Nathan Lyon
-
SL vs Aus: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్(Nathan Lyon) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియాలో టెస్టు ఫార్మాట్లో 150కి పైగా వికెట్లు తీసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ప్రస్తుతం శ్రీలంక(Sri Lanka vs Australia)లో పర్యటిస్తోంది.తొలిరోజే తొమ్మిది వికెట్లుఇందులో భాగంగా తొలుత గాలె(Galle) వేదికగా టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్లో లంకను ఆసీస్ మట్టికరిపించింది. ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అనంతరం ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో దినేశ్ చండిమాల్ (163 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (107 బంతుల్లో 59 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (83 బంతుల్లో 36; 3 ఫోర్లు) కాసేపు పోరాడినా... భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇతరులలో పతుమ్ నిశాంక (11), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (0) దారుణంగా విఫలమయ్యారు. చండిమాల్, కుశాల్ మెండిస్ కాస్త పోరాడటంతో లంక జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది.నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్రఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్తో కలిసి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా ఖండంలో టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు.అంతకు ముందు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆసియాలో 127 వికెట్లు తీయగా.. న్యూజిలాండ్ మాజీ స్టార్ డేనియల్ వెటోరి 98, ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 92 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాన్-ఆసియన్ బౌలర్లు👉నాథన్ లియోన్- 30 టెస్టుల్లో 150👉షేన్ వార్న్- 25 టెస్టుల్లో 127👉డేనియల్ వెటోరి- 21 టెస్టుల్లో 98👉జేమ్స్ ఆండర్సన్- 32 టెస్టుల్లో 92.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు స్టార్క్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ కూహ్నెమన్ రెండు, ట్రవిస్ హెడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 229/9 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 257 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
శ్రీలంకతో రెండో టెస్ట్.. ఆసీస్ బౌలర్ల విజృంభణ.. హెడ్ వెరైటీ సెలబ్రేషన్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా (Australia) పైచేయి సాధించింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బేశారు. మాథ్యూ కుహ్నేమన్ 2, ట్రవిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (74), కుసాల్ మెండిస్ (59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పథుమ్ నిస్సంక 11, దిముత్ కరుణరత్నే 36, ఏంజెలో మాథ్యూస్ 1, కమిందు మెండిస్ 13, ధనంజయ డిసిల్వ 0, రమేశ్ మెండిస్ 28, ప్రభాత్ జయసూర్య 0, నిషాన్ పెయిరిస్ డకౌట్ అయ్యారు. కుసాల్ మెండిస్కు జతగా లహీరు కుమార (0) క్రీజ్లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్ అయ్యారు.pic.twitter.com/IRsGEkTBll— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 6, 2025హెడ్ వినూత్న సంబురాలుఈ మ్యాచ్లో కమిందు మెండిస్ను ఔట్ చేసిన అనంతరం ట్రవిస్ హెడ్ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. చేయి నొప్పి పెడితే కాని, కాలితే కాని ఎలా విదిలించుకుంటామో అలా చేశాడు. హెడ్ ఇలాంటి వెరైటీ సంబురాలు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇంచుమించు ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు.కాగా, రెండు టెస్ట్లు, రెండు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరg ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
శ్రీలంకను మట్టికరిపించిన ఆస్ట్రేలియా.. లంకేయుల రికార్డు ఓటమి
శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, ఈ ఎడిషన్లో ఆఖరిగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ టూర్లో భాగంగా రెండు వన్డేలు కూడా ఆడనుంది. ఈ క్రమంలో తొలుత గాలె వేదికగా బుధవారం లంక- ఆసీస్ జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ(232)తో చెలరేగగా.. ట్రవిస్ హెడ్ మెరుపు అర్ధ శతకం(40 బంతుల్లో 57) బాదాడు. స్మిత్, ఇంగ్లిస్ శతకాలుమిగతా వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం(141)తో దుమ్ములేపాడు. ఇక టెస్టు అరంగేట్రంలోనే జోస్ ఇంగ్లిష్ సెంచరీ(102)తో మెరిసి తన విలువను చాటుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(46 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. టెయిలెండర్లలో బ్యూ వెబ్స్టర్(23), మిచెల్ స్టార్క్(19 నాటౌట్) తమ శక్తిమేర పరుగులు రాబట్టారు.ఈ క్రమంలో 154 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఉన్న వేళ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో స్పిన్నర్లు ప్రబాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే శ్రీలంక తడబడింది.కంగారూ స్పిన్నర్ల ధాటికి కుదేలుఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఏడేసి పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండిమాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే, ఆసీస్ స్పిన్నర్ అద్భుత బంతితో చండిమాల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.మిగతా వాళ్లలో ఏంజెలో మాథ్యూస్(15), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(22), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో 165 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియాన్ మూడు వికెట్లు కూల్చాడు. పేసర్ మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కాయి.ఫాలో ఆన్ గండం.. తప్పని ఓటమిఅయితే, తమ తొలి ఇన్నింగ్స్లో లంక కనీసం సగం కూడా స్కోరు చేయకపోవడంతో.. ఆస్ట్రేలియా ధనంజయ బృందాన్ని ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో వెంటనే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(6), దిముత్ కరుణరత్నె(0) మరోసారి విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు కాసేపు నిలబడ్డారు. చండిమాల్ 31, ఏంజెలో మాథ్యూస్ 41, కమిందు మెండిస్ 32, ధనంజయ డి సిల్వ 39, కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశారు. ఇక ఆఖర్లో జెఫ్రీ వాండర్సే ఒక్కడే అర్ధ శతకం(53) చేయగలిగాడు.లంక క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమిఅయితే, ఆస్ట్రేలియా స్కోరుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన శ్రీలంక.. ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
IND VS AUS 4th Test: అశ్విన్ను వెనక్కు నెట్టిన లియోన్
టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ (Nathan Lyon) భారత తాజా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను (Ravichandran Ashwin) వెనక్కు నెట్టాడు. మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ ఘనత సాధించాడు. సిరాజ్ వికెట్తో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లియోన్ ఏడో స్థానానికి ఎగబాకడు. అశ్విన్ 106 టెస్ట్ల్లో 537 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 133 టెస్ట్ల్లో 538 వికెట్లు తీశాడు.టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్గ్రాత్ (563), నాథన్ లియోన్ (538), రవి అశ్విన్ (537), కోట్నీ వాల్ష్ (519), డేల్ స్టెయిన్ (439) టాప్-10లో ఉన్నారు.మెల్బోర్న్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు చివరి సెషన్ వరకు సాగిన మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకునే అవకాశాలను దారుణంగా దెబ్బ తీసింది. ఏడో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరలేదు. మరోవైపు సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.మెల్బోర్న్ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.105 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. లబూషేన్ (70) టాప్ స్కోరర్గా నిలువగా.. పాట్ కమిన్స్ (41), నాథన్ లియోన్ (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశారు.340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
మెల్బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు!
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. హోరా హోరీగా సాగుతున్న ఈ బాక్సింగ్ డే టెస్టు ఫలితం సోమవారం తేలిపోనుంది. నాలుగో రోజు ఆటలో తొలి రెండు సెషన్స్లో భారత్ పై చేయి సాధించినప్పటికి.. ఆఖరి సెషన్లో మాత్రం కంగారులు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు.ముఖ్యంగా టెయిలాండర్లు నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ పదో వికెట్కు 55 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మొత్తంగా ఈ వెటరన్ జోడీ 110 బంతులు ఎదుర్కొని తమ జట్టుకు అడ్డుగోడగా నిలిచారు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజ్లో నాథన్ లైయన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆసీస్ భారత్ ముందు 333 నుంచి 350 పరుగుల మధ్య టార్గెట్ను నిర్దేశించే అవకాశముంది. ఈ క్రమంలో భారత్ ఈ టార్గెట్ను చేధిస్తే 96 ఏళ్ల ఇంగ్లండ్ ఆల్టైమ్ బద్దలు కానుంది.మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టెస్టుల్లో అత్యధిక రన్ ఛేజింగ్ 322 పరుగులగా ఉంది. 1928లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 322 లక్ష్యాన్ని చేధించింది. ఆ తర్వాత ఈ వేదికగా 300పైగా టార్గెట్ను ఏ జట్టు కూడా చేధించలేకపోయింది. ఇప్పుడు భారత్కు చరిత్రను తిరగరాసే అవకాశం లభించింది.మెల్బోర్న్లో అత్యధిక రన్ ఛేజ్లు ఇవే..322- ఇంగ్లండ్- ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1928297-ఇంగ్లండ్- ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1895295-దక్షిణాఫ్రికా-ప్రత్యర్ధి(ఆస్ట్రేలియా)-1953286-ఆస్ట్రేలియా-ప్రత్యర్ధి(ఇంగ్లండ్)-1929282-ఇంగ్లండ్-ప్రత్యర్ధి(ఇంగ్లండ్)-1908ఎంసీజీలో భారత్ రికార్డు ఎలా ఉందంటే?కాగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే లక్ష్యాన్ని చేధించిగల్గింది. 2020 డిసెంబర్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. అంతకమించి లక్ష్యాన్ని భారత్ ఛేజ్ చేయలేకపోయింది. అయితే 2018/19 ఆసీస్ పర్యటనలో భాగంగా ఇదే మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ అద్బుతవిజయం సాధించింది. 137 పరుగుల తేడాతో ఆసీస్ను టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు పడగొట్టి కంగారులను దెబ్బ తీశాడు. కాగా ఆస్ట్రేలియాలో భారత్ అత్యధిక టెస్టు ఛేజింగ్ 329గా ఉంది. 2021లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఈ ఫీట్ సాధించింది.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ అల్టైమ్ రికార్డు బ్రేక్ -
IND VS AUS 4th Test: భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన లయోన్, బోలాండ్
మెల్బోర్న్ టెస్ట్ నాలుగో రోజు ఆసీస్ చివరి వరుస ఆటగాళ్లు నాథన్ లయోన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ 110 బంతులు ఎదుర్కొని చివరి వికెట్కు అమూల్యమైన 55 పరుగులు జోడించారు. లయోన్, బోలాండ్ను ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. మరికొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా బుమ్రా లయోన్ను ఔట్ చేసినప్పటికీ అది నో బాల్ అయ్యింది. లయోన్-బోలాండ్ భాగస్వామ్యం పుణ్యమా అని ఆసీస్ ఆధిక్యం 333 పరుగులకు చేరింది.ఐదో రోజు ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు అంత ఈజీ కాదు. మెల్బోర్న్ మైదానంలో ఇప్పటివరకు ఛేదించిన అతి భారీ లక్ష్యం 332. ఈ సంఖ్యను ఆసీస్ నాలుగో రోజే దాటేసింది. ఐదో రోజు లయోన్, బోలాండ్ తమ అద్బుత బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగిస్తే లక్ష్యం మరింత పెద్దది అవుతుంది. లయోన్, బోలాండ్ చివరి వికెట్కు నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆఖరి రోజు ఏమైనా జరిగేందుకు ఆస్కారముంది. ఆస్ట్రేలియా, భారత్లలో ఏ జట్టైనా మ్యాచ్ గెలవచ్చు. మ్యాచ్ డ్రా లేదా టై కూడా కావచ్చు.తొలుత దెబ్బేసిన లబూషేన్, కమిన్స్ఈ మ్యాచ్లో భారత్ను తొలుత లబూషేన్ (70), కమిన్స్ (41) దెబ్బేశారు. వీరిద్దరు ఏడో వికెట్కు 57 పరుగులు జోడించారు. బుమ్రా, సిరాజ్ రెచ్చిపోవడంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. లబూషేన్, కమిన్స్ పుణ్యమా అని అనూహ్యంగా పుంజుకుంది. వీరిద్దరి భాగస్వామ్యంతోనే ఆసీస్ గెలుపు రేసులోకి వచ్చింది. అంతవరకు ఈ మ్యాచ్లో భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు.91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. లబూషేన్-కమిన్స్, లయోన్-బోలాండ్ జోడీలు అతి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి రోజు 96 ఓవర్ల పాటు ఆట జరిగే అవకాశం ఉంది. -
టెస్ట్ల్లో అత్యధిక వికెట్ల వీరులు.. ఏడో స్థానానికి ఎగబాకిన అశ్విన్
టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 24) మొదలైన రెండో టెస్ట్లో మూడు వికెట్లు తీసిన అశ్విన్ తన వికెట్ల సంఖ్యను 531కి పెంచుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ఆసీస్ స్పిన్ లెజెండ్ నాథన్ లయోన్ను (530) అధిగమించాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్గ్రాత్ (563) అశ్విన్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అశ్విన్.. టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డెవాన్ కాన్వే (76) వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర (43), డారిల్ మిచెల్ (12) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో న్యూజిలాండ్ తొలి టెస్ట్లో నెగ్గిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.న్యూజిలాండ్తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసిఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్ను అవుట్ చేశాడు. లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించిఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్కు రెండు వికెట్లు దక్కాయి.చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు -
పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటినుంచే సన్నాహాకాలు ప్రారంభించింది. దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2024-25 సీజన్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్, హాజిల్వుడ్ మినహా మిగితా ఆసీస్ అగ్రశ్రేణి ఆటగాళ్లంతా పాల్గోంటున్నారు.అయితే ఈ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ నాథన్ లియాన్ గల్లీ క్రికెట్ మాదరి బంతిని పొదల్లో వెతుకుతూ నవ్వులు పూయించాడు. ఈ మ్యాచ్లో న్యూ సౌత్ వేల్స్కు లియాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అసలేం జరిగిందంటే?సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 56 ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్లో ఆఖరి బంతికి క్యారీ భారీ సిక్సర్ బాదాడు. దెబ్బకు బంతి మైదానం వెలుపుల ఉన్న పొదల్లో పడింది. ఈ క్రమంలో న్యూ సౌత్ వేల్స్ ఫీల్డర్లు బంతిని ఆ పొదల్లో వెతకడం ప్రారంభించారు. కానీ బంతి కన్పించలేదు. దీంతో బంతిని వెతికేందుకు లియాన్ స్వయంగా రంగంలోకి దిగాడు. అయితే అతడికి ఓ బంతి దొరికింది. కానీ లియాన్కు దొరికింది రెడ్ బాల్ కాదు వైట్ బాల్. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడో కన్పించకుండా పోయిన బంతి ఇప్పుడు నాథన్కు దొరింది. కానీ తాజాగా పోయిన బంతి మాత్రం వారికి దొరకలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా ఎటువంటి సంఘటనలు ఎక్కువగా గల్లీ క్రికెట్లో జరుగుతూ ఉంటాయి. View this post on Instagram A post shared by cricket.com.au (@cricketcomau) -
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్.. అశ్విన్ ముందు ప్రపంచ రికార్డు
త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో అశ్విన్ 14 వికెట్లు పడగొడితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు. లియోన్ డబ్ల్యూటీసీలో 43 మ్యాచ్లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్.. 35 మ్యాచ్ల్లో 174 వికెట్లు తీసి మూడో హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో (42 మ్యాచ్ల్లో 175 వికెట్లు) ఉన్నాడు. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో అశ్విన్ 26 వికెట్లు సాధిస్తే.. డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మార్కును తాకిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. బంగ్లాతో టెస్ట్ సిరీస్లో అశ్విన్ 14 వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు సాధించిన టెస్ట్ బౌలర్ల జాబితాలో లియోన్తో సమానంగా ఏడో స్థానంలో నిలుస్తాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) టాప్-6లో ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్ (516) ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.కాగా, బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ చెన్నై వేదికగా.. రెండో మ్యాచ్ కాన్పూర్ వేదికగా (సెప్టెంబర్ 27 నుంచి) జరుగనున్నాయి. టెస్ట్ సిరీస్ అనంతరం భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్ -
Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కానుంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్లు ఆడిన అనంతరం.. న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ రెండు సిరీస్లు స్వదేశంలోనే జరుగనుండటం రోహిత్ సేనకు సానుకూలాంశం. అయితే, ఆ తర్వాతే భారత జట్టుకు సిసలైన సవాల్ ఎదురుకానుంది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) ఆడేందుకు టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ ఆరంభానికి రెండు నెలలకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.ఆ ముగ్గురు బ్యాటర్లను కట్టడి చేయగలిగితేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజీటీలో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని నాథన్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు బ్యాటర్లను కట్టడి చేయగలిగితే తాము సులువుగానే పైచేయి సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు. తమ బౌలింగ్ విభాగం వీరిని సమర్థవంతంగా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్... ఈ ముగ్గురే మాకు టీమిండియాతో సిరీస్లో కీలకం కానున్నారు. అయితే, వీరితో పాటు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, రవీంద్ర జడేజా నుంచి మాకు సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. వీరందరి కలయికతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే కనిపిస్తోంది.కఠిన సవాల్కు సిద్ధంకాబట్టి మేము కఠిన సవాల్కు సిద్ధంగా ఉండాలి. మా బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. వాళ్లను అడ్డుకునేందుకు మా వాళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని నాథన్ లియోన్ పేర్కొన్నాడు. కాగా 2014 తర్వాత ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవలేకపోయింది. ఇక 2017 నుంచి సొంతగడ్డపై రెండు, ఆసీస్ మట్టిపై రెండుసార్లు సిరీస్ గెలిచి టీమిండియా జోష్లో ఉంది. చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే! -
భారత్, న్యూజిలాండ్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
ఐపీఎల్-2024 ముగిసిన వెంటనే అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ పండగ సిద్దమైంది. టీ20 వరల్డ్కప్-2024కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వార్మాప్ మ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన టోర్నీ ఆరంభానికి కేవలం రెండు మాత్రమే ఉన్నందన మాజీలు, వెటరన్ క్రికెటర్లు ఏ జట్టు ఫైనల్కు చేరుతుందో, ఏ జట్టు సెమీస్కు వెళ్తుందో అంచనా వేస్తున్నారు.తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో ఫైనల్కు చేరే జట్లను లియాన్ ఎంచుకున్నాడు. ఫైనల్ పోరులో ఆసీస్-పాకిస్తాన్ జట్లు తలపడతాయని లియాన్ జోస్యం చెప్పాడు. తాజాగా లియాన్ ప్రైమ్ వీడియో స్పోర్ట్స్ ఆస్ట్రేలియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా పొట్టి ప్రపంచకప్ ఫైనల్కు చేరే జట్లు ఏవన్న ప్రశ్న లియాన్కు ఎదురైంది. లియాన్ వెంటనే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అని సమాధనమిచ్చాడు."టీ20 వరల్డ్కప్ ఫైనల్కు ఆస్ట్రేలియా చేరుతుందన్న నమ్మకం నాకు ఉంది. మా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇక నా వరకు అయితే ఫైనల్కు చేరే మరోజట్టు పాకిస్తాన్. విండీస్, యూఎస్ పరిస్థితుల్లో పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు, బాబర్ ఆజాం వరల్డ్క్లాస్ క్రికెటర్లు ఉన్నారని" అని ప్రైమ్ వీడియో స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లియాన్ పేర్కొన్నాడు. కాగా ఫైనల్ చేరే జట్ల జాబితాలో టీమిండియాని ఎంచుకోపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. ప్రపంచంలో తొలి క్రికెటర్గా!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన లియోన్.. కివీస్ పతనాన్ని శాసించాడు. అతడి స్పిన్ దాటికి న్యూజిలాండ్ కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 10 వికెట్లను లియోన్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో సంచలన ప్రదర్శన కనబరిచిన లియోన్ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్గా నాథన్ నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు ఈ ఆసీస్ దిగ్గజం 10 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్తో అశ్విన్ రికార్డును లియోన్ బ్రేక్ చేశాడు. -
తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్ 6 వికెట్లతో చెలరేగాడు. 111/3 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. అదనంగా 85 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(59) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్తో పాటు హాజిల్వుడ్ రెండు, హెడ్, గ్రీన్ తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. అయితే తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 204 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో కివీస్ ముందు 369 పరుగులు భారీ టార్గెట్ను ఆస్ట్రేలియా ఉంచింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్లు), హాజల్వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 & 196 ఫలితం: 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం -
టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్న నాథన్ లయోన్ హవా.. వాల్ష్ రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ హవా కొనసాగుతుంది. తాజాగా అతను దిగ్గజ పేసర్, విండీస్ మాజీ బౌలర్ కోట్నీ వాల్ష్ రికార్డును బద్దలు కొట్టాడు. వాల్ష్ 1984-2001 మధ్యలో 128 టెస్ట్లు ఆడి 519 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో నాలుగు వికెట్లు పడగొట్టిన లయెన్.. తన టెస్ట్ వికెట్ల కౌంట్ను 521కి పెంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లయోన్.. వాల్ష్ను అధిగమించి, ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్ట్ల్లో 500 వికెట్ల మార్కును తాకాడు. ప్రస్తుతం అతను 507 వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) టాప్లో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (698), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (5), నాథన్ లయోన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (174 నాటౌట్) భారీ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 179 పరుగులకే ఆలౌటైంది. లయోన్ 4, హాజిల్వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (71) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
క్యూరేటర్ నుంచి ఆసీస్ స్పిన్ లెజెండ్గా.. ఏకంగా షేన్ వార్న్ సరసన!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్లోని కోచ్లను ఆకర్షించింది. అనంతరం జట్లు ప్రాక్టీస్కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు. దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్బ్యాక్స్లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది. దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. స్టూవర్ట్ మెక్గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు. వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది. అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు. అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్. అలా మొదలైంది.. 2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్కు దిగాడు. రౌండ్ ద వికెట్గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్ను తాకిన బంతి స్లిప్స్లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది. అంతే.. అటు లయన్తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్కు చోటు లభించింది. ఈ మ్యాచ్లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్స్పిన్నర్గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. యాషెస్తో మేలిమలుపు.. ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్కు చాన్స్ లభించింది. ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది. అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ను కట్టడి చేసి ఆసీస్ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్మెంట్కు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ దిగ్గజంగా ఎదిగి.. షేన్వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్గా లయన్కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్కంటే సరైన వేదిక ఏముంటుంది. భారత గడ్డపై సత్తా చాటి స్పిన్కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం. షేన్ వార్న్ సరసన లయన్ కెరీర్లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్. ఆసీస్ ఓడిన మ్యాచ్లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
నేను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు వీరే: ఆసీస్ స్టార్ స్పిన్నర్
గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్గా చరిత్రకెక్కిన అతడు.. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. సొంతగడ్డపై పాకిస్తాన్తో టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న నాథన్ లియోన్.. ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని పేర్కొన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లు అని తెలిపాడు. కాగా కోహ్లి- లియోన్ ముఖాముఖి పోరులో రన్మెషీన్దే పైచేయి కావడం విశేషం. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లి లియోన్ బౌలింగ్లో కేవలం ఏడుసార్లు అవుట్ కాగా.. 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్లో 96కు పైగా స్ట్రైక్రేటుతో 100 పరుగులు సాధించిన కోహ్లి.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు.. టెస్టుల్లో లియోన్పై డివిలియర్స్ది కూడా పైచేయే! అతడి బౌలింగ్లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ.. కేవలం రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, టెండుల్కర్కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్లో మెరుగైన రికార్డు లేదు. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్లో కేవలం సగటు 29 కలిగి ఉన్న సచిన్ నాలుగుసార్లు అవుటయ్యాడు. కాగా నాథన్ లియోన్ తదుపరి పాకిస్తాన్తో మూడో టెస్టు సందర్భంగా మైదానంలో దిగనున్నాడు. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్.. తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా వెల్లడించాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన
Australia vs Pakistan, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ఆఖరి టెస్టులో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మంగళవారం ధ్రువీకరించాడు. స్వదేశంలో పాకిస్తాన్పై టెస్టుల్లో రెండు దశాబ్దాలకు పైగా ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఆసీస్ మరోసారి సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో పర్యాటక పాక్ను 360 పరుగుల తేడాతో చిత్తు చేసిన కంగారూ జట్టు.. బాక్సింగ్ డే టెస్టులోనూ విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. వార్నర్ ఫేర్వెల్ టెస్టు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం (జనవరి 3) నుంచి ఐదు రోజుల మ్యాచ్ మొదలు కానుంది. ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం పింక్ టెస్టుగా నిర్వహించనున్న ఈ మ్యాచ్ సందర్భంగా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడనున్నాడు. తన రెగ్యులర్ జోడీ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. నెట్స్లో శ్రమిస్తున్న ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. మరో ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్లో ఉన్న కారణంగా గ్రీన్ను పక్కనపెట్టక తప్పలేదు. 👀 #AUSvPAK https://t.co/YcZvY1CYlM — cricket.com.au (@cricketcomau) January 1, 2024 ‘పింక్’ టెస్టులో గెలుపు ఎవరిది? ఇక బౌలింగ్ దళంలో పేస్ త్రయం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్తో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్ ఉండగా.. అలెక్స్ క్యారీ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్బౌలర్ గ్లెన్ మెగ్రాత్ భార్య జేన్ మెగ్రాత్ రొమ్ము క్యాన్సర్తో మరణించింది. ఈ నేపథ్యంలో.. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమె జ్ఞాపకార్థం మెగ్రాత్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆసీస్ ఆడే టెస్టుల్లో ఒక మ్యాచ్ను పింక్ టెస్టుగా నిర్వహిస్తూ ఫండ్రైజింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: నా రికార్డు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజం
Australia vs Pakistan, 3rd Test: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆట తీరుపై బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ తరఫున తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టగల సత్తా లియోన్కు ఉందన్నాడు. కాగా పాకిస్తాన్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. నామమాత్రపు ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. ఆమె జ్ఞాపకార్థం ‘పింక్’ టెస్టు నిర్వహణ ఇరుజట్ల మధ్య బుధవారం (జనవరి 3) నుంచి ‘పింక్ టెస్టు’ ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. కాగా బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించిన గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పింక్ టెస్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీలో తాజాగా జరుగనున్న మ్యాచ్ 16వది. ఈ టెస్టు సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ విరాళాల సేకరణ చేపట్టనుంది. ఈ సందర్భంగా గ్లెన్ మెగ్రాత్ ప్రసంగిస్తూ.. నాథన్ లియోన్ బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు. ‘‘ప్రతి రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. ఒకవేళ లియోన్ నన్ను దాటేస్తే అంతకంటే సంతోషం ఉండదు. అతడు అసాధారణ బౌలర్. అలా అయితే అతడికి తిరుగే ఉండదు లియోన్కు ఆల్ ది బెస్ట్. ఒకవేళ నాతో పాటు షానో(షేన్ వార్న్) రికార్డును కూడా అధిగమిస్తే అతిడికి తిరుగే ఉండదు. లియోన్ బౌలింగ్ నైపుణ్యాలు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం అతడికి అలవాటు’’ అని మెగ్రాత్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్గా గ్లెన్ మెగ్రాత్ ఘనత సాధించాడు. నేటికీ అతడి రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ తరఫున 124 టెస్టులు ఆడిన రైటార్మ్ పేసర్ మెగ్రాత్ 563 వికెట్లు తీశాడు. 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్ మరోవైపు.. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్తో పెర్త్ టెస్టు సందర్భంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా పింక్ టెస్టుకు ముందు అతడి ఖాతాలో మొత్తంగా 505 వికెట్లు ఉన్నాయి. సుమారు మరో నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్న లియోన్ ఇంకో 59 వికెట్లు తీస్తే .. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో మెగ్రాత్ను అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ దిగ్గజ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బుమ్రా? -
బాబర్ విఫలం.. కమిన్స్ జోరు! రెండో రోజు ఆసీస్దే పైచేయి!
Australia vs Pakistan, 2nd Test Day 2: పాకిస్తాన్తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాకిస్తాన్ మధ్య బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. టీ విరామానికి 37 నిమిషాల ముందు వర్షం రావడంతో ఆటకు మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. దాంతో తొలి రోజు 66 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖవాజా (42; 5 ఫోర్లు) తొలి వికెట్కు 90 పరుగులు జోడించారు. స్టీవ్ స్మిత్ (26; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి లబుషేన్ (44 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (9 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లు హసన్ అలీ, ఆమెర్ జమాల్, ఆగా సల్మాన్ ఒక్కోవికెట్ తీశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మొదలుపెట్టిన కంగారూ జట్టును పాక్ బౌలర్లు కట్టడి చేశారు. 187/3 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను 318 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆతిథ్య ఆసీస్ రెండో రోజు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జోష్లో బ్యాటింగ్ మొదలుపెట్టిన పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చాడు ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ను అవుట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అర్ధ శతకం(62)తో మెరిశాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాన్ మసూద్(54)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ షఫీక్ను, లియోన్ మసూద్ను అవుట్ చేసి ఈ జోడీని విడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లోనూ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. కమిన్స్ అద్భుత బంతితో బాబర్(1)ను బౌల్డ్ చేయగా.. సౌద్ షకీల్ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోష్ హాజిల్వుడ్ పెవిలియన్కు చేర్చాడు. ఇక మరోసారి బంతితో మ్యాజిక్ చేసిన కమిన్స్.. ఆగా సల్మాన్(9)ను అవుట్ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి మళ్లీ ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా 55 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 29, ఆమిర్ జమాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్కు మూడు, నాథన్ లియోన్కు రెండు, జోష్ హాజిల్వుడ్కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! -
AUS VS PAK 1st Test: 500 వికెట్ల క్లబ్లో చేరిన లియోన్
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్ను మట్టికరిపించారు. ఈ మ్యాచ్లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్ల అరుదైన క్లబ్లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో లియోన్ సహా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (133 టెస్ట్ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కంటే ముందు 500 వికెట్ల క్లబ్లో చేరిన వారిలో ఉన్నారు. FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ — cricket.com.au (@cricketcomau) December 17, 2023 సెకెండ్ ఇన్నింగ్స్లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ లెజెండరీ క్లబ్లో చేరాడు. 36 ఏళ్ల లియోన్ 123 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించి ఆసీస్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్కు ముందు వార్న్, మెక్గ్రాత్ ఆసీస్ తరఫున 500 వికెట్ల క్లబ్లో చేరారు. లియోన్ తన 500 వికెట్ డీఆర్ఎస్కు వెళ్లి సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో మొత్తంగా 5 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 3, సెకెండ్ ఇన్నింగ్స్లో 2) సాధించిన లియోన్ ఆసీస్ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. Nathan Lyon is an All-time legend of Test cricket. 🫡 pic.twitter.com/qjP4wYv5lg — Johns. (@CricCrazyJohns) December 17, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
Aus Vs Pak: ఆస్ట్రేలియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా వరల్డ్కప్ హీరో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. షాన్ మసూద్ బృందంతో తలపడబోయే జట్టులో వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్కు చోటిచ్చినట్లు తెలిపింది. కాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. కంగారూ వంటి పటిష్ట జట్టుతో పోరుకు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. కాన్బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే.. గురువారం (డిసెంబరు 14) నుంచి అసలైన సిరీస్ ఆరంభం కానుంది. వైస్ కెప్టెన్గా వరల్డ్కప్-2023 హీరో పెర్త్లో జరుగనున్న ఈ మ్యాచ్కు సంబంధించిన తమ తుది జట్టు ఇదేనంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బుధవారం వివరాలు వెల్లడించాడు. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్లో తనకు డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు. మర్ఫీకి బైబై.. లియోన్ ఇన్ మాజీ సారథి స్టీవ్ స్మిత్తో కలిసి హెడ్.. కో-వైస్ కెప్టెన్గా ఉంటాడని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్తో మ్యాచ్తో నాథన్ లియోన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. ఇక పాక్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగనుంది. అదే విధంగా ఆల్రౌండర్ స్లాట్లో కామెరాన్ గ్రీన్తో పోటీ పడ్డ మిచెల్ మార్ష్వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపడంతో అతడు ఈ మ్యాచ్లో భాగం కానున్నాడు. ఇదిలా ఉంటే.. స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ వైస్ కెప్టెన్ అయినప్పటికీ.. ఒకవేళ కమిన్స్ గైర్హాజరైతే ఈ మ్యాచ్లో కెప్టెన్గా స్టీవ్ స్మిత్కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. పాకిస్తాన్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
యాషెస్ మూడో టెస్ట్ చాలా ప్రత్యేకం.. ఆ ఇద్దరూ లేకుండా 6037 రోజుల తర్వాత..!
హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ మ్యాచ్ ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్కు వందో టెస్ట్ మ్యాచ్ కాగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ లేకుండా 6037 రోజుల తర్వాత ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆండర్సన్, లయోన్ లేకుండా 2006 డిసెంబర్ 26న చివరిసారిగా ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. కాగా, రెండో టెస్ట్ సందర్భంగా గాయపడినందున నాథన్ లయోన్ సిరీస్ మొత్తానికే దూరం కాగా, తొలి రెండు టెస్ట్ల్లో రాణించికపోవడంతో ఆండర్సన్ను ఇంగ్లీష్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది (మూడో టెస్ట్కు). ఇదిలా ఉంటే, లార్డ్స్లో ముగిసిన రెండో టెస్ట్లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. -
Ashes Series 2023: గెలుపు జోష్లో ఉన్న ఆసీస్కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
5 మ్యాచ్ల యాషెస్ సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ సిరీస్ మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్ లేని లోటు ఆసీస్కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది. లయోన్ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్కు లయోన్ స్థానంలో టాడ్ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మర్ఫీ.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడాడు. ఆసీస్-ఇంగ్లండ్ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది. కాగా, రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్ అందుకోబోతూ నాథన్ లయోన్ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్ లయోన్కు తన కెరీర్లో వరుసగా వందో టెస్ట్ మ్యాచ్. గాయపడిన అనంతరం లయోన్ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్లో లయోన్ లేకపోయినా ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టోక్స్ పోరాటం వృధా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఆసీస్ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్్ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
నాథన్ లయోన్కు నీరాజనాలు.. గాయాన్ని లెక్క చేయకుండా, కుంటుతూనే బరిలోకి..!
యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆటలో ఆసీస్కు లయోన్ అవసరం పడటంతో అతను ఏమాత్రం సంకోచించకుండా ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. లయోన్ కమిట్మెంట్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 👏 @NathLyon421.#LoveLords | #Ashes pic.twitter.com/yx5l8w2Vu1 — Lord's Cricket Ground (@HomeOfCricket) July 1, 2023 అతను నొప్పిని భరిస్తూ కుంటుతూ మైదానంలోకి వస్తుంటే, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు. లయోన్ ఔటై పెవిలియన్కు వెళ్తున్న సమయంలోనూ ప్రేక్షకులు చప్పట్లతో స్టేడియాన్ని మార్మోగించారు. ఆట పట్ల లయోన్కు ఉన్న డెడికేషన్, తాను చేయగలిగే కొన్ని పరుగులైన జట్టుకు ఉపయోగపడతాయన్న అతని కమిట్మెంట్కు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. లయోన్ కుంటుతూ మైదానంలోకి వస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. Here he comes! #Ashes pic.twitter.com/2t954CNI7g — cricket.com.au (@cricketcomau) July 1, 2023 కాగా, ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన లయోన్.. బౌండరీ సాయంతో 4 పరుగులు చేసి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. అనంతరం ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి విజయానికి 257 పరుగుల దూరంలో ఉంది. అదే ఆసీస్ గెలవాలంటే 6 వికెట్లు అవసరం. క్రీజ్లో డకెట్ (50), స్టోక్స్ (29) ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి) -
Ashes 2023: నాథన్ లియోన్కు గాయం.. ఆసీస్కు ఊహించని షాక్!
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు. యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటలో లియోన్ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఇది జరిగింది. ఈ క్రమంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాతి సెషన్కు లియోన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఇది ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. రెండో టెస్టులో లియోన్ 13 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే 500వికెట్ల మార్క్ను అందుకునే అవకాశం ఉంది. ఇక లియోన్కు లార్డ్స్ టెస్టు వందోది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లియోన్ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందింస్తూ.. ''నాథన్ కచ్చితంగా ఎలా ఉన్నాడో తెలియదు.. అతని గాయం తీవ్రమైతే మాత్రం తమ జట్టుకు భారీ నష్టం మిగలనుంది. అతని లోటును తీర్చడం చాలా కష్టం. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది.''అంటూ తెలిపాడు. తాజాగా మూడోరోజు ఆటకు ఇరుజట్లు సిద్ధమవుతున్నా వేళ ఆడమ్ వైట్ అనే వ్యక్తి తన ట్విటర్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్న వీడియోనూ షేర్ చేశాడు. ఈ వీడియోలో నాథన్ లియోన్ రెండు స్రెచర్ల సాయంతో నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీన్నిబట్టి లియోన్కు గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండో టెస్టుకు లియోన్ దూరమైనట్లే. నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మార్ఫీ! ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్ కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. లియోన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లార్డ్స్ టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసేసమయానికి 61 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 45, బెన్ స్టోక్స్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 138 పరుగులు వెనుకబడి ఉంది. The Australians have arrived 80 minutes before play as Nathan Lyon struggles with his team mates on crutches following his calf injury yesterday. @SEN_Cricket pic.twitter.com/a1lRWLIofm — Adam White (@White_Adam) June 30, 2023 చదవండి: అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం #Ashes2023: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్చేస్తే -
చరిత్ర సృష్టించనున్న నాథన్ లయోన్.. తొలి బౌలర్గా అరుదైన ఘనత
యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇవాళ (జూన్ 28) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్కు చిరకాలం గుర్తుండిపోతుంది. కేవలం ఈ మ్యాచ్లో ఆడటం ద్వారానే అతను చరిత్ర సృష్టించనున్నాడు. టెస్ట్ క్రికెట్లో వరుసగా 100 మ్యాచ్లు ఆడిన తొలి బౌలర్గా అరుదైన ఘనత సాధించనున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర బౌలర్కు ఈ ఫీట్ను సాధించలేదు. ఓవరాల్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సర్ అలిస్టర్ కుక్ వరుసగా 159 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అతని తర్వాత ఆసీస్ ఆల్రౌండర్ అలెన్ బోర్డర్ (153), ఆసీస్ మార్క్ వా (107), ఇండియా సునీల్ గవాస్కర్ (106), కివీస్ బ్రెండన్ మెక్కల్లమ్ (101) ఉన్నారు. ఓవరాల్గా చూస్తే.. లయోన్ తన కెరీర్ మొత్తంలో 121 టెస్ట్లు ఆడాడు. ఇందులో 23 ఐదు వికెట్ల ఘనతలు, 4 పది వికెట్ల ఘనతల సాయంతో 495 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే లార్డ్స్ టెస్ట్లో లయోన్ మరో 5 వికెట్లు పడగొడితే.. 500 వికెట్ల మైలురాయిని కూడా చేరుకుంటాడు. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బజ్బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులు కాల్చుకుంది. మరి ఈ మ్యాచ్లో అయిన ఇంగ్లండ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి. -
సిరాజ్ అరుదైన ఘనత.. స్వదేశం కంటే విదేశాల్లోనే అదుర్స్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా నాథన్ లియాన్ను క్లీన్బౌల్డ్ చేయడం ద్వారా సిరాజ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక మ్యాచ్లో సిరాజ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. కాగా 19 టెస్టుల్లో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా టీమిండియా తరపున టెస్టుల్లో 50 వికెట్లు తీసిన 42వ బౌలర్గా రికార్డులకెక్కాడు. ఇక టీమిండియా తరపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా 11 టెస్టుల్లోనే 50 వికెట్ల మార్క్ అందుకున్నాడు. కాగా సిరాజ్కు టెస్టుల్లో స్వదేశం కంటే విదేశాల్లోనే మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తీసిన 50 వికెట్లలో 41 వికెట్లు విదేశాల్లో వచ్చినవే. ఇందులో 18 వికెట్లు(ఏడు టెస్టుల్లో) ఆస్ట్రేలియా గడ్డపై, 20 వికెట్లు(ఆరు టెస్టుల్లో) ఇంగ్లండ్ గడ్డపై తీశాడు. ఇక సిరాజ్ ఖాతాలో ఒకే ఒక్క ఐదు వికెట్ల హాల్ ఉండగా.. అది కూడా ఆసీస్ గడ్డపైనే(2021లో బ్రిస్బేన్లో) వచ్చింది. Mohammed Siraj completes 5️⃣0️⃣ Test wickets in just 19 Test matches. One of the most improved players in recent times.@mdsirajofficial | #WTC2023Final pic.twitter.com/nwE4lhS6pW — CricTracker (@Cricketracker) June 8, 2023 చదవండి: సిరాజ్కు కోపం తెప్పించిన స్మిత్ చర్య -
Ind Vs Aus: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా..
India Vs Australia 4th Test Day 4 Records: నాలుగో టెస్టులో నాలుగో రోజు నాలుగో శతకం నమోదైన విషయం తెలిసిందే. ఒక టెస్టులో నాలుగు సెంచరీలు కొత్తేం కాదు... కానీ ఈ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో మాత్రం ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మూడు టెస్టులు కూడా మూడో రోజుల్లోనే ముగిశాయి. స్పిన్నర్లు తిప్పేసిన ఆ మ్యాచ్ల్లో బ్యాటర్లు విలవిలలాడారు. గత మ్యాచుల్ని శాసించిన బౌలర్లపై ఇరు జట్ల బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడ్డారు. మరి టీమిండియాకు అనుకూలంగా మారిన నాలుగో రోజు ఆటలో విశేషాలు, నమోదైన ప్రధాన రికార్డులన్నీ ఒకేచోట చూసేద్దామా?! 1205 రోజుల తర్వాత... భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... సుదీర్ఘ టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. ఆఖరి టెస్టులో మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు. ఓవర్నైట్ స్కోరు 289/3 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన భారత్కు జడేజా (84 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రూపంలో గట్టిదెబ్బే తగిలింది. బ్యాటింగ్కు కలిసొచ్చే పిచ్పై కోహ్లికి జతయిన ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జతయ్యాడు. ‘రన్ మెషిన్’ అండతో భరత్ భారీ సిక్సర్లతో అలరించాడు. 363/4 వద్ద లంచ్కు వెళ్లొచ్చాక ఎంతో ఓపిగ్గా ఆడిన కోహ్లి 241 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2019లో నవంబర్ 23న క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్పై కోహ్లి 27వ టెస్ట్ శతకం సాధించాడు. మళ్లీ 43 టెస్టుల తర్వాత భారత గడ్డపైనే 28వ సెంచరీ చేసి 1205 రోజుల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఐదో వికెట్కు 84 పరుగులు జోడించాక లయన్ బౌలింగ్లో భరత్... హ్యాండ్స్కాంబ్ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్ పటేల్ కూడా పట్టుదలతో ఆడటంతో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. ఇద్దరి జోడీ కుదరడంతో భారత్ భారీస్కోరుకు బాటపడింది. మూడో సెషన్లో టీమిండియా 500 మార్క్ను అందుకోగా, కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. కాసేపటికే అక్షర్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అక్షర్ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో ఆరో వికెట్కు 162 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కాసేపటికే భారత్ 571 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. నాలుగో రోజు ప్రధాన రికార్డులు 75: టీమిండియా స్టార్, రన్మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 75వ సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 28వ శతకం. భారత గడ్డపై లియోన్ చరిత్ర భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ జట్టు బౌలర్గా నాథన్ లయన్ గుర్తింపు పొందాడు. భారత్లో 11 టెస్టులు ఆడిన లయన్ 56 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ అండర్వుడ్ (ఇంగ్లండ్; 16 టెస్టుల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును లయన్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కొట్టిన సిక్స్లు. 10: ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో భారత్ కొట్టిన అత్యధిక సిక్స్లు ఇవే. 1986లో ముంబైలో, 2013లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ల్లో భారత్ ఎనిమిది చొప్పున సిక్స్లు కొట్టింది. మూడో జట్టుగా భారత్ ఓ టెస్ట్ మ్యాచ్లో తొలి ఆరు వికెట్లకు 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా (1960లో వెస్టిండీస్పై), పాకిస్తాన్ (2015లో బంగ్లాదేశ్పై) ఈ ఘనత సాధించాయి. ఆస్ట్రేలియా రికార్డు బద్దలు నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా 480 పరుగులతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా ఆసీస్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులు సాధించిన భారత్.. పర్యాటక జట్టు పేరిట ఉన్న ఘనతను కనుమరుగు చేసింది. అయ్యర్ అవుట్! భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నాలుగో రోజు బ్యాటింగ్కు దిగలేదు. వెన్నునొప్పితో బాధపడిన అతనికి స్కానింగ్ కూడా తీశారు. ముందు జాగ్రత్తగా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఆడించలేదు. మూడో రోజు ఆటలోనే అతనికి నొప్పి మొదలైనట్లు తెలిసింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఈ నెల 17 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. చదవండి: Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది! -
IND VS AUS 4th Test: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు (టెస్ట్ల్లో) పడగొట్టిన విదేశీ బౌలర్గా ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డెరెక్ అండర్వుడ్ (16 టెస్ట్ల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో కేఎస్ భరత్ (44) వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ రేర్ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం లియోన్ ఖాతాలో 55 వికెట్లు (11 టెస్ట్ల్లో) ఉన్నాయి. భారతగడ్డపై లియోన్ ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనతను, ఓ సారి 10 వికెట్లు ఫీట్ను సాధించాడు. లియోన్, అండర్వుడ్ తర్వాత భారత గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల జాబితాలో రిచీ బెనాడ్ (52), కోట్నీ వాల్ష్ (43), ముత్తయ్య మురళీథరన్ (40) మూడు నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు. భారత్పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్గా.. ప్రస్తుత భారత పర్యటనలో చెలరేగిపోతున్న నాథన్ లియోన్.. పలు ఆసక్తికర రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ రికార్డుతో పాటు భారత్పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్గానూ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా భారత్పై 26 టెస్ట్ మ్యాచ్లు ఆడిన లియోన్.. 9 సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు 2 సార్లు 10 వికెట్ల ఘనత సాధించి 115 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారతపై ఏ స్పిన్నర్ ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. అలాగే భారత్పై అత్యధిక ఫైఫర్లు సాధించిన బౌలర్గాను లియోన్ రికార్డు నెలకొల్పాడు. భారత్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్కు ముందు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (139) మాత్రమే ఉన్నాడు. BGT-2023లో భీకర ఫామ్లో ఉన్న లియోన్.. 4 టెస్ట్ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా లియోన్ ఖాతాలో 480 వికెట్లు (119 టెస్ట్ల్లో) ఉన్నాయి. ఇందులో 23 సార్లు ఐదు వికెట్ల ఘనత, 4 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (685), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (576), మెక్గ్రాత్ (563), వాల్ష్ (519) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (169), అక్షర్ పటేల్ (57) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. -
Shane Warne: అప్పుడే ఏడాది గడిచిపోయిందా? నమ్మలేకున్నా!
Shane Warne Death Anniversary: ‘‘అత్యంత విచారకరం. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ దివంగత షేన్ వార్న్ను గుర్తు చేసుకున్నాడు. కాలం గిర్రున తిరిగిపోయిందని.. వార్న్ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్ లేనిలోటు ఎవరూ పూడ్చలేరన్నాడు. ‘మాంత్రికుడు’ మరో లోకానికి.. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ లోకాన్ని వీడి నేటికి సరిగ్గా ఏడాది. థాయ్లాండ్లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన అతడు హఠాన్మరణం చెందాడు. ఛాతీ నొప్పితో కుప్పకూలిన వార్న్.. థాయ్లాండ్ పర్యటనలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించింది. వార్న్ను కడసారి చూసుకునేందుకు తరలివచ్చిన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. క్రికెట్ అంటే పిచ్చి ఈ నేపథ్యంలో షేన్ వార్న్ను గుర్తు చేసుకున్న మార్క్ టేలర్.. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. స్పిన్ మాంత్రికుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇండియాలో బంతి అద్భుతంగా టర్న్ అవుతున్న సందర్భాల్లో కచ్చితంగా వార్న్ మనందరికీ మరీ మరీ గుర్తుకువస్తాడు. తన స్పిన్ మాయాజాలంతో వార్న్ చేసిన అద్భుతాలు, మైదానంలో వదిలిన జ్ఞాపకాలు అలాంటివి. అతడు లేని లోటు ఎన్నటికీ ఎవ్వరూ పూడ్చలేరు. అతడి అభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆట పట్ల వార్న్కు ఉన్న ప్రేమ, అంకితభావానికి మాత్రం ఫిదా కాకుండా ఉండలేం’’ అని మార్క్ టేలర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ గెలిచిన సారథిగానూ రికార్డులకెక్కాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇక ప్రస్తుతం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ వార్న్ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. మరోవైపు.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు -
ఆనందం ఆస్ట్రేలియాదే...
ఆ్రస్టేలియా ముందు అతిస్వల్ప విజయలక్ష్యం... అయినా సరే గత టెస్టులో 18 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు, ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 11 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు తీసిన తీరును బట్టి భారత శిబిరంలో ఏదో ఒక మూల కాస్త ఆశ, నమ్మకం... అందుకు తగినట్లుగానే ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ కూడా దక్కింది. అయితే ఆపై ఆసీస్ ఎక్కడాతడబడలేదు. హెడ్, లబుషేన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పోయారు. డిఫెన్స్ ఆడి ఉత్కంఠ పెంచకుండా ఓవర్కు 4.14 రన్రేట్తో పరుగులు చేస్తూ మ్యాచ్ను వేగంగా ముగించేశారు. ప్రత్యర్థిని స్పిన్ గోతిలో పడేయబోయిన భారత్ చివరకు అదే వ్యూహానికి చిక్కి మ్యాచ్ను చేజార్చుకుంది. రెండు టెస్టులు ఓడి నిస్సహాయంగా కనిపించిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా పుంజుకొని చెప్పుకోదగ్గ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అధికారికంగా ఆస్ట్రేలియా అర్హత సాధించింది. భారత్ కూడా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే చివరిదైన నాలుగో టెస్ట్లో ఆసీస్పై గెలవాలి. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’ అయినా, భారత్ ఓడిపోయినా టీమిండియా ఫైనల్ అవకాశాలు న్యూజిలాండ్–శ్రీలంక టెస్ట్ సిరీస్ తుది ఫలితంపై ఆధారపడి ఉంటాయి. ఇండోర్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఆ్రస్టేలియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్లో ఆ్రస్టేలియా 9 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. సిరీస్లో భారత్ టీమిండియా ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బరిలోకి దిగిన ఆసీస్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (53 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లబుషేన్ (58 బంతుల్లో 28 నాటౌట్; 6 ఫోర్లు) జట్టును గెలిపించారు. నాథన్ లయన్ (11/99) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్లో చివరి టెస్టు ఈనెల 9 నుంచి అహ్మదాబాద్లో జరుగుతుంది. ప్రత్యర్థిని కుప్పకూల్చేందుకు స్పిన్ తప్ప మరో మార్గం లేదని భావించిన భారత్ మరో ఆలోచన లేకుండా అశ్విన్తోనే బౌలింగ్ మొదలు పెట్టింది. దానికి తగిన ఫలితం కూడా అందుకుంది. రెండో బంతికే తడబడిన ఉస్మాన్ ఖాజా (0) కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో టీమిండియా ఆశలు మరింత పెరిగాయి. అయితే హెడ్, లబుõÙన్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 13 పరుగులే. ఈ దశలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంతి సీమ్ దెబ్బ తినడంతో అంపైర్లు బంతిని మార్చాల్సి వచ్చింది. భారత బృందం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినా అదే బంతితో బౌలింగ్ చేయక తప్పలేదు. అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి హెడ్ జోరు పెంచగా, జడేజా తర్వాతి ఓవర్లో లబుõÙన్ రెండు ఫోర్లు కొట్టాడు. అశ్విన్ మరో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు రాబట్టి వీరిద్దరు 15 ఓవర్లలో స్కోరును 56/1కు చేర్చారు. డ్రింక్స్ తర్వాత 23 బంతుల్లో 22 పరుగులు రాబట్టి కంగారూలు విజయాన్ని అందుకున్నారు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 109; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 197; భారత్ రెండో ఇన్నింగ్స్: 163; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: ఖాజా (సి) భరత్ (బి) అశ్విన్ 0; హెడ్ (నాటౌట్) 49; లబుషేన్ (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 78. వికెట్ల పతనం: 1–0. బౌలింగ్: అశ్విన్ 9.5–3–44–1, జడేజా 7–1–23–0, ఉమేశ్ 2–0–10–0. పిచ్ ‘నాసిరకం’ మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్ఛిన ఇండోర్లోని హోల్కర్ స్టేడియం పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ‘నాసిరకం పిచ్’గా గుర్తిస్తూ మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించింది. మూడో రోజు తొలి సెషన్లోపే ఈ టెస్టు ముగిసింది. ‘పొడిగా ఉన్న ఈ పిచ్పై బంతికి, బ్యాట్కు మధ్య సమతుల్యత లోపించింది. మ్యాచ్ ఐదో బంతికే దుమ్ము రేగగా, ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది’ అని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ నివేదిక ఇచ్చారు. -
BGT 2023: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అందుకే ఇలా: రోహిత్ శర్మ
Rohit Sharma Comments Over Indore Test Loss: ‘‘టెస్టు మ్యాచ్ ఓడటానికి అనేక కారణాలు ఉంటాయి. నిజానికి తొలి ఇన్నింగ్స్లో మా బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. మొదటి ఇన్నింగ్స్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ఎంత ముఖ్యమో మాకు ఇప్పుడు మరింత బాగా అర్థమైంది. వాళ్లకు 80-90 పరుగుల ఆధిక్యం లభించినపుడైనా మేము మెరుగ్గా బ్యాటింగ్ బ్యాటింగ్ చేయాల్సింది. కానీ మరోసారి మేము విఫలమయ్యాం. కేవలం 75 పరుగులు మాత్రమే చేయగలిగాం. ఒకవేళ మేము తొలి ఇన్నింగ్స్లో బాగా ఆడి ఉంటే పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. ప్రస్తుతం మేము డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోచించడం లేదు. మా దృష్టి మొత్తం ప్రస్తుతం నాలుగో టెస్టు మీదే ఉంది. అహ్మదాబాద్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం గురించే మా ఆలోచన. తొలి రెండు టెస్టుల్లో మా ఆట తీరు బాగుంది. అహ్మదాబాద్లోనూ అదే పునరావృతం చేయాలని భావిస్తున్నాం. పిచ్ ఎలా ఉందన్న విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం సరిగ్గా చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత మన ప్రణాళికలు సరిగ్గా అమలయ్యాయా? లేదా అన్న అంశం గురించి మాత్రమే ఆలోచించాలి. బ్యాటర్లకు సవాల్ విసిరే పిచ్లపై ఆడినపుడు మరింత ధైర్యంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నిజానికి వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా నాథన్ లియోన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, తొలి రెండు మ్యాచ్లలో మా బ్యాటింగ్ ఎలా ఉందో అందరూ చూశారు కదా! అయితే, ఈసారి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయలేకపోయాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇండోర్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు ఆసీస్ అవకాశాలను మెరుగుపరిచింది. బ్యాటర్ల వైఫల్యం ఇక బుధవారం(మార్చి 1) మొదలైన మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. తొలి ఇన్నింగ్స్లో 109, రెండో ఇన్నింగ్స్లో 163 పరుగులకు ఆలౌట్ కావడమే ఇందుకు నిదర్శనం. రెండు ఇన్నింగ్స్లో కలిపి నయావాల్ ఛతేశ్వర్ పుజారా మొత్తంగా 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా తొలి ఇన్నింగ్స్లో 60 పరుగులతో రాణించి జట్టుకు ఆధిక్యం అందించగా.. రెండో ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ 49, మార్నస్ లబుషేన్ 28 పరుగులతో అజేయంగా నిలిచి విజయలాంఛనం పూర్తి చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాథన్ లియోన్ మొత్తంగా 11 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 24 పరుగులు చేశాడు. చదవండి: సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం Danielle Wyatt: అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్మెంట్! -
చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూటో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 8 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో లియాన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లియాన్ చరిత్ర సృష్టించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో 57వ ఓవర్లో ఉమేష్ యాదవ్ను ఔట్ చేసిన లియాన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాథన్ ఇప్పటివరకు 112 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కుంబ్లే రికార్డును లియాన్ బ్రేక్ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు.. నాథన్ లయన్- 112 వికెట్లు అనిల్ కుంబ్లే- 111 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్- 106 వికెట్లు హర్భజన్ సింగ్- 95 వికెట్లు రవీంద్ర జడేజా- 84 వికెట్లు చదవండి: IND Vs AUS: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు! -
8 వికెట్లతో దుమ్మురేపిన లియోన్.. పలు రికార్డులు బద్దలు
ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. రెండోరోజు ఆటలో భాగంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. మూడోరోజు ఉదయం ఏమైనా అద్భుతం జరిగితే తప్ప ఆసీస్ గెలుపును అడ్డుకోవడం కష్టమే. బంతి అనూహ్యంగా టర్న్ అవుతున్నప్పటికి లక్ష్యం చిన్నది కావడంతో ఆసీస్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ 8 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను లియోన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ►టీమిండియా గడ్డపై బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అందుకున్న మూడో ఆటగాడిగా నాథన్ లియోన్ నిలిచాడు. భారత గడ్డపై లియోన్ ఒక ఇన్నింగ్స్లో 8 వికెట్ల ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి. ఇంతకముందు 2016-17 పర్యటనలో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టులో 50 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా 64 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ►న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. 2021-22లో భారత్లో పర్యటించిన కివీస్ జట్టు.. ముంబై వేదికగా ఆడిన టెస్టులో ఎజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. కుంబ్లే తర్వాత టెస్టుల్లో ఈ ఫీట్ అందుకున్న బౌలర్గా నిలిచాడు. ►టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ను వెనక్కి నెట్టాడు. ►ఇక టెస్టుల్లో లియోన్ పుజారాను 13వ సారి ఔట్ చేశాడు. ఒక బ్యాటర్ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్గా లియోన్ నిలిచాడు. ►భారత గడ్డపై అత్యధికసార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్న లియోన్ (ఐదుసార్లు).. రిచీ బెనాడ్స్ రికార్డును సమం చేశాడు. -
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Ind Vs Aus 3rd Test Indore Day 1: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బుధవారం (మార్చి 1) ఆరంభమైన మూడో టెస్టులో ఆది నుంచే బంతి స్పిన్కు టర్న్ అవుతోంది. ఇండోర్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ సమయానికి 84 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్తో ఖాతా తెరిచాడు. చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు తర్వాతి రెండో ఓవర్లో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(21)ను అవుట్ చేశాడు. తర్వాత వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ రంగంలోకి దిగి ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4) వికెట్లు కూల్చగా.. కుహ్నెమన్ శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్ చేశాడు. వీరికి తోడు మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లి(22)ని ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత లియోన్ శ్రీకర్ భరత్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగవు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఇండోర్ పిచ్ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా.. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్లో బౌలింగ్కు రానేరాడు. ప్రస్తుతం ఇంత జరుగుతున్న భారత శిబిరంలో మరీ అంత చిరాకు లేకపోవడానికి కారణం వాళ్లు తొలి రెండు టెస్టుల్లో గెలవడమే! కానీ ఇక్కడ బంతి ఎలా టర్న్ అవుతోందో చూడండి. అందుకే నాకు ఈ పిచ్లపై కంప్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడేమంటావు రవి? ముందుగా చెప్పినట్లు ప్రపంచంలో ఏ టెస్టు మ్యాచ్లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్తో వేయించరు. అస్సలు ఆ అవకాశమే లేదు. ఇండోర్లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశాం. బ్యాటర్లకు కూడా అవకాశం రావాలి కదా రవి. ఒక్క మాటతో అదుర్స్ అనిపించిన రవి! ఇప్పుడు మీ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఏం చెబుతావో చెప్పు! మొదటి, రెండో రోజు బ్యాటింగ్కు కాస్త అనుకూలించాలి కదా!’’ అని బ్యాటింగ్ ఆల్రౌండర్ హెడెన్ వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా రవిశాస్త్రి ఒక్క మాటతో.. ‘‘హోం కండిషన్స్’’ అంటూ హెడెన్కు అదిరిపోయే రీతిలో జవాబు ఇచ్చాడు. ‘‘స్వదేశంలో మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది! కానీ ఇక్కడ ఇంకాస్త కఠినంగా ఉంది పరిస్థితి. ఒక్కటంటే ఒక్క మెరుగైన భాగస్వామ్యం నమోదైతేనే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది’’అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్కు కౌంటర్ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో.. Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం -
Ind Vs Aus: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత
Ind Vs Aus 3rd Test Indore Day 1 Nathan Lyon Record: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో భాగంగా టీమిండియాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. ఇండోర్లో మొదలైన బుధవారం నాటి తొలి రోజు ఆటలో.. ఆరంభంలో పేస్కు అనుకూలిస్తుందనుకున్న పిచ్పై స్పిన్ బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ ప్రభావం చూపలేకపోయిన వేళ.. మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నారు. స్పిన్నర్ల విజృంభణ వీరిద్దరు చెలరేగడంతో మొదటి రోజు ఆటలో 12 ఓవర్లలో టీమిండియా 46 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేసి కుహ్నెమన్ ఆసీస్కు శుభారంభం అందించగా.. లియోన్ దానిని కొనసాగించాడు. వార్న్ రికార్డు బద్దలు.. లియోన్ అరుదైన ఘనత భారత ఓపెనర్లు రోహిత్, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వికెట్లను కుహ్నెమన్ తన ఖాతాలో వేసుకోగా.. నాథన్ లియోన్ ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జడ్డూను అవుట్ చేయడం ద్వారా లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్గా చరిత్ర సృష్టించాడీ వెటరన్ స్పిన్నర్. తొలి రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన జడేజా వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. కాగా ఆసియాలో లియోన్కు ఇది 128వ వికెట్. ఈ క్రమంలో అతడు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్లు(ఇప్పటి వరకు) ►నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా స్పిన్నర్)- 128 ►షేన్ వార్న్(ఆస్ట్రేలియా స్పిన్నర్) 127 ►డానియెల్ వెటోరీ(న్యూజిలాండ్ స్పిన్నర్)- 98 ►డెయిల్ స్టెయిన్(సౌతాఫ్రికా పేసర్)-92 ►జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్ పేసర్)- 82 ►కోర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్ పేసర్)- 77 చదవండి: పుజారా చెత్త రికార్డు.. భారత్ తరపున రెండో క్రికెటర్గా Steve Smith: 'లెక్క సరిచేస్తా'.. నీకంత సీన్ లేదు! -
పుజారా చెత్త రికార్డు.. భారత్ తరపున రెండో క్రికెటర్గా
ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా తడబడుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకున్నప్పటికి ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరగా.. గిల్ 21 పరుగులు చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక పుజారా నాలుగు బంతులు ఎదుర్కొన్న అనంతరం లియోన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే పుజారా ఒక చెత్త రికార్డును తన పేరిట లఖించుకున్నాడు. ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన జాబితాలో చేరిపోయాడు. నాథన్ లియోన్ పుజారాను ఔట్ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పుజారాను 12 సార్లు ఔట్ చేయడం విశేషం. ఇంతకముందు సునీల్ గావస్కర్ అండర్వుడ్ చేతిలో 12 సార్లు ఔటయ్యాడు. టీమిండియా తరపున సునీల్ గావస్కర్ తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రెండో క్రికెటర్గా పుజారా నిలిచాడు. -
ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు?
ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్క్లాస్ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ. టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు -
ఆసీస్ స్పిన్నర్ను 24 గంటలు ఫాలో అయిన జడేజా
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సూపర్ అనిపించుకుంటున్నాడు. రీఎంట్రీ తర్వాత ఏ క్రికెటర్ అయినా నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాడు. కానీ జడేజా అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాడు. రీఎంట్రీకి ముందు వచ్చిన గ్యాప్ను కసిలా తీసుకున్న జడేజా అద్భుత రీతిలో రాణిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. ఇప్పుడు అతన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక సవాల్ అని చెప్పొచ్చు. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అన్నీ తానై జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన జడ్డూ ఢిల్లీ టెస్టులోనూ అదే జోరును చూపించాడు. అయితే ఈసారి బ్యాటింగ్లో పెద్దగా మెరవకపోయినప్పటికి భారత్లో తాను ఎంత ప్రమాదకర స్పిన్నర్ అనేది ఆసీస్కు మరోసారి రుచి చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్ల బలహీనతను పసిగట్టిన జడ్డూ ఏడు వికెట్లతో వారి నడ్డి విరిచాడు. ఓవరాల్గా ఒక టెస్టులో పది వికెట్లు తన ఖాతాలో వేసుకొని వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. మైదానంలో ఎంత చలాకీగా కనిపిస్తాడో బయట కూడా అంతే చురుకుగా ఉంటాడు. తానే ఏం చేసినా జడ్డూ దానిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు. ఇన్స్టాగ్రామ్లో జడేజాకు ఐదు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే జడ్డూ మాత్రం ఎవరిని ఫాలో అవ్వడం లేదు. కానీ తాజాగా మాత్రం జడేజా.. తనకు మంచి మిత్రుడైన ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్ను 24 గంటల పాటు ఫాలో అవ్వడం ఆసక్తి కలిగించింది. మరి లియోన్ను ఎందుకు ఫాలో అయ్యాడో తెలియదు కానీ.. తాను ఫాలో అయిన విషయాన్ని మాత్రం ఇన్స్టాలో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన స్ర్కీన్షాట్ పెట్టి.. ''మై ఫ్రెండ్ లియోన్ను 24 గంటలు ఫాలో అయ్యా'' అంటూ.. క్యాప్షన్ జత చేశాడు. జడ్డూ పోస్ట్ టీమిండియా అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. గ్రౌండ్లోనే అనుకున్నాం.. సోషల్ మీడియాలో కూడా ఆసీస్ క్రికెటర్లను నీడలా వెంటాడుతున్నావు ఎందుకు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి ఒకటి నుంచి జరగనుంది. చివరి రెండు టెస్టులకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న జైదేవ్ ఉనాద్కట్ను మిగతా రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. ఇక వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ను జట్టులో ఉంచినప్పటికి అతని వైస్ కెప్టెన్సీని మాత్రం తొలగించింది. దీనిని బట్టి రానున్న రోజ్లులో రాహుల్పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండో టెస్టులో విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు మరింత చేరువైంది. మూడో టెస్టులోనూ టీమిండియా విజయం సాధిస్తే ఫైనల్కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో ఆసీస్ క్లీన్స్వీప్ అయితే మాత్రం వారికి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం పోయినట్లే. అలా జరగకుండా ఉండాలంటే ఆసీస్ చివరి రెండు టెస్టులను కనీసం డ్రా అయినా చేసుకోవడానికి ప్రయత్నించాలి. Ravindra Jadeja is only following Nathan Lyon for 24 hours. pic.twitter.com/tAbAyI8LjZ — Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2023 చదవండి: ఉన్నపళంగా స్వదేశానికి ఆసీస్ కెప్టెన్.. పిచ్పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే -
లియోన్ మాయాజాలం.. ఐదేయడంతో పాటు అరుదైన రికార్డు
Nathan Lyon: ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ మరోసారి రెచ్చిపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. రెండో రోజు ఆట మొదలైనప్పటి నుంచే వీరలెవెల్లో విజృంభించిన లియోన్.. కేఎల్ రాహుల్ (17), రోహిత్ శర్మ (32), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4), శ్రీకర్ భరత్ (6)లను పెవిలియన్కు పంపాడు. తద్వారా టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టడంతో పాటు ఓ అరుదైన క్లబ్లో చేరాడు. స్పిన్ను సహకరించే వికెట్పై బంతిని గింగిరాలు తిప్పుతూ టీమిండియా ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న లియోన్.. టెస్ట్ల్లో భారత్పై 100 వికెట్లు తీసిన 3వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్ 100 వికెట్ల మైలురాయిని కేవలం 24 టెస్ట్ల్లో చేరుకోవడం మరో విశేషం. లియోన్కు ముందు జేమ్స్ ఆండర్సన్ (139), ముత్తయ్య మురళీథరన్ (105) మాత్రమే భారత్పై 100కు పైగా వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కేవలం 152 మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో కోహ్లి (44), జడేజా (26)లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. 10 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో టీమిండియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కోహ్లి అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలి కాగా.. జడేజా మర్ఫీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. లియోన్ 5 వికెట్లతో విజృంభించగా.. మర్ఫీ, మాథ్యూ కున్నెమన్ చెరో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ (4), అశ్విన్ (9) క్రీజ్లో ఉన్నారు. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 111 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
పుజారాపై పగపట్టిన లియోన్.. వందో టెస్ట్ అన్న కనికరం కూడా లేకుండా..!
Nathan Lyon-Pujara: కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారాపై ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ పగపట్టాడు. న్యూఢిల్లీ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పుజారాను డకౌట్ చేసి పెవిలియన్కు పంపిన లియోన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్న లియోన్.. తన కెరీర్లో ఓ బ్యాటర్ను అత్యధిక సార్లు ఔట్ చేసిన రికార్డును సవరించుకున్నాడు. లియోన్ తన టెస్ట్ కెరీర్లో పుజారాను అత్యధికంగా 11 సార్లు ఔట్ చేయడం ద్వారా తన బాధిత బ్యాటర్ల జాబితాలో పుజారాకు తొలిస్థానం కల్పించాడు. వందో టెస్ట్ ఆడుతున్నాడన్న కనికరం కూడా లేని లియోన్.. పుజారాను బాగా ఇబ్బంది పెట్టి వికెట్ల ముందు (ఎల్బీడబ్ల్యూ) దొరికించుకున్నాడు. లియోన్ బాధిత బ్యాటర్ల జాబితాలో పుజారా తర్వాత అజింక్య రహానే రెండో స్థానంలో ఉన్నాడు. లియోన్ రహానేను 10 సార్లు ఔట్ చేశాడు. ఆ తర్వాత సువర్ట్ బ్రాడ్ (9), బెన్ స్టోక్స్ (9), మొయిన్ అలీ (9), అలిస్టర్ కుక్ (8), టిమ్ సౌథీ (8) లను లియోన్ టెస్ట్ల్లో అత్యధిక సార్లు ఔట్ చేశాడు. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతుంది. తొలి రోజు భారత బౌలర్ల విజృంభణతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా లియోన్ బంతిని గింగిరాలు తిప్పుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే కేఎల్ రాహుల్ (17)ను పెవిలియన్కు పంపిన లియోన్.. ఆ తర్వాత రోహిత్ శర్మ (32), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4)లను వరుసగా ఔట్ చేశాడు. ఆతర్వాత కోహ్లి (36), జడేజా (26) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా.. ఈ సారి టాడ్ మర్ఫీ విజృంభించాడు. జడ్డూను మర్ఫీ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. జడేజా ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 125/5గా ఉంది. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 138 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. 4 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఆస్ట్రేలియా ఫీల్డర్ అద్భుత విన్యాసం.. షాక్లో శ్రేయాస్! వీడియో వైరల్
ఢిల్లీ వేదికగా భారత్తో జరగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ హ్యాండ్కాంబ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. హ్యాండ్కాంబ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్తో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను పెవిలియన్కు పంపాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్ వేసిన నాథన్ లియోన్ బౌలింగ్లో రెండో బంతిని అయ్యర్ లెగ్సైడ్ ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఫస్ట్ షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హ్యాండ్కాంబ్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. అయితే బంతి తొలుత నేరుగా అతడి చేతికి తగిలి కాస్త పైకి వెళ్లింది. వెంటనే అతడు వెంటనే డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ను తీసుకున్నాడు. ఇక ఇది చూసిన అయ్యర్ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ సంచలన క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇక తొలి ఇన్నింగ్స్లో లియోన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 15 ఓవర్లు బౌలింగ్ చేసిన లియోన్.. 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక 45 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(30), రవీంద్ర జడేజా(25) భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే పనిలో పడ్డారు. చదవండి: ENG vs NZ: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా Very good catch by Peter Handscomb in IND vs AUS 2nd test match #IndVsAus2023 #IndvsAus2ndtest #BGT2023 #BGT23 pic.twitter.com/jNYjnqBixL — sportsliveresults (@Ashishs92230255) February 18, 2023 -
ఇదేమి బాల్రా బాబు.. దెబ్బకు రోహిత్ శర్మ షాక్! వైరల్
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. తొలుత ఎల్బీ రూపంలో కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపిన లియోన్.. అనంతరం రోహిత్ శర్మ, పూజారా, శ్రేయస్ అయ్యర్ను ఔట్ చేశాడు. ఇప్పటివరకు 11ఓవర్లు బౌలింగ్ చేసిన లియోన్.. 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. లంచ్ విరామానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 88 పరుగుల చేసింది. లియోన్ సూపర్ డెలివరీ.. రోహిత్ క్లీన్ బౌల్డ్ కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అద్భుతమైన బంతితో లియోన్ బోల్తా కొట్టించాడు. భారత్ ఇన్నింగ్స్ 20 ఓవర్లో లియోన్ వేసిన ఓ సంచలన బంతికి రోహిత్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆఫ్సైడ్ పడిన బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి రోహిత్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్ను గిరాటేసింది. ఇది చూసిన రోహిత్ ఒక్క సారిగా షాక్కు గురయ్యాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రోహిత్ 32 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. -
BGT 2023: ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం? ఏంటిది పుజారా!
India vs Australia, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా ‘నయావాల్’ ఛతేశ్వర్ పుజారాకు చేదు అనుభవం ఎదురైంది. కెరీర్లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్లో అతడు డకౌట్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే భారంగా పెవిలియన్ చేరాడు. వందో టెస్టులో సెంచరీ బాది సత్తా చాటాలని ఆశపడిన అభిమానులను ఉసూరుమనిపించాడు. లియోన్ దెబ్బకు మూడు వికెట్లు ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 17) ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ఆరంభమైంది. భారత బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియా తొలి రోజే 263 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలో 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ను నాథన్ లియోన్ అవుట్ చేశాడు. దీంతో అతడి స్థానంలో పుజారా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను బౌల్డ్ చేసిన లియోన్.. అదే ఓవర్లో పుజారాను(19.4 ఓవర్) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు వెనుదిరగక తప్పలేదు. కాగా ఛతేశ్వర్ పుజారా కెరీర్లో ఇది వందో టెస్టు అన్న విషయం తెలిసిందే. వాళ్ల తర్వాత కాగా భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 13వ క్రికెటర్గా పుజారా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్దేవ్, సునీల్ గావస్కర్, వెంగ్ సర్కార్, గంగూలీ, కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ఒకే ఒక్కడు ఇక అంతర్జాతీయ టి20 ఫార్మాట్ మొదలయ్యాక ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడకుండానే 100 టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ పుజారా. చదవండి: IND vs AUS: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం! Ind Vs Aus 2023 2nd Test: అంపైర్పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. బ్యాట్ను గట్టిగా బాదుతూ! వీడియో వైరల్ -
ఇక్కడికి వచ్చే ముందు వీడియోలు చూస్తూనే ఉన్నా.. నా భార్య విసిగెత్తిపోయింది!
India vs Australia Test Series: సమకాలీన క్రికెటర్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల తనకెంతో ఆసక్తి ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్ అన్నాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనకెన్నో సలహాలిచ్చాడని.. అతడితో మాట్లాడటం తనకెంతో ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా రైట్ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ అయిన నాథన్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్. కీలక బౌలర్గా.. ఇప్పటి వరకు ఆసీస్ తరఫున 116 టెస్టులాడిన అతడు 461 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అతడు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. స్పిన్కు అనుకూలించే ఉపఖండ పిచ్లపై జట్టుకు మరింత కీలకంగా మారాడు. అయితే, నాగ్పూర్లోని తొలి టెస్టులో అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఏడు వికెట్లతో సత్తా చాటగా.. నాథన్ లియోన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. అరంగేట్ర టెస్టు ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను అవుట్ చేశాడు. నాథన్ లియోన్ అశ్విన్ అంటే వణుకు మరోవైపు.. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ మొత్తంగా 8, రవీంద్ర జడేజా 7 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి టెస్టులో విజయంతో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్.. ఢిల్లీ మ్యాచ్లోనూ ఆసీస్ను మట్టికరిపించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే.. అశ్విన్ అంటే ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఎంత భయమో.. సిరీస్ ఆరంభానికి ముందే మరోసారి బయటపడిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఈ రైట్ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ను ఎదుర్కొనేందుకు తన డూప్లికేట్గా భావిస్తున్న మహేశ్ పితియా అనే యువ బౌలర్తో నెట్స్లో స్టీవ్ స్మిత్ తదితరులు ప్రాక్టీసు చేశారు. కానీ అసలు సమయానికి అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు. అశ్విన్ వీడియోలు చూస్తూనే ఉన్నా.. నా భార్య విసిగెత్తిపోయింది! ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన నాథన్ లియోన్ అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అశ్విన్ అంటే ఏమిటో అతడి రికార్డులే చెబుతాయి. నేనైతే అశూకు పూర్తిగా భిన్నమైన బౌలర్ను. నాకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. అయితే, ఇక్కడికి(ఇండియా) వచ్చే ముందు ఇంట్లో కూర్చుని అశ్విన్ ఫుటేజీలన్నీ చూశాను. లాప్టాప్లో తన బౌలింగ్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉండిపోయాను. నా ప్రవర్తన చూసి నా భార్య విసిగెత్తిపోయింది’’ అంటూ నాథన్ లియోన్ వ్యాఖ్యానించాడు. ఎన్నో సలహాలు, సూచనలు అశ్విన్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్న నాథన్ లియోన్... ‘‘ఆటలో ఉన్న గొప్పదనం అదే. ప్రతి రోజూ మరిన్ని మెరుగులు దిద్దుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యర్థిని గమనించడం, వారి బలాబలాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అశ్విన్తో కలిసి కూర్చుని మాట్లాడినపుడు అతడు నాకెన్నో విషయాలు చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఉన్నపుడు కూడా మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. తను వైవిధ్యం కనబరచ గల బౌలర్. తన నైపుణ్యం అమోఘం. అందుకే అతడి నుంచి నేర్చుకున్న విషయాలు నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయని భావిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: టెస్టుల్లోనూ నెంబర్వన్.. కెప్టెన్గా రోహిత్ శర్మ కొత్త చరిత్ర Shubman Gill-Sara Tendulkar: వాలెంటైన్స్ డే ఎంత పని చేసింది.. శుభ్మన్, సారా రిలేషన్ను బయటపెట్టింది..! -
చరిత్ర సృష్టించిన నాథన్ లయోన్.. నో బాల్ వేయకుండా 30,000 బంతులు
146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ ఈ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్లో లయోన్ ఈ ఫీట్ను సాధించాడు. ఇంతకీ లయోన్ సాధించిన ఆ రికార్డు ఏంటంటే.. 1877లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఒకే ఒక్క బౌలర్ (కనీసం 100 టెస్ట్లు ఆడిన క్రికెటర్) టెస్ట్ల్లో కనీసం ఒక్క నో బాల్ కూడా వేయకుండా 30,000 బంతులను బౌల్ చేశాడు. ఆ మహానుభావుడే నాథన్ లయోన్. 2011లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన లయోన్.. ఇప్పటివరకు 115 టెస్ట్ మ్యాచ్లు ఆడి 460 వికెట్లను పడగొట్టాడు. Nathan Lyon today bowled his 30,000th delivery in Test cricket without ever overstepping. Not a single line no-ball in entire career. — Mazher Arshad (@MazherArshad) February 11, 2023 12 ఏళ్ల కెరీర్లో 100కు పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడిన లయోన్ ఒక్కసారి కూడా క్రీజ్ దాటకపోవడమనేది సాధారణ విషయం కాదు. సుదీర్ఘ కెరీర్లో ఇంత పద్ధతిగా, క్రమశిక్షణగా, స్థిరంగా బౌలింగ్ చేయడమనేది నేటి జనరేషన్లో అస్సలు ఊహించలేము. పొట్టి ఫార్మాట్లో ఇటీవలికాలంలో మన టీమిండియా బౌలర్ ఒకరు ఒకే ఓవర్ ఏకంగా ఐదు సార్లు క్రీజ్ దాటి బౌలింగ్ చేసిన ఘటన కళ్లముందు మెదులుతూనే ఉంది. టెస్ట్ క్రికెట్లో ఏ బౌలర్కు సాధ్యంకాని ఈ రికార్డును 35 ఏళ్ల లయోన్ నమోదు చేసినట్లు ప్రముఖ గణాంకవేత్త మజర్ అర్షద్ వెలుగులోకి తెచ్చాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా లయోన్ ఈ రేర్ ఫీట్ను సాధించినట్లు మజర్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్ శర్మ (120) సెంచరీతో, అశ్విన్ (3/42, 5/37) 8 వికెట్లతో, అక్షర్ పటేల్ (84) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విజృంభించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకే చాపచుట్టేయగా.. టీమిండియా 400 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లతో విజృంభించగా.. కమిన్స్ 2, లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు అశ్విన్, జడేజా, షమీ (2/13), అక్షర్ పటేల్ (1/6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్ కేవలం 91 పరుగులకే టపా కట్టేసి ఇన్నింగ్స్ ఓటమిని ఎదుర్కొంది. -
ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!!
India vs Australia, 1st Test Day 2- Suryakumar Yadav: టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అరంగేట్ర టెస్టులో తీవ్రంగా నిరాశపరిచాడు. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో డెబ్యూ చేసిన సూర్య.. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. భారత ఇన్నింగ్స్ 60 ఓవర్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ వేసిన ఓ అద్భుతమైన బంతికి సూర్యకుమార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆఫ్సైడ్ పడిన బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో సూర్య ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్యకుమార్ తల ఊపుతూ నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు కాదని సూర్యకుమార్ యాదవ్కు తుది జట్టులో చోటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సూర్య తొలి మ్యాచ్లోనే సింగిల్ డిజిట్ స్కోర్కు పరిమితం కావడంతో.. అతడు టెస్టులకు సెట్కాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరి కొంత మంది సూర్య స్థానంలో గిల్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం! ఆసుపత్రికి తరలింపు Agressive intent 🤣🤣☝️☝️#SuryakumarYadav #shubhmangill pic.twitter.com/MMM8f05PCA — Gill Stan (@gillified_) February 10, 2023 The Range of Sky#SuryakumarYadav pic.twitter.com/Un30ET8Y4o — 𝙃𝙖𝙧𝙞𝙨𝙝🌾 (@Paisabarbaadbc1) February 3, 2023 SKY makes his TEST DEBUT as he receives the Test cap from former Head Coach @RaviShastriOfc 👏 👏 Good luck @surya_14kumar 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/JVRyK0Vh4u — BCCI (@BCCI) February 9, 2023 -
భారత్లో టెస్టు సిరీస్ గెలవడం.. యాషెస్ విజయం కంటే గొప్పది!
India Vs Australia - BGT 2023: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి పందొమ్మిదేళ్లకు పైనే అయింది. చివరిసారిగా 2004లో కంగారూలు భారత్లో ఈ ఫీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు మళ్లీ ఇక్కడ టెస్టు సిరీస్ ట్రోఫీ గెలిచిందే లేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాలని ప్యాట్ కమిన్స్ బృందం ఉవ్విళ్లూరుతోంది. గెలుపు కోసం ఆసీస్ తహతహ సొంతగడ్డపై వరుస సిరీస్లు గెలిచి సత్తా చాటిన ఆసీస్.. భారత్లోనూ అలాంటి ఫలితాలే రాబట్టాలని కోరుకుంటోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సిరీస్ ఫైనల్ చేరే క్రమంలో ఈ ఫీట్ నమోదు చేయాలనే తలంపుతో ఉంది. ఇందుకు తగ్గట్లుగా నెట్స్లో తీవ్రంగా కష్టపడుతోంది. ఓవరాల్గా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత్కు ఉన్న ఆధిక్యాన్ని తగ్గించాలని ఆశపడుతోంది. యాషెస్ కంటే పెద్ద విజయం ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ సారథి, ప్రస్తుత వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఈ టెస్టు సిరీస్కు ఉన్న ప్రాముఖ్యాన్ని మరోసారి తెలియజేశాయి. క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ.. ‘‘అక్కడ టెస్టు సిరీస్ కాదు.. టెస్టు మ్యాచ్ గెలవడమే అత్యంత కష్టంతో కూడుకున్న పని. మనం ఆ కొండను ఢీకొట్టగలిగితే.. గండాన్ని దాటగలిగితే.. అంతకంటే మించిన విజయం మరొకటి ఉండదు. మనం భారత్లో సిరీస్ గెలిస్తే.. దానిని యాషెస్ కంటే గొప్ప విజయంగా భావించవచ్చు’’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక స్పిన్నర్ నాథన్ లియోన్ మాట్లాడుతూ.. టీమిండియాలో సిరీస్ గెలవాలంటే కఠినంగా శ్రమించకతప్పదని.. అందులో తమ పాత్ర(స్పిన్ బౌలర్లు) మరింత కీలకం కానుందని పేర్కొన్నాడు. అవును.. అంత వీజీ కాదు! కాగా ఆసీస్ ఆటగాళ్లు అంగీకరించినట్లు.. స్వదేశంలో పటిష్ట టీమిండియాను ఢీకొట్టడం ఆసీస్కు అంత తేలికకాదు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ల రూపంలో కంగారూ బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఇక ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా రోహిత్ సేన- ప్యాట్ కమిన్స్ బృందం మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: JSK Vs MICT: రషీద్ విఫలం.. ముగిసిన ఎంఐ కథ.. టోర్నీ నుంచి అవుట్.. మనకేంటీ దుస్థితి? Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ ఇదీ చదవండి: ‘శవాన్ని కాల్చేస్తారు.. బూడిదను తీసుకువెళ్తారు’.. బ్లిగ్ పెళ్లి.. అసలు బూడిద ఉన్న ట్రోఫీ ఎక్కడ? What’s tougher: An India tour, or away Ashes series? The Aussie Test stars have their say #INDvAUS pic.twitter.com/ljF0II6LBo — cricket.com.au (@cricketcomau) February 6, 2023 -
అశ్విన్ను వెనక్కునెట్టిన ఆసీస్ స్పిన్నర్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8వ బౌలర్గా..!
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. పెర్త్ వేదికగా వెస్డిండీస్తో జరిగిన తొలి టెస్ట్లో 8 వికెట్లు (2/61, 6/128) పడగొట్టిన లయోన్.. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను (86 టెస్ట్ల్లో 442 వికెట్లు) అధిగమించాడు. కెరీర్లో 111 టెస్ట్లు ఆడిన లయోన్ ఖాతాలో ప్రస్తుతం 446 వికెట్లు ఉన్నాయి. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ (133 మ్యాచ్ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ (145 మ్యాచ్ల్లో 708 వికెట్లు), ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (178 మ్యాచ్ల్లో 668 వికెట్లు), భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (132 టెస్ట్ల్లో 619 వికెట్లు), ఇంగ్లండ్ స్టువర్ట్ బ్రాడ్ (159 మ్యాచ్ల్లో 566 వికెట్లు), ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ (124 టెస్ట్ల్లో 563 వికెట్లు), విండీస్ గ్రేట్ వాల్ష్ (132 టెస్ట్ల్లో 519 వికెట్లు) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, విండీస్తో జరిగిన తొలి టెస్ట్లో మార్నస్ లబూషేన్ (204, 104 నాటౌట్), స్టీవ్ స్మిత్ (200 నాటౌట్, 20 నాటౌట్), నాథన్ లయోన్ (2/61, 6/128) చెలరేగడంతో ఆతిధ్య ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో లబూషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (65) అర్ధసెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్ (99) పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. మిచెల్ స్టార్క్ (3/51), పాట్ కమిన్స్ (3/34), లయోన్ (2/61) ధాటికి 283 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ (64), టగెనరైన్ చంద్రపాల్ (51) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో లబూషేన్ మరోసారి సెంచరీతో రెచ్చిపోవడంతో ఆ జట్టు 182/2 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 498 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఛేదనలో లయోన్ తిప్పేయడంతో విండీస్ 333 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 164 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ (110) శతకంతో రాణించగా, రోస్టన్ ఛేజ్ (55) అర్ధసెంచరీతో పర్వాలేదనిపించాడు. 2 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో తదుపరి మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది. -
లేటు వయసులో ఘాటైన ప్రేమ.. గర్ల్ఫ్రెండ్ను పెళ్లాడిన ఆసీస్ స్టార్
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక ఇంటివాడయ్యాడు. 34 ఏళ్ల లియాన్.. తన చిన్ననాటి గర్ల్ఫ్రెండ్ ఎమ్మా మెక్కార్తీని పెళ్లాడాడు. ఐదేళ్లుగా ఎమ్మాతో డేటింగ్లో ఉన్న లియాన్ ఘాటైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు. తాజాగా ఆదివారం సాయంత్రం బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాథన్ లియాన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. వాస్తవానికి గతేడాది లియాన్.. గర్ల్ఫ్రెండ్ ఎమ్మాకు డైమండ్ రింగ్ తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకొని రూమర్లకు తెరదించాడు. కాగా నాథన్ లియాన్ ఇది వరకే మెల్ వారింగ్తో వివాహం కాగా.. ఐదేళ్ల క్రితమే విడిపోయారు. లియాన్- మెల్ వారింగ్ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. ఇక ఆఫ్ స్పిన్నర్ అయిన నాథన్ లియాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే లంకతో టెస్టు సిరీస్ ద్వారా 438వ వికెట్ సాధించిన లియాన్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్-10లోకి ఎంటరయ్యాడు. ఇక లియాన్ ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు(తొలి రెండు స్థానాల్లో షేన్ వార్న్ 708 వికెట్లు, గ్లెన్ మెక్గ్రాత్ 563 వికెట్లు). కాగా 2011లో శ్రీలంకతో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాథన్ లియాన్ ఆసీస్ తరపున 110 టెస్టుల్లో 438 వికెట్లు, 29 వన్డేల్లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో లియాన్ 20 సార్లు ఐదు వికెట్ల హాల్... మూడుసార్లు 10 వికెట్ల హాల్ అందుకున్నాడు. View this post on Instagram A post shared by Nathan Lyon (@nath.lyon421) చదవండి: మగ బిడ్డకు జన్మనిచ్చిన కృనాల్ పాండ్యా భార్య పంఖురి శర్మ క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా -
ఐదేసిన లయన్.. లంకను కట్టడి చేసిన ఆసీస్
Nathan Lyon: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో పర్యాటక ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 212 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (5/90) లంక పతనాన్ని శాశించగా, స్వెప్సన్ (3/55), స్టార్క్ (1/31), కమిన్స్ (1/25) తలో చేయి వేశారు. లంక ఇన్నింగ్స్లో వికెట్కీపర్ నిరోషన్ డిక్వెల్లా (58) అర్ధసెంచరీతో రాణించగా మిగతా ఆటగాళ్లంతా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు కరుణరత్నే (28), నిస్సంక (23), మాథ్యూస్ (39), ఆర్ మెండిస్ (22), ధనంజయ డిసిల్వా (14) రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు..డేవిడ్ వార్నర్ (25), ఉస్మాన్ ఖ్వాజా (47 నాటౌట్) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 47 పరుగులు జోడించాక వార్నర్ మెండిస్ బౌలింగ్లో ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. వార్నర్ పెవిలియన్కు చేరాక ఆసీస్ స్వల్ప వ్యవధిలో లబూషేన్ (13), స్టీవ్ స్మిత్ (6)ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఖ్వాజా, ట్రవిస్ హెడ్ (6) క్రీజ్లో ఉన్నారు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 2 వికెట్లు పడగొట్టగా, స్టీవ్ స్మిత్ రనౌటయ్యాడు. కాగా, లంక పర్యటనలో ఆసీస్ టీ20 సిరీస్ను (2-1) కైవసం చేసుకుని వన్డే సిరీస్ను (2-3) చేజార్చుకున్న విషయం తెలిసిందే. చదవండి: ఇంగ్లండ్తో ఐదో టెస్ట్కు టీమిండియా కెప్టెన్ ఎవరంటే..!? -
తిప్పేసిన లియోన్.. పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన ఆసీస్
3 టెస్ట్ల సిరీస్లో భాగంగా లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్లో పాకిస్థాన్ బొక్క బోర్లా పడింది. 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 235 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఖరి టెస్ట్లో115 పరుగుల తేడాతో ఓటమిపాలై, 0-1 తేడాతో సిరీస్ను చేజార్చుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాక్ గడ్డపై దాదాపు రెండున్నర దశాబ్దాల (24 ఏళ్లు) చరిత్రను తిరగరాసింది. 1998/99లో మార్క్ టేలర్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు చివరిసారిగా పాక్ గడ్డపై సిరీస్ విజయం (1-0) సాధించింది. ఈ పర్యటనలోని తొలి రెండు టెస్ట్లు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, 351 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి రోజు ఆటను 73/0 ఓవర్నైట్ స్కోర్తో ప్రారంభించిన పాక్.. ఓ దశలో చారిత్రక విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ బౌలర్లు నాథన్ లియోన్ (5/83), పాట్ కమిన్స్ (3/23) పాక్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశారు. పాక్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (55), ఇమామ్ ఉల్ హక్ (70) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించగా, మిగతా వారంతా దారుణంగా నిరుత్సాహపరిచారు. ఈ మ్యాచ్లో 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు) చెలరేగిన కమిన్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికవగా, సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఉస్మాన్ ఖవాజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. స్కోరు బోర్డు : ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 391 ఆలౌట్ (ఉస్మాన్ ఖ్వాజా 91, స్టీవ్ స్మిత్ 59, గ్రీన్ 79, అలెక్స్ క్యారీ 67, షాహీన్ అఫ్రిది 4/79, నసీమ్ షా (4/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 268 ఆలౌట్ (షఫీక్ 81, అజహర్ అలీ 78, బాబర్ ఆజమ్ 67, పాట్ కమిన్స్ 5/56, స్టార్క్ (4/33)) ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్ 227/3 డిక్లేర్డ్ (ఉస్మాన్ ఖ్వాజా 104 నాటౌట్, వార్నర్ 51) పాకిస్థాన్ సెకెండ్ ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (ఇమామ్ ఉల్ హాక్ 70, బాబర్ ఆజమ్ 55, నాథన్ లియోన్ (5/83), కమిన్స్ (3/23)) చదవండి: చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు -
టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా!
రావల్పిండి వేదికగా పాకిస్తాన్ జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్లో.. అఖరి బంతిని ఇమామ్-ఉల్-హక్ సిక్సర్ బాదాడు. దీంతో టెస్టులో 250 సిక్స్లు సమర్పించుకున్న తొలి బౌలర్గా లియాన్ నిలిచాడు. ఇక రెండో స్ధానంలో శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరత్ 194 సిక్స్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలతో చెలరేగాడు. మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల చేసి డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో అజార్ అలీ (185), ఇమామ్-ఉల్-హక్ (157) అద్భుంగా రాణించారు. ఇక ఆస్ట్రేలియా కూడా పాక్కు ధీటుగా బదులు ఇచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 459 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మాన్ ఖవాజా (97), మార్న్ లబుషేన్ (90) పరుగులతో రాణించారు. మ్యాచ్ అఖరి రోజు వికెట్ నష్టపోకుండా పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Viral Video: భాంగ్రా నృత్యంతో అదరగొట్టిన వార్నర్ -
తాగింది చాలు.. ఇక దయచేయండి! క్రికెటర్లకు ఘోర అవమానం.. తరిమేసిన పోలీసులు!
Ashes Series: హోబర్ట్ వేదికగా ఐదో టెస్టులో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి యాషెస్ సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది ఆస్ట్రేలియా. 4-0 తేడాతో యాషెస్ ట్రోఫీని కైవసం చేసుకుని సత్తా చాటింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీలో ఎంజాయ్ చేస్తూ సంతోషంలో మునిగితేలారు. వీళ్లు ఆనందంతో తాగితే... ఇంగ్లండ్ క్రికెటర్లు బాధతో బాటిళ్లు చేతబట్టారు. ఏదైనా సరే శ్రుతి మించనంత వరకే కదా సాఫీగా సాగేది! ఒక్కసారి అదుపు తప్పితే ఇక అంతే సంగతులు! విమర్శల పాలు కాక తప్పదు. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి హోటల్ నుంచి వెళ్లగొట్టే దుస్థితి తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఆసీస్ ఆటగాళ్లు అలెక్స్ క్యారీ, నాథన్ లియాన్ సహా పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ‘‘మరీ అల్లరి ఎక్కువైంది. తొందరగా ప్యాక్ చేసుకోవాలి.. అందుకే మేమిక్కడికి వచ్చాము. వెళ్లి నిద్రపోండి. థాంక్యూ’’అంటూ ఓ పోలీసు వాళ్లను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ విషయం గురించి టాస్మానియా పోలీసులు మాట్లాడుతూ... ‘‘క్రౌన్ ప్లాజా హోబర్ట్ నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందింది. కొంతమంది తాగిన మత్తులో అక్కడ రభస చేస్తున్నారని చెప్పారు. ఉదయం ఆరు గంటల సమయంలో మా వాళ్లు అక్కడికి వెళ్లి తాగిన వాళ్లను అక్కడి నుంచి పంపించేశారు. అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని స్పష్టం చేశారు. యాషెస్ సిరీస్ 2021-2022లో ఆస్ట్రేలియా విజయ పరంపర: బ్రిస్బేన్ టెస్టు- 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఆసీస్ గెలుపు అడిలైడ్ టెస్టు: 275 పరుగుల తేడాతో ఘన విజయం మెల్బోర్న్ టెస్టు: ఇన్నింగ్స్ మీద 14 పరుగుల తేడాతో భారీ విజయం సిడ్నీ టెస్టు: డ్రా హోబర్ట్ టెస్టు: 146 పరుగుల తేడాతో కంగారూల జయకేతనం చదవండి: Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లివే: సిరాజ్ భావోద్వేగం Police moving on early morning Ashes party. Story on https://t.co/fDqIhz1nzH #ashes @9NewsAUS pic.twitter.com/9XC39GoWUv — Tim Arvier (@TimArvier9) January 18, 2022 -
Ashes 1st Test: ఆసీస్ బౌలర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు
Nathan Lyon: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ పలు అరుదైన ఘనతలను సాధించాడు. ఈ మ్యాచ్లో డేవిడ్ మలాన్ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన లియోన్.. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ఏషియన్ ఆఫ్ స్పిన్నర్గా, రెండో నాన్ ఏషియన్ స్పిన్ బౌలర్గా(షేన్ వార్న్(708)), మూడో ఆసీస్ బౌలర్గా(వార్న్, మెక్గ్రాత్(563)), ఓవరాల్గా ఈ ఘనత సాధించిన17వ బౌలర్గా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 34 ఏళ్ల నాథన్ లియోన్ ఈ మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా 101 టెస్ట్ల్లో 403 వికెట్లు సాధించాడు. కాగా, ఈ మ్యాచ్లో మరో విశేషం కూడా ఉంది. లియోన్ గతేడాది జనవరిలో ఇదే వేదికపై తన 399వ వికెట్ సాధించాడు. నాటి నుంచి దాదాపు ఏడాదిపాటు ఒక్క వికెట్ కోసం ఎదురు చూసిన లియోన్.. ఈ మ్యాచ్లో ఆ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ఆసీస్.. పర్యాటక ఇంగ్లండ్పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 20 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 5 టెస్ట్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు బోర్డు: ఇంగ్లండ్ 147 & 297 ఆస్ట్రేలియా 425 & 20/1 చదవండి: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. -
వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర
Nathan Lyon 400 Wicket Milestone In Test Cricket.. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ టెస్టుల్లో 400వ వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా గబ్బా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో డేవిడ్ మలాన్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. లియోన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు), గ్లెన్ మెక్గ్రాత్(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఓవరాల్గా చూసుకుంటే 400 వికెట్ల మార్క్ను చేరుకున్న 17వ బౌలర్గా నిలిచాడు. చదవండి: Ashes Series: ఓవైపు మ్యాచ్.. మరోవైపు ప్రపోజల్.. ఇక్కడ మరో విశేషమేమిటంటే నాథన్ లియోన్ గతేడాది జనవరిలో ఇదే గబ్బా మైదానంలో టీమిండియాతో జరిగిన టెస్టులో వాషింగ్టన్ సుందర్ను ఔట్ చేయడం ద్వారా 399 వ వికెట్ సాధించాడు. అప్పటినుంచి దాదాపు ఏడాదిపాటు ఒక వికెట్ తీయడం కోసం ఎదురుచూడడం ఆసక్తి కలిగించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా ఎక్కువగా టెస్టులు ఆడకపోవడం.. గాయాలతో లియోన్ దూరమవ్వడం.. ఇక తాను ఆడిన రెండు, మూడు టెస్టులోనూ లియోన్ 33 ఓవర్లపాటు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. ఎట్టకేలకు యాషెస్ సిరీస్లో వికెట్ తీయడం ద్వారా లియోన్ చరిత్ర సృష్టించాడు. చదవండి: Ashes Test Series: మార్క్వుడ్ బీమర్.. బ్యాట్స్మన్ దవడ పగలింది 400 Test Match Wickets For Nathan Lyon 👏 - Third Australian player to scalp 400 wickets in Tests - 17th man overall to reach the milestone AUSTRALIA'S MOST SUCCESSFUL OFF SPINNER 🐐 . .#Cricket #AUSvENG #Ashes #Ashes21pic.twitter.com/wgVcaFynmN — CRICKETNMORE (@cricketnmore) December 11, 2021 -
Tim Paine: టిమ్ బెస్ట్ వికెట్ కీపర్.. తను డ్రెస్సింగ్ రూంలో ఉంటే చాలు!
Nathan Lyon Said Tim Paine Want the World Best Wicketkeeper in Team: మహిళకు అసభ్య సందేశాలు పంపాడన్న ఆరోపణల నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా టెస్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్కు సహచర ఆటగాడు నాథన్ లియాన్ మద్దతుగా నిలిచాడు. కేవలం ఆస్ట్రేలియాలోనే కాకుండా... ప్రపంచం మొత్తంలో అత్యుత్తమ వికెట్ కీపర్ టిమ్ అని కొనియాడాడు. అతడు డ్రెస్సింగ్రూంలో ఉంటే వాతావరణం బాగుంటుందన్నాడు. అంతేతప్ప పైన్ కారణంగా ఆటగాళ్ల దృష్టి ఇతర విషయాలకు మళ్లుతుందనుకోవడం సరికాదని చెప్పుకొచ్చాడు. కాగా 2017లో ఓ మహిళకు అభ్యంతరకర మెసేజ్లు పంపినట్లు అంగీకరించిన పైన్.. టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ముందు ఈ మేరకు ప్రకటన చేయడంతో.. జట్టులో అతడికి చోటు ఉంటుందా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడు గనుక జట్టుతో చేరితే ఇటీవల పరిణామాల ప్రభావం ఇతర ఆటగాళ్లపై పడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ మట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో దేశంలోనే కాదు.. ప్రపంచంలో కూడా అత్యుత్తమ వికెట్ కీపర్ టిమ్. ఆసీస్ డ్రెస్సింగ్రూంలో వందకు వంద శాతం తనకు మద్దతు లభిస్తుందని నమ్ముతున్నా. తన కారణంగా మా దృష్టి మళ్లుతుందనడం సరికాదు. మేము ప్రొఫెషనల్ ఆటగాళ్లం. మా పని క్రికెట్ ఆడటం మాత్రమే. ఇతర విషయాలను పట్టించుకోము. ఆటగాళ్లుగా మా విధులేమిటన్న అంశంపై మాత్రమే దృష్టి సారిస్తాం’’ అని క్రిక్బజ్తో వ్యాఖ్యానించాడు. ఇక సెలక్షన్కు తాను అందుబాటులో ఉంటానని పైన్ స్పష్టం చేసిన నేపథ్యంలో... బెస్ట్ వికెట్ కీపర్ జట్టులోకి రావాలని తాను కోరుకుంటానని, ఒక బౌలర్గా ఇది తన స్వార్థమని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022 Auction- KL Rahul: లక్నో జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్..! ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధం? IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో -
పుజారాకు అశ్విన్ సవాల్..!
చెన్నై: అగ్రశ్రేణి స్పిన్నర్గా భారత్కు ఎన్నో అద్భుత విజయాలు అందించినా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ సత్తాపై అనేక మార్లు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. తాజా సిరీస్కు ముందు ఆస్ట్రేలియా గడ్డపై అతను విఫలమైన విషయాన్ని పదే పదే అందరూ గుర్తు చేశారు. విదేశాల్లో రాణించలేడనే అపవాదూ అతనిపై ఉండేది. ఒక దశలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్, ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీలు కూడా అతనికంటే మెరుగైన వారని కథనాలు వచ్చాయి. అయితే ఈ సిరీస్లో 28.83 సగటుతో 12 వికెట్లు తీసిన అశ్విన్ జట్టు సిరీస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ పోరులో టాప్ బ్యాట్స్మన్ స్మిత్ను అవుట్ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు. ‘ఒక మ్యాచ్కు ముందు నేను సొంతంగా హోమ్ వర్క్ చేసుకుంటాను. ఎనిమిది గంటల పాటు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వీడియోలు చూస్తాను. ఆపై మ్యాచ్లో ఎక్కడ, ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో నిర్ణయించుకుంటా. టిమ్ పైన్ను మెల్బోర్న్లో అలాగే అవుట్ చేశా. స్మిత్ను ఎవరు అవుట్ చేస్తారనే దానిపై బాగా చర్చ జరిగింది. ఎవరూ నా గురించి మాట్లాడనే లేదు. ఆసీస్ గడ్డపై స్మిత్ ఎప్పుడూ స్పిన్నర్ల బౌలింగ్లో అవుట్ కాలేదు. నేను దానిని మార్చాలనుకున్నా. ప్రపంచంలో నన్ను నేను అత్యుత్తమ బౌలర్గా భావించుకుంటా. అలాగే అత్యుత్తమ బ్యాట్స్మన్ను అవుట్ చేయాలని కోరుకుంటా. కోహ్లితో తలపడలేను కాబట్టి స్మిత్తో తలపడ్డా. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశా’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. లయన్, అలీలతో పోలుస్తూ తనను మరీ ‘మైక్రోస్కోప్’ కింద ఉంచి పరీక్షించారని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్లో అశ్విన్కంటే లయన్ ప్రదర్శన బాగుండగా... 2018 సౌతాంప్టన్ టెస్టులో అలీ వికెట్లు తీసిన చోట అశ్విన్ విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘లయన్గానీ అలీగానీ సరిగ్గా ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్ నుంచి వార్న్ వాటిని అద్భుతంగా వర్ణించినంత మాత్రాన నేను అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదు. వారు భారత బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. నేను ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్కు బౌలింగ్ చేస్తున్నాను. గత సిరీస్లో అడిలైడ్లో నా పొత్తికడుపులో గాయమైనా సరే పట్టుదలగా ఆడి ఆరు వికెట్లు తీశాను. కానీ మ్యాచ్ ముగిశాక నాకంటే లయన్ ఎంత బాగా బౌలింగ్ చేశాడో అందరూ చెప్పుకున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. లయన్ మంచి బౌలరే. అతనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా ఆలోచనలు వేరు. ఇకపై లయన్తో పోటీ పడటంకంటే స్మిత్తో తలపడటం ముఖ్యమని అర్థం చేసుకున్నా’ అని అశ్విన్ వివరించాడు. అర మీసంతో ఆడతా! సహచరుడు పుజారాకు అశ్విన్ సరదాగా సవాల్ విసిరాడు. ఇంగ్లండ్తో సిరీస్లో మొయిన్ అలీతో పాటు మరే స్పిన్నర్ బౌలింగ్లోనైనా పుజారా పిచ్పై ముందుకు దూసుకొచ్చి బౌలర్ తల మీదుగా భారీ షాట్ ఆడితే తాను సగం మీసం తీసేస్తానని... అలాగే మైదానంలో మ్యాచ్ ఆడతానని అశ్విన్ వ్యాఖ్యానించాడు. -
బాధ్యత లేని రోహిత్; హిట్మ్యాన్ స్పందన
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో అవుటైన తీరుపై తాను పశ్చాత్తాపడటం లేదని హిట్మ్యాన్ రోహిత్ శర్మ అన్నాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని, వాటిని ఆమోదించేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. నాథన్ లయన్ స్మార్ట్ బౌలర్ అన్న రోహిత్.. అతడు బంతి విసిరిన విధానం వల్లే తాను అనుకున్న షాట్ కొట్టలేకపోయానని తనను తాను సమర్థించుకున్నాడు. కాగా గబ్బాలో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 62 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి శుభ్మన్ గిల్ ఔట్ కాగా, లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి వైస్ కెప్టెన్ అవుట్ అయ్యాడు. అయితే, సులభమైన క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోవడంపై అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ షాట్ సెలక్షన్ బాగాలేదని విమర్శిస్తున్నారు.(చదవండి: ఏమాత్రం బాధ్యత లేని రోహిత్!) ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ బంతిని బలంగా బాదేందుకు సిద్ధంగా ఉన్నాను. లాంగాన్ మీదుగా బౌండరీకి తరలించాలనుకున్నా. అయితే నా ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయాను. నిజానికి నేను ఈరోజు ఏం చేశాను అది నాకు నచ్చింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని తొలుత భావించాం. అయితే కొన్ని ఓవర్లు ఆడిన తర్వాత స్వింగ్ అంతగా లేదని అర్థమైంది. పూర్తిగా తేరుకునేలోపే దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాను. అయితే ఇందులో పశ్చాత్తాపడటానికి ఏమీ లేదు. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను. తప్పులు జరగడం సహజం. దానిని స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. లయన్ చాలా స్మార్ట్గా బౌల్ చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా లయన్ వేసిన ఫ్లైట్ బంతిని మిడాన్ వైపునకు రోహిత్ షాట్ ఆడాడు. లాంగాన్లో ఉన్న స్టార్క్ కాస్త ముందుకు కదిలి దాన్ని ఒడిసిపట్టడంతో వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. Nathan Lyon's 397th Test wicket seemed to come out of nowhere and the Aussies were pumped! #OhWhatAFeeling #AUSvIND | @Toyota_Aus pic.twitter.com/rIhl4ZjbTu — cricket.com.au (@cricketcomau) January 16, 2021 -
అశ్విన్ కంటే అతడే గ్రేట్ : చోప్రా
ముంబై : టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. క్రికెట్, ఆటగాళ్లకు సంబంధించి అనేక చర్చలను, విషయాలను తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అంతేకాకుండా తనకు నచ్చిన, స్పూర్తి పొందిన పలు ఫోటో, వీడియోలను సైతం షేర్ చేస్తుంటాడు. ఇక పలు ఆసక్తికర, వివాదాలకు సంబంధించిన విషయాలపై చర్చిండంలో ఈ వ్యాఖ్యాత ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియా టెస్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్లలో ఎవరు గొప్పా అనే దానిపై స్పష్టతనిచ్చాడు. (‘భారత్లో అతడిని ఎదుర్కోవడం కష్టం’) ‘ప్రస్తుత క్రికెట్లో అశ్విన్, లయన్లు ఇద్దరు గొప్ప స్పిన్నర్లు. సులువుగా వికెట్లు పడగొట్టగలరు. అయితే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవాలంటే మాత్రం నేను లయన్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుకుంటే అతడి బౌలింగ్ యాక్షన్ నాకు బాగా నచ్చుతుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించకున్నా బౌన్స్ రాబట్టి వికెట్లను పడగొడతాడు. బంతిపై అతడికి మంచి నియంత్రణ ఉంటుంది. ఎక్కడ, ఎలా బౌలింగ్ చేయాలో బాగా తెలుసు. ఉపఖండపు పిచ్లపై ముఖ్యంగా భారత్ మైదానాలలో లయన్తో పోలిస్తే వికెట్ల వేటలో అశ్విన్ చాలా ముందుంటాడు. అయితే ఉపఖండపు పిచ్లపై లయన్ రాణిస్తూనే ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మైదానాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. అందుకే ప్రస్తుత టెస్టు క్రికెట్లో లయన్ ది బెస్ట్ అని చెబుతున్నాను’ అంటూ చోప్రా పేర్కొన్నాడు. ఇక అశ్విన్ 71 టెస్టుల్లో 365 వికెట్లు పడగొట్టగా.. లయన్ 96 టెస్టు మ్యాచ్ల్లో 390 వికెట్లను చేజిక్కించుకున్నాడు. (క్రికెట్లో నెపోటిజమ్ రచ్చ.. చోప్రా క్లారిటీ) -
‘భారత్లో అతడిని ఎదుర్కోవడం కష్టం’
ఇస్లామాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై పాకిస్తాన్ మాజీ స్పిన్ దిగ్గజం సక్లయిన్ ముస్తాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్కే పరిమితమైన అశ్విన్ను భారత్లో ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నాడు. భారత్తో పాటు ఉపఖండపు పిచ్లలో అతడు చాలా ప్రమాదకరి అని సక్లాయిన్ పేర్కొన్నాడు. విదేశీ పిచ్లపై కూడా రాణిస్తున్నప్పటికీ స్వదేశీ పిచ్లపైనే అతడికి మెరుగైన రికార్డులు ఉన్నాయన్నాడు. అంతేకాకుండా ఉపఖండపు పిచ్లపై అతడిని ఎదుర్కొనేందకు ప్రత్యర్థి బ్యాట్స్మన్ చాలా ఇబ్బంది పడతారన్నాడు. రవీంద్ర జడేజా సైతం టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడని వివరించారు. (‘ఇదేందయ్య ఇది.. నేనెప్పుడు చూడలేదు’) పరిమిత ఓవర్ల క్రికెట్లో కుల్దీప్ బౌలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ముస్తాక్ పేర్కొన్నాడు. కుల్దీప్తో అనేకమార్లు మాట్లాడానని మంచి మనసు గల వ్యక్తి అని అన్నాడు. క్రికెట్పై పరిజ్ఞానం, సానుకూల దృక్పథం కలిగిన ఆటగాడు కుల్దీప్ అని సక్లాయిన్ అభివర్ణించాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్పై కూడా ఈ పాక్ మాజీ స్పిన్నర్ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తాడు. లయన్ బౌలింగ్ అద్భుతంగా ఉందని, ఇంగ్లండ్, పాకిస్తాన్, భారత్ జట్లపై మెరుగ్గా రాణించాడని కొనియాడాడు. ప్రస్తుత క్రికెట్లో అతడు అత్యుత్తమ స్పిన్నర్లలో నాథన్ లయన్ అని పేర్కొనడంలో ఎలాంటి సందేహం లేదని సక్లయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. (‘బౌలింగ్ చేయమంటే భయపెట్టేవాడు’) -
ప్రేక్షకులు లేకుంటే...కోహ్లి ఎలా ఆడతాడో !
సిడ్నీ: విరాట్ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్ను 2–1తో సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో కూడా నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత్ మళ్లీ పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో సిరీస్ జరుగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా దీనిని నిర్వహించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మైదానంలో ఉత్సాహానికి మారుపేరుగా నిలిచే విరాట్ కోహ్లి ప్రేక్షకులు లేని స్టేడియంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరమని ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ వ్యాఖ్యానించాడు. జనం లేనప్పుడు అతను ఎలా స్పందిస్తాడో చూడాలనుందని అన్నాడు. సహచర బౌలర్ మిషెల్ స్టార్క్తో సంభాషణ సందర్భంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘మామూలుగానైతే ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటికి అనుగుణంగా తనను తాను మార్చుకొని ఆడటం కోహ్లి శైలి. అయితే స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఆడితే అతను ఎలా స్పందిస్తాడో చూడాలని ఉందంటూ నేను స్టార్క్తో చెప్పాను. ఖాళీ సీట్లను చూస్తే అతనిలో జోష్ పెరుగుతుందో లేదో? పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుందనేది వాస్తవం. అయితే విరాట్ సూపర్ స్టార్ కాబట్టి పరిస్థితులను తొందరగా అర్థం చేసుకోగలడేమో’ అని లయన్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్ను మరోసారి ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని.... అయితే సిరీస్ ఎలాగైనా జరగాలనేదే తన కోరిక అని అతను అన్నాడు. ‘ప్రేక్షకుల సమక్షంలో ఆడాలా, లేదా అనేది మా చేతుల్లో లేదు. ఈ విషయంలో వైద్యుల సూచనలు పాటించాల్సిందే. కాబట్టి దాని గురించి ఆలోచించడం లేదు. భారత్తో ఆడటమన్నదే ముఖ్యం. గత సిరీస్లో వారు మమ్మల్ని ఓడించారు. అయితే ఇప్పుడు మా జట్టు చాలా పటిష్టంగా ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో కూడా మా రెండు టాప్ టీమ్లే తలపడాలని ఆశిస్తున్నా’ అని లయన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
'టిమ్ పైన్ ఉత్తమ కెప్టెన్గా నిలుస్తాడు'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ను పొగడ్తలతో ముంచెత్తాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కెప్టెన్గా వైదొలిగిన స్టీవ్ స్మిత్ స్థానంలో పైన్ కెప్టెన్గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిమ్ పైన్ సారథ్యంలో భారత జట్టుకు టెస్టు సిరీస్ కోల్పోయినా ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ను నిలబెట్టుకున్నామాని లియోన్ తెలిపాడు. నాథన్ లియోన్ మాట్లాడుతూ.. ' మా జీవితంలో బాల్ ట్యాంపరింగ్ వివాదం ఎప్పటికి వెంటాడుతుంది. అలాంటి సమయంలో కష్టకాలంలో ఉన్న జట్టును తన నాయకత్వ ప్రతిభతో మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు పైన్ ప్రయత్నించాడు. కెప్టెన్గా టిమ్ పైన్ తన విశ్వసనీయతను కాపాడుకుంటునే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని నిజాయితీయే పైన్ను ఏదో ఒకరోజు ఉత్తమ కెప్టెన్గా నిలబెడుతుంది. రోజు రోజుకు కెప్టెన్సీలో పైన్ మరింత రాటు దేలుతున్నాడు' అంటూ ప్రశంసలు కురిపించాడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అన్ని క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరగాల్సిన సిరీస్ను క్రికెట్ ఆస్ట్రేలియా జూన్ నెలకు వాయిదా వేసింది. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) (పొలాక్ మదిలో సచిన్ కానీ అతడి జాబితాలో..) -
అశ్విన్ నుంచి లాగేసుకున్నాడు..!
మెల్బోర్న్: భారత క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్గా తన మార్కును చూపెట్టిన రవిచంద్రన్ అశ్విన్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఒకవైపు జట్టులో చోటు సంపాదించడమే కష్టంగా మారిన తరుణంలో ఆడపా దడపా వచ్చిన అవకాశాల్ని కూడా అశ్విన్ పెద్దగా వినియోగించుకోలేకపోతున్నాడు. 71 టెస్టుల్లో 365 టెస్టు వికెట్లు సాధించిన అశ్విన్ పూర్వ వైభవం తగ్గిందనే చెప్పాలి. ఇది విషయాన్ని ఆసీస్ మాజీ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పష్టం చేశాడు. తన ప్రకారం చూస్తే గతేడాది వరకూ వరల్డ్ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్గా ఉన్న అశ్విన్ను ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ అధిగమించాడన్నాడు. ట్వీటర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భాగంగా వరల్డ్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ ఎవరని అడిగిన ప్రశ్నకు హాగ్ సమాధానమిచ్చాడు. ప్రధానంగా లయాన్-అశ్విన్లో ఎవరు ఉత్తమ అని ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చాడు హాగ్. (నవ్వులు పూయిస్తున్న అశ్విన్ ‘కోచింగ్ అలెర్ట్’ వీడియో) ‘ ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ లయాన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గడిచిన ఏడాది వరకూ బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ రేసులో అశ్విన్ ముందు వరుసలో ఉండేవాడు.ఆ ప్లేస్ను అశ్విన్ నుంచి లయాన్ లాగేసుకున్నాడు. ఇద్దరు తమ తమ గేమ్లను మెరుగుపరుచుకుంటూ ముందుకుసాగుతున్నారు’ అని హాగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ 96 టెస్టు మ్యాచ్లు ఆడిన లయాన్ 390 వికెట్లు సాధించాడు. -
'ఐసీసీ ప్రతిపాదన అందుకే నచ్చలేదు’
ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆస్ర్టేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్ పేర్కొన్నాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లకు సంబంధించి 2017 అక్టోబర్లోనే ఐసీసీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2023 నుంచి 2031 మధ్య జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సిరీస్లలో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లను అమలు చేయాలని ఐసీసీ పేర్కొంది. సాధారణంగా ఐదు రోజుల టెస్టు మ్యచ్లో రోజుకు 90 ఓవర్ల ఆట ఉండగా దానిని నాలుగు రోజులకు కుదించనుండడంతో రోజుకు 98 ఓవర్లు ఆడాల్సి వస్తుంది. 2018 నుంచి టెస్టు మ్యాచ్ల పరిస్థితి చూసుకుంటే దాదాపు 60 శాతం మ్యాచ్లు నాలుగురోజుల్లోనే ముగుస్తుండడంతో ఐసీసీ నాలుగురోజుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. అయితే ఐసీసీ ప్రతిపాదనను పలువురు మాజీ క్రికెటర్లు స్వాగతించారు. అందులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్, తదితరులు ఉన్నారు. 'ఐసీసీ తెచ్చిన నాలుగురోజుల టెస్టు మ్యాచ్ ప్రతిపాదనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. నాలుగు రోజుల మ్యాచ్లు అమలు చేస్తే విజయాల శాతం కంటే డ్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు 2014లో అడిలైడ్లో భారత్తో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే ఐదవ రోజున చివరి గంటలో ఫలితం తేలడం చూశారు. అలాగే 2014లోనే కేప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యచ్లో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా మా బౌలర్ రేయాన్ హారిస్ మోర్నీ మోర్కెల్ను అవుట్ చేసి మా జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ల ఫలితాలు ఐదవ రోజునే వచ్చాయి. అందుకే నా దృష్టిలో నాలుగు రోజుల మ్యాచ్లు అమలు చేస్తే డ్రాలు ఎక్కువవుతాయి. దీంతో పాటు నా వ్యతిరేకతకు మరో కారణం కూడా ఉంది. ఈరోజుల్లో పిచ్ల స్వభావం ప్లాట్గా మారిపోయి బ్యాట్సమెన్కు అవకాశంగా మారడంతో బౌలర్లు వికెట్లు తీయడానికి అపసోపాలు పడుతున్నారు.అయితే ఐదవ రోజున పరిస్థితులు తారుమారుయ్యే అవకాశం ఉండడంతో స్పిన్నర్లు వికెట్లు పడగొట్టడంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంది. ఐసీసీ నా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోదని నాకు తెలుసు, అయినా సరే నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటు' నాథన్ లియోన్ పేర్కొన్నాడు. (చదవండి : నా తండ్రి కంటే నాకు ఏది ఎక్కువ కాదు) -
హల్చల్ చేస్తున్న'లియోన్ కింగ్'
బర్మింగ్హమ్ : యాషెస్ సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టును ఆస్ట్రేలియా 251 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో నాథన్ లియోన్ మొత్తం 9వికెట్లతో(మొదటి ఇన్నింగ్స్ 3 , రెండో ఇన్నింగ్స్లో 6 ) వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ విసిరిన పదునైన బంతులకు ఇంగ్లండ్ బ్యాట్సమెన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అతని ప్రదర్శనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు ముంచెత్తాయి. కాగా, బిగ్బాష్ లీగ్ ఫ్రాంచైజీ 'సిడ్నీ సిక్సర్స్' మాత్రం లియోన్ను వినూత్న రీతిలో ప్రశంసించింది. లియోన్ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా ' ది లియోన్ కింగ్' పేరుతో వీడియోను విడుదల చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే వేదికలో ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా మొదటి టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా దానికి బదులు తీర్చుకుంది. ఆస్ట్రేలియా విధించిన 398 పరుగుల లక్ష్యాన్ని నాథన్ లియోన్(6-49), పాట్ కమ్మిన్స్(4-32) ధాటికి ఇంగ్లండ్ 146 పరుగులకే చాప చుట్టేసింది.యాషెస్ సిరీస్ నుంచే ప్రారంభమైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో ఆస్ట్రేలియా విజయంతో బోణీ చేసింది. 🙌 6/49 and 350 Test wickets for the Lyon King @NathLyon421 as the Aussies took a 1-0 series lead in the #Ashes overnight! Well played, mate! 🦁👑#smashemsixers pic.twitter.com/S1cSBPPkWV — Sydney Sixers (@SixersBBL) August 6, 2019 -
‘టీమిండియాతో పోరును ఎంజాయ్ చేస్తాం’
మెల్బోర్న్: త్వరలో భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న స్పిన్నర్ నాధన్ లయన్.. వరల్డ్కప్కు ముందు సాధ్యమైనంత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటం తమకు కచ్చితంగా మంచి అవకాశమన్నాడు. అందులోనూ భారత్లాంటి పటిష్టమైన జట్టుపై ఆడటం యువకులతో కూడిన తమ జట్టును మరింత రాటుదేలేలా చేస్తోందన్నాడు. తమ జట్టులో ప్రతీ ఒక్కరూ భారత్తో పోరును ఎంజాయ్ చేయడం ఖాయమన్నాడు. ‘వరల్డ్కప్కు ముందు ఎక్కువ వైట్బాల్ మ్యాచ్లు ఆడటం మాకు సువర్ణావకాశమే. భారత పర్యటనలో మా ప్రణాళికలు కచ్చితంగా ఉంటాయనే అనుకుంటున్నా. ఇది మాకు చాలా పెద్ద చాలెంజ్. భారత్లో ఆ జట్టుకు అనుకూలించే పిచ్లపై ఆడటం సవాల్తో కూడుకున్నది. నా వరల్డ్కప్ ప్రిపరేషన్స్ ఆదివారం నుంచి ఆరంభం కానుంది. నా పాత్రను సమర్దవంతంగా నిర్వర్తించడానికి వంద శాతం కృషి చేస్తా. నేను సిడ్నీ సిక్సర్స్కు ఆడినా, ఆస్ట్రేలియాకు ఆడినా జట్టుకు ఉపయోగపడేలా ఆడటమే నా లక్ష్యం’ అని లయన్ తెలిపాడు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. రెండు టీ20ల సిరీస్, ఐదు వన్డేల సిరీస్లు ఇరు జట్లు తలపడనున్నాయి. -
అతని కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యా: మయాంక్
సిడ్నీ: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే. మెల్బోర్న్లో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి (76,42) 118 పరుగులు చేసి విదేశీ గడ్డపై అరంగేట్రం మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్ ఆటగాడిగా నిలిచిన మాయాంక్.. నాల్గో టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. ఆసీస్తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మాయంక్ అగర్వాల్(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఆరంభాన్ని అందించాడు. ఫలితంగా తొలి మూడు ఇన్నింగ్స్ల్లో రెండు అర్థ శతకాలు సాధించిన మూడో భారత ఓపెనర్గా నిలిచాడు. ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరం కావడంతో మయాంక్ను అదృష్టం వరించింది. అయితే ఆసీస్ స్పిన్నర్ లయన్ కోసం ప్రత్యేకంగా సిద్ధమైన విషయాన్ని మయాంక్ తాజాగా స్పష్టం చేశాడు. తొలి రెండు టెస్టుల్లో 16 వికెట్లు సాధించిన మంచి ఊపు మీద ఉన్న లయన్ అడ్డుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. ‘ మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోచ్ రవిశాస్త్రి సర్ నా వద్దకు వచ్చారు. నా అరంగేట్రంపై ఒక స్పష్టత ఇచ్చారు శాస్త్రి సర్. ఆ సమయంలో నేను కాస్త ఆందోళనకు లోనయ్యా. ఆ సీన్ను వాస్తవంలో తలుచుకుంటే ఏదో తెలియని ఫీలింగ్.. ఒక వైపు ఆనందం.. మరొకవైపు కాస్త భయం. ఆ సమయంలో నేను లయన్ కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకోవాలనుకున్నా. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సర్, కేఎల్ రాహుల్లు లయన్ బౌలింగ్ను ఎలా ఆడాలనే దానిపై చర్చిస్తున్నారు. అందులో నేను భాగస్వామ్యం అయ్యా. మేమంతా లయన్ బంతిని సంధించే విధానంపై సుదీర్ఘంగా చర్చించా. ప్రాక్టీస్ సెషన్లో అదే పనిగా లయన్ను ఎదుర్కోవడంపై చెక్ చేసుకున్నా. అదే ప్రణాళికను మ్యాచ్లో కూడా అవలంభించి సక్సెస్ అయ్యా. ఒక స్టార్ స్పిన్నర్ను కచ్చితమైన ఎదుర్కొని విజయవంతం కావడం చాలా సంతోషం అనిపించింది’ అని మయాంక్ అగర్వాల్ తెలిపాడు. -
ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్!
పెర్త్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ 283 పరుగులకు ముగిసింది. 172/3 ఓవైర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన.. ఆదిలోనే అజింక్యా రహానే (51:105 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారితో కోహ్లి ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 214 బంతుల్లో 11 ఫోర్లతో కోహ్లి కెరీర్లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోతున్న ఈజోడిని హజల్వుడ్ దెబ్బతీశాడు. హనుమ విహారి(26)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 5వ వికెట్కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి ఔట్.. టీమిండియా ప్యాకప్.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి కోహ్లి బలవ్వడంతో భారత్ వికెట్లను చకచకా కోల్పోయింది. కమిన్స్ వేసిన 93వ ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్లో ఉన్న హ్యాండ్స్కోంబ్ చేతిలో పడింది. అయితే బంతి మాత్రం నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ప్రకటించాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. చివరల్లో దాటిగా ఆడే ప్రయత్నం చేసిన పంత్.. టేలండర్ల సాయంతో 27 పరుగులు జోడించాడు. నాథన్ లయన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన పంత్ (36) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చివరి వికెట్గా బుమ్రా ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 5 వికెట్లతో స్పిన్నర్ లయన్ భారత బ్యాట్స్మన్ పతనాన్ని శాసించాడు. స్టార్క్, హజల్వుడ్లకు రెండేసి వికెట్లు దక్కగా.. కమిన్స్కు ఒక వికెట్ దక్కింది. -
భారత్ను ఊరిస్తున్న విజయం!
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ను విజయం ఊరిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ 307 పరుగులకు కుప్పకూలింది. 151/3 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 156 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. అనంతరం 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆతిథ్య జట్టు నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్(11)ను భారత స్పిన్నర్ అశ్విన్ పెవిలియన్ చేర్చగా.. మరో ఓపెనర్ హ్యారీస్(26)ను మహ్మద్ షమీ క్యాచ్ ఔట్ చేయడంతో 44 పరుగులకే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం మరోసారి చెలరేగిన అశ్విన్-షమీ ద్వయం.. ఉస్మాన్ ఖవాజా(8), హ్యాండ్స్ కోంబ్ (14)లను పెవిలియన్ చేర్చింది. క్రీజులో షాన్ మార్ష్ (31నాటౌట్), ట్రావిస్ హెడ్ (11 నాటౌట్)లున్నారు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ఏకంగా 6 వికెట్లతో చెలరేగడంతో భారత్ బ్యాట్స్మెన్ పెవిలియన్ క్యూ కట్టారు. పుజారా(71), రహానే(70) ఆసీస్ బౌలర్లను ఎదురొడ్డి నిలిచినప్పటికీ మిగతా బ్యాట్స్మన్ నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 250 ఆలౌట్, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 235 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్ 307 ఆలౌట్, ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 104/4 -
కోహ్లిని ఎగతాళి చేసిన లియోన్!
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో చతేశ్వర పుజారా పుణ్యమా అని 250 పరుగులు చేసిన కోహ్లి సేన.. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ను 235 పరుగులకు ఆలౌట్ చేసి స్వల్ప ఆధిక్యం దక్కించుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లిని ఔట్ చేసిన అనంతరం ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రవర్తించిన తీరు ఇరుజట్ల మధ్య భావోద్వేగాల స్థాయిని తెలుపుతోంది. లియోన్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడేక్రమంలో కోహ్లి షార్ట్ లెగ్లో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో కోహ్లి పెవిలియన్ వెళ్తుండగా.. డిఫెన్స్ ఇలా ఆడాలంటూ లియోన్ అనుకరిస్తూ చూపించాడు. ఫించ్ వికెట్ పడ్డప్పుడు కూడా విరాట్ కోహ్లి ఆనందంతో గాల్లో పంచ్లిస్తూ సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి టెస్టుల్లో లియోన్ బౌలింగ్లోనే ఆరుసార్లు ఔటవ్వడం విశేషం. -
హేయ్ సర్ఫరాజ్.. ఏందా బ్యాటింగ్!!
అబుదాబి: 57 పరుగులకే సగం వికెట్లు పోయి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సారథి ఎంతో ఆచితూచి ఆడాల్సివుంటుంది. వికెట్లకు అడ్డుగోడలా నిల్చొని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాలి. కానీ పాకిస్తాన్ సారథి, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. కానీ వికెట్ల ముందు ‘అడ్డుగోడ’లా నిలబడలేదు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ తెగువను చూసి అందరూ ముక్కున వేళేసుకుంటున్నారు. ప్రస్తుతం పాక్ కెప్టెన్ బ్యాటింగ్ స్టాన్స్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులతో సహా మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా సర్ఫరాజ్ తీసుకున్న బ్యాటింగ్ స్టాన్స్పై కామెంట్స్ చేశారు. కొందరు అభిమానులు సర్ఫరాజ్ ఏంటా బ్యాటింగ్ అంటూ ఫన్నీగా స్పందించగా, మరికొందరు నీ ఆలోచనకు, బ్యాటింగ్ తెగింపుకు జోహార్ అంటూ ట్వీట్ చేశారు. రెండో టెస్టులో ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 57/1. మరికొద్ది సేపటికే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (4/78) దెబ్బకు 57/5. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆసీస్ స్పిన్నర్ లయన్ ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చాడు. ఆసీస్ బౌలర్లను తికమక పెట్టడానికి స్టాన్స్ మార్చుకొని బ్యాటింగ్ చేశాడు. మూడు స్టంప్స్ను వదిలేసి ఎక్కడో దూరంగా నిలబడి బ్యాటింగ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆరంగేట్రం ఆటగాడు ఫఖర్ జమాన్(94; 8 ఫోర్లు, సిక్స్)తో కలిసి సర్ఫరాజ్ (94; 7 ఫోర్లు)ల పోరాటంతో కోలుకుంది. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆరు పరుగల దూరంలో సెంచరీ చేజార్చుకున్నా హీరోగా మిగిలాడు. ఇక ఈ టెస్టులో పాక్ అదరగొడుతోంది. పాక్ బౌలర్ మహ్మద్ అబ్బాస్(5/33) ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 145 పరుగులకే ఆలౌటైంది. -
లియోన్కు జరిమానా హద్దులు మీరిన స్లెడ్జింగ్..
-
హద్దులు మీరిన స్లెడ్జింగ్.. లియోన్కు జరిమానా
డర్బన్ : ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో అతిగా ప్రవర్తించిన స్పిన్నర్ నాథన్ లియోన్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) జరిమాన విధించింది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మొదటి టెస్టులోనే స్లెడ్జింగ్ తారా స్థాయికి చేరింది. ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్లో ఆటగాళ్లు క్రీడా స్పూర్తి మరిచి ప్రవర్తించారు. లియోన్ వేసిన 12 ఓవర్లో మార్క్రమ్తో సమన్వయ లోపంతో ఏబీ డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. ఆనందంలో మునిగిపోయిన లియోన్ బంతిని ఏబీ పైకి విసరడంతో చాతికి తగిలింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో నాథన్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. అయితే బంతి కావాలని విసరలేదని నాథన్ క్షమాపణలు కోరాడు. ఈ రనౌట్ వ్యవహారంలోనే వార్నర్-డికాక్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాలుగో రోజు టీ విరామం సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళుతున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం దూషించుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే దారిలో ఉన్న మెట్ల వద్దే వార్నర్ ఆవేశంగా డి కాక్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డయింది. సహచరుడు ఖాజా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వార్నర్ మాత్రం తగ్గలేదు. కొద్ది దూరంలోనే ఉన్న డి కాక్ కూడా ఆ సమయంలో ఏదో అంటూ తమ జట్టు గది వైపు వెళ్లిపోయాడు. ఇక తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై ఆసీస్118 పరుగులతో ఘన విజయం సాధించింది. -
క్రికెట్ చరిత్రలో స్పిన్నర్లు తొలిసారి..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్ పరంగా చూస్తే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్లు పరుగుల వరద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే 2017 స్పిన్నర్లకు కూడా బాగా కలిసొచ్చింది. కచ్చితంగా చెప్పాలంటే గతేడాది స్పిన్నర్స్కు సూపర్ ఇయర్గా నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా స్పిన్నర్లు రెచ్చిపోయి వికెట్లు సాధించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో ఆరు వందలకు పైగా వికెట్లు సాధించిన ఘనతను స్పిన్నర్లు మొదటిసారి తమ ఖాతాలో వేసుకున్నారు. 2017లో స్పిన్నర్లు సాధించిన టెస్టు వికెట్లు 638. ఫలితంగా గతేడాది స్పిన్నర్లు సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు(584)ను బద్దలు కొట్టారు. ఓవరాల్గా స్పిన్నర్లు ఐదు వందలకు పైగా సాధించింది కేవలం ఐదుసార్లు మాత్రమే. 2001లో 521 టెస్టు వికెట్లను తీసిన స్పిన్నర్లు.. 2004లో 577 వికెట్లు సాధించారు. ఇక 2015లో 554 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.గతేడాది అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్నర్ల జాబితాలో నాథన్ లయాన్(63), అశ్విన్(56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
ఈ ఏడు ‘కింగ్ ఆఫ్ ది బౌలర్’ ఎవరు..?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ బౌలర్లలో ఈ ఏడు తీవ్ర పోటీ నెలకొంది. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానం కోసం ఐదుగురు బౌలర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ ఏడాది పూర్తి కావడానికి మరో నెలరోజుల సమయం ఉండటంతో ఆ స్థానం ఎవరి దక్కుతుందనే విషయంపై క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఏకపక్షంగా 72 వికెట్లతో అశ్విన్ ఈస్థానం దక్కించుకోగా.. రంగనా హెరాత్ 57 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా పేసర్ కేఎస్ రబడ 54 వికెట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 52, ఆసీస్ స్పిన్నర్ లియోన్ నాథన్ 50, భారత్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ 48, రవీంద్ర జడేజా 47 వికెట్లతో రేసులో ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికా బౌలర్ రబడాకు అంతగా అవకాశం కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా డిసెంబర్ 26న జింబాబ్వేతో ఏకైక టెస్టు మాత్రమే ఆడనుంది. ఈ ఏకైక టెస్టు తర్వాత కొత్త సంవత్సరంలోనే భారత్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక అగ్రస్థానం దక్కించుకునే అవకాశం ఆసీస్ ప్లేయర్ లియోన్కు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యాషెస్ సిరీస్లో భాగంగా ఇంకా మూడు టెస్టులు ఆడే అవకాశం లియోన్కు ఉంది. కానీ ఈ సిరీస్ స్పిన్కు అంతగా అనుకూలించని ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఉపఖండ పిచ్లపై రెచ్చిపోయే అశ్విన్, జడేజాలకు ఇంకా ఒక ఇన్నింగ్స్, పూర్తి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. కానీ భారత్ దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని పేస్ పిచ్లు సిద్దం చేస్తుండటంతో ఈ జోడి అంతగా ప్రభావం చూపలేకపోతుంది. హెరాత్కు కూడా ఇదే పరిస్థతి. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో లంక రెండో ఇన్నింగ్స్లో, మూడో టెస్టులో ఈ ద్వయం రెచ్చిపోతే అగ్రస్థానం కైవసం చేసుకోవడం అంత కష్టేమేమి కాదు. -
లయన్.. అరుదైన మైలురాయి
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో విజృంభించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు స్పిన్నర్ నాధన్ లయన్ అరుదైన మైలురాయిని సాధించారు. బంగ్లాతో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసిన లయన్.. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో మెరిశారు. దాంతో ఒక టెస్టు మ్యాచ్ లో 13 వికెట్లను లయన్ తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా ఆసియాలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్ రికార్డును లయన్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓకెఫీ రికార్డును లయన్ అధిగమించారు. గతేడాది భారత్ తో జరిగిన పుణె టెస్టులో ఓకెఫీ 12 వికెట్లతో ఉన్న రికార్డును లయన్ బద్ధలు కొట్టాడు. మరొకవైపు కనీసం ఐదు వికెట్లను వరుసగా మూడుసార్లు సాధించిన ఘనతను లయన్ తన కెరీర్ లో తొలిసారి సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంచితే, ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత స్పిన్ ద్వయం అశ్విన్, రవీంద్ర జడేజాలను లయన్ అధిగమించాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో అశ్విన్, జడేజాలు 44 వికెట్లతో ఇప్పటివరకూ టాప్ లో ఉండగా, దాన్ని లయన్ 45 వికెట్లతో సవరించాడు. బంగ్లాతో రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించి సిరీస్ ను 1-1 తో సమం చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయిన ఆసీస్.. రెండో టెస్టులో చెలరేగి ఆడి సిరీస్ ను సమం చేసుకుంది. కాగా, తొలి టెస్టులో ఓటమి ఎదుర్కోవడంతో ఆసీస్ తన టెస్టు ర్యాంకింగ్స్ లో నాల్గో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ర్యాంకింగ్స్ లో భారత్ తన టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంది. -
79 ఏళ్ల ఆసీస్ రికార్డు బ్రేక్
చిట్టగాంగ్:ఆస్ట్రేలియా స్పిన్నర్ నాధన్ లయన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్న లయన్.. రెండో రోజు ఆటలో మరో రెండు వికెట్లను సాధించారు. దాంతో లయన్ కు తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు లభించాయి. లయన్ దెబ్బకు విలవిల్లాడిన బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 305 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంచితే, తొలి రో్జు ఆటలో పేస్ బౌలర్ తో కలిసి లయన్ బౌలింగ్ ను ఆరంభించడంతో 79 ఏళ్ల ఆసీస్ రికార్డు ఒకటి బద్దలైంది. ఇలా ఒక పేస్ బౌలర్ తో కలిసి స్పిన్నర్ బౌలింగ్ ను మొదటి రోజు ఉదయమే పంచుకోవడం ఆసీస్ క్రికెట్ చరిత్రలో 1938 తరువాత ఇదే తొలిసారి. తద్వారా ఆసీస్ మాజీ స్పిన్నర్ బిల్ ఓ రెల్లీ రికార్డును లయన్ బ్రేక్ చేశారు. బంగ్లాదేశ్ తో టెస్టులో తొలి ఓవర్ ను పేసర్ ప్యాట్ కమిన్స్ వేయగా, రెండో ఓవర్ ను లయన్ వేశారు. ఇలా తొలి రోజు ఉదయం పేసర్ తో కలిసి బౌలింగ్ ను పంచుకున్న లయన్ చెలరేగిపోయారు. తొలి బంగ్లాదేశ్ నాలుగు వికెట్లను తీసి తన స్పిన్ మ్యాజిక్ ను ప్రదర్శించారు. నిన్నటి ఆటలో ఓవరాల్ గా ఐదు వికెట్లను సాధించిన లయన్.. మొదటి నాలుగు వికెట్లను ఎల్బీడబ్ల్యూ రూపంలో సాధించడం ఇక్కడ మరో విశేషం. -
లయన్ విజృంభణ
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ తో ఇక్కడ ఆరంభమైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాధన్ లయన్ విజృంభిస్తున్నారు. తన స్సిన్ మ్యాజిక్ తో చెలరేగిపోతున్న లయన్.. బంగ్లాదేశ్ కు సొంతగడ్డపైనే చుక్కలు చూపిస్తున్నారు. గింగిరాలు తిరిగే బంతులతో బంగ్లాదేశ్ తొలి నాలుగు వికెట్లను కూల్చి సత్తాచాటుకున్నారు. బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(9)ను మొదటి వికెట్ గా పెవిలియన్ కు పంపిన లయన్.. ఆపై కీలక ఆటగాడు ఇమ్రుల్ కెయిస్(4)అవుట్ చేశాడు. అటు తరువాత కాసేపటికి సౌమ్య సర్కార్(33), మోమినుల్ హక్(31)లను పెవిలియన్ కు పంపాడు. లయన్ సాధించిన నాలుగు వికెట్లు ఎల్బీ రూపంలో రావడం ఇక్కడ మరో విశేషం. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆదిలోనే బంగ్లాదేశ్ కు లయన్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లయన్ ను ఎదుర్కోలేక బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందులు పడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
ఆధిక్యం అటా ఇటా?
-
ఆధిక్యం అటా ఇటా?
►53 పరుగుల దూరంలో భారత్ ►తొలి ఇన్నింగ్స్లో 248/6 ►రాణించిన రాహుల్, పుజారా ►లయన్కు 4 వికెట్లు భారత్ మెరుగ్గానే ఆడింది, కానీ ఆడాల్సినంత బాగా ఆడలేదు... ఇద్దరు అర్ధ సెంచరీలు చేస్తే మరొకరు చేరువగా వచ్చారు, కానీ ఒక్కరూ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. పిచ్ ప్రమాదకరంగా లేదు, బౌలింగ్ భీకరంగానూ లేదు... కానీ ఆధిపత్యం ప్రదర్శించడంలో విఫలమయ్యారు... గత టెస్టులాగే క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో ఆస్ట్రేలియా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ ఒత్తిడి పెంచడంలో సఫలమైంది. ఒక దశలో 108/1తో భారత్ మెరుగైన స్థితిలో నిలిచినా... అనవసర ఆవేశం ప్రదర్శించి రాహుల్ చేజేతులా వికెట్ ఇచ్చుకోవడంతో జట్టు తడబడింది. వికెట్పై బౌన్స్ను సమర్థంగా ఉపయోగించుకున్న లయన్ చివరి సెషన్లోనే నాలుగు కీలక వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. పిచ్ మారిపోతున్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లో చేసే పరుగులే కీలకం కానున్నాయి. చేతిలో నాలుగు వికెట్లతో భారత్ ఎంత ఆధిక్యం సాధించగలదన్నదే మూడో రోజు కీలకం. ధర్మశాల: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టులో రెండో రోజు ఆట కూడా ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి. చివరకు ఈ పోరులో టీమిండియా కాస్త వెనుకంజలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (124 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), చతేశ్వర్ పుజారా (151 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కెప్టెన్ రహానే (104 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (49 బంతుల్లో 30; 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. రాహుల్, పుజారా రెండో వికెట్కు 87 పరుగులు జోడించారు. ప్రస్తుతం జడేజా (16 బ్యాటింగ్), సాహా (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో లయన్కు 4 వికెట్లు దక్కాయి. సెషన్ 1: రాహుల్కు లైఫ్ రెండో రోజు ఆటను రాహుల్, విజయ్ నెమ్మదిగా ఆరంభించారు. మొదట్లో ఆసీస్ పేసర్లు హాజల్వుడ్, కమిన్స్ చక్కటి బౌలింగ్తో బ్యాట్స్మెన్ను కట్టడి చేయగా... పిచ్పై ఉన్న బౌన్స్ను దృష్టిలో ఉంచుకొని ఆసీస్ ఎనిమిదో ఓవర్లోనే స్పిన్నర్ లయన్ను బౌలింగ్కు దించింది. హాజల్వుడ్ బౌలింగ్లో అప్పటి వరకు ఓపిగ్గా ఆడిన విజయ్ (36 బంతుల్లో 11; 2 ఫోర్లు) చివరకు అతని బౌలింగ్లోనే వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే స్లిప్లో రెన్షా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రాహుల్ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు పుజారా జాగ్రత్తగా ఆడుతూ క్రీజ్లో పాతుకుపోయాడు. ఓవర్లు: 27, పరుగులు: 64, వికెట్లు: 1 సెషన్ 2: కీలక భాగస్వామ్యం లంచ్ తర్వాత ఒకీఫ్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన రాహుల్, ఆ వెంటనే 98 బంతుల్లో ఈ సిరీస్లో ఐదో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కమిన్స్తో కొంత వాదన చోటు చేసుకున్న తర్వాత రాహుల్ ఏకాగ్రత కోల్పోయాడు. కమిన్స్ వేసిన బౌన్సర్ను అంచనా వేయకుండా హుక్ షాట్ ఆడబోయి రాహుల్ వెనుదిరిగాడు. మరోవైపు 132 బంతుల్లో పుజారా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రహానే ఆరంభంలో కొన్ని ఉత్కంఠభరిత క్షణాలు ఎదుర్కొన్నా...మెల్లగా నిలదొక్కుకున్నాడు. ఓవర్లు: 32, పరుగులు: 89, వికెట్లు: 1 సెషన్ 3: లయన్ దెబ్బ విరామం తర్వాత తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి లయన్ భారత్ను దెబ్బ తీశాడు. అనూహ్యంగా ఎగసిన బంతిని ఆడలేక పుజారా షార్ట్లెగ్లో క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే కరుణ్ నాయర్ (5) కూడా సరిగ్గా ఇదే తరహాలో వెనుదిరిగాడు. ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించిన తర్వాత నాయర్ వరుసగా నాలుగో ఇన్నింగ్స్లో కూడా విఫలమయ్యాడు. ఈ దశలో చక్కగా ఆడుతున్న రహానేకు మరో ఎండ్లో అశ్విన్ నుంచి సహకారం లభించింది. అయితే లయన్ బౌలింగ్లోనే స్లిప్లో స్మిత్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో రహానే ఇన్నింగ్స్కు తెరపడింది. దూకుడుగా ఆడుతున్న అశ్విన్ను కూడా పెవిలియన్ పంపించి లయన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అంపైర్ ఎల్బీగా ప్రకటించడంతో అశ్విన్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. వచ్చీ రాగానే రెండు సిక్సర్లు బాది జడేజా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా...రెన్షా మరో క్యాచ్ వదిలేయడంతో సాహాకు లైఫ్ లభించింది. ఓవర్లు: 31, పరుగులు: 95, వికెట్లు: 4 (డ్రాప్) రెన్షా (బి) కమిన్స్ రెండో రోజు భారత్కు రెండు సార్లు అదృష్టం రెన్షా రూపంలో కలిసొచ్చింది. స్లిప్లో అతను రెండు సార్లు క్యాచ్ వదిలేసి భారత్కు మేలు చేశాడు. ప్యాట్ కమిన్స్ వేసిన 12వ ఓవర్లో రాహుల్ ఇచ్చిన క్యాచ్ను మొదటి స్లిప్లో రెన్షా వదిలేశాడు. అతని చేతి వేళ్లకు తగిలి బంతి వెళ్లిపోయింది. ఆ సమయంలో రాహుల్ స్కోరు 10 మాత్రమే. ఆ తర్వాత రాహుల్ మరో 50 పరుగులు జోడించాడు. ఆట ముగియడానికి కొద్ది సేపు ముందే కమిన్స్ బౌలింగ్లోనే అదే మొదటి స్లిప్లో సాహా ఇచ్చిన అంతకంటే సులువైన మరో క్యాచ్ను రెన్షా వదిలేశాడు. ఈ సమయంలో సాహా స్కోరు 9 మాత్రమే. మూడో రోజు సాహా గనక మ్యాచ్ దిశను మార్చే కీలక ఇన్నింగ్స్ ఆడితే మాత్రం రెన్షా చేసిన తప్పుకు ఆసీస్ భారీ మూల్యం చెల్లించినట్లు అవుతుంది. మరోసారి కమిన్స్ బౌలింగ్లోనే పుజారా (స్కోరు 28) బ్యాట్కు తగిలిన బంతి రెన్షాకు కాస్త ముందు పడింది. గంటకు 146 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా, అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చిన ఆసీస్ బౌలర్ కమిన్స్ను సహచరుడు రెన్షా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు. ► 3 ఒక సిరీస్లో సెంచరీ లేకుండా 5 అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడు రాహుల్. ► 2 ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పుజారా (1,316) రెండో స్థానంలో నిలిచాడు. 2005–06 సీజన్లో పాంటింగ్ 1,483 పరుగులు చేశాడు. ► 10 టెస్టుల్లో కనీసం 1000 పరుగులు చేసి 100 వికెట్లు తీసిన పదో భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. జడేజా ఈ సీజన్లోనే 500కు పైగా పరుగులు చేసి 50కి పైగా వికెట్లు తీయడం విశేషం. -
'విరాట్ గ్యాంగ్పైనే తీవ్ర ఒత్తిడి'
రాంచీ: తమతో ఇంకా రెండు టెస్టు మ్యాచ్లు మిగిలిన ఉన్న సిరీస్ లో టీమిండియాపైనే ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ లో ఆసీస్ ఎటువంటి ఒత్తిడి లేకుండానే బరిలోకి దిగిందనే విషయం విరాట్ సేనకు తెలుసన్నాడు. ఈ క్రమంలో సిరీస్ ను గెలవాలన్న ఒత్తిడి వారిపై విపరీతంగా ఉందన్నాడు. 'భారత్ తో సిరీస్ లో భాగంగా మేము దుబాయ్ లో అడుగుపెట్టినప్పుడు అపారమైన నమ్మకంతో ఉన్నాం. కానీ భారత్ కు వచ్చిన తరువాత సిరీస్ ను 4-0 తో కోల్పోతున్నామనే వార్తలు వచ్చాయి. ప్రతీ ఒక్కరు కూడా మాతో అదే చెబుతూ వచ్చారు. మా జట్టు భారత్ పై విజయం సాధించడం అంత ఈజీ కాదన్నారు. మమ్మల్ని ఇంకా నేర్చుకునే జట్టుగానే అభివర్ణించారు. కాకపోతే ప్రపంచంలో ఎంత అత్యుత్తమ జట్టుపైనైనా గెలుపొందే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది. అదే తొలి టెస్టులో నిరూపించాం కూడా.రెండో టెస్టులో ఓడటం కొద్దిగా బాధించింది. మూడో టెస్టులో తిరిగి సత్తా చాటుతాం. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో భారత్ పైనే తీవ్ర ఒత్తిడి ఉంది.. మాపై ఎంతమాత్రం కాదు' అని లియాన్ తెలిపాడు. గురువారం రాంచీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
విరాట్ సేనపైనే ఒత్తిడి ఉంది
రాంచీ: టీమిండియాపైనే ప్రస్తుతం ఒత్తిడి ఉందని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అన్నాడు. టెస్టు సిరీస్ ప్రారంభంకాక ముందు తాము 0-4 తేడాతో ఓడిపోతామని, తమ జట్టులో అనుభవంలేని యువ ఆటగాళ్లు ఉన్నారని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారని చెప్పాడు. వారి అంచనాలు తప్పయ్యాయని అన్నాడు. భారత్-ఆసీస్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. మరో రెండు టెస్టులు రాంచీ, ధర్మశాలలో జరుగుతాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగళూరు నుంచి రాంచీ వెళ్లారు. తొలి టెస్టులో తాము సత్తాచాటి విజయం సాధించామని, రెండో మ్యాచ్లో విజయానికి చేరువగా వెళ్లామని నాథన్ చెప్పాడు. చివరి రెండు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ సేనను ఎదుర్కోవడంపై దృష్టిసారిస్తున్నామన్నాడు. స్పిన్కు అనుకూలించే ఇక్కడి పిచ్లపై తాను బౌలింగ్లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తొలి రెండు మ్యాచ్లలో పిచ్ స్పిన్కు అనుకూలించిందని చెప్పాడు. -
రహానే Vs స్పిన్నర్ లియోన్
పుణే: ఒకవైపు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయిన ఆస్ట్రేలియా ఉండగా, మరోవైపు సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది. అందులోనూ విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలోనూ దూకుడే మంత్రంగా సాగిపోతున్నాడు. అయితే వచ్చిన చిక్కంతా.. భారత టెస్ట్ వైస్ కెప్టెన్, టాప్ క్లాస్ ప్లేయర్ అజింక్య రహానే ఫామ్. వరుసగా రెండేళ్లపాటు జట్టు విజయాలలో పాలుపంచుకున్న రహానే కొన్ని టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ను ఏ మేరకు ఎదుర్కుంటాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అతడి స్థానంలో ఇంగ్లండ్ తో చివరిటెస్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయడం రహానేపై మరింత ఒత్తిడిని పెంచింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో భాగంగా రేపు (గురువారం) పుణేలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఆసీస్ జట్టులో అందరి దృష్టి ప్రధానంగా స్పిన్నర్ నాథన్ లియోన్ పైనే ఉంది. ఎందుకంటే అతడు ఎంతగా రాణిస్తే జట్టుకు అంత ప్రయోజనం ఉంటుందని ఆసీస్ టీమ్ మేనెజ్ మెంట్ భావిస్తోంది. కోహ్లీని ఎలాగూ ప్రత్యర్థి జట్టు అపడం కష్టమే కనుక.. ఆసీస్ స్పిన్నర్ టార్గెట్ రహానే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ తో ఆడిన మూడు టెస్టుల్లో ఓ 5 వికెట్ల ఇన్నింగ్స్ సహా 15 వికెట్లు తీశాడు లియోన్. రహానే తర్వాత ఆసీస్ స్పిన్నర్ టార్గెట్ చతేశ్వర్ పుజారా. ఇటీవల ఇంగ్లండ్ సిరీస్ లో భారత్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి కనీసం అర్ధశతకం చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం పుజారా అలవాటు. దీంతో ప్రధానంగా భారత బ్యాట్స్ మన్లలో రహానే, పుజారా వర్సెస్ స్పిన్నర్ లియోన్ పోరుగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. విదేశాల్లోనూ సులువుగా పరుగులు రాబట్టే రహానే స్వదేశంలో జరిగే ఈ సిరీస్ లో లియోన్ సహా ఆసీస్ బౌలర్లపై పైచేయి సాధిస్తాడని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
బజ్జీకి కౌంటర్ ఇచ్చిన ఆసీస్ స్పిన్నర్
భారత్లో జరిగే టెస్టు సిరీస్లో భారత్కు గట్టి పోటి ఇస్తామని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ చెప్పాడు. భారత ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవల ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు లియోన్ మంగళవారం బదులిచ్చాడు. ప్రస్తుత ఆసీస్ జట్టు అత్యంత బలహీనమైన జట్టు అని, భారత్ సిరీస్ను 4-0తో వైట్ వాష్ చేస్తుందని బజ్జీ తెలిపిన విషయం తెలిసిందే. ఎవరి నమ్మకాలు వారివని, వారి మాటలు మా జట్టు పట్టించుకోదని లియోన్ అన్నాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్, యువ క్రికెటర్లతో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉందని తెలిపాడు. భారత్కు గట్టి పోటి ఇచ్చి మంచి ఫలితాలు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనికి మా జట్టు గట్టిగా సాధన చేస్తుందని, గెలుస్తామనే సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నాడు. భారత్ నెం.1 స్థానంలో ఉండగా ఆసీస్ వెనుకే ఉందన్నాడు. మేము ఫాస్ట్ బౌలర్లతో తొలి రోజే 5 వికెట్లు పడగొడ్తమనుకోవడం లేదని, ఇది మాకు పెద్ద సవాలని చెప్పాడు. ఇక భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ను లియోన్ పొగడ్తలతో ముంచెత్తాడు. అశ్విన్ వరల్డ్ క్లాస్ స్పిన్నరని, అతని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నాడు. ఇప్పటి వరకు ఏమి చేశానో చెప్పడం లేదని, గత నాలుగు ఏళ్లతో పోలిస్తే ఉపఖండ పరిస్థితులకు అనుగుణంగా చాలా మారనని లియోన్ తెలిపాడు. జట్టులో అందరూ యువ స్పిన్నర్లే కావడంతో జట్టు స్పిన్ దాడికి నాయకుడిగా ఉంటున్నానని, ఇది చాలా సంతోషమైన విషయమని, ఒత్తిడిగా భావించడం లేదని తెలిపాడు. మంచిగా బౌలింగ్ చేసి బ్యాటింగ్ జట్టును ఒత్తిడికి గురి చేయడమే తన కర్తవ్యమని లియోన్ అభిప్రాయపడ్డాడు. -
అతి చేయకండి: నాధన్ లయాన్
మెల్బోర్న్:ఒకవైపు పింక్ బాల్తో డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణలో ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ) ముందు వరుసలో ఉంటే, దాన్ని మాత్రం ఆ దేశ స్పిన్నర్ నాధన్ లయాన్ వ్యతిరేకిస్తున్నాడు. పింక్ బాల్తో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ల నిర్వహణలో అతిగా వెళ్లకుండా ఉంటేనే మంచిదంటూ సలహా ఇచ్చాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్కు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదంటూనే, డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ వల్ల అంతగా ఉపయోగం లేదన్నాడు. 'ఎక్కువ శాతంలో డే అండ్ నైట్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ఇప్పటికే అడిలైడ్లో నిర్వహించిన పింక్ బాల్ మ్యాచ్ మంచి సక్సెస్ అయ్యింది. కానీ టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని రక్షించడం కూడా ముఖ్యమే. పింక్ బాల్ తో గేమ్లు నిర్వహిస్తే టెస్టు క్రికెట్కు హాని జరిగే అవకాశం ఉంది. దాంతో పింక్ బాల్ గేమ్ను సాధ్యమైనంత తక్కువగా నిర్వహిస్తేనే మంచిది. డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై అతిగా వెళ్లకండి' అని లయాన్ తెలిపాడు. ఈ మేరకు వచ్చే ఏడాది యాషెస్ సిరీస్లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు సీఏ ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టాడు. యాషెస్లో డే అండ్ నైట్ టెస్టును తాను కోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతేడాది వేసవిలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య అడిలైడ్ లో తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వెస్టిండీస్-పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో డే అండ్ నైట్ టెస్టును నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ నాల్గో టెస్టును డే అండ్ నైట్ మ్యాచ్ గా ఆడనుంది.