Nagarkurnool
-
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత
-
మహా ‘ఘన’పతిం..
సాక్షి, నాగర్కర్నూల్: దేశంలోనే ఎత్తయిన ఏకశిలా వినాయకుని విగ్రహం నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. దుందుభీ వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని గోమటేశ్వరుడు, చాముండి కొండపై నందీశ్వరుడితోపాటు.. ఆవంచలోని గణపతి సైతం అతిపెద్ద ఏకశిలా విగ్రహాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో.. జడ్చర్ల పట్టణానికి చేరువలో ఆవంచ గ్రామంలో ఈ మహా గణనాథుని విగ్రహం ఉంది. ఏటా వినాయక చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మహా గణపతిని దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే గణనాథునికి ఇప్పటికీ ఆలయం లేకపోవడంతో నిత్య పూజలకు నోచుకోవడం లేదు. పశ్చిమ చాళుక్యుల కాలంలో.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేకమల్లుడు, భువనైకమల్లుడు, తైలోక్యమల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్షాు్వ్కలు.. గణపతి భక్తులు కావడంతో ఇక్కడ 26 అడుగుల ఎత్తయిన ఏకశిలా గణపతిని నెలకొల్పినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. పశ్చిమ చాళుక్యుల కాలంలోనే గ్రామ శివారులోని భైరవాలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివపంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక.. ఆవంచలోని భారీ ఏకశిలా గణనాథునికి ఆలయాన్ని నిర్మించేందుకు ఒక చారిటబుల్ ట్రస్టు ఏడేళ్ల కిందట ముందుకొచి్చంది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేసింది. అయితే ఆలయ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఏళ్ల తరబడి ఆలయ నిర్మాణానికి నోచుకోకపోవడంతో వినాయకునికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి.. పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.ప్రభుత్వం దృష్టి సారించాలి పురాతన కాలం నాటి వినాయకుని ఏకశిలా విగ్రహానికి ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – కిరణ్, ఆవంచ, తిమ్మాజిపేట మండలం, నాగర్కర్నూల్ జిల్లా -
నాగర్ కర్నూల్ పోలీసులు చేసిన పనికి అందరూ షాక్
-
మీ సొంత ఖర్చులతో షెడ్ నిర్మించండి
సాక్షి, హైదరాబాద్: చట్టవిరుద్ధంగా, స్టే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ చిన్నషెడ్ కూల్చివేసినందుకు బాధ్యత వహిస్తూ సొంత ఖర్చుతో పున:నిర్మించాలని నాగర్కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారిని హైకోర్టు ఆదేశించింది. నిలిపివేత ఉత్తర్వులున్నా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దంపతులు కట్టుకున్న చిన్నషెడ్ను బుల్డోజర్తో కూల్చివేసి అధికారులు తమ ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేశారని మండిపడింది.ఇదే తీరులో పలుకుబడి వర్గానికి చెందిన వారి నిర్మాణాలకు కూల్చగలరా అని ప్రశ్నించింది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలో చాలా ఏళ్ల క్రితం ఇల్లు (చిన్నషెడ్) నిర్మించుకున్నామని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించినా కూల్చివేతకు నోటీసులు జారీ చేశారంటూ కటకం మహేశ్, నాగలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్న బడ్డీషాపు నిర్వహణకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతోపాటు ఆస్తి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.ఎలాంటి కారణం లేకుండానే నిర్మాణాల తొలగింపునకు పంచాయతీరాజ్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులను కోర్టు మంజూరు చేసింది. మరోవైపు తమ వాదనలను దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను కోర్టు ఆదేశించింది.కౌంటర్ దాఖలు చేయకుండా, మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతుండగానే మహేష్, నాగలక్ష్మిల ఇంటిని అధికారులు కూల్చివేశారు. పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. సోమవారం విచారణ సందర్భంగా డీపీఓను నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సొంత ఖర్చుతో నిర్మాణం చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పురిటి నొప్పులు భరిస్తూ.. పరీక్ష రాసి..
నాగర్కర్నూల్ క్రైం: ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్–2 పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తుండగానే పురిటినొప్పులు వచ్చి నా ఆమె చలించలేదు.. పట్టుబట్టి పరీక్ష రాసిన తర్వాతే కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లింది. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (25) నిండు గర్భిణి. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివి గ్రూప్–2 పరీక్షల కోసం వేచి చూసింది. ఈ మేరకు సోమ వారం పరీక్ష రాస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విష యం తెలుసుకున్న అధికారులు కలెక్టర్ బదావత్ సంతోశ్కు సమాచారం అందించగా.. ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే అందుకు నిరాకరించిన గర్భిణి.. పరీక్ష పూర్తయిన తర్వాతే కాన్పు కోసం వెళ్తానని పట్టుబట్టింది. తీవ్రమైన పురిటి నొప్పులను భరిస్తూనే పరీక్ష రాసిన అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్ -
తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా,నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కస్తూరిబా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఫలితంగా ఇటీవల కాలంలో పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అందుకు నవంబర్ 27న నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.మాగనూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు ' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. -
ఇప్పటికి ఈ స్మారక శిల వయసు 3,500 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి స్మారక శిల (మెన్హిర్) వెలుగు చూసింది. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె గ్రామ శివారులో డిండి నదీ తీరంలో దీన్ని గుర్తించారు. వారసత్వ ప్రాంతాలను పరిరక్షించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గురువారం డిండి నదీ తీరాన్ని సందర్శించారు. కొండారెడ్డి పల్లి– ఉప్పునుంతల మధ్యలో నదీ తీరంలో ఈ నిలువురాయిని గుర్తించారు. భూ ఉపరితలంలో ఎనిమిది అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు మందంతో ఉన్న ఈ స్మారక శిల కొంతమేర పక్కకు ఒరిగి ఉంది. గ్రానైట్ శిలతో చేసిన ఈ స్మారకం 3,500 ఏళ్ల క్రితం ఇనుపయుగం నాటిదిగా ఆయన పేర్కొన్నారు. అప్పట్లో స్థానిక మానవసమూహంలో చనిపోయిన ప్రముఖుడికి గుర్తుగా దీన్ని పాతారని, గతంలో ఈ ప్రాంతంలో ఆదిమానవుల కాలం నాటి బంతిరాళ్ల సమాధులు ఉండేవని, వ్యవసాయ పనుల్లో భాగంగా అవి కనుమరుగయ్యాయని స్థానికులు తిప్పర్తి జగన్మోహన్రెడ్డి, అభిలాశ్రెడ్డి, సాయికిరణ్రెడ్డి తదితరులు ఆయన దృష్టికి తెచ్చారు. మన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ నిలువు రాయినైనా కాపాడుకోవాలని ఆయన స్థానికులకు సూచించారు. -
తెలంగాణలో మినీ మాల్దీవులు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
ప్రభుత్వ భూముల్లో ఈత వనాల పెంపకం
సాక్షి, నాగర్కర్నూల్: అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన యోధుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈత వనాల పెంపకం కోసం గౌడ సొసైటీలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విరివిగా ఈత వనాలను పెంచనున్నట్టు చెప్పారు. అలాగే సాగునీటి కాల్వల గట్లపై కూడా ఈత వనాలను పెంచుతామన్నారు. వైన్షాపుల కేటాయింపులో ప్రస్తుతం అమలులో ఉన్న 15 శాతం రిజర్వేషన్ను సొసైటీ సభ్యులకు వర్తింపజేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఏళ్లుగా దాగి ఉన్న సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను బయటకి తెచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గీత కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గౌడ కార్మికులకు రక్షణ కిట్లను అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డికి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ సీనియర్ నేత మధు యాష్కిగౌడ్, బీసీ సంఘాల నేత జాజాల శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
TG: మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
సాక్షి, నాగర్కర్నూల్: మట్టిమిద్ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని వనపట్లలో చోటు చేసుకుంది. వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. నిద్రిస్తున్న ఆ కుటుంబం మీద పడ్డాయి. ఘటనలో గొడుగు పద్మ (26), ఆమె ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , కొడుకు (10) నెలలు విక్కీ కన్నుమూశారు. తండ్రి భాస్కర్(28)కు గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లాస్పత్రికి తరలించారు. ముగ్గురు బిడ్డలతో తల్లి ఊహించిన ప్రమాదంలో చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె!
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, రెబల్స్టార్ ప్రభాస్, కమల్హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షి, నాగర్కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్లో యూరాలజిస్ట్గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు. ⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్కు ఎంపికైంది. అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్లో ‘ఎక్స్లైఫ్’ సిగ్మెంట్కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. స్వగ్రామంలో హర్షాతిరేకాలుదర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం. ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు.. మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిఇంకా గొప్ప విజయాలు సాధించాలి.. ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. – హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం -
నల్లమల నాయకుడెవరు?
సాక్షి, నాగర్కర్నూల్: ఓవైపు నల్లమల అభయారణ్యం, మరోవైపు కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న నాగర్కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్కర్నూల్పై పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్, బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పోటీలో ఉన్నారు. . 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా, 1962లో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 8 సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, ఒక్కోసారి తెలంగాణ ప్రజాసమితి, బీఆర్ఎస్ గెలిచాయి. 4.5 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఈ స్థానంలో గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో అగ్రభాగం మాదిగ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ పట్టు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రంగంలోకి దింపి తమ అభ్యర్థి గెలుపునకు వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అలంపూర్కే చెందిన తాను విద్యావంతుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఒకసారి తనకు అవకాశం కల్పించాలని ఆర్ఎస్.ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12స్థానాల్లో కాంగ్రెస్ గెలి చింది. అలంపూర్, గద్వాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఈ రెండు నియోజకవర్గాలు నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోనే ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పోతుగంటి భరత్ప్రసాద్ బీజేపీబలం పెంచుకున్న బీజేపీ.. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానంలో 13.03 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతికి 1,29,021 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములును తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ, ఆయన కొడుకుభరత్ప్రసాద్కు పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది. నియోజకవర్గంలోని కల్వకుర్తి, నాగర్క ర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మా ణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రహదారి నిర్మాణ పను లు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బ లాన్ని పెంచుకున్న బీజేపీ మోదీ చరిష్మాతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచా రం నిర్వహించి ఈ స్థానంలో పాగా వేసేందుకు పట్టుదలతో ఉంది. మల్లు రవి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు గెలిచింది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నంది ఎల్లయ్య ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మల్లు రవిని మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. సీఎం రేవంత్రెడ్డి స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కాగా, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవీ ప్రభావితం చూపే అంశాలుసాగునీటి కోసం చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి నీరందించాలన్న డిమాండ్ ఉంది. పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి.గద్వాల నుంచి ఏపీలోని మాచర్ల వరకు నూతన రైల్వేలేన్ ప్రతిపాదనలకు 20 ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికీ విద్యారంగంలో వెనుకబాటే కన్పిస్తోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ఇప్పటికీ కలగానే మారింది. నల్లమలలోని చెంచులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవు. వీరి జీవనోపాధికి పరిశ్రమలు స్థాపించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు.నల్లమల అటవీప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాలు ఉన్నా పర్యా టకంగా అభివృద్ధి లేదు. పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న డిమాండ్ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లుటీఆర్ఎస్: పోతుగంటి రాములుఓట్లు: 4,99,672 – 50.48 శాతంకాంగ్రెస్: మల్లు రవిఓట్లు: 3,09,924 – 31.31 శాతంబీజేపీ: బంగారు శ్రుతిఓట్లు: 1,29,021 – 13.03 శాతం -
తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: ప్రధాని మోదీ
Live Updates.. బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రసంగం... తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: మోదీ గత పదేళ్ల తెలంగాణ అభివృద్దికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసింది తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయి మల్కాజ్గిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను వేగవంతమైన అభివృద్ధి కూడా తెలంగాణలో తీసుకురావాలి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దికి అడ్డుగా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది తెలంగాణను గేట్వే ఆఫ్ సౌత్ అంటారు ఏడు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవటం మినహా కాంగ్రెస్ ఏం చేయలేదు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం ఈసారి 400 సీట్లు ఎన్డీయేకు రాబోతున్నాయి గరీబీ హఠావో నినాదం కాంగ్రెస్వాళ్లు ఇచ్చారు. కానీ, పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది పొందారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బీజేపీనే దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగింది ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశాం రాజ్యాంగాన్ని మారుస్తామని అంబేద్కర్ను కేసీఆర్ అవమానించారు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లోనే నడుస్తోంది కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లి లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడ్డ చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోంది. గ్యారెంటీల పేరతో కాంగ్రెస్ గారడీలు చేస్తోంది. నేడు యువత, ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో దోచుకుంది సరిపోక ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దోచుకున్నారు. ►నాగర్ కర్నూల్ చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొననున్న మోదీ. ►బేగంపేట్కు బయలుదేరిన ప్రధాని మోదీ.. ►ప్రధాని మోదీ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. ►కాగా, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ►శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీ.. మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భారీ రోడ్డుషోలో పాల్గొన్నారు. రాత్రి వరకు ఈరోడ్డు షో కొనసాగింది. ►అనంతరం రాజ్భవన్కు చేరుకొని మోదీ అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూల్కు మోదీ వెళ్లనున్నారు. అక్కడ వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ►ఈ బహిరంగ సభలో కృష్ణా క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్ సభ స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థులతోపాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు. -
బీఎస్పీకి రెండు లోక్సభ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను రెండు లోక్సభ సీట్లను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, నాగర్కర్నూలు లోకసభ స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల రెండు పర్యాయాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో నాగర్కర్నూలుతో పాటు మరో రెండు స్థానాలను బీఎస్పీ కోరినప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. బీఎస్పీకి కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ చేసుకుంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్తో జరిగిన చర్చల సారాంశాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించిన అనంతరం బీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. కాగా, 15 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. భువనగిరి, నల్లగొండ, మెదక్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతే బీఆర్ఎస్ జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బీజేపీలో చేరిన నాగర్కర్నూల్ ఎంపీ రాములు
ఢిల్లీ, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తుంది. ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. .. షెడ్యూల్ వచ్చే లోపు దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా
జడ్చర్ల టౌన్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూలు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తన గెలుపు కోసం రెండు నెలలు శ్రమించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి స్పష్టం చేశారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన మేరకు తనకు లోక్సభ టికెట్ కేటాయింపులో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డుగా ఉంటుందని ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్రెడ్డికి తన రాజీనామాను సమర్పించానని, సమయం, సందర్భం రానందున బహిర్గత పరచలేదని తెలిపారు. శుక్రవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చినపుడే సీఎం రేవంత్తో చర్చించానని, ఎంపీ టికెట్కు అడ్డు రాకుండా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానన్నారు. పదేళ్లుగా అనేక ఫైళ్లు ఢిల్లీలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పటంతో ఈ బాధ్యతలు స్వీకరించి అనేక శాఖల్లో ఫైళ్లలో కదలిక తీసుకువచ్చానన్నారు. తన రాజీనామాను ఆమోదించే వరకు ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. అయితే తనకు టికెట్ రావడంలేదని ప్రచారం జరుగుతున్నందున కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలందరూ తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న మంద జగన్నాథం, సంపత్కుమార్లకు తాను వ్యతిరేకం కాదని, వారికి టికెట్ అడిగే హక్కు ఉందని అన్నారు. పార్టీ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, టికెట్ ఇవ్వకూడదని ఏ ఒక్క కారణం చెప్పినా.. సర్వేలు అనుకూలంగా లేవని తేలినా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు. -
ఉద్రిక్తత.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ను లాక్కెళ్లిన రైతులు
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి ఛైర్మన్ ఛాంబర్లోకి దూసుకెళ్లిన రైతులు.. ఛైర్మన్ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు. -
చెట్ల మందు తాగించి..బండరాళ్లతో చంపుతాడు
సాక్షి, నాగర్కర్నూల్: మాయలు, మంత్రాలు తెలుసునని నమ్మిస్తూ, మంత్ర శక్తితో గుప్తనిధులు వెలికితీస్తానంటూ ఆస్తులు కాజేసి, ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ రామెట్టి సత్యనారాయణను నాగర్కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిందితుడిని అరెస్ట్ చూపుతూ, మీడియాకు వివరాలను వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ ఇప్పటివరకు 11 మందిని హత్యచేసినట్టు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడని వెల్లడించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో హత్యలు.. ‘‘నిందితుడు సత్యనారాయణ యాదవ్ తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని అమాయకులను నమ్మిస్తూ వారి పేరిట ఉన్న ప్లాట్లు, వ్యవసాయ భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించాం. గుప్తనిధులు వెలికితీస్తానని ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి వారికి జిల్లేడు పాలు, ఇతర చెట్ల మందులను తాగిస్తాడు. వారు అపస్మారక స్థితిలోకి చేరుకోగానే బండ రాళ్లతో మోది హత్యకు పాల్పడ్డాడ’’ని డీఐజీ చౌహాన్ వివరించారు. మొత్తం 11 మందిని హత్య చేయగా, ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదని చెప్పారు. 11 మంది అమాయకులు బలి.. 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా నాగాపూర్లో గుప్తనిధు ల కోసం పూజల పేరుతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు. వీరిలో హజిరాబీ(60), ఆష్మాబేగం(32), ఖాజా(35), ఆశ్రీన్(10) ఉన్నారు. 2021లో నాగర్కర్నూల్ జిల్లా ఎండబెట్లకు చెందిన సలీం పాషా(38), కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఆరెపల్లి శ్రీనివాసులు(52), 2022లో నాగర్కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన వాసర్ల లింగస్వామి(50), 2023లో కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్రెడ్డి(43), కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి(70), తిరుపతమ్మ(42), వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్(32)ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు సత్యనారాయణకు పోలీస్ అధికారులతో సంబంధాలు? మూడేళ్ల నుంచి తరచుగా హత్యలు, మోసాలకు పాల్పడుతూ ఇప్పటివరకు 11 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న మాంత్రికుడు సత్యనారాయణ యాదవ్.. కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల అండదండలతోనే ఇన్నాళ్లు తప్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్లో నివసిస్తున్న ఓ మహిళ తమ కుటుంబ సమస్య పరిష్కారం కోసం సత్య నారాయణను ఆశ్రయించగా, ఆమె భూమిని కూడా తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై సదరు మహిళ ఈ ఏడాది ఏప్రిల్లోనే నాగర్కర్నూల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి దర్యాప్తు అధికారి నిందితుడు సత్యనారాయణ యాద వ్ నుంచి రెండు ప్లాట్లను.. తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. తాజాగా వీపనగండ్ల మండలం బొల్లారానికి చెందిన వెంకటేశ్ భార్య ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది. అప్పుడే పట్టుకుంటే నలుగురు బతికేవారు.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్లో 2020 ఆగస్టు 14న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణహత్యకు గురికాగా, మూడేళ్లుగా పోలీసులు నిందితుడిని గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. మాయలు, మంత్రాల పేరుతో భూ రిజిస్ట్రేషన్లు, ఆ తర్వాత హత్యలకు పాల్పడుతున్న సత్యనారాయణ బాగోతాలను వెలుగులోకి తెస్తూ గత ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలోనూ పోలీసులు సత్యనారాయణ కేసులో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత 2023 జూలైలో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్రెడ్డి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన తండ్రీకూతుళ్లు బీంరెడ్డి రాంరెడ్డి, తిరుపతమ్మ, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్ హత్యకు గురయ్యారు. ఆరు నెలల ముందే పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ఉంటే ఆ నలుగురు ప్రాణాలతో బయటపడేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
-
‘చెంచు’ చిచ్చరపిడుగు
పది లక్షల మందిలో ప్రథముడు ఊహ తెలియకముందే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.. నాలుగేళ్లకే మంటలంటుకొని కాళ్లు, చేతులు, శరీరం కాలిపోయింది.. 60 శాతం గాయాలతో ఆస్పత్రికి తీసుకెళితే..బతకడమే కష్టమని డాక్టర్లు అన్నారు.. ఆరేళ్ల ప్రాయంలోనే 3 మేజర్ సర్జరీలు జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్లోకి రాలేదు... ఈ పరిచయమంతా ఓ నల్లమల కుర్రాడి గురించి... లోకం పోకడనే తెలియని.. ఇప్పటికీ నాగరికతకు దూరంగా ఉండే చెంచుల నుంచి ఓ చిచ్చర పిడుగు జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడు. పదిలక్షల మంది విద్యార్థులు పోటీ పడగా, అందరికంటే ముందువరుసలో నిలిచాడు.. అతడే ’మిలియనీర్ ’దినేశ్. సాక్షి, ప్రత్యేకప్రతినిధి/నాగర్కర్నూల్ : వ్యక్తిగత పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో నల్లమలకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు. అపోలో హాస్పిటల్, డెటాల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన టోటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పరీక్ష జరగ్గా, ఇందులో నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దినేష్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాడు. దినేష్ బతకడమే కష్టమన్నారు... నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరుకు చెందిన దినేష్ తండ్రి కరమ్చంద్ కొన్నాళ్లు కాంట్రాక్ట్ టీచర్గా పనిచేశాడు. ఈయన భార్య మహేశ్వరి దినేష్కు ఊహ తెలియకముందే కన్నుమూసింది. తల్లి ప్రేమకు దూరమై పెరిగిన దినేష్ నాలుగేళ్ల వయసులో ఇంట్లో స్టవ్ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్లు, చేతులు 60 శాతం కాలిపోయాయి. చికిత్స చేసే ముందే డాక్టర్లు దినేష్ బతకడమే కష్టమన్నారు. ఐదేళ్లకు ఒక ఆపరేషన్, ఆరేళ్ల వయసులో దినేష్కు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొంతవరకు శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ ముఖం, చేతులు మామూలు స్థితికి చేరుకోలేదు. కాళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో శస్త్రచికిత్స చేయాలని డాక్డర్లు చెప్పారు. ఐదో తరగతి నుంచి ‘ట్రైబల్ వేల్ఫేర్’లోకి మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దినేష్ ఐదోతరగతిలో చేరాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్లో తనే టాపర్. ఆంగ్లంపై ఉన్న మక్కువ, పట్టు గుర్తించిన టీచర్లు ఉదయ్కుమార్, ఆంజనేయులు దినేష్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అతడి పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. ఫలితంగా ట్రైబల్ సొసైటీ సారథ్యంలో జరిగిన పలు డిబేట్లు, ఇగ్నైట్ ఫెస్ల్లో అనేక బహుమతులు పొందాడు. 2500 పాఠశాలలు...పదిలక్షల మంది విద్యార్థులు డెటాల్ సంస్థ అపోలో ఫౌండేషన్తో కలిసి బాలబాలికల్లో స్వీయ, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నియంత్రణపై అవగాహనకు ప్రతి ఏటా హైజిన్ ఒలింపియాడ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4–15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి రెండు తరగతులను ఒక కేటగిరిగా చేసి మొత్తంగా ఐదు కేటగరిలో పరీక్ష నిర్వహిస్తారు. 9–10 తరగతుల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 2500 పాఠశాలల నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 50 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరిగింది. దినేష్ పూర్తి మార్కులతో పాటు చేతిరాత, పరీక్ష రాసిన విధానం ఆధారంగా అదనపు మార్కులతో కలిపి 51 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో దినేష్కు ప్రథమస్థానం వచ్చినట్లు డెటాల్ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న ముంబైలో జరిగే కార్యక్రమంలో దినేష్ రూ. లక్ష నగదుతోపాటు పురస్కారం అందుకోనున్నాడు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యార్థి దినేష్ను నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్ననూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, చంద్రశేఖర్, గణేష్, విద్యార్థి తండ్రి కరంచంద్ పాల్గొన్నారు. నిక్ వుజిసిక్ నాకు స్ఫూర్తి తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్గా మారిన నిక్ వుజిసిక్ నాలో స్ఫూర్తి నింపారు. అవకాశాలు అనేవి అందరికీ సమానమే. వాటిని అందిపుచ్చుకోవడమే మనవంతు అని నేర్చుకున్నా. అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నా. చదువుతోపాటు క్రికెట్ నా హాబీ. బెస్ట్ కీపర్గా నా మార్కు చూపిస్తున్నా. సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలని అనుకుంటున్నా. – దినేష్ -
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ పీఎస్లో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు ఎస్పీ మనోహర్. మరోవైపు మహబూబ్ నగర్-- జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. -
నాగర్ కర్నూల్ బహిరంగ సభలో ఏం జరిగింది!,కాషాయం పార్టీలో కొత్త జోష్
కర్నాటక ఫలితాలతో డీలాపడ్డ కమలం పార్టీకి నాగర్ కర్నూల్ సభ ఊపిరి పోసిందా? తెలంగాణలో అధికారం సాధించాలన్న సంకల్పానికి జేపీ నడ్డా సభ బలం చేకూర్చిందా? చేరికలు లేక, రాష్ట్ర నాయకత్వంలో విభేదాలతో గందరగోళంగా ఉన్న బీజేపీకి పార్టీ చీఫ్ రాకతో జోష్ పెరిగిందా? టీ.బీజేపీకి నాగర్ కర్నూల్ బహిరంగసభ ఇచ్చిన సందేశం ఏంటి? సీనియర్ నేతలున్న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కూడా కేడర్లో ఊపు తెచ్చింది. పాలమూరు జిల్లా తమకు అత్యంత ముఖ్యమైనదని బీజేపీ పెద్దలు చాటారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పార్టీ నేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డి నిత్యం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పార్టీకి హైప్ తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కేడర్లో నిరాశ అలుముకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకురావడానికి పార్టీ పెద్దలు సీరియస్గానే ప్రయత్నించారు. కాని ఆయన పాతగూటికే చేరాలని నిర్ణయించుకున్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తెలంగాణలో పార్టీ నేతలు, కేడర్ మీద ప్రభావం చూపించింది. పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. కేడర్ నిస్సత్తువకు గురైంది. మరోవైపు కర్నాటకలో సాధించిన విజయంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కర్నాటక సరిహద్దులోనే ఉన్న పాలమూరు జిల్లాలో కచ్చితంగా కాంగ్రెస్ ఎఫెక్ట్ ఉంటుందని భావించారు. అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ నాగర్కర్నూల్లో బీజేపీ నవసంకల్ప్ యాత్ర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభకు రావడం, ప్రజలు కూడా భారీగా తరలిరావడంతో బీజేపీ కేడర్లో ఉత్సాహం ఉప్పొంగింది. తెలంగాణలో పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన ప్రయత్నం పాలమూరు జిల్లాలో మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ విజయాలపై కూడా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడర్ మొత్తం ఉత్సాహంగా పాల్గొనాలని కేంద్ర నాయకత్వం సూచించింది. జిల్లా కేడర్లో ఉత్సాహం నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు నడ్డా. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద నిరాశలో కూరుకుపోయిన కమలం కేడర్కు నడ్డా బహిరంగసభ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. చదవండి: కాంగ్రెస్కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం.. పక్క పార్టీల నాయకులకు గాలం -
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది: జేపీ నడ్డా
Updates.. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ది దిశగా సాగుతోందని, తెలంగాణ అభివృద్ధిలో మోదీ చేయాల్సింది అంతా చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం ఆయన నాగర్ కర్నూల్లోని నవ సంకల్పసభలో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సామర్థ్యాన్ని కేసీఆర్ నాశనం చేశారు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘తెలంగాణ వికాసం కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు. తెలంగాణకు మోదీ భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. 80 కోట్ల ప్రజలకు మోదీ ప్రభుత్వం రేషన్ ఇస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధితో రైతులను కేంద్రం ఆదుకుంటోంది. మొత్తం ఐరోపా ఖండం కన్నా ఐదు రెట్ల మందికి రేషన్ అందుతోంది. దేశంలో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ఉజ్వల, ఉజాలా పథకాలతో గ్యాస్ అందిస్తున్నాం. ఆయుస్మాన్ పథకంతో ఎంతోమందికి బీమా కల్పించాం. మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. ♦సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్కు వెళ్లనున్న జేపీ నడ్డా.. అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ♦ సంపర్క్ సే సమర్థన్ ప్రచారంలో భాగంగా ఫిల్మ్నగర్లో క్లాసికల్ డ్యాన్సర్, పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర జయంత్తో జేపీ నడ్డా, కిషన్రెడ్డి భేటీ అయ్యారు. మోదీ పాలనలో అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాలను ఆనంద శంకరకు అందించారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా: ప్రొ.నాగేశ్వర్ జేపీ నడ్డాతో భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ పాలన గురించి నడ్డా వివరించారని తెలిపారు. ‘‘వివిధ అంశాలపై సమావేశంలో చర్చించాం. దేశవ్యాప్తంగా అనేకమందిని కలుస్తున్నారు. అందులో భాగంగానే నన్ను కలిశారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా. ప్రజాస్వామ్యంలో ఇలా కలుసుకోవడం శుభపరిణామం. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిది’’ అని నాగేశ్వర్ పేర్కొన్నారు. ♦ప్రొఫెసర్ నాగేశ్వర్తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకానికి నాగేశ్వర్కు ఆయన అందించారు. నడ్డా వెంట తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు ఉన్నారు. ♦ నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. ♦ ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందరావు, విజయశాంతి, వివేక్ తదితరులు ఉన్నారు. ♦ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డా. ♦బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలులో బీజేపీ తలపెట్టిన సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ♦ అయితే, కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా, రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించి దిశానిర్దేశం చేసే విషయంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో ముఖ్యనేతల మధ్య సమన్వయం కొరవడి బీజేపీ డీలాపడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు. ♦ జేపీ నడ్డా.. మధ్యాహ్నం ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు. నడ్డా పూర్తి షెడ్యూల్ ఇదే.. ♦ ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతారు. ♦ మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్లో రిజర్వ్ టైమ్. ♦ 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొ.నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు సమావేశమవుతారు. ♦ 2.55 నిమిషాలకు ఫిల్మ్నగర్లో పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ను కలుసుకుంటారు. ♦ 3.50కి నోవాటెల్కు చేరుకుంటారు. ♦ 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగర్కర్నూ ల్కు బయలుదేరి 4.50కు అక్కడికి చేరుకుంటా రు. ♦ సాయంత్రం 5–6గంటల మధ్య నాగర్కర్నూల్ జెడ్పీ హైసూ్కల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. ♦ 6.15కు హెలి కాప్టర్లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్కు చేరుకుంటారు. ♦ 6.45 గంటలకు ప్రత్యేక విమా నంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు. -
10,783 కనెక్షన్లకు ‘జీరో’ బిల్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్కు ఒక మీటర్, ఆ మీటర్కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. 2,788 కనెక్షన్లపైనే విచారణ.. ఈఆర్సీ సూచనలతో టీఎస్ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది. తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది. 10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్కు తెలియజేశారు. ఒక్క నాగర్కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి. 41 మందిపై చర్యలకు ఆదేశం.. నాగర్కర్నూల్ డివిజన్లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు
సాక్షి, నాగర్కర్నూల్: ఒకేసారి 220 జంటలు ఒక్కటైన అపురూప దృశ్యం ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆవిష్కృతమైంది. ఎంజేఆర్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల మహోత్సవం కన్నులపండువగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.కేశవరావు, పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకులు కల్యాణం నిర్వహించగా.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ముత్యాల పందిరి, పురోహితుల ఆధ్వర్యంలో 220 కొత్త జంటలు ఒకే వేదిక ద్వారా ఒక్కటయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వధూవరులకు కంకణాలను అందజేశారు. కొత్తజంటలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. సామూహిక వివాహాలకు హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటుచేశారు. సంపాదనలో సగం పేదలకే.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సంపాదించిన దాంట్లో సగం పేదల కోసం ఖర్చు చేయాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ఎంపీ కె.కేశవరావు అన్నారు. ఎమ్మెల్యే సొంతంగా రూ.3 కోట్లు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనకు అవకాశం వస్తే అనాథలు, బడుగు, బలహీనులకు వివాహాలు జరిపిస్తానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా వివాహ కార్యక్రమాలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కటికానున్న 220 జంటలు
సాక్షి, నాగర్కర్నూల్: ఒకేసారి 220 జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యే దృశ్యం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆవిష్కృతం కానుంది. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో ఐదోసారి సామూహిక వివాహ మహోత్సవాన్ని ఆదివారం ఉదయం 10.05 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా, శుక్రవారం కాబోయే జంటలకు మెహందీ, హల్దీ ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి కాబోయే వధువరులు మురిసిపోయారు. సామూహిక వివాహ వేడుకల్లో మొత్తం 220 జంటలకు ఏకకాలంలో వివాహం నిర్వహించనున్నారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్షీనరసింహస్వామి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా, ప్రతి జంటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వివాహాలు జరిపించనున్నారు. పెళ్లయ్యే జంటల తరపున బంధువులందరికీ విందు భోజనాలు కూడా పెడుతున్నారు. కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కార్యకర్తల బలంతోనే..: జనార్దన్రెడ్డి కార్యకర్తలు, ప్రజల తోడ్పాటుతోనే ఐదోసారి సామూహిక వివాహాలు చేయగలుగుతున్నాం. ఎంతోమంది నిరుపేదలకు వారి పిల్లల పెళ్లిళ్లు చేయడమనేది కలగానే ఉంటుంది. పెద్దసంఖ్యలో జంటలకు వివాహం జరిపించడం అదృష్టంగా భావిస్తున్నా. -
ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా నల్లమల
సాక్షి, నాగర్కర్నూల్: అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా నల్లమల అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్తో కలసి మన్ననూరులో కొత్తగా నిర్మించిన ట్రీహౌస్, అదనపు కాటేజీలతోపాటు 8 సఫారీ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ల్లోని పులుల సంరక్షణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 2018లో 12గా ఉన్న పులుల సంఖ్య 2021లో 21కి పెరిగినట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్ నమో దు చేస్తున్నామని, సమాచారం తెలిపిన వారికి బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఎకో టూరిజంలో భాగంగా ప్యాకేజీలు.. టైగర్ స్టే ప్యాకేజీలో భాగంగా రెండ్రోజులు అడవిలో ఉండి టైగర్ సఫారీతోపాటు ట్రెక్కింగ్, కాటేజీల్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే ఉన్న కాటేజీలకు మరో ఆరు కాటేజీలతోపాటు ఇటీవల నిర్మించిన ట్రీహౌస్æ కాటేజీ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఈనెల 26 నుంచి టైగర్ స్టే ప్యాకేజీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. సాధారణ కాటేజీలో ఇద్దరికి రూ.4,600, మడ్ హౌస్లో రూ. 6 వేలు, ట్రీ హౌస్లో రూ. 8 వేలతో ప్యాకేజీని ఖరారు చేశామన్నారు. బుకింగ్ల కోసం www.amrabadtigerreserve.com సంప్రదించొచ్చన్నారు. పులుల అభయారణ్యాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రీయాల్ చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కలెక్టర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత ప్రియుడితో కలిసి మహిళ ఘాతుకం.. అనుమానంతో వేధిస్తున్నాడని
సాక్షి, నాగర్కర్నూల్: తాగి వేధిస్తున్న ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి మహిళ హత్య చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు వలస వెళ్లింది. అక్కడే ఉంటున్న రవికుమార్ (38)తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో వారు ఐదేళ్ల క్రితం అక్కడి నుంచి వచ్చి వట్టెంలో సహజీవనం చేస్తున్నారు. కాగా, కృష్ణమ్మకు గతంలో జడ్చర్లకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానంతో రవి రోజూ తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆ వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేక మాజీ ప్రియుడు శ్రీనివాస్కు విషయం చెప్పింది. వారిద్దరూ కలిసి ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిద్రలో ఉన్న రవికుమార్ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ హన్మంత, ఎస్ఐ కృష్ణా ఓబుల్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వెంటనే విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తామని పోలీసులు చెప్పారు. -
నాగర్కర్నూల్లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే, మార్కండేయ లిఫ్ట్ పనులను పరిశీలించేందుకు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. నాగం జనార్థన్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇక్కడకి వచ్చేందుకు వీలులేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ నేతల దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా పనులు చేస్తున్నప్పుడు తమను అడ్డుకోవాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. దాడి ఘటన తర్వాత కాంగ్రెస్ నేతలు, నాగం అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కల్తీ మద్యం కలకలం?
నాగర్కర్నూల్ క్రైం: ఒకే షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తాగిన ఇద్దరు వ్యక్తులు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతులు కుటుంబసభ్యుల కథనం మేరకు... నాగర్కర్నూల్ మండలం నల్లవెల్లికి చెందిన నర్సింహ(45) సోమవారం సాయంత్రం నాగర్కర్నూల్ బస్టాండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరో ఘట నలో మండలంలోని కుమ్మెరకు చెందిన ఊషన్న(50) బ్యాంకులో నగదును తీసుకునేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రానికి వచ్చా డు. డబ్బులు తీసుకున్న తర్వాత మద్యం తాగి తిరిగి వెళ్తూ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ వద్ద కిందపడి మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఊషన్న జేబులో మద్యం సీసా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నర్సింహ, ఊషన్న ఇద్దరూ కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. శాంపిల్స్ సేకరించిన ఎక్సైజ్ అధికారులు జిల్లా కేంద్రంలో ఇద్దరు కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ పరమేశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం బస్టాండ్ సమీపంలోని మోతీ వైన్స్లో తనిఖీలు నిర్వహించి పలు బ్రాండ్లకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు. కాగా మృతులు ఇద్దరూ మద్యం కొనుగోలు చేసింది ఒకే వైన్స్ నుంచే కావడం కల్తీ మద్యం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయమై ఎక్సైజ్ ఈఎస్ ఫయాజుద్దీన్ను వివరణ కోరగా మోతీ వైన్స్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. -
ఉద్యమకారులపై కేసులా?
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో ఉద్యమకారులపై కుట్రలతో కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, అయితే రాష్ట్రంలో ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదని విమర్శించారు. తిండి లేకున్నా ఉంటాం కానీ, ఆత్మగౌరవం లేకుండా ఉండలేమని వ్యాఖ్యానించారు. తాను రెండు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ‘జూపల్లి మరో ప్రస్థానం’పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెద్దపులి
అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్టువర్లపల్లి సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించింది. ఒక్కసారిగా పులి రో డ్డుపైకి రావడంతో అటు వెళ్తున్న ప్ర యాణికులు వాహనాలను నిలిపివేశారు. పులి ఫొటోలను కెమెరాల్లో చిత్రీకరించారు. దీనిపై డీఎఫ్వో రోహిత్ గోపిడి స్పందిస్తూ అమ్రాబా ద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేశారు. అందుకే మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు అక్కడక్కడ రోడ్డుపై పులుల సంచారం కనిపిస్తోందని పేర్కొన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలే: ఆర్ఎస్పీ
కొల్లాపూర్ రూరల్: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కుడికిల్లలో ఇటీవల పోడు భూముల సమస్యలతో నార్లాపూర్, కుడికిల్ల గ్రామాల రైతుల ఘర్షణలో గాయపడిన దళిత రైతులను పరామర్శించారు. అనంతరం ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ అంగట్లో సరుకుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రెండు పార్టీలు ముందుగా మాట్లాడుకునే ఈ తతంగాన్ని నడిపాయని ఆరోపించారు. కొనుగోలుకు గురైన ఎమ్మెల్యేలను దించి.. బీఎస్పీ పార్టీ వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాగర్కర్నూల్: ర్యాగింగ్ భూతానికి మైనా బలి!
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ఓ ప్రభుత్వకాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ర్యాగింగ్ చేశారనే మనస్థాపంతో మైనా అనే ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హనుమాన్ తండాకి చెందిన మైనా(19).. జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదవుతోంది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆపై ఇంటికి వచ్చి బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాయంత్రానికి కన్నుమూసింది. తొలుత సూసైడ్కి గల కారణాలు తెలియరాలేదు. అయితే ర్యాంగింగ్కు సంబంధించిన వీడియోగా ఒకటి వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వీడియోలో ఒకరు.. మైనాను కొడుతున్నట్లుగా ప్రచారం అవుతోంది. కౌన్సెలింగ్.. బెదిరింపులు? మైనాపై జరిగిన ర్యాగింగ్ బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు లెక్చరర్లు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు విషయం బయట చెప్పొద్దని ప్రిన్సిపాల్ సైతం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో భారీ వర్షాలు
-
ఎలుక మూతి.. సౌండ్ వింటే గుండె ఆగి చస్తాయ్!!
సాక్షి, నాగర్ కర్నూల్: జానెడు పొడవు.. 2,3 కిలోల బరువు.. ఎలుకలాంటి ముఖం.. జాతి మాత్రం జింక. మన దేశంలో అరుదైన మూషిక జింకలు అవి. జింకల జాతిలో అతి చిన్నవి అయిన ఈ మూషిక జింకలకు నల్లమల అభయారణ్యం కేంద్రంగా మారుతోంది. అంతరించిపోయే దశలో ఉన్న మూషిక జింకలను సంరక్షించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రత్యేకంగా ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బరువు తక్కువ.. భయం ఎక్కువ! భారత ఉప ఖండంలో మాత్రమే విరివిగా కనిపించే మూషిక జింకలు నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల కిందే అంతరించిపోయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జింకలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చింది. మూషిక జింకలకు భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు, జంతువులు దాడి చేసినప్పుడు వాటి గుండె ఆగి మరణిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూషిక జింకలు రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో నేలరాలిన పండ్లు, పూలు, ఆకులను తింటాయి. మారేడు, ఉసిరి, పరక, గొట్టి, మంగకాయలు, పుట్టగొడుగులు, చిన్నచిన్న పొదల లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింక గర్భాధారణ కాలం ఆరునెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. అయితే వెంటనే మళ్లీ సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. వీటిని చిరుత పులులు, అడవి కుక్కలు, గద్దలు, అడవి పిల్లులు వేటాడుతాయి. వీటికితోడు వేట, అడవుల నరికివేత, కార్చిచ్చుల వంటివి మూషిక జింకల ఉనికికి ముప్పుగా మారుతున్నాయి. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 2017 నుంచి మౌస్డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని తిరిగి పెంచేందుకు అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం. ::: రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ 3 దశల్లో.. ప్రత్యేక జాగ్రత్తల మధ్య.. అటవీశాఖ హైదరాబాద్లోని జూపార్క్, సీసీఎంబీ సంస్థలతో కలసి మూషిక జింకల సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదట 2008లో శేషాచలం అడవుల నుంచి నాలుగు ఆడ, రెండు మగ మూషిక జింకలను తీసుకొచ్చి హైదరాబాద్ జూపార్క్లోని బ్రీడింగ్ కేంద్రంలో ఉంచారు. వాటి సంఖ్య పెరిగిన తర్వాత 2017 సెప్టెంబర్ 12 నుంచి ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’ప్రోగ్రాం కింద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ► ఒక్కో బ్యాచ్లో ఆరు ఆడ, రెండు మగ మూషిక జింకలను వదులుతున్నారు. ఇది మూడు దశలుగా జరుగుతుంది. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ సమీపంలో మూడు కంపార్ట్మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ► తొలిదశలో క్యారెట్, దానిమ్మ, అరటి వంటి బయటి ఆహారాన్ని అందించి పరిరక్షిస్తారు. ► రెండో దశలో బయటి ఆహారాన్ని తగ్గిస్తూ.. అడవిలో సహజంగా లభించే ఆహారాన్ని అందజేస్తారు. ► మూడో దశలో అడవిలోకి వదిలి బయటి నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా సహజ వాతావరణంలో అవే వెతుక్కుని తీసుకునేలా అలవాటు చేస్తారు. ► మొత్తంగా 30 రోజుల పరిశీలన అనంతరం పూర్తిగా అడవిలో వదిలేస్తారు. అయితే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అడవిలో అక్కడక్కడా 50 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 144 మూషిక జింకలను విడుదల చేశారు. -
రైలు కిందపడి చావాలనుకున్నా.. బతికి సాధించా: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే
సాక్షి, నాగర్కర్నూల్: ‘వ్యాపారం, రాజకీయాల్లోకి రాకముందు నేను కూడా ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. రైలు కిందపడి చనిపోయేందుకు కాచిగూడ రైల్వేస్టేషన్కు వెళ్లా. కానీ, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నా. జీవితంలో పైకి ఎదగాలనే పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యాను. ఒకప్పుడు పనిలేని స్థాయి నుంచి.. ఇప్పుడు 7 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాను’.. అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఒకప్పుడు నాన్నతో గొడవపడి కేవలం రూ.30తో హైదరాబాద్ వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన వివరించారు. యువత ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని హితవు పలికారు. నిరుపేద విద్యార్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! -
పిల్లలను చంపాడని భర్త గొంతుకోసిన భార్య
కొల్లాపూర్ రూరల్: పిల్లలను హత్య చేశాడని కోపంతో రగలిపోయిన ఓ మహిళ తన భర్త గొంతుకోసి హత మార్చింది. తల్లితో కలిసి ఆమె ఈ హత్యకు పా ల్పడిన ఘటన వివరా లిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లకు చెందిన ఓంకార్(40), మహేశ్వరి భార్యా భర్తలు. వీరికి కూతురు, కుమా రుడు ఉన్నారు. ఇటీవల భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 17న భార్య, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి సమీపంలో భా ర్యను బైక్పై నుంచి తోసేసి ఇద్దరు చిన్నారులను తీసుకొని వెళ్లిపోయాడు. కోడేరు మండలం నాగుపల్లి సమీపంలోని అడ్డగట్టు పైకి పిల్లలను తీసుకెళ్లి గొంతుకోసి, తాను కూడా కోసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా ఓంకార్ ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. అప్ప టికే కోపంతో ఉన్న మహేశ్వరి ఆదివారం ఉదయం తన తల్లి జోగమ్మతో కలిసి ఓంకార్ గొంతును కోసి హత్య చేసింది. -
కుటుంబ పాలనకు అంతం పలకాలి
నాగర్కర్నూల్ రూరల్: రాష్ట్రంలో ఒక కుటుంబంతో అరాచక వ్యవస్థ కొనసాగుతోందని, ఈ పాలనకు అంతం పలకాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర గురువారం నాగర్కర్నూల్ జిల్లాలో ముగిసి వనపర్తి జిల్లా గోపాల్పేటలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన నాగర్కర్నూల్ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్ చనిపోయి 13 ఏళ్లు గడుస్తున్నా.. ఈ ప్రాంత ప్రజలు ఇంకా ఆయనను గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి తన తండ్రి జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
అచ్చంపేట: ‘కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం అన్నారు.. మూడేళ్లకే ఎలా మునిగింది. కాంక్రీట్తో కట్టాల్సిన ప్రాజెక్టును మట్టితో నిర్మిస్తారా’.. అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ఇదే నల్లమలలో మరణించిన మహానేత వైఎస్సార్కు మరణం లేదని, ప్రజల గుండెల్లో ఆయన ఇంకా బతికే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేసింది శూన్యమని, ప్రతీ పథకం మోసమని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. పాలమూరు జిల్లాపై వైఎస్సార్కు అమితమైన ప్రేమ ఉందని.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పలు ప్రాజెక్టులు చేపట్టారని షర్మిల పేర్కొన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దాటే వరకు నల్లబ్యాడ్జీలతో పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. -
Ganesh Chaturthi 2022: ఏకశిలలో భారీ ఏకదంతుడు
సాక్షి, నాగర్కర్నూల్: ఇది దేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడి విగ్రహం. ఇది నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. దుందుభి వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉన్న గోమఠేశ్వరుడు, చాముండీ కొండపై నందీశ్వరుడితోపాటు ఆవంచలోని గణపతి ఏకశిలా విగ్రహాలుగా అతిపెద్దవిగా ప్రసిద్ధి. ఏటా వినాయక చవితి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే ఈ గణనాథుడికి ఆలయం లేదు. నాటి ఆవుల మంచాపురమే.. నేటి ఆవంచ.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేక మల్లుడు, భువనైక మల్లుడు, తైలోక్య మల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్ష్యాకులు గణపతి భక్తులు కావడంతో క్రీ.శ.12వ శతాబ్దంలో 26 అడుగుల ఎత్తైన ఏకశిలా గణపతిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియం వద్ద భద్రపర్చారు. వీరి కాలంలోనే గ్రామశివారులోని భైరవ ఆలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివ పంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక పూజలందుకోని గణనాథుడు దేశంలోనే అతిపెద్ద వినాయక ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య గణపతికి నీడ లేకుండాపోయింది. ఆలయం నిర్మాణం జరగకపోవడంతో ఈ విగ్రహం వందల ఏళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తోంది. ఏడేళ్ల క్రితం ఓ చారిటబుల్ ట్రస్టు ఆలయం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే ఆలయ నిర్మాణపనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టిసారించాలి.. పురాతన కాలం నాటి ఏకశిలా వినాయక విగ్రహానికి ఆలయాన్ని నిర్మించాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు ఆలయం లేక గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుడిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – వస్పతి శివలింగం, ఆవంచ, నాగర్కర్నూల్ జిల్లా -
భర్త వేధింపులతో ఒకరు.. పెళ్లికి యువకుడు నిరాకరించాడని మరొకరు
సాక్షి, మహబూబ్నగర్: మండలంలోని తాళ్లనర్సింహాపురం గ్రామానికి చెందిన దుబ్బల సుజాత(30) భర్త వేధింపులు భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బాలవెంకటరమణ కథనం ప్రకారం.. ఈ నెల 13న రాత్రి భర్త క్రాంతికుమార్ సుజాతను కొట్టడంతో ఆమె తన తల్లి అలివేలమ్మకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె వచ్చి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లింది. మళ్లీ 16న రాత్రి భర్త మరోసారి కొట్టడంతో మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే తల్లి, బంధువులు నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. సుజాత కొల్లాపూర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తుండగా.. క్రాంతికుమార్ పెంట్లవెల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై సుజాత అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: భర్త ఆగడాలు తట్టుకోలేక.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య వెల్దండ: ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్ఐ నర్సింహులు కతనం ప్రకారం.. వెల్దండలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరత్నమ్మ(24) ఆమనగల్ మండలానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 20న పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబ్నగర్కు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై నాగరత్నమ్మ అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్యతో గొడవపడి పిల్లల గొంతు కోసేశాడు
కోడేరు: భార్యతో గొడవ పడి.. క్షణికావేశంలో చిన్నారులను గొంతు కోసి హత్యచేసిన ఓ తండ్రి..ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ భార్య చనిపోవడంతో జావాయిపల్లి గ్రామానికి చెందిన మరో మహిళను రెండో వివాహం చేసుకున్నా డు. అయితే తాగి జులాయిగా తిరుగుతుండటంతో ఆమె ఓంకార్ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత సొంతూరిలో మల్లేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి విశ్వనాథం (7), చందన (3) పిల్లలున్నారు. కొల్లాపూర్కు మకాం మార్చి..సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 4 రోజుల క్రితం కుడికిల్లకు వచ్చాడు. బుధవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తాన ని చెప్పి ద్విచక్రవాహనంపై భార్య, పిల్లలను ఎక్కించుకుని నాగర్కర్నూల్కు బయల్దేరాడు. మార్గమధ్యలో భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్యను పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి వద్ద బైక్ నుంచి తోసేసి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కోడేరు మండలం ఎత్తం శివారులో నాగులపల్లి వెళ్లే రోడ్డు పక్కన బైక్ను ఆపి.. ఇద్దరి పిల్లల్ని గట్టుపైకి తీసుకెళ్లి పొదల్లో వారి గొంతు కోసి చంపి తర్వాత తానూ గొంతు కోసుకున్నాడు. అయితే.. నొప్పి భరించలేక రోడ్డుపైకి వచ్చి పడిపోయాడు. అటుగా వెళుతున్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడి వచ్చి వివరాలు సేకరించారు. పిల్లలనూ చంపేశానని చెప్పాడు. ఓంకార్ను నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, కుటుంబసభ్యులు గుట్టపైకి వెళ్లిచూడగా చనిపోయి ఉన్న పిల్లల మృతదేహాలు కనిపించాయి. కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
Telangana: కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందే!
నాగర్ కర్నూల్ వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలో పోడు భూముల సమస్య అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతోంది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన నాగం జనార్థనరెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. తెలుగుదేశం అంతర్థానం తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ గుర్తింపు దక్కకపోవడంతో ప్రస్తుతం హస్తం పార్టీలో కాలం వెళ్ళదీస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మర్రి జనార్థనరెడ్డి కారు గుర్తు మీద ఇక్కడి నుంచి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మర్రి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జిల్లా పర్యటకు వచ్చినపుడు బహిరంగంగానే మర్రి పోటీ గురించి ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ళ దామోదరరెడ్డితో మర్రి జనార్థనరెడ్డికి అసలు పడదనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. నియోజకవర్గంలో తన కేడర్పై కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదరరెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డిపై మీడియా ముందే తీవ్ర ఆరోపణలు చేశారు. కూచుకుళ్ళ రెండోసారి కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ కుమారుడు డాక్టర్ రాజేశ్రెడ్డి ఈసారి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. నాగం జనార్థనరెడ్డి వయస్సు మీదపడటం, కాంగ్రెస్ కేడర్లో చాలామంది టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్రెడ్డి టీఆర్ఎస్లో సీటు రాకపోతే కాంగ్రెస్లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగం, కూచుకుళ్ళ మధ్య సయోధ్య కుదిరితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాగంకు సముచిత స్థానం ఇస్తామని పెద్దల నుంచి హామీ వస్తే నియోజకవర్గంలో పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా మారవచ్చు. కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతాయని చెబుతున్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ సీటుగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించిన గువ్వల బాలరాజ్ మూడోసారి కూడా పోటీ చేస్తారని తెలుస్తోంది. బాలరాజ్ వ్యవహారశైలి కారణంగా కేడర్లో, ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేస్తున్నదేమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఆమ్రాబాద్లో మంచినీటి సమస్య, పోడు భూముల సమస్య ఏమాత్రం పరిష్కారం కాకపోవడంతో గిరిజనులు కూడా ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేలో కూడా బాలరాజ్కు నెగిటివ్ నివేదికే వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డాక్టర్ వంశీకృష్ణ నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన కేడర్ తిరిగి వస్తుండటంతో తమ విజయం తథ్యమని హస్తం పార్టీ భావిస్తోంది. డాక్టర్ వంశీకృష్ణ భార్య ఆమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనూరాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈసారి బీజేపీ కూడా అచ్చంపేటలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇటీవల కర్నాటక డీజీపీగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్తో బీజేపీ టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి మహేంద్రనాథ్ కుమారుడైన రవీంద్రనాథ్ అయితే మాదిగ సామాజిక వర్గం ఓట్లన్నీ కమలం గుర్తుకే పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. కల్వకుర్తిలో అధికార పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య అంతర్గత పోరు సాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వీరిద్దరి మధ్య రెండు వర్గాలుగా చీలిపోయారు. గత ఎన్నికల్లో జైపాల్కు కసిరెడ్డి సహకరించకపోయినా విజయం సాధించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా గ్యాప్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్యా సయోధ్యకు పార్టీ నాయకత్వం కూడా ప్రయత్నించలేదు. వంశీచందర్రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించి..ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమి చెందారు. రెండున్నరేళ్ళుగా వంశీచందర్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్ కాంగ్రెస్లోకి చేరేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. కాని సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేస్తోంది. గత రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిన తల్లోజు ఆచారినే ఈసారి కూడా బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్రెడ్డి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్రెడ్డి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి ఓటమి చెందారు. తర్వాత హర్షవర్థన్ కారు పార్టీలోకి జంప్ చేశారు. ఇక అప్పటినుంచీ ఇద్దరి మధ్యా వార్ నడుస్తోంది. ఇద్దరి వర్గీయులు ఎవరికి వారు ఈసారి సీటు తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే జూపల్లి పార్టీ మారతాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ మారితే పాతగూడు కాంగ్రెస్లో చేరతారా? లేక కాషాయ జెండా పట్టుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు జగదీశ్వరరావు ఆసక్తి చూపిస్తున్నారు. హర్షవర్థన్రెడ్డి పార్టీ వీడాక కాంగ్రెస్లో బలమైన నాయకత్వం కరువైంది. -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్లోని పంప్హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్హౌస్లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్ను కిందకు దింపుతుండగా క్రేన్వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్లో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. -
కుటుంబ పాలనపై ప్రజలకు విసుగు: లక్ష్మణ్
సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిదేళ్లలో చేసిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన ప్రజా సంక్షేమ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసుగు చెందారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి పార్టీ అని వ్యాఖ్యానించారు. -
మంచినీళ్లు అడిగితే పురుగుల మందు ఇచ్చారు!
నాగర్కర్నూల్ రూరల్/తెలకపల్లి: ప్రియురాలి కోసం వచ్చిన యువకుడిని పట్టుకుని ఎందుకొచ్చావంటూ నిలదీసి దాడి చేశారు. దీంతో అక్కడ్నుంచి దెబ్బలతో వచ్చిన యువకుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా పరిస్థితి విషమించడంతో నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించగా.. ప్రణాళిక ప్రకారమే తమ కొడుకును చంపేశారని తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈనెల 5న జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని దాదామోని శివ(18) కొంతకాలంగా అచ్చంపేట మండలం చవుట పల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కాగా, ఈనెల 5న తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లిలోని చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్రియురాలి కోసం శివ అదే రాత్రి ఇంటికి వెళ్లాడు.దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ‘మా అమ్మాయి వద్దకు మళ్లీ ఎందుకొచ్చా వు..’ అంటూ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ పడి శివ అక్కడ్నుంచి ఇంటికి రాగా అతడి కుటుంబ సభ్యులు నాగర్కర్నూల్ లోని జనరల్ ఆస్పత్రికి తరలిం చారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని నిమ్స్కు తీసు కెళ్లారు. అక్కడే చికిత్స పొందు తూ ఈనెల 9న మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం అతని తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఎస్ఐపై చర్య తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు శివను పథకం ప్రకారమే ప్రియురాలి బంధువులు హత్య చేశారని యువకుడి తల్లిదండ్రులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంతటి నాగన్న, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ఆరోపించారు. న్యాయం చేయాలని తెలకపల్లి పోలీసులను ఆశ్రయించిన యువకుడి తల్లిదండ్రులను అక్కడి ఎస్ఐ బెదిరించారని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్పీ మనోహర్కు ఫిర్యాదు చేశారు. దాడి చేశారని కేసు పెట్టేందుకు వెళ్లిన శివపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని ఎస్ఐ బెదిరించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడిలో దెబ్బలకు తాళలేక మంచినీళ్లు ఇవ్వాలని కోరిన శివకు ప్రియురాలి బంధువులు పురుగుమందు తాగించారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకుడు పృథ్వీరాజ్, జనసేన యూత్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా లక్ష్మణ్గౌడ్, శివ కుటుంబ సభ్యులు, తెలకపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. -
కారులో ఇరుక్కుపోయి, డోర్ తీయలేక!
సాక్షి, నాగర్కర్నూల్: సరదాగా కారులోకి వెళ్లిన తర్వాత డోర్లాక్ పడటంతో ఓ బాలిక ఊపిరాడక మరణించింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారంరాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన కడమంచి అంజమ్మ తన భర్త దూరం కావడంతో కూలిపనులు చేస్తూ కూతురు సుగుణ(9)తో కలసి జీవిస్తోంది. నాలుగో తరగతి చదువుతున్న సుగుణ చెత్త సేకరణ నిమిత్తం ఈ నెల 2న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకువెళ్లింది. మధురానగర్ సమీపంలో ఓ ఇంటి వెనకాల రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు వద్దకు చేరుకుంది. కారు డోర్లను తీసేందుకు ప్రయత్నించగా ఎడమ వైపు ఉన్న ముందు డోరు తెరచుకుంది. బాలిక కారులోకి వెళ్లి కూర్చొని డోర్ వేయగానే డోర్ లాక్ అయింది. డోర్ తీసేందుకు బాలిక ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లకు దూరంగా కారును పార్క్ చేసి ఉంచడం, జన సంచారం లేకపోవడంతో కారులో బాలిక ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. దీంతో ఊపిరాడక కారులో సొమ్మసిల్లి పడిపోయింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు కారు యజమానికి చెందిన బంధువు కారు తీసేందుకు రాగా.. లోపల బాలిక మరణించిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా, కూతురు కోసం తల్లి పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని భావించి ఎదురుచూసింది. ఈలోగా కారులో ఇరుక్కున్న బాలిక 32 గంటల తర్వాత శవమై కనిపించడం కలకలం రేపింది. మృతదేహాన్ని జిల్లాస్పత్రికి తరలించారు. అద్దాలు పగలకొట్టేందుకు ప్రయత్నించినా.. బాలిక కుటుంబసభ్యులు, బంధువులు శనివారం ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. సీఐ హన్మంతు వచ్చి వారికి సర్దిచెప్పారు. అనంతరం పోలీసులు సంఘటనాస్థలంలోని సీసీ కెమెరాను పరిశీలించగా బాలిక చెత్త ఏరుకుంటూ అక్కడున్న కారులోకి సరదాగా వెళ్లినట్లు గుర్తించారు. అయితే కారులో ఉన్న జాకీరాడ్తో కారు అద్దాలను పగలకొట్టేందుకు బాలిక విఫలయత్నం చేసింది. ఈ దృశ్యాలు కూడా సీసీ ఫుటేజీలో కనిపించాయి. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
చారకొండ: దైవ దర్శనానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదానికిగురై దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసు కుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన దం పతులు గౌస్ఖాన్ (50), ఫర్హానా (42), కుమారు డు ఇంతియాజ్తో పాటు నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లికి చెందిన గౌస్ఖాన్ సోదరి సాదిక (51), ఆమె కుమారుడు రోషన్ (31) కలసి కారులో శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా లో ఉన్న హజ్రత్ అమినా పీరాన్ దర్గాకు వెళ్లారు. దర్శనం చేసుకున్నాక అర్ధరాత్రి తిరుగు ప్రయాణమ య్యారు. శనివారం ఉదయం 7.30 గంటలకు వారు ప్రయాణిస్తున్న కారు తుర్కపల్లి సమీపంలోకి చేరుకోగానే జడ్చర్ల–కోదాడ ప్రధాన రహదారిపై అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాంక్రీట్ దిమ్మెను బలంగా ఢీకొంది. దీంతో ఇంతియాజ్కు తీవ్ర గాయాలు కాగా మిగతా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఇంతియాజ్ను అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను కల్వకుర్తి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. చారకొండ ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ మనోహర్, కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐ రామకృష్ణ పరిశీలించారు. కారు నడిపిన రోషన్ నిద్రమత్తులో ఉండడంతోపాటు పాటు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఏడాది క్రితం తుర్కపల్లి సమీపంలో రోడ్డు విస్తరణ చేపట్టారు. పాతరోడ్డుకు ఉన్న కల్వర్టును కూల్చివేసి కొత్తది నిర్మించారు. అయితే రోడ్డు పక్కన కాంక్రీట్ దిమ్మని అలాగే వదిలేశారని గ్రామస్తులు తెలిపారు. చదవండి: కలిసి బతకలేమని.. ప్రియుడి మృతి, చున్నీ తెగిపడి.. -
‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం
కందనూలు (నాగర్కర్నూల్): పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల సొరంగం పనుల్లో రాయి కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్రెడ్డి ఎప్పటిలాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకుని, మరో నలుగురు కూలీలతో కలిసి బుధవారం ఉదయం లోపలికి వెళ్లాడు. సొరంగంలో 400మీటర్ల మేర చేరుకోగానే పైకప్పు నుంచి రాళ్లు విరిగి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంట ఉన్నవారు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ హెల్మెట్ లేకుండానే ట్రాక్టర్తో లోపలికి వెళ్లినట్టు తెలిసింది. -
నాగర్కర్నూలు: అచ్చంపేటలో టీఆర్ఎస్ Vs కాంగ్రెస్
-
డాక్టర్ల దారుణం.. కరోనా ఉందని కాన్పు చేయలేదు
‘కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గర్భిణికి కరోనా సోకినా నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం చేశారు. జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రిలో కూడా కరోనా సోకి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు.’’ – ఈ నెల 23న ట్విట్టర్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిజమే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బంది కరోనా పరిస్థితుల్లో సైతం వెనుకంజ వేయకుండా నిర్విరామ సేవలందిస్తున్నారు. కానీ కొన్నిచోట్ల మాత్రం వారు ఈ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి మెచ్చుకున్న రెండ్రోజులకే ఒక నిండు గర్భిణిని ఆస్పత్రి ఆరుబయటే వదిలేశారు. కరోనా సాకుతో ఆమెకు డెలివరీ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించింది. సాక్షి, నాగర్కర్నూల్/అచ్చంపేట రూరల్: పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ ఉందనే సాకుతో డెలివరీ చేసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. బల్మూర్ మండలం బాణాలకు చెందిన చెంచు మహిళ నిమ్మల లాలమ్మ మూడో కాన్పు కోసం సోదరి అలివేలతో కలసి మంగళవారం ఉదయం అచ్చంపేట సివిల్ ఆస్పత్రికి వచ్చింది. ముందు జాగ్రత్తగా వైద్యులు ఆమెకు కరోనా ర్యాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ డెలివరీ చేయడం కుదరదని, నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తూ చీటీని రాసిచ్చి చేతులు దులిపేసుకున్నారు. కనీసం అంబులెన్సు కూడా ఏర్పాటు చేయలేదు. దాదాపు 40 నిమిషాలు గడిచిపోయాయి. ఈలోగా లాలమ్మకు పురిటి నొప్పులు ఎక్కువైనా వైద్యులెవరూ స్పందించలేదు. చివరికి ఆస్పత్రి ఆవరణలోనే ఆమె ఆడశిశువుకు జన్మి నిచ్చింది. దీంతో సిబ్బంది హడావుడిగా లాలమ్మను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. బిడ్డకు, తల్లికి ప్రత్యేక గదిని కేటాయించి చికిత్స అందించారు. గతంలోనూ ఇదే తీరు.. గతంలోనూ అచ్చంపేట సివిల్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. 2016 సెప్టెంబర్ 28న నల్లగొండ జిల్లా చందంపేటకు చెందిన ఈదమ్మ కాన్పుకు రాగా.. ఆస్పత్రి వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో ఆçస్పత్రి బయటే ప్రసవించింది. 2019 డిసెంబర్ 18న అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన గర్భిణికి డెలివరీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తల, మొండెం వేరు అయ్యేలా చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రానియ్యలేదు: అలివేలు, లాలమ్మ సోదరి పురిటినొప్పులు వస్తున్నాయని చెల్లెలు లాలమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చినం. డాక్టర్లు టెస్టు చేసి కరోనా ఉందని చెప్పారు. పురిటినొప్పులు వస్తున్నా ఎవరూ దగ్గరకు రాలేదు. మేం చెంచులం, పైసలు ఉండవనే మమ్మల్ని ఆస్పత్రి నుంచి పంపించారు. అందరూ చూస్తుండగానే కాన్పు అయింది. నిబంధనల ప్రకారమే రెఫర్ చేశాం: డా.కృష్ణ, సూపరింటెండెంట్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. డ్యూటీ డాక్టర్ పరిశీలించి నిబంధనల ప్రకారమే జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. వారు బయటకుపోయిన చాలాసేపటి తర్వాత ఆరుబయట ఆమె ప్రసవించడంతో వెం టనే బాలింత, శిశువుకు ఆస్పత్రిలోని ఓ ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నాం. డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకోండి: మంత్రి హరీశ్ అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని కోవిడ్ వచ్చిందని చేర్చుకోకుండా బయటికి పంపిన డ్యూటీ డాక్టర్ హరిబాబుపై చ ర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు కలెక్టర్ ఉదయకుమార్ను ఆదేశించారు. కోవిడ్తో వచ్చి న గర్భిణులకు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయా లని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. -
పాపం గణపయ్య
-
కిడ్నాప్ కు దారితీసిన ఇద్దరు వ్యక్తుల ఆర్థిక లావాదేవీల వివాదం
-
భయంభయంగా.. వాగు దాటి..
సాక్షి, కొల్లాపూర్ రూరల్ : ఎడతెరిపి లేని వర్షాలతో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం సమీపంలోని ఉడుములవాగులో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం అవతలివైపు వెళ్లిన దాదాపు 25 మంది రైతులు సాయంత్రం తిరిగి వచ్చేందుకు వీలు లేకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. చివరికి కొంతమంది తాళ్లు వదలడంతో వాటి సాయంతో మహిళలు, వృద్ధులు భయం భయంగా వాగు దాటారు. ఆరేళ్ల క్రితం ఈ వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభించినా పూర్తి చేయకపోవడంతో వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. – కొల్లాపూర్ (నాగర్కర్నూల్ జిల్లా) నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది. – రెంజల్(బోధన్) -
హమాలీ పనికి మించిన ఉపాధి ఏముంది?: మంత్రి నిరంజన్రెడ్డి
నాగర్కర్నూల్: ‘కొనుగోలు కేంద్రాల కాడ సగటున 100 మందికి పనివస్తుంది. వానాకాలం, యాసంగిలో రెండున్నర నెలలు ఎవరి పనులు వారు చేసుకుంటూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేసుకునే వెసులుబాటు తెలంగాణలో గ్రామగ్రామాన వచి్చంది. ఇంతకు మించిన ఉపాధి ఏముంది? ఉపాధి అంటే ఇది. సదువుకుంటే సర్కారీ నౌకరి వస్తది.. అయితే, సదువుకున్న అందరికీ సర్కారీ నౌకరి రాదు’అని నిరుద్యోగులను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ‘దిశ’సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉండి ఉద్యోగాలను తొలగించి, ప్రైవేట్పరం చేస్తున్న పారీ్టలు ఇక్కడ ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు చర్చ చేయకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలంటే వీలుపడుతుందా అని ప్రశ్నించారు. మీడియా వక్రీకరించింది: నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్లో తాను మాట్లాడిన మాటలను మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచింది. ఉద్యోగం అంటేనే ఉపాధి. అది కలి్పంచడం ప్రభుత్వ విధి’ అని తానన్న వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నానన్నట్టుగా ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి తెలిపారు. -
హరితహారం: ఎమ్మెల్యే నాటిన మొక్కలు తినేసిందని..
సాక్షి, కొల్లాపూర్: హరితహారంలో భాగంగా గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డులో మొక్కలు నాటారు. కాసేపటికే కొన్ని మొక్కలను ఓ మేక తినేసింది. దీంతో మున్సిపల్ సిబ్బంది దాన్ని పట్టుకొని కొత్త గ్రంథాలయ భవనం వద్ద ఇనుప జాలీలో బంధించారు. జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని యజమాని రంగస్వామికి కబురంపారు. శుక్రవారంమేకను విడిపించుకునేందుకు రంగస్వామి రాగా అధికారులు లేరు. ఈలోగా విషయం సోషల్మీడియాకు ఎక్కడంతో శుక్రవారం సాయంత్రం అధికారులు మేకను విడిచిపెట్టారు. -
ఆర్టీసీ బస్సుకు విద్యుదాఘాతం.. మహిళ మృతి
కల్వకుర్తి టౌన్: ఆర్టీసీ బస్సు విద్యుదాఘాతానికి గురవడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ మేస్త్రీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కల్వకుర్తి బస్టాండ్లో ప్రయాణికులను ఎక్కించుకుని అచ్చంపేటకు బయల్దేరింది. పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో మురుగుకాల్వ నిర్మాణం చేపడుతుండటంతో బస్సును డ్రైవర్ వెంకటయ్య ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డైవర్షన్ తీసుకున్నాడు. అయితే అక్కడ కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగను గమనించక ముం దుకు వెళ్లాడు. దీంతో బస్సు టాప్పై ఉండే క్యారియర్కు తీగ తగిలి ఎర్తింగ్ రావడంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. అక్కడే పనిచేస్తున్న తాపీమేస్త్రీ శ్రీశైలం పరిస్థితిని గమనించి వెంటనే తాను పని చేసే స్థలం వద్ద ఉన్న పెద్ద కర్రను తీసుకొచ్చి విద్యుత్ తీగను పక్కకు నెట్టాడు. ప్రమాద తీవ్రతను పసిగట్టిన డ్రైవర్.. ఎవరూ బస్సు దిగవద్దని, కిందకు దిగితే ఎర్తింగ్ వల్ల కరెంట్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే ప్రాణభయంతో డోరు వద్ద ఉన్న వంగూరు మండలం రంగాపూర్కు చెందిన నర్సమ్మ (50) తన ఇంటికి అవసరమైన ఇనుప వెంటిలేటర్లను తీసుకుని, బస్సులోని ఐరన్ రాడ్డు సహాయంతో కిందకు దిగిన వెంటనే విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందింది. మరో ప్రయాణికుడు వృద్ధుడైన రెడ్యా భయంతో కిటికిలోంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు దగ్ధమయ్యేది.. బస్సుకు విద్యుత్ తీగలు తగల డం గమనించాను. వెంటనే పెద్దకర్రను తీసుకుని పక్కకు జరిపి బస్సును ముందుకు వెళ్లనివ్వమని డ్రైవర్కు చెప్పాను. అప్పటికే బస్సుకు ఎర్తింగ్ ఉండటం, 11కేవీ విద్యుత్ లైన్ కావటంతో పూర్తిగా దగ్ధమై ఉండేది. ఈ ప్రమాదం గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది. – శ్రీశైలం, ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి -
కరోనాతో కొడుకు మృతి.. ఆగిన తల్లి గుండె!
కల్వకుర్తి టౌన్: కరోనాతో కొడుకు మృతి చెందిన కొన్ని గంటల్లోనే తల్లి హఠాన్మరణం చెందింది. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవల్లితండాకు చెందిన జైపాల్నాయక్(55) ప్రస్తుతం జూపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. గత నెల 28న జైపాల్నాయక్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో శనివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి మునావత్ నాన్కు(80) కొంతసేపటికే గుండె పోటుతో చనిపోయింది. కాగా ఆమె దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండేదని తండావాసులు తెలిపారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మృతదేహంతో మూడ్రోజులు సహవాసం
నాగర్కర్నూల్ : అనారోగ్యంతో చనిపోయిన మహిళ మృతదేహంతో ఓ వ్యక్తి మూడు రోజుల పాటు సహవాసం చేశాడు. అయితే.. మృతదేహాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో చోటు చేసుకుంది. తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కూతురు కళమ్మను ఇరవై ఏళ్ల క్రితం అవుసలికుంటకు చెందిన శేఖర్తో వివాహం జరిపించారు. పది నెలలకే భర్త చనిపోవడంతో కళమ్మకు నాగనూలుకు చెందిన బాలపీరుతో రెండో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. కొన్నేళ్ల తర్వాత రెండో భర్త కూడా చనిపోవడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే.. తండ్రి కృష్ణయ్య ఇటీవల కూతురిని మందలించడంతో అవుసలికుంటలో ఒంటరిగా ఉంటున్న మొదటి భర్త తమ్ముడు లింగస్వామి ఇంటికి వచ్చింది. అప్పటికే అనారోగ్యం పాలైన ఆమె గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో ఎక్కడ తనపైకి వస్తుందనే భయంతో లింగస్వామి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. శనివారం గుడిసె ముందు గుంతను తీసి శవాన్ని పూడ్చి పెట్టేందుకు గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తా
-
తల్లి గొంతు కోసి తల తీసుకొని పరారీ
సాక్షి, నాగర్కర్నూల్: మద్యానికి బానిసైన కొడుకు కన్నతల్లిని అతిదారుణంగా చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొల్లాపూర్ మండలం సింగోటంలో సంగణమోని చంద్రమ్మ (65) తన కొడుకు రాముడు (40) ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిసైన కొడుకు తల్లితో రోజూ డబ్బుల కోసం గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. (గుంటూరు జిల్లాలో దారుణ హత్య) అనంతరం తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో విచక్షణ రహితంగా ఆమె గొంతు కోసి తలను తీసుకొని పరారయ్యాడు. కాగా.. నిందితుడికి ఇద్దరు భార్యలు ఉండగా, పది సంవత్సరాల కిందనే వారు భర్తని వదిలేశారని బంధువులు తెలిపారు. ప్రతి రోజు అర్థరాత్రి వరకు గొడవ పెట్టుకొని తల్లితో డబ్బులు తీసుకునేవాడని తెలిపారు. నిందితుడు గ్రామస్తులతో ఎప్పుడూ గొడవ పడుతూ.. అర్ధరాత్రి సమయంలో తలుపులు కొడుతూ భయబ్రాంతులకు గురిచేసే వాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నపరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
ప్రమాదమా.. మాక్ డ్రిల్లా?
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అధికారులు, ఉద్యోగులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. గత నెల 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంతో రూ.వందల కోట్లలో నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మరవక ముందే బుధవారం షార్ట్సర్క్యూట్తో మరోసారి మంటలు చెలరేగడం ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. అయితే అది మాక్డ్రిల్గా జెన్కో ఉన్నతాధికారులు ప్రకటించడంతో.. అది ప్రమాదమా.. మాక్ డ్రిల్లా అనే చర్చ మొదలైంది. ఉద్యోగులు, సిబ్బంది పరుగులు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనుల్లో భాగంగా బుధవారం మొదటి యూనిట్లో నీటిని తోడిపోసి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మోటారు, ఇతర సామగ్రిని విద్యుత్ కేంద్రంలోకి తీసుకొస్తున్న డీసీఎం వాహనం కేంద్రంలో తాత్కాలికంగా లైటింగ్ కోసం దోమలపెంట సబ్స్టేషన్ నుంచి కనెక్షన్ తీసుకున్న విద్యుత్ కేబుళ్లపై వెళ్లింది. అధిక లోడ్తో కూడిన డీసీఎం వాహనం విద్యుత్ కేబుళ్లపై వెళ్లడంతో వైర్లలో స్పార్క్ వచ్చి షార్ట్సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇటీవల జరిగిన ప్రమాదం నుంచి తేరుకోని ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. పొగ కమ్ముకోవడంతో అక్కడే ఉన్న అధికారులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేశారు. విద్యుత్ సరఫరా కూడా వెంటనే నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్సర్క్యూట్తో నీటిని తోడి పోస్తున్న మూడు మోటార్లకు సంబంధించిన పైపులు కూడా కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదంలో విద్యుత్ వైర్ కాలిపోవడంతో వెంటనే మరో కేబుల్ వేసుకొని అక్కడి విద్యుత్ లైట్లను పునరుద్ధరించుకొని పనులు చేపట్టినట్లు తెలిసింది. ఘటన బయటికి తెలియడంతో మళ్లీ ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరిగింది. అప్రమత్తతను గుర్తించేందుకే.. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో బుధవారం జరిగిన ఘటన ప్రమాదంగా భావిస్తున్న తరుణంలో జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, సీఈ సురేష్ రహస్య మాక్డ్రిల్గా ప్రకటించారు. పనులు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల అప్రమత్తతను గుర్తించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పునరుద్ధరణ పనులు చేపడుతున్న క్రమంలో అక్కడ కేవలం జెన్కో ఉద్యోగులే కాకుండా పారిశుద్ధ్య పనులు చేసేవారు, ఇతర కార్మికులు కూడా ఉన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తికాక ముందే మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారు. ఒకవేళ మాక్డ్రిల్ నిర్వహిస్తే బయటి సబ్స్టేషన్ నుంచి లైటింగ్ కోసం కనెక్షన్ తీసుకున్నప్పుడు స్థానిక విద్యుత్ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా, అప్రమత్తం చేయకుండా, అసలు విద్యుదుత్పత్తి ప్రారంభం కానప్పుడు మాక్డ్రిల్ ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాన్ని కప్పిపుచ్చుకునేందుకే మాక్ డ్రిల్గా అధికారులు ప్రకటించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అది అనుకోకుండా జరిగిన ఘటనగానే చెబుతున్నారు. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్కంఠ!
సమయం: బుధవారం సాయంత్రం 5:30 గంటలు ప్రదేశం: నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం (గత నెల 20న విద్యుత్ ప్రమాదం జరిగిన ప్రాంతం). సందర్భం: విద్యుత్ కేంద్రం బయట వర్షం. కేంద్రం ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. భయంతో అధికారులు, ఉద్యోగుల పరుగులు. సాక్షి, నాగర్కర్నూల్: అసలేం జరుగుతుందో తెలి యదు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అప్పటికే బయట కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దయ్యారు. వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక వాహనం మంటల్ని ఆర్పింది. సుమారు గంటసేపు తీవ్ర ఉత్కంఠతో ఉన్న ఉద్యోగులు, అధికారులకు అదంతా మాక్డ్రిల్ అంటూ ఉన్నతాధికారుల నుంచి అందిన వార్త ప్రాణం పోసినట్టుయింది. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్లో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. వంద మందికిపైగా ఉద్యోగులు, అధికారులు, కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో విద్యుత్ కేంద్రం ప్రవేశద్వారం నుంచి నీళ్ల మోటార్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. నేల మీద ఉన్న విద్యుత్ తీగలపై నుంచి వెళ్లింది. దీంతో షార్ట్సర్క్యూట్ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. ఆ సమయంలో పునరుద్ధరణ పనులు చేస్తున్న సిబ్బంది అంతా అయోమయానికి గురై బయటికి పరుగుతీశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టెన్షన్)తో మంటలను ఆర్పారు. విద్యుత్ కేంద్రంలో రెండోసారి జరిగిన ప్రమాదం వార్త వెంటనే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఉలికిపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అనేక చర్చలు మొదలయ్యాయి. ఇలా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు (గంట పాటు) ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఇది మాక్డ్రిల్ అని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మాక్డ్రిల్పై భిన్నాభిప్రాయాలు అధికారులు నిర్వహించిన ఈ మాక్డ్రిల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అందులో పనిచేస్తున్న తమకు ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అందులో పనిచేసే ఓ ఉద్యోగి తెలిపారు. 15 రోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోని తమను మాక్డ్రిల్ పేరిట భయపెట్టే యత్నం చేయడం ఆవేదన కలిగించిందన్నారు. మరోవైపు బయట వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ కేంద్రంలో మాక్డ్రిల్ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 15రోజుల నుంచి ఆ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో దోమలపెంట సబ్స్టేషన్ నుంచి విద్యుత్ కేంద్రానికి కేబుళ్లు వేసిన అధికారులు వాటి ద్వారా లైట్లు, మోటార్లు నడిపిస్తున్నారు. మాక్డ్రిల్తో ఆ కేబుళ్లు కాలిపోయాయి. తర్వాత రంగంలో దిగిన అధికారులు కేబుళ్లు మార్చి విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు. (ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. ) ప్రమాదం కాదు.. మాక్డ్రిల్ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సిబ్బంది అప్రమత్తతను పరిశీలించేందుకే రహస్యంగా మాక్డ్రిల్ నిర్వహించాం. ఈ కేంద్రాన్ని పరిశీలించేందుకు విశ్రాంత అధికారి అజయ్తో కలిసి వెళ్లా. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. – ప్రభాకర్రావు, సీఎండీ, టీఎస్ ట్రాన్ ్సకో, జెన్ కో -
శ్రీశైలం పవర్ ప్లాంట్లో మళ్లీ పేలుడు?
సాక్షి, శ్రీశైలం: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు కలకలం రేపింది. బుధవారం సాయంత్రం భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో భయంతో పవర్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు లో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు ప్రభాకరరావు స్పష్టం చేశారు. గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించమని సీఎండీ ప్రభాకరరావు ఆదేశించారు. సిఎండి అదేశాలతోనే మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. -
15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగింది కానీ, ఆస్తి నష్టం అంతగా జరగలేదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు స్పష్టం చేశారు. ప్రమాదంలో వేల కోట్ల రూపా యల నష్టం జరిగిందనే ప్రచారంలో వాస్త వం లేదని చెప్పారు. బుధవారం శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇండోర్ గ్యాస్ సబ్స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూంలను ఆయన పరిశీలించారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నాయకత్వంలోని బృందంతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. జపాన్ నుంచి నిపుణుల బృందం త్వరలో ప్లాంట్ను సందర్శిస్తుందని, 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగో యూనిట్ బాగా దెబ్బతిన్నదని, ఒకటి, రెండు, ఐదు యూనిట్లలో కొంత నష్టం జరిగిందని, ఆరో యూనిట్లో ప్యానల్ దెబ్బతిందని వివరించారు. త్వరలో వీటి పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగల భద్రతే ముఖ్యం విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రభాకర్రావు అన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహించే 200 మంది సిబ్బందితో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలన్నారు. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నాలుగంత స్తుల్లో నిండిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల పేలిన ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు, ఇతర పరికరాలను సీఎండీ పరిశీలించారు. త్వరలో 2 విద్యుత్ యూనిట్లలో విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆరో యూనిట్ సీజ్ శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రం పనులను సీఎండీ ప్రభాకర్రావు క్షుణ్నంగా పరిశీలించారు. దోమలపెంట నుంచి ట్రాన్స్కో సబ్స్టేషన్ ద్వారా కేంద్రంలో లైట్లను వేయించారు. నాలుగు ఫ్లోర్లలో నీళ్లు నిండటంతో మోటార్లు ఏర్పాటు చేసి ఎత్తిపోస్తున్నారు. సీఐడీ విచారణలో భాగంగా ప్రమాదం సంభవించిన ఆరో యూనిట్ను సీజ్ చేశారు. విద్యుత్ ఎక్కడి నుంచి ప్రసారమైందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. పుట్టెడు దుఃఖంలోనూ.. ఇదిలాఉండగా తన సోదరుడు శ్రీనివాసరావు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని సీఎండీ ప్రభాకర్రావు బుధవారం శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరా మర్శించి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, అజయ్, సీఈలు ప్రభాకర్రావు, సురేష్, టెక్ని కల్ ఎస్ఈ హనుమాన్ పాల్గొన్నారు. -
పవర్ హౌస్లోకి నీళ్లు.. విచారణకు ఆటంకం
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో సోమవారం విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో చీకటి, వేడి ఎక్కువగా ఉండడంతో పూర్తి అండర్ గ్రౌండ్కు దర్యాప్తు బృందం వెళ్లలేకపోయింది. కొన్ని చోట్ల కాలిన పదార్థాల నుండి సీఐడీ బృందం షాంపిల్స్ సేకరించారు. మానవ తప్పిదమా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఇప్పటికే అధికారుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని సాక్ష్యాల కోసం సీఐడీ అధికారులు నేడు విచారణ చేట్టారు. అదే విధంగా పవర్ హౌస్లోకి భారీగా నీరు చేరడంతో చేస్తున్న మరమ్మతుల వల్ల దర్యాప్తుకు కొంత ఆటంకం ఏర్పడింది. పవర్ హౌస్లోకి విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది బయటి నుంచి లోపలికి విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. ఊట నీరును మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. (శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీ విచారణ
-
శ్రీశైలం ప్రమాదం: వివరాలు సేకరిస్తున్న సీఐడీ
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్కు గల కారణాలను సీఐడీ దర్యాప్తు బృందం విశ్లేషించనున్నది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందని టెక్నికల్ బృందాలు వీడియో తీశారు. (కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) పవర్ సప్లై ఎలా ఇచ్చారనే వివరాలు సీఐడీ రాబడుతోంది. పలువురు అధికారుల నుంచి సీఐడీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మొదట ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న స్థలంలోని పదార్థాలను అధికారులు సేకరించారు. అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా? లేదా? అన్న దానిపై సీఐడీ టెక్నికల్ బృందం విశ్లేషించనుంది. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. మానవ తప్పిదం ఉందా లేదా అనేది సీఐడీ అధికారులు తేల్చనున్నారు. (శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ) చదవండి: (‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
-
కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత
-
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం పవర్హౌజ్ ప్రమాదంపై సీఐడీ చీఫ్ గోవింద్సింగ్ విచారణ కొనసాగుతోంది. శ్రీశైలం పవర్హౌజ్ ప్రమాదంపై విచారణకు నాలుగు బృందాలు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ సైన్స్, సీఐడీ, లోకల్ పోలీసుల టీమ్లు ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాద ఘటనపై ఈగలపెంట పోలీస్ స్టేషన్లో 174 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 8 మంది గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. (చదవండి: కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) (చదవండి: మృత్యుసొరంగం) -
కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి, నాగర్కర్నూల్: తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. (చదవండి: పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదాలు!) పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, శ్రీశైలం పవర్ప్లాంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి మరో 8 మందికి గాయాలు కాగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాషియా ప్రకటించింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. (చదవండి: మృత్యుసొరంగం) ఆ స్వేచ్ఛ కూడా లేదా: ఎంపీ రేవంత్ ఇదిలా ఉంటే శ్రీశైలం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వంపై ఎంపీ రేవంత్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్కు అంత భయమెందుకు? దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?’ అని ఆయన సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
ఇదే తొలి ప్రమాదం
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 20 ఏళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నిర్మాణం పనులు 1988– 89లో ప్రారంభయ్యాయి. కేంద్రంలో తొలిసారిగా 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి ఒక్కో యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కాగా, మొత్తం 6 యూనిట్లను మూడేళ్లలో పూర్తి చేశారు. ఒక్క యూనిట్కు 150 మెగావాట్ల చొప్పు న విద్యుత్ కేంద్రం మొత్తం 900 మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. గత నెల 17వ తేదీ నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 24 గంటల వ్యవధిలో 21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రానికి ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,400 మిలియన్ యూని ట్లు ఇవ్వగా.. కేవలం 31 రోజుల్లోనే 600 మిలి యన్ యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు సమాచారం. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు యూనిట్లకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద నష్టం రూ.వేల కోట్లలో ఉండొచ్చని సమాచారం. ఘటనపై ప్రభుత్వం సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడతాయనే విషయాన్ని అధికారులు వెల్లడించడంలేదు. నిపుణుల బృందం పరిశీలించిన అనంతరం ప్రమాదానికి గల కారణాలు, నష్టంపై ఓ అంచనాకు రావచ్చని చెబుతున్నారు. (మృత్యుసొరంగం) విద్యుత్ సరఫరాలో అంతరాయం.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 870 అడుగులకు తగ్గకుండా ఉన్నంత వరకే కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దాదాపు వచ్చే ఏడాది ఫిబ్ర వరి వరకు నీరు ఉండే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రమాదం జరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంటే రోజుకు 21 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రమాదం కారణంగా 1,400 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యా న్ని చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్పత్తి కోల్పోవడం వల్ల పవర్గ్రిడ్కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మరో మార్గంలో గ్రిడ్ సమకూర్చుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రా నికి జల విద్యుత్ కేంద్రం ద్వారా అందించే 900 మెగావాట్ల విద్యుత్ కోల్పోయింది. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం న్యూఢిల్లీ: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మరణించడంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఈ మరణాలు తమను ఎంతగానో బాధించాయని వేర్వేరుగా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించింది. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాల గురించే ఆలోచిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ప్రధాని స్పందిస్తూ ‘అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరం. నా మనసంతా మృతుల కుటుంబాల చుట్టూనే తిరుగుతోంది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’అని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆర్థిక సాయంతో పాటు ఇతర సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు బాధిత కుటుంబాలకు శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని ప్రకటించారు. -
మృత్యుసొరంగం
సాక్షి, నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచుతున్న భారీ జలవిద్యుత్ కేంద్రం కొందరు ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిలిచ్చింది. జలవిద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్ ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులుకాగా, మిగిలిన ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వారు. మరో ఎనిమిది మంది ఉద్యోగులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు... గురువారం రాత్రి 10:30 నుంచి 11:00 గంటల సమయంలో 900 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంగల శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉన్న 4వ యూనిట్లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో తొలుత మంటలు రేగాయి. ఆ వెంటనే ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న డీఈ పవన్, ఇతర ఉద్యోగులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడమే కాకుండా కేవలం 3 నిమిషాల్లోనే పవర్హౌస్లో పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన ఆరుగురు ఉద్యోగులు వెంటనే కారులో బయటకు వచ్చారు. ఎలక్ట్రికల్ డీఈ అంకినీడు, మరో ఉద్యోగి అతికష్టం మీద డీజిల్ సెట్ వెళ్లే సొరంగ మార్గంలో పరుగులు పెడుతూ బయటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రాన్స్ఫార్మర్ పేలుడుకు కారణం అదేనా? శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. కృష్ణా నదిలో హెడ్ (నీటి ఇన్టేక్, నీటి డిశ్చార్జ్ పాయింట్ మధ్య హెచ్చుతగ్గులు) ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే 150 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లు అధికంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే కారణంతో ఒక్కో యూనిట్ 180 మెగావాట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. అయితే పేలుడు సంభవించిన నాలుగో యూనిట్కు చెందిన ఆక్సిలరీ వోల్జేజీ ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు మాత్రం ఒక్కసారిగా 200 మెగావాట్ల ఉత్పత్తికి వెళ్లిపోయింది. ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ఓ అధికారి చెప్పారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నాలుగో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆగిపోలేదని సమాచారం. ఈ క్రమంలో పేలుళ్లు, మంటలు సంభవించి విద్యుత్ కేంద్రం మొత్తం చీకటిగా మారింది. అడుగు దూరంలో ఉన్న మనిషిని సైతం చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగిందని బయటకు వచ్చిన ఇంజనీర్లు, ఇతర అధికారులు పేర్కొన్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి మంత్రి జగదీశ్రెడ్డి, సీఎండీ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, ఎస్పీఈ సిబ్బంది, అధికారులు, కార్మికులు, నాన్ ఇంజనీర్లు ఆక్సిజన్ ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు. కారు లైట్లు వేసుకొని వెళ్లినా దారి కనిపించలేదు. విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ కలెక్టర్ ఎల్. శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ విద్యుత్ కేంద్రం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 2:15 గంటలకు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, సీఎండీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి పొగ కమ్ముకోవడంతో వెనుదిరిగారు. అనంతరం జగదీశ్రెడ్డి ప్రమాద ఘటనపై జెన్కో అధికారులతో సమీక్షించారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను అతికష్టం మీద లోపలికి పంపించారు. పవర్హౌస్లోని గ్యాస్ ఇన్సులేటెడ్ సిస్టమ్ దిగువ ప్రాంతంలో ఆయిల్ లీక్ కావడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. అయినా అతికష్టం మీద ఫైర్ సిబ్బంది ప్రయత్నం కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎండీ ప్రభాకర్రావు, జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పొగ ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన ప్లాంటులోకి ప్రవేశించి గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతికారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు దురదుష్టవశాత్తు మరణించడంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మృతులు వీరే.. 1. డీఈ శ్రీనివాస్గౌడ్ (హైదరాబాద్) 2. ఏఈ వెంకటేశ్వర్రావు (పాల్వంచ) 3. ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్) 4. ఏఈ ఉజ్మా ఫాతిమా (హైదరాబాద్) 5. ఏఈ సుందర్ (సూర్యాపేట) 6. ప్లాంట్ అటెండర్ రాంబాబు (ఖమ్మం జిల్లా) 7. జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ (పాల్వంచ) 8. వినేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) 9. మహేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) వీరందరూ ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం ఫొటోలు
-
నువ్వు, పిల్లలు జాగ్రత్త.. సుందర్ చివరి మాటలు
సాక్షి, నాగర్ కర్నూల్: ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు ఇవి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో సుందర్ నాయక్ ఒకరు. 35 ఏళ్ల సుందర్ నాయక్ నిన్ననే తిరిగి విధుల్లో చేరాడు. కరోనా బారిన పడి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత తేరుకున్న సుందర్ డ్యూటీకి గురువారం హాజరయ్యాడు. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) కాగా, కరోనాను జయించిన సుందర్.. ఇలా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మృత్యుంజయుడనుకున్న సుందర్ను విధి మరోలా వక్రించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తొలుత లభించిన మృతదేహం కూడా సుందర్దే. ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇక ప్రాణాలతో బయటపడలేమని ఊహించిన సుందర్.. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడలేకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని భార్యకు ఫోన్లో ప్రమాద తీవ్రతను వివరించాడు. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం) -
కరోనాపై గెలిచి, అనూహ్యంగా మృత్యువాత
నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఒకరు మృతి చెందారు. ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మృతుడు సుందర్ నాయక్ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేశారు. (35 మందితో పవర్ హౌస్లోకి రెస్క్యూ టీమ్) -
శ్రీశైలం పవర్ హౌస్లోకి రెస్క్యూ టీమ్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పతి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్కో ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అధునాతన పరికరాలతో పవర్ హౌస్లోకి వెళ్లిన 35మంది సీఐఎస్ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అదనపు డీజీ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ డీజీపీ విజ్ఞప్తితో సీఐఎస్ఎఫ్ ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇవాళ మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ (చదవండి: గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు) ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలం వద్ద ఏపీ ఎమ్మెల్యేలు పలువురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ప్రమాదం జరిగిన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రం వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. లోపల చిక్కుకుపోయిన 9 మంది క్షేమంగా తిరిగిరావాలని ఆకాక్షించారు. -
ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ అయితే, ప్రమాద స్థలంలో పొగ తగ్గకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ టీం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. ఆక్సిజన్ అందక వెనక్కి వచ్చారు.. సొరంగంలో దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. సహాయక చర్యలను మంత్రి జగదీశ్రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న సిబ్బందిని కాపాడేందుకు అధికారులు సింగరేణి సహాయం కోరారు. ఇక ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారంతా బాగానే ఉన్నారని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. బాధితులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థకు గురికావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించారు. (గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..) ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి: తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ అధికారులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు.