులకు పోస్టింగులివ్వండి: కన్నా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా కాలంగా పోస్టింగ్ ఇవ్వక వెయిటింగ్లో కొనసాగుతున్న పోలీసు అధికారులకు వెంటనే పోస్టులను కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఇతర శాఖల ఉద్యోగులతో పాటు వెయిటింగ్లో ఉంచిన పోలీసులందరికీ పోస్టింగ్లు ఇవ్వాలని లేఖలో కోరారు. -
చంద్రబాబు ఉచ్చులో పడొద్దు..
-
చంద్రబాబు ఉచ్చులో పడొద్దు..
సాక్షి, విశాఖపట్నం: సంక్షేమ పథకాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతోనే చంద్రబాబు, పవన్కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు రాజధానిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని వెల్లడించారు. రాజధానిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయని.. రాష్ట్ర రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. టీడీపీతో గత ఐదేళ్లుగా జత కట్టిన బీజేపీ ఎందుకు 1500 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందో సమాధానం చెప్పాలన్నారు. ‘రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చువుతుందని ఆనాడు టీడీపీ, బీజేపీలు చెప్పలేదా.. బీజేపీ లక్ష కోట్లు ఇస్తే రాజధానిని అమరావతిలో కొనసాగించడానికి సిద్ధమని’ తెలిపారు. ఆయనకు విజన్ లేదు..ప్యాకేజీ ఇస్తే చాలు.. పవన్కు విజన్ లేదని..ప్యాకేజీ ఇస్తే చాలని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ గుర్తింపు కోసమే ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము చంద్రబాబు పర్యటనను అడ్డుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్పై తప్పుడు కేసు పెట్టలేదా.. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ను అడ్డుకోలేదా’ అని నిప్పులు చెరిగారు. రానున్న రోజుల్లో చంద్రబాబు మూడు సీట్లకే పరిమితమవుతారన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. వారే రాజధాని ఉద్యమంలో ఉన్నారు.. రియల్ ఎస్టేట్ మాఫీయా, భూదందా చేసేవాళ్లే ఎక్కువ మంది రాజధాని ఉద్యమంలో ఉన్నారని దుయ్యబట్టారు. రాజధాని రైతులను రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని.. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని సూచించారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థులకు వరమని.. సీఎం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. అని వర్గాల సంక్షేమమే వైస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. -
చంద్రబాబు హయాంలోనే ఇసుక మాఫియా
సాక్షి, లబ్బీపేట / విజయవాడ తూర్పు: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలోనే ఇసుక మాఫియా ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించినా, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. బృందావన కాలనీలో బీజేపీ అధికార ప్రతినిధి, ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోగులూరి శ్రీకృష్ణచైతన్య శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధారి్మక సెల్ కార్యాలయాన్ని సోమవారం కన్నా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియంకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల విద్యాబోధన కాకుండా, తెలుగు మీడియం పాఠశాలలు తొలగించకుండా, ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని మతాలను తమ పార్టీ గౌరవిస్తుందని, గత ప్రభుత్వం దేవాలయాలను కూలి్చందని, ఎన్ని క్షుద్రపూజలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ధారి్మక సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
‘పవన్ కల్యాణ్తో వేదిక పంచుకోం’
సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. నవంబర్ 4న విజయవాడలో బీజేపీ పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మునిగే నావ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయని బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిహెళ్ల రఘురాం అన్నారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగైందని, తెలుగుదేశం పార్టీ మునిగే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. జనసేన ఒక గందరగోళ పార్టీ అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్తమానంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కొత్తవారు కావడంతో వారికి శిక్షణ తరగతులు అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలు వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. -
కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?
సాక్షి, గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కన్పించడంలేదని, రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల చెప్పుడు మాటలు వింటున్నారని గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. ఈ నెల 16వ తేదీన గురజాలలో కన్నాలక్ష్మీనారాయణ ధర్నా చేస్తామన్నారు. గురజాలలో ఎందుకు ధర్నా చేస్తున్నారో అర్థం కావడంలేదని, గత ప్రభుత్వంలో గురజాలలో సున్నపురాయి దోపిడీ జరుగుతుంటే అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని మండిపడ్డారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు అక్రమ కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేదు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకాలు చేస్తే ప్రశ్నించలేదు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకుల ద్వారా నిజాలు తెలుసుకోవాలని’ కన్నాకు సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ మైనింగ్, అక్రమ గ్రానైట్, నకిలీ విత్తనాలు, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు జరగకుండా అదుపు చేశాం. గడచిన 3 నెలల్లో గురజాలలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామన్నారు. 2 నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారి మాటలు వింటే పచ్చ కామెర్ల వారికి అంత పచ్చగానే కనపడుతుందనేలాగే ఉంటుందని ఎద్దేవాచేశారు. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారిని బీజేపీలోకి పంపి మళ్ళీ 3సంవత్సరాల తర్వాత టీడీపీలో చేర్చుకుంటారని తెలిపారు. చంద్రబాబు ఉద్దేశం బీజేపీ భుజాలపైన గన్ను పెట్టి వైఎస్సార్సీపీపై దాడిచేయాలని, ఇప్పటికైనా బీజేపీ నాయకులు టీడీపీ దుర్మార్గాలను గ్రహించాలని సూచించారు. గతంలో ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధర్నా చేసే వారికి ప్రొటెక్షన్ కల్పించమని పోలీసు అధికారులకు సూచిస్తుంది అని పేర్కొన్నారు. -
ఆ విషయం కన్నాకు చివరివరకు తెలియదు!
ఆయన సీనియర్ రాజకీయనాయకుడు. అంతేకాదు బలమైన సామాజిక వర్గాన్నికి చెందిన నేత. కానీ రాజకీయ వ్యూహాలను రచించటంలో మాత్రం వెనుకపడిపోయారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్ధంకాక తికమక పడుతున్నారు. దాంతో అధిష్టానం ఆగ్రహంగా వున్నట్టు చెబుతున్నారు. ఎందుకు అలా ? ఇంతకు ఆయన ఎదుర్కొంటున్న సమస్యలేంటి? పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన నేతల్లో ఈయన పేరు కూడా బలంగా వినిపించింది. అయితే అప్పుడు కాలం కలిసి రాలేదు. కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలు కన్నా లక్ష్మీనారాయణను ఎదగనియ్యకుండా చేశాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్గా వెళ్లి బీజేపీలో చేరారు. దీనికి బలమైన కారణముంది. గుంటూరు రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు వీరిద్ధరి మధ్య వార్ పీక్ స్టేజిలో ఉండటం, ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవటంతో రాయపాటి సాంబశివరావు కక్ష సాధింపునకు దిగుతారనే భయం లక్ష్మీనారాయణను నిలవనీయలేదు. దీంతో మూడో కంటికి తెలియకుండా రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లి కాషాయం కండువా కప్పుకున్నారు. అప్పట్లో టీడీపీ, బీజేపీల మధ్య సఖ్యత ఉండటంతో కన్నా లక్ష్మీనారాయణను రాయపాటి సాంబశివరావు ఏమీ చేయలేకపోయారు. తర్వాత జరిగిన పరిణామాలు, 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ పెద్దలు.. ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలను అప్పగించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఆయన ద్వారా రాష్ట్రంలోని కాపు నాయకులు, ఇతర ప్రముఖులు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం ఆలోచించింది. కానీ కన్నా లక్ష్మీనారాయణ వల్ల అది సాధ్యం కాలేదు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినవారు ఎవరూ గెలవలేకపోయారు. దాంతో రాష్ట్రంలో బీజేపీని నిలబెట్టడంలో కన్నా విఫలం అయ్యారన్న ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించాలని బీజేపీ ఢిల్లీ నేతలు కన్నా లక్ష్మీనారాయణకు టార్గెట్ పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, టార్గెట్ అందుకోవడంలో కూడా విఫలం అయ్యారని, రాష్ట్రమంతా తిరిగినా కేవలం ఎనిమిది లక్షల కంటే సభ్యత్వాలు నమోదు కాలేదని పార్టీ వర్గాల సమాచారం. అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరే నేతల గురించి కూడా రాష్ట్ర అధ్యక్షుడైన కన్నా లక్ష్మీనారాయణకు తెలియడం లేదు. సైకిల్ పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు కాషాయం కండువా కప్పుకున్న సంగతి కన్నాకు చివరి నిమిషం దాకా తెలియని పరిస్థితే దీనికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు. సరే.. జరిగిందేదో జరిగిందనుకున్నా.. ఆ తర్వాత కూడా బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు ఎవరూ కన్నాను కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. వాస్తవానికి కేంద్ర స్థాయిలో పార్టీలో చేరే రాష్ట్ర నేతలు.. రాష్ట్ర అధ్యక్షుడిని కలవటం అనేది సర్వసాధారణం. కానీ కన్నా విషయంలో వారు అసలు పట్టించుకోనట్లే వ్యవహరించటం పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులుకు అంటున్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే వారు కన్నాను కలవలేదన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి చేరికలు ఉన్నప్పటికీ వారంతా రాష్ట్ర అధ్యక్షుడైనా కన్నాను పట్టించుకోకుండా నేరుగా ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ చేసుకుని జాయిన్ అవుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాను చూస్తే బీజేపీలో కన్నా పరిస్థితి మైనస్లో పడిందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కన్నాకు మరో ఎనిమిది నెలల సమయమే ఉంది. ఆ తర్వాత కన్నాను పక్కన పెట్టాలనే ఢిల్లీ పెద్దలు నిర్ణయించారని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో అగమ్యగోచరంగా తయారయిందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. -
కన్నా లక్ష్మీనారాయణ ఫెయిలయ్యారా?
-
‘శివాజీ వెనుక చంద్రబాబు హస్తం’
సాక్షి, అమరావతి: గరుడు పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కన్నా.. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అణవేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కేంద్రంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుకాదని.. హోదాకు సమానమైన ఆర్థిక సాయం కేంద్రం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజికి చంద్రబాబు అంగీకరించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేదుకే బీజేపీపై ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని, అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిందని అభిప్రాయపడ్డారు. ఏపీలోనే కాక.. దేశమంతా బీజేపీపైపు చూస్తోందని, యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. -
అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’
సాక్షి, అమరావతి : అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభలను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తానా సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించిన లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారని అన్నారు. ఈ సభలను పచ్చతమ్ముళ్లు టీడీపీ భజన సభలుగా మార్చి అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ట దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. ‘ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అని కన్నా వ్యాఖ్యానించారు. -
అందుకే టీడీపీని వీడుతున్నారు : కన్నా
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడిపై విసుగుతోనే టీడీపీ నేతలు పార్టీ వీడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదన్నారు. వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు చంద్రబాబుకు ఫిరాయింపులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై చంద్రబాబు మట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించనట్లే అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి చూసే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. -
బాబుతో పొత్తు వల్ల రెండు సార్లు దెబ్బ
రైలుపేట (గుంటూరు): రాష్ట్రంలో చంద్రబాబుతో రెండుసార్లు పొత్తు పెట్టుకుని బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేనకు చెందిన పలువురు మండల స్థాయి నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ 1999లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గాలి వీస్తున్న రోజుల్లో, 2014లో నరేంద్ర మోదీ గాలి వీస్తున్న సమయంలో చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని రెండుసార్లు బీజేపీ దెబ్బతిందని చెప్పారు. నాలుగున్నరేళ్లపాటు కేంద్రం నుంచి రూ. లక్షల కోట్లు నిధులు తీసుకుని, వాటిని ఇతర పనులకు కేటాయించి అవినీతికి పాల్పడిన చంద్రబాబు కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. దీన్ని ప్రజలు నమ్మకుండా వాస్తవాన్ని తెలుసుకున్నారు కాబట్టే నేడు అనేకమంది బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నట్లు వెల్లడించారు. అలాగే హైదరాబాద్లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోయి ఇక్కడికి పారిపోయి వచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదనే విషయం తెలిసినప్పటికీ అన్ని పార్టీలు ప్రజలను సెంటిమెంట్తో మభ్యపెట్టి మోసగించాయని చెప్పారు. -
కెమెరా ముందు సంసారం.. వెనకాల..
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, తోకపత్రిక యజమాని రాధాకృష్ణ మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏకంగా ఎన్టీఆర్ను వాడు.. వీడు అని చంద్రబాబు దుర్భాషలాడటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బాగోతాలపై ఏపీ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్ధాయితో ధ్వజమెత్తారు. కెమెరా ముందు సంసారులుగా నటిస్తూ.. కెమెరా వెనకాల వ్యభిచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ కెమెరా ముందు సంసారం...కెమెరా వెనుక వ్యభిచారం. ఇదీ మీ పచ్చ పత్రికల బాగోతం. ఎన్టీఆర్ను చంపారు. కాంగ్రెస్తో పొత్తుట్టుకుని ఆయన విలువలకు అంత్యక్రియలు చేశారు. ఇప్పుడు ఆయన్ని చరిత్ర నుంచి తుడిపేయడానికి తెగించారు. ఏపీ రాజకీయ చరిత్రకు చంద్రబాబు ఒక అవినీతి మచ్చ’ అని వ్యాఖ్యానించారు. (చదవండి : ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేస్తా) అదంతా నాటకమే..! సాక్షి, విజయవాడ: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పట్ల చంద్రబాబు చేసిన కించపరిచే వ్యాఖ్యలపై ఏపీ మాజీ హోం మంత్రి, వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. ‘బాబు వ్యాఖ్యలతో అన్నగారి ఆత్మ క్షోభిస్తుంది. తాజా ఘటనతో ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు నిజమైన వైఖరి బయటపడింది. ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేసి బాబు నివాళులు అర్పించడం నాటకమని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కళ్ళు తెరవాలి. అన్నగారి ఆత్మగౌరవం కాపాడాల్సిన కనీస బాధ్యత ఆయన వారసులపై ఉంది’ అన్నారు. బాబుకు నరనరాల్లోనూ విద్వేషం.. విజయవాడ: ఎన్టీఆర్ పట్ల మొదటి నుంచి చంద్రబాబుది కపట ప్రేమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేష్ఠ రమేష్బాబు అన్నారు. ఎన్టీఆర్ అంటే బాబుకు నరనరాల్లోనూ విద్వేషం ఉందని, గత్యంతరం లేక ఎన్టీఆర్ పేరును ఇప్పటి వరకు వాడుకున్నాడని విమర్శించారు. తెలుగు ప్రజలు దైవంగా భావించే ఎన్టీఆర్ను నీచంగా సంబోధిస్తూ వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు అహంకారానికి ఎన్టీఆర్ అభిమానులు సరైన బుద్ది చెబుతారని ఆకాక్షించారు. -
‘ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు షాడో టీమ్’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విచక్షణా జ్ఞానం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కాంగ్రెస్, జనసేన పార్టీలతో అంటకాగుతూ బీజేపీ ఆరోపణలు చేయడాన్ని ట్విటర్లో తప్పుబట్టారు. బీజేపీకి వైఎస్సార్సీపీ బీ టీమ్గా వ్యవహరిస్తోందని చంద్రబాబు చేసిన ఆరోపణలపై కన్నా ఘాటుగా స్పందించారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు షాడో టీమ్ నడుపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బీ టీమ్గా పనిచేస్తోందన్నారు. జనసేన, కమ్యూనిస్టు, కేఎ పాల్ ప్రజాశాంతి పార్టీలు.. వరుసగా సీ, డీ, ఈ టీమ్లుగా ఉన్నాయని ఆరోపించారు. టీడీపీకి మాయవతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాదీ పార్టీ ఎఫ్ టీమ్గా ఉందని కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. -
సోము వీర్రాజుకు చేదు అనుభవం!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలు కొందరు వీర్రాజును జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్భంధించారు. భారత జనతాపార్టీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో బీజేపీ నేతలు వివక్షత చూపుతున్నారని బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం పని చేసే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నాయకులను ఎవరిని జిల్లాలో అడుగు పెట్టనీయబోమని అన్నారు. రానున్నరోజుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణను కూడా ఇదే విధంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. -
చిన్న కేసుకే సిట్ వేస్తారా..!
సాక్షి, తిరుపతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం నేరమని అన్నారు. అయినా, డేటా చోరీ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న టీడీపీ నేతలు భుజాలెందుకు తడుముకొంటున్నారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలో నమోదైన చిన్న కేసు విషయమై ఏపీలో సిట్ ఎందుకు వేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. డేటా చోరీ కేసుతో టీడీపీ నాయకులంతా గాబరా పడుతున్నారని, ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బ్లాక్మెయిల్కు దిగుతోందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని గొంతు చించుకుంటున్న టీడీపీ పరువు నష్టం దావా ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) 2017 నుంచి టీడీపీ చేస్తుందదే..! తెలంగాణలో ఉన్న ఓట్లను ఏపీలో చేర్చే ప్రక్రియకు 2017 నుంచే టీడీపీ పూనుకుందని కన్నా ఆరోపించారు. ఏ గడ్డి తిని అయినా అధికారంలోకి రావాలని బాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫామ్-7 దాఖలు చేస్తే టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం తీరు చూస్తే డేటా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో మాదిరిగానే చంద్రబాబు తీరు ఉందని అన్నారు. ఓటర్ల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. డేటా చోరీపై నియమించిన మూడు సిట్ల నివేదిలక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపిందని స్పష్టం చేశారు. ఈ నెల 13న బీజేపీ-బస్సుయాత్ర విజయనగరంలో ప్రారంభమై 21న కడపలో ముగుస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. (చదవండి : స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) -
‘టీడీపీ గూండాలను బాబు ఎగదోస్తున్నారు’
-
‘టీడీపీ గూండాలను బాబు ఎగదోస్తున్నారు’
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక దిగజారిన ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని, ఆర్టీవో అధికారులతో కలిసి సభకు వచ్చే బస్సు యజమానులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్కు కూడా కలిశామని చెప్పారు. ‘మోదీ సభను అడ్డుకోండి, నరకండి, చంపండి అని చంద్రబాబు తన గూండాలకు చెప్తున్నారు. ఇంతలా దిగజారిన సీఎంను ఇక్కడే చూస్తున్నాం’ అని మీడియాతో అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో మోదీకి ఎంట్రీ లేదంటూ టీడీపీ నేతలు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విజయవాడ వచ్చే మార్గంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. -
చంద్రబాబుకు భయం పట్టుకుంది
-
టీడీపీ నేతలకు నితిన్ గడ్కరీ సవాలు
సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సాయం మరెవరూ అందించలేదని, దీనిపై టీడీపీ నేతలకు ఛాలెంజ్ విసురుతున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నితిన్ గడ్కరీ హాజరై మాట్లాడుతూ..' అందరికి సుపరిపాలన అందించాలన్నదే మోదీ లక్ష్యం. గత ప్రభుత్వాల హయాంలో టెర్రరిజం పెరిగిపోయింది. ప్రధానిగా మోదీ వచ్చిన తరువాత టెర్రరిజంను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. 2022 నాటికి ఆర్థికంగా వెనుకబడిన పేదలు అందరికి ఇళ్లు కట్టిస్తాము. కేంద్రం ఆర్థిక పరంగా రాష్ట్రానికి చేయాల్సినందంతా చేస్తోంది. మోదీ రాష్ట్రానికి ఎంతో చేస్తున్నా, చంద్రబాబు రాజకీయంగా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం ఖర్చు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికి పోలవరం 62 శాతం పూర్తయింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. దీనిపై ఎవరికి సందేహాలు వద్దు. భారతమాలలో భాగంగా 44 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేస్తున్నాము. అనంతపురం అమరావతి హైవే నిర్మాణం 20 వేల కోట్లతో పూర్తి చేస్తాము. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి చేస్తాము. కాకినాడలో పెట్రో కెమికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము. బీజేపీ కుటంబ పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. యాబై ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్ల కాలంలో జరిగింది. దీనిపై మేము ఛాలెంజ్కు సిద్ధం. పోర్టులు, రోడ్లకు నా శాఖ నుంచి రూ. లక్ష 25 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చాము' అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించినందుకు గడ్కరీని రాష్ట్ర బీజేపీ నేతలు సన్మానించారు. చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుంది : కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం ఇచ్చిన పథకాలతోనే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని బీజేపీనే విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో టీడీపీ విడిపోయిన తరువాతే రాష్ట్రానికి 24 వేల కోట్ల నిధులు ఇచ్చామన్నారు. చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుంది. మోదీ అంటే భయంతో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావడం లేదన్నారు. సర్వేలు చూస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది : విష్ణుకుమార్ రాజు రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇసుక దోపిడీ ద్వారా రూ.2 వేల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు.16,200 కోట్లతో రోడ్ల పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఇప్పటికీ ఇసుక దోపిడీని సీఎం చంద్రబాబు అరికట్టలేక పోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారని తెలిపారు. భూములు ఆక్రమమించిన పచ్చ పాములు పేర్లు బైటకు వస్తాయని సిట్ నివేదికను తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. ఎన్నికల సర్వేలు చూస్తుంటే చంద్రబాబుకు భయమేస్తోందన్నారు. మొన్నటి వరకు బీజేపీ, వైఎస్ జగన్, పవన్ ఒక్కటే అని విమర్శలు చేసిన టీడీపీ నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తొలగించి టీఆర్ఎస్ పేరు చేర్చారన్నారు. ప్రతి స్కీమ్ను ఒక స్కామ్గా మార్చారు : పురందేశ్వరి అగ్రవర్ణాల్లో పేదల కోసం ఎవరు ఊహించని విధంగా రిజర్వేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టారని మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అగ్రవర్ణాల్లో పేదల కోసం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి స్కీమ్ను ఒక స్కామ్గా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నీతి నిజాయితీతో కూడిన పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కట్టినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘అందుకే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉంది కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమానాశ్రయంలో దాడి జరిగింది కాబట్టి కేంద్రానిదే బాధ్యత అన్న చంద్రబాబు... ఇప్పుడు కేంద్రానికి సహకరించమని చెబుతున్న మాటలను ప్రజలకు అర్థం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను అవినీతి పేరుతో చంద్రబాబు నాయుడు, లోకేష్లు దోచుకున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే దేశాభివృద్ధి గా భావించి పథకాల కేటాయింపుల్లో నరేంద్ర మోదీ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వాల్మీకీ, బోయల సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. నరేంద్ర మోదీ మరో సారి ప్రధానమంత్రి అవడం దేశానికి అవసరమని చెప్పారు. అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. -
‘మోదీ నిర్ణయంతో చంద్రబాబు దిమ్మ తిరిగింది’
సాక్షి, గుంటూరు: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎంతో మంది పేదలకు భరోసా కలుగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎలాంటి పోరాటాలు లేకుండానే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. 70 ఏళ్లలో ఏ ప్రధాని తీసుకోని నిర్ణయం మోదీ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అగ్రవర్ణ పేదల గుండెల్లో మోదీ దేవుడిగా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ గురించి మాట్లాడేటప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మోదీ నిర్ణయంతో చంద్రబాబుకి దిమ్మ తిరిగిందని వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల అనుభవం దోచుకోవడానికి, దాచుకోవడానికేనా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో తాను చేసిన అభివృద్ధి పనులకే చంద్రబాబు ప్రారంభాలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పోలవరంపై నాణ్యతను గాలికొదిలి ప్రచారం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ చేసిన పనికి చంద్రబాబు సంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
కన్నా ఇంటి ముందు టీడీపీ కార్యకర్తల ఆందోళన
సాక్షి, గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడును బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఆందోళనకారుల ఎదుటే కన్నా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ- బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వివాదం చేటుచేసుకుంది. అనంతరం తోపులాట చేసుకోవడంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు. -
చంద్రబాబు ఓ గజదొంగ : కన్నా
సాక్షి, ప్రకాశం : సీఎం చంద్రబాబు నాయుడు ఓ గజదొంగ అని, దేశాన్ని దోచుకోవడానికి మరికొంత మంది దొంగలను ఏకంచేసే ప్రయత్నాలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో పాత్రధారులు కాంగ్రెస్ పెద్దలేనని ధ్వజమెత్తారు. దేశానికి ప్రధాని నరేంద్రమోదీ అవసరం చాలా ఉందన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే, పాకిస్థాన్లో సంబరాలు చేసుకున్నారని గుర్తుచేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని తిట్టిన చంద్రబాబు, అదే తల్లి కాంగ్రెస్తో సిగ్గులేకుండా కలిశారని కన్నా నిప్పులు చెరిగారు. సీఎం మానసిక పరిస్థితి అంత బాగోలేదు, కేసీఆర్ని ముందుగా రెచ్చగొట్టింది చంద్రబాబే అన్నారు. -
ఇటువంటి వ్యక్తి సీఎంగా అవసరమా : కన్నా
సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుని ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్దం కావడం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు మానసికవ్యాధితో బాధ పడుతున్నారని, ఇటువంటి వ్యక్తి సీఎంగా మనకు అవసరమా అని నిప్పులు చెరిగారు. హైకోర్టు ఏపీకి ఇస్తే, వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి లబ్ధి చేకూర్చడానికే అని బాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏవిధంగా వైఎస్ జగన్కు మేలు జరుగుతుందో చంద్రబాబే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడారు. 'నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు శ్వేత పత్రం అంటే అర్దం తెలుసా? ఎన్ని నిధులు తెచ్చారు. ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేశారో వివరిస్తే చంద్రబాబు నిజాయితీ అర్థమయ్యేది. కానీ అబద్దాలు, అసత్యాలతో ప్రజలను శ్వేత పత్రాల రూపంలో మభ్య పెడుతున్నారు. అబద్దాల చక్రవర్తిగా పేరు పొందిన బాబు తన పేరును మరోసారి సార్దకం చేసుకున్నారు. మీ ఎంపీ మురళీమోహన్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటు నుంచి శాఖలవారీగా ఏ ఏడాదిలో ఎన్ని నిధులు ఇచ్చామో వివరాలతో సహా ఆందచేశాం. వివిధ శాఖల నుంచి 14 వేల 319 కోట్లు వచ్చినా .. వాటి గురించి ఏపీ ప్రభుత్వం చెప్పకుండా సాయం చేయడం లేదని ఆరోపించడం అన్యాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదేళ్లలోనే అనేక ఇనిస్టిట్యూట్ లను కేంద్రం ఏపీకి ఇచ్చింది. అనుభవం కలిగిన సీఎంగా చంద్రబాబుకు ప్రజలు పట్టం కడితే.. అన్ని రూపాలలో అవినీతితో డబ్బును దోచుకునేందుకే తన అనుభవాన్ని చూపించారు. బాబు ప్రతి చర్య, ప్రతి మాట అంతా మోసమే. కడప స్టీల్ ఫ్లాంట్ విషయంలోను వాస్తవాలు చెప్పకుండా కేంద్రంపై బురద జల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఐరన్ ఓర్ ఇవ్వకుండా రాయలసీమ వాసులను మరోసారి చంద్రబాబు మోసం చేస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుకు సిద్దమంటూ చంద్రబాబు ఉత్తరం ఇచ్చిన తర్వాతే కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇండిపెండెంట్గా ఉండాల్సిన జ్యూడిషరీ వ్యవస్థను సీఎం క్యాంప్ కార్యాలయంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి చర్యల ద్వారా ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రపతి ఆదేశాలను పట్టించుకోకుండా బరి తెగించి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా బాబు పాలన సాగిస్తున్నారు. కృష్ణా నది ఒడ్డున కట్టడాలు ఉండకూడదంటే.. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అక్రమార్కుల పక్షాన నిలిచిన చరిత్ర చంద్రబాబుది. రోజుకో మాట మాట్లాడుతూ యూ టర్న్లు తీసుకునే చంద్రబాబు ఇప్పుడు హైకోర్టు విషయంలో కూడా యూ టర్న్ తీసుకుని తన బుద్దిని చాటుకున్నారు. చంద్రబాబు రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లకు ఫిర్యాదు చేస్తాం. ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు, ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో చంద్రబాబు శ్వేత పత్రం విడుదలచేయాలి. ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రానికి రానీయకుండా అడ్డుకుంటామని చంద్రబాబు ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్దం. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి' అని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. -
ఇటువంటి వ్యక్తి సీఎంగా అవసరమా : కన్నా
-
ఏం చేద్దాం: ఓటమిపై బీజేపీ అంతర్మథనం
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో.. ఆ పార్టీ అధినాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. తాజా పరాభవాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాల పధాధికారుల సమావేశం ఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్తోపాటు మురళీధర్రావు, ఇతర రాష్ట్రాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తాజాగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించడం, పార్టీ నాయకత్వంలో, శ్రేణుల్లో మళ్లీ నైతిక ఉత్తేజాన్ని నింపి రానున్న లోక్సభ ఎన్నికల కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘ఏపీలో దోచి.. కూకట్పల్లిలో..’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్లో అక్రమాలకు పాల్పడి దోచిన సొమ్ముతో చంద్రబాబు కూకట్పల్లి నియోజకవర్గంలో గెలవడానికి విశ్వప్రయంత్నం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బాబు మీద ఉన్న వ్యతిరేకతతోనే సుహాసిని ఓడిపోయిందని అన్నారు. ‘చక్రాలు తిప్పే మన వీరుడి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గట్టి పోటీ ఉండేది’ అని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో రోడ్లు, అంగన్వాడీలు, స్మశానాలకు కేంద్రకే నిధులిస్తోందని తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ తన బాబు సొమ్ములాగా రోడ్లకు తన పేరు పెట్టుకుంటున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరపత్రాల రూపంలో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే ప్రతిపనికి నిధులు కేంద్రమే ఇస్తోందని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి పేరుతో ఎన్ని పార్టీలు జట్టుకట్టినా మోదీ ఇమేజ్ను తగ్గించలేరని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో మూడు దఫాలుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడం సహజమేనన్నారు. -
మహాకూటమి కాదు.. పెద్ద దొంగల కూటమి
సాక్షి, విజయనగరం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులంతా కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మహాకూటమి కాదు అది పెద్ద దొంగల కూటమి అని అభివర్ణించారు. పార్వతీపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నరేంద్ర మోదీ పాలననే స్వాగతిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్, చంద్రబాబుల అవినీతి బయట పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వారి అవినీతిని నిరూపించలేకపోతే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు అంత నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు. లోకేశ్కు, చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించుకొని.. నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో సోనియాగాంధీపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆమెతో చేతులు కలిపి.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. -
రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారు
-
‘ఇసుకపై టీడీపీ ట్యాక్స్’
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలు ఇసుకపై టీడీపీ టాక్స్ కడుతున్నారని.. ఆ టాక్స్మీద వచ్చే డబ్బును చంద్రబాబు నాయుడు, లోకేష్ పంచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు నుంచే వేల లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని.. బయటి ప్రపంచానికి మాత్రం రైతులే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని సింగపూర్ కంపెనీలు కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తోందన్నారు. చంద్ర బాబు ఇంటిని చూస్తేనే ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొంగలా దొరికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కన్నా వ్యాఖ్యానించారు. -
‘బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’
సాక్షి, రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూసేకరణ చట్టానికి నీళ్లు వదిలి.. అవసరానికి మించి రైతుల నుంచి అడ్డగోలుగా వేలాది ఎకరాలు సేకరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి, మచిలీపట్నం, కాకినాడ సెజ్లకు సంబంధించిన భూసేకరణలో దారుణమైన అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ నెల 19న మచిలీపట్నం నుంచి నిరసన దీక్ష పేరుతో భూసేకరణలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో కలిసి బీజేపీ రాజకీయాలు చేస్తోందంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్పై దుమ్మెత్తిపోసి.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎవరని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా పార్టీలో చేర్చుకుని పదవులు ఇచ్చిందెవరని నిలదీశారు. అవినీతి పరులపై దాడులు జరుగుతుంటే చంద్రబాబు తనపైనే దాడులు జరిగినట్టు కంగారు పడుతున్నారని తెలిపారు. అవినీతి పాలన వల్లే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులలో చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. -
‘బీజేపీ సభలకు వెళ్తే రేషన్ కట్ చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో అరాచక శక్తులు పెరిగిపోయాయని బీజేపీ నేతలు దినేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావును గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను రోడ్డుపైనే నిర్బంధించడం బాధాకరమని దినేష్రెడ్డి వ్యాఖ్యానించారు. పై అధికారులు చెప్పడం వల్లనే కన్నాను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ముళ్లపూడి బాపిరాజుతో బహిరంగ చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి మాణిక్యాల రావును నిర్బంధించాల్సిన అవసరమేంటని సుధీష్ రాంబొట్ల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక మాజీ మంత్రికే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే... ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సభలకు వెళ్లిన వారిని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారనీ, రేషన్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచదని హితవు పలికారు. ఆంద్రప్రదేశ్కు సాయం చేసేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. -
ఓ నటుడి స్క్రిప్ట్ చదివే స్థాయికి బాబు దిగజారాడు
-
జగన్పై దాడిని అందుకే ఖండించాను: కన్నా
సాక్షి, గుంటూరు : ఏపీలో ప్రతిపక్ష నేతలు ప్రశాంతంగా తిరిగే పరిస్థితులు లేవంటూ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై జరిగిన దాడిని మానవ జన్మ ఎత్తిన ఎవరైనా ఖండిస్తారు.. అలానే తాను కూడా మానవతా దృక్పథంతోనే ఖండించానని కన్నా తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడే దమ్ము, ధైర్యం బాబుకు లేవని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షనేతలేవరూ ప్రశాంతంగా తిరగే పరిస్థితులు లేవని కన్నా ఆరోపించారు. అమిత్ షా, పవన్ కళ్యాణ్తో పాటు తనపై కూడా దాడికి కుట్రలు చేశారని వెల్లడించారు. ఈ విషయం గురించి గతంలోనే తాను కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యాధితో పాటు బాబుకు భయం పట్టుకుందని.. అందుకే ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని ఖండించడం కూడా తప్పే అంటున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ బాబు సృష్టే.. రాష్ట్రంలో ఏం జరిగిన టీడీపీ నాయకులు ఆపరేషన్ గరుడ అంటున్నారు.. ఎందుకంటే దాని సృష్టి కర్త చంద్రబాబేనని కన్నా ఆరోపించారు. ఒక సినిమా యాక్టర్ చెప్పిన స్క్రిప్ట్ని చదివే స్దాయికి సీఎం దిగజారిపోయారని ఆయన విమర్శించారు. ఆ సినిమా నటుడు రాష్ట్రంలో జరిగే విషయాల గురించి నెలల ముందే బ్రహ్మంగారి కాలజ్ఞానంలా చదువుతుంటే మీరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఆ బ్రహ్మజ్ఞానిని పట్టుకుని కుట్రలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐ గురించి బాబు మాట్లాడటం హాస్యాస్పదం.. దళిత డీజీపీకి అన్యాయం చేసిన చంద్రబాబు సీబీఐ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సీబీఐలో తన బంధువులను ప్రధాని మోదీ పెట్టుకోలేదని గుర్తు చేశారు. బాబుకు, మోదీకి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఎద్దేవా చేశారు. అలిపిరి దాడి జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసమర్ధ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడం తప్పులేదని తెలిపారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సుసైడ్ నోట్ రాసుకోవడం చూశామని, హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం బాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామంటూ కన్నా ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలు
గుంటూరు: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 17వ సారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి లేఖాస్త్రం సంధించారు. ఈ దఫా మరో ఐదు ప్రశ్నలు వేశారు. దీంతో ఇప్పటి దాకా కన్నా పంపిన ప్రశ్నల సంఖ్యకు 85కి చేరింది. కానీ ఇప్పటి వరకు కన్నా లక్ష్మీనారాయణ పంపిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడి నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రశ్న నెంబర్ 81: మీరు, మీ కుమారుడు, మీ అనుచరులు, మీ చెంచా మీడియా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా ఐటీ దాడులు చేయిస్తుందని గగ్గోలు పెట్టారు. మీ బినామీ రమేష్ మీసాలు కూడా తిప్పుతున్నారు. గత ఆరు సంవత్సరాల్లో ఎడ్కో(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు సీఎం రమేష్ రిత్విక్ సంస్థ రూ.12 కోట్లు చెల్లిస్తే, ఆ అడ్రస్లో ఆ కంపెనీనే లేదు. ఆ సంస్థ ప్రతినిధి సాయిబాబా రిత్విక్ కంపెనీ అకౌంటంట్ కాదని మీరందరూ ప్రకటించగలరా? సూట్ కేసు కంపెనీలకు చెల్లించిన డబ్బు విచారణ చేయించుకోగలరా? ఈ కోట్లాది రూపాయలేగా ఎంఎల్ఏలను కొనటానికి ఉపయోగించింది. తెలంగాణాలో రేవంత్ రెడ్డి చేత పంపిన యాభై లక్షలు కూడా అవే గదా. ఏపీని నిలువునా దోచి, వేల కోట్ల కాంట్రాక్టులను మీ బినామీ అయిన రమేష్ కంపెనీలకు ఇష్టారాజ్యంగా ఇచ్చి అక్కడ నుంచి మీరు వెనక్కు తెచ్చుకోవడం. ఏమి నైపుణ్యం. ఇలాంటి అనాగరిక సంస్కారహీనుడైన వ్యక్తి రాజ్యసభకా? ఆయనకున్న అర్హత మీ బినామీ కావడమే. అలా పంపినందుకు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత అతని చేత రాజీనామా ఇప్పించండి. ఈ విషయమై సీబీఐ విచారణకు స్వచ్ఛందంగా అడగగలరా? ప్రశ్న నెంబర్ 82: నీరు-చెట్టు పథకంలో భాగంగా సెక్రటేరియట్ దగ్గర నాటిన మొక్కలకు సంబంధించి చేసిన కోట్లాది రూపాయల అవినీతిని ఇంకా ప్రజల మరచిపోక ముందే కుప్పం నియోజకవర్గంలో పంచిపెట్టేందుకు ఒక్కో క్రికెట్ బ్యాట్ను రూ.6 వేలకు కొని, ప్రతీ డిపార్టుమెంటులో అవినీతి ఉండాల్సిందేనని నిరూపించారు. జీఓ ఆర్టీ నెంబర్.413, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్(స్పోర్ట్ట్స్ అండ్ యూత్ సర్వీస్) శాఖ, 16-10-2018 తేదీన 250 క్రికెట్ బ్యాట్లను మెస్సర్ ఎక్సెల్ స్పోర్ట్ట్స్ వారి నుంచి రూ.15 లక్షలకు కొన్ని మాట అబద్ధమా? మీ నియోజకవర్గంలో పంచే క్రికెట్ బ్యాట్లలో కూడా అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా? ప్రశ్న నెంబర్ 83: అస్తమానం మీరు, మీ అనుచరులు కేంద్రం నుంచి ఎలాంటి సాయం సహకారం లేదని గగ్గోలు పెడుతూ ఉంటారు. సాక్షాత్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమారే దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా నిధులు వచ్చాయని చెబుతున్నారు కదా? అందువల్ల 1776 గ్రామపంచాయతీ భవనాలను, 4843 అంగన్వాడీ భవనాలకు, 15వేల కి.మీల సీసీ రోడ్లను, 2.46 లక్షల పంట కుంటలను నిర్మించుకున్నామని చీఫ్ సెక్రటరీ చెప్పలేదా? ముఖ్యమంత్రిగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా? ప్రశ్న నెంబర్ 84: రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టు మీకూ, మీ కుమారునికీ, మీ మంత్రులకూ అనుచరులకూ, కలెక్షన్లకూ కేంద్రమైంది. ప్రాజెక్టులన్నీ మీ బినామీలకు అప్పగించడం, అంచనాలు పెంచడం, నిధులన్నీ దోచిపెట్టడం, ఆ నిధులన్నీ మరలా మీ దగ్గరకు రావడం. కృష్ణా నదిపై వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణం అంచనాలను రెండుసార్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో. రెండుసార్లు టెండర్లను ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో ప్రజలకు వివరిస్తారా? ఇదంతా మీకు అవగాహన ఉన్న కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేందుకు కాదా? ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా మీ అస్మదీయులకు దోచిపెట్టడం, ప్రశ్నిస్తే తెలుగు జాతి మీద దాడి అని ఎదురు దాడి చేయడం మీకు పరిపాటి అయింది. తెలుగు జాతి గౌరవాన్ని మీ స్వార్ధానికి బలి చేస్తున్నారు. కాదని చెప్పగలరా? ఈ విషయంపై సీబీఐ విచారణకు సిద్ధమా? ప్రశ్న నెంబర్ 85: భారత దేశ చరిత్రలో ప్రజస్వామ్యబద్దంగా ఎన్నిక కాబడిన గ్రామసర్పంచులకు మీరు చేసినంత అన్యాయం మరెవరైనా చేశారా? వాళ్లను పక్కన పెట్టి, జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల హక్కులను హరించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు 20, 30 నెలల నుంచి వాళ్లకు జీతాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయి బ్రహ్మాండంగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో ప్రజలకు వివరించగలరా? ఎలక్షన్లు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోతే దాని బాధ్యత మీరు వహించేందుకు సిద్ధంగా ఉన్నారా? -
బాబు మానసికస్థితి బాలేదు.. బట్టలిప్పి తిరిగినా..!!
సాక్షి, గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని, త్వరలోనే ఆయన బట్టలూడదీసుకోని రోడ్డుపై తిరిగినా ఆశ్చర్యం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే ఆయన నేడు జతకట్టారని మండిపడ్డారు. గురువారం గుంటూరులో కన్నా విలేకరులతో మాట్లాడాతూ.. ‘టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రానికి చంద్రబాబు సైంధవుడు. రాష్ట్ర విభజన సమయంలోనే చంద్రబాబు కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లుగా ఉంది’ అని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సోమ్ముతో పోలవరం విహార యాత్రలా? అని కన్నా ప్రశ్నించారు. కేంద్రం సోమ్ముతో ప్రాజెక్టు కడుతూ.. చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. రాయలసీమలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో మంత్రి పరిటాల సునీతా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని తాను చాలెంజ్ చేసి చెబుతానని, రాయలసీమ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. రాజధాని పేరుతో వ్యాపారం చేసుకోవడం తప్ప టీడీపీ చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు దొంగ మాటలకు సీఎస్ దినేశ్కుమార్ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. విభజన హామీల విషయంలో మన్మోహన్సింగ్, మోదీల ప్రసంగం మార్ఫింగ్ చేసి టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, టీడీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరిస్తామని కన్నా తెలిపారు. పగటి కలలు కంటూ వార్త రాశారు వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయమై బీజేపీని ఉద్దేశించి ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఆ పత్రిక ఎండీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ఆధారాలు లేకుండా అసత్యాలతో, ఊహగానాలతో కూడిన ఆ కథనాన్ని ఖండిస్తున్నాను. ఆ కథనం పగటికలలు కంటూ రాసినట్టుగా ఉంది. ఈ కథనానికి సంబంధించి తప్పు బప్పుకుంటారని ఆశిస్తున్నాన’ని అందులో పేర్కొన్నారు. -
‘అవసరానికో పొత్తు.. అది చంద్రబాబు అవకాశవాదం’
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తే చంద్రబాబుకి భయం పట్టుకుందనీ, తన నీడను చూసుకుని కూడా చంద్రబాబు భయపడుతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని ఇమేజ్ను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారనే ఎప్పుడో చెప్పామని అన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబు అవసరం కొద్ది పొత్తులు పెట్టుకుంటారని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బీజేపీకి కులం, మతం, రంగు లేదని ఉద్ఘాటించారు. కమ్యూనిస్టుల చరిత్రంతా విదేశీయులదేనని విమర్శలు గుప్పించారు. కోర్టు నోటీసులను బేఖాతరు చేస్తున్న చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రచార దాహంతోనే 29 మంది మృతి చెందారనీ, గోదావరి పుష్కారాల్లో తొక్కిసలాటకు ఆయనే కారణమని ఆరోపించారు. ప్రమాద ఘటన పై జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక అత్యంత దురదృష్టకరమని చెప్పారు. ముఖ్యమంత్రికి ధైర్యముంటే పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన, విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని సవాల్ విసిరారు. -
ఆ కంపెనీ బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో ఐదు ప్రశ్నలు సంధించారు. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై గత కొన్ని వారాలుగా కన్నా బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబును ప్రశ్నలు అడుగుతున్న సంగతి తెలిసిందే. ఈవారం కూడా ఆయన అలాగే ఐదు అంశాలపై చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. ‘విశాఖపట్నం మధురవాడలో మీ కుమారుని మిత్రుడైన జి శ్రీధర్ రాజుకు 360 కోట్ల రూపాయల విలువైన భూమిని 25 కోట్ల రూపాయలకు కట్టబెట్టలేదా?. ఏపీఎల్ఎమ్ఏ, సర్వే నంబర్ 409లో ఉన్న భూమికి ఎకరం విలువ 7.26 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తే.. మీ కేబినెట్ దానిని 50 లక్షల రూపాయల ధర నిర్ణయించలేదా? ఇందులో మీకు, మీ కుమారునికి ముడుపులు అందలేదని చెప్పగలరా’ అని ప్రశ్నించారు. ‘వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే 7 శాతం వడ్డీలో కేంద్రం తన 3 శాతం చెల్లిస్తూండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతాన్ని గత నాలుగేళ్లుగా చెల్లించని మాట వాస్తవం కాదా? దీంతో బ్యాంకులు ఆ మొత్తాన్ని పేద రైతుల నుంచి బలవంతగా వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఆ బకాయిలను ఎప్పటిలోగా చెల్లించి రైతులకు ఉపశమనం కలిగిస్తార’నిప్రశ్నించారు. ‘కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సర్వే నంబర్ 93లోని 499 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన భూమిని కారుచౌకగా వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్కు ధారదత్తం చేయలేదా?. ఆ కంపెనీ మీ బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా? ఈ కేటాయింపులో అవకతవకలు జరగలేదని శ్వేత పత్రం విడుదల చేయగలరా’ అని ప్రశ్నించారు. ‘కేంద్రం రాష్ట్రానికి విద్యాసంస్థలు ఇవ్వడం లేదని చెబుతున్న మీరు.. 2016 డిసెంబర్లో కేంద్ర మంత్రులు శంకుస్థాన చేసిన ఎస్సీఈఆర్టీకి ఎందుకు భూమి ఎందుకు కేటాయించలేదో ప్రజలకు వివరించగలరా’ అని ప్రశ్నించారు. ‘ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం మేజర్ పోర్టుకు ఎప్పుడో రైట్స్ లిమిటెడ్ సంస్థ అనుకూలంగా రిపోర్టు ఇచ్చినా.. ప్రైవేటు రంగంలో మైనర్ పోర్టుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు వివరించగలరా. వెనుకుబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నార’ని ప్రశ్నించారు. -
‘కేరళ వరదలను ఆయన రాజకీయాలకు వాడుకున్నారు’
సాక్షి, తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవాలపై కూడా రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎర్రకాలువ ముంపు ప్రాంతాలలో పర్యటించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ఎస్టిమేషన్లు పెంచి నాణ్యతలేని నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంత నష్టం జరుగుతున్నా చంద్రబాబు ఇప్పటిదాకా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేరళ వరదలను కూడా రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమని విమర్శించారు. ఏపీ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవుపలికారు. జిల్లాలో నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చ ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులకు అందించాలని, రైతుల రుణాలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. -
‘మాస్టర్ప్లాన్ బీరువాలో దాచావా బాబూ’
సాక్షి, అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులతో ఒక్క పనికి కూడా శంకుస్థాపన చేయలేదని అన్నారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ప్లాన్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ బీరువాలో దాచారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం బాండ్ల జారీ ద్వారా సేకరించిన రెండువేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత 72వ స్వాతంత్ర్య దినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన కాంగ్రెస్తో దోస్తీ కట్టిన బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి, పచ్చి అవకాశవాది అని తీవ్ర విమర్శలు చేశారు. రెండుకళ్ల సిద్ధాంతంలో రాటుదేలిన బాబు చివరకి పొత్తుల్లో కూడా అదే ఫాలో అయ్యారని ఎద్దేవా చేశారు. గ్రామీణప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి కారణం ప్రధాని నరేంద్రమోదీ చలవేనని అన్నారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా తొలి విడతగా 10 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య సేవలు అందనున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి పథకం అమలవుతుందని ప్రధాని తెలిపారు. -
‘చంద్రబాబు గాలి దీక్షలు చేస్తున్నారు’
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో గాలి దీక్షలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోచుకున్న సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు వైఖరి బయటపడిందని తెలిపారు. టీడీపీకి ఓటు వేయని వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని ఆరోపించారు. కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. -
ఏపీ బీజేపీ నూతన కమిటీ ప్రకటన
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కమిటీ, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ కమిటీలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. కొంత కాలంగా రాష్ట్ర కమిటీ నియామకంపై పార్టీలో ఎదురుచూపులు సాగుతుండగా, ఎట్టకేలకు శనివారం ప్రకటించారు. మొత్తం 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 14 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారితో పాటు పదిమంది జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా కందుల రాజమోహన్ రెడ్డి, దర సాంబయ్య, పాక సత్యనారాయణ, దశరథ రాజ్ కవిత, ఎస్ విష్ణువర్థన్ రెడ్డి, తురగ నాగభూషణం, కే కపిలేశ్వరయ్య, కే కోటేశ్వరరావులు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా వి సత్యమూర్తి, జమ్ముల శ్యాం కిషోర్, ఎస్ సురేష్ రెడ్డి, పీ మాణిక్యాల రావు, కోశాధికారిగా పీ సన్యాసి రాజు నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వీరితో పాటు మరికొంత మందికి కమిటీలో చోటు కల్పించనున్నారు. -
‘కాపు రిజర్వేషన్లకు బాబు వ్యతిరేకి’
-
‘కాపు రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకం’
సాక్షి, విజయవాడ: కాపు రిజర్వేషన్లపై మాట తప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం మాట తప్పారని మండిపడ్డారు. బీసీ నాయకులను చంద్రబాబు రెచ్చగొట్టి కాపులపై దాడుల చేయించారని ధ్వజమెత్తారు. కేవలం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారన్నారు. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే బాబు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఉద్యమం చేసిన కాపులను, ముద్రగడ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. తుని ఘటనలో కాపులపై టీడీపీ ప్రభుత్వం అనేక తప్పుడు కేసుల పెట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్పై చంద్రబాబు నాలుగున్నర ఏళ్లుగా కాలయాపన చేశారన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రయత్నిస్తోందని కన్నా తెలిపారు. రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రానికి పంపి బాబు చేతుల దులుపుకోవాలనుకున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సిగ్గుందా? కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని టీడీపీ వర్గానికి చెందిన ఓ మీడియా రాయడం సరైనది కాదని కన్నా లక్ష్మీనారయణ పేర్కొన్నారు. రైల్వే జోన్ ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు ఒంగోలు వెళ్లి ధర్మ పోరాట దీక్ష పెట్టడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం అవినీతి చేయడానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. హోదాపై అనేక సార్లు మాట మార్చిన బాబుకు పరిపక్వత లేదని ఎద్దేవ చేశారు. రాష్ట్ర అభివృద్దిపై చర్చ చేయడానికి మోడీ అవసరం లేదని.. చంద్రబాబు స్థాయికి తాను సరిపోతానని కన్నా పేర్కొన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. హిందుత్వంపై చంద్రబాబు దాడికి దిగుతున్నారని అందుకే శివస్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారిన మండిపడ్డారు. -
‘బాబు అవినీతి కాంగ్రెస్కు కనిపించదా’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిధులుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు తన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకోవటానికే కేంద్రంపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్ ఎందుకు సహకరించిందో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని, మోదీ బలమైన నాయకుడు కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ అవినీతి బయట పెట్టినందుకే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదన్నారు. చంద్రబాబు కోరిక మేరకే ప్యాకేజీ ఇచ్చారని, చంద్రబాబు ప్రత్యేకహోదా అడగలేదని తెలిపారు. ప్యాకేజీ కింద చంద్రబాబు మోదీని 5 వేల కోట్లు అడిగారని, మోదీ మాత్రం 16,500కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని అన్నారు. రాష్ట్రంలో జన్మభూమి బ్రోకర్ల పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దని మాట్లాడిన క్లిప్పింగ్స్ను బీజేపీ నేతలు స్ర్కీన్ మీద ప్రదర్శించారు. ప్యాకేజీ ఇచ్చినందుకు వెంకయ్యనాయుడిని రాష్ట్రమంతా తిప్పి టీడీపీ నాయకులు సన్మానాలు చేశారని గుర్తుచేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకే అసెంబ్లీలో మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ చంద్రబాబు తీర్మానం చేశారని తెలిపారు. ప్యాకేజీపై అరుణ్ జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించి స్వాగతించిన విషయాలను కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. -
‘నాడు ధన్యవాద తీర్మానం. నేడు అవిశ్వాసం’
సాక్షి, విజయవాడ: పూటకో మాట మాట్లాడే చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఒకటని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్య పెట్టడంలో చంద్రబాబును మించిన వారు లేరని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేంద్రంపై పలువురు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. వాటిపై స్పందించిన చంద్రబాబు అవిశ్వాసం వల్ల ఏం ఒరుగుతుందని మాట్లాడారు. నేడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతూ కేంద్రంపై అవిశ్వాసానికి పూనుకొన్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తోందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధాని మోదీ, ఇతర మంత్రుల సహాయ సహకారాలు మరువలేనివని పొగుడుతూ చంద్రబాబు గతంలో మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. నేడు అదే చంద్రబాబు పూర్తి భిన్నంగా వ్యవహరించి రాష్ట్రం పరువు బజారున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరికి మహానాడు తీర్మానాల్లో సైతం కేంద్రంపై ప్రశంసలు కురిపించి, ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన బాబు వైఖరి నేడు తేటతెల్లం అయిందన్నారు. -
‘నిజాలు చెప్తున్నామనే మాపై దాడులు’
సాక్షి, రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైసా కూడా బాకీ లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం రాష్ట్రానికి సంబంధం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేవలం సమన్వయకర్త మాత్రమేనని కన్నా అన్నారు. పోలవరాన్ని కేంద్రం గడువులోగా నిర్మించి తీరుతుందని ఆయన చెప్పారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని బీజేపీ నేత ప్రశ్నించారు. నిజాలు చెప్తున్నామనే మా పై దాడులు చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిది.. అలాంటిది రాజకీయాల కోసం గుండెను పిసికేయవద్దని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. -
టీడీపీవి దిగజారుడు రాజకీయాలు
బద్వేలు అర్బన్ : నాడు ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీనే కావాలని పట్టుబట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు యూటర్న్ తీసుకుని హోదా కావాలని దొంగ దీక్షలు చేస్తున్నారని, కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసమే టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఏమాత్రం స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో త్వరలోనే అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కన్నా తెలిపారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని బలిజ సేవా సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్డ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నానబాలవెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు బాబాఫకృద్దీన్, సీనియర్ నాయకులు రమణయ్య, ప్రభాకర్, సుధాకర్రెడ్డి, సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
కడప నగరంలో బీజేపీ శ్రేణుల ర్యాలీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా కడపకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు నగర శివార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి వైఎస్సార్ సర్కిల్, సంజన్న సర్కిల్, అప్సర సర్కిల్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత కందుల ఎస్టేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. నగరంలోని కందుల ఎస్టేట్లో పలువురు ముస్లింలు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. శనివారం రాత్రి అల్మాస్పేటలోని ఎస్టీ కాలనీలో కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితోపాటు సహఫంక్తి భోజనంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కందుల రాజమోమన్రెడ్డి, శ్రీనాథ్రెడ్డి, హరినాథరెడ్డి, సుంకర శ్రీనివాస్, పెసల సాంబశివారెడ్డి, పట్నం ఎరికలప్ప, లక్ష్మణ్రావు, బండి ప్రభాకర్, దుర్గం దస్తగిరి, మాకం అశోక్కుమార్, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్పై టీడీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు..
సాక్షి, విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్పై ప్రభుత్వ విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఉంటున్నది రాజ్భవనా లేక బీజేపీ భవనా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్, రాజ్భవన్పై ఏపీ ప్రజలకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బుద్ధా వెంకన్న మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలకు అతీతంగా పని చేయాలి తప్ప, రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గవర్నర్ బంగ్లా నుండే ప్రారంభమయిందని అన్నారు. బీజేపీ నేతలు గవర్నర్ బంగ్లాని చూసి రెచ్చిపోతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. కన్నా అవినీతి గురించి మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీకి చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులు నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
చంద్రబాబు మోసగాడని మోదీ తెలుసుకోలేకపోయారు!
సాక్షి, నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసగాడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకోలేకపోయారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి రూ. 16800 కోట్లు ప్రధానమంత్రి కేటాయించగానే.. చంద్రబాబు కొనియాడారని, కానీ, అవినీతి, అక్రమాల కారణంగా కేంద్రం నుంచి ఆ నిధులను చంద్రబాబు తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. నెల్లూరులో మంగళవారం కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత దోపిడీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబుని రాబోయే ఎన్నికల్లో తరిమితరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కన్నా పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటివరకు రూ. లక్ష 55 వేల కోట్ల నిధులను ఏపీకి ఇచ్చిందని తెలిపారు. కేంద్రం మంజూరుచేసిన పక్కా ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అక్రమాలు జరిగాయని తెలిపారు. చివరికీ మరుగుదొడ్ల నిర్మాణంలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని, అవినీతి, అరాచకాలు, అక్రమాలు తప్ప పాలన లేదని అన్నారు. టీడీపీ అవినీతికి కట్టుబడితే.. బీజేపీ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. -
పోలవరం: కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, విజయవాడ : ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక వరమని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడుపడుతోందని కావాలనే కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును తాము సందర్శించామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి తెలిపారు. పాతరేట్లకే ప్రాజెక్టు పనులు చేయించింది కేంద్రమంత్రి గడ్కరీయేనని వారు అన్నారు. వచ్చే వేసవికాలం నాటికి పోలవరం పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని వారు ఆదివారం విలేకరులతో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును బాధ్యతగా తీసుకుంది కాబట్టి సమీక్షించాల్సిన బాధ్యత తమపైన ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా చెల్లించని బిల్లులు లేవని ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని కన్నా తెలిపారు. నూటికి నూరుశాతం కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టును కడుతున్నారని తెలిపారు. దాదాపు రూ.16వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని నూరుశాతం కేంద్రమే భరిస్తోందని తెలిపారు. పోలవరం బాధ్యత తమది అని గడ్కరీ చెప్పారని అన్నారు. చంద్రబాబుకి నిజం చెప్పడం రాదని, తమకు అబద్ధం చెప్పడం రాదని అన్నారు. -
‘నిరూపిస్తా.. లేకపోతే జైలుకు వెళతా’
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతిని నిరూపిస్తానని.. అలాకాకపోతే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్న చందాన కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతోందన్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి ఏమీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో 5 వేల కోట్ల రూపాయలు, ప్రత్యేక ప్యాకేజి 16000 కోట్ల రూపాయలు ఒప్పుకున్న మాట అవాస్తవమా అని ప్రశ్నించారు. విశాఖపట్నం రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు సంబంధించి విభజన చట్టంలో పరిశీలన చేయమని ఉందని, కృష్ణమరాజ పట్నం పోర్టుతో సీఎం చంద్రబాబు బేరం కుదుర్చుకుని... ఇప్పుడు దుగరాజపట్నం పోర్టు కావాలంటున్నారని తెలిపారు. సాక్షర భారత్ ప్రాజెక్టును కొత్త పథకంలో విలీనం చేసినందున.. కొత్త ప్రపోజల్స్ పెట్టమంటే.. పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 20వేల మంది ఉద్యోగాలు పోయాయన్నారు. చంద్రబాబు నిజం మాట్లాడరు.. ఆయనకు ముని శాపం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మానవహక్కులకు భంగం వాటిల్లుతోందని, వాటిని కాపాడతామని అన్నారు. చంద్రబాబుకు మానసిక పరిస్థితి బాగాలేదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు లాగా మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాలేదని, ప్రజల సహకారంతో కష్టపడి ప్రధాన మంత్రి అయ్యారని పేర్కొన్నారు. -
మరోసారి మోసగిస్తున్న బాబు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కేవలం రూ.వెయ్యి కోట్లు కావాలని అడిగితే ఏడాదికి రూ.3,200 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.16 వేల కోట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇస్తామని వెంకన్న సాక్షిగా చెప్పారన్నారు. అయితే ఇవ్వాల్సిన మొత్తంలో ముందుగానే 30 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర పర్యటనను బుధవారం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.16 వేల కోట్లు ఇస్తామని ప్రకటించినప్పుడు మోదీ, అమిత్షా, వెంకయ్యనాయుడులను పొగడ్తలతో చంద్రబాబు ముంచెత్తారని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులను చక్కగా మెక్కేసి ఎన్నికల సమయం దగ్గరవ్వడంతో తప్పులన్నీ బీజేపీపై, కేంద్రంపై నెట్టేసి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రజలు నమ్మరు: కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చంద్రబాబును ఈసారి ప్రజలు నమ్మరన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఫీజుబిలిటీ లేదని చెప్పినప్పటికీ నిపుణుల కమిటీ వేసి స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం ఉన్నామన్నారు. కడప స్టీల్ప్లాంట్ ఇస్తారని తెలిసీ ప్రజల మెప్పుకోసం సీఎం రమేష్ దీక్ష చేస్తాననడం సిగ్గుచేటన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. విశాఖ రైల్వే జోన్కు అన్ని దస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిసీ టీడీపీ ఎంపీలు ధర్నాలు చేసేందుకు సిద్ధమై ప్రజల నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారన్నారు. వీటిన్నింటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2014లో మోసపూరిత హామీలిచ్చి చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. వెనుకబడిన కులాలవారు న్యాయవృత్తికి పనికిరారని ముఖ్యమంత్రిగా లేఖ రాయడం సరికాదన్నారు. సమావేశంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : కన్నా లక్ష్మీనారాయణ
ఢిల్లీ: తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపినట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఢిల్లీలో కన్నా లక్ష్మీ నారాయణ ప్రధాని మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన 12 అంశాలను త్వరగా నెరవేర్చాలని వినతిపత్రం సమర్పించారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, రామాయపట్నం పోర్టు, గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు, విద్యాసంస్థలకు నిధులు, వెనకబడిన జిల్లాలకు రూ.150 కోట్ల చొప్పున కేటాయించాలని అందులో పేర్కొన్నారు. ఏడు జిల్లాలకు జీఎస్టీ పన్ను మినహాయింపు ఇవ్వాలని, రాయలసీమలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. గిరిజనులు-మత్స్యకారుల అభివృద్ధికి నిధులు, స్టార్టప్లకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికలలో ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని మోదీకి తెలిపినట్లు చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. ‘చంద్రబాబు మోసం చేసినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ, ఏపీ ప్రజలకు చెప్పాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న 85 శాతం అంశాలు పూర్తి చేశాం. ఏపీ ప్రజల వెంట తాను ఉంటానని మోదీ తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. జూన్ 20 నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపడుతున్నాం. కరపత్రాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరిస్తాం. ఏపీకి వివిధ పథకాలకు నిధులు, గ్రాంటులు ఏవిధంగా కేంద్రం ఇచ్చిందో ప్రజలకు తెలుపుతాం. పోలవరంపై ఖర్చు పెట్టిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చిందే. గాలేరు-నగరి, హంద్రినీవా పూర్తి చేస్తే చంద్రబాబును అభినందిస్తామని’ ఈ సందర్భంగా కన్నా పేర్కొన్నారు. -
ఏపీలో కొత్త అపరిచితుడు
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త అపరిచితుడు చంద్రబాబు నాయుడు వచ్చాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ..అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు బాబుకు కచ్చితంగా తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. సొంత జిల్లాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోడని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను అడ్డుపెట్టికుని భౌతిక దాడులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. అందుకు నిదర్శనం అమిత్ షాపై దాడేనని వ్యాఖ్యానించారు. బాబు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతకాలం మనగగలుగుతాడో చూద్దామన్నారు. నాలుగేళ్లు మిత్రపక్షంలో ఉంటూనే లోలోపల ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్నాడని ఆరోపించారు. పోలవరంలో పది శాతం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు పెట్టాల్సి ఉన్నా అది కూడా వద్దు అని కేంద్రమే పూర్తిగా భరిస్తుందని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికీ చెబుతున్నాం పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. హోదా ఇవ్వడం కుదరదు అని ఎప్పుడో బాబుకు చెప్పామని, మొదటి నుంచి మోదీ ఇస్తాను అన్నది స్పెషల్ ప్యాకేజీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్యాకేజీ ద్వారా సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని తెలిపారు. ప్యాకేజీకు ఒకే చెప్పిన బాబు, వెంకయ్యనాయుడుని పట్టుకుని బీజేపీకి జై అంటూ ఊరూరా ప్రచారం చేశాడని విమర్శించారు. ఎక్స్టెర్నల్ ఏజన్సీ నుంచి ప్యాకేజీ నిధులు తెచ్చుకోలేకపోయింది చంద్రబాబేనని ఆయన అసమర్థతను వెల్లడించారు. బాబు చేతగానితనాన్ని ప్రశ్నించిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్లకు భయపడి మోదీపై ఆరోపణలు చేయడం మొదలెట్టాడని బాబు కుటిలయత్నం గురించి వివరించారు. ప్రజల సొమ్ముతో అమరావతి డిజైన్లు పేరుతో ప్రత్యేక విమానం వేసుకుని పదహారు దేశాలు తిరిగాడని, చివరికి చేసింది ఏమీ లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం నమ్మి భూములు అప్పచెప్పిన స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, రాజధానిలో శంఖుస్థాపన చేసిన వాటిలో 90 శాతం వాటికి ఇంకా పనులు కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. ఇవి లేఖ ద్వారా ప్రశ్నించిన భారత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించారని తెలిపారు. నోట్ల రద్దు నా ఆలోచన అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీతో తెగదెంపులు చేసుకున్నాక బీజేపీనే చేసింది అనడం అబద్ధం కాదా సూటిగా అడిగారు. మహానాడుగా పిలువబడే మాయనాడులో మూడేళ్లు వైఎస్సార్సీపీపై పడి ఇప్పుడు బీజేపీపై పడి ఏడుస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు. -
బాబువన్నీ కపట నాటకాలు
గుంటూరు వెస్ట్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పట్టాభిషేకం ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో దిగిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ను కన్నా తనయుడు నాగరాజు స్థానిక కన్నావారితోటకు తీసుకొచ్చారు. అనంతరం సిద్ధార్థ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కన్నాకు నూతన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బీజేపీకి బాహుబలిగా కన్నాను వక్తలు వర్ణించారు.. చంద్రబాబుపై విరుచుకుపడిన నాయకులు సభలో మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ 1983లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారన్నారు. చేసేవన్నీ ధారుణాలైనప్పుడు ధర్మ పోరాట దీక్ష చేయడంలో అర్థమేంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సినీ నటి కవిత మాట్లాడుతూ చంద్రబాబు మాటలు శివారెడ్డి మిమిక్రీలాగా ఉంటున్నాయన్నారు. చంద్రబాబు నీచత్వాన్ని చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కర్ణాటకలో తన వల్లే బీజేపీ ఓడిపోయిందనడం పెద్ద జోక్గా ఉందన్నారు. ఆయన అవినీతి బాగోతం ఎక్కడ బయటికొస్తుందోనని ప్రజల ముందుకొచ్చి కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు మాట్లాడుతూ చంద్రబాబు అభద్రతాభావానికి లోనవుతున్నారన్నారు. పార్టీలో చేరిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సమక్షంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్ బీజేపీలో చేరారు. ఆయనతోపాటు 13 జిల్లాల అధ్యక్షులను కన్నా సాదరంగా ఆహ్వానించి కండువాలను కప్పారు. -
చంద్రబాబు చేతగానితనం వల్లే ఏపీలో వెనుకబాటు
-
సోము వీర్రాజు కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో చిచ్చురేపిన సంస్థాగత పదవుల భర్తీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవడంతో కినుక వహించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎట్టకేలకు చల్లబడ్డారు. అజ్ఞాతం నుంచే సోమవారం రాత్రి ఒక కీలక ప్రకటన చేశారు. దీంతో రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన సోము వర్గం నేతలు పునరాలోచనలో పడ్డారు. ‘‘అధిష్ఠానం ఎంపికను అందరూ సమర్థించాల్సిందే. పార్టీ నిర్ణయమే అంతిమం కాబట్టి దానికి అందరూ కట్టుబడి ఉండాలి. పెద్దల నిర్ణయాన్ని పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలుగానీ వ్యతిరేకించవద్దు..’’ అంటూ సోము వీర్రాజు పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. (బీజేపీలో ముసలం.. అజ్ఞాతంలోకి సోము వీర్రాజు!) -
ఇదంతా మీడియా సృష్టే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి రేగడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అందరూ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పనిచేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత అంటూ ఉండదని, అంతా ఒక్కటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు గ్రూపులు లేవని, ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. కులాల ఆధారంగా తమ పార్టీ పదవులు ఇవ్వదని తెలిపారు. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన ఓబీసీ అంటూ ప్రచారం చేశారని గుర్తుచేశారు. కాగా, కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన మద్దతుదారులు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తనకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని భావించిన వీర్రాజుకు ఆశాభంగం ఎదురవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో గెలుపు మాదే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వస్తుందని మురళీధర్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాము ఎవరితో కలవాల్సిన అవసరం లేదని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా లేరని తెలిపారు. ఈ నెల 15 తర్వాత 2019 వ్యూహాలను వెల్లడిస్తామన్నారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకెళ్లినా, ఆయనకు ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. -
సోము వీర్రాజు మద్దతుగా రాజీనామాలు
సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి సోము వీర్రాజు దక్కకక పోవడం దారుణమని ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో పట్ల వీర్రాజు వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత 39 ఏళ్ళుగా పార్టీకి సేవలు అంధించిన వీర్రాజుకు అన్యాయం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు అన్నారు. వీర్రాజుకు మద్దతుగా బొమ్ముల దత్తు రాజీనామ చేశారు. మరోవైపు జిల్లా రూరల్, అర్బన్ అధ్యక్షులు, అదేవిధంగా ఆ వర్గం నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. తదుపరి నిర్ణయాలు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలో వెల్లడిస్తామని వీర్రాజు వర్గీయులు తెలిపారు. -
బీజేపీలో ముసలం.. అజ్ఞాతంలోకి సోము వీర్రాజు!
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం పుట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది. కన్నాకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై కినుక వహించిన సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కన్నాతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్తారని భావించినప్పటికీ.. పార్టీ నేతలకు వీర్రాజు అందుబాటులో లేరని సమాచారం. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం పార్టీలో కలకలం రేపుతోంది. మరోవైపు ఆయన వర్గం నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. సోము వీర్రాజుకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా రూరల్, అర్బన్ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం కావడం.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగడం తదితర పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్గా హరిబాబు వైదొలగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎన్నికల కన్వీనర్గా సోము వీర్రాజును బీజేపీ అధినాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే, మొదటినుంచి ఏపీ రాజకీయాల్లో బీజేపీ తరఫున దూకుడుగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజుకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. పార్టీ అధినాయకత్వం కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. అయితే, పార్టీ మారేందుకు సిద్ధపడిన కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించేందుకు ఆయనకు అధ్యక్ష పదవి అప్పగించినట్టు సోము వీర్రాజు వర్గీయులు భావిస్తున్నారు. తమ నేతకు కాకుండా పార్టీ మారేందుకు సిద్ధపడిన కన్నాకు ఎలా పదవి అప్పగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ నేతకు చివరినిమిషంలో పదవి ఇవ్వకుండా అవమానించారని వీర్రాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ
-
ఏపీ బీజేపీ చీఫ్గా కన్నా నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశే మా టార్గెట్ అని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఆమేరకు సంస్థాగత మార్పులు చేసింది. అనూహ్యరీతిలో కన్నా లక్ష్మీనారాయరణకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీబాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు ఆదివారం బీజేపీ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. వీర్రాజుకు కీలక పదవి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు సైతం పార్టీలో కీలక పదవి దక్కింది. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారనే పేరున్న సోముకే అధ్యక్ష పదవి దక్కుతుందని, దీంతో అలక వహించిన కన్నా పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. నమ్మకాన్ని నిలబెడతా: కన్నా తనకు కీలక పదవి దక్కడంపై కన్నా లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడతానని, అమిత్ షా, నరేంద్ర మోదీల నమ్మకాన్ని నిలబెడతానని మీడియాతో కన్నా అన్నారు. -
హేమామాలినిని కలిసి ఆంధ్రుల పరువు తీశారు
అమరావతి: ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏనాడైనా అమరావతికి చంద్రబాబు దండం పెట్టారా? ఫొటోలో పోజుల కోసం పార్లమెంటుకు మొక్కుతారా అని చంద్రబాబునుద్దేశించి దుయ్యబట్టారు. ఢిల్లీలో చంద్రబాబును కలవడానికి ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. ఢిల్లీ వెళ్లి హేమమాలినిని కలిసి వస్తావా.. ఏపీ సీఎంగా ఆంధ్రుల పరువు తీశారని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయుడి లేఖతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని, ఏపీ ప్రయోజనాలు కోసం చంద్రబాబు ఏనాడూ పోరాటం చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అధికారంలోకి రావడానికి అడ్డుగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అవినీతి అసమర్థత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని కప్పిపుచ్చుకొనేందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప రాష్ట్రానికి ఏమి చేశారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో జల్సా చేస్తున్నారని, ప్రజలు కట్టిన పన్నులు టీడీపీ కార్యకర్తలు పంచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, హోదాకు బదులు ప్యాకేజీ ఒప్పుకుంది చంద్రబాబేనని స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానించిందీ, ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో అభినందన తీర్మానం చేసింది కూడా చంద్రబాబేనని చెప్పారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకురాలేదని ప్రశ్నించారు. బీజేపీని ముంచాలని చూస్తూ చంద్రబాబు మునిగిపోతున్నారని.. ఆయన మోసాలను ప్రజలు గమనించాలని విన్నవించారు. రైల్వే జోన్ ఇస్తామని ఎన్నడూ బీజేపీ చెప్పలేదని, ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపింది బీజేపీనేని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణాలను కావాలనే ఆలస్యం చేస్తూ.. తన తప్పులను బీజేపీపై రుద్దాలని బాబు భావిస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని, పారిపోయి వచ్చి కట్టుబట్టలతో పంపారని అబద్దాలు చెబుతున్నారని వెల్లడించారు. అమెరికాలో కూడా లేని రేట్లతో తాత్కాలిక భవనాలకు కోసం ఖర్చు చేస్తున్నారని, తాత్కాలిక భవనాలు కడుతున్న సీఎంను ప్రజలు తాత్కాలిక సీఎంగానే చూస్తున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. -
పొత్తు ధర్మాన్ని బాబు పాటించడం లేదు
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మూడేళ్ల పాలన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో అఖండ మెజారిటీతో పార్టీని గెలిపించగా చంద్రబాబుకు పాస్ మార్కులు మాత్రమే పడుతున్నాయని మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీలో పొత్తుధర్మాన్ని ఏకపక్షంగా తామే పాటిస్తున్నా మని, బాబు ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. పైగా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తేనే శత్రుభావంతో చర్యలు తీసుకుంటున్నారని వాపో యారు. పనులు కాలేదు కాబట్టి పార్టీ మారుతున్నామనేవారు ముందుగా పదవికి రాజీనామా చేసి వెళ్లాలన్నారు. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్నే వదులుకుందని ఫిరా యింపులకు పాల్పడలేదని అంటున్న కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ఓటమి ఎరుగని స్థితి నుంచి అనూహ్యంగా ఓడిపోయారు.. ఎలా ఫీలవుతున్నారు? అది కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్ప నా వ్యక్తిగత ఓటమి కాదనుకుంటున్నాను. 2014లో అది తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఆ రోజు విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. ఒక సెంటిమెంట్ ప్రజల్లో వచ్చినందుకే ఓడిపోయాం. మామూలు పరిస్థితుల్లో అయితే ఓడిపోయేవాడిని కాదు. 1994లో 26 మందిమి గెలిస్తే అత్యధిక మెజారిటీ నాదే. కిరణ్కుమార్ రెడ్డితో మీకు ఎక్కడ తేడా వచ్చింది? ఆయనతో నేనేం తేడాగా వ్యవహరించలేదు. కాని నన్ను సీఎం కావడానికి సిద్ధంగా ఉండాలని అధిష్టానం పిలిచిన క్షణం నుంచి ఆయనే నాతో తేడాగా వ్యవహరించ సాగారు. బాగా కోపం పెంచుకున్నారు. మంత్రిగా ఉండి నేను ఏ పనులు చెప్పినా చేయొ ద్దని జిల్లాలో అధికారులను ఆదేశించారు. వేధింపు అంటే అదే. వైఎస్ జగన్కు 145 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా అధిష్టానం వినలేదే? వైఎస్ఆర్పై అభిమానం వల్లే జగన్ సీఎం కావాలని కోరుకున్నాం. కానీ అధిష్టానం తన అధికారాన్ని ప్రదర్శించుకోవడానికే మా అందరి అభి ప్రాయాలను తోసి పుచ్చింది. మీరు మంత్రిగా ఉన్న కాలంలో జగన్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేశారా? ఎప్పుడూ లేదు. ఏరోజు తను నాకు కాల్ చేయలేదు. ఆయన మీద కేసులు పెట్టడం సరైందేనా? ప్రభుత్వం పెట్టిన కేసు కాదు. కోర్టు ఆదేశం ప్రకారం నడిచిన కేసు అది. ఇకపోతే అది కోర్టు ముందు ఉంది. నేను, మీరు, బొత్స సత్యనారాయణ ఇలా ఎవరు మాట్లాడినా దాన్ని కోర్టే నిర్ణయించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీ సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి? క్షేత్రస్థాయిలో అయితే బాగాలేవు. బీజేపీ కార్యకర్తలను వాళ్లు ప్రతిపక్షంలాగానే చూస్తున్నారు తప్ప, పొత్తులో ఉన్న పార్టీగా అయితే చూడటం లేదు. ఉదాహరణకు ప్రతిదీ జన్మభూమి కమిటీల ద్వారానే జరు గుతోంది. ఎవరికన్నా ఒక పెన్షన్ ఇప్పిం చాలన్నా, ఇల్లు, స్థలం కావాలన్నా బీజేపీ కార్యకర్త ఇప్పించే పరిస్థితిలో లేడు. మండల స్థాయి ఆఫీసుకు బీజేపీ కార్యకర్త వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇవన్నీ మేం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. వారి సలహాతో సమన్వయ కమిటీ వేశారు. ఒకసారి భేటీ అయ్యారు. తర్వాత కూర్చో లేదు. పరిస్థితిలో మార్పు లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు ప్రభుత్వానికి పాస్ మార్కులే వచ్చాయి. ముఖ్యమంత్రే స్వయంగా చెబు తున్నారు. మీరు కరెక్టుగా ఉండకపోతే బాగుండదని చంద్రబాబే కార్యకర్తలను హెచ్చ రిస్తున్నారు కదా. అలాంటివి కరెక్టు చేసుకుంటే బాగుంటుంది. ప్రధాని మోదీకి, చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారు? నేను వేయటం కాదు. ప్రజలే వేశారు. మోదీ మూడేళ పాలన తర్వాత ఎవ్వరూ ఊహిం చనంత మెజారిటీతో యూపీలో ప్రజలు గెలిపించారు. 300 పైగా సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మోదీ పనితీరుకు ఈ ఒక్కటీ చాలు. కాబట్టి ఆయనకు వంద శాతం మార్కులు వేయవచ్చు. ఇక చంద్రబాబుకయితే పాస్ మార్కులే వస్తున్నాయి. పొత్తు ధర్మం మీరు పాటిస్తున్నారా? చంద్రబాబు కూడా పాటిస్తున్నారా? మేమే పాటిస్తున్నాం.. బాబు పాటించడం లేదు. ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. మా జిల్లా అధికారులున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చెబితే పని చేయొద్దు అని బాబు వారికి చెప్పారు. ఇదే ట్రీట్మెంట్ అంటే. బాబు చెప్పారు కాబట్టే అధికారులు మేం చేస్తే ఫోన్లు కూడా ఎత్తడంలేదు. పాలనాపరంగా చంద్రబాబు వ్యవహారంపై మీ అభిప్రాయం? కక్ష సాధింపు చర్యలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. బాబు ప్రభుత్వంలో ఉన్నారు. చాలామంది పాలనకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తి ఉంటారు. వాళ్లను కూడా ఆయన వ్యతిరేకుల్లా భావించి చర్య తీసుకుంటున్నారు. అవేంటో మీకు తెలియనివి కావు. నేను చెప్పాల్సిన పనీ లేదు. జనాలకు అన్నీ తెలుసు. విపక్షం నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు కదా? వాజ్పేయి ఒక్క ఓటు తేడాతో ఓటమికి కూడా సిద్ధమయ్యారు. బీజేపీకి సంబంధించి ఒక్కరినికూడా మేం ఫిరాయించలేదు. మా విధానం కాదు. ఫిరాయించాలంటే ముందుగా రాజీనామా చేసి తర్వాత పార్టీ మారండి అనేదే మా విధానం.. ఎమ్మెల్యేగా ఉండగా ఏ ప్రలోభం లేకుండా పార్టీ మారతారా? నైతికంగా అయితే రాజీనామా చేసి వెళ్లాలి. లేదా రాజీనామా చేయిం చిన తర్వాతే తీసుకోవాలి. ప్రలోభాలు అంటే ఎమ్మెల్యేలు తమకు పనులు కావటం లేదు. ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు మేం మరింతగా సేవ చేయ వచ్చు అని అంటున్నారు. దానిపై మన వ్యాఖ్యలు ఎందుకు? వైఎస్ఆర్ మరణం తర్వాత పరిణామాలపై మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్కు చాలా నష్టం జరిగింది. వ్యక్తిగత నష్టం అలా ఉంచండి. అభివృద్ది విషయంలో ఏపీ చాలా నష్టపోయింది. చెప్పలేను. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అన్నారు. 2014లో ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ ఈ అయిదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ గలం అన్నారాయన. ఆయన ఉంటే అలానే జరిగి ఉండేది. వైఎస్ఆర్, బాబు పాలనలో తేడా చెప్పండి? రాజశేఖరరెడ్డి కులాన్ని, వర్గాన్ని చూసి సహా యం చేసే వ్యక్తి కాదు. ఎవరొచ్చినా సహా యపడాలనేది ఆయన కోర్ వాల్యూగా ఉండేది. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పొత్తులో ఉన్న మాకే సహకరించడం లేదంటే ఇతరుల విషయంలో ఎలా ఉంటుందో ఆలోచించండి. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనలో... వైఎస్సార్ సాయం చేశారా? సీఎంగా వైఎస్సార్ తల్చుకుని ఉంటే బాలకృష్ణపై కేసు పెట్టేవారు కదా.. పెట్టలేదంటేనే సహజంగా వైఎస్సార్ సహకరించినట్లే కదా. ఆ ఎథిక్స్ ఆ రోజుల్లో ఉండేవి. కాపులతో చంద్రబాబు ప్రభుత్వం తీరు ఎలా ఉంటోంది? అధికారానికి రాకముందు కాపులుంటున్న వీధివీధిలో తిరిగి చంద్రబాబు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. ఇప్పుడు వాటినే నెరవేర్చమని వారు నిలదీస్తున్నారు. వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు అంతేకాని క్షేత్రస్థాయిలో కాపులపై వేధింపులు జరుగు తున్నాయన్నది కరెక్టు కాదనుకుంటాను. బాబు అబద్దాలకోరు అని జగన్, రఘువీరారెడ్డి చేస్తున్న ఆరోపణలపై మీ వ్యాఖ్య? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అలా అనక తప్పదు. కానీ వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు కూడా చంద్రబాబు గాలి పోగేసి మాట్లాడేవారని మేం చెప్పేవాళ్లం. (కన్నా లక్ష్మినారాయణతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇక ఏ రాష్ట్రానికీ 'హోదా' సాధ్యం కాదు
ఇక నుంచి దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే అధికంగా కేంద్రం నిధులిస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా, ప్యాకేజి విషయమై జరుగుతున్న హడావుడి నేపథ్యంలో ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు ఇస్తే దానికి కేంద్రం నిధులు ఇస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 1.40 లక్షల కోట్ల సాయం చేసిందని కన్నా తెలిపారు. -
టీడీపీతో కలిసుంటామో లేదో చెప్పలేం!
నాలుగేళ్ల తర్వాత పరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేమన్న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఏర్పడిందని, దీన్ని భర్తీ చేయడం ద్వారా బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. బీజేపీ-టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని, రాజకీయాల్లో ఆరు నెలల కాలమే చాలా ఎక్కువని, నాలుగేళ్ల తర్వాత ఏమి జరుగుతుందో తాను జోస్యం చెప్పలేనన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని, జేఎస్పీ, లోక్సత్తా ఇతర ప్రతిపక్ష పార్టీల్లోనూ అనిశ్చితి నెలకొందని చెప్పిన ఆయన ఆ పార్టీల నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కన్నా వల్ల బీజేపీ సీమాంధ్రలో మరింత బలపడుతుందని చెప్పా రు. కొత్తవారిని బీజేపీ ఇముడ్చుకోలేదనే విమర్శ ఉందని, దాన్ని పోగొట్టేలా పాత నేతలు, కార్యకర్తలు వ్యవహరించాలని సూచించారు. మోదీని వ్యతిరేకించే పార్టీలు, నాయకులంతా బీజేపీకి ప్రత్యర్థులేనని చెప్పారు. విజయవాడలో రాజ ధాని ఏర్పాటును తాము బలపరిచామని, భూసమీకరణలో ఇబ్బందులు ఏర్పడితే వాటిని తొలగించాలని ప్రభుత్వానికి సూచిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఏపీలోనే ఉండి పనిచేయాలని గతంలోనే సూచించామని, త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఏపీలో 58 ఏళ్లుగా ఒక్క జాతీయ విద్యా సంస్థ కూడా రాలేదని, ఎన్డీఏ ప్రభుత్వం 11 జాతీయ సంస్థలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థను ఒక్కో జిల్లాలో పెడుతూ అధికార వికేంద్రీకరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా నిర్ణయించి రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది తమ అభిప్రాయమని, దీన్ని ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు. బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తా : కన్నా ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో గుంటూరులో ఒక సభ పెట్టి మరింత మందిని చేర్పించాలని చూస్తున్నామని, ఈ సభకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వస్తానని చెప్పారన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్షా కూడా సభకు వచ్చేలా చూడాలని ఆయన హరిబాబును కోరారు. -
బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తో కలసి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నివాసానికి వెళ్లి.. ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఆయన పనితీరుకు ఆకర్షితుడినై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా. రాంమాధవ్ ఆధ్వర్యంలో అమిత్షా సమక్షంలో పార్టీలో చేరా. మోదీ నాయకత్వంలో బీజేపీలో పనిచేయడమే నా ప్రధాన ఉద్దేశం. అమిత్షా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో కలసి మోదీ నాయకత్వంలో పనిచేస్తా’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో భవిష్యత్తు లేదనే బీజేపీలో చేరారా? అని ప్రశ్నించగా.. ఆయన బదులిస్తూ ‘‘అదేం కాదు. అలా అయితే ఎన్నికల ముందే చేరేవాడిని. ఎన్నికలకు ముందే తెలుసు కదా..’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదంటారా? అన్న ప్రశ్నకు.. అది తానెలా చెప్పగలనని ఆయన అన్నారు. కాంగ్రెస్లో పీసీసీ పదవి దక్కలేదన్న అసంతృప్తే బీజేపీలో చేరేందుకు కారణమైందా? అని ప్రశ్నించగా.. ‘‘అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కానీ బీజేపీలో చేరేందుకు అది కారణం కాదు. మోదీ పనితీరు నచ్చి చేరుతున్నా’’ అని ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు బీజేపీలో చేరే అవకాశముందా? అని అడగ్గా.. ‘‘వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో చర్చలు జరుగుతున్నాయి’’ అని కన్నా చెప్పారు. -
మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరా:కన్నా
-
మోదీ విధానాలు నచ్చే బీజేపీలో చేరా:కన్నా
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విధానాల నచ్చడం వల్లే బీజేపీలో చేరినట్లు మాజీ కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బీజేపీలో నమ్మిబంటు మాదిరిగా పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ పై కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రామ్ మాధవ్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. తనను మోదీ విధానాలు ఆకర్షించాయన్నారు. ఆ పార్టీలో నమ్మశక్యమైన నేతగా పనిచేస్తానని కన్నా తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇంకా చాలామంది బీజేపీలో చేరే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి బీజేపీలో చేరారా?అన్న ప్రశ్నకు అటువంటిది ఏమీ లేదన్నారు.ఒకవేళ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తే.. ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి ఉండేవాడిని కదా?అని విలేకర్లను ఎదురు ప్రశ్నించారు. -
బీజేపీలో చేరిన మాజీ మంత్రి కన్నా
-
బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించి ఆయన బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది. కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి బాటలోనే కన్నా పయనించి కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. దేశమంతా నరేంద్ర హవా కొనసాగుతుండడం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్ కదం
- మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ - కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా పాతగుంటూరు: టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నో ఆంక్షలు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రుణ మాఫీ చేసి, కొత్తగా రుణాలు మంజూరు చేయకపోతే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను కూడా పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బాబు వచ్చాక జాబు పోయింది: కాసు మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ప్రచారం చేశారని, బాబు అధికారంలోకి రాగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు పరచాలని, లేని పక్షంలో కాంగ్రెస్పార్టీ ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ నుండి జిల్లాపరిషత్ కార్యాలయం వరకు కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి, పార్టీ నాయకులు వహీద్, కొరివి వినయ్ కుమార్, కూచిపూడి సాంబశివరావు, పక్కాల సూరిబాబు, రాంబాబు, రామకృష్ణారెడ్డి, ఎస్కె.సుభాని, పి.ఎ.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
పెద్దవాళ్లమనిపించుకోడానికే విమర్శలు: కన్నా
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పదవులన్నీ అనుభవించి చివర్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, పార్టీకి రాజీనామా చేయడం కిరణ్కుమార్రెడ్డికి తగదని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. మూడేళ్లకు పైగా సీఎం పదవిలో సంతోషంగా కాలం వెళ్లబుచ్చి ఇప్పుడు కాంగ్రెస్పై బురదచల్లడం సరికాదన్నారు. పార్టీలోని సీనియర్ నేతలతో సహ ప్రతీ కార్యకర్త కాంగ్రెస్లోనే కొనసాగుతారన్నారు.పార్టీని వీడివెళ్లే ఆలోచనలను ఎవరూ పెట్టుకోరాదని చెప్పారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ సోనియాగాంధీపై, కాంగ్రెస్ పార్టీపై వస్తున్న విమర్శలను ఖండించారు. పెద్దవారిని విమర్శించడం ద్వారా తామూ పెద్దవారమనిపించుకోవచ్చనే జేసీ దివాకర్రెడ్డి అధినేత్రి సోనియాగాంధీపై విమర్శలు చేస్తున్నారని పార్టీలో ఎదిగి, అనేక పదవులు కూడా అనుభవించి ఇప్పుడిలా పార్టీ నేతనే విమర్శించడం పెద్దరికమనిపించుకోదని హితవు పలికారు. సోనియాపై వ్యక్తిగత విమర్శలకు దిగడం రాజకీయంగా దిగజారుడుతనమేనన్నారు. అధికారం కోసం సోనియా గాంధీ ఏనాడూ పాకులాడలేదని, కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆమె నాయకత్వాన్ని కోరుకోవడం వల్లనే పార్టీ పగ్గాలు చేపట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని జేసీ మరిచిపోకూడదన్నారు. అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ప్రపంచంలోనే అగ్రశ్రేణి నేతగా సోనియా ఎదిగారని చెప్పారు. అలాంటి నాయకురాలిపై జేసీ విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుందన్నారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలని సోనియాకు వినతి కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ సోనియాకు వినతిపత్రాన్ని సమర్పించినట్టు కన్నా తెలిపారు. శనివారం ఉదయం 10-జన్పథ్లో సోనియాతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీ జాబితాల్లో చేర్చాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉందనే విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ విన్నపంపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. ఇప్పటి వరకు కాపుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని, ఈ విషయంలోనూ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రపతి పాలనపై మాట్లాడారా అని ప్రశ్నించగా రాజకీయాల గురించి మాట్లాడలేదని కన్నా సమాధానమిచ్చారు. -
గవర్నర్తో మంత్రి కన్నా భేటీ.. రాజకీయాలపై చర్చ
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. పావుగంట పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. సీమాంధ్ర ప్రాంతానికి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ ప్రాంతానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ముఖ్యమంత్రులు అవుతారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గతంలో ఢిల్లీ పిలిపించుకుని ఆయనతో చర్చించడం, ఇప్పుడు ఆయన గవర్నర్ నరసింహన్ను కలిసి వివిధ అంశాలపై పావుగంట పాటు చర్చించడం లాంటి అంశాలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. -
సీఎం హిట్ వికెట్
-
సీఎం హిట్ వికెట్
* సమైక్యవాది అనిపించుకునే యత్నంలో సీఎం సెల్ఫ్గోల్ * విభజనకు నిరసనగా ఢిల్లీ పర్యటన వాయిదా అంటూ సొంత చానల్లో ప్రచారం * అధిష్టానాన్ని ధిక్కరించి జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ కథనాలు * బాలల దినోత్సవంలో పాల్గొనాల్సి ఉండడం వల్లే సీఎం ఢిల్లీ రాలేదని బయటపెట్టిన షిండే హోంమంత్రి ప్రకటనతో ఫెయిలైన సీఎం ప్లాన్ సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మట్టికరవనున్న సీమాంధ్రలో సమైక్య హీరో అనిపించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈ దఫా తన మంత్రివర్గ సహచరుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసి పావులు కదిపారు. గురువారం సీఎం జీవోఎం ముందు హాజరై ప్రభుత్వ పరంగా విభజనపై పలు అంశాలను వివరించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ బాలల చలనచిత్ర కార్యక్రమ ప్రారంభోత్సవం ఉన్న కారణంగా కేంద్ర మంత్రికి సమాచారం ఇచ్చి ఆయన పర్యటన 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే సమైక్యం కోసం కట్టుబడి ఉన్నందునే సీఎం జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ తన సొంత టీవీ చానల్లో ప్రచారం మొదలుపెట్టారు. భేటీకి రాకుండా అధిష్టానాన్ని ధిక్కరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ను మార్చి ఆ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణను కూర్చోబెట్టాలని పెద్దలు నిర్ణయించారంటూ ఆయన సన్నిహితులతో లీకులిప్పించారు. తద్వారా కన్నాను దెబ్బతీయడంతోపాటు తనకుతానుగా సమైక్యం కోసం కట్టుబడి ఉన్నట్టుగా చిత్రీకరించుకునే వ్యూహంతో కిరణ్కుమార్ రెడ్డి ముందుకువెళ్లారు. అయితే ముఖ్యమంత్రి జీవోఎం ముందు హాజరుకాకపోవడానికి బాలల చలనచిత్రోత్సవ కార్యక్రమమే కారణమని స్వయంగా కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే ప్రకటన చేయడంతో కిరణ్ ప్లానంతా ఫెయిలైంది. షిండే ప్రకటనతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిని ఇదంతా కిరణ్ ఒక ఎత్తుగడ ప్రకారం చేసిన డ్రామాయేనని సాయంత్రానికి తేల్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రందాకా లీకులే లీకులు.. రాష్ట్ర విభజనపై తమ ముందుకు రావలసిందిగా కిరణ్ను జీవోఎం ఆదేశించినట్లు, గురువారం రాత్రి 8 గంటలకు సమయాన్ని ఖరారు చేసినట్లు బుధవారమే సీఎం కార్యాలయవర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నట్లు కూడా బుధవారం ప్రకటించారు. అయితే గురువారం ఉదయానికే సీన్ మారిపోయింది. సీఎం కిరణ్ జీవోఎం ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడం లేదని టీవీ చానళ్లకు లీకులు అందాయి. దాంతో పాటు సొంత చానల్లో అదే విషయాన్ని ఊదరగొట్టారు. మంత్రుల బృందం రాష్ట్ర విభజన సమస్యలపై ఏర్పడినందున దాని ముందు హాజరుకావడమంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని, అందుకే సీఎం కిరణ్ ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారని వ్యూహాత్మకంగా ప్రచారం చేయించారు. సమైక్యవాదం కోసం అధిష్టానాన్ని, కేంద్రమంత్రుల బృందాన్నీ కిరణ్కుమార్రెడ్డి ఎదిరించి నిలబడుతున్నారన్న కలరింగ్ ఇప్పించారు. ఒకే దెబ్బకు ‘కన్నా’ వికెట్ కూడా.. కన్నా లక్ష్మీనారాయణ మూడు రోజుల కిందట సోనియాగాంధీని కలిసిన నేపథ్యంలో దీనిపైనా సీఎం ప్రచారాన్ని సాగించారు. సమైక్యవాదిగా సీఎం ధిక్కారస్వరం తీవ్రమైందని, అందుకే జీవోఎంకు వెళ్లడం లేదని, ఆయన్ను మార్చాలన్న ఆలోచనతోనే సోనియాగాంధీ స్వయంగా కన్నాను పిలిచి మాట్లాడారన్న కథనాలు ప్రసారమయ్యేలా చేశారు. నిజంగానే సీఎం అధిష్టానాన్ని, కేంద్రాన్ని ధిక్కరించే ఢిల్లీకి వెళ్లడం లేదా? అన్న అనుమానం వచ్చిన కొంతమంది తెలంగాణ నేతలు దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. ఈనెల 25వ తేదీకి కిరణ్కుమార్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్య వాదం వినిపిస్తున్న కారణంగానే కిరణ్ను మార్చాలన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టుగా ఆయనకు ఆయనే ప్రచారంలో పెట్టించడంతో పాటు ఇటీవలి కాలంలో తనకు దూరమైన కన్నా లక్ష్మీనారాయణను విభజన వాదిగా ముద్రవేయాలన్న ప్రణాళికబద్ధంగా ఇదంతా చేశారని కాంగ్రెస్లో గుప్పుమంటోంది. జీవోఎం సమయమే కేటాయించలేదు: యాదవరెడ్డి మంత్రుల బృందం కిరణ్కు గురువారం సమయమే కేటాయించలేదని జీవోఎం అధికారులు తమకు చెప్పారని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ యాదవరెడ్డి మీడియాకు చెప్పారు. మరికొందరు నేతలూ ఇదే అన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు కేంద్రమంత్రి మనీష్ తివారీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున సీఎం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు వీలుగా భేటీని వాయిదా వేయాలని కేంద్ర మంత్రే జీవోఎంకు లేఖ రాశారని, ఆ కారణంగానే సీఎం ఢిల్లీ పర్యటన 18కి వాయి దా పడిందని సాయంత్రానికి సీఎంవో మీడియాకు వివరణ ఇచ్చింది. సీఎం మార్పు ఉండదు: మంత్రులు తాజా కథనాలపై సీఎం సన్నిహిత మంత్రులు కూడా వేర్వేరుగా స్పందించారు. సీఎంను మార్చడం అంత సులభమైన విషయం కానేకాదని, విభజన నిర్ణయంతో ఇప్పటికే ఒక తప్పుచేసిన పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుతో మరో తప్పు చేయబోదని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగానైనా తప్పుకోవాలని, శాసనసభాపక్ష సమావేశం పెట్టయినా నిర్ణయం తీసుకోవలసి ఉందని అన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో ఏక వాక్య తీర్మానంతో సీఎం ఎంపిక కుదరబోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఈ సమయంలో ఎవరు ఢిల్లీకి వెళ్లినా సీఎం మార్పు జరుగుతుందనే ప్రచారం సాధారణమైపోయిందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మనీష్ తివారీ హైదరాబాద్కు రావడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని మరో మంత్రి శైలజానాథ్ తెలిపారు. ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ప్రచారం మీడియాలోనే జరుగుతోందని, తమకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని స్పష్టంచేశారు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే: కన్నా తనపై జరిగిన ప్రచారాన్ని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. తాను సమైక్యవాదినేనని, అధిష్టానంతో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివెనుక ఎవరున్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇదంతా జరిగిందన్నారు. -
సీమాంధ్ర పీసీసీ చీఫ్గా కన్నా?
పీసీసీ అధ్యక్షుల ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదానికి ముందే తెలంగాణ, సీమాంధ్రులకు వేర్వేరుగా పీసీసీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు పదవులకు పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు దాదాపు ఖరాయినట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు అధిష్టానం పెద్దల నుంచి ఆయన పిలుపువచ్చినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన హస్తిన పర్యటనకు వెళ్లిరావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రస్తుతం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పనిలో ఉన్నారని.. ఆయన ఆదేశాల మేరకే హైకమాండ్ పెద్దలు శ్రీధర్బాబును ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఇక సీమాంధ్రలో పీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. హైకమాండ్ పిలుపుతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనమవడంతో కన్నాకు పీసీసీ పగ్గాలు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధినేత్రి సోనియా గాంధీతో కన్నా సమావేశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మేడమ్తో నేడు ఆయన ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తమ నాయకుడు తీపి కబురుతో తిరిగొస్తారని కన్నా వర్గీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జోడు పదవులు అనుభవిస్తున్న బొత్స సత్యనారాయణ నుంచి పీసీసీ పీఠాన్ని వేరొకరికి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన నిర్ణయాన్ని హైకమాండ్ అమలు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. బొత్స స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా పదవికి అప్పగిస్తే కాపు ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉంటుందని అధిష్టానం అంచనా వేస్తోస్తున్నట్టు సమాచారం. అయితే గతంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవికి కన్నా పేరు వినిపించిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు సత్తిబాబునే తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశమూ లేకపోలేదన్న వాదన విన్పిస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఇదే నిజమయితే పీసీసీ పీఠాలు ఎవరికి దక్కుతాయనేది తొందరలోనే తేలుతుంది. -
రైతులకిచ్చే సబ్సిడీ అభివృద్ధి ఖర్చే
ప్రపంచ వ్యవసాయ సదస్సు ముగింపు సమావేశంలో స్పీకర్ మనోహర్ సదస్సు సిఫారసుల అమలుకు కృషి: మంత్రి కన్నా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సబ్సిడీలను సంక్షేమ పథకాల వ్యయంలో భాగంగా చూడటం తగదని, ఈ ఖర్చును దేశాభివృద్ధికి చేస్తున్న ఖర్చుగా పరిగణించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐసీసీలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు ముగింపు సమావేశంలో గురువారం స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తరిగిపోతున్న ప్రకృతి వనరులు, కూలీల కొరత, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే సంసిద్ధత లోపించడం వంటి సమస్యలతో వ్యవసాయ రంగం సతమతమవుతోందన్నారు. రాష్ట్ర వ్యవసాయ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధికి సదస్సు చేసిన సిఫారసుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విలువల రాజకీయాలు కావాలి: జేమ్స్ బోల్గర్ ప్రపంచంలో కోట్లాది మంది ఆకలి తీర్చడానికి, సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటుగా మార్చడానికి చిత్తశుద్ధి కల్గిన రాజకీయ నాయకత్వం కావాలని ప్రపంచ వ్యవసాయ ఫోరం (డబ్ల్యూఏఎఫ్) సలహా మండలి చైర్మన్ జేమ్స్ బోల్గర్ పేర్కొన్నారు. చిన్న కమతాలకు అనువుగా వ్యవసాయ యాంత్రీకరణ జరగాలన్నారు. డబ్ల్యూఏఎఫ్ నేత బెకర్ మాట్లాడుతూ సదస్సు అనుకున్న దానికన్నా బాగా విజయవంతమయ్యిందన్నారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికే మహంతి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ చంద పునేఠ తదితరులు మాట్లాడారు. నిరసనల మధ్య ముగిసిన సదస్సు రైతు సంఘాల నిరసనల మధ్య మూడు రోజుల ప్రపంచ వ్యవసాయ సదస్సు గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని పలు రైతు సంఘాలు బహిష్కరించాయి. సదస్సులో పాల్గొని చర్చల తీరును ఎండగట్టాలని భావించిన కొందరు రైతు నేతలను పోలీసులు లోపలికి అనుమతించలేదు. సదస్సు చివరి రోజు కూడా నిరసన తెలిపిన పలువురు రైతు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, చర్చల్లో బహుళజాతి కంపెనీల వ్యాపార విస్తరణ ధోరణిని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన రీతిలో ఎండగట్టడం విశేషం. విదేశీ కంపెనీల ప్రతినిథులు కొత్త టెక్నాలజీ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ ఉండాల్సిన అవసరాన్ని మన శాస్త్రవేత్తలు గట్టిగా చెప్పారు. కర్ణాటక వ్యవసాయ యూనివర్సిటీ మాజీ వీసీ పాటిల్, ఐసీఏఆర్ ఇంజనీరింగ్ మాజీ డీడీజీ ఎంఎం పాండే, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ వీసీ రాజ్కుమార్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న ముల్కనూర్ సొసైటీ విజయ గాథ! కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సొసైటీ సాధించిన ఘన విజయం ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రతినిధులను అమితంగా ఆకట్టుకుంది. 1956లో కేవలం రూ.2,300 మూలధనంతో ఈ సొసైటీ ప్రారంభమైంది. ప్రస్తుతం 7,300 మంది రైతుల భాగస్వామ్యంతో రూ.10 కోట్ల షేర్ కేపిటల్తో రూ.180 కోట్ల టర్నోవర్ సాధించిన వైనంపై సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రధానంగా విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంది. బయటి వ్యక్తుల ప్రమేయాన్ని అంగీకరించకపోవడం.. నిబద్ధత, నిజాయితీ కలిగిన స్థానిక నాయకత్వం.. సకాలంలో రైతులకు రుణాలివ్వడం.. రుణ వసూళ్లను మార్కెటింగ్తో అనుసంధానించడం వల్లే తమ సొసైటీ ఇంత అభివృద్ధి సాధించిందని ప్రవీణ్ రెడ్డి వివరించడంతో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. -
11 నుంచి మూడో విడత రచ్చబండ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రజలందరినీ భాగస్వాములనుచేసి రచ్చబండ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రమంత్రులు పితాని సత్యనారాయణ, ఎన్ రఘువీరారెడ్డి, డీ శ్రీధర్లతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో తీసుకోవలసిన చర్యల గురించి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మొదటి విడత రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించి, రెండో విడతలో వచ్చిన రేషన్కార్డులు, గృహ నిర్మాణాలకు మంజూరు పత్రాలు, పింఛన్లు పంపిణీ చే శారన్నారు. రెండో విడతలో వచ్చిన అర్జీలను పరిష్కరించి మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తా జాగా జరగనున్న రచ్చబండలో 17 లక్షల 94 వేల గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారన్నారు. 4 లక్షల 98 వేల ఎస్సీ కుటుంబాలు, 5 లక్షల 15 వేల ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మట్టితో మెరక పెంచేందుకు నిధులు మం జూ రు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణను కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్గౌడ్, సీపీఓ కేటీ వెంకయ్య, డీఆర్డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ కే పోలప్ప పాల్గొన్నారు. -
ప్రపంచ వ్యవసాయ సదస్సు జరిగేదిలా
సాక్షి,హైదరాబాద్: సోమవారం నుంచి గురువారం వరకు హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు కార్యక్రమాల వివరాలు నిర్వాహకుల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి.. నవంబర్ 4న: ఉదయం 10.30 గంటలకు ప్రతినిధుల నమోదు.. ఆ తర్వాత నగర శివార్లలో స్థానిక వ్యవసాయ పద్ధతుల పరిశీలన, నగరంలోని వివిధ వ్యవసాయ, అనుబంధ పరిశోధనా కేంద్రాల సందర్శన - రాత్రి 7 గంటలకు నొవాటెల్ హోటల్లో వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చే విందుకు హాజరు. నవంబర్ 5న: సదస్సు ప్రారంభోత్సవం: ఉదయం 9.30 - 11 గంటల మధ్య - మ. 2 నుంచి 1 గంటల వరకు: ఆర్బీ సింగ్ (మాజీ డెరైక్టర్, ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్), లియాన్ కండాన్ (సీఈవో, బేయర్ కంపెనీ), అనిల్ జైన్(సీఈవో, జైన్ ఇరిగేషన్)ల కీలకోపన్యాసాలు - సా. 2.30 నుంచి 4 గంటల వరకు: ప్రొ. జులియన్ క్రిబ్ (యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ, ఆస్ట్రేలియా), డెన్సీ బ్యురెల్ (గ్లోబల్ ఫాం ఎక్సెటెన్షన్ మేనేజర్), సుహాస్ పి. వాణి(ఇక్రిశాట్)ల ఉపన్యాసాలు - సా. 4 నుంచి 5 గంటల మధ్య: ‘పార్టనరింగ్ సొల్యూషన్స్ ఫర్ స్మాల్హోల్డర్ ఫ్రార్మర్స్’ అనే అంశంపై బేయర్ కంపెనీ ఆధ్వర్యంలో చర్చ. - సా. 5 నుంచి 6 గంటల వరకు: ‘సుస్థిర వ్యవసాయంలో సహకార సంఘాల పాత్ర’అనే అంశంపై ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి ఆధ్వర్యంలో.. ‘భారత దేశంలో ఆహార, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అన్న అంశంపై వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో చర్చా గోష్టులు రాత్రి 7.30 గంటలకు: శిల్పారామంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆతిధ్యంలో విందు. నవంబర్ 6న: ఉ. 9.30 గంటలకు: కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి క్రిష్ణ బెరై గౌడ కీలకోపన్యాసం. ఠ ఉ. 10 నుంచి 11 గంటల వరకు: పాడి రంగంపై చర్చ - ఉ. 11 గంటలకు: పర్యావరణానికి మేలు చేస్తున్న ‘బయోబేస్డ్’ వ్యవసాయంపై పెర్ ఫాల్హట్ (డెన్మార్క్), అన్టన్ రొబెక్(బయోబేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అధ్యక్షుడు) ఉపన్యాసాలు - మ. 12.30 గంటలకు: వాణిజ్య ప్రదర్శన అంశంపై అరుణ్ చంద్ర అంబటిపూడి(ఫెయిర్ ట్రేడ్ ఫౌండేషన్ ఇండియా, ఈడీ) ఉపన్యాసం - మ. 2.30 గంటలకు: అమరీష్ గులాటి (ఎండి, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్), థాడ్ సిమన్స్(సీఈవో, నొవస్ ఇంటర్నేషనల్)ల ఉపన్యాసాలు. ఆ తర్వాత వ్యవసాయంలో మౌలిక వసతులు, రవాణా తదితర అంశాలపై చర్చ. - సా. 4.30 గంటలకు: డెవలపింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ అగ్రి బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రి బిజినెస్ అంశాలపై వ్యవసాయ సదస్సు చైర్మన్ కెన్నత్ బేకర్ ఆధ్వర్యంలో చర్చ నవంబర్ 7న: ఉ. 9.30 గంటలకు: సుస్థిర వ్యవసాయంలో ముల్కనూరు సొసైటీ విజయగాథపై ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్రసంగం ఠ ఉ. 10 నుంచి 12.45 గంటల వరకు: టెక్నాలజీ రెస్పాండింగ్ టు నేచర్స్ ఛాలెంజెస్ అన్న అంశంపై ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ పద్మరాజు ఆధ్వర్యంలో చర్చ.. వ్యవసాయ మార్కెట్ల తీరుతెన్నులపై చర్చ ఠ మ. 1.45 గంటలకు: సదస్సు ముగింపు సభ.