lavanya
-
మస్తాన్ సాయి కుటుంబాన్ని దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని డిమాండ్
-
మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్,సాక్షి,: లావణ్య, రాజ్ తరుణ్ల వివాదం తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, మస్తాన్ సాయి (Mastan Sai Case) నిందితుడిగా ఉన్న ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు చేరింది. మస్తాన్ సాయి కేసు విషయమై లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్బాబు గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. దర్గా ప్రతిష్టతకు భంగం..ధర్మకర్త కుమారుడైన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో తెలిపారు. అందుకే, మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్ బాబు వెల్లడించారు. -
మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు
మణికొండ: రెండు రోజులుగా పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొన్న మస్తాన్సాయిని(Mastan Sai Case) శనివారం తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయి యువతులకు పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ ఇవ్వటం, వారు మత్తులోకి జారుకున్న తర్వాత వారిపై లైంగికదాడికి పాల్పడటం, దానిని సీక్రెట్ కెమెరాలు, సెల్ఫోన్ల వీడియా తీసి రికార్డు చేయటం, వాటిని ఆధారంగా చేసుకుని యువతులను పలుమార్లు బ్లాక్మెయిల్ చేయడం చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే కోవలో సినీహీరో రాజ్తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య సైతం అతని ఉచ్చులో చిక్కుకుంది. అతని వద్ద తన వీడియోలు ఉన్న హార్డ్డెస్్కను తస్కరించిన ఆమె దాని ఆధారంగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన హార్డ్డెస్క్ తిరిగి ఇవ్వాలని మస్తాన్సాయి లావణ్యను బెదిరించడమేగాక తనతో పాటు తన ఇంటిపై దాడి చేశాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇంటికి వచ్చిన సమయంలో మస్తాన్ సాయితో పాటు అతడి స్నేహితుడు ఖాజా మెయినుద్దీన్ డ్రగ్స్ తీసుకుని ఉండటంతో పరీక్షలు నిర్వహించిన పోలీసులు నార్కోటిక్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ నెల 2న అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉద్దేశపూర్వకంగానే నేరాలు... మస్తాన్సాయిని నార్సింగి పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించటంతో అతను ఉద్దేశపూర్వకంగానే యువతులకు డ్రగ్స్ ఇవ్వటం, నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్కు పాల్పడటం లాంటి చర్యలు ఉద్దేశ పూర్వకంగానే చేశానని అంగీకరించినట్టు తెలిసింది. తల్లితండ్రుల అతి గారాబం కారణంగా ఉన్నత చదువులు చదువుకున్నా వక్రమార్గంలో పయనించినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్, ఇతర యువతులను నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అతడి నైజంగా పోలీసులు గుర్తించారు. తను చేసిన నేరాలను విచారణలో అంగీకరించటంతో అదే నివేదికను కోర్టుకు అందించినట్లు తెలిసింది. -
నాకు తెలియకుండా మస్తాన్ సాయి వీడియో తీశాడు
-
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.ఈ క్రమంలో లావణ్య.. ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని ఆమె తెలిపారు. ‘‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలి’’ అని లావణ్య కోరారు.‘‘యువతులు వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలి. నేను రాజ్ తరుణ్ కోసం ఒంటరి పోరాటం చేశాను. నేను సహాయం కోసం మాత్రమే కొందరితో పర్సనల్ గా మాట్లాడాను. నేను నా కేసులో ఏమవుతుందో తెలుసుకోవడం కోసమే వేరే వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడాను. రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చిన కాళ్ళు మొక్కుతాను. నేను మస్తాన్ సాయి నుంచి బయటపడితే చాలు’’ అంటూ లావణ్య వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. సంచలన విషయాలు వెల్లడి -
మస్తాన్ సాయి చుట్టూ పోలీస్ ఉచ్చు
-
లావణ్య నిజస్వరూపం మరోసారి బయటపెట్టిన శేఖర్ బాషా..
-
హార్డ్ డిస్క్ లో 300ల వీడియోలు.. లావణ్యపై శేఖర్ బాషా కుట్ర
-
లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.మస్తాన్సాయి రిమాండ్ రిపోర్టు ప్రకారం..‘మస్తాన్సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా పోలీసులు జత పరిచారు. మస్తాన్ సాయి ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే, ఆలోపే ఇతర డివైస్లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావణ్యను పలు మార్లు చంపేందుకు అతడు యత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు.. కొన్నేళ్లుగా మస్తాన్సాయి పబ్లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్క్లో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్క్ను మస్తాన్సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..కాగా, లావణ్యను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్సాయి, శేఖర్బాషా యత్నిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది నాగూర్బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. -
నేరాలను ఒప్పు కున్న మస్తాన్ సాయి
-
మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్
-
రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసిన మాస్తాన్ సాయికి ఉచ్చు బిగ్గుస్తోంది. మరోసారి మస్తాన్ సాయిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి నార్సింగ్ పీఎస్కి లావణ్య వచ్చింది. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేం ఆర్జే శేఖర్ బాషాపై లావణ్య ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య అంటోంది. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది.మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందజేసింది. తనతో పాటు మరో యువతిని కూడా ఇరికించే ప్లాన్ చేశారని లావణ్య అంటోంది. 150 గ్రాముల ఎండీఎంఏ తెస్తానని శేఖర్ బాషాతో మస్తాన్ సాయి చెప్పాడు. ‘‘లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయమని, పార్టీలో డ్రగ్స్ పెట్టి లావణ్యను, మరో యువతిని ఇరికిద్దామని మస్తాన్ సాయి, శేఖర్ బాషా సంభాషణల’’ ఆడియో క్లిప్ను పోలీసులకు లావణ్య అందజేసింది.కాగా, సినీ హీరో రాజ్ తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం జరిగింది. గతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, గుంటూరులో నమోదైన ఆ కేసులో నిందితుడిగా ఉన్న రావి బావాజీ మస్తాన్ సాయి ఈ దారుణానికి తెగపడ్డాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు సోమవారం మస్తాన్ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన గుంటూరు వాసి షేక్ ఖాజా మొయినుద్దీన్కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... లావణ్యకు మస్తాన్ సాయితో 2022లో పరిచయమైంది.ఆమెతో పలు సందర్భాల్లో వీడియో కాల్స్ మాట్లాడిన మస్తాన్ దాదాపు 40 కాల్స్ రికార్డు చేశాడు. 2023లో గుంటూరులో జరిగిన మస్తాన్ సోదరి వివాహానికి అతడు ఆహ్వానించడంతో లావణ్య వెళ్లింది. ఆ సందర్భంలో ఆమె తన వీడియోల విషయం ప్రశ్నించగా... తీవ్రంగా దాడి చేసిన మస్తాన్ ఆమెపై లైంగిక దాడికీ పాల్పడ్డాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని రాజ్తరుణ్కు ఫోన్ ద్వారా చెప్పారు. తాను హీరోగా ఉన్నానని, తన పేరు బయటకు రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు అనడంతో లావణ్య అక్కడి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్పై కేసు నమోదైంది.ఆడవాళ్ల జీవితాలతో...ఇదిలా ఉండగా... మస్తాన్ సాయి అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వారికి వల వేస్తున్నాడని లావణ్యకు తెలిసింది. మరికొందరి ఫోన్లు హ్యాక్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలా సంగ్రహించిన, రికార్డు చేసిన వందలాది నగ్న వీడియోలు, కాల్ రికార్డులను 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్డిస్క్లో మస్తాన్ దాచినట్లు గమనించింది. ఇటీవల మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ హార్డ్డిస్క్ను తన అధీనంలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ హార్డ్డిస్క్ కోసం మస్తాన్ అనేక రకాలుగా లావణ్యపై ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 31న మరికొందరితో కలిసి లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెపై దాడికి యత్నించాడు.మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు టీవీ, సీసీ కెమెరాలు సహా అనేక వస్తువులు ధ్వంసం చేశాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ రోజు తన స్నేహితురాలి దగ్గర ఆశ్రయం పొంది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై ఆదివారం రాత్రి మరోసారి డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెతో పాటు ఆమె సోదరుడినీ నిర్బంధించాడు. లావణ్య గొంతు నులిమి హత్యాయత్నం చేసి, ల్యాప్టాప్, హార్డ్డిస్క్ తదితరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆ సమయంలో అతడి వెంట ఖాజా, మరొకరు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మరో ప్రముఖ హీరో పేరు..సోమవారం మస్తాన్ను అరెస్టు చేసి జ్యుడీషి యల్ రిమాండ్కు తరలించిన పోలీసులు ఖాజాకు నోటీసులు జారీ చేశారు. మస్తాన్ వద్ద ఉన్న బ్యాగ్ నుంచి హార్డ్డిస్్క, ల్యాప్టాప్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగి పోలీసులకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మరో ప్రముఖ హీరో పేరునూ ప్రస్తావించారు. మస్తాన్సాయి ఇంట్లో నుంచి తెచ్చిన హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్రయత్నించారని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య అన్నారు.సోమవారం ఆమె నార్సింగి పోలీస్స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్సాయితో పాటు అతని తండ్రి తనను చంపేందుకు చూస్తున్నారని, ఇప్పటికే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇన్ని రోజులు తన వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక మిన్నకున్నానని, ఇప్పుడు పూర్తి వివరాలతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పుడు కూడా కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మస్తాన్సాయిపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారని, వారు అడిగిన వివరాలను ఇచ్చానని ఆమె వివరించారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాలయిను ట్రాప్ చేసిన మస్తాన్సాయి
-
రాజ్తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం
మణికొండ: సినీ హీరో రాజ్ తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం జరిగింది. గతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, గుంటూరులో నమోదైన ఆ కేసులో నిందితుడిగా ఉన్న రావి బావాజీ మస్తాన్ సాయి ఈ దారుణానికి తెగపడ్డాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు సోమవారం మస్తాన్ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన గుంటూరు వాసి షేక్ ఖాజా మొయినుద్దీన్కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... లావణ్యకు మస్తాన్ సాయితో 2022లో పరిచయమైంది.ఆమెతో పలు సందర్భాల్లో వీడియో కాల్స్ మాట్లాడిన మస్తాన్ దాదాపు 40 కాల్స్ రికార్డు చేశాడు. 2023లో గుంటూరులో జరిగిన మస్తాన్ సోదరి వివాహానికి అతడు ఆహ్వానించడంతో లావణ్య వెళ్లింది. ఆ సందర్భంలో ఆమె తన వీడియోల విషయం ప్రశ్నించగా... తీవ్రంగా దాడి చేసిన మస్తాన్ ఆమెపై లైంగిక దాడికీ పాల్పడ్డాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని రాజ్తరుణ్కు ఫోన్ ద్వారా చెప్పారు. తాను హీరోగా ఉన్నానని, తన పేరు బయటకు రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు అనడంతో లావణ్య అక్కడి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్పై కేసు నమోదైంది. హార్డ్డిస్క్ లో నగ్నవీడియోలు, కాల్ రికార్డింగ్లు.. ఇదిలా ఉండగా... మస్తాన్ సాయి అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వారికి వల వేస్తున్నాడని లావణ్యకు తెలిసింది. మరికొందరి ఫోన్లు హ్యాక్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలా సంగ్రహించిన, రికార్డు చేసిన వందలాది నగ్న వీడియోలు, కాల్ రికార్డులను 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్డిస్క్లో మస్తాన్ దాచినట్లు గమనించింది. ఇటీవల మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ హార్డ్డిస్్కను తన అధీనంలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ హార్డ్డిస్క్ కోసం మస్తాన్ అనేక రకాలుగా లావణ్యపై ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 31న మరికొందరితో కలిసి లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెపై దాడికి యత్నించాడు.టీవీ, సీసీ కెమెరాలు సహా అనేక వస్తువులు ధ్వంసం చేశాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ రోజు తన స్నేహితురాలి దగ్గర ఆశ్రయం పొంది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై ఆదివారం రాత్రి మరోసారి డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెతో పాటు ఆమె సోదరుడినీ నిర్బంధించాడు. లావణ్య గొంతు నులిమి హత్యాయత్నం చేసి, ల్యాప్టాప్, హార్డ్డిస్క్ తదితరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆ సమయంలో అతడి వెంట ఖాజా, మరొకరు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం మస్తాన్ను అరెస్టు చేసి జ్యుడీషి యల్ రిమాండ్కు తరలించిన పోలీసులు ఖాజాకు నోటీసులు జారీ చేశారు. మస్తాన్ వద్ద ఉన్న బ్యాగ్ నుంచి హార్డ్డిస్్క, ల్యాప్టాప్ తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషి ంచిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగి పోలీసులకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మరో ప్రముఖ హీరో పేరునూ ప్రస్తావించారు. నాకు ప్రాణహాని ఉంది: లావణ్య మస్తాన్సాయి ఇంట్లో నుంచి తెచ్చిన హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్ర యత్నించారని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య అన్నారు. సోమవారం ఆమె నార్సింగి పోలీస్స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్సాయితో పాటు అతని తండ్రి తనను చంపేందుకు చూస్తున్నారని, ఇప్పటికే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇన్ని రోజులు తన వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక మిన్నకున్నానని, ఇప్పుడు పూర్తి వివరాలతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పుడు కూడా కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయతి్నస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మస్తాన్సాయిపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారని, వారు అడిగిన వివరాలను ఇచ్చానని ఆమె వివరించారు. -
మస్తాన్ సాయి పెన్ డ్రైవ్ లో బడా స్టార్ల ప్రైవేట్ వీడియోలు
-
మస్తాన్ సాయి అరెస్ట్.. లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు!
రాజ్ తరుణ్- లావణ్య వివాదం టాలీవుడ్లో సంచలనంగా సృష్టించింది. గతేడాది ఒకరిపై ఒకరు కేసులతో పాటు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాము విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అని నార్సింగి పోలీసులకు తాజాగా లావణ్య ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.ఫిర్యాదులో సంచలన విషయాలు..మస్తాన్ సాయిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య ోసంచలన విషయాలు బయటపెట్టింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందించినట్లు లావణ్య వెల్లడించింది.హార్డ్ డిస్క్లో 300 వీడియోలు..పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో దాదాపు 300లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో లావణ్యకు సంబంధించినవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది.ఆధారాలతో వచ్చా- లావణ్యమస్తాన్ సాయిపై అన్నీ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశానని లావణ్య తెలిపింది. గతంలో నా వద్ద ఆధారాలు లేవని.. అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. ఇప్పుడు వీడియోలతో సహా నా వద్ద ఉన్న ఆధారాలు నార్సింగి పోలీసులకు ఇచ్చానని లావణ్య పేర్కొంది. దీంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్గా మారింది. ప్రాణహాని ఉంది..లావణ్యమస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు యత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హార్డ్ డిస్క్ను పోలీసులకు అప్పగించానని లావణ్య పేర్కొంది. -
'రాజ్ తరుణ్తో విడిపోవడానికి అతనే కారణం'.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య!
లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. దీంతో నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు..పలువురు అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు వచ్చాయి. ఏకాంతంగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దాదాపు 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)అసలేం జరిగిందంటే..టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం గతేడాది సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్కు రిలేషన్ ఉందని గతంలో లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది. -
Tirupati Stampede: మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది..
వైకుంఠ ద్వారం నుంచి ఆ కలియుగ వేంకటేశ్వరస్వామివారిని దర్శించి పునీతులు కావాలని తరలివచ్చారు. కానీ అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. వారి జ్ఞాపకాలు తలుచుకుని బంధువులు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు.తిరుపతి టాస్క్ఫోర్స్: వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్లే సమాధానం చెబుతున్నాయి. తోడుగా ఉన్నవారు దూరమవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తల్లిలేని ఆడ బిడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోలేక పోతున్నామని, ఆ జ్ఞాపకాలు తలుచుకుని మంచానికే పరిమితమయ్యామని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం కౌంటర్లలో ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెల్సిందే. అందులో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందిన భక్తులు ఉన్నారు. ఘటన జరిగి సుమారు ఆరు రోజులు కావస్తున్నా మరణించిన భక్తుల రక్తసంబంధీకులు, బంధువులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కొందరు మంచానికే పరిమితమయ్యామని, జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారువైజాగ్కు చెందిన మృతురాలు లావణ్య కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి దూరమైన ఆ పసిపాపల ఆవేదన వర్ణ నాతీతం. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన చెందుతున్న ఆ పిల్లలను బంధువులు ఓదార్చలేని పరిస్థితి. తల్లిని కోల్పోయా.. మాది కేరళ. ఈనెల 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మా తల్లి నిర్మల చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోలేకున్నాం. మా తల్లి నా కళ్ల ఎదుటే తి రుగుతున్నట్లు ఉంది. మా కుటుంబానికి ఆ మే పెద్ద దిక్కు. అలాంటిది తల్లి లేకపోవడం కలచివేస్తోంది. ఏ జన్మలో పాపం చేశానో త ల్లిని పోగొట్టుకున్నాను.–కౌషిగ, మృతురాలు నిర్మల కుమార్తె, కేరళఅమ్మ జ్ఞాపకాలతో..ఊహించని ఘటనతో కుటుంబం అంతా షాక్లోనే ఉంది. దైవదర్శనానికి వెళితే ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి అమ్మతో కలసి సంతోషంగా గడుపుకున్నాం. ఇప్పుడు నాన్నతో పాటు యావత్ కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయి ఉన్నాం. జ్వరాలతో మంచాన పడ్డాం. – మహేష్, మృతురాలు శాంతి కుమారుడు, వైజాగ్మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది మాది వైజాగ్ దగ్గర మద్దెలపాళెం. నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఒక్కడే కుమారుడు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నా భార్య రజిని మరణించింది. మా ఇంటి మహాలక్ష్మి మాకు దూరమైంది. ఇంట్లో నేను, నా కుమారుడు ఇద్దరమే మిగిలాం. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి సంతోషంగా గడిపాం. ఈ ఏడాది ఆమెను దేవుడు దూరం చేశాడు. మా అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. – లక్ష్మణరెడ్డి, మృతురాలి భర్త, మద్దెలపాళెం, వైజాగ్ఆయన జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా.. వైకుంఠ వాకిలి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే తపనతో నా భర్త నాయుడుబాబుతో క లసి 8వ తేదీన తిరుపతికి వచ్చాం. అదే రోజు జరిగిన తొక్కిసలాటలో నా భర్త చనిపోయాడు. కూలి చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో ఈ విషాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నా భర్త వెంట లేడనే బాధను దిగమింగుకోలేక పోతున్నా. కుటుంబంలో 90 ఏళ్ల పెద్దవారు ఉన్నా రు. వారి బాగోగులు చూసుకోవాలి. ఆయన తోడు విడిచాడు. నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సాయం అందించింది. నేను పెద్దగా చదువుకున్న దానిని కాదు. అధికారులు ఉద్యోగం నర్సీపట్నంలోనే కల్పిస్తే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.– మణికుమారి,మృతుడు నాయుడుబాబు సతీమణి, నర్సీపట్నం -
కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట!
తిరుపతి క్రైం/తిరుపతి కల్చరల్: మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవళ్లతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం తమ పెంపుడు కుక్క(టావీు)ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తమతో వెటకారంగా మాట్లాడుతూ చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు. కుక్కను చంపిన వారికి వత్తాసు పలుకుతూ.. రూ.2 లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. తానే రూ.2 లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి పాల్గొన్నారు.ఇద్దరు నిందితుల అరెస్టు..టామీ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్ పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. శంకర్ కాలనీకి చెందిన లావణ్య ఈనెల 6న బయటకు వెళ్తూ తన కుమార్తె గ్రీష్మతో పాటు టామీని స్కావెంజర్స్ కాలనీలోని తన మామయ్య ఆనందయ్య ఇంట్లో వదిలి వెళ్లారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కుమార్తె గ్రీష్మ.. లావణ్యకు ఫోన్ చేసి తాతయ్య ఎదురింట్లో ఉన్న శివకుమార్, సాయికుమార్ టామీని చంపేశారని తెలిపింది. శివకుమార్ ఇంటి వైపు టామీ చూసి అరుస్తుండడంతో.. సాయికుమార్ రాయితో కొట్టాడని.. ఆ వెంటనే శివకుమార్ కత్తితో టామీని నరికి చంపేశాడు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. -
హీరోయిన్కు సారీ చెప్పిన రాజ్ తరుణ్.. చాలా బాధగా ఉందంటూ..!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించారు. జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఒకవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తోన్న రాజ్ తరుణ్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి అతనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ముంబయిలోని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంటి వద్దకు వెళ్లిన లావణ్య హల్చల్ చేసింది. అయితే అక్కడే రాజ్ తరుణ్ ఉన్న సమయంలో ఈ గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలైంది.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)తాజాగా ఈ సంఘటనపై రాజ్ తరుణ్ పోస్ట్ చేశారు. ముంబయిలో జరిగిన సంఘటనను తలచుకుంటే చాలా బాధగా ఉంది.. అవమానంగా అనిపించిందని ట్వీట్ చేశారు. ఇలా మీ నివాసం వద్ద జరిగినందుకు క్షమించాలంటూ మాల్వీమల్హోత్రాను ట్విటర్ ద్వారా కోరారు. అయినప్పటికీ మీతో, మీ స్నేహితులతో కలిసి వినాయక చవితి పండుగను ఆస్వాదించానని.. అలాగే ఆ గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని రాజ్ తరుణ్ రాసుకొచ్చారు. అంతేకాకుండా గణేశునితో దిగిన ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. I feel so sad and humiliated for the recent events happened in mumbai . I’m very sorry @MalviMalhotra that it happened at your place . However, I had a great time experiencing Vinayak Chavithi with u nd ur friends. May Ganesha bless u nd all of us with peace and endless success. pic.twitter.com/AZZEBTUOwf— Raj Tarun (@itsRajTarun) September 12, 2024 -
దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్(10), జయవర్ధన్(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు. దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు. -
'నా నగలు ఎత్తుకెెళ్లారు'.. లావణ్య సంచలన ఆరోపణలు!
టాలీవుడ్ రాజ్తరుణ్-లావణ్య కేసు మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజ్ తరుణ్పై కేసు పెట్టిన లావణ్య పాటు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన రూ.12 లక్షల విలువైన బంగారం దొంగిలించారని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. నగలకు సంబంధించిన బిల్లులతో సహా పోలీస్ స్టేషన్కు వచ్చిన లావణ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. నా బంగారు గాజులు, పుస్తెల తాడు, బ్రేస్ లెట్ , చైన్ మాల్వీనే దొంగిలించారంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. మా ఇంటికి మాల్వి మూడు సార్లు వచ్చిందని.. నగలు దాచిన బీరువా తాళాలు ఆమె దగ్గరే ఉన్నాయని ఆరోపించింది. దీనికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది.నా రాజ్ను పంపించు...హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన రాజ్ను తిరిగి పంపించు.. నా మనిషిని తీసుకెళ్లి నన్ను ఒంటరిదాన్ని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా రాజ్ తరుణ్ను మాల్వీ తన గ్రిప్లో పెట్టేసుకుందని.. నేను తిరిగి వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు రాజ్ ఇచ్చాడని లావణ్య తెలిపింది.నిందితుడిగా రాజ్ తరుణ్ పేరు..అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో పోలీసులు ఇటీవలే నేర అభియోగపత్రం దాఖలు చేశారు. అందులో హీరో రాజ్ తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో సహజీవనం చేసింది వాస్తవమేనని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరింత రసవత్తరంగా మారింది. కాగా.. మరోవైపు ఈ వారంలో రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. -
రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ లావణ్య ఫస్ట్ రియాక్షన్
-
రాజ్తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో తాజాగా ఛార్జ్షీట్ దాఖలు అయింది. రాజ్తరుణ్పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చేశారు. లావణ్య- రాజ్తరుణ్ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అందుకు సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు.ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్తరుణ్పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ గతంలో ఆమె పిర్యాదులో పేర్కొంది. పిర్యాదులో పేర్కొన్నట్లుగా ఆమె పలు ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె రాజ్ తరుణపై కేసు కూడా పెట్టింది. ఈ కేసులో రాజ్తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ విషయంలో తాజాగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసే ఛాన్స్ ఉంది. -
డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రగ్ పెడ్లర్గా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని సోమవారం తెలంగాణా ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్లింది. గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడు రావి రామ్మోహనరావు కుమారుడే ఈ మస్తాన్ సాయి. గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్సాయి పేరు వెలుగులోకి వచి్చంది. మస్తాన్ దర్గాకు దర్శనం కోసం వచి్చన సమయంలో తనతో మస్తాన్సాయి అసభ్యంగా ప్రవర్తించినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇతను దర్గాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందడంతో నార్సింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో మస్తాన్సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత గుంటూరులోని మస్తాన్ దర్గాలోనే ఉంటున్నప్పటికీ గుంటూరు పోలీసులతో కుమ్మక్కు కావడంతో వారు అతడి జోలికి వెళ్లలేదని సమాచారం. -
రాజ్తరుణ్-లావణ్య వివాదం.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్గా మారింది. రాజ్ తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి, ఇప్పుడు వేరే హీరోయిన్ మోజులో పడి వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది. అంతేకాదు తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, గర్భం చేసి అబార్షన్ చేయించాడని పోలిసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మీడియా రెండు-మూడు రోజులు పలు కథనాలు ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇప్పటి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది. అటు లావణ్య..ఇటు శేఖర్ బాషా నిత్యం ఏదో ఒక యూట్యూబ్ చానెల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం..అవి కాస్త వైరల్ కావడం..దీనిపై కొంతమంది విశ్లేషణలు పెట్టడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా రాజ్తరుణ్-లావణ్య వివాదంపై తన విశ్లేషణ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజ్-లావణ్య వివాదం మీడియా సర్కస్గా మారిందని, సోషల్ మీడియాలో అయితే ఒక వెబ్ సిరీస్గా దీన్ని ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. మొత్తంగా లావణ్య వ్యవహారమే తేడాగా ఉందంటూ.. రాజ్ తరుణ్కి మద్దతుగా మాట్లాడాడు ఆర్జీవీ.‘రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం చేశాడని.. అతను నాకు కావాలని లావణ్య అంటోంది. రాజ్ మాత్రమే కావాలంటే..అది చాక్లెట్ కాదు కదా? పెళ్లి చేసుకొని,20-30 ఏళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లే విడిపోతున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అసలు పాయింట్ కాదు’ అని ఆర్జీవీ అన్నారు.ఇక లావణ్య వరుసగా ఆడియో క్లిప్స్ రిలీజ్ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘కలిసి కాపురం చేసే వాళ్లకి ఆడియో రికార్డు చేయాలనే ఆలోచన రాదు. క్రిమినల్ మైండ్ సెట్ వాళ్లకే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆడియో క్లిప్స్ లీక్ చేయడం క్రిమినల్ మెంటాలిటీని సూచిస్తుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉండడం అసంభవం. రాజ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతుంది..కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందనే నాకు అనిపిస్తుంది’ అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. My observations on the RELATIONSHIP HORRORS between MEN and WOMEN in the context of Raj Tarun and Lavanya ISSUE https://t.co/Y4FTfmnVSC— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024 -
రాజ్ తరుణ్పై లావణ్య కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం!
టాలీవుడ్లో సంచలనంగా మారిన లావణ్య కేసులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో రాజ్ తరుణ్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో రాజ్ తరుణ్కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.కాగా.. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్తో దాదాపు 11 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడింది. నాకు భర్త కావాలి అంటూ ఇటీవల ప్రసాద్ ల్యాబ్ వద్ద హల్చల్ చేసింది. అయితే రాజ్ తరుణ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. రాజ్ తరుణ్ ఇటీవలే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. -
కాలితో తన్నాడంటూ శేఖర్ భాషాపై ఫిర్యాదు చేసిన లావణ్య
రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ఆర్జే శేఖర్ భాషాపై కేసు నమోదైంది. తన స్నేహితుడు రాజ్ తరుణ్పై లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన పలు మీడియా వేదకల మీద కామెంట్లు చేశాడు. లావణ్య వల్లే రాజ్ తరుణ్ చాలా నష్టపోయాడని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్లో పాల్గొన్న లావణ్యపై శేఖర్ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్ భాషాపై కేసు నమోదు చేశారు.రాజ్ తరుణ్-లావణ్య వివాదం దారి మళ్లీ ఇప్పుడు శేఖర్ భాషా, లావణ్య గొడవ నెట్టింట వైరల్ అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న లావణ్యపై శేఖర్ భాషా దాడి చేశాడని తెలుస్తోంది. తన కడుపు మీద బలంగా శేఖర్ భాషా తన్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె చెప్పారు.శేఖర్పై కేసు సెక్షన్ 74, 115(2) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.శేఖర్ భాషా- లావణ్య మధ్య గొడవకు ప్రధాన కారణం ఆయన చేసిన ఆరోపణలే అని చెప్పవచ్చు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్కు మద్ధతుగా చాలామంది కామెంట్లు చేశారు. ఆపై ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో పాటు చాలామంది అమ్మాయిలకు డ్రగ్స్ అందించినట్లు ఆయన చెప్పారు. దీంతో లావణ్య, శేఖర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒక మీడియా వేదికపైనే శేఖర్ భాషాను లావణ్య చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. -
రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు
రాజ్ తరుణ్-లావణ్య వివాదం రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. తాజాగా లావణ్యపై నార్సింగ్ పోలీసులకు ప్రీతి ఫిర్యాదు చేసింది. తమకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని ఆమె ఆరోపించింది. తమతో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. ఆమె వల్ల చాలామంది జీవితాలు నరకంగా మారాయని ఆరోపించింది. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఎస్ఐ సుఖేందర్రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో తాజాగా లావణ్య గురించి రాజ్ తరుణ్ లాయర్ ముధు శర్మ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లావణ్య డ్రగ్స్కు అలవాటు పడటమే కాకుండా అనేకమందికి అందించింది. దానిని అడ్డుకునేందుకు రాజ్ తరుణ్ చాలాసార్లు ప్రయత్నించాడు. అమె నిరాకరించింది. లావణ్యకు దూరంగా ఉంటూ వచ్చిన రాజ్ తరుణ్పై కక్ష పెంచుకుంది. అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తుంది. లావణ్యకు డ్రగ్స్ మూఠాతో సంబంధాలు ఉన్నాయి. వారు డ్రగ్స్ ఎక్కడ తెస్తారు వంటి పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అవన్నీ పోలీసులకు అందిస్తాం. డ్రగ్స్ మత్తులో ఉన్న ఆడపిల్లలపై న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి ఆపై వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ వివరాలు పూర్తి స్ధాయిలో రాబోతున్నాయి. లావణ్య ఉచ్చులో చిక్కుకొని డ్రగ్స్కు అలవాటు పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. త్వరలో వారందరూ బయటకు వస్తారు. డ్రగ్స్ గురించి రాజ్ తరుణ్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. దీంతో లావణ్య నుంచి ఆయనకు ప్రాణహాని ఉంది. రాజ్ తరుణ్ జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్పుత్లా కాకుండా చూసుకోవాలి. అని లాయర్ సూచించారు. -
Raj Tarun - Lavanya Case: వేధిస్తోందంటూ లావణ్యపై ఫిర్యాదు
మణికొండ: తనను మోసం చేశాడంటూ నటుడు రాజ్తరుణ్పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ప్రీతి అనే మహిళ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. లావణ్య తనను ఫోన్ చేసి వేధిస్తోందని, తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి శుక్రవారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై నార్సింగి అడ్మిన్ ఎస్ఐ సుఖేందర్రెడ్డిని వివరణ కోరగా ప్రీతి అనే మహిళ ఇచి్చన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, అది తమ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంతోపాటు..అందులోని ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై ఇపుడే ఏమి చెప్పలేమన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ ఫిర్యాదుపై వివరాలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదుదారు ప్రీతితో పాటు ఆర్జే శేఖర్ బాష, న్యాయవాది శర్మ ఉన్నారు. -
రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. లాయర్ సంచలన కామెంట్స్..
-
రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్యపై కేసు నమోదు..
రాజ్ తరుణ్- లావణ్య వివాదం పలు మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లావణ్య తమ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తున్నట్లు వారు తెలిపారు. తమ ఇంటి వద్దకు వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.మాదాపూర్లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుంన్న రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య గొడవ చేసిందని సమాచారం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి తలుపులు బలంగా కొడతూ తమను ఆందోళనకు గురిచేసినట్లు వారు చెబుతున్నారు. ఆపై ఇంటి ముందు బూతులు తిడుతూ గట్టిగా కేకలు వేసి ఇబ్బందులుకు గురిచేసిందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. అయితే, రాజ్ తరణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. తనను పెళ్లి చేసుకుని మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె చెబుతుంది. -
రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య
టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారంలో రచ్చ కొనసాగుతుంది. కొద్దిరోజుల క్రితం రాజ్ తరుణ్పై లావణ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్న రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకుని మోసం చేశాడని తెలిపింది. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్లో లావణ్య, శేఖర్ భాష మధ్య పెద్ద గొడవే జరిగింది.లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ తరపున తన స్నేహితుడు శేఖర్ భాష పలు ఆధారాలతో మీడియా ముందుకు వచ్చాడు. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని ఆయన తెలిపాడు. చిన్నపిల్లలకు కూడా లావణ్య డ్రగ్స్ అమ్మినట్లు మీడియా డిబెట్లో శేఖర్ బాష కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన లావణ్య దాడికి దిగింది. లైవ్ రన్ అవుతుండగానే శేఖర్ బాషను లావణ్య చెప్పుతో కొట్టింది. దీంతో ఇద్దరూ ఆగ్రహంతో రెచ్చిపోయారు. అయితే, డ్రగ్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదని లావణ్య తెలిపింది. కావాలని తనని ఇందులోకి లాగుతున్నారని ఆమె వారించింది. కానీ, ఆమె డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయని అందుకు సంబంధించిన లింక్ ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో లావణ్య డిబెట్ మధ్యలో నుంచి వెళ్లిపోయింది. ఇలా రోజుకో కొత్త గొడవలతో వీరిద్దరి వ్యవహారం నడుస్తుంది. -
లావణ్య-రాజ్ తరుణ్ స్టోరీలో మరో ట్విస్ట్
-
'పదేళ్లు కలిసి ఉన్నాం.. రాజ్ తరుణ్ సమాధానం చెప్పాలి': లావణ్య కామెంట్స్
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్ను కలిసేందుకు వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. ప్రసాద్ ల్యాబ్లో తిరగబడరా సామీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా లావణ్య అక్కడికి వెళ్లేందుకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లావణ్యను వెళ్లకుండా నిలువరించారు. దీంతో నా భర్త రాజ్ తరుణ్తో నన్ను మాట్లాడనివ్వండి అంటూ పోలీసులను కోరింది. నా భర్తతో మాల్వీ ఎందుకు వచ్చిందని లావణ్య ప్రశ్నించింది. భర్తతో సంసారం చేసినట్లుగా మాల్వీ ఎందుకు కలిసి ఉంటోందని మాట్లాడింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి.. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని లావణ్య కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నన్ను ఎందుకు రాజ్ తరుణ్ను కలవకుండా చేస్తున్నారు. నాకు రాజ్ సమాధానం కావాలి. నా భర్త నాకు కావాలి. నా నుంచి ఎన్నిసార్లు తప్పించుకుంటాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మాది లవ్ మ్యారేజ్. పెళ్లి ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టుకు అన్ని ఆధారాలు ఇచ్చాను. నాతో పదేళ్లు కలిసి ఉన్నాడు. నాకు అబార్షన్ రెండుసార్లు చేయించాడు. నా ఇంటి నుంచి అతనే పారిపోయాడు. నేను ఒక సాధారణ అమ్మాయిని. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాట్లేదో మీకే తెలియాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ' అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ టాలీవుడ్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. తాను రాజ్ తరుణ్తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు లావణ్య ఆరోపించింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు కామెంట్స్ చేసింది. -
నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్పై రాజ్ తరుణ్ రియాక్షన్
కొద్దిరోజులుగా రాజ్ తరుణ్పై లావణ్య చేస్తున్న ఆరోపణలకు తాజాగా తిరగబడరసామీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కొన్నింటికి సమాధానాలు దొరికాయి. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జోడీగా నటించిన చిత్రం తిరగబడరసామీ.. ఇందులో మన్నారా చోప్రా కీలకపాత్రలో నటించింది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఆగష్టు 2న విడుదల కానున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో లావణ్య వివిదాం గురించి రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా స్పందించారు.లావణ్య అబార్షన్ గురించి రాజ్ తరుణ్ కామెంట్లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అందుకే ప్రతిసారీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. నేను లావణ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం లేదు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టే ఈ విషయంలో లీగల్గా వెళ్తున్నాను. నా వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆమెను చేస్తున్న ఆరోపణలకు సంభంధించి ఇప్పటి వరకు ఎవరూ ఆధారాలు అడగలేదు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలో ఆబార్షన్ గురించి లేదు. నిజమే అయితే, అందుకు సంబంధించిన మెడికల్ అధారాలు బయటపెట్టాలి.ఇక పెళ్లి గురించి మాట్లాడితే నాకు చాలా భయంగా ఉంటుంది. జీవితం లో పెళ్లి గోల వద్దు అనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల నేను నటించిన పురుషోత్తముడు సినిమా ప్రమోషన్కు రాలేకపోయాను. నేను కూడా మనిషినే.. నాపై కావాలనే నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నేను ఎక్కడికీ వెళ్లలేకపోయాను. నా 32 ఏళ్ల జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. వారం , పది రోజులుగా ఇంటికే పరిమితం అయ్యాను.. నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా భాదపడుతున్నారు. ' అని రాజ్ తరుణ్ తెలిపారు. ఈ వివాదం గురంచి కాస్త పక్కన పెడితే అంటూ తిరగబడరసామీ సినిమా గురించి రాజ్ తరుణ్ మాట్లాడారు. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడి పనిచేశారు. నిర్మాత కూడా ప్రాణం పెట్టి నిర్మించారు. మాల్వీ మల్హోత్ర చాలా గొప్ప నటి. టాలీవుడ్లో ఆమె ఇదే మొదటి సినిమా. కాబట్టి ఈ వివాదాలన్నీ కాస్త పక్కనపెట్టేసి ఆమెను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు రాజ్ తరుణ్ కోరాడు.నాపై దాడి చేసిన వారితో లావణ్య టచ్లో ఉంది: మాల్వీ మల్హోత్రలావణ్య చేస్తున్న ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె నాతోపాటు నా సోదరుడిపై చేసిన కామెంట్లకు ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చాను. జులై 24న కూడా లావణ్య మెసేజ్ చేసింది.. అదీ కూడా పోలీసులకు పంపాను. నా ఫ్యామిలీ కానీ, నేను కానీ ఆమెని ఎప్పుడూ కలవలేదు. మాపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో తెలియదు. 2020లో నాపై దాడి చేసిన కొంతమంది క్రిమినల్స్తో ఆమె ఇప్పుడు టచ్లో ఉన్నారు. వారితో టచ్లో ఉండకూడదని ఆమెకు సలహా కూడా ఇచ్చాను. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్ అని అభిప్రాయపడుతున్నాను. లావణ్య గురించి ఇంతకు మించి ఏమీ మాట్లడలేను. లీగల్గా ఆమెపై చర్యలు తీసుకుంటాను. -
Audio Call: రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. లావణ్య-శేఖర్ బాషా ఆడియో లీక్!
-
రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. మరో సంచలన ఆడియో లీక్!
హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్ సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు పెట్టుకోవడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే రాజ్ తరుణ్కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను అందుబాటులో లేనని రిప్లై కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఆడియో కాల్లో లావణ్య.. ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంచలనంగా మారింది. ఇందులో లావణ్యకు, శేఖర్ భాషకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ శేఖర్ భాషను లావణ్య నిలదీసింది. మీరే రాజ్ తరుణ్ ఇల్లు కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారని లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకునే శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని.. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ భాషా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. -
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపెట్టిన లావణ్య..
-
Lavanya Namoju: ఆలయచిత్రం
గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు. మన సంస్కృతి కోసం‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.రాక్ స్టోన్స్ పై జంతువులు‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.వెడ్డింగ్ లైవ్ ఆర్ట్‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.– నిర్మలారెడ్డి -
రాజ్ తరుణ్ కు బిగుసుకుంటున్న ఉచ్చు..! నార్సింగి పోలీసుల నోటీసులు
-
రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఏముంది
-
హీరో రాజ్ తరుణ్కి నోటీసులు పంపిన పోలీసులు
పోలీస్ కేసులతో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల ముందు మీడియా ముందుకొచ్చిన లావణ్య అనే అమ్మాయి.. ఈ కుర్ర హీరోపై హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ కేసులో రాజ్ తరుణ్కి పోలీసులు నోటీసులు పంపించారు. ఈనెల 18 లోపు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద ఇతడికి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి ఆరోపణలు చేసింది. నటి మాల్వీ మల్హోత్రా పరిచయమయ్యాక తనని పట్టించుకోవడం మానేశాడని, దీని గురించి అడిగితే నోటికొచ్చినట్లు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో ఇరికించడం వల్ల 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనని బెదిరించారని లావణ్య చెప్పుకొచ్చింది.లావణ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మాల్వీ, ఈమె సోదరుడు మయాంక్పై కేసు నమోదు చేశారు. రీసెంట్గా రాజ్ తరుణ్ తనకు దూరమైపోతాడేమో అనే బాధతో లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ మేరకు పోలీసులు ఈమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి) -
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. మాల్వీ మల్హోత్రాపై సంచలన ఆరోపణలు!
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ రోజుకోక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులతో ఫుల్ హాట్ టాపిక్గా మారింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో కేసులు కూడా నమోదయ్యాయి. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహా పలువురిపై రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. ఇటీవల లావణ్య సూసైడ్ చేసుకుంటున్నానంటూ పోలీసులను పరుగులు పెట్టించించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా ఎపిసోడ్పై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమ పేరుతో తమ ఆస్తులని లాక్కుందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడంటూ తమ కుమారున్ని జైలుకు పంపించిందని వెల్లడించింది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఫ్లైట్ టికెట్స్, మెసేజెస్ వీడియో కాల్స్, కాల్ లిస్ట్ను ఆమె బయటపెట్టింది. తన కొడుకు యోగేశ్ను ట్రాప్ చేసి జైలుకు పంపించిందని మాల్వీ మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. తాజా ట్విస్ట్తో రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రా- లావణ్య టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది. -
రాజ్ తరుణ్ ప్రేయసితో గొడవ.. మరోవైపు మాల్వీ ఆల్బమ్ సాంగ్ రిలీజ్
యువ హీరో రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి వల్ల ఎంతలా రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాయి. తనని మోసం చేసిన రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వలలో పడ్డాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ కేసుల వేస్తోంది. ప్రతిగా మాల్వీ కూడా లావణ్యపై కేసు పెట్టింది. గత కొన్నిరోజుల నుంచి ఈ తతంగం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇది ఇలా ఉండగానే తాను నటించిన ఆల్బమ్ సాంగ్ని మాల్వీ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: వీడియో కాల్లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?)'షాబానో' అంటూ సాగే ఈ పాటని ఇప్పుడు రిలీజ్ చేయడం ఓ విధంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అయితే ఈ పాటని ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పుడిలా రాజ్ తరుణ్-లావణ్య-మాల్వీ మల్హోత్రా మధ్య నడుస్తున్న వివాదం వల్ల ఈ పాటకు కాస్త క్రేజ్ ఏర్పడింది. ఆ పాట ఏంటనేది మీరు చూసేయండి.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!) -
అర్ధరాత్రి లావణ్య నుంచి షాకింగ్ కాల్
-
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్
-
తాను చనిపోతానంటూ లాయర్ కు లావణ్య మెసేజ్
-
'రాజ్ తరుణ్ ఫోన్ నుంచే కాల్ చేసింది'.. ఆమెపై లావణ్య షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్కు రిలేషన్ ఉందని ఆరోపించిన లావణ్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్బాస్ బ్యూటీ అరియానా గ్లోరీతో రిలేషన్ ఉన్న మాట నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరీతో రాజ్తరుణ్కు ఎఫైర్ ఉందని మీకెలా తెలుసు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.లావణ్య మాట్లాడుతూ..' ఎందుకు నీ చట్టు తిప్పుకుంటున్నావ్ ఓ సారి నేను అరియానా గ్లోరీని అడిగా. ఒక అబ్బాయితో అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. హీరోతో మామూలుగా మాట్లాడి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు. తనే రాజ్ తరుణ్ను బాయ్ఫ్రెండ్గా భావించింది. వాళ్లు దిగిన ఫోటోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్.. అరియానా గ్లోరీ ఇంటికి వస్తున్నాడని నాకు కొందరు చెప్పారు. ఆ తర్వాత నేను గోవాలో ఉండగా.. రాజ్ తరుణ్ ఫోన్ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడింది. నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని అడిగింది. నాకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తోందంటూ నాతో ఇన్సల్ట్గా మాట్లాడింది. ఆ తర్వాత అరియానా నాకు సారీ చెప్పింది. ఆ ఆడియో కూడా నా వద్ద ఉంది. ఇప్పుడైతే ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవ్' అని లావణ్య చెప్పుకొచ్చింది. కాగా.. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
నాకు దూరం చేస్తా అని ఛాలెంజ్ చేసింది..
-
రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక ట్విస్ట్
-
హీరో రాజ్తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్!
టాలీవుడ్ హీరో రాజ్తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్తరుణ్తో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్తరుణ్ను ఏ1గా, మాల్వీని ఏ2గా, మయాంక్ని ఏ3గా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినుట్ల పోలీసులు తెలిపారు.లావణ్యకు అబార్షన్ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి జులై 5న నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగి పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్ని పోలీసులు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్తరుణ్తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు తన కుటుంబం అదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని.. రాజ్తరుణే అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది.డ్రగ్స్ కేసులో ఇరికించారురాజ్తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. ‘జనవరిలో నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్ చేశారు. 45 రోజుల పాటు నేను జైలులో ఉన్నాను. రాజ్తరుణ్, మాల్వి కలిసే ఇదంతా ప్లాన్ చేశారు. బయటకు వచ్చాక ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరించారు’ అని లావణ్య ఆరోపించింది. -
రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
-
రాజ్తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. మరోసారి లావణ్య ఫిర్యాదు..
మణికొండ/బంజారాహిల్స్: ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర కేసుల తరుణంలో సినీహీరో రాజ్తరుణ్ వ్యవహారం సినిమా స్టైల్లో అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఇరువర్గాలను పిలిచి నిజానిజాలు నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రాజ్తరుణతో 11 ఏళ్ల లివింగ్ రిలేషన్లో ఉన్నానని, ఇప్పుడు మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తన వద్దకు రావటంలేదని, మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక్ తనను చంపుతానని బెదిరించాడని ఇదివరకే ఫిర్యాదు చేసిన లావణ్య మంగళవారంరాత్రి నార్సింగి పోలీస్స్టేషన్లో మరో ఫిర్యాదు చేసింది. ముందుగా చేసిన ఫిర్యాదుకు ఆధారాలను చూపాలని పోలీసులు ఆమెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన న్యాయవాదితో కలిసి ఆధారాలను, 175 ఫొటోలు, స్క్రీన్చాట్లు, వీడియోలు, కాల్ రికార్డ్లు అందజేసినట్టు తెలుస్తోంది. రాజ్తరుణ్తో తనక 10 ఏళ్ల క్రితమే గచ్చబౌలిలోని ఎల్లమ్మగుడిలో వివాహమైందని, తనకు గర్భం రావటంతో ఓ ఆస్పత్రిలో అబార్షన్ కూడా చేయించారని తెలిపింది. రాజ్తరుణ్కు గతంలోనూ మరికొంత మంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. తాను అని్వక పేరుతో పాస్పోర్టు పొందానని, తామిద్దరం కలిసి ఇదివరకు విదేశాలకు కూడా వెళ్లామని తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఆధారాలను పరిశీలించి రాజ్తరుణపై కేసులు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. త్వరలోనే రాజ్తరుణ్ను విచారించి అసలు నిజాలను వెలుగులోకి తెస్తామని పేర్కొన్నారు. లావణ్యపై మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు లావణ్య అనవసరంగా వివాదంలోకి లాగి తన పరువుకు భంగం కలిగిస్తోందని, తన సోదరుడికి ఇష్టారాజ్యంగా మెసేజ్లు పెట్టి బెదిరిస్తోందని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాయదుర్గం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనది హిమాచల్ప్రదేశ్ అని, తల్లిదండ్రులు అక్కడే ఉంటారని, తాను మాత్రం ముంబైలో ఉంటానని, ‘తిరగబడరా స్వామీ’సినిమాలో నటించానని, ఈ సినిమా నిమిత్తమే హైదరాబాద్కు వచ్చి స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నానని వెల్లడించారు. ఫిర్యాదుపై పో లీసులు జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి ఫిలింనగర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. -
బీరు బాటిళ్లతో దారుణంగా.. రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య సంచలనం
-
లావణ్యపై మరో ఫిర్యాదు చేసిన సినీ నటి మాల్వి మల్హోత్రా
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు: లావణ్య
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి పోలీసులని ఆశ్రయించింది. తన మాజీ ప్రియుడితో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై మళ్లీ కేసు పెట్టింది. తనతో పాటు తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని మాల్వీ.. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లావణ్య ఇప్పుడు మరో కేసు పెట్టింది. దీనితో పాటు స్క్రీన్ షాట్స్, మరికొన్ని ఆధారాలని ఫిర్యాదుతో పాటు సమర్పించింది. ఈ క్రమంలోనే మరోసారి రాజ్ తరుణ్తో తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్)గత పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని చెప్పిన లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పి షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్, వివరాలు సమర్పించింది. అయితే లావణ్య అని కాకుండా అన్విక పేరుతో తామిద్దరం కలిసున్నామనే చెప్పుకొచ్చింది. ఇదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లొచ్చామని రివీల్ చేసింది. అయితే మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్) -
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-అతడి మాజీ ప్రియురాలు లావణ్య మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా నిలిచిన నటి మాల్వి మల్హోత్రా.. లావణ్యపై మరో ఫిర్యాదు చేసింది. తనని, తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జోరీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుని ఫిలిం నగర్ స్టేషన్కి పోలీసులు బదిలీ చేశారు. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని మాల్వీ తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)ఈ కేసు పూర్వాపరాలకు వస్తే.. రాజ్ తరుణ్ తను కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నామని, కానీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడని చెబుతూ లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చింది. మాల్వి, ఆమె తమ్ముడు కలిసి తనని బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్ని వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా రాజ్ తరుణ్ లావణ్యపై కేసు పెట్టాడు. గతంలో ఈమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని, కానీ ఇప్పుడు మస్తాన్ అనే వేరే వ్యక్తితో ఈమె రిలేషన్లో ఉందని అన్నాడు.మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందని చెప్పి నటి మాల్వి మల్హోత్రా పోలీస్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది. తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. మరి రోజుకో టర్న్ తీసుకుంటున్న ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్) -
కీలక ఆధారాలతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ లవర్
-
రాజ్ తరుణ్ తో ఉన్న సంబంధం ఇదే...
-
రాజ్తరుణ్పై ఆధారాలతో మరో ఫిర్యాదు చేస్తా
మణికొండ: సినీ హీరో రాజ్తరుణ్ తనతో కలిసి లివింగ్ రిలేషన్లో ఉండటం, గుడిలో పెళ్లి చేసుకోవటం, నన్ను ఫోన్లో చంపేస్తానని బెదిరించిన రికార్డులు అన్నీ ఉన్నాయని, వాటన్నింటినీ జతచేస్తూ న్యాయవాదితో కలిసి త్వరలోనే నార్సింగి పోలీసులకు మరో ఫిర్యాదు చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. ఆదివారం ఆమె నగరంలో మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో పరిచయం అయిన తరువాతనే రాజ్తరుణ్ పూర్తిగా మారిపోయాడన్నారు. తనను వదలించుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారన్నారు. గతంలో డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేక పోయినా బలవంతంగా అందులో ఇరికించారని, త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. నార్సింగి పోలీసులు ఆధారాలు ఇవ్వాలని నోటీసు ఇచ్చారని, గతంలో తను ఇచి్చన ఫిర్యాదు సరిగా లేదనే విషయం తెలుసుకుని ప్రస్తుతం న్యాయవాదితో తయారు చేయించి పూర్తి ఆధారాలతో మరో ఫిర్యాదు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కలి్పంచాలని ఆమె కోరింది. -
లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: రాజ్ తరుణ్ హీరోయిన్
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఇప్పటికే వీరిద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. అంతే కాకుండా తనను చంపేస్తానని బెదిరిస్తోందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.అయితే లావణ్య చేస్తున్న ఆరోపణలపై తిరగబడరా స్వామి మూవీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రియాక్ట్ అయింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని మాల్వీ కొట్టిపారేసింది. నా కుటుంబం గురించి ఆమె చేసిన కామెంట్స్ నిజం కాదని తెలిపింది. ఆమెపై తప్పకుండా ఫిర్యాదు చేస్తానని.. పరువునష్టం దావా వేస్తానని వెల్లడించింది. మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ..'ఆమె నా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్ తీసుకుంది. అవీ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎలా సేకరించిందో తెలియాలి. లావణ్యను నేను ఇప్పటివరకు కలవలేదు. ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంతే కాదు.. తన గురించి నాకేలాంటి వివరాలు తెలియదు. నేను కేవలం సినిమా గురించి మాత్రమే రాజ్ తరుణ్తో మాట్లాడతా. సెప్టెంబర్ నుంచి నాకు, రాజ్ తరుణ్కు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నాపై లావణ్య చేస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. దీనివల్ల నా రిప్యూటేషన్ దెబ్బతింటుంది. తప్పకుండా ఆమెపై పరువునష్టం దావా వేస్తా.' అని హెచ్చరించారు. కాగా.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా తిరగబడరా స్వామి చిత్రంలో నటిస్తున్నారు. -
'రాజ్ తరుణ్కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్'.. లావణ్య షాకింగ్ కామెంట్స్!
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్ తామిద్దరం 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని.. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్కు చాలామంది హీరోయిన్స్తో రిలేషన్స్ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నాకు రాజ్ తరుణ్కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్లో ఉన్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్గేమ్ ఆడారు. ఆ గేమ్లో నేను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను.' అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. 'నేను, మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతను కేవలం నా మ్యూచ్వల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతనితో రిలేషన్లో ఉన్నట్లేనా? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదు. అతని కోసం చాలా భరించాను. రాజ్ తరుణ్కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి. ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
రాజ్ తరుణ్తో ఎఫైర్పై స్పందించిన మాల్వి మల్హోత్రా
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్తరుణ్పై కోకాపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హీరో రాజ్తరుణ్ తనతో సహజీవనం చేస్తూనే మరో పక్క మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా స్పందించింది.మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. 'రాజ్తరుణ్తో నటించిన ప్రతీ హీరోయిన్ను లావణ్య అనుమానిస్తుంది. ఇప్పటి వరకు ఆమెతో నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను తనను బెదిరించలేదు. లావణ్యనే ప్రతిరోజూ నాకు మెసేజ్లు, కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తోంది. రాజ్ తరుణ్ నా సహ నటుడు మాత్రమే. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆమె చెబుతున్నవన్నీ అబద్దాలే' అని పేర్కొంది.చదవండి: హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!'రాజ్తరుణ్తో నాకు పెళ్లి అయినట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదు. ఆమె ఇలాంటి కథలు చెబుతుంది. లావణ్య చేస్తున్న టార్చర్ భరించలేక ఆమె నంబర్ను నేను బ్లాక్ చేశాను. ఈ విషయాన్ని రాజ్తరుణ్తో కూడా చెప్పాను. ఆ సమయంలో ఆమె నా తల్లదండ్రులకు కూడా ఫోన్ కాల్స్ చేసి వార్నింగ్ ఇచ్చింది. నా కుటుంబ సభ్యులు నంబర్స్ రాజ్తరుణ్ వద్ద కూడా లేవు. ఆమె ఎలా సంపాధించిందో తెలాల్సి ఉంది. ఆమె కాల్స్ చేసి భూతులు మాట్లాడుతుంది. తనకు ఎలాంటి సిగ్గులేదు. సమస్య వారిద్దరిదీ. కానీ, ఈ గొడవలు నా పేరు ఎందుకు తీస్తుందో తెలియదు. ఆమె టార్చర్ భరించలేకనే నేను ఎనిమి నెలలుగా రాజ్తరుణ్తో టచ్లో లేను. సినిమా విడుదల సమయంలో మాత్రమే ఆయనతో మాట్లాడుదానిని. మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. ఇలాంటి రూమర్స్ ఇంతటితో ఆపేస్తే మంచిది. ఇప్పుడు నేను కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తా.' అని మాల్వి మల్హోత్రా తెలిపింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్ పోలీస్స్టేషన్కు చేరుకుంది. -
రాజ్ తరుణ్ - లావణ్య కేసులో ట్విస్ట్
-
హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్తరుణ్పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదకొండేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ పిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కేసులో నార్సింగి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పిర్యాదులో పేర్కొన్న ఆధారాలు సమర్పించాలంటూ తిరిగి లావణ్యకే నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం లావణ్య ఫిర్యాదు చేయగా.. సాయంత్రమే పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన నాలుగు పేజీల ఫిర్యాదు ఫార్మాట్లో లేదని,నేరం జరిగితే సమయం, ప్లేస్..ఇలాంటి వివరాలేవి అందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. లావణ్య చేసిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వమని నోటీసులు ఇచ్చినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు లావణ్య అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది.ప్రాణహానీ ఉంది: లావణ్యహీరో రాజ్తరుణ్ తనతో సహజీవనం చేస్తూ మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు రాజ్తరుణ్, మాల్వి కలిసి ఇటీవల గోవా, చెన్నై, పాండిచ్చేరిలకు కలిసి వెళ్లారని, ఇదే విషయాన్ని నిలదీస్తే తనను దూరం పెట్టాడని పేర్కొంది. రాజ్తరుణ్ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తామని హీరోయిన్ సోదరుడు బెదిరించాడని తెలిపింది. తనకు ప్రాణహానీ ఉందని, కాపాడాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే అధారాలు సమర్పించాలని పోలీసులు లావణ్యను కోరారు.రిలేషన్లో ఉన్న మాట నిజమే కానీ.. : రాజ్తరుణ్లావణ్య ఫిర్యాదు తర్వాత రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ..గతంలో ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని.. విడిపోయి చాలా కాలం అవుతుందని చెప్పారు. 2014 నుంచి 2017 వరకు లావణ్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నానని చెప్పారు. తనకు మందు, సిగరేట్తో పాటు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఎన్నిసార్లు చెప్పినా మానేకపోవడంతో తాను బయటకు వచ్చానని చెప్పారు. -
రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్
-
ఆమె అలవాట్లు చూసి భయపడ్డా.. అందుకే నా ఇంటి నుంచి బయటికి వచ్చేశా: రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నారని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణల పై హీరో రాజ్ తరుణ్స్పందించాడు. తన రిప్యూటేషన్ ఎక్కడా దెబ్బతింటుందో అని ఇన్నాళ్లు బయటికి చెప్పలేదని అన్నారు. అంతే కాకుండా తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేనని తెలిపారు.నా ఇంటి నుంచే బయటికి వచ్చేశా..తాను గుంటూరులో నా ఇంటిలోనే ఉండేదని రాజ్ తరుణ్ వెల్లడించారు. నా సొంతింట్లినే లావణ్య పైన ఉండేదని.. అక్కడ మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసి ఉన్నారని తెలిపారు. తనకు మందు, సిగరెట్ అలవాటు ఉందని.. డ్రగ్స్ నా జీవితంలో ఎప్పుడు తీసుకోలేదని అన్నారు. మస్తాన్ సాయి.. ఆమెను విపరీతంగా కొట్టేవాడని.. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయన్నారు. అతనిపై కేసు పెట్టి కూడా.. నా ఇంట్లోనే మళ్లీ అతనితోనే ఉంటోందని అన్నారు. ఆమె అలవాట్లు నచ్చక నేను ఇంటి నుంచి బయటికి వచ్చేశానని తెలిపారు. ఒక అమ్మాయికి చెందిన అశ్లీల ఫోటోలు, వీడియోలు పెట్టుకుని వాళ్ల ఫాదర్ను బ్లాక్మెయిల్ చేసిందని రాజ్ తరుణ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కేవలం నా ఇమేజ్ దెబ్బతింటుందని పోలీసులకు చెప్పేందుకే బయపడ్డానని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా.. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. లావణ్యకు కూడా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నా ఇంటి కోసమే ఈ రచ్చ అంతా చేస్తోందని ఆయన ఆరోపించారు.ఆమెపై కృతజ్ఞత ఉంది.. కానీ..ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని.. కానీ అది కేవలం 2014 నుంచి 2017 వరకు మాత్రమేనని రాజ్ తరుణ్ అన్నారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వివరించారు. డ్రగ్స్ తీసుకోవద్దని తనకు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ఆమెతో ఏడేళ్లుగా దూరంగానే ఉంటున్నానని.. ఇప్పటికీ ఆమెపై తనకు కృతజ్ఞత ఉందని.. అందుకే నా ఇంటి నుంచి నేనే బయటికి వచ్చేశానని రాజ్ తరుణ్ వెల్లడించారు. నాపైనే కాదు... మస్తాన్ సాయిపైనా కేసు పెట్టింది ఇప్పుడు కూడా అతనితోనే...Raj Tarun Reveled Shocking Facts, Lavanya Relationship With Mastan Sai#rajtarun #rajtaruncase #rajtarunloverlavanya #latestnews #sakshiNews pic.twitter.com/OSEgrah0Ae— Sakshi TV Official (@sakshitvdigital) July 5, 2024 -
రాజ్ తరుణ్ లవర్ లావణ్య సంచలన ఆడియో
-
రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
-
లీవ్ అడిగిన పాపానికి..
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి లావణ్య, సిబ్బంది నడుమ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. దీంతో అటెండర్ పుష్ప, ల్యాబ్ టెక్నీషియన్ నీరజ మంగళవారం వైద్యాధికారిణి లావణ్యపై శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనారోగ్య కారణాలతో లీవ్ కోసం అటెండర్ పుష్ప విన్నవించుకోగా పట్టించుకోక పోవడంతో తన భర్త ద్వారా టెలిఫోన్లో వైద్యాధికారిణిని మరోమారు విన్నవించే ప్రయత్నం చేశారు. అయితే అటెండర్ పుష్ప వ్యక్తిగత విషయాల గురించి ఆమె భర్తకు వైద్యాధికారిణి లావణ్య చెడుగా చెప్పడంతో కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో మూడు రోజుల క్రితం పుష్ప భర్త, భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఈ విషయమై ఆధారాలతో సహా పోలీసులకు అందజేసి న్యాయం కోసం అటెండర్ పుష్ప ఫిర్యాదు చేసింది. అలాగే హాస్పిటల్లోని ల్యాబ్ టెక్నీషియన్ నీరజతో కూడా దురుసుగా ప్రవర్తించడం, తరచూ విధుల నిర్వహణలో తన పట్ల భేదాభిప్రాయంతో వ్యవహరిస్తోందని, వీరిద్దరూ శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ గౌస్పీర్ను వివరణ కోరగా పీహెచ్సీ డాక్టర్పై రెండు ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!
-
మహిళ చేతిలో నారా లోకేష్ చిత్తు చిత్తు..
-
వాళ్ల దగ్గర ఉన్నంత డబ్బు లేదు.. మంగళగిరి ముఖాముఖిలో చంద్రబాబు, లోకేష్ను ఏకేసిన సీఎం జగన్
-
బాబు బ్యాచ్ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. కాగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేది. దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్ అందించిన ప్రభుత్వం మనది. పెన్షన్ను రూ.3వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చింది. 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్ ఇవ్వరు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్ ఇచ్చాము. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసిన ప్రభుత్వం మనదిఅని తెలిపారు. పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా?. మేనిఫెస్టోలో చెప్పే ప్రతీ హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది. మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది చంద్రబాబే. అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయండి’ అని కోరారు. -
సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్ అబ్బాయి
ఖమ్మం: వారి ప్రేమ ఖండాంతరాలు దాటి వివాహ బంధంతో ఏకమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కళాశాల డైరెక్టర్ మందడపు సత్యనారాయణ – సుజని దంపతుల కుమార్తె లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ దేశంలోని బార్సిలోనలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. సత్తుపల్లిలోని శ్రీసాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్ధరాత్రి 12.53 నిమిషా లకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఇవి చదవండి: శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు -
ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం
-
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు