Madhavi
-
మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో ముగ్గురు హత్య చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఆ ముగ్గురిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అవసరమైతే గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడిని రిమాండ్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మీర్పేట పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి గురుమూర్తిని విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. సరూర్నగర్లోని సీసీఎస్ లేదా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వరకు వరకు అతన్ని విచారణ చేయనున్నట్లు సమాచారం.ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేశాడు.మరోవైపు.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఉన్మాదిలా మారి.. 70 సార్లు కత్తితో పొడిచి.. -
నా దారి రహదారి
అవని నుంచి అంతరిక్షం వరకు మహిళలు అసాధారణ విజయాలు సాధించి తమ సత్తా చాటుతున్నా.... ఇంకా లింగవివక్షతతో కూడిన బోలెడు ఆశ్చర్యాలు మిగిలే ఉన్నాయి. ఫిలింనగర్ బస్తీలో మక్కల మాధవి బస్ డ్రైవర్గా స్టీరింగ్ పట్టినప్పుడు... ‘ఇదేందీ!’ అని ఆశ్చర్యపోయిన వాళ్లే ఎక్కువ. ‘పెద్ద బస్పు నడపడం నీ వల్ల ఏమవుతుందమ్మా!’ అని నిరాశ పరిచిన వారే ఎక్కువ. అయినా సరే...‘నా దారి రహదారి’ అంటూ మాధవి దూసుకువెళుతూ తన డ్రైవింగ్ స్కిల్స్తో శభాష్ అనిపించుకుంటోంది...హైదరాబాద్ ఫిలింనగర్లోని గౌతమ్నగర్ బస్తీలో నివసించే మక్కల మాధవి భర్త రాజేష్ ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ బస్సు డ్రైవర్గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇదే బస్సులో మాధవి అటెండర్గా పని చేసేది. భర్త బస్సు నడుపుతున్న తీరు చూసి డ్రైవింగ్పై ఆసక్తి పెంచుకుంది. స్కూల్ మైదానంలో భర్త ద్వారా డ్రైవింగ్లో శిక్షణ తీసుకొని ఏడాది క్రితం నుంచే బస్సు నడపడం మొదలుపెట్టింది. స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్తోపాటు టీచర్లు కూడా ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ప్రోత్సహించారు. పూర్తి అనుభవం వచ్చాకే స్కూల్ బస్సు నడుపుతానని జేహెచ్పీఎస్ యాజమాన్యానికి తెలియజేసింది.డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన మాధవిని చూసి ‘బక్కపల్చగా ఉన్న ఈమె బస్సు ఏం నడుపుతుంది!’ అని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా బస్సు నడపడానికి తిరస్కరించారు. అయితే మాధవి ఏమాత్రం నిరాశ పడలేదు. మూడోసారి వెళ్ళి ఒకసారి తాను బస్సు నడపడం చూడాలని, నచ్చకపోతే లైసెన్స్ ఇవ్వొద్దని వేడుకుంది. ఎత్తు, ఒంపుల్లో బస్సును నడిపించి ఎలాగైనా అనర్హురాలిగా చేసి పంపాలనుకున్న అధికారులు మాధవి బస్సు నడిపించే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. పరీక్షలో పాస్ కావడంతో మాధవికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను మరింత ప్రోత్సహిస్తూ పిల్లలను తీసుకురావడం, ఇంటి దగ్గర దింపేందుకు బస్సు నడిపే బాధ్యతను అప్పగించింది. గో ఎ హెడ్డ్రైవింగ్ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త కాస్త భయపడ్డాడు. అయితే నాకు నేర్పించే క్రమంలో గ్రౌండ్లో నా డ్రైవింగ్ చూసి ఆయనకు భయం పోయింది. దీంతో మెల్లమెల్లగా ప్రతిరోజూ అదే గ్రౌండ్లో రెండు గంటలపాటు డ్రైవింగ్ప్రాక్టిస్ చేసేదాన్ని. బస్సు డ్రైవింగ్ పూర్తిగా వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కూల్ యాజమాన్యం, టీచర్లు వెన్ను తట్టి ప్రోత్సహించడం, బస్సు నడుపుతున్నప్పుడు గో ఏ హెడ్ అని పిల్లలు అరవడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.– మక్కల మాధవి – పురుమాండ్ల నరసింహారెడ్డి,సాక్షి, హైదరాబాద్ -
మీర్పేట మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మీర్పేట వెంకట మాధవి హత్య కేసులో ఎట్టకేలకు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు.. మధ్యాహ్నాం అరెస్టును ధృవీకరించారు. అంతకు ముందు.. మాధవి కనిపించకుండా పోయిందన్న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కేసును ఇప్పుడు మర్డర్ కేసుగా మార్చారు. సాయంత్రం నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. ఆమెను హతమార్చాక.. మలయాళ సినిమా సూక్ష్మదర్శిని ప్రేరణతో మృతదేహాన్ని మాయం చేశాడు గురుమూర్తి. ఆ తర్వాత కూడా సినిమా టికెట్లు బుక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రకరకాల ప్రచారాలు మీడియాలో జరగ్గా.. సాయంత్రం ప్రెస్మీట్లో పోలీసులు ఆ విషయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.భార్య మాధవితో గొడవ పడి ఆమెను హతమార్చి.. ఆపై మృతదేహాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు గురుమూర్తి. ఆపై ఆ మాంసాన్ని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్పై కాల్చాడు. చివరకు ఎముకల్ని పొడి చేసి చెరువులో కలిపాడు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆ సినిమా చూసి.. మాధవి కేసులో మరిన్ని కొత్త విషయాలు!
హైదరాబాద్, సాక్షి: సంచలనం సృష్టించిన మీర్పేట వెంకట మాధవి హత్య కేసులో.. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని ప్రేరణతోనే గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు.. ఈ కేసు దాదాపుగా ఓ కొలిక్కి రావడంతో నిందితుడిపై పోలీసులు చర్యలకు దిగనున్నారు.వెంకట మాధవి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో అనే ఆలోచనలో గురుమూర్తికి ఈ ఆలోచన తట్టింది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలోనే మృతదేహాన్ని డిస్పోస్ చేశాడు గురుమూర్తి. ఆ చిత్రంలో మాదిరే.. భార్య మాధవి మృతదేహాన్ని కెమికల్స్లో నానబెట్టి, ఆపై కాల్చి పొడి చేశాడు గురుమూర్తి. ఇవాళ డీఎన్ఏ రిపోర్ట్తో పాటు క్లూస్టీం ఆధారంగా ఇచ్చే నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీంతో.. సాయంత్రంలోగా నిందితుడపై యాక్షన్కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.నజ్రియా, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో ఎం.సి.జతిన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’. మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ హాట్స్టార్లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. తన చుట్టు పక్కల జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉన్న ఇల్లాలు.. తన పక్క ఇంట్లో జరిగిన ఓ ఘోరమైన నేరాన్ని ఎలా బయట పెట్టిందన్నది ఈ చిత్ర కథ.దుర్వాసన రాకుండా..మీర్పేట పరిధి జిల్లెలగూడ న్యూవెంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే మాజీ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశం జిల్లాలోని సొంతూరులో మరో మహిళతో వివాహేతర బంధం వ్యవహారం తెలిసినప్పుడు భార్య తరఫు కుటుంబీకులు గురుమూర్తిపై దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు భార్య మరణం విషయం తెలిస్తే దారుణంగా స్పందిస్తారేమోనని భయపడ్డాడు. ఇంటర్నెట్లో మృతదేహం ఎలా ముక్కలు చేయాలని వెతికాడు. చైతన్యపురిలో నర్సు హత్య ఉదంతంతోపాటు వెబ్సిరీస్లు, సినిమాల ప్రేరణ పొందాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో తలను వేరుచేసి మొండేన్ని మూడు ముక్కలు చేశాడు. ఆ తర్వాత బకెట్లో వేడినీటిలో ముక్కల్ని ఉడికించిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వాడాడు. సాయంత్రం వరకూ ఈ పనిపూర్తి చేసి మీర్పేటలోని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంకట మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక.. పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే దఫదఫాలుగా ఫోరెన్సిక్, క్లూస్టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు తల వెంట్రుకలు, స్టవ్, వాటర్ బకెట్, హీటర్ వద్ద కొన్ని రక్తం, ఆనవాళ్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి విశ్లేషించారు. ఇవన్నీ వెంకట మాధవివేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ పోలీసులకు కొత్త విషయాలు వెలుగు తెలుస్తున్నాయి. ఘటన తర్వాత ఎనిమిది సార్లు గురుమూర్తి ఫోన్ మాట్లాడాడు. అందులో.. బడంగ్పేటలో ఉన్న సోదరితోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితుడి ఫోన్ కాల్ డాటా సేకరణలో ఈ విషయాలు వెలుగు చూశాయి. -
మీర్పేట్ మాధవి కేసులో మరో సంచలనం.. వేడి నీటిలో ఉడికించి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో భాగంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. మాధవిని భర్త గురుమూర్తే దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. భార్య శరీర భాగాలను ముక్కలు చేసి ఉడికించడానికి పోటాషియం హైడ్రాక్సైడ్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు.మీర్పేట్ మాధవి హత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. తాజాగా పోలీసులు విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. మాధవిని హత్య చేసిన తర్వాత గురుమూర్తి.. ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి ఉడికించడానికి పోటాషియం హైడ్రాక్సైడ్ను వాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాత్రూంలో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. వాటిని వేడి నీటలో ఉడికించి, బొక్కలు పొడి చేసి బాత్రూమ్ ఫ్లస్ ద్వారా డ్రైనేజీలోకి పంపించాడని పోలీసులు గుర్తించారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్గా మారింది. అయితే, మృతదేహాన్ని నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క మొద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆ కత్తిని ఏం చేశాడు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.అసలు కారణం..సంక్రాంతి పండుగ కోసం భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు గురుమూర్తి. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది. పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి.. జనవరి 14న సాయంత్రం గురుమూర్తి, మాధవి తిరిగొచ్చారు. ఆ తర్వాత రోజు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి.. ఆమెను కొట్టి విసురుగా తోసేయడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో కంగారుపడిపోయిన గురుమూర్తి, కేసు తనపై రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని ముక్కులుగా కట్ చేశాడు.ఇంటి యజమాని కుటుంబంతో సహా బెంగళూరులో ఉండటం, పిల్లలు సోదరి ఇంట్లో ఉండటంతో గురుమూర్తికి కలిసొచ్చింది. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తనతో గొడవపడి అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్పేటకు వచ్చి.. అల్లుడితో కలిసి బంధువులు, తెలిసినవారి ఇళ్లలో వాకబు చేసింది. ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం, మాధవి ఇంట్లోంచి వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అతడిపైనే పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తానే భార్యను చంపినట్లు ఒప్పుకున్నాడు.వివాహేతర సంబంధం..కాగా, భార్య మాధవి బంధువుల అమ్మాయితో గురుమూర్తి సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మూడేళ్ల కిందటే గొడవ జరగడంతో ఇరువురూ తమ స్వగ్రామానికి వెళ్లడం మానేశారు. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పండగలు, వేడుకలకు వెళ్లలేకపోతున్నామని భార్యాభర్తలు తరుచూ దీనిపై గొడవపడినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని పెళ్లిచేసుకోడానికే భార్యను గురుమూర్తి హత్య చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ చిల్లెలగూడలో జరిగిన దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్ సిరీస్ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూసినట్టు పోలీసులు నిర్ధారించారు.మీర్పేట్కు చెందిన మాధవి హత్య కేసులో ఆమె భర్త, నిందితుడు గురుమూర్తిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక, ఇప్పటికే రెండుసార్లు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ సోదాలు నిర్వహించింది. అలాగే, సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు, మాధవి హత్య కేసులో ఇద్దరు పిల్లల స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. పిల్లల స్టేట్మెంట్ సందర్భంగా కూడా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ తల్లి కనిపించకపోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్టు పిల్లలు తెలిపారు. అలాగే, కుటుంబ సభ్యలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.ఇదిలా ఉండగా.. నిందితుడు విషయాలపై ఆధారపడకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో నేడు కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.జరిగింది ఇదీ.. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర దింపాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి భార్యకు గొడవ మొదలైంది. మరో మహిళతో సంబంధం, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు భార్య చూసింది. అప్పటికే భార్యను హతమార్చాలని కసితో ఉన్న గురుమూర్తి అనుకున్నంత పని చేశాడు. భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్సిరీస్లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.శరీరాన్ని ముక్కలుగా చేసి..ఆ తర్వాత బకెట్ నీళ్లను హీటర్తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పోలీసులకు గురుమూర్తి మీద అనుమానమొచ్చింది. మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకు వచ్చే దృశ్యాలు రికార్డవలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూస్టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. బకెట్లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.పోలీసులకే ట్విస్ట్.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు. -
రషీద్ సోదరుడిపై కేసు నమోదు చేయటం దారుణం: అడ్వొకేట్ రోళ్ల మాధవి
-
నాది కూడా సీమ రకమే గుర్తుపెట్టుకో జేసీ.. మాధవీలత స్వీట్ వార్నింగ్
-
ఎమ్మెల్యే మాధవీరెడ్డి సహా 8మంది కార్పొరేటర్లు సస్పెండ్
-
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
కూటమిలో కుంపట్లు జనసేన, టీడీపీ నేతల మధ్య కుర్చీల కోసం పోరాటం..
-
భారత్ రెగ్యులేటర్లు.. భేష్
ముంబై: భారత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు అత్యుత్తమ రీతిలో ‘‘ప్రపంచ ప్రమాణాల స్థాయి’’ విధులు నిర్వహిస్తున్నాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అలాగే వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి సైతం రెగ్యులేటర్లు కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా రెగ్యులేటర్లను ప్రశ్నించడానికి లేదా విమర్శించడానికి తాను వ్యతిరేకం కాదని ఆమె ఆ సందర్భంగా ఉద్ఘాటింటారు. అయితే రెగ్యులేటర్లు నిర్వహిస్తున్న అత్యున్నత బాధ్యతలు, ఎకానమీ పురోభివృద్ధిలో సహకారం పట్ల కూడా ‘అత్యంత స్పృహ‘ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్బెస్ట్ బ్యాంక్స్ అవార్డుల కార్యక్రమంలో అన్నారు.సెబీ విషయంలో బయటకు వస్తున్న వాస్తవాలను అందరూ పరిశీలించాలని కోరారు. సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రెగ్యులేటర్లపై చర్యలు తీసుకోవాలని చర్చించే ముందు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను’’ అని సీతారామన్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి లోనుకావడం లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లకు ధన్యవాదాలు బ్యాంకుల్లో పొదుపులు... పెట్టుబడుల్లోకి మారుతున్నాయన్న భయాలను ప్రస్తావిస్తూ, తక్కువ వడ్డీవచ్చే ఖాతాల వద్ద సౌకర్యవంతంగా కూర్చుండిపోకుండా, కొంత రిస్క్ తీసుకునిఎక్కువ రాబడులు పొందే వీలున్న మార్కెట్లలోకి మధ్యతరగతి భారతీయులు ప్రవేశించడానికి దోహదపడుతూ ‘‘గొప్ప సేవ’’చేస్తున్న డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లకు ధన్యవాదాలని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2014లో 2.31 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య సెపె్టంబరు 2024 నాటికి 17.1 కోట్లకు పెరిగాయన్న గణాంకాలను కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.బ్యాంకుల పటిష్టత అటు ఎకానమీని ఇటు కుటుంబాల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వాటి లాభదాయకతను ప్రభావితం చేసే రుణ నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె బ్యాంకింగ్కు సూచించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు విద్యాపరంగా అర్హత కలిగి ఉన్నారని, అయితే పారిశ్రామిక అవసరాల గురించి వారికి పెద్దగా తెలియడం లేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అరాచకాలు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావు అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ రైతును బెదిరించడమేకాకుండా, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కూడా గళ్లా రామచంద్రరావుకే మద్దతు పలుకుతుండటంతో బాధితుడు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు గుంటూరు విద్యానగర్లో నివాసం ఉంటున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల పొలం ఉంది. గళ్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర రియల్ ఎస్టేట్కు గతంలో వెంకటరావు ఎకరం రూ. 48 లక్షలు చొప్పున 4.90 ఎకరాలు అమ్మాడు. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ నాలుగున అగ్రిమెంట్ చేసుకుని మూడు చెక్కులు రామచంద్రరావు ఇచ్చాడు. ఆ చెక్కుల్లో రెండు బౌన్స్ అయ్యాయి. ఇది కాకుండా తాను అమ్మకుండా ఉన్న మిగిలిన భూమిలో భ్రమర వారు మట్టి తోలుతున్నారని తెలిసి వెంకటరావు వెళ్లి అడిగితే.. కాళ్లు విరగ్గొడతానని రామచంద్రరావు బెదిరించాడు. దీంతో వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తాము అగ్రిమెంట్ చేయించుకున్న 4.90 ఎకరాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజి్రస్టేషన్ కోసం భమ్రర వారు ప్రయతి్నంచగా.. 1బీ అడంగల్లో 3.90 ఎకరాలు మాత్రమే కనపడుతుండటంతో అంతవరకే రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించి బౌన్స్ అయిన చెక్కులు వెనక్కి తీసేసుకున్నారు. ఎన్నికలు అవ్వగానే వేధింపులు ఎన్నికలు ముగిసి రామచంద్రరావు భార్య మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంకటరావుకు వేధింపులు మొదలయ్యాయి. రిజి్రస్టేషన్ చేయకుండా మిగిలిన ఎకరాతో పాటు వెంకటరావు అమ్మకుండా ఉన్న 3 ఎకరాల 7 సెంట్ల భూమి రూ. 30 లక్షలు ఇస్తామని, రామచంద్రరావుకు పుట్టిన రోజు గిఫ్టుగా ఆ భూమి అంతా రిజి్రస్టేషన్ చేయాలంటూ రామచంద్రరావు అనుచరులు ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపుతాం అంటూ బెదిరించారు. ఈ క్రమంలో గడిచిన శనివారం వెంకటరావు, అతని కుమారుడు హరికృష్ణ బయటకు వచ్చి తిరిగి వెళ్తుంటే వారి బండిని ఢీకొట్టి దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పట్టాభిపురం పోలీసులు వెంకటరావు, అతని కుమారుడికి వేరేవారితో ఫోన్ చేయించి మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందని, ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మాట్లాడుకోండి అని చెప్పించారు. దీంతో పోలీసుల వద్దకు వెళ్తే తమకు న్యాయం దక్కదని భావించిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. గుంటూరుకు రామచంద్రరావే సీఎం లాంటివాడని, అతనిని కాదంటే బతకలేరంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఇటీవలే ఇంటికి వచి్చన తనపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని, తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే రామచంద్రరావే బాధ్యత వహించాలని హరికృష్ణ ఆవేదన వెలిబుచ్చాడు. -
పొలం బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వమని ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం
-
22న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ మాధవి పురీ బుచ్, ఆమె భర్త ధవళ్కు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ చేసిన సంచలన ఆరోపణలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వివాదంలో కేంద్ర బిందువుగా మారిన మాధవి వెంటనే రాజీనామా చేయాలని, అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనెల 22వ తేదీన దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచి్చంది.ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు, పీపీసీ చీఫ్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ తర్వాత పార్టీ ఈ ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక సమావేశంలో రాబోయే ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధత, సంస్థాగత అంశాలు, ఎన్నికలపరంగా జాతీయ ప్రాముఖ్యత గల వివిధ అంశాలు, సమస్యలపై ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించారు. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశీ్మర్లలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ‘‘అదానీ– మాధవి బుచ్ ఉదంతంలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉంది. ఒక సంస్థ ప్రయోజనాల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ఎంతగా ప్రలోభాలకు గురైందో ఈ ఉదంతం చాటుతోంది’’ అని నేతలు భేటీలో తీర్మానం చేశారు. భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హిండెన్బర్గ్ ఉదంతం సహా దేశంలోని పలు సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అందుకుతగ్గ ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. కేరళ వయనాడ్ కొండల్లో ప్రకృతి విలయతాండవం ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై సమావేశం తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేసింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్ డిమాండ్ను నేతలు పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్లో దాడులకు గురవుతున్న బాధిత మైనారిటీలు గౌరవంగా బతికేలా తగు సహాయక, పునరావాస చర్యలు తీసుకునేలా మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ సర్కార్పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పేదలు, మధ్యతరగతిని వంచించారు: ఖర్గే ‘‘స్టాక్మార్కెట్లో చిన్న మదుపరుల పెట్టుబడుల భవితవ్యం అగమ్యగోచరం కాకూడదు. హిండెన్బర్గ్ బట్టబయలుచేసిన సెబీ, అదానీల ఉదంతం యావత్భారతావనికి షాక్కు గురిచేసింది. సెబీ, అదానీ సంబంధాలను బయటపెట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నేతృత్వంలో దర్యాప్తు జరపాల్సిందే. రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది.కుల గణన అనేది ప్రజల డిమాండ్. ఈ అంశాలపై త్వరలో దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను చేపడదాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాల్సిందే. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, పగ్గాల్లేని ద్రవ్యోల్బణంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతిని ప్రభుత్వం వంచించింది. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి’’ అని ఖర్గే అన్నారు. -
ఈ ముగ్గురి మరణం.. మిస్టరీ
సనత్నగర్(హైదరాబాద్): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో నిర్జీవంగా పడి ఉండటం కలకలం రేపింది. మానసిక స్థితి సరిగా లేని కుమారుడికి స్నానం చేయించేందుకు బాత్రూమ్లోకి వెళ్ళిన భార్యభర్తలు.. కొడుకుతో సహా విగతజీవులుగా మారడం సంచలనం రేకె త్తించింది. అయితే వీరు విద్యుదాఘాతానికి గురయ్యారా? లేక కొడుకు మానసిక పరిస్థితి తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ? అనేది మిస్టరీగా మారింది. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జెక్కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా.. జెక్ కాలనీ నాల్గో వీధిలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఫ్లా్లట్ నంబర్ 204లో ఆర్.వెంకటేష్ (59), భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) నివాసం ఉంటున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్లో బిజినెస్ యూనిట్ హెడ్గా పనిచేస్తున్నాడు. 2004 నుంచి జెక్కాలనీలోనే నివాసముంటున్నారు. కుమారుడు హరికృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దగ్గరుండి తల్లిదండ్రులే అతని బాగోగులు చూసుకుంటున్నారు. ప్రతిరోజూ వారే కుమారుడికి స్నానం చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ముగ్గురూ బాత్రూంలో మృత్యువాత పడగా, వారి మృతికి కారణం ఏమై ఉంటుందా? అన్నది మిస్టరీగానే ఉంది. బాత్రూమ్లో గ్యాస్ ఆధారిత గీజర్ ఉండటంతో షార్ట్ సర్క్యూట్కు ఆస్కారం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడాన్ని బట్టి చూస్తే ముగ్గురూ ఒకేసారి బాత్రూమ్లోకి వెళ్లారని తెలుస్తోంది.ఇలా వెలుగులోకి వచ్చింది..ఇంట్లో పనిచేసే వరలక్ష్మి ఉదయం 11.30 గంటలకు వచ్చి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ముగ్గురూ బయటకు వెళ్ళి ఉంటారేమోనని భావించి యధావిధిగా క్లీన్ చేసి వెళ్ళిపోయింది. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి లేకపోవడంతో అటువైపు ఆమె వెళ్లలేదు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వరలక్ష్మి మళ్ళీ రాగా..పాల ప్యాకెట్, ఉదయం తాను చూసిన ఇతరత్రా వస్తువులు అలాగే ఉండడాన్ని చూసి ఇంకా వారు రాలేదేమోనని వెళ్లిపోయింది. సాయంత్రం 6 గంటలకు తోటి పనిమనిషి విజయలక్ష్మితో కలిసి మళ్లీ వచ్చింది. అయితే అనుమానం వచ్చిన వారికి వాచ్మన్ సత్యనారాయణను పిలిచి బాత్రూమ్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా డోర్కు అడ్డంగా హరికృష్ణ బట్టలు లేకుండా పడిఉన్నాడు. ఆ పక్కనే వెంకటేష్, మాధవి మృతదేహాలు పడి ఉన్నాయి. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి డర్టీ పాలిటిక్స్.. మహిళను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్మెంట్లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు. -
Ugadi 2024: ఆరు రుచులను కలపగా.. విరిసిన 'ఉగాది'
జీవితమనే చెట్టు గొప్ప గొప్ప లక్ష్యాల చిగుర్లు వేసింది ప్రయత్నాల పూత పూసింది విరివిగా కానీ చేదుగా; అభిమానం అడ్డొచ్చి పడింది పిందెలుగా అయితే గుత్తులు గుత్తులుగా, అంతలో.. చింత చిరాకుపడి, పులుపుని రేపడం మొదలుపెట్టింది ఊరుకోని పట్టుదల పచ్చపచ్చగా వ్యాపించి ఎదగడం మొదలుపెట్టింది; కటువుగా కారం చల్లినట్లు.. నిర్ణయాలు వాటి వాటి స్థానం తీసుకున్నాయి; ధైర్యం విషయ గుజ్జుని గ్రహించింది.. లోపాలకు వగరు మందేసింది.. పరిశ్రమ కఠోరంగా అన్నిటినీ కలిపంది.. విజయం తియ్యగా వరించింది కృతజ్ఞత ఎక్కువ మోతాదులో కాకుండా.. తగిన మోతాదులో ఉపయోగించాలని ఉప్పు ఉపదేశించింది.. మొత్తానికి కచ్ఛాపచ్ఛాగా పచ్చడవుతున్న జీవితం.. మాంఛి.. పసందైన షడ్రుచులతో నడుస్తున్నది! :::మాధవి మేళ్ళచెర్వు, గుంటూరు క్రోధి నామ సంవత్సర రాశిఫలాల కోసం క్లిక్ చేయండి -
డివైడర్ మధ్యలోని పూలు తెంపుకొని వస్తుండగా గర్భిణి విషాదం!
నిజామాబాద్: సంప్రదాయం ప్రకారం గోదావ రి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్తున్న ఐదు నెలల గర్భిణి.. మార్గమధ్యలో డివైడర్పై ఉన్న పూలను తెంపి, వాహనం వద్దకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. వివరాలిలా ఉన్నా యి. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్కు చెందిన కొమిరె మాధవి(25) ఐదు నెలల గర్భిణి. ఐదు నెలల సమయంలో గంగమ్మ పూజలు చేయడం వారి కుటుంబంలో ఆనవాయితీ. శుక్రవారం ఉదయం మాధవి భర్త గంగసాగర్, కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ జిల్లా సోన్ వద్ద గల గోదావరిలో స్నానాలు ఆచరించడానికి ఆటోలో బయలుదేరారు. మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద ఆటోను ఆపి జాతీయ రహదారి డివైడర్ మధ్యలోనున్న పూలను తెంపడానికి మాధవి వెళ్లింది. పూలను తెంపి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఓట్ల కోసం టీడీపీ చిల్లర రాజకీయం..!
-
ఎంపీ మాధవి కుమార్తెకు సీఎం నామకరణం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ మాధవి శివప్రపాద్ దంపతుల కుమార్తెకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నామకరణం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన మాధవి, భర్త శివప్రసాద్ అక్కడకు వచ్చిన సీఎం జగన్ను కలిశారు. వారి కోరిక మేరకు చిన్నారికి నామకరణం చేశారు. తాము కోరిన వెంటనే సీఎం నామకరణం చేయడం ఆనందంగా ఉందని, త్వరలో బారసాల నిర్వహించి సీఎం నామకరణం చేసిన పేరును ప్రకటిస్తామని ఎంపీ మాధవి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల కల్చరల్/వేములవాడ: న్యాయవాద వృత్తి లో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, ని రంతర అధ్యయనంతోనే రాణించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.మాధవీదేవి పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఏజేసీజే) కోర్టు భవనాన్ని హైకోర్టు మ రో న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్రావుతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులకు దిశానిర్దేశనం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో అమలులో ఉన్న వ ర్చువల్ విధానాన్ని రానున్న రోజుల్లో అన్ని కోర్టు లకూ విస్తరిస్తామన్నారు. జిల్లా కోర్టులోనూ ఈ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. కోర్టు సముదాయం కోసం కేటాయించిన స్థలం విషయంలో బార్ కౌన్సిల్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ జె.శ్రీనివాసరావు మాట్లాడు తూ కఠోరశ్రమ, నిజాయితీతో కొనసాగితే న్యాయ వృత్తిలో రాణించడం సులువేనన్నారు. సిరిసిల్ల, జగి త్యాల జిల్లాల న్యాయమూర్తులు ఎన్.ప్రేమలత, నీలిమ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ మాధవిదేవి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ కాజా శరత్ శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇప్పటికే ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉన్నప్పటికీ.. సుమారు 3,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి సంబంధించి సత్వర తీర్పు వెలువరించేందుకే మరో కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. భద్రాచలం బార్ అసోసియేషన్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను అందించిందని, బార్ అభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో ఫ్యామిలీ కోర్టు ప్రారంభం రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టు సము దాయంలో ఫ్యామిలీ కోర్టును హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జి.రాధారాణి శనివారం ప్రారంభించారు. అదేవిధంగా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ నూతన సంవత్సర కేలెండర్ను ఆవిష్కరించారు. హైకోర్టు జడ్జికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు స్వాగతం పలకగా.. పలువురు జడ్జిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొద టి అదనపు జిల్లా జడ్జి తిరుపతి, ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి.వేణు పాల్గొన్నారు. సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తా: జస్టిస్ పుల్లా కార్తీక్ చివ్వెంల(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో నెలకొన్న సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హైకోర్టు జడ్జి, సూర్యాపేట జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ పుల్లా కార్తీక్ అన్నారు. ఆయన శనివారం సూర్యాపేట జి ల్లాకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా న్యా యవాదులు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కార్తీక్ మాట్లాడారు. అంతకుముందు ఆయన పిల్ల లమర్రి శివాలయాన్ని, అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోండ్రాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
Madhavi Kattekola: జై జవాన్కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్ఆర్ఎల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
అల్లూరి జిల్లా వెలగల పాలెంలో మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు 8వ వర్ధంతి
-
భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలో హెడ్ కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్ (51) (హెచ్సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్ 1993లో కానిస్టేబుల్గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కం అగ్రిమెంట్తో పాటు మరో డాక్యుమెంట్ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్నోట్లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్ హాసం, ఎస్బీ సీఐలు అశోక్రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్బాషా, కడప మేయర్ కె.సురేష్బాబు, వైఎస్సార్సీపీ నాయకుడు అప్జల్ఖాన్, పులి సునీల్కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్కుమార్ కడప వచ్చి స్టేషన్లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్
వెండితెరపై అలరించిన అలనాటి తారలేందరో ప్రస్తుతం కనుమరుగయ్యారు. అందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. 80,90లో తమ అందం, అభిమనయంతో ఆకట్టుకున్న ఎంతో స్టార్ హీరోయిన్స్ వెండితెరకు దూరమై పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో సీనియర్ నటి, ‘మాతృదేవోభవ’ ఫేం మాధవి ఒకరు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన తెనె కళ్లలతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు. చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక మాధవి గ్లామర్, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్ పీక్లో ఉండగానే మాధవి సడెన్గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్ ఫొటోలు చూసి నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) -
నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన
ప్రముఖ సినీ, టీవీ నటి మాధవి ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయానంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. మిర్చిలో మాట వినని కొడుకు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిగా కనిపించింది. దీంతో ప్రభాస్ ఆమెకు విలన్ కుటుంబం తరపున డబ్బు సాయం చేస్తాడు. అలా ఈ సినిమాలో ఎమోషన్స్ పండించి నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె పలు టీవీ సీరియల్స్లో విలనిజం పోషిస్తోంది. బుల్లితెరపై కుట్రలు చేస్తూ, మోసం చేసే పాత్రల్లో మాధవి ఆకట్టుకుంటోంది. చదవండి: ఏడాది తిరక్కుండానే యాంకర్ శ్యామల మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’ అలాంటి ఆమె నిజ జీవితంలో ఓ వ్యక్తి నమ్మ భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకుందట. ఇటీవల లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించిన ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తనకు తెలిసిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు బాగా తెలిసిన వ్యక్తి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టమన్నాడు. అతడిని నమ్మి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మాయ మాటలు చెబుతూ ఆ డబ్బు మొత్తం కాజేశాడు. స్టాక్ మార్కెట్పై నాకు పెద్దగా అవగాహన లేకపోడం వల్లే సులువుగా నన్ను మోసం చేయగలిగాడు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కల్యాణ్ రామ్ అమిగోస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! డబ్బు పోయిందనే బాధ కంటే.. తెలిసినే వ్యక్తే, నేను బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని, లేదంటే తనలా మోసపోతారంటూ నెటిజన్లకు సూచించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండ అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని ఆమె తెలిపింది. కాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో మాధవి దేవయాని పాత్ర పోషించింది. ఇందులో హీరోకు పెద్దమ్మగా నటించింది. కపట ప్రేమ చూపిస్తూ.. సొంతవాళ్లపైనే కుట్రలు చేసే పెద్దమ్మగా మాధవి తన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
హెచ్ఎం చనువుతో.. టీచర్గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు
‘మనందరికీ ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పనీ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. చిన్న సూది, దారంతో నా ప్రయాణం మొదలైంది. ఇదే ఇప్పుడు నా చుట్టుపక్కల వారి జీవితాలను మార్చింది. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ అభిరుచిని అనుసరించండి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని పొందండి. అపజయాలకు భయపడ కండి. అవి విజయానికి సోపానాలుగా భావించండి’ అంటున్నారు మాధవి. సీతంపేట (విశాఖ ఉత్తర): కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టించగలరని, రికార్డులు క్రియేట్ చెయ్యగలరని నిరూపించారు అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలో నివసిస్తున్న మాధవి సూరిభట్ల. మాధవి స్థాపించిన ‘మహిళా మనోవికాస్’ సంస్థ ద్వారా తన వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందిన 200 మంది మహిళలతో కేవలం మూడు నెలల్లో ఊలుతో 4,686 క్రోచెట్ క్యాప్స్ చేతి అల్లికతో తయారు చేసి.. ‘లార్జెస్ట్ క్రోచెట్ హ్యాట్స్, క్యాప్స్’ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక గృహిణి సారధ్యంలో మరో 200 మంది మహిళల భాగస్వామ్యంతో రికార్డు సాధించి గిన్నిస్బుక్లో విశాఖ నగరానికి ఒక పేజీ సృష్టించారు. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డుపై ఎంతోమంది మహిళలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దీనికి ముందు మరో నాలుగు గిన్నిస్ రికార్డుల్లో మాధవి భాగస్వామ్యం కావడం విశేషం. అదే స్ఫూర్తితో తనెందుకు సొంతంగా గిన్నిస్ రికార్డు సాధించకూడదు అనే ఆలోచన విజయంవైపు నడిపించింది. రెండు పీజీలు చేసిన మాధవి వివాహం తర్వాత కొన్నాళ్లు హైదరా బాద్లో ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశారు. భర్త వెంకట రామారావుకు ఆర్సీఎల్లో ఉద్యోగం కారణంగా పాతికేళ్ల క్రితం విశాఖలో స్థిరపడ్డారు. మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. దీంతో కుటుంబ బాధ్యతలు చూసుకునేసరికే సమయం సరిపోయేది. అయినా తనలో ఉన్న ప్రతిభ తోటి మహిళలకు నేర్పాలన్న ఉద్దేశంతో మధు క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరిట 2014లో మాధవి సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఎంతో మందికి ఊలుతో క్యాప్స్, స్వెట్టర్స్, శాలువాలు, స్కార్ఫ్, పోంచోస్, అలాగే చాక్లెట్స్, కేక్స్ తయారీ, న్యూస్ పేపర్తో అలంకరణ (పేపర్ క్విల్లింగ్) వస్తువులు ఇలా ఎన్నో అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో మహిళా మనో వికాస్గా సంస్థ పేరును మార్చి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం రెండు బ్యాచ్లు, సాయంత్రం రెండు బ్యాచ్లకు శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మహిళలు ఊలుతో పలు రకాల అల్లికలు నేర్చుకున్నారు. ఆ విధంగా సుమారు 350 మంది వరకు మనో వికాస్లో సభ్యులుగా చేరారు. నాలుగు గిన్నిస్ రికార్డుల్లో భాగస్వామ్యం... గతంలో నాలుగు గిన్నిస్ రికార్డుల సాధనలో మాధవి భాగస్వా మ్యం అయ్యారు. చెన్నైకు చెందిన సంస్థ ద్వారా 2017లో లార్జెస్ట్ స్కార్ఫ్ తయారీ, 2018లో స్ల్కప్చర్స్ తయారీ, 2019లో క్రిస్మస్ డెకరేషన్, 2020లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చనలో ఆన్లైన్లో పాల్గొని గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. అదే స్ఫూర్తితో తనెందుకు రికార్డు సాధించకూడదు. నా వల్ల మరో నలుగురికి పేరు తేవాలన్న ఆలోచన కలిగింది. అదే తడువుగా మహిళా మనోవికాస్ సభ్యుల వద్ద తన ఆలోచన బయటపెట్టారు. దేశ విదేశాలలో తన వద్ద శిక్షణ పొందిన 200 మంది మహిళలు మాధవి ఆలోచనకు జత కలిశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధిని మెయిల్ ద్వారా సంప్రదించారు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే మూడు నెలల్లో వెయ్యి క్రోచెట్ క్యాప్స్(చేతితో అల్లిన ఊలు క్యాప్లు) తయారు చెయ్యాలని గిన్నిస్ ప్రతినిధులు జులై 2022లో లక్ష్యం నిర్దేశించారు. మూడు నెలల్లో 200 మంది మహిళలు ఏకంగా 4,686 క్రోచెట్ క్యాప్స్ తయారు చేసి ప్రదర్శనకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 18న అక్కయ్యపాలెం మెయిన్రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో 4,686 క్యాప్స్తో ‘లార్జెస్ట్ క్రోచెట్ క్యాప్స్ ’ ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించి మాధవితో పాటు, భాగస్వా మ్యులైన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు పైబడిన మహిళలు సైతం ఈ రికార్డు సాధనలో పాలు పంచుకున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 20 వరకు క్యాప్స్ తయారు చేశారు. (చదవండి: చంద్రబాబు పేకలో పవన్కల్యాణ్ జోకర్) -
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్కు వచ్చేశాం. స్కూల్తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్కుమార్ -
ఎవరీ మాధవీ పురీ.. కీలక పదవి దక్కించుకున్న తొలి మహిళగా రికార్డ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారి ఒక మహిళ నాయకత్వం వహించనున్నారు. కేబినెట్ ఎంపికల కమిటీ.. మాజీ బ్యాంకర్ మాధవీ పురీ బుచ్ను సెబీ కొత్త చైర్పర్సన్గా ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీకాలం సోమవారం(28న) ముగియనుంది. దీంతో నేటి(మార్చి1) నుంచి 57 ఏళ్ల మాధవి బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిగా మూడేళ్లపాటు సెబీ చీఫ్గా వ్యవహరించనున్నారు. వెరసి సెబీ నిర్వహణకు ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవనున్నారు. సెబీకి పూర్తికాలపు తొలి మహిళా సభ్యురాలిగా కూడా మాధవి సేవలందించడం గమనార్హం! 30 ఏళ్ల అనుభవం.. ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల కెరీర్ను సొంతం చేసుకున్న మాధవీ పురీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్ను ప్రారంభించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కన్సల్టెంట్గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా. త్యాగి ఐదేళ్లు...: 1984 బ్యాచ్ హిమాచల్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ త్యాగి 2017 మార్చి 1న సెబీ చైర్మన్గా ఎంపికయ్యారు. తొలుత మూడేళ్లు బాధ్యతలు నిర్వహించాక తదుపరి ఆరు నెలలపాటు, ఆపై మరో 18 నెలలపాటు చైర్మన్ పదవీ నిర్వహణకు గడువును పొందారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్థుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి ప్రస్తుత చైర్మన్ త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4 వరకూ పలు కీలక విధులను నిర్వర్తించారు. మాధవీ పురీ కెరీర్... సెబీకి తొలి మహిళా సారథిగా బాధ్యతలు చేపట్టనున్న మాధవీ పురీ ఐసీఐసీఐ బ్యాంక్సహా ప్రైవేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 2008 నవంబర్ 26న ముంబైలోని ఓ హోటల్పై టెర్రిరిస్టుల దాడి జరిగినప్పుడు చిక్కుకుపోయిన కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా ఉన్నారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్లో ముగిసింది. దీంతో అదే ఏడాది డిసెంబర్లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. సెకండరీ మార్కెట్ల రక్షణ, సామర్థ్యం, పారదర్శకత తదితర అంశాల మెరుగుపై సలహా కమిటీ ద్వారా సెబీకి సేవలందించారు. -
మిద్దె తోటల మాధవి.. ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో
తోటపని ఆందోళనను దూరం చేస్తుంది.తోటపని ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.తోటపని ఏకాగ్రతకు దారి చూపుతుంది.తోటపని ఆరోగ్యాన్నిఇస్తుంది.తోటపని సంతృప్తినీ, సంతోషాన్నీ మూట గట్టి ఇస్తుంది. విశాఖపట్నం వాసి మాధవి గుత్తికొండ పదేళ్లుగా చేస్తున్న డాబాగార్డెన్ ఐదేళ్లుగా ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో యూ ట్యూబ్ ద్వారా కూరగాయల పెంపకాన్నీ ప్రోత్సహిస్తోంది. లక్షలాది వ్యూవర్స్కి తనదైన వాణీ వినిపిస్తోంది. ఇంటికి అవసరమైన కూరగాయల సాగును సొంతంగా తామే ఎలా సాగు చేసుకోవచ్చో చిన్న చిన్న సూచనల ద్వారా వ్యూవర్స్ని ఆకట్టుకుంటోంది మాధవి గుత్తికొండ. సాగులో మెలకువలను చెబుతూ నెటిజనులను ప్రోత్సహిస్తున్న మాధవి తాను చేస్తున్న పని గురించి చెబుతూ... ‘‘తోటపని నాకు చిన్నప్పటి నుంచీ ఉన్న అభిరుచి. కుండీల్లో మొక్కలు పెంచేదాన్ని. ఇండోర్, ఔట్డోర్ డెకొరేటివ్ మొక్కల పెంపకాన్ని ఇష్టంగా చేసేదాన్ని. పెళ్లి, పిల్లల బాధ్యతల నడుమ రోజులు గడుస్తున్నప్పటికీ మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదు. పదేళ్ల కిందట సొంతంగా ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి అవసరమైన రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు సాగుచేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కాలేజీలకు వెళుతున్నారు. నాకు కాస్త తీరిక దొరికింది. దీంతో మేడ పైన కూడా మొక్కల పెంపకం ముఖ్యంగా కూరగాయల పెంపకం చేసేదాన్ని. ఒత్తిడి నుంచి విశ్రాంతి వైపు.. పిల్లలు మేడ పైన చదువుకునేటప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందనీ నాతోపాటు వాళ్లూ మొక్కలకు నీళ్లు పోయడం, వాటి గురించి పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్ మా పిల్లలు, వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యూ ట్యూబ్లో గార్డెన్కి సంబంధించిన ఛానెల్స్ సెర్చ్ చేశాను. తెలుగులో ఏవీ కనిపించలేదు. దాంతో నేనే చానెల్ మొదలుపెట్టాను. ఫోన్తోనే షూట్.. ఏ సీజన్లో ఏ విత్తనాలు, మట్టి రకాలు, ఎరువు, నీళ్లు ఎంతలా పెట్టాలి.. ఇలా అన్ని సూచనలతో ఫోన్లోనే గార్డెనింగ్కు సంబంధించిన వన్నీ షూట్ చేస్తుంటాను. తీసిన వీడియోలను మొదట్లో పిల్లలే ఎడిట్ చేసేవారు. ఇప్పుడు నేనే స్వయంగా ఛానెల్ వర్క్ కూడా చేస్తున్నాను. కాలక్షేపం... పేరు, ఆనందం టైమ్ పాస్కు మొదలుపెట్టిన ఈ తోట పని ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పిల్లలు కూడా కాస్త టైమ్ దొరికితే చాలు తోట పనిలోకి వచ్చేస్తున్నారు. మేం బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా కొత్తరకం విత్తనాలు, మొక్కలు కనిపించినా, వాటిని తీసుకురావడం మొదలైంది. బంగాళదుంప.. పసుపు నేను ప్రయత్నించని సాగు అంటూ లేదు. బీర, సొరకాయలు, పచ్చిమిరప నాలుగైదు రకాలు, టొమాటో నాలుగు రకాలు, మునగ.. బంగాళదుంపల సాగు కూడా చేశాను. వెల్లుల్లి ట్రై చేశాను. పసుపు కొమ్ములూ పండించాను. అరటిమొక్కలు పెంచుతున్నాం. వీటి పనిలో సాయంగా ఉండటానికి ఒక హెల్పర్ని పెట్టుకున్నాను. ఘనమైన రుచి.. ఆరోగ్యం.. ఖర్చు గురించి ఆలోచన లేదు. ఎందుకంటే, ఇంటికి అవసరమైన ఆర్గానిక్ కూరగాయలు కొనాలంటే మాటలు కాదు. అదే మనకు మనంగా పండించుకున్నాం కాబట్టి ఖర్చు కలిసిరావడంతోపాటు కూరగాయల రుచి కూడా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. మా అవసరాలకు మించిన కూరగాయలను చుట్టుపక్కలవాళ్లకు, బంధువులకు కూడా పంపిస్తుంటాను. కాలానుగుణంగా మూడు నెలలకు ఒకసారి పంటసాగు పని ఉంటుంది. ఇప్పటికి నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ముందు నుంచీ ఛానెల్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఫాలో అయినవారున్నారు. కొత్తగా జాయినైనవారున్నారు. మా ఛానెల్ ద్వారా మిద్దె తోట గురించి తెలిసినవారు, సూచనలు, సలహాలు తీసుకొని వాళ్లు కూడా కూరగాయలు పండిస్తున్నారు. వాటిని మాకు పంపించేవారు, లేదా ఆ వీడియోలు షేర్ చేసేవారు ఉంటారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంటుంది. కొంతమందైనా స్ఫూర్తిగా తీసుకొని కూరగాయల సాగు చేయడం సంతోషాన్ని ఇస్తుంటుంది. అనుభవంలోకి వస్తే తప్ప ఆ ఆనందం తెలియదు. ఇప్పుడు మా ఇంటిపైన కాసే కూరగాయలతో వంటలు కూడా చేసి, వాటిని పోస్ట్ చేస్తుంటాను. మంచి రెస్పాన్స్ రావడంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ నుంచి అంతో ఇంతో ఆదాయమూ వస్తోంది’’ అని ఆనందంగా వివరించారు మిద్దె తోటల మాధవి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఘనంగా టీవీ యాంకర్ పెళ్లి
మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్ పెద్ద కూతురు, టీవీ యాంకర్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్కు చెందిన అరవింద్తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. "ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ డాటర్.. ఇలా అన్నీ ఉన్న నువ్వు దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. (చదవండి: నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు) మరోవైపు సన్నిహితులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయగా టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా వాళ్లు కూడా హాజరై వధూవరును మనసారా ఆశీర్వదించారు. వీరిలో నటులు జగదీష్, మనియన్ పిల్ల రాజు, శ్రీకుమార్, దర్శకులు కమల్, షాజి కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా అభిమానులు కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినీ దర్శకుడు మధుపాల్ - రేఖల మొదటి సంతానమే మాధవి. టీవీ యాంకర్గా ఆకట్టుకున్న ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గానూ పని చేస్తున్నారు. (చదవండి: వైరల్: బుల్లితెర స్టార్లతో ప్రదీప్ డ్యాన్స్) View this post on Instagram A post shared by Meenakshi 💮 (@meenakshi_madhupal) -
నా భర్తను నాకు అప్పగించాలి : మాధవి
సాక్షి, హైదరాబాద్ : తన భర్తను అప్పగించాలని కరోనా బాధితుడు మధుసూదన్ భార్య మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో మాధవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డాక్టర్లు తన భర్తకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారని మాధవి తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మధుసూదన్ను ప్రాణాలతో అప్పగిస్తే సీఎం కేసీఆర్ను సన్మానిస్తానని తెలిపారు. మధుసూదన్కు ఎం జరిగినా అది ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు. మరణాలు పెరగాలని ఎవరు కోరుకోరని.. మధుసూదన్ విషయంలో ప్రభుత్వం వాదనకు, గాంధీ ఆస్పత్రి రికార్డులకు పొంతన కుదరడం లేదని విమర్శించారు. (చదవండి : నా భర్త జాడ చెప్పండి!) కాగా, మధుసూదన్ కుటుంబంలో పలువురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మాధవి కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఇంటికి వెళ్లిన మాధవికి తన భర్త కనిపించకపోవడంతో ఆమె షాక్కు గురయ్యారు. వైద్యులు తన భర్త బతికే ఉన్నాడని చెప్పారని అన్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మధుసూధన్ చికిత్స పొందుతూ మరణించాడని స్పష్టం చేశాయి. కుటుంబ సభ్యుల సూచనల మేరకే ఈ విషయాన్ని మాధవికి చెప్పలేదని వెల్లడించాయి. మరోవైపు మాధవి మాత్రం తన భర్త జాడ చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. -
షీ ఐ మాధవి
‘జరిగిందంతా నాతో చెప్పడం మీకు ఇబ్బందిగా ఉంటే మా లేడీ కానిస్టేబుల్తో షేర్ చేసుకోవచ్చు’ అని చెప్తాడు లైంగిక బాధితురాలితో ఒక ఎస్సై. కోర్టులో ... ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేలా డిఫెన్స్ లాయర్ ప్రశ్నలు అడుగుతూంటే.. ‘బాధితురాలు స్త్రీ.. కాస్త సున్నితంగా డీల్ చేయండి’ అంటూ అడ్డుపడుతుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ‘సెక్షన్ 375’ సినిమాలోని దృశ్యాలవి. నిజంగా కూడా పోలీస్ శాఖ, జ్యుడీషియరీలోనూ ఇలా ఆలోచించే వాళ్లుంటే బాగుండు అనిపిస్తుంది. లేరు అనడానిక్కూడా లేదు.. ఉన్నారు. కొంత మంది. వాళ్లలో వాసంశెట్టి మాధవి ఒకరు. తెలంగాణ, కరీంనగర్ జిల్లా, హుజురాబాద్లో సీఐగా పనిచేస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్కు, పేరంటాలు, పెళ్లిళ్లకూ అందునా చీరలు కట్టుకుని అటెండ్ అయ్యే వీలు చాలా తక్కువ. పట్టుచీరలు కట్టుకొని ఆ ఫంక్షన్స్కు అటెండ్ అయిన మహిళలను చూసి ‘అయ్యో.. నాలా యూనిఫామ్ వేసుకునే చాన్స్ వీళ్లకు లేదే’ అనుకుంటా.. నా యూనిఫామ్ పట్ల గౌరవం, నా పట్ల నాకు గర్వంగా అనిపిస్తుంది. అమ్మాయిలు భద్రంగా ఉండాలంటే మగపిల్లల ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మను, తోబుట్టువులను గౌరవించడం మగపిల్లలకు నేర్పించాలి. దీని బాధ్యత పేరెంట్స్, టీచర్స్దే. పిల్లలకు చదువొక్కటే కాదు లోకజ్ఞానమూ కావాలి. పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర పుస్తకాలు, పేపర్ రీడింగ్ పిల్లలకు అలవాటు చేయాలి. వార్తలను టీవీల్లో, సోషల్ మీడియాలో ఫాలో అవడం కాదు కచ్చితంగా పత్రికలనే చదివేలా చూడాలి. పేపర్ అనే ఎందుకంటున్నానంటే.. పేపర్కున్న విశ్వసనీయత ఒక కారణమైతే.. అది చదివినప్పుడు మనలో ఒక రియాక్షన్ ఉంటుంది. అది ఇంకో కారణం. నా 23 ఏళ్ల సర్వీస్లో ఎన్నడూ పశ్చాత్తాప పడ్డ సందర్భాలు లేవు. కేవలం పొట్టకూటి కోసమే ఈ ఉద్యోగంలో చేరా. డిగ్రీ అయిపోయాక బీఈడీ చేయాలనుకుంటున్నప్పుడు అప్పటికే ఎస్ఐ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న మా అన్నయ్య.. ‘బీఈడీ అంటే ఇంకా రెండేళ్లు పడుతుంది. నా మాట విని ఎస్.ఐ. పోస్ట్’కి అప్లయ్ చెయ్’ అంటూ ఎంకరేజ్ చేశాడు. అలా అన్నయ్య, నేను ఇద్దరం ఒకే బ్యాచ్ లో ట్రైన్ అయ్యాం. ఉద్యోగంలో చేరినప్పటినుంచి నా పనికి న్యాయం చేసుకుంటూ పోతున్నా’ అని చెప్పారు మాధవి. ఆ మూడు కేసులు.. ‘ పదేళ్ల కిందట 26 ఏళ్ల యువతి మీద 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అప్పుడు నేను ఆ జ్యూరిస్ డిక్షన్లో లేను. పదేళ్ల తర్వాత అంటే ఇటీవలే ఆ కేస్ ట్రయల్స్కు వచ్చింది. ఇప్పుడది నా జ్యూరిస్ డిక్షన్. అయితే లైంగిక దాడి తర్వాత ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోయింది. జరిగిన సంఘటన అటుంచి, ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో కూడా లేదు. ఆమెకు మానసిక చికిత్స అవసరమని, మానసికంగా కుదుట పడ్డాకే ట్రయల్స్ మొదలుపెట్టాలని కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. మూడు నెలల తర్వాత ఆమె కుదుట పడ్డాకే.. ట్రయల్స్కు వెళ్లాం. ఇక్కడ ఇంకో చిక్కు వచ్చిపడింది. నేను ఎదురుగా ఉంటేనే ధైర్యంగా మాట్లాడేది. నన్నూ అనుమతించమని కోరును అభ్యర్థించి మరీ ఆమెకు అండగా నిలబడ్డాను. ఈ ప్రయత్నాలతో ఆమె తన మీద దాష్టీకం చేసిన వ్యక్తిని గుర్తుపట్టి.. జరిగిందంతా కోర్టుకు వివరించింది. ఆ నేరస్తుడికి పదేళ్లు శిక్ష పడింది. వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలనూ డీల్ చేసాను. సామాన్యుల నుంచి సమాజంలో పేరున్నవాళ్ల దాకా, కొత్త పెళ్లిజంటల నుంచి 40 ఏళ్లు కాపురం చేసిన వాళ్లదాకా ఎందరికో కౌన్సెలింగ్స్ ఇచ్చాను. పోలీస్స్టేషన్కు రావడం ఇష్టంలేని వాళ్ల ఇళ్లకు సివిల్ డ్రెస్లో వెళ్లి మరీ కౌన్సెలింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆస్తి లాక్కొని తిండి పెట్టక అమ్మానాన్నలను కష్టపెడ్తున్న పిల్లలనూ పిలిచి మాట్లాడి పెద్దవాళ్లకు పరిష్కారం చూపించిన కేసులు ఎన్నో. ఇలాంటి పట్టణాల్లో అంతగా కనపడవు కాని పల్లెల్లో అన్నీ అవే. రోజుకు ఒక్కటైనా వస్తుంది అలాంటి కేసు. సవాళ్లు? నేనైతే పెద్దగా ఎదుర్కోలేదు. అలాగని డిస్క్రిమినేషన్కు ఈ ఫీల్డేమీ మినహాయింపు కాదు. పనికి జెండర్ ఉండదు, ఏ టాస్క్కైనా నేను సిద్ధమే అని నిరూపించుకోవడానికి, ఆ కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలుసు. మహిళలమని మనకు మనమే రిజర్వేషన్స్పెట్టుకుంటే అవతలి వాళ్లు మనల్ని ఈక్వల్గా చూడరు అని నా ఉద్దేశం. మన పనితీరే మనకు గౌరవాన్ని, గుర్తింపునిస్తుంది. నేను జాయిన్ అయిన కొత్తలో మగవాళ్లు ఎవరైనా ‘మాధవి ..లేడీ ఇన్స్పెక్టర్ అని పిలిస్తే ‘ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్... అంతే.. మగ, ఆడ అని ఉండదు కదా అని వాదించి వారికి వారికి నచ్పజెప్పేదాన్ని. కుటుంబ సభ్యులతో మాధవి విమెన్ ఫ్రెండ్లీ పోలీస్... మొన్న తొమ్మిదేళ్ల పాప మీద లైంగిక దాడి జరిగింది. సివిల్ డ్రెస్లో వెళ్లి.. ఓపిగ్గా ఆ పాపతో మాట్లాడితే విషయమంతా చెప్పింది. బహుశా నాలో వాళ్ల అమ్మనో.. అత్తనో.. పిన్నినో చూసుకొని ఉంటుంది. అదే నా స్థానంలో మేల్ ఆఫీసర్ ఉండుంటే ఆ పాప భయంతో బిగుసుకుపోయేదేమో! న్యాయం జరిగినా, జరగకపోయినా బాధితులు మహిళలే. ఈ నిజాన్ని గ్రహించేది, అర్థం చేసుకునేదీ మహిళలే. ఇన్స్టంట్గా న్యాయం అందించే అవకాశమూ ఉంటుంది. అందుకే పోలీస్డిపార్ట్మెంట్లోకి ఎంత వీలైతే అంత ఎక్కువ మంది మహిళలు రావాలి. బీటెక్లు చదివి ఏ కాల్సెంటర్లోనో పదివేలకు ఉద్యోగం చేసేకంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే.. గౌరవానికి గౌరవం, సాటి మహిళల తరపున ఉన్నామనే గర్వం రెండూ మిగులుతాయి. తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే.. మీ ఆడపిల్లలను పోలీస్ జాబ్స్కి ఎంకరేజ్ చేయండి. భయపడాల్సిందేమీ లేదు. మీ అమ్మాయి ధైర్యంగా ఉండడమే కాక పదిమంది అమ్మాయిలకూ ధైర్యాన్నివ్వగలదు. దిశ తర్వాత మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమాలు.. ప్రత్యేకంగా ఏమీ చేపట్టలేదు కాని డయల్ 100 మీద విస్తృత ప్రచారం మాత్రం చేశాం.. చేస్తున్నాం. మహిళల నుంచి వచ్చిన, వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందం, ఆశ్చర్యం రెండూ కలుగుతున్నాయి. తన కొడుకు స్కూల్కి వెళ్లకుండా మారాం చేస్తున్నాడు కాస్త వచ్చి పిల్లాడిని బుజ్జగించండి అని ఒక అమ్మ, తొమ్మిది నెలల నిండుతున్నా డెలివరీకి తల్లిగారింటికి పంపించట్లేదు.. కొంచెం మీరొచ్చి మా అత్తగారికి కౌన్సెలింగ్ ఇవ్వరా అంటూ ఓ గర్భిణీ కాల్ చేశారు. çసమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలన్న అవగాహనైతే వచ్చింది అది చాలు’’ అని సంతోషపడుతున్నారు మాధవి. కుటుంబ నేపథ్యం.. మేం ఆరుగురం అక్కచెల్లెళ్లం, మాకు ఇద్దరన్నదమ్ములు. మా నాన్నదీ పోలీస్ ఉద్యోగమే. నా పదేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లమే ఇంటి బాధ్యతలను చూసుకునేవాళ్లం. మా అక్కచెల్లెళ్లం మా అత్తగారింటి వాళ్లకు చెప్పిన మాటొక్కటే..‘మా అమ్మ బతికుంటే ఒకటే అమ్మ ఉండేది.. కాని ఇప్పుడు మాకు మేం ఆరుగురం అమ్మలమే’ అని. అందుకే ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే గర్వపడండి. బాగా చదివించండి.. స్వశక్తి మీద నిలబడేలా పెంచండి. నా కుటుంబానికి వస్తే మా వారు మహేష్ బాబు కూడా ఇన్స్పెక్టరే. ఇద్దరు అబ్బాయిలు రుషి ఫణీంద్ర, మీరజ్ చంద్ర. నేను ఈ రోజు ఈ ఉద్యోగం హాయిగా చేసుకోగలుతున్నానంటే మా అత్తగారి సహకారం వల్లే. – సరస్వతి రమ ఫొటోలు .. అల్లె నరేందర్, సాక్షి, హుజురాబాద్ -
మాధవి పరిణయ సందడి
గొలుగొండ, కొయ్యూరు: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లిపీటలెక్కారు. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తన చిన్ననాటి స్నేహితుడు కుసిరెడ్డి శివప్రసాద్తో మాధవి వివాహం వేడుక వైభవంగా జరగనుంది. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజుంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల రాకతో గ్రామాలు కళకళలాడాయి. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. -
ఎన్నికలే స్నేహాన్ని ప్రేమగా మార్చాయి..
ప్రేమించుకోవడానికి రెండు హృదయాలు ఒకటి కావాలి. వివాహం చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కలవాలి. మొదట ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరువాత వారి అభిప్రాయాన్ని పెద్దలకు చెప్పారు. ముందు కాదూ కూడదు అన్నా చివరకు వివాహానికి రెండు వైపుల వారు అంగీకరించారు. దీంతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి , గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్ల మధ్య చిగురించిన ప్రేమ ఇప్పుడు వివాహంతో ఇద్దరిని ఒకటిగా చేస్తోంది. కొయ్యూరు (పాడేరు): స్నేహ బంధం..ప్రేమగా అంకురించింది. మిత్రత్వం చిగురించి అది ప్రేమగా మారింది. ఎంపీ మాధవి, కాబోయే భర్త శివప్రసాద్ దాదాపు 16 సంవత్సరాల పాటు స్నేహితులుగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో మాధవికి సహాయం చేసేందుకు ఆమె వెనకే శివప్రసాద్ ఉన్నారు. అంత వరకు స్నేహితులుగా ఉన్న ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. పెద్దలు రెండు వైపుల కాస్తా వ్యతిరేకించారు. తరువాత వివాహానికి అంగీకరించారు. ఇద్దరి తండ్రుల మధ్య పరిచయం మాధవి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేముడు. శివప్రసాద్ తండ్రి నారాయణమూర్తి మధ్య పరిచయం ఉంది. దేముడు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న దేముడు, నారాయణమూర్తిల మధ్య మిత్రత్వం చాలాకాలం కొనసాగింది. ఇద్దరూ సహధ్యాయులు శివప్రసాద్ మాధవి క్లాస్మేట్లు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. నవోదయలో చదివిన మాధవి పదిలో బయటకు వచ్చారు. తరువాత ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఉన్నత విద్యలోను కలిసి చదువుకోవటంతో స్నేహం చిగురించింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఎన్నికలే స్నేహాన్ని ప్రేమగా మార్చాయి ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలు ఇద్దరు స్నేహితులను ప్రేమికులుగా మార్చాయి. మాధవికి ఇద్దరు సోదరులున్నారు. అయితే ఎన్నికల సమయంలో కీలకంగా ఉండి సలహాలు ఇచ్చేవారు ఉండాలి. ప్రసాద్ ఎన్నికల సమయంలో అన్ని తానే వెనక నుంచి మద్దతు చెప్పారు. ఆ సమయంలో స్నేహితులు ఇద్దరు ప్రేమికులుగా మారారు. చివరకు ఎన్నికల త రువాత వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈనెల 17న రాత్రి 3.15 నిమిషాలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుంది. 18న శరభన్నపాలెంలోనే విందు ఏర్పాటు చేశారు. ఒకరినొకరంఅర్థం చేసుకున్నాం ఇద్దరికి 16 ఏళ్లుగా పరిచయం ఉంది. చిన్నతనం నుంచి స్నేహితులుగానే ఉండిపోయాం. కలిసి చదవడం మూలంగా ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. అన్ని తానై ఎన్నికల సమయంలో నన్ను నడిపించారు.అటువంటి వ్యక్తి భర్తగా రావడం నా సుకృతం. –మాధవి, ఎంపీ స్నేహమే ప్రేమగా మారింది మొదటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులం కలిసి చదువుకున్నాం. ఎన్నికల సమయంలో ఇద్దరం కలిసి ప్రచారం చేశాం. అవసరమైన సాయం చేశాను. ఆ సమయంలోనే ఇద్దరి నడుమ స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. ఆమె నా భార్యగా రావడం నా అదృష్టం.– కుసిరెడ్డి శివప్రసాద్ -
ఎంపీ మాధవి వివాహానికి సీఎంకు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. తనకు కాబోయే భర్త శివప్రసాద్తో కలిసి ఆమె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న (శుక్రవారం) ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నెల 17వ తేదీన జరిగే తమ పెళ్లికి రావాలంటూ సీఎం జగన్కు వివాహా ఆహ్వాన పత్రికను అందచేశారు. కాగా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్తో ఎంపీ మాధవి వివాహం జరగనుంది. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్లో ఏర్పాటు చేశారు. చదవండి: అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ 17న అరకు ఎంపీ వివాహం -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
సాక్షి, విశాఖపట్నం : అతి పిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్ను పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్లో ఏర్పాటు చేయనున్నారు. గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ బి.టెక్, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం కరస్పాండెట్గా ఓ కాలేజ్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు అయింది. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్చంద్రదేవ్ని ఇంటికి సాగనంపారు. -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
-
విశాఖకు ఇది శుభోదయం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు కూత పెట్టింది. పరుగు ప్రారంభించింది. అతి తక్కువ సమయం, తక్కువ చార్జీలు, మెరుగైన సౌకర్యాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది. గురువారం ఉదయం 11.30 గంటలకు రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగాడి జెండా ఊపి ఈ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. అలాగే వాల్తేర్ డివిజన్ను యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్ పరిశీలనలో ఉందన్న మంత్రి వెల్లడించారు. సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ): ‘విశాఖవాసులకు ఇది శుభోదయం.. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సమయం . అతి తక్కువ ప్రయాణ సమయం, ఏసీ, డైనింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది’ అన్నారు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ చెన్నబసప్ప. విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం దీనిని ప్రత్యేక రైలుగా ఆయన ప్రారంభించారు. అతిథులు, డీఆర్ఎం, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రత్యేక రైళ్లను బిజీ రూట్లలో మాత్రమే నడుపుతామని, విశాఖ ప్రజలకు దీని అవసరం ఉండటంతో ఉదయ్ను ఏపీకి కేటాయించామన్నారు. రైల్వేలో ఆ మూడింటికి ప్రాధాన్యం మోదీ ప్రభుత్వం రైల్వేలో మూడు అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటిది ప్రయాణికుల భద్రత, రెండోది పరిశుభ్రత, మూడోది సమయపాలన అని తెలిపారు. ఈ మూడింటిని రైల్వే కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైల్వే సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప, డీఆర్ఎం శ్రీవాస్తవ, ఎంపీలు జీవీఎల్, ఎంవీవీ తీరిన విశాఖ వాసుల చిరకాల కోరిక విశాఖవాసుల చిరకాల కోరిక విజయవాడకు విశాఖ నుండి డైరెక్ట్ రైలు నడపడం. నేడు ఉదయ్ ప్రారంభంతో ఈ కోరిక తీరిందని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం చేతన్కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. రైల్వేస్టేషన్లో ఉదయ్ ప్రారంభం సందర్భంగా డీఆర్ఎం మాట్లాడారు. ఉదయ్ సర్వీస్ ప్రారంభంతో విశాఖవాసులకు విజయవాడ ప్రయాణం చాలా అనుకూలంగా మా రిందన్నారు. నగరవాసులు విజయవాడలో తమ పనులు చూసుకుని తిరిగి రాత్రికి నగరానికి చేరుకునే విధంగా ఈ టైంటేబుల్ ఉం దని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్.మాధవ్, పాకలపాటి రఘువర్మ, దువ్వారపు రామారావు, మాజీ ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు, రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుగుప్రయాణం ఫుల్ విశాఖ నుంచి గురువారం ప్రారంభమైన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి పూర్తి ఆక్యుపెన్సీతో వచ్చినట్లు తెలిసింది. విశాఖ నుంచి కూడా ప్రకటించిన అతి కొద్ది సమయంలోనే సీట్లు చాలావరకు నిండిపోయాయి. విజయవాడ నుంచి కూడా అన్ని కోచ్లు ఫుల్గా వచ్చాయి. డివిజన్ విషయంలో మాకు చేతనైనంత చేస్తాం విశాఖకు ప్రత్యేక జోన్ కేటాయింపు పెద్ద వరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. డివిజన్ విషయంలో చేతనైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విశాఖ అందాలు అద్భుతం విశాఖ నగర సౌందర్యానికి ముగ్ధులైన ఆయన అనంతరం స్టేషన్ నిర్వహణ చూసి డీఆర్ఎం చేతన్కుమార్ను ప్రశంసించారు. విశాఖ రైల్వేస్టేషన్ ఎంతో అందంగా ఉందని, స్టేషన్ను ఇలా ఉంచడంలో డీఆర్ఎం, సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. విశాఖలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండో విస్టాడోమ్ కోచ్ను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు. -
మంచి నటుడు అనిపించుకోవాలనుంది
‘‘నేను లేను’ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంది. సినిమా డిఫరెంట్గా ఉంది అని అభినందిస్తున్నారు. నేను అనుకున్నదానికంటే ఈ సినిమా ఎక్కువ రీచ్ అయింది’’ అని హీరో హర్షిత్ అన్నారు. రామ్ కుమార్ దర్శకత్వంలో హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీ పద్మ, మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. సుక్రి కుమార్ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా హర్షిత్ పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘మాది కర్నూల్. ఇంటర్మీడియట్కి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. స్కూల్లో డ్యాన్స్ బాగా చేసేవాణ్ణి. నటన, డ్యాన్స్లో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రామ్కుమార్తో ఎనిమిదేళ్లుగా అనుబంధం ఉంది. ఇది వరకూ మేమిద్దరం ‘గణపతిబప్పా మోరియా’ సినిమా చేశాం. కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. దాంతో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా చేశాం. కొత్త కాన్సెప్ట్ కోరుకునేవారికి కచ్చితంగా నచ్చుతుంది. నెక్ట్స్ రెండు సినిమాలకు డిస్కషన్ జరుగుతున్నాయి. హీరోగా కాదు నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలోని ఎల్బీ నగర్లో నివాసముంటున్న ప్రతాప్ భార్య మాధవి (26) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న మాధవి భర్తతో గొడవ పడి మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ ఎస్ఐ జైపాల్రెడ్డి తెలిపారు. -
అతిపిన్న వయస్కురాలైన ఎంపీగా మాధవి
విశాఖపట్నం, పాడేరు: అరకు లోక్సభ స్ధానం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి పార్లమెంట్లో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించనున్నారు. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక కావడం విశేషం. గతంలో హర్యానాకు చెందిన దుష్యంత్ చౌహన్ 28 ఏళ్ల వయస్సులో ఎన్నికై పార్లమెంట్కు వెళ్లి అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇప్పుడు మాధవి 26 ఏళ్ల వయస్సులోనే ఆమె ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. వైరిచర్ల కిశోర్చంద్ర సూర్యనారాయణ దేవ్ వంటి ఉద్దండుల్ని ఓడించి మాధవి ఘనత సాధించడమే కాకుండా పిన్న వయస్కురాలిగా పార్లమెంట్కు వెళుతుండడం విశేషం. గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. గత 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి కొత్తపల్లి గీతకు 4,13,191ఓట్లు రాగా 91,398 పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన గొడ్డేటి మాధవికి 2.25 లక్షల మెజార్టీ రావడం విశేషం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్కు 3,60, 458 ఓట్లు రాగా 1,92,444 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే స్థాయిలో మాధవి కూడా భారీ ఆధిక్యత సాధించి ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీలందరి కంటే మాధవికి భారీ ఆధిక్యత లభించింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీకి మన్య ప్రాంత ప్రజలంతా బ్రహ్మరథం పట్టడంతో గొడ్డేటి మాధవికి భారీ ఆధిక్యత లభించింది. 2019 ఎన్నికల్లో అరకు లోక్సభ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు వివరాలు కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్(టీడీపీ)– 3,38,101, కేకేవీవీ సత్యనారాయణ రెడ్డి (బీజేపీ) – 17,867, గొడ్డేటి మాధవి (వైఎస్సార్సీపీ) – 5,62,190, శృతిదేవి వైరిచర్ల (కాంగ్రెస్) – 17,730, వంపూరు గంగుల మయ్య (జనసేన)–42,794, స్వాముల సుబ్రహ్మణ్యం (జనజాగృతి)– 4,710, అనుముల వంశీకృష్ణ(ఇండిపెండెంట్)– 10,240, కంగల బాలుదొర (ఇండిపెండెంట్)– 13,826, నరవ సత్యవతి( ఇండిపెండెంట్) – 11,236, బిడ్డిక రామయ్య( ఇండిపెండెంట్)– 7867 -
మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం
సాక్షి, శ్రీకాకుళం: అనుభవం పనిచెయ్యలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్చంద్రదేవ్ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు. మొత్తంగా మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్చంద్రదేవ్కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్లో మొదలైన వైఎస్సార్సీపీ ఆధిక్యం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. మొత్తంగా 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా, పాలకొండ నియోజకవర్గం నుంచి గొడ్డేటి మాధవికి 68241 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి కిశోర్చంద్రదేవ్కు 53202 ఓట్లు పోలయ్యాయి. జనసేన అభ్యర్థి వి.గంగులయ్యకు 2933 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వై.శృతీదేవికి 1305 ఓట్లు పోలయ్యాయి. -
అరకులో నా గెలుపు ఖాయం
-
అందమైన ప్రేమకథ
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి ముఖ్య తారలుగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్– దివ్యాషిక క్రియేషన్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. రామ్కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటివరకు చూడని కొత్త కాన్సెప్ట్ మా సినిమాలో ఉంది. ఇటీవల విడుదల చేసిన మా చిత్రం ట్రైలర్ 75 లక్షల వ్యూస్ను అందుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రేక్షకులు తప్పకుండా మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. బిశ్వజిత్నాథ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా:ఎ. శ్రీకాంత్, సహనిర్మాత: యషిక. -
అమ్మతనాన్ని చాటిన హుజూరాబాద్ టౌన్ సీఐ
హుజూరాబాద్రూరల్: మాతృత్వానికి ఏ విధులు అడ్డంరావు.. ఓవైపు ఎన్నికల్లో శాంతిభద్రతలను కాపాడుతూనే ఓ తల్లి ఓటేసేందుకు వెళ్లగా తన బిడ్డను పోలీస్ అనే విషయాన్ని మరిచిపోయి ఎత్తుకొని లాలించిన వైనం పలువురిని ఆలోచింపజేసింది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో గురువారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భద్రత ఏర్పాట్లో విధులు నిర్వర్తిస్తున్న హుజూరాబాద్ టౌన్ సీఐ మాధవి ఓ చిన్నారి ని తన ఒడిలో చేర్చుకొని మమకారాన్ని చాటుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఓటేసేందుకు వచ్చిన ఓ తల్లి పడుతున్న బాధను గమనించి ఆమె ఆర్నేళ్ల చిన్నారిని అక్కున చేర్చుకుని తన తల్లి ఓటేసి వచ్చే వరకు ఆలనా, పాలన చూసి ఆనందం పొందింది. దీంతో అక్కడికి ఓటేసి వచ్చిన ఓటర్లు, నాయకులు సీఐకి అభినందనలు తెలిపారు. -
ప్రేమలో మునిగిపోయా
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ ముఖ్య పాత్రల్లో రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ పతాకంపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. ఇప్పటి వరకూ ఎవరూ తీయని సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్న చిత్రం ఇదే అని గర్వంగా ఫీలవుతున్నా. ఇటీవల విడుదల చేసిన టీజర్కి అనూహ్య స్పందన వచ్చింది. కొత్త నటీనటులతో సినిమా తీసినా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, సహనిర్మాత: యషిక. -
ప్రేమలో థ్రిల్
హర్షిత్ హీరోగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ పతాకంపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేశారు. రామ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. కథనం, సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ప్రత్యేక ఎసెట్గా నిలుస్తాయి. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా:ఎ. శ్రీకాంత్, సహ నిర్మాత: యాషిక. -
ఫ్యూచర్ కేక్స్
కంటికి ఇంపుగా కనిపించాలి. నాలుకకు హితవుగా ఉండాలి. దేహానికి ఆరోగ్యాన్నివ్వాలి. ఇదీ ఆహారానికి శిల్ప, మాధవి చెప్పే భాష్యం. ఆహార ప్రియుల జఠరాగ్నిని శాంతింప చేయడం ద్వారా కెరీర్లోని తమ లక్ష్యాగ్నిని జ్వలింపజేసుకుంటున్న ఈ యువతులు.. విజయవంతమైన ఆంట్రప్రెన్యూర్లుగా నిలవాలనే ఒక ఫైర్తో పనిచేస్తున్నారు. అందుకేనేమో.. తమ రెస్టారెంట్కి ‘ఫ్యూ’ అని పేరు పెట్టుకున్నారు. ‘ఫ్యూ’ అంటే ఫ్రెంచిలో ‘మంట’ అని అర్థం. ఆహారం అంటే ఏదో మనకి వచ్చినట్లు వండుకుని, ఆకలైనప్పుడు తిన్నట్లు కాదు. ఇదొక ఆర్ట్, అందులో రాకెట్ సైన్స్ అంత శాస్త్రీయత దాగి ఉంటుందని చెబుతున్నారు శిల్పా దాట్ల, మాధవి. ప్రకృతి ఇచ్చిన ముడిసరుకును ఆరోగ్యకరంగా ప్రాసెస్ చేయడం, ఆ దినుసులతోనే ప్రకృతిని ప్రతిబింబించేటట్లు రుచులను రూపొందించడం తమ ప్రత్యేకత అంటూ వైట్ చాకొలెట్తో తయారు చేసిన ఆకును చూపిస్తారు. గులాబీ రంగు లిచీ కేక్ మీద అమర్చిన వైట్ చాకొలెట్ ఆకు అప్పుడే చెట్టు నుంచి రాలిపడిన పారిజాతం పువ్వును తలపిస్తోంది. తినకుండా దానిని చక్కగా గాజు జాడీలో అలంకరించుకోవాలన్నంత నాజూకుగా ఉందా చాకో లీఫ్. ‘‘రెండు నిమిషాల్లో తినేసే పేస్ట్రీ మీద అలంకరణ కోసం ఇంత మనసు పెట్టడమా!’’ అంటే అదే ఫ్రెంచ్ వాళ్ల ప్రత్యేకత అంటారు. అక్కడ రుచిగా, శుచిగా, ఆరోగ్యకరంగా తయారు చేయడంతోపాటు గార్నిషింగ్ కూడా అంతే శ్రద్ధగా చేస్తారట. ఆ ఫ్రెంచ్ సంప్రదాయాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు శిల్ప, మాధవి. ఇద్దరూ తెలుగమ్మాయిలే శిల్ప, మాధవి ఇద్దరూ తెలుగమ్మాయిలే. ప్రపంచంలో చాలా దేశాలను చూశారు. రకరకాల రుచులను, అభిరుచులను గమనించారు. మన దగ్గరి ఆహారప్రియులు ముంబై, ఢిల్లీ వెళ్లినప్పుడు కొత్త రుచుల కోసం ప్రయత్నిస్తున్న వైనాన్ని తెలుసుకున్నారు. వాటిని ఇక్కడికి తీసుకురావడం గురించి ఆలోచించారు. ‘ఫ్యూ’ అనే ఫ్రెంచ్ పట్టిసెరీ (మామూలు భాషలో బేకరీ షాపు)ని ప్రారంభించారు. ‘‘మనవాళ్లు యూరప్ టూర్ వెళ్లడం బాగా ఎక్కువైంది. అక్కడి రుచులకు ఫిదా అయిపోవడం కూడా. పారిస్ నుంచి ఈఫిల్ టవర్ను ఇక్కడికి తేలేం, కానీ అక్కడి డెజర్ట్ల రుచిని ఇక్కడ చూపించవచ్చు. ఈ రుచులతో టూర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. అలా ఒకసారి వచ్చిన వాళ్లు మా ’ఫ్యూ’ను ఇక మర్చిపోరు. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తారు’ అన్నారు మాధవి. సొంతంగా చేయడమే ఆనందం మాధవి పదేళ్లకు పైగా అమెరికాలో ఉద్యోగం చేసి గత ఏడాది ఇండియాకి వచ్చారు. శిల్పకి పందొమ్మిదేళ్లకే పెళ్లయింది. తండ్రి ఎన్.సి.ఎల్. గ్రూప్ ఎం.డి. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలోనే ఉద్యోగం చేశారామె. సిమెంట్, స్టీల్ వంటి బిల్డింగ్ మెటీరియల్ నిర్వహణతో పాటు తమ కుటుంబానికి ఉన్న కెమికల్ కంపెనీ బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వర్తించినప్పటికీ అవేవీ తనకు సంతృప్తినివ్వలేదంటారు. ‘‘నాకు ఇంటీరియర్ డెకరేషన్ చాలా ఇష్టం. ఆ తర్వాత అంతే ఇష్టమైన అంశం ఆహారం. మా ఇంటికి లంచ్కి వచ్చిన అతిథులు కూడా ఇంటిని అలంకరించిన తీరును, నేను వడ్డించిన రకరకాల వంటకాలను ప్రత్యేకంగా మెచ్చుకునేవాళ్లు. కన్స్రక్షన్ కంపెనీ బాధ్యతల్లో వచ్చిన ప్రశంసల కంటే ఇంటికి వచ్చిన అతిథుల ప్రశంసలు నాకు చాలా సంతోషాన్నిచ్చేవి. కొన్నాళ్లకు నాకంటూ సొంతంగా ఏదైనా చేయాలనిపించింది. ఫ్యామిలీ బిజినెస్లో ఎంత కష్టపడినా, ఎంత విజయవంతంగా నడిపించినా సరే... ‘బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్’, ‘తాతలు, తండ్రి పరిచిన కార్పెట్ మీద నడవడమే కదా’ అంటారు. అంతే తప్ప నా దీక్ష, శ్రమ కనిపించవు. అలా కాకుండా నాకు నేనుగా ఏదైనా స్థాపించి, దానిని విజయవంతంగా నడిపించాలి అనుకున్నాను. అది కుటుంబ వ్యాపారానికి సంబంధం లేకుండా పూర్తిగా భిన్నంగా, నా అభిరుచులకు అనుగుణంగా ఉండాలనుకున్నాను. దాంతో నా హజ్బెండ్ బిజినెస్లో కూడా పాల్పంచుకోకుండా సొంతంగా ‘ఫ్యూ పట్టిసెరీ’ని స్థాపించాను. మాధవి, నేను కజిన్స్మి. ఇద్దరం ఐడియాస్ షేర్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఎనిమిది నెలల పాటు ఈ ప్రాజెక్ట్ మీద వర్కవుట్ చేశాం. షెఫ్ టీమ్ని ముంబై పంపించి సంజనా పటేల్ (పేస్ట్రీ క్వీన్ ఆఫ్ ఇండియా) దగ్గర శిక్షణ ఇప్పించాం. కలినరీలో ఇప్పటి వరకు హైదరాబాద్లో ఏది లేదో దానిని మేము పరిచయం చేస్తున్నాం. కలినరీ స్టూడియో, లైవ్ డెజర్ట్ మాకు మాత్రమే ప్రత్యేకం. లైవ్ డెజర్ట్ అంటే కస్టమర్ కోరిన పదార్థాలతో షెఫ్లు అప్పటికప్పుడు తయారు చేసిస్తారు. బ్రెడ్ కోసం సొంత బేకరీ పెట్టడంలో ఉద్దేశం కూడా క్వాలిటీలో తేడా రాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని మెయింటెయిన్ చేయడం కోసమే. ఫ్రెంచ్ రుచులను నేర్చుకోవాలనే వాళ్ల కోసం రెండు– మూడు రోజుల కోర్సులు, రోజుకు రెండు–మూడు గంటల పాటు వారం రోజుల కోర్సులను ప్రవేశపెట్టాం. ఎన్.సి.ఎల్. కోసం పని చేసిన టైమ్కంటే రెండింతలు ఫ్యూ కోసం పని చేస్తున్నాను. సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది’’ అంటారు శిల్ప. అత్తింటికి తోడు వచ్చే అమ్మ తరళా దలాల్ మనదేశంలో తొలితరం కమర్షియల్ చెఫ్. 1966 నుంచి ముంబైలో వంట క్లాసులు మొదలు పెట్టారు. ఆ తర్వాత వంటల పుస్తకాలు రాయడం ప్రారంభించి రెండు వందల పుస్తకాలు రాశారు. టీవీ షోలలో వండుతూ ప్రేక్షకులకు వంటలు నేర్పించారు. ‘అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు తరళా దలాల్ వంటల పుస్తకం కూడా వెంట పంపించండి’ అని చెప్పుకునేటంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆమె పుస్తకాలు. ఐదేళ్ల కిందట ఆమె మరణించినప్పటికీ కుకరీ షోలతో ఇప్పటికీ భారతీయ మహిళల మనసుల్లో జీవించే ఉన్నారు. - తరళా దలాల్ ఇది మెదడు చేసే పని వీణా అరోరా ద ఇంపీరియల్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్. హోటల్ ఇండస్ట్రీలో లెజెండ్ షెఫ్ ఆమె. టూరిజం మంత్రిత్వ శాఖ నుంచి బెస్ట్ లేడీ షెఫ్ అవార్డు అందుకున్నారు. ఆమె కలినరీ ట్రైనింగ్ ఎక్కడా తీసుకోలేదు. వండడం చేతులతో చేసే పని కాదు, మెదడు ఉపయోగించి చేయాల్సిన పని అంటారామె. కొందరు నేర్చుకుని మెళకువలు సాధిస్తే, కొందరిలో సహజంగా ఈ మెళకువ ఉంటుంది. ఆమె ఆ రెండో కోవకి చెందుతారు. - వీణా అరోరా అభి‘రుచి’ సంజనా పటేల్కి రకరకాల డెజర్ట్లు చేయడం ఇష్టం. పారిస్లో కన్ఫెక్షనరీ టెక్నాలజీలో డిప్లొమా, లండన్లో ఫుడ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ముంబైలో సొంతంగా ‘లాఫోలి’ పేరుతో పాట్టిసెరీ ప్రారంభించారు. ఇండియాలో ఈ తరహా డెజర్ట్ ఎటెలియర్లలో ఇదే తొలిది. ఫుడ్ ఇండస్ట్రీలో ఆమె చేస్తున్న ప్రయత్నాలకు పేస్ట్రీ క్వీన్ ఆఫ్ ఇండియా, ద సైంటిస్ట్, గేమ్ చేంజర్, ద ఒరిజినల్’ అనే బిరుదులు వచ్చాయి. - సంజనా పటేల్ ఫస్టే కాదు బెస్ట్ కూడా ఫ్రాన్స్లో ఉండే క్వాలిటీ కోసం ముడిసరుకులన్నీ విదేశాల నుంచే తెప్పిస్తున్నాం. రసాయన ఉత్పత్తులు లేకుండా పూర్తిగా సహజమైన దినుసులనే వాడుతున్నాం. కలర్స్ కూడా మొత్తం వెజిటబుల్ కలర్సే. పేస్ట్రీ అనగానే మైదా పిండి గుర్తుకువస్తుంది. కానీ మైదాను తగ్గించి బాదం పొడి వంటి రకరకాల పొడులను చేరుస్తున్నాం. ప్రత్యేకించి పెరిగే పిల్లలకు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఆరోగ్యకరమైన పదార్థాలు చేరుస్తున్నాం. హైదరాబాద్లో ఇదే తొలి ఫ్రెంచ్ పాట్టిసెరీ. మా ప్రయత్నం ఫస్ట్ మాత్రమే కాదు బెస్ట్ కూడా అయ్యేటట్లు శ్రమిస్తున్నాం. – మాధవి, శిల్పాదాట్ల, ఉమెన్ ఆంట్రప్రెన్యూర్లు – వాకా మంజులారెడ్డి -
ఆస్పత్రి నుంచి మాధవి డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మాధవి(22)ని వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఎర్రగడ్డ ప్రేమ్నగర్కు చెందిన సందీప్(24), బోరబండ వినాయకనగర్కు చెందిన మాధవి(22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో మాధవి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు తల్లిదండ్రులకు చెప్పకుండా సెప్టెంబర్ 12న అల్వాల్ ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత మాధవి తండ్రి మనోహరాచారి కొత్త దంపతులకు బట్టలు కొనిస్తానని, ఎర్రగడ్డకు రావాలని ఆహ్వానించడంతో సెప్టెంబర్ 19న వారిద్దరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ మనోహరాచారి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మాధవిని యశోద ఆస్పత్రికి తరలించారు. తెగిపోయిన చేయి సహా చెవి, మెడ భాగంలోని నరాలు, కండరాలను వైద్యులు అతికించారు. చికిత్స పూర్తయిన తర్వాత తాజాగా డిశ్చార్జి చేశారు. కాగా, ఇప్పటివరకు మాధవిని చూసేందుకు తల్లిదండ్రుల తరఫు బంధువులెవరూ రాలేదు. నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నా: మాధవి, బాధితురాలు సందీప్పై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని భావించాను. ఇదే విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పాను. అయితే, వారు అంగీకరించకపోవడం వల్లే ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నాం. దాడి తర్వాత చాలా అవస్థ పడ్డాను. నాలాంటి పరిస్థితి మరే ప్రేమికురాలు ఎదుర్కోకూడదు. దాడి చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. నమ్మించి మోసం చేశాడు: సందీప్, మాధవి భర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి రావాలని మనోహరాచారి ఆహ్వానించాడు. రిసెప్షన్ చేస్తామని చెప్పాడు. కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించాడు. తీరా వచ్చిన తర్వాత దాడికి పాల్పడ్డాడు. ప్రాణాపాయస్థితిలో వచ్చిన నా భార్యను యశోద ఆస్పత్రి ఆదుకుంది. వైద్యఖర్చులను భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. -
బంధువులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే..
హైదరాబాద్: బంధువులు, కుటుంబ సభ్యుల ఒత్తిళ్ల కారణంగా ఆవేశానికి లోనై తన కుమార్తె మాధవి, అల్లుడు సందీప్పై దాడి చేశానని నిందితుడు మనోహరాచారి పోలీసుల విచారణలో వెల్లడించాడు. మనోహరాచారి గత నెల 19న ఎర్రగడ్డలో అల్లుడు, కూతురిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ జరిపేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు నిందితుడిని మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో ఘటనకు దారితీసిన వివరాలను మనోహరాచారి వెల్లడించినట్లు సమాచారం. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో దాడికి పాల్పడలేదని, కుటుంబ సభ్యులు, బంధువుల సూటి పోటి మాటలతో ఆవేశానికి లోనయ్యానని తెలిపాడు. మాధవి, సందీప్ల ప్రేమ విషయం తనకు తెలియదని, ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నాక పోలీసుల ద్వారా తనకు పిలుపు వచ్చిందని చెప్పాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చాక వారిపై ఉన్న కోపం పోయిందని, రెండు సార్లు సందీప్ ఇంటికి వెళ్లి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చానని వెల్లడించాడు. తరువాత బంధువులు, కుటుంబ సభ్యులు తనను రెచ్చగొట్టారని విచారణలో పేర్కొన్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుని వస్తే ఊరుకుంటావా, పౌరుషం లేదా అంటూ బంధువులు పదే పదే అనడంతో ఏమి చేయాలో తెలియక వారం రోజుల పాటు అన్నపానీయాలు మాని మద్యానికి అలవాటు పడ్డానని చెప్పాడు. ప్రణయ్ హత్య ఘటనతో ఆగ్రహం.. సందీప్ను వదిలిపెట్టి ఇంటికి రావాలని పదే పదే కోరినా మాధవి రాలేదని, ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య సంఘటన తనలో మరింత ఆగ్రహన్ని తెప్పించిందని మనోహరాచారి విచారణలో అంగీకరించాడు. అయితే ప్రణయ్ను హత్య చేసిన విధంగా కాకుండా తన కూతురు మాధవినే హతమార్చాలని నిర్ణయానికి వచ్చానని చెప్పాడు. 19న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి నేరుగా అమీర్పేటలోని వైన్స్షాపుకు వెళ్లి బాగా మద్యం సేవించి మాధవికి ఫోన్ చేసి బట్టలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కదానివే ఎర్రగడ్డకు రావాలని తెలిపానన్నాడు. మార్గ మధ్యంలో ప్రైమ్ ఆసుపత్రి సమీపంలో కొబ్బరి బొండాల బండి వద్దకు వెళ్లి కత్తిని దొంగిలించి ఎర్రగడ్డకు వచ్చానని తెలిపాడు. అప్పటికే సందీప్, మాధవిలు అక్కడకు కలిసి రావడంతో ముందుగా సందీప్పై దాడిచేస్తే పారిపోతాడని భావించి అతడిపై కత్తితో దాడి చేశానని పేర్కొన్నాడు. మద్యం మత్తులో కసాయిగా మారి అల్లారు ముద్దుగా కనిపెంచిన కుమార్తెని చేతులతోనే నరికేశానని విచారణలో తెలిపాడు. -
వెతకబోయిన కత్తి చేతికి దొరికి..!
సాక్షి, సిటీబ్యూరో: ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో పాటు తనను నిర్లక్ష్యం చేస్తోందనే కక్షతో కన్న కూతురి పైనే కత్తి కట్టిన మనోహరాచారి ఆమెపై దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని చోరీ చేసి తీసుకువచ్చాడు. ఈ కేసుకు సంబంధించి కీలకాధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్లను ఎస్సార్నగర్ పోలీసులు సేకరించారు. ఎర్రగడ్డ ప్రాంతంలో గత బుధవారం తన కుమార్తె మాధవిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు మనోహరాచారిని తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. హత్యాయత్నానికి రెండు రోజుల ముందు నుంచి మనోహరాచారి ముభావంగా ఉండటంతో పాటు విపరీతంగా మద్యం తాగుతున్నాడు. గత బుధవారం ఉదయం మాధవికి ఫోన్ చేసి వస్త్రాలు ఖరీదు చేసుకోవడానికి ఎర్రగడ్డకు రావాలని సూచించాడు. అనంతరం అమీర్పేటలోని దుకాణం నుంచి నేరుగా బైక్పై ఎస్సార్నగర్ వెళ్ళిన మనోహరాచారి అక్కడ ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు. అమీర్పేటలోని సత్యం థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లి మద్యం తాగాడు. మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరిన అతను మాధవిని చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అక్కడి నుంచి మైత్రీ వనం వైపు వస్తూ.. మైత్రీ వైన్స్ పక్కన ఉన్న ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్ద ఉన్న కత్తిని తస్కరించారు. ఈ దృశ్యాలు కొబ్బరి బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మాధవి, సందీప్లపై దాడి జరిగింది. -
కత్తి దొరక్కపోయి ఉంటే..
-
కూతుర్ని చంపి.. తానూ చావాలనుకున్నాడు!
సాక్షి, హైదరాబాద్: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని.. కన్న కూతురినే కడతేర్చాలనుకున్నాడు.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇదీ బుధవా రం హైదరాబాద్లోని ఎస్సార్నగర్లో కన్న కూతురుపైనే కత్తితో దాడిచేసిన మనోహరాచారి ఆలోచన. కత్తి దాడి తర్వాత కూతురు మాధవి చనిపోయిందని భావించాడు. దీంతో రైలు కింద పడి చనిపోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని భార్య లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె ఎస్సార్నగర్ పోలీసులకు సమాచారం అందించింది. బుధవారం సాయంత్రం 3 గంటలు గాలించి మనోహరాచారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడిని జుడీషియల్ రిమాండ్కు తరలించారు. కేసులో మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మనోహరాచారి ఘా తుకానికి ఒడిగట్టడం వెనుక మిర్యాలగూడ దారుణం ప్రభావమున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరీక్ష కలిపింది ఇద్దరినీ.. మనోహరాచారి స్వస్థలం కర్నూలు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్రెడ్డి సీఎంగా ఉండగా ఆ జిల్లాలో కీలక ఫ్యాక్షన్ లీడర్ల వెనుక తిరిగి ఆర్థి కంగా చితికిపోయాడు. విశ్వబ్రాహ్మణ కులానికి చెం దిన వాడు కావడంతో ఆ వృత్తి చేసుకుని బతికేందుకు దాదాపు 20 ఏళ్ల కింద హైదరాబాద్కు వలసొచ్చాడు. ప్రస్తుతం అమీర్పేటలోని ఓ జ్యువెలరీ దుకా ణం బయట ఆభరణాలకు మెరుగుపెట్టే పని చేస్తున్నాడు. కుమారుడు ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుండగా, భార్య లక్ష్మి హైటెక్సిటీలో చిన్న ఉద్యో గం చేస్తోంది. ఆయన కుమార్తె మాధవి 2013లో మోతీనగర్లోని డాన్బాస్కో స్కూల్ పరీక్ష కేంద్రం లో పదో తరగతి పరీక్షలు రాసింది. అదే కేంద్రంలో సందీప్ పరీక్ష రాశాడు. వీరి నంబర్లు ముందు, వెనుక రావడంతో పరీక్షలు పూర్తయ్యేలోపు వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మాధవాచారి కుటుంబం బోరబండ రాజ్నగర్ బస్తీలో, సందీప్ కుటుంబం ఎర్రగడ్డలోని ప్రేమ్నగర్లో నివసిస్తోంది. ఆర్య సమాజ్లో పెళ్లి.. వీరి వివాహానికి సందీప్ కుటుంబం అంగీకరించినా మాధవి తరఫు వారు మాత్రం కుల పట్టింపుతో సమేమిరా అన్నారు. దీంతో వీరిద్దరూ గత బుధవారం మాధవి కుటుంబీకులకు తెలియకుండా ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా, ఇరువురూ మేజర్లు కావడంతో వారి కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి సందీప్తో మాధవిని పంపారు. ఆ సమయంలో సందీప్ ఏం చేస్తున్నాడని పోలీసులు ఆరా తీశారు. ఓ బిర్యానీ సెంటర్లో సూపర్వైజర్గా పని చేస్తూ నెలకు రూ.8 వేలు సంపాదిస్తున్నానని చెప్పాడు. తనను లెక్కచేయట్లేదని.. వారిద్దరూ సందీప్ ఇంట్లోనే ఉంటు న్నారు. గడిచిన వారం రోజుల్లో మనోహరాచారి సందీప్ ఇంటికి 3సార్లు వెళ్లాడు. అతడి తల్లిని అమ్మా అని సంబోధిస్తూ తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అయితే 4 రోజుల కింద జరిగిన ఓ ఘటనతో మనోహరాచారి మానసికంగా కుంగిపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో సందీప్ ఇంట్లో పంచాయితీ జరిగింది. ఆ సందర్భంగా ఓ దశలో నీ కుమార్తె వస్తే తీసుకెళ్లండంటూ సందీప్ మనో హరాచారితో అన్నాడు. తనతో రావాలని తండ్రి కోరగా.. తనకు భర్తే సర్వస్వమని, కులమతాలకు అతీతంగా తాము కలసి ఉంటామని మాధవి చెప్పింది. దీంతో మానసికంగా దెబ్బతిన్న మనోహరాచారి ఆ తర్వాత మూడుసార్లు ఫోన్ చేసినా కుమార్తె నుంచి స్పందన రాలేదు. దీంతో తనను ఎదిరించడమే కాకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆమెపై కక్షకట్టాడు. కూతురిని ఒంటరిగా రమ్మన్నాడు.. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహరాచారి రెండు రోజులుగా ముభావంగా ఉండటంతో పాటు మితిమీరి మద్యం తాగుతున్నాడు. మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ హత్యోదంతాన్ని మీడియాలో చూసి ప్రభావితమయ్యాడు. తీవ్ర ఉద్రేకానికి గురై కుమార్తెను మట్టుపెట్టాలని భావించాడు. మాధవికి ఫోన్ చేసి దుస్తులు కొనేందుకు ఎర్రగడ్డ రావాలని కోరాడు. సందీప్ పనికి వెళ్లి ఉంటాడని, ఇద్దరూ కలసి రారనే భావించాడు. ఫోన్ చేశాక బైక్పై ఎస్సార్నగర్ వెళ్లి మద్యం కొనుకున్నాడు. అమీర్పేటలోని సత్యం థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆ మద్యం తాగాడు. కత్తి దొరక్కపోయి ఉంటే.. మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మైత్రీ వనం వైపు వస్తూ.. ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్దకు చేరుకుని లోపలకు వెళ్లి కొద్ది సేపు ఆగాడు. విజయనగరం నుంచి వలస వచ్చిన దాని యజమాని మూత్ర విసర్జనకు వెళ్లగా అక్కడున్న కొబ్బరి బొండాలు నరికే కత్తిని దొంగిలించి తన బ్యాగ్లో పెట్టుకుని బైక్పై బయల్దేరాడు. ఈ దృశ్యాలు బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాను గోకుల్ థియేటర్ వద్ద ఉన్నానంటూ కుమార్తె నుంచి మనోహరాచారికి ఫోన్ వచ్చింది. 3.30–3.45 గంటల మధ్య అక్కడకు చేరుకున్న మనోహరాచారి.. కుమార్తె వెంట సందీప్ను చూసి మొదట అతడిపై, ఆ తర్వాత మాధవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కొబ్బరి బొండాల దుకాణంలో ఆ కత్తి దొరక్కపోయి ఉంటే కథ వేరేలా ఉండేదని పోలీసులు అంటున్నారు. రెండు మూడుసార్లు పథకం.. ఎంతో గారాబంగా పెంచిన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పించిందని మనోహరాచారి పేర్కొన్నాడు. మాధవిని మాత్రమే చంపాలని నిర్ణయించుకునట్లు చెప్పాడు. రెండు మూడు సార్లు పథకం వేసినా మాధవి, సందీప్ కలసి రావడంతో వదిలిపెట్టినట్లు తెలిపాడు. రద్దీ ప్రాంతానికి పిలిస్తే అనుమానం రాకుండా వస్తారనే భావనతో ఎర్రగడ్డకు పిలిపించానని మనోహరాచారి వివరించాడు. దాడి అనంతరం రోడ్డు దాటి ఆటోలో బల్కంపేట మీదుగా లాల్బంగ్లా వద్ద ఆటో దిగి మక్తాలోకి వెళ్లానని చెప్పాడు. భయం భయంగా.. హత్యాయత్నానికి పాల్పడ్డ మనోహరాచారి భార్యా, కుమారుడు భయంతో గడుపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకూ భయపడుతున్నారు. బోరబండలో ఉన్న వారి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడేందుకు సైతం వారు ధైర్యం చేయలేకపోతున్నారు. మాల కులంలో పుట్టడమే నేరమా: సందీప్ తల్లి రమాదేవి మాల కులంలో పుట్టడమే తప్పా. నా కొడుకు, మాధవి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెను సొంత కూతురిలా చూసుకున్నాను. తమ పుట్టింటి కంటే ఇక్కడే బాగుందని చెప్పింది. కొడుకు, కోడలు జంట ఎంతో బాగుందనుకున్నాను. కానీ అంతలోనే ఈ దారుణం జరిగింది. నిలకడగా మాధవి పరిస్థితి.. కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వెంటిలేటర్ కూడా తొలగించారు. ఆమెకు ప్రాణాపాయమేమీ లేదని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, కుల నిర్మూలన పోరాట సమితి, తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు గురువారం యశోద ఆసుపత్రిలో మాధవిని పరామర్శించారు. నమ్మించి దాడి చేశాడు: సందీప్ తమ వివాహన్ని మాధవి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే తాము ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నామని సందీప్ తెలిపాడు. గురువారం ఆస్పత్రి నుంచి సందీప్ డిచ్చార్జి అయ్యాడు. 2015లో తమ ప్రేమ విషయం మాధవి ఇంట్లో తెలిసి తల్లి లక్ష్మి, సోదరుడు వచ్చి బెదిరించి వెళ్లారని చెప్పాడు. తమ పెళ్లయ్యాక పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన సందర్భంగా మాధవి కోసం దాచిన రూ.5 లక్షలు ఇస్తానని మనోహరాచారి చెప్పినట్లు తెలిపాడు. వివాహ విందుకు దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి దాడి చేశాడని చెప్పాడు. ఎప్పటికైనా తనను, తన భార్యను చంపేస్తాడేమోనని భయంగా ఉందని, తమ కుటుంబానికి భద్రత కావాలని కోరాడు. చనిపోయిందనుకుని.. రక్తపు మడుగులో పడిఉన్న మాధవిని చూసి చనిపోయిందని భావించి పారిపోయాడు. కొద్దిసేపటికే భార్య లక్ష్మికి ఫోన్ చేసి.. మాధవిని చంపేశానని, కుమారుడిని జాగ్రత్తగా చూసుకొమ్మని, తాను రైలు కింద పడి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో లక్ష్మి ఎస్సార్నగర్ పోలీసులకు చెప్పింది. సనత్నగర్ నుంచి లక్డీకాపూల్ వరకు ఉన్న రైల్వే ట్రాక్లపై 3 గంటల పాటు గాలించారు. చివరకు మక్తా వద్ద రైలు పట్టాల సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయానికి తరలించిన తర్వాతే అతడికి మాధవి బతికుందనే విషయం తెలిసింది. గురువారం ఉదయానికి మద్యం మత్తు దిగినాక కూడా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మాధవితో మాట్లాడాను : మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తండ్రిలో చేతిలో పాశవికంగా దాడికి గురైన మాధవి ప్రస్తుతం క్షేమంగా ఉందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవిని గురువారం కలిశానని ఆయన తెలిపారు. మాధవితో మాట్లాడానని, ప్రస్తుతం ఆమె చాలా ధైర్యంగా ఉందని.. తల్లి, తమ్ముడిని చూడాలని ఉందంటూ అడిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవికి వైద్యం అందించిన ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. రక్షణ కల్పించడంలో విఫలం... మిర్యాలగూడ ప్రణయ్ హత్యపై దేశం మొత్తం స్పందించింది.. కానీ కేసీఆర్ మాత్రం స్పందించలేదని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణయ్, మాధవిల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వమే ఇటువంటి ఘటనలపై స్పందించకపోతే శాంతి భద్రతలు ఎక్కడికి పోతాయంటూ ప్రశ్నించారు. 24 గంటల్లో ఈ ఘటనలపై కేసీఆర్ తన వైఖరి తెలపకపోతే.. 48 గంటల్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ఎవరివైపు? మాధవిపై అత్యంత పాశవికంగా దాడి జరిగితే.. మనోహరాచారి మద్యం మత్తులో హత్యాయత్నం చేశాడని డీసీపీ ఎలా చెబుతారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ చూస్తుంటే నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందంటూ ఆరోపించారు. -
మాధవి హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణాలతో పోరాడుతున్న మాధవి హెల్త్ బులిటెన్ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..‘మాధవి ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటిలెటర్ తొలగించాం. 48 గంటల తర్వాత జనరల్ వార్డుకు తరలిస్తాం. తండ్రి ఇంత దారుణంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర షాక్కు గురైంది. తన తల్లి.. తమ్ముడిని చూడాలని కోరింది. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో ఎక్కువ మందిని చూడటానికి అనుమతిని ఇవ్వటంలేదు’ అని తెలిపారు. అసలేం జరిగిందంటే.. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు. బైక్పై వచ్చి మనోహర చారి బ్యాగులో తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. ముందుగా సందీప్పై దాడి చేశాడు. మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. -
విషమంగానే మాధవి ఆరోగ్య పరిస్ధితి
-
ఇంకా వెంటిలేటర్పైనే మాధవి
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణలతో పోరాడుతున్న మాధవి హెల్త్ బులిటెన్ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మాధవికి ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. కత్తితో నరకడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందన్నారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నలుగురు వైద్యుల బృందం ఆమెకి చికిత్స అందించిందన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ‘మాధవి ఆస్పత్రికి వచ్చే సరికి చాలా రక్తస్రావం జరగడంతో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది. 8 గంటలపాటు శ్రమించి రక్తస్రావాన్ని తగ్గించాం. ఆమెకు ఆరు బాటిళ్ల రక్తాన్ని ఎక్కించాం. మెడపై ఆమెకు తీవ్ర గాయమైంది. ముఖకవళికలకు సంబంధించిన నరాలు, మెదడుకు వెళ్లే ప్రధాన నరం, ఎడమ చేయి ఎముక పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు సర్జరీలు చేసి వాటిని సెట్ చేసాం. మెడపై ఉన్న గాయాలను తగ్గించే ప్రయత్నం చేశాం. తొలుత ఆమె ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించాం. ఆమె ఇతర ఆవయవాలపై ప్రభావం చూపకుండా ఈ శస్త్రచికిత్సలు నిర్వహించాం. ఇది చాలా సంతృప్తికరంగా సాగింది. అయినప్పటికీ మరో 48 గంటలు గడిస్తే గానీ మాధవి కండీషన్ చెప్పలే’మని తెలిపారు. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె
సాక్షి, విశాఖపట్నం: చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి శనివారం రాంబిల్లి మండలం పంచదార్లలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆమె వెంట పాడేరు నియోజకవర్గానికి చెందిన వేలాది మంది సీపీఐ, వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు దేముడు అభిమానులు వందలాది వాహనాల్లో పాల్గొన్నారు. బీఎస్సీ, బీపీఈడీ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం కొయ్యూరు గిరిజన సంక్షేమ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ అస్వస్థతకు గురైన దేముడు 2015 అక్టోబర్లో మరణించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేముడిని మెరుగైన వైద్యం కోసం మన్యం నుంచి హెలి కాప్టర్లో హైదరాబాద్ తరలించిన విషయాన్ని వెంట వచ్చిన అభిమానులు గుర్తు చేసుకున్నారు. మాధవికి తల్లి చెల్లయ్యమ్మ, ఇద్దరు సోదరులు ఉన్నారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే దేవుడి కూతురు మాధవి
-
భర్తను చంపి.. లొంగిపోయిన భార్య..
సాక్శి, చిత్తూరు : జిల్లాలోని శాంతిపురం మండల కేంద్రంలో వ్యాపారి హత్య సంఘటన సంచలనం సృశ్టిస్తోంది. తన భర్తను తానే చంపానంటూ భార్య పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. శాంతిపురంలో శివాజీ గణేశన్ అనే వ్యాపారి గత ఆరు సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మాధవి అనే మహిళతో ఆయనకు వివాహం అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు, ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో శనివారం గణేశన్ను తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. వ్యాపార పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండే గణేశన్ హఠాత్తుగా హత్యకు గురి కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గణేశన్-మాధవి దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే, మాధవి ఉదయం కుప్పం పొలీస్ స్టేశన్కి వెళ్ళి లొంగిపోవడం వెనక వారి మధ్య ఏదో గొడవ ఉందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. శివాజీ గణేశన్ శరీరంపై పలు కత్తిపోట్లు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు భార్యే ఈ హత్య చేసి ఉంటుందా? అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే చిత్తూరు నుంచి క్లూస్ టీం సంఘటనాస్థలంలో అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు కూడా తమ శైలిలో విచారణను ఆరంభించారు. అయితే మృతుడు శివాజీ గణేశన్కి అతని కుటుంబం మధ్య తగాదాలు ఉన్నాయని ఈ తగాదాల కారణంగానే వేరేవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో శివాజీ గణేశన్ సోదరుడైన పండరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూలంకషంగా విచారణ జరిగితే తప్ప పండరికి, గణేశన్ హత్యకు ఉన్న లింకు ఏమిటనేది బయటపడదు. -
కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
-
సెల్ఫోన్ దొంగతనం ఆపాదించడంతో..
భార్య మృతిచెందడంతో అతను అన్నీతానై బిడ్డను పెంచాడు. చదువులో చురుగ్గా ఉండడంతో కాయకష్టం చేసి ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఏమి జరిగిందో కాని ఆ విద్యార్థిని కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని బలవన్మరణం పొందింది. దీంతో తండ్రి ఆవేదన అంతాఇంతా కాదు. ఉన్నత చదువులు చదివి అండగా ఉంటుందనుకున్న కుమార్తె అర్ధంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలం వేలవేడు పంచాయతీ మాధమాల గ్రామానికి చెందిన అక్కుపల్లి బలరామయ్య యాదవ్, భారతి దంపతుల కుమార్తె మాధవి(18). మాధవికి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి భారతి మృతి చెందింది. బలరామయ్య మళ్లీ నెల్లూరు జిల్లా వెందోడు గ్రామానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబ కలహాలతో సుజాత బలరామయ్యకు దూరమైంది. అప్పటి నుంచి మాధవిని బలరామయ్య గారాబంగా పెంచుకున్నాడు. మాధవి 1 నుంచి 5వ తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివింది. 10వ తరగతి వరకు ఏర్పేడు మండలం పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ శ్రీకాళహస్తిలోని రాయలసీమ జూనియర్ కళాశాలలో పూర్తి చేసింది. కుమార్తె చదువుల్లో రాణిస్తుండడంతో బలరామయ్య ఉన్నత చదువులు చదివించడానికి ఆసక్తి చూపాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఆగస్టు 10వ తేదీన సివిల్ ఇంజినీరింగ్లో చేర్పించాడు. ఆమె అదే కళాశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటోంది. ఏమి జరిగిందో కాని ఆమె ఇటీవల ఇంటికి వచ్చేసింది. మూడు రోజులు ఇంటి దగ్గరే ఉండి శనివారం తిరిగి కళాశాలకు వెళ్లింది. సోమవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీటెక్లో చేరిన ఏడు నెలలకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందనే వార్త వినగానే తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. ‘భార్య దూరమైతే కంటికి రెప్పలా కాపాడుకుంటినే.. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లిపోయావా తల్లీ అంటూ ఆయన చేస్తున్న రోదన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. సెల్ఫోన్ దొంగతనం ఆపాదించడంతో.. మాధవి ఉంటున్న హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని సెల్ఫోన్ కనిపించకపోయింది. దీంతో తోటి విద్యార్థినులు మాధవిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాధవి తన తండ్రికి తెలియజేయడంతో ఆయన నాలుగు రోజుల క్రితం కళాశాలకు వచ్చి హెచ్వోడీతో మాట్లాడారు. దీన్ని మాధవి అవమానంగా భావించింది. ఆదివారం రాత్రి తోటి స్నేహితులతో కలిసి నిద్రపోయిన మాధవి సోమవారం శవమై కనపించడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కళాశాల యాజమాన్యం వసతి గృహంలోని విద్యార్థినులను ఇళ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు, చిల్లకూరు, మనుబోలు ఎస్ఐలు శ్రీనివాసరావు, జేపీ శ్రీనివాసరావు కళాశాలకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. బాత్రూం తలుపును పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ రామ్ గారు, మేము ఒకరికొకరు 5 ఏళ్లుగా ఇష్టపడుతున్నాం. నాకు 23. అతనికి 27 ఏళ్లు. అతను బిజినెస్ చేస్తున్నాడు. చెప్పుకోదగ్గ ఆస్తి లేకున్నా, నన్ను హ్యాపీగా చూసుకోగలిగినంత సంపాదిస్తున్నాడు. నేను జాబ్ చేస్తున్నాను. మా పేరెంట్స్ నాకు బాగా ఆస్తి ఉన్న అబ్బాయిని ఇచ్చి చెయ్యాలనుకుంటున్నారు. అతని పేరెంట్స్కి మేము పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ ఇంకా టైం పడుతుంది అంటే సహించలేకపోతున్నారు. మావాళ్లు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. జాబ్ కూడా మాన్పించేశారు. నేను నా ప్రేమ గురించి మాట్లాడితే మా అమ్మకి హెల్త్ డిస్ట్రబ్ అవుతుంది. ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్లు చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకుని ప్రేమిస్తున్న అతన్ని మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. అతనికి దూరంగా ఉండలేకపోతున్నాను. సలహా ఇవ్వగలరు ప్లీజ్... – మాధవి మాధవి బంగారం. ‘సార్... ఒక్కసారయినా అబ్బాయిలను బంగారం.. కన్నా.. నాన్నా అని పిలిచారా సార్..’ బంగారాన్ని బంగారం అని పిలుస్తా. దొంగవాణ్ణి దొంగ అని పిలుస్తా. ‘అంటే అబ్బాయిలంతా దొంగలా సార్.. దిస్ ఈస్ ఆబ్సల్యూట్లీ అన్ ఫెయిర్ సార్.. దొంగ ఏంటి సార్ దొంగ?!! హౌ డేర్ యూ సార్..’ దొంగతనం చేస్తే దొంగ అనకపోతే బంగారం అని పిలవాలా? నా చెల్లెలు మాధవి బంగారం... వాడు దొంగారం ఇదే ఫైనల్. ‘ఏమి దొంగిలించాడు సార్... మీ ఆస్తా.. మీ బావమరిది ఆస్తా? సార్!’ మధ్యలో నా బావమరిదిని తీసుకురాకు.. ‘అమ్మాయి హెల్ప్ అడిగితే మధ్యలో అబ్బాయిని తేకండి సార్’ ఓకే ‘ఓకే’ ఓకే ‘సార్.. దొంగ ఎందుకు అన్నారు సార్?’అమ్మాయి మనసు దొంగిలించాడు కదా ‘ఓహ్... హౌ స్వీట్ సార్’ అలాగే అమ్మాయి పేరెంట్స్ మనస్సు కూడా కబ్జా చేసుకోమంటా. ‘అప్పుడు బంగారం అని పిలుస్తారా సార్ అబ్బాయిని!’ గజదొంగ అంటా... ఎనీ డౌట్?‘ఇదిగోండి అరటిపండు వితౌట్ డౌట్ -
లవ్ డాక్టర్ న న్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! ఒన్ ఇయర్గా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ విషయం తనకి కూడా తెలుసు. బట్ తను నన్ను పట్టించుకోవడం లేదు. తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా చెప్పి చూశారు. అయినా తను వినలేదు. తనకోసం చాలా సార్లు నా ఆత్మభిమానాన్ని చంపుకున్నా. తనకోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తానని చెప్పాను. బట్ తను వేస్ట్ అంటున్నాడు. తన మనసులో వేరే అమ్మాయి లేదు. ఇంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. బ్రేకప్ అయ్యింది. ఘోరంగా బాధపడ్డాడు. తను లేకుండా నేను ఉండలేను. ఎలా మరిచిపోవాలో అర్థం కావడం లేదు. తనకి ఇంప్రెస్ చెయ్యడమంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎలా సార్? బనానా జోక్స్ వద్దు సార్! మంచి సలహా ఇవ్వండి ప్లీజ్!! – మాధవి ‘యాపిల్ తెమ్మంటారా సార్’ ‘ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు?’ ‘ఎందుకు సార్ అంత కోపం మీ మాధవి సిస్టర్ చెప్పింది కదా నో బనానా జోక్స్ అని’ వాడు యాపిల్. నా చెల్లెలు సింపుల్ బనానా. బనానాకి బనానాకి వర్క్ అవుట్ అవ్వుద్ది కానీ, వాట్ ఈజ్ దిస్ యాపిల్, బనానా స్టోరీ? వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే మనం గౌరవంగా ఉండాల్సింది పోయి.. అన్నయ్యా... వాడే కావాలి! అంటే... హౌ ఇట్ ఈజ్ పాజిబుల్? ‘మరి ఏం చెయ్యాలి సార్ మాధవి?’ ఫుల్గా వాడిని ఇగ్నోర్ చెయ్యాలి. దెబ్బకు వాడే తోకాడిస్తూ వస్తాడు!! ‘ఆహా.. ఓహో... మీకు పౌరుషం వస్తే మీరు మనిషి కాదు సార్!’ ‘జోక్ సార్! ఇదిగో అరటిపండు!!’ అని నవ్వింది నీలాంబరి. ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలు తల్లీ కొడుకు ప్రాణాలు తీశాయి. ముక్కుపచ్చలారని మూడేళ్ల కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజిపేటలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన నందమోని కురుమయ్య కుమార్తె మాధవిని మూడేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం షాపురం గ్రామానికి చెందిన జుట్టు శ్రీనువాసులుకు ఇచ్చి వివాహం చేశారు. దంపతులిద్దరు మహదేవునిపేటలో ఉండి కూలీపనులు చేసుకుంటున్నారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా వచ్చింది. శ్రీనువాసులు తన పాత ఆటోను మరమ్మతు చేయించుకుంటానని స్వగ్రామానికి వెళ్లాడు. మాధవి తన అక్కగారి ఊరైన మానాజిపేటకు వెళ్లింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మూడేళ్ల కొడుకు యశ్వంత్పై ముందు కిరోసిన్ పోసి తానూ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇంటి ముందు ఉన్న సపారం (గడ్డితో ఉన్న కప్పు)కు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలను ఆర్పివేసే సరికి తల్లి, కొడుకు మంటల్లో కాలిపోయారు. -
అంజలి కాదు.. మాధవి!
సాక్షి, సిటీబ్యూరో: వ్యక్తిగత రుణాల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు టోకరా వేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన అంజలి అసలు పేరు మాధవిగా తేలింది. ఈమెపై గతంలోనూ రెండు కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మాధవితో పాటు ఈ నేరానికి సహకరించిన నర్సింహ్మారావును బుధవారం పట్టుకుని రిమాండ్కు తరలించిన విషయం విదితమే. వీరు వరంగల్లోనూ మోసాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చినచీర్లపల్లికి చెందిన వివాహిత బి.మాధవి, వారాసిగూడకు చెందిన జి.నర్సింహ్మారావు కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. రుణం తీసుకొనేందుకు ఎవరైనా ఫోన్ చేస్తే.. బజాజ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణాలు ఇస్తామంటూ అంజలి నమ్మబలికేది. రుణం ఇవ్వడంలో ఓ చిత్రమైన లాజిక్ చెప్పేది. నాగోల్లో ఉన్న బజార్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నుంచి మార్జిన్ మనీ చెల్లించడం ద్వారా సులభ వాయిదాల పద్ధతిలో వస్తువులు ఖరీదు చేయాలని, తర్వాత వాటిని తమకు విక్రయిస్తే నగదు ఇస్తామని, షోరూమ్కు సులభవాయిదాల్లో మొత్తం చెల్లించవచ్చని వల వేసేది. అలా చేసిన ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని మోసం చేసేవారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు అంజలి, నర్సింహ్మారావును అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో నిందితురాలు తన పేరును అంజలిగా చెప్పింది. లోతుగా ఆరా తీసిన సైబర్క్రైమ్ పోలీసులు ఆమె అసలు పేరు మాధవిగా గుర్తించారు. 2013లోనూ ఈమెపై సీసీఎస్లో రెండు కేసులు నమోదు కావడంతో అరెస్టు చేసినట్లు తేలింది. అప్పట్లో ఓ యాడ్ ఏజెన్సీ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్ తరహాలో వందల మందిని మోసం చేసిందని సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ తెలిపారు. ఈ కేసుల్లోనూ అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మరోపక్క తాజా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు బాధితుల వివరాలూ సేకరించడానికి మాధవిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకొనేందుకు దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ రవికిరణ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈమె చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని కోరారు. -
కాన్పుకొచ్చి .. కానరాని లోకాలకు..
• సిజేరియన్ అనంతరం పరిస్థితి విషమం • చికిత్స పొందుతూ బాలింత మృతి అనంతపురం సిటీ : కాన్పు కోసం వచ్చిన ఓ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చి కానరానికి లోకాలకు వెళ్లింది. భూమ్మీద అడుగు పెట్టిన కొద్ది గంటల్లోనే తల్లిని కోల్పోయిన ఆ శిశువును చూసి ప్రతి ఒక్కరూ అయ్యో..పాపం అంటూ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన అనంతపురం సర్వజనాస్పత్రిలో జరిగింది. ఎలా జరిగిందంటే... గుత్తి మండలం బేతపల్లికి చెందిన మాధవి(21) వివాహం పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన రామాంజినేయులుతో జరిగింది. మొదటి కాన్పులో మగ బిడ్డకు మాధవి జన్మనిచ్చింది. రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల 14(ఆదివారం)న ఉదయం చేర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు సిజెరీయన్ చేసి ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అదే రాత్రి 9 గంటలకు మాధవికి మూర్ఛ లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంటనే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. రాత్రంతా మూర్చ రావడంతో కుట్లు తెగిపోయాయని వైద్యులు తమకు చెప్పినట్లు మాధవి బంధువులు అంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మాధవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతికి దారి తీసిన కారణాలపై కుటుంబ సభ్యులకు సరైన సమాచారం లేదు. కాన్పు వరకు బాగున్న మాధవి రాత్రికి రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతి చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. శిశువును తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు అనంతపురం రూరల్ పరిధిలోని చంద్రబాబు కొట్టాలకు చెందిన ఓ మహిళ కాన్పు అనంతరం మృతి చెందింది. ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని సీపీఐ నేతలు ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి పట్టుమని పది రోజులు కూడా గడవకనే మరో తల్లి చికిత్స పొందుతూ మృతి చెందడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడ వైద్య సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అయినా ఉన్నతాధికారులు పట్టించకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
ఇంట్లో ఉంటే దొంగిలిస్తారని... బ్యాగులో పెట్టుకుంది..
హైదరాబాద్ : చైతన్యపురి నుంచి చౌటుప్పల్కు ఆటోలో వెళ్తున్న మాధవి అనే మహిళ హ్యాండ్ బ్యాగ్ మాయమైంది. చైతన్యపురిలో నివాసముంటున్న మాధవి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చౌటుప్పల్లోని తన ఇంటికి వెళదామని అనుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోతే దొంగలు పడతారు అని భావించిన ఆమె.... ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, రూ.20 వేల నగదు బ్యాగ్లో పెట్టుకుని ఆటోలో చౌటుప్పల్కు బయలుదేరింది. అయితే హయత్నగర్ వచ్చేసరికి నగలు, నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితురాలు హయత్నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. -
చావైనా.. బతుకైనా అతడితోనే..
► భర్త ఇంటి ముందు యువతి మౌనపోరాటం ► విజయవాడ నుంచి వచ్చి ఆందోళనకు దిగిన దివ్యాంగురాలు ► బాధితురాలికి అండగా నిలిచిన మిగిలిన దివ్యాంగులు దర్శి : పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేశాక భర్త పట్టించుకోక పోవడంతో ఓ యువతి తీవ్ర ఆవైదనకు గురై తన అత్తగారి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. వివరాలు.. విజయవాడ భవానీపురానికి చెందిన నర్రా మాధ వి మూడేళ్ల క్రితం మండల పరిధిలోని తూర్పుచౌటపాలెంలోని బంధువుల వివాహానికి వచ్చింది. అక్కడ మరో సామాజిక వర్గానికి చెందిన కుడి మెల చంద్రబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పట్లో చంద్రబాబు విశాఖపట్నంలో చదువుతున్నాడు. 2013 మే 19వ తేదీన ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా విజయవాడ సమీపంలోని గుణదలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయాన్ని చంద్రబాబు చాలాకాలం వరకు తన కుటుంబ సభ్యులకు చెప్పలేదు. విశాఖపట్నంలో చదువుకుంటూ పది రోజులకు ఒకసారి విజయవాడలోని తన భార్య మాధవి ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఆమెను మూడుసార్లు గర్భిణిని చేసి అబార్షన్ కూడా చేయించాడు. పెళ్లి విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని, ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తానని భార్యను నమ్మించాడు. రెండేళ్ల అనంతరం విషయం చంద్రబాబు ఇంట్లో తెలిసింది. కుమారునికి మరో సంబంధం చూస్తున్నారు. అప్పటి నుంచి మాధవితో ఆమె భర్త సరిగా మాట్లాడటం లేదు. ఆమె ఫిర్యాదు మేరకు 2015 అక్టోబర్ 31వ తేదీన దర్శి పోలీసుస్టేషన్లో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కాపురానికి పంపారు. విజయవాడలో వేరు కాపురం కూడా పెట్టారు. మళ్లీ కుక్కతోక వంకరే మూడు నెలల కాపురం అనంతరం మళ్లీ భార్యను వదిలి ఇంటికి వచ్చేశాడు. భార్యతో ఫోన్లో కూడా మాట్లాడేందుకు నిరాకరించాడు. బుధవారం రాత్రి బాధితురాలు తన భర్త చంద్రబాబు ఇంటికి వెళ్లింది. భార్యను ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయట గేటు వేశారు. రాత్రంతా ఇంటి బయటే మెట్లపై కూర్చొంది. బాధితురాలికి వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనాల సురేష్, జిల్లా అధ్యక్షుడు దుర్గారావు, జాతీయ వర్కింగ్ అధ్యక్షురాలు కొల్లి మాధవీలత మద్దతుగా నిలిచారు. దివ్యాంగురాలిని వేధించడం అన్యాయం బాధితురాలికి అండగా నిలిచిన వీహెచ్పీఎస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగురాలిని కించపరిచి మోసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాధవికి న్యాయం చేయాల్సిందేనని కోరారు. తన భర్త వచ్చే వరకూ ఇక్కడే కూర్చొంటానని బాధితురాలు తేల్చి చెప్తోంది. గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చారు. బాధితురాలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వనట్లు తెలిసింది. -
ఇసుక డంపులపై దాడులు..
- ఆరు వాహనాలు సీజ్ బోయిన్పల్లి కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలోని ఇసుక అక్రమ డంప్లపై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రొక్లెయినర్, రెండు లారీలు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొదురుపాక వాగు నుంచి ఇసుక అక్రమంగా తవ్వి ఇక్కడ నిల్వ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం మేరకు వేములవాడ రూరల్ సీఐ మాధవి ఆటోలో సంఘటనా స్థలానికి వెళ్లి ఈ దాడులు నిర్వహించారు. -
క్రేజీ క్రేజీ టీనేజ్!
ఆత్మబంధువు ‘‘హాయ్ అక్కా.... ఎలా ఉన్నారు?’’ మాధవిని పలకరించింది రేఖ. ‘‘ఫైన్. నువ్వేంటీ ఇక్కడా?!’’ ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ‘‘ఏం నేను షాపింగ్కు రాకూడదా?’’ ‘‘అలాగనేం కాదు. నువ్వు పుస్తకాల పురుగువి కదా. షాపింగ్కి ఆమడ దూరం కదా. అందుకే అడిగాను.’’ ‘‘అఫ్కోర్స్.. ఐ లవ్ బుక్స్. ఇప్పుడు కూడా బుక్స్ కొందామనే వచ్చా.’’ ‘‘అనుకున్నా’’ నవ్వుతూ అంది మాధవి. ‘‘సర్లే అక్కా నీ జోకులాపు. ఇంకేంటీ సంగతులు. పిల్లలెలా ఉన్నారు?’’ ‘‘పిల్లలకేం... బాగానే ఉన్నారు. మాకే కష్టంగా ఉంది.’’ ‘‘ఏమైందక్కా?’’ ‘‘ఏం చెప్పన్రా. చెప్పాలంటే పెద్ద కథే.’’ ‘‘అవునా... అయితే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద’’ అంటూ కాఫీ షాపుకు తీసుకెళ్లింది రేఖ. ‘‘ఆకాష్ ఇంటర్, నీహారిక టెన్త్ క్లాస్. ఇద్దరూ ఇద్దరే. చెప్పిన మాట అస్సలు వినడం లేదు’’ కాఫీ తాగుతూ చెప్పింది మాధవి. ‘‘టీనేజ్ కదా. ఇది కామన్.’’ ‘‘ఏంటి కామన్? ఒక్క మాట వినరు. ఏం చెప్పినా.. మాకు తెలుసులే అంటారు. ఇంకా చెప్పాలంటే... ఎదురు మాట్లాడతారు. వాడైతే విసురుగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అదేమో గదిలోకి వెళ్లి ధడేల్మని తలుపేసుకుంటుంది. వీళ్లతో ఎలా వేగాలో అర్థం కావడం లేదు.’’ ‘‘టీనేజ్ అంటే అంతే. నిన్నటిదాకా చిన్నపిల్లల్లా మన వెంటే తిరిగినవాళ్లు పెద్దాళ్లయిపోయే వయసు. ఆ క్రమంలో వాళ్లు సొంతంగా ఆలోచిస్తారు. సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటిని స్పష్టంగా చెప్పేస్తారు. వాటికి మనం అంగీకరించనప్పుడు మరింత గట్టిగా చెప్తారు. దాంతో వాళ్లు ఎదురు మాట్లాడి నట్లు మనం అనుకుంటాం. అంతే’’ చెప్పింది రేఖ. ‘‘అంతేనంటావా?! సరే... పొద్దున లేస్తే ఫోన్, ఫ్రెండ్స్. దీనికేమంటావ్?’’ ‘‘టీనేజ్ పిల్లలు ఫ్రెండ్స్కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ పేరెంట్స్కు ఇవ్వరు. ఆ వయ సులో ఫ్రెండ్స్ మాటే వేదం. ఇక ఫోనం టావా... ఇప్పుడది లేకుండా ఎవరమైనా బయటకు కదులుతున్నామా?’’ ‘‘అలాగని వాళ్లు ఫోన్లో ఏమేమో మాట్లాడితే ఎలా?’’ ‘‘అక్కా... ఇక్కడే మనం తెలివిగా, లౌక్యంగా వ్యవహ రించాలి. వయసుకు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ఉండాలని పెద్దలు చెప్పిన మాట గుర్తుందా? టీనేజ్ పిల్లలు మనం చెప్పింది వినాలంటే, మనం వాళ్ల ఫ్రెండ్స్గా మారిపోవాలి. వారి ఆశలు, ఆశయాలు, కలలు, కబుర్లు అన్నీ ఓపిగ్గా వినాలి, వాళ్లతో మన ఆలోచనలు పంచు కోవాలి. అప్పుడు వాళ్లే అన్నీ చెప్తారు. ఆ వయసులో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా మార్పులు చాలా వేగంగా ఉంటాయి. ఆ మార్పులను వాళ్లు అర్థం చేసుకోలేక గాభరా పడుతుంటారు. అప్పుడు మనమే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే ఫ్రెండ్స్ను అడుగు తారు, వాళ్లు తమకు తెలిసింది చెప్తారు. అది మంచీ కావచ్చు, చెడూ చేయొచ్చు.’’ ‘‘నిజమే రేఖా... మొన్న నీహారికకు మొటిమలు వస్తే వాళ్ల ఫ్రెండ్స్ ఇచ్చిందని ఏదో క్రీమ్ రాసింది. మొహమంతా దద్దుర్లు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. ఒకటే తిట్లు, ఇలాంటివి మొహానికి ఎలా రాస్తారని’’ చెప్పింది మాధవి. ‘‘అందుకే... వాళ్లకు మనం నమ్మక మివ్వాలి... ఏం చెప్పినా అమ్మా నాన్నా అర్థం చేసుకుంటారని. అప్పుడు అన్నీ మనతోనే చెప్తారు.’’ ‘‘ఇక మీదట అలాగే ఉంటాను’’ చెప్పింది మాధవి. ‘‘ఈ వయసులో వాళ్ల ఇంట్రస్ట్లు, ఆటిట్యూడ్, వాల్యూస్ వేగంగా మారిపో తుంటాయి. వాటిని గమనించాలి.’’ ‘‘ఔన్రా... ఆకాష్గాడికి ఈ మధ్య బైక్స్ పిచ్చి పట్టింది. వాళ్ల నాన్నను అడిగితే ఇవ్వడని, మొన్న ఫ్రెండ్ బైక్ నడిపి దెబ్బలు తాకించుకున్నాడు. పెద్ద దెబ్బలేం కాదులే. కానీ వాళ్ల నాన్న నాలుగు పీకాడు గట్టిగా.’’ ‘‘అదే మనం చేసే తప్పు. ఆ వయసు పిల్లల్ని కొడితే మనపై ద్వేషం పెంచుకునే ప్రమాదం ఉంది.’’ ‘‘అలాగని వాళ్లు తప్పులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ‘‘చూస్తూ ఊరుకోమని కాదక్కా. తప్పేమిటో ఒప్పేమిటో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆకాష్ను కొట్టే కంటే... అన్నయ్యే దగ్గరుండి బైక్ నేర్పితే సరిపోయేది.’’ ‘‘ఓహ్.. అలానా! సరే ఆయనకు చెప్తాలే. ఇంకా?’’ ‘‘అక్కా... పిల్లలకు లంచ్ టైమ్ అవుతుంది. నేను వెళ్లాలి. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. తాపీగా మాట్లాడుకుందాం.’’ ‘‘ష్యూర్ రేఖా. తప్పకుండా త్వరగానే వస్తా. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫో!’’ అంటూ వీడ్కోలు తీసుకుంది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
పెళ్లి చేసుకోనన్నాడని..
గార్ల : ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోనన్నందుకు మనస్తాపానికి గురయిన ఓ బాలిక ఈనెల 21న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా గార్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అంబేద్కర్ నగర్కు చెందిన కందుల మాధవి(15) 8వ తరగతి చదువుతోంది. అయితే అదే కాలనీకి చెందిన కుసుమూరి సందీప్ రెండు నెలల క్రితం మాధవి ఇంటికి వచ్చి.. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ప్రేమ విషయం బాలిక తల్లికి చెప్పడంతో ఆమె అంగీకరించింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం మాధవి కిరాణ దుకాణం వద్దకు వెళ్లగా.. సందీప్ ఆమె వద్దకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురయిన మాధవి ఈనెల 21న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తల్లి సుశీల ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మాధవి కేసులో భాను అరెస్ట్
నెల్లూరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ వీర మాధవి (28) ఆత్మహత్య కేసులో ప్రియుడు భానుతేజను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేయడంతో తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు కారణాలను వివరించి మాధవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 'భానూ..ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా..నా చేతులకు గాజులు వేసి..నా ముఖాన ఇంత బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లయిపోయింది భానూ.. ఈ ఒకే ఒక్క కోరిక తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్లోకి..ఇంకెవరి లైఫ్లోకి రాను.. మీకందరికీ దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను.. ఇక సెలవ్..'అంటూ వీడియో సెల్ఫీ తీసుకున్న మాధవి బలవన్మరణానికి పాల్పడ్డారు. కావలిలోని కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన మాధవి పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. మాధవి ఆత్మహత్యకు కారణమైన భానుతేజను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. -
మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవి సస్పెన్షన్
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ బయో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో నిందితురాలిగా ఉన్న రాజయ్య భార్య మాధవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 3న తెల్లవారుజామున సారిక సజీవ దహనం కాగా, అదే రోజు పోలీసులు మాధవిని అరెస్ట్ చేసినప్పటికీ పోలీసుల నుంచి రిమాండ్ రిపోర్టు అందలేదు. తాజాగా ఆ రిపోర్టు కేయూ అధికారులకు రిమాండ్ రిపోర్టు అందగా, కేయూ ఇన్చార్జి వీసీ చిరంజీవులు అనుమతి మేరకు ఇన్చార్జి రిజిస్ట్రార్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం మాధవిని సస్పెండ్ చేశారు. అయితే ఈనెల 5 నుంచి మాధవిపై సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, మాధవి సిర్పూర్ కాగజ్నగర్లోని ఓ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ 2010లో కేయూ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యూరు. ఈ మేరకు క్యాంపస్లోని బయో టెక్నాలజీ విభాగంలో సుమారు రెండేళ్ల పాటు పనిచేశాక, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి బదిలీ అయ్యూరు. కేయూ చరిత్రలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్ కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. -
పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య..
జైలు నుంచి భర్త విడుదల కాలేదని మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు.. కన్నబిడ్డలను చంపి.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నార్పల మండలం బండ్ల పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాధవి(24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితం భర్త ఓ హత్యకేసులో ఇరుక్కుని జిల్లా సబ్ జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దే ఉంటోంది. భర్త జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపం చెందిన మాధవి.. బుధవారం ఉదయం తన ఇద్దరు పిల్లలకు ఉరేసి..తాను ఉరేసుకుంది. ఈ ఘటనలో కూతురు భాను (5)ప్రాణాలతో బయట పడగా.. కుమారుడు లోకేశ్వర్ రెడ్డి (3) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం బాను ను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి దాకా ఆస్తి గొడవ!