Minister Pocharam Srinivas Reddy
-
గడువులోగా ప్రీమియం చెల్లించండి: పోచారం
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం కింద రైతులు బీమా ప్రీమియంను గడువులోగా చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కోరారు. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు కర పత్రాలు, గోడపత్రికలు ముద్రించి గ్రామాల్లో ప్రచారం చేశామని తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రీమియం చెల్లించని రైతులకు బీమా వర్తించదని, పరిహారం అందదన్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే రైతులందరి బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులే మినహాయించుకుంటాయని పేర్కొన్నారు. బ్యాంకు రుణం తీసుకోని రైతులు తమ మండలంలోని కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియంను చెల్లించాలన్నారు. 2017–18 యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపినట్లు చెప్పారు. కాగా,పీఎంఎఫ్బీవై కింద వరి బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని, ఇతర పంటలకు జూలై 31 ఆఖరు అని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. -
కౌలు రైతులకు ‘పెట్టుబడి’ ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: రాళ్లూ రప్పలున్న భూముల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అన్నిరకాల భూములకు సాయం అందుతుందని చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పాతూరి సుధాకర్రెడ్డి, టి.భానుప్రసాద్, భూపాల్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పోచారం సమాధానమిచ్చారు. కౌలుదారులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. భూ యజమానులకే ఇస్తామన్నారు. ఉద్యాన పంటలకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. పెట్టుబడి సాయం కింద చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా చూసేందుకు సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, తాము కూడా కేంద్ర ఆర్థికమంత్రిని కలిశామని తెలిపారు. పెట్టుబడి పంపిణీ చేపట్టేనాటికి అవసరమైన కరెన్సీ రాష్ట్రానికి రానుం దని తెలిపారు. ఏ బ్యాంకులోనైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులను పంపిణీ చేస్తామని, చెక్కుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 1.42 కోట్ల ఎకరాలకు చెందిన 72 లక్షల మంది రైతులకు ఖరీఫ్లో పెట్టుబడి సాయం చేస్తామని, రబీ లో మాత్రం సాగయిన భూములకే ఇస్తామన్నారు. పెట్టుబడి సాయాన్ని ఖరీఫ్కు వచ్చే నెల 19 నుంచి మే నెలాఖరు వరకు అందజేస్తామన్నారు. రబీ సాయాన్ని నవంబర్ 20 నుంచి ఇస్తామన్నారు. ప్రజాప్రతినిధులంతా పెట్టుబడి పంపిణీలో భాగస్వాములవుతారన్నారు. రాష్ట్రం లో 2,638 రైతు మందిరాలను నిర్మిస్తామన్నారు. వాటికోసం 654 చోట్ల ఇప్పటికే భూమి సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడి సాయాన్ని తాను వదులుకుంటున్నట్లు సభ్యుడు భూపాల్రెడ్డి సభలో ప్రకటించారు. భాషాపండితులకు న్యాయం రాష్ట్రంలో 2,487 మంది భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయడానికి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సభ్యులు పాతూరి సుధాకర్రెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారని, నియామక నియమావళి సవరించే వరకు స్కూలు అసిస్టెంట్ పదవులను భర్తీ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపే అడ్వకేట్ జనరల్తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని కడియం హామీ ఇచ్చారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని రాములు నాయక్ విజ్ఞప్తి చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచు తున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘వేటు’ కాస్తా లేటు!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) పాలకవర్గాలపై వేటు వేయాలని సహకార శాఖ నిర్ణయించినా దాని అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ ఒత్తిడి పెరగడంతో వేటు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ నెల 17 వరకు నిర్ణయం తీసుకోవడానికి అవకాశముండటంతో వాయిదా పద్ధతిని ఎంచుకు న్నారు. ఆ రెండు పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను ఇంకా కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) పాలకవర్గాల పదవీకాలం శనివారం ముగిసింది. డీసీ సీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (డీసీఎంఎస్), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్)ల పదవీకాలం ఈ నెల 17 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం, నల్లగొండ డీసీసీబీలపై వాయిదా వేశారు. మొత్తం 906 ప్యాక్స్లలో 90 ప్యాక్స్లపై అభియోగాలు నమోదయ్యాయి. వాటి పాలకవర్గాలను రద్దు చేసి అధికారులను నియమించాలని నిర్ణయించారు. మిగతా సంఘాల చైర్మన్లు పర్సన్ ఇన్చార్జులుగా నియమితులయ్యారు. కొన్ని సంఘాల సభ్యులు సహకార శాఖకు బకాయిపడ్డారు. పాలకవర్గ గడువు తీరడం, మళ్లీ కొనసాగాలంటే బకాయిలు చెల్లించాల్సి రావడంతో అనేకమంది వాటిని తీర్చినట్లు చెబుతు న్నారు. రూ.20 కోట్లకుపైగా బకాయి సొమ్ము తమకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. మంత్రి పోచారం సమీక్ష... సహకార శాఖపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి పార్థసారథి, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య శని వారం సమీక్ష జరిపారు. జిల్లా సహకార అధికారులతో ఆయన సమావేశమై పలు వివరాలు తీసుకున్నారు. సహకార సంఘాల పదవీ కాలం ముగియడం, పర్సన్ ఇన్చార్జుల నియామకం నేపథ్యంలో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. -
చట్ట సవరణ తర్వాతే ‘సహకార’ ఎన్నికలు
బీర్కూర్: పంచాయతీరాజ్ చట్ట సవరణ తరహాలోనే సహకార చట్టాన్ని సవరించిన తర్వాతే సహకార సంఘా లకు ఎన్నికలు నిర్వహిస్తామని వ్యవ సాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని శ్రీవేంకటేశ్వరాలయంలో నిర్వహించిన గోదా దేవి–రంగనాథుల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సహకార ఎన్నికల విషయమై ఇప్పటికే రెండు, మూడు సార్లు సమావేశమయ్యా మన్నారు. పాలక వర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు నాలుగు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఎన్నికలు నిర్వహిం చడం, అఫీషియల్, నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిలతోపాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ వేయడం, ప్రస్తుత పాలకవర్గాన్నే కొనసాగించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
కౌలు రైతులకు సాయం చేయలేం
♦ రాజకీయాలకతీతంగారైతు సమన్వయ సమితులు ♦ వ్యవసాయశాఖ మంత్రి పోచారం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం చేయడం న్యాయపరంగా సాధ్యంకాదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, నిర్వహణపై డివిజన్, మండల వ్యవసాయ అధికారుల శిక్షణ’ కార్యక్రమంలోనూ, తర్వాత విలేకరులతోనూ మంత్రి పోచారం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉండగా, కలెక్టర్ల సమావేశం వల్ల రాలేకపోయారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మంచి రోజులు వచ్చాయని, రైతులు ఆర్థికంగా బలోపేతమవుతూ బ్యాంకులను శాసించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. 1936 తర్వాత రాష్ట్రంలో భూసర్వే జరగలేదని చెప్పారు. ప్రతీ రైతుకు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున పెట్టుబడి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న నేపథ్యంలో భూ సర్వే చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రతీ గ్రామంలో 15 మంది సభ్యులతో రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తారని, అందులో ఒకరు సమన్వయకర్తగా ఉంటారని వివరించారు. ప్రతీ సంఘంలో మూడో వంతు మహిళలు ఉంటారని తెలిపారు. మండల, జిల్లా సమన్వయ సమితుల్లోనూ 24 మంది సభ్యులుగా ఉంటారని, వీటిల్లోనూ మూడో వంతు మహిళలు ఉంటారని వివరించారు. రైతు సమితుల సమన్వయకర్తలకు గౌరవ వేతనం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,24,06,474 పట్టాదారులు చెరువులు, కుంటలపై ఆధారపడి ఉన్నారన్నారు. ఈ నెల 9వ తేదీలోపు సమితుల ఏర్పాటు, ఈ నెల 10–14 తేదీల మధ్యలో మండల సదస్సులు, 15 నుండి డిసెంబర్ 15 వరకు భూముల రికార్డుల ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలకుగాను ప్రతి 9 గ్రామాలకు ఒక బృందం చొప్పున 1,193 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ బృందం ప్రతీ గ్రామంలో 10 రోజులుండి భూములను పూర్తిగా సర్వే చేస్తుందన్నారు. ఈ టీం భూమి కొలతల వివరాల పట్టిక, రైతులవారీగా భూముల వివరాలను సేకరిస్తుందని తెలిపారు. అనంతరం పాస్ పుస్తకాలను రూపొందించి రైతులకు అందజేస్తామన్నారు. రికార్డులను క్రమబద్ధీకరించడానికి ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ను ప్రారంభి స్తామనీ, ప్రతీ తహసీల్దార్ రిజిస్ట్రార్గానూ ఉంటారనీ అన్నారు. మరో 526 ఏఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని చెప్పారు. రైతు అవార్డు సీఎం తీసుకుంటారో లేదో..! ముఖ్యమంత్రికి రైతు అవార్డు బోగస్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నోరుపారేసుకోవడంపై మంత్రి పోచారం మండిపడ్డారు. అవార్డు కోసం తాము ఎవరినీ బతిమిలాడుకోలేదని అన్నారు. మూడేళ్లలో తాము రైతులకు చేసిన సేవలకు గుర్తింపుగా సంబంధిత సంస్థే ప్రకటించిందని చెప్పారు. రైతు అవార్డును ముఖ్యమంత్రి తీసుకుంటారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ కిషన్రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
బ్రేకింగ్: మంత్రి పోచారంకు అస్వస్థత!
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తీసుకోకపోవడంతో ఆయన స్వల్పంగా అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని.. తిరిగి అతిథి గృహానికి చేరుకున్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు మొదట ఆయనను తిరుమలలో ఉన్న అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న అపోలో ఆస్పత్రిలో తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతానికి పోచారం ఆరోగ్యం బాగానే ఉందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మంత్రి పోచారం అస్వస్థత నుంచి కోలుకున్నారని, చికిత్స అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఆయన కుటుంబసభ్యులు, స్పీకర్, మంత్రులతో సహా బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రి పోచారం కూడా ఉన్నారు. -
బ్రేకింగ్: మంత్రి పోచారంకు అస్వస్థత!
-
గ్రీన్హౌస్ సాగులో నెదర్లాండ్ సహకారం
మంత్రి పోచారంతో నెదర్లాండ్ దౌత్య బృందం భేటీ సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ (పాలీ హౌస్) సేద్యంలో తెలంగాణ రైతులకు సాంకేతిక సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నెదర్లాండ్ హామీ ఇచ్చింది. ఢిల్లీలోని నెదర్లాండ్ ఎం బసీ కాన్సుల్ జనరల్ గైడో తైల్ మెన్ ఆధ్వ ర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం సచివాల యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డితో సమావేశమైంది. చిన్నగా ఉన్నా తమ దేశం వ్యవసాయం, మాంసం, పాడి ఉత్పత్తు ల ఎగుమతులలో ఎంతో అభివృద్ధి సాధించిందని, పూల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని నెదర్లాండ్ ప్రతినిధులు మంత్రికి వివరిం చారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేవిధంగా పరిశ్రమలు నెలకొల్పాలని ఆ దేశ ప్రతినిధులను కోరారు. తెలంగాణలో వ్యవ సాయం, అనుబంధ రంగాలలో అపార అవకాశాలు ఉన్నాయని... రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పుత్తులకు అగ్రి ప్రాసె సింగ్ యూనిట్లను జోడిస్తే రైతులకు మంచి ధరలు లభిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావించాక రాష్ట్రంలో గ్రీన్హౌస్ సేద్యానికి ప్రాధా న్యం ఇచ్చామని... ఇప్పటివరకు వెయ్యి ఎకరాలకు పైగా అనుమతులు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ భారీగా సబ్సిడీలు ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్ దేశంలోని అత్యు త్తమ వ్యవసాయ వర్సిటీ వాగెనింగన్లు పరిశోధన రంగంలో పరస్పరం సహకరించు కోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశంలో వ్యవసా యశాఖ కమిషనర్ జగన్మోహన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ పంటలు అధ్వానం
మంత్రికి జిల్లా వ్యవసాయాధికారుల నివేదన హైదరాబాద్: ప్రస్తుతం ఖరీఫ్ పంటలు అధ్వానంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. శని వారం సచివాలయంలో జిల్లా జేడీఏలు, ఇతర వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. జేడీఏలు జిల్లాల్లో పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మొక్కజొన్న ఎండిపోతోందన్నారు. పోచారం మాట్లాడుతూ బోర్లల్లో తక్కువ నీరుండి పంటలకు సరిపోని పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు స్ప్రిం క్లర్లు ఇవ్వాలని, వాటిని ఎలా అందించాలో ఉద్యానశాఖ కసరత్తు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఖరీఫ్ పంటలు నష్టపోతే ముందస్తు రబీకి సన్నాహాలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోందని, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
మంత్రి పోచారం దంపతుల వరుణయాగం
బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. -
నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు
మల్లన్నసాగర్ సాధన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకం, సీతారాంపల్లి, రామచంద్రబోస్, కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా కోటి ఎకరాలను సాగులోకి తెస్తామన్నారు. కాళేళ్వరం ఎత్తిపోతలు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి గోదావరి నీటితో రైతుల పాదాలు కడుగుతామని మంత్రి చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంవత్సరానికి రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదన్నారు. గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని, వాటిని మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చ0గొడుతూ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫెదారు రాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, రాజేశ్వర్రావు, ఎమ్మెల్యేలు హన్మంత్ సిందే, షకీల్ అహ్మద్, ఆశన్నగారి జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐదారు రోజుల్లో మరో రూ.2,020 కోట్లు
మూడో విడత రుణమాపీని బ్యాంకులకు విడుదల చేస్తాం: పోచారం సాక్షి, హైదరాబాద్: మూడో విడత విడుదల చేయాల్సిన రుణమాఫీలో మిగిలిన సగం సొమ్మును ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధిపతులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడో విడతలో సగం రూ. 2,019.99 కోట్లు ఇటీవల విడుదల చేశామని... మిగిలిన రూ. 2,020 కోట్లు ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో సరాసరి 371.2 ఎం.ఎం. వర్షం కురవాల్సి ఉండగా... 435.9 ఎం.ఎం. కురిసిందని వివరించారు. ఆరుతడి పంటలన్నీ ఆశాజనకంగా ఉన్నాయని.. మొత్తం 70 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయన్నారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గమే హరితహారంలో నంబర్వన్ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. -
మల్లన్నసాగర్పై నీచ రాజకీయాలు!
సాక్షి ప్రతినిధి నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల క్షేమం కోరి చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడ్డుతగలడం నీచరాజకీయాలకు దిగజారడమేనని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడంతో పాటు ప్రజలు మమ్మల్ని గుర్తించరనే భయంతో ఏదో ఒక అంశాన్ని ముందేసుకొని చెడగొట్టే కార్యక్రమాలకు దిగుతున్నారన్నారు. అందులో భాగంగానే మల్లన్నసాగర్ భూనిర్వాసితులను రెచ్చగొడుతున్నారని, ప్రతిపక్షాలు సహకరించి పద్ధతి మార్చుకోకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి హెచ్చరించారు. మంగళవారం నిజామాబాద్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఉత్తర తెలంగాణ లో బీడుబడిన భూములను సస్యశ్యామలం చేసి శాశ్వతంగా కరువు బారిన పడకుండా చేయడానికి రూ. 83 వేల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు కలిపి పాత ఆయకట్టు 20 లక్షలు , కొత్త ఆయకట్టు 20 లక్షలు మొత్తం 40 లక్షల ఆయకట్టుకు నీరు ఈ ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం టెండర్లు పిలిచారని పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో తమకు ప్రజల మద్దతు ఉండదని భయంతో మల్లన్నసాగర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అక్కడే నిర్మిస్తే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్న సోయి కేసీఆర్కు వచ్చిందని, కాని నీకు ఎందుకు రాలేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. 60 ఏళ్ల పరిపాలనలో మీరు ఏమి చేశారని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో కుట్రరాజకీయాలు చేస్తున్నారని, నీచరాజకీయాలకు దిగజారుతున్నారని మండిపడ్డారు. ఎవరైన నీరు, ప్రాజెక్టులు తెస్తుంటే శత్రువులైన సహకరిస్తారని అలాంటిది రాజకీయ అజ్ఞానులు టీడీపీ, కాంగ్రెస్ నేతలు సహకరించకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్షాలు అడ్డుతగిలి అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదారు రాజు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్మే బిగాల గణేష్గుప్త, నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
హరిత ఉద్యమం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం జిల్లా లో ఉద్యమంలా సాగుతోంది. ఈ నెల 8న వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ డిగ్రీ కళాశాల మైదానంలో అ«ధికారికంగా ప్రారంభించారు. సుమారు 14 రోజుల పాటు నిర్వహించే హరితహారంలో 3.35 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా.. అధికారులతో సమీక్షలు జరిపిన మీదట కలెక్టర్ డాక్టర్ యోగి తారాణా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో హరితహారం విజయవంతం కోసం ప్రజాప్రతి ని««దlులు, అధికారులు సర్వశక్తులొడ్డుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 22.01 లక్షలు మొక్కలు నాటారు. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 1 కోటి 51 లక్షల 13 వేల 819 మొక్కలు నాటినట్లు కలెక్టర్ కార్యాలయవర్గాలు తెలి పాయి. నిజామాబాద్ నగరంలో నగరపాలక సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన హరితహారం భారీ ర్యాలీలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మేయర్ ఆకుల సుజాత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్త, జేసీ రవీందర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంత రం నిజామాబాద్ నగరంలో వివిధ డివిజన్లలో మొక్కలు నాటారు. అబ్కారీశాఖ మంత్రి టి పద్మారావు కామారెడ్డి మండలం రాఘవాపూర్లో కల్లుగీత సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గం గాధర్ గౌడ్, ఎక్సైజ్ డీసీ డేవిడ్ రవికాంత్, డీఆర్డీఏ పీఈ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యే హన్మంత్ సిం« దే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. నిజామాబాద్ రూర ల్ నియోజకవర్గం సిర్నాపల్లిలో అంతకు ముం దు రోజు రాత్రి బస చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిం చేందుకు ఆయన జక్రాన్పల్లి మండలం పడకల్లో రాత్రి బస చేసి గ్రామస్తులు, అ«ధికారులు, ప్రజాప్రతినిధులతో హరితహారం ప్రాధాన్యం వివరించారు. ఎల్లారెడ్డి, బాల్కొండ, బోధన్, ఆర్మూరు, బాన్సువాడలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమంలా హరితహారం సాగింది. పుట్టుక నుంచి చచ్చేవరకు .. మనిషి పుట్టుక మొదలు చనిపోయేంత వరకు కట్టె అవసరమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అందుకు చెట్టే ప్రధానమని ఆలోచించని మనిషి, పూర్వికులు నాటిన చెట్లను విచక్షణ రహితంగా నరికివేస్తుండటం వలన వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదన్నారు. నిజామాబాద్ పట్టణంలోని నెహ్రుచౌక్ వద్ద హరితహారం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఐటీఐలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడారు. అడవులు అధికంగా ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నయనే విషయాన్ని ప్రజలు గ్రహించి మన జిల్లాలోనూ ఎక్కువ మొత్తం మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు. చెట్టుతోనే మనకు మనుగడ అని చెట్టు లేని యేడల భవిష్యత్తులో ప్రాణవాయువును ప్రతినిత్యం 3 సిలిండర్ల ప్రకారం కొనాల్సి వస్తుందన్నారు. నిజామాబాద్లాంటి çనగరంలో వారం రోజులకు ఒక మారు స్నానం చేయాల్సి న దుస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న వ్యవసాయ దినోత్సవం సందర్భంగా 2.50 లక్షల మొక్కలు నాటాలనుకున్నా.. హైదరాబాద్ మినహా 9 జిల్లాలో మొక్కల కొరత వల్ల ఈనెల 22వ తేదీన జరుపుకుంటున్నామని వివరించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్త మాట్లాడుతూ తన చిన్నతనంలో అడవులలో పండ్లను తినేవారిమని, చెట్ల ఆకులలో భోజనం చేసేవారిమని అన్నారు. వారం రోజులు ముసురుకురిసేదనీ, ఈ రోజు ఆ ఆనవాల్లె లేకుండా పోయాయని దానికి కారణం చెట్లను నరకడమే నన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రికైన హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రధాన మంత్రిని కొనియాడారని ఇలాంటి బహత్తర కార్యక్రమం 29 రాష్ట్రాలలో తెలంగా ణ రాష్ట్రంలో చేపట్టడం అభినందనీమని అన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగి తారాణా మాట్లాడుతూ విచక్షణా రహితంగా అడవులలోని చెట్లను నరికివేయడంతో వర్షాలు పడకపోవడం వల్ల తాగునీరు కొంటున్నామని, ఈ మాదిరిగా రాబోయే 5 సంవత్సరాలు మొక్కలు నాటకున్నచో ఇతర అవసరాలకు వేల రూపాయలతో నీరు కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. నగర మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో టారె ్గట్ ప్రకారం 5 లక్షల 61 వెయ్యి మొక్కలను నేటి పచ్చదనంతో పలకరించేలా చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సం యుక్త కలెక్టర్ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతులందరికీ రుణాలిచ్చేలా చూడండి
జిల్లా వ్యవసాయాధికారులు, బ్యాంకు మేనేజర్లకు పోచారం ఆదేశం సాక్షి, హైదరాబాద్ : రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా వ్యవసాయాధికారులు, లీడ్ బ్యాంకు మేనేజర్లు చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా, విత్తన గ్రామ కార్యక్రమం, ఇప్పటివరకు జరిగిన పంటల సాగు, హరితహారంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు నాటికి పంట రుణాల రెన్యువల్స్ పూర్తిచేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్లకు సూచించారు. వడ్డీ లేని రుణాల కింద రైతుల నుంచి ఎటువంటి వడ్డీ వసూలు చేయకూడదని ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లా బ్యాంకులకు మార్గదర్శకాలు పంపించామన్నారు. హరితహారం కింద రైతులు తమ పొలాల గట్లమీద, ఇతరత్రా పెద్దఎత్తున మొక్కలు నాటేలా చూడాలన్నారు. పసుపు పంటకు కొత్త విత్తనం తీసుకున్న రైతులు... పంట పండాక దాన్నే విత్తనంగా వాడుకోవాలని సూచించారు. -
పోచారం... తప్పుకో : షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్ : నాసిరకం, నకిలీ విత్తనాలు కొంటే ప్రభుత్వానికి బాధ్యత లేదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మంత్రివర్గం నుంచి వైదొలగాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్కుమార్తో కలిసి అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రుణాలు దొరకక, నాణ్యమైన విత్తనాలు అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రెండు విడతల రుణమాఫీని ఒకేసారి చేయాలి’ అని షబ్బీర్ విమర్శించారు. ముస్లింలకు ముఖ్యమైన పండుగ రంజాన్ (ఈ నెల 7) నాడు కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించాలని సీఎంకు షబ్బీర్లేఖ రాశారు. -
మల్లన్న సాగర్పై అనవసర రాద్ధాంతం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు మల్లన్న సాగర్పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఎత్తై ప్రాంతం కావడం వల్ల, ఎత్తిపోతల అవసరం లేకుండా కాల్వల (గ్రావిటీ) ద్వారా నీరిచ్చే అవకాశం ఉండటం వల్ల మల్లన్న సాగర్ను చేపట్టామన్నారు. తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులంతా తెలంగాణ బిడ్డలేనన్నారు. విపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వాసితులను రె చ్చగొడుతున్నాయని, ఏ ప్రాజెక్టు నిర్మించినా ముంపు ఉంటుందని అన్నారు. -
జల పరిరక్షణతోనే మానవాళి భవిష్యత్తు!
తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సులో వక్తలు - వాన నీటి సంరక్షణ ఉద్యమంలా సాగాలని పిలుపు - వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఇకపై ఎరువుల వాడకమన్న పోచారం - 230 కోట్ల మొక్కలు నాటుతామన్న మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టేలా చర్యలు చేపట్టినప్పుడే మానవాళి మనుగడ సాగిస్తుందని తెలంగాణ జల సంరక్షణ వేదిక అభిప్రాయపడింది. భూగర్భ జలాలు పెంచుకునే ప్రణాళికలను రూపొం దించి, దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఉధృతంగా సాగాలని పిలుపునిచ్చింది. భవిష్యత్లో జల సంక్షోభాలు తలెత్తకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ జల సంరక్షణ వేదిక, దక్కన్ వాటర్ హార్వెస్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంయుక్తంగా ‘మేకింగ్ తెలంగాణ వాటర్ ఎఫిషియంట్ స్టేట్ బై 2020’ పేరిట సదస్సు నిర్వహించాయి. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వేదిక వ్యవస్థాపక చైర్మన్ వి.ప్రకాశ్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సింగరేణి డెరైక్టర్ మనోహర్రావు, సీనియర్ జర్నలిస్టు అష్టకాల రామ్మోహన్ హాజరయ్యారు. నీటి సంక్షోభానికి వర్షపాతం తగ్గడం కారణం కాదని... కురిసిన ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోకపోవడమే కారణమని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. భూగర్భ జలాలు పెంచుకునేలా చర్యలు చేపట్టాలని.. వాన నీటిని సంరక్షించి, భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఎరువులు: పోచారం రాష్ట్రంలో ఎరువుల వాడకంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తారణాధికారి, మం డలానికో వ్యవసాయాధికారి, డివిజన్కు ఒక ఏడీ ఉండేలా చర్యలు చేపట్టామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారి రైతుల పొలాలను పరిశీలించి చేసే సూచనల మేరకే ఫర్టిలైజర్ దుకాణాలవారు ఎరువులు, పురుగు మం దులు ఇచ్చే విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు 230 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. ఇప్పటికే 15కోట్ల మొక్క లు నాటామని, రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నీటి సంరక్షణ అందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సేంద్రియ ఎరువుల వాడకం వైపు రైతులు మళ్లేలా అవగాహన, ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. -
కేంద్రం తీరువల్లే పత్తికి దెబ్బ
జగదేవ్పూర్: కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ధోరణి వల్ల పత్తికి ఎదురుదెబ్బ తగిలిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఫలితంగా ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో రాష్ట్రంలో పత్తి పంట సాగు చేసే పరిస్థితి లేదన్నారు. ఈసారి రైతులు పత్తి జోలికి వెళ్లొద్దని సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్పూర్లో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద విత్తన సబ్సిడీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని తెలిపారు. మొత్తం 52 లక్షల మంది రైతులు ఉండగా, 906 సొసైటీలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో రైతులు ఏ పంటలు సాగు చేస్తారో సర్వే చేసి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత ఏడాది ధరలతోనే ఈ సారి కూడా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. విత్తనాలు సిద్ధం... ప్రస్తుతం 60 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా 7.80 లక్షల క్వింటాళ్ల విత్తనాలు నిల్వ చేశామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మన వద్దే సబ్సిడీలు అధికమన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు దాదాపు రూ.400 కోట్ల సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలో 24, 500 హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఇక్కడి రైతులు రారాజులు అని సంబోధించారు. కల్యాణ లక్ష్మికి రూ.510 కోట్లు.. కల్యాణ లక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.510 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే వర్తించే కల్యాణలక్ష్మి ఇక నుంచి బీసీలకు కూడా వర్తిస్తుందన్నారు. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరు కల్యాణలక్ష్మికి అర్హులేనన్నారు. -
దివాలా సొసైటీలకే ఇవ్వాలా..?
- వాటికి ఎరువులు, విత్తనాల పంపిణీ బాధ్యతపై విమర్శలు - 906 సహకార సొసైటీలకుగాను 400 నష్టాల అంచుల్లోనే - వ్యవసాయశాఖ నిర్ణయంతో రైతులకు తప్పని కష్టాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ప్రాథమిక సహకార సొసైటీ(ప్యాక్స్)ల ద్వారా విత్తనాలు, ఎరువులను రైతులకు సరఫరా చేయాలని రాష్ట్రవ్యవసాయ శాఖ నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సహకార సొసైటీలు దివాలా అంచున ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 906 సొసైటీలుండగా వాటిల్లో 400 సొసైటీలు నష్టాల్లో ఉన్నాయని, సరైన నిర్వహణ లేక కొన్ని కునారిల్లుతున్నాయని, ఇలాంటి స్థితిలో వాటికి విత్తనాలు, ఎరువులను విక్రయించే బాధ్యత ఇస్తే సమస్యలు తప్పవంటున్నారు. గతంలో అనేక సొసైటీలు ఇలా మార్క్ఫెడ్ నుంచి ఎరువులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు. 50 శాతం సబ్సిడీపై...: మండల కేంద్రాల నుంచి కాకుండా గ్రామాల్లో ఉండే సహకార సొసైటీల ద్వారానే విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సహకార సొసైటీల ద్వారానైతే రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో చేరతాయనేది వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఉద్దేశం. ఈ ఏడాది మొత్తం 7.5 లక్షల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. వాటి విలువ రూ.412 కోట్లు. రైతులకు సబ్సిడీ పోను సర్కారు స్వయం గా రూ. 206 కోట్లు భరించనుంది. 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 3.75 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 77 వేల క్వింటాళ్ల వేరుశనగ, 70 వేల మొక్కజొన్న, 80 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేస్తాయి. అలాగే 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. బ్యాంకు గ్యారంటీ ఉన్నా... సొసైటీలకు ప్రభుత్వం కేటాయించే విత్తనాలు, ఎరువుల విలువ మేరకు సహకార బ్యాంకులు ప్రభుత్వానికి గ్యారంటీ ఇస్తాయి. బ్యాంకు గ్యారంటీ ఉన్నా నష్టాల బాటలో ఉన్న 400 సొసైటీలు విత్తనాలు, ఎరువులు తీసుకొని ఏ మేరకు వెన క్కు తిరిగి చెల్లిస్తాయన్న ప్రశ్న అధికారుల ను వేధిస్తోంది. అవి చేతులెత్తేస్తే సహకార బ్యాంకులు కుప్పకూలిపోతాయంటున్నారు. గతేడాది మార్క్ఫెడ్కు కొన్ని సొసైటీలు రూ. 3 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం తగదని, బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. బాధ్యులైన ఇంజినీర్లు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రగతిభవన్లో హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీలు కవిత, బీబీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, భూపతిరెడ్డి, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్రెడ్డి, మేయర్ సుజాత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటి మొక్కలు.. రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో కోటి మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, 11 రకాల కాంపోనెంట్ల కింద 3.35 కోట్ల మొక్కలను పెట్టేందుకు ఈ నెలాఖరులోపు ఉపాధి పనులతో గుంతలను తవ్వించాలని సూచించారు. వర్షాలు ప్రారంభం ఆయన వెంటనే మొక్కలు నాటడాన్ని చేపట్టి ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగస్వాములను చేసేందుకు మండలాలు, గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ నివేదికలను ప్రజాప్రతినిధులకు అందజేయాలన్నారు. మిషన్ కాకతీయ.. మిషన్ కాకతీయ మొదటి దశ కింద రూ. 234 కోట్లతో 76,724 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు మంజూరు చేసిన 658 పనులలో 571 పనులు పూర్తి అయ్యాయని పోచారం తెలిపారు. మిగిలిన 87 పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో దశ కింద గుర్తించిన 674 పనులలో 50 వేల ఎకరాలకు నీరు అందించే 649 చెరువుల పునరుద్ధరణకు రూ. 227 కోట్ల అంచనాతో పనులను మంజూరయ్యాయన్నారు. వాటిలో 610 పనుల అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, 604 పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోపు అగ్రిమెంట్తో పాటు గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను నిలువ చేసేందుకు అనువుగా చెరువుల తూములు, అలుగులను ముందస్తుగా పటిష్టపర్చాలని సూచించారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునికీకణకు ప్రభుత్వం రూ. 115 కోట్లను మంజూరు చేయనుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని భూములకు నీటి వసతి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నామన్నారు. పథకాల అమలులో మనమే ఫస్టు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మన జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని అధికారులకు సూచిం చారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. ఉపాధి హామీ తదితర పథకాల్లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24 శాతం ఉంటే, జిల్లాలో 21.46 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చెట్లకు కూడా నీరందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం లోని రఘునాథ చెరువును ట్యాంకు బండ్గా మార్చనున్నామని కవిత తెలిపారు. చెరువు పక్కనుంచే నిజాంసాగర్ కాలువ వెళ్తున్నందున అందులోనుంచి నీరు ఈ చెరువులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ట్యాంకు బండ్ నిర్మించనున్నట్లు తెలిపారు. జూన్ 10 నుంచి హరితహారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటించడానికి ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. వచ్చేనెల 10 నుంచి హరితహారం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో రెండేళ్లల్లో వేయి ఎకరాలలో గమ్కరియా మొక్కలను నాటించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసేందుకు సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన 43.73 ఎకరాల ప్రభుత్వ భూములలో 42.22 ఎకరాలను సేకరించామని తెలిపారు. అలాగే 2.65 ఎకరాల ప్రైవేటు భూములలో రెండు ఎకరాలను సేకరించి అప్పగించామన్నారు. పైపులైన్లు, ఇతర నిర్మాణ పనులకు అవసమరైన 36 హెక్టార్ల అటవీ భూములను అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే 36 రైల్వే క్రాసింగ్ల గుండా పైపులైన్లు నిర్మించేందుకు రైల్వే అధికారులతో సంయుక్తంగా సర్వే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించి 35, ఆర్అండ్బీకి సంబంధించి 451, పీఆర్కు సంబంధించి 748, సాగునీటి కాలువలకు సంబంధించి 206 చోట్ల క్రాసింగ్లు ఉన్నాయని, వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన అన్ని పనులను ఏకకాలంలో పూర్తి చేయించేందుకు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘భగీరథ’ వేగం పెంచండి ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలో రూ. 4 వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం చేపడుతోందని, చరిత్రలో ఇది ఒక అద్భుత విషయమని మంత్రి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రూ. 41.11 కోట్లతో జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్టెక్ వెల్ పనులలో ఎక్కువ మంది కూలీలను నియమించాలని సూచించారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,350 కోట్లు, సింగూరు నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని 1,645 ఆవాసాలకు సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. జూన్ 30 నాటికి 121 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 148 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూములలో వేసే పైపులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదు ‘‘మిషన్ కాకతీయ విషయంలో నాకు ఒక్కసారి కూడా ఇరిగేషన్ ఎస్ఈ, సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు’’ అని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా చెప్పడం లేదన్నారు. ఎస్ఈ వద్ద తన ఫోన్ నంబరు కూడా లేదని పేర్కొన్నారు. ఈఈ, డీఈలకు కూడా నేను తెలియదన్నారు. రాజేశ్వర్ ఆవేదనపై మంత్రి పోచారం స్పందించారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో.. ఇందల్వాయి నుంచి ధర్పల్లికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు అత్యంత దారుణంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రోడ్డుకు అనుమతుల విషయంలో అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోడ్డు బాగు చేయించలేకపోతున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా చెట్లు అడ్డుగా లేవన్నారు. అయినా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు ఇస్తే రోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని, అధికారులు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. -
రైతు నెత్తిన ‘సోయా’ టోపీ
♦ విత్తనాల సేకరణలో అడ్డగోలు విధానం ♦ మార్కెట్ ధర రూ.3 వేలుంటే..కంపెనీల నుంచి రూ.6,600కు కొనుగోలు ♦ కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టేందుకే అని విమర్శలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయశాఖ సోయాబీన్ విత్తన కుంభకోణానికి తెరలేపింది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పండించాలని పెద్దఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం.. విత్తనాలను మాత్రం అధిక ధరలకు కొనేందుకు సిద్ధమైంది. వివిధ కంపెనీల నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి వాటికి కోట్లు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది 6.35 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగైతే ఈసారి 11.5 లక్షల ఎకరాల్లో సాగును పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 4 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని అంచనా వేసింది. ఆ విత్తనాలను సేకరించే బాధ్యత వివిధ కంపెనీలకు అప్పగించింది. మధ్యప్రదేశ్ నుంచి వాటిని సేకరించే పనిలో కంపెనీలున్నాయి. ప్రభుత్వం క్వింటాల్ సోయాబీన్ విత్తన ధరను రూ.6,600 ఖరారు చేసింది. అందులో 33.33 శాతం సబ్సిడీని భరించి రైతులకు రూ.4,400 ధరకు అందజేస్తామని ఇటీవల ఉత్తర్వులిచ్చింది. కానీ ఈ ఏడాది సోయాబీన్ ధర మార్కెట్లో గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.3 వేలకు మించి ధర పలకడంలేదని స్వయంగా మార్కెటింగ్ శాఖే పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల కోసం ఏకంగా రెండింతల ధరను ఎలా ఖరారు చేశారో అంతుబట్టడం లేదు. ఒక్కో క్వింటాలుకు రైతుపై రూ.800 భారం ప్రస్తుత ధరను లెక్కలోకి తీసుకోకుండా గతేడాది ధరను అధికారులు ఎలా ఖరారు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో ధర ప్రకారమే రైతులు కొనుగోలు చేస్తే వారికి రూ.3 వేలకే దొరుకుతుంది. ఒకవేళ దాన్ని ప్రాసెస్ చేసినా రూ.3,600కు మించి ధర ఉండదంటున్నారు. అలాంటిది రైతులకు క్వింటాలుకు రూ.4,400కు కట్టబెట్టబోతున్నారన్న మాట. ఈ లెక్కన రైతులపై ఒక్కో క్వింటాలుకు ఏకంగా రూ.800 భారం పడనుంది. ఇలా కంపెనీల నుంచి అధికంగా కొనుగోలు చేయడం వల్ల రైతులపై రూ.32 కోట్లు, ప్రభుత్వంపై రూ.88 కోట్లు అదనపు భారం పడనుంది. ఈ తతంగంలో ప్రైవేటు కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం గతేడాది ధర ప్రకారమే సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ధర తగ్గినా ఎక్కువ ధరతో కంపెనీల నుంచి సోయాబీన్ విత్తనాలు ఎందుకు కొంటున్నారని ప్రశ్నించగా ఆయన సరైన సమాధానమివ్వలేదు. -
తెలంగాణకు ‘రసాయన’ ముప్పు!
♦ వ్యవసాయశాఖ మంత్రి పోచారం ♦ రాంపూర్లో ‘మన తెలంగాణ - మన వ్యవసాయం’ ప్రారంభం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రమాదం పొంచి ఉందని, ఇకనైనా సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మన రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, మొదటి స్థానంలో పంజాబ్ ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం రాంపూర్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్లో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, పంజాబ్ నుంచి ఢిల్లీకి చికిత్స నిమిత్తం రోగులు రైలులో వెళ్లగా ఆ రైతులకు క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని పేరొచ్చిందని చెప్పారు. భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల భూమికి 10 లక్షల యూనిట్లుగా విభజించి భూసా ర పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భూసార పరీక్ష అనంతరం రైతులకు భూసార మట్టి పరీక్షా పత్రాన్ని అందిస్తామని తెలిపారు. -
వెటర్నరీ విద్యార్థులపై లాఠీచార్జి
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మంగళవారం అట్టుడికింది. మంత్రిని ఘెరావ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో రణరంగంగా మారింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెటర్నరీ వైద్య పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా... నేరుగా భర్తీ చేయాలన్న డిమాండ్తో వెటర్నరీ విద్యార్థులు వారం రోజులుగా వర్సిటీలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ వర్సిటీలో ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. దీనికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతుండడంతో... ఆయనకు తమ సమస్యలు చెప్పుకుందామని కొందరు వెటర్నరీ విద్యార్థులు వచ్చారు. కానీ మంత్రిని కలవడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని వెనక్కి పంపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న దాదాపు 500 మంది విద్యార్థులు సమావేశ మందిరం వద్దకు వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న మంత్రి పోచారంను ఘెరావ్ చేశారు. పోలీసులు విద్యార్థులను పక్కకు నెట్టి మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు.. సమావేశ మందిరంలోని కుర్చీలు, బల్లలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో సాయికిరణ్, శ్రీధర్, బి.రాకేష్ అనే ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంత్రిని కలసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సీఎంకు విన్నవిస్తా: పోచారం పోలీసుల సహాయంతో సమావేశ మందిరంలోకి వెళ్లిన మంత్రి పోచారం.. విద్యార్థుల ఆందోళన తీవ్రం కావడంతో బయటకు వచ్చి మాట్లాడారు. వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశం తన పరిధిలో లేదని.. దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కానీ స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. మొత్తం 276 వైద్య పోస్టులుంటే అర్హులైన వారు 175 మందే ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గోశాలలకు ఉచితంగా గడ్డి సరఫరా కరువు పరిస్థితుల్లో రైతులకు మరింత అండగా ఉండాలని వర్క్షాప్ సందర్భంగా అధికారులకు మంత్రి పోచారం ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, మహబూబ్నగర్, జడ్చర్ల, కొడంగల్, ఆలంపూర్, షాద్నగర్, మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ నియోజకవర్గాల్లోని గోశాలల్లో పశువులకు ఉచితంగా గడ్డి సరఫరా చేయాలని సూచించారు. 231 కరువు మండలాల్లోని ఒక్కో రైతుకు సంబంధించి ఒక్కో పశువుకు వచ్చే 2 నెలల పాటు వంద కిలోల దాణాను 50 శాతం రాయితీపై ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్లను ఈ ఏడాది 100కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాలకు ప్రతి లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని కొనసాగిస్తామన్నారు. -
తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సవరణలను సభ తిరస్కరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాల నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రవాణా, హోంశాఖ, వ్యవసాయం, పశు సంవర్ధనం, మత్స్య పరిశ్రమ, సహకార రంగాలకు చెందిన పద్దులకు ఆదివారం ఆమోదం లభించింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు ముఖ్యపట్టణాల్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పోలీసుల వారంతపు సెలవును త్వరలో అమలు చేస్తామన్నారు. భూసార పరీక్షలకు ప్రత్యేక వాహనం: పోచారం భూసార పరీక్షలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అలాగే పశువైద్యం కోసం కూడా 108 తరహాలో వాహనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.