New technology
-
‘నల్ల పెట్టె’ మౌనరాగం!
బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు. ‘డెత్ కోడ్’ను రహస్యంగా తనలో దాచుకుంటుంది. ఈ బాక్స్ ఒకటి కూడా కాదు. నిజానికి రెండు పెట్టెలు! విమానం కూలిపోతే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే చాలు... ప్రమాద కారణాలు తెలిసినట్టే. ఆ తప్పులు, లోపాలు పునరావృతమవకుండా జాగ్రత్తపడితే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చు. విమానయానాన్ని అందరికీ సురక్షితం చేయవచ్చు.గాలిలో ప్రయాణం గాలిలో దీపం. రన్ వే మీది నుంచి పైకి ఎగిరిన విమానం మళ్లీ క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కారణాలు తెలియాలంటే, కచ్చితమైన ఆధారాలు కనుగొనాలంటే తొలుత దాని బ్లాక్ బాక్స్ పరిశోధకుల చేతికి చిక్కాలి. అందుకే దర్యాప్తు సంస్థలు ముందుగా దాని అన్వేషణ కోసం రంగంలోకి దిగుతాయి. బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు భాగాలు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. బ్లాక్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా ఇవి నల్ల రంగులో ఉండవు! ప్రమాద స్థలిలో సులభంగా గుర్తుపట్టగలిగేలా ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి.విమానం కూలిపోయినప్పుడు ఆ నష్ట ప్రభావం దాని తోకభాగంపై స్వల్పంగా పడుతుంది. అందుకే కీలక డేటా నిక్షిప్తమైన బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా దాన్ని విమానం తోక భాగంలో అమర్చుతారు. సెకన్ల వ్యవధిలో ఎఫ్డీఆర్ దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంది? ప్రయాణ మార్గం, దిశ వంటి వివరాలను అది నమోదు చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి పైలట్లు పంపిన, స్వీకరించిన సమాచారమేంటి? పైలట్ల సంభాషణలు, విమానంలోని కాక్పిట్ శబ్దాలు వంటి వివరాలను సీవీఆర్ రికార్డు చేస్తుంది.విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలేమిటి? దుర్ఘటన చివరి నిమిషాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనే వివరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. ఫ్లైట్ రికార్డర్ల డేటాను విశ్లేషించి ప్రమాద హేతువులపై పరిశోధకులు ఓ అంచనాకు వస్తారు. మరి దర్యాప్తులో ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె’… తాను మాట్లాడబోనంటూ అప్పుడప్పుడు మొండికేస్తుంది. కావాల్సిన డేటా ఇవ్వకుండా మొరాయించి ఇన్వెస్టిగేటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. క్లిష్ట సమయాల్లో రహస్యాలు బయటికి చెప్పకుండా మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’ విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి. దాంతో ఆ దుర్ఘటన దర్యాప్తు ప్రస్తుతం క్లిష్టంగా మారింది. దక్షిణ కొరియా విమానంలోని బ్లాక్ బాక్స్ ఎందుకు విఫలమైంది? బ్లాక్ బాక్సులు ఇలా విఫలమైన సందర్భాలు గతంలో ఉన్నాయా? అందుకు దారితీసే కారణాలేంటి? ఈ సమస్యను అధిగమించేదేలా? వివరాలు మీకోసం... వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులో భాగమైన రెండు ఫ్లైట్ రికార్డర్ల బరువు సుమారు 4.5 కిలోల దాకా ఉంటుంది. గురుత్వశక్తి కంటే 3,400 రెట్ల అధిక శక్తితో విమానం కూలుడు సంభవించినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కొంతసేపు భరించగలదు. విమానం సముద్రంలో కూలినా తానెక్కడున్నదీ తెలిపేలా హై పిచ్ శబ్దాలతో బ్లాక్ బాక్స్ 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. నీటిలో 20 వేల అడుగుల లోతులోనూ 30 రోజులు పనిచేయగలదు. దానిలోని కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా టెక్నీషియన్లు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసుకుని కాపీ చేస్తారు. అనంతరం డేటాను డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫలమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ (Software) లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సులు పనిచేయవు.ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు వాటిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ-యాక్టివేట్ చేసినప్పుడు అవి పనిచేయడం మానివేస్తాయి. డేటా ఓవర్ లోడ్ (Overload) అయినప్పుడు కూడా అవి మొరాయిస్తాయి. కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిర్ణీత కాలం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఫలితంగా వాటి నుంచి ఎలాంటి సమాచారం లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్లైన్స్ (airlines) బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో దాని తలుపు ఊడినప్పుడు (డోర్ ప్లగ్ బ్లో-అవుట్) సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. అత్యుష్ణ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటిలో ఎక్కువ కాలం నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. తేమ చేరుకుని సున్నిత భాగాల్లోని ఎక్విప్మెంట్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లోని పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సులు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం!ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యంపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఆవశ్యకత ఎంతో ఉన్నా ఖర్చు, పరిమితుల దృష్ట్యా వాటి సామర్థ్యం పెంపు అంశంలో కొంత జాప్యం సంభవిస్తోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలోని సాధారణ సిస్టమ్స్ నుంచి కాకుండా వేరే వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానం అంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి అందులోని 217 మంది మరణించారు. ఈ విమానంలో ఆన్బోర్డ్ (onboard) ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి.విమానం లోపల సాధారణ అవసరాలకు సరఫరా అయ్యే కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు మరో 10 నిమిషాలపాటు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లు ఉండాలని సదరు ప్రమాదం దరిమిలా అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సులకు బ్యాకప్ బ్యాటరీలున్నా వాటి జీవితకాలం తక్కువ. ఆ బ్యాటరీలు కొన్ని సందర్భాల్లో పనిచేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’ విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమవడంతో ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక అవి పనిచేయడం మానివేసి ఉంటాయని భావిస్తున్నారు.ఇక సీవీఆర్ విషయానికొస్తే అది సాధారణంగా ఒక విడతలో గరిష్ఠంగా రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ రెండు గంటల్లో రికార్డయిన డేటానే అది రిపీట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఇది ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 రియో డి జెనీరో (బ్రెజిల్) నుంచి ప్యారిస్ వెళుతూ నడి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి విమానంలోని 228 మంది చనిపోయారు. ఇక మలేసియా ఎయిర్లైన్స్ (airlines) ఎంహెచ్ 370 ఫ్లైట్ వ్యధ... ఇప్పటికీ అంతు లేని కథ! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా రాడార్ తెర మీది నుంచి ఆ విమానం అదృశ్యమైంది.అందులోని 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం అలా ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలో అదొక పెద్ద మిస్టరీ. ఆ విమానం ఏమైపోయిందో కనుక్కోవడానికి బోలెడు వ్యయమైంది. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విమానం దక్షిణ హిందూమహాసముద్రంలో కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాని జాడ కనుగొనేందుకు అన్వేషణ పునః ప్రారంభించాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానం దుర్ఘటన దరిమిలా... మహాసముద్రాలను దాటి దూర ప్రయాణాలు చేసే ట్రాన్స్-ఓషనిక్ ఫ్లైట్స్ విషయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల వాయిస్ డేటా రికార్డింగ్ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది.మలేసియా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యంతో ఆ సిఫార్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ దిశగా అమెరికా కూడా ముందడుగు వేసింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల రికార్డింగును తమ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీ-ఆథరైజేషన్ చట్టంలో చేర్చింది అమెరికా. అయితే కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలవుతోంది. ఇప్పుడు తిరుగుతున్న చాలా విమానాల జీవిత కాలం 40-50 ఏళ్లు. పాత విమానాల్లో సీవీఆర్ రికార్డింగ్ వ్యవధి పెంపు సాధ్యపడటం లేదు.కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు!తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సులకు రూపకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజి, బ్యాకప్ బ్యాటరీల జీవిత కాలం పెంపు వంటివి ఇందులోని ప్రధానాంశాలు. విమానాల కూలుళ్ల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రాబోతున్నాయి. విమానాలు సముద్రాల్లో కూలిపోయే మెరైన్ ప్రమాదాల్లో రికవరీ బృందాలు తక్కువ శ్రమతో సత్వరం బ్లాక్ బాక్సును గుర్తించేలా మెరుగుపరచిన ‘అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన రియల్ టైమ్ డేటాను గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేసే కొత్త డిజైన్లతో బ్లాక్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ఒకవేళ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ భౌతికంగా నాశనమైనా పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. - జమ్ముల శ్రీకాంత్ -
ప్రతి 6 నిమిషాలకో కొత్త టెక్నాలజీ.. పేటెంట్ దరఖాస్తుల వెల్లువ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 92,000 పేటెంట్ దరఖాస్తులు నమోదయ్యాయి. ఇది సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధికి కేంద్రంగా భారత్లో పెరుగుతున్న పరిపక్వతను సూచిస్తుందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ తెలిపారు.ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ భారత్లో ఐపీ రక్షణను కోరుతోందని అసోచాం సదస్సులో చెప్పారు. మేధో సంపత్తి (ఐపీ) హక్కులకు సంబంధించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నామని, కొత్త నిబంధనల కోసం వివిధ వాటాదారుల నుండి అభిప్రాయాలను కోరుతున్నామని అన్నారు.‘వివిధ రంగాలలో ఐపీ రక్షణ కోసం రూపొందించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నాం. ఈ కసరత్తు జరుగుతోంది. అటువంటి మార్గదర్శకాల ప్రభావాన్ని మరింత బలోపేతం చేయడానికి పరిశ్రమ సంఘాలు, ఐపీ వాటాదారులు కూడా సహకారం అందించవచ్చు. శక్తివంతమైన మేధో సంపత్తి (ఐపీ) హక్కుల వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన ఐపీ ఫైలింగ్ల దిశగా మేము పని చేస్తున్నాం. మంజూరైన పేటెంట్లలో ఈ వేగవంతమైన పెరుగుదల దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో, ఐపీ హక్కులను మంజూరు చేయడంలో భారత పేటెంట్ కార్యాలయ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అనేక ఆవిష్కరణలతో దరఖాస్తుల నాణ్యత పెరగడాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోంది’ అని ఆయన అన్నారు. -
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్లలో వీడియో కాల్కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ
రిలయన్స్ జియో మరో కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతోంది. ఇంట్లోని స్మార్ట్ టీవీలను తక్కువ ఖర్చుతో సులభంగా కంప్యూటర్లుగా మార్చే సాంకేతికతను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) అని పిలిచే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్గా మారుస్తుంది.ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్ మాత్రం ఉంటే చాలు. స్మార్ట్ టీవీలే కాకుండా సాధారణ టీవీలను సైతం జియోఫైబర్ లేదా జియోఎయిర్ఫైబర్తో వచ్చే సెట్-టాప్ బాక్స్ ద్వారా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా టీవీని క్లౌడ్ కంప్యూటింగ్కు కనెక్ట్ చేసే సాంకేతికత.జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీని ఉపయోగించడం చాలా సులభం. యూజర్ యాప్లోకి లాగిన్ అయితే చాలు. క్లౌడ్లో స్టోర్ అయిన డేటా మొత్తం టీవీ స్క్రీన్పై కనిపిస్తుంది. సాధారణంగా కంప్యూటర్లో చేసే ఈమెయిల్, మెసేజింగ్, సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, స్కూల్ ప్రాజెక్ట్లు, ఆఫీసు ప్రెజెంటేషన్ల వంటి పనులన్నింటినీ ఇప్పుడు టీవీలో చేయవచ్చు.ఖరీదైన కంప్యూటర్లను కొనుక్కోలేని దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి, సాధారణ కంప్యూటర్తో పోలిస్తే ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా డేటా రికవరీని చాలా సులభతరం చేస్తుంది. ఇది టీవీలతో పాటు మొబైల్ పరికరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్కు సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే నెలల్లో దీనిని మార్కెట్లో విడుదల చేయవచ్చు. -
అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం
బోకా చినా(అమెరికా): అగ్రరాజ్యం అమెరికాలో అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం చోటుచేసుకుంది. రాకెట్ను నింగిలోకి పంపించాక బూస్టర్ను మళ్లీ వినియోగించుకునేందుకు సాయపడే కొత్తరకం సాంకేతికతను అంతరిక్షరంగ సంస్థ స్పేస్ఎక్స్ విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగవేదిక నుంచి రాకెట్తోపాటు నింగిలోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి ఎగిరొచ్చిన ఘటనకు దక్షిణ టెక్సాస్లోని స్టార్బేస్ ప్రయోగవేదిక సాక్షిగా నిలిచింది. అమెరికా స్థానికకాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.25 గంటలకు ఈ స్టార్షిప్ రాకెట్ను ప్రయోగించారు. రాకెట్లోని 232 అడుగుల(71 మీటర్ల) ఎత్తయిన బూస్టర్.. లాంఛ్ప్యాడ్ నుంచి స్పేస్క్రాఫ్ట్ను నింగిలోకి పంపించిన ఏడు నిమిషాల తర్వాత మళ్లీ లాంఛ్ప్యాడ్కు వచ్చి చేరింది. నిప్పులు కక్కుతూ తిరిగొచి్చన బూస్టర్ను లాంఛ్ప్యాడ్లోని మెకానికల్ ‘చాప్స్టిక్’ చేతులు ఒడిసిపట్టిన వీడియోను స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేశారు. ‘‘రాకెట్ను లాంచ్టవర్ ఒడుపుగా పట్టేసుకుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్. అయితే ఇందులో ఎలాంటి ఫిక్షన్ లేదు’’ అని మస్క్ టీŠవ్ట్చేశారు. ప్రయోగం విజయవంతమవడంతో ప్రయోగకేంద్రంలోని స్పేస్ఎక్స్ శాస్తవేత్తలు, సంస్థ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. నాసా అడ్మినిస్టేటర్ సైతం వీళ్లకు ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా 400 అడుగుల(111 మీటర్ల)ఎత్తయిన అత్యంత భారీ రాకెట్కు సంబంధించిన బూస్టర్ ఇలా లాంఛ్ప్యాడ్ మీదకే తిరిగిచేరడం ఇదే తొలిసారి. బూస్టర్ వల్ల నింగిలోకి వెళ్లిన స్పేస్క్రాఫ్ట్ను శాస్త్రవేత్తలు హిందూమహాసముద్రంలో నిర్దేశిత సముద్రప్రాంతంలో దించారు. ఇంజనీరింగ్ చరిత్ర పుస్తకాల్లో లిఖించదగ్గ రోజు ఇది అని స్పేస్ఎక్స్ ప్రధానకార్యాలయంలో ఇంజనీరింగ్ మేనేజర్ కేట్ టైస్ ఆనందం వ్యక్తంచేశారు.లాంచ్ప్యాడ్పై తొలిసారిగా.. చిన్నపాటి ‘ఫాల్కన్–9’ రాకెట్లకు వినియోగించిన ఫస్ట్–స్టేజీ బూస్టర్లను గత తొమ్మిదేళ్లుగా స్పేస్ఎక్స్ వినియోగిస్తోంది. అయితే అందులో ఏవీ కూడా మళ్లీ లాంచ్ప్యాడ్కు చేరుకోలేదు. క్యాప్సూల్, స్పేస్క్రాఫ్ట్ను నింగిలోకి తీసుకెళ్లాక ఫస్ట్–స్టేజీ బూస్టర్లు సముద్రంలోని నిర్దేశిత తేలియాటే తలాలపై క్షేమంగా ల్యాండ్ అయ్యేవి. లేదంటే లాంచ్ప్యాడ్కు ఏడు మైళ్ల దూరంలోని కాంక్రీట్ శ్లాబులపై ల్యాండ్ అయ్యేవి. కానీ ఇలా భారీ ఫస్ట్–స్టేజీ బూస్టర్ తిరిగి లాంచ్ప్యాడ్కు తిరిగిరావడం ఇదే తొలిసారి. జూన్లో మినహా గతంలో భారీ ఫస్ట్–స్టేజీ బూస్టర్ల పునరాగమనంపై ప్రయోగాలు విఫలమయ్యాయి. ఫాల్కన్ విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాను భారీ స్టార్షిప్కు వాడాలని మస్క్ నిర్దేశించుకుని ఎట్టకేలకు విజయం సాధించారు. ఒక్కోటి 33 మిథేన్ ఇంధన ఇంజన్ల సామర్థ్యముండే బూస్టర్లతో తయారైన స్టార్షిప్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన పెద్ద రాకెట్గా పేరొందింది. ఇలాంటి రెండు స్టార్షిప్లను సరఫరాచేయాలని స్పేస్ఎక్స్కు నాసా ఆర్డర్ ఇచి్చంది. ఈ దశాబ్ది చివరికల్లా చంద్రుడి మీదకు వ్యోమగాములను తరలించేందుకు వీటిని వాడనున్నారు. -
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి
కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్ ఫ్యూజన్ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్ బుధవారం హైదరాబాద్లోని టీ-హబ్లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్! టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్ ఫైష్మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!! -
ఇండియన్ రైల్వే టార్గెట్.. ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం
టెక్నాలజీ ఎంత పెరిగిన రైలు ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అన్నారు. వచ్చే ఐదేళ్లలో నేషనల్ ట్రాన్స్పోర్టర్ 44,000 కి.మీలను కవచ్ కిందకు తీసుకువస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకీ ఈ కవచ్ సిస్టం అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. అదే ట్రాక్ మీద ఒకవేలా ట్రైన్ వస్తే అలాంటి సమయంలో రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రమాద సంకేతాలకు గుర్తిస్తే వెంటనే ట్రైన్ ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలు గురించినప్పటికీ ట్రైన్ ఆపరేటర్ చర్యలు తీసుకొని సమయంలో ఇదే ఆటోమేటిక్గా బ్రేక్లు వేస్తుంది.ప్రస్తుతం కవచ్ సిస్టమ్కు ముగ్గురు మాత్రమే తయారీదారులు ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ తయారీదారులు కూడా పెంచాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా మార్గాల్లో కవచ్ ఇన్స్టాలేషన్పై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి మరో 6000 కిమీ కవచ్ ఇన్స్టాలేషన్ కోసం టెండర్లను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.ప్రపంచంలోని చాలా ప్రధాన రైల్వే వ్యవస్థలు 1980లలో కవాచ్ మాదిరిగా ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ATP)కి మారాయి. అయితే మనదేశంలో భారతీయ రైల్వే 2016లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TACS) మొదటి వెర్షన్ ఆమోదంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఈ కవచ్ సిస్టం దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు. -
ఇద్దరు దొంగల ఫైటింగ్ కథ..
దొంగతనం చేయాలంటే పకడ్బందీగా స్కెచ్ వేయాలి. ఈ ఇద్దరు దొంగలకు మాత్రం ఎలాంటి స్కెచ్, పెన్సిల్ అవసరం లేకుండానే బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఒక ఇంటి ముందు వారికి కొరియర్ ప్యాకేజీ కనిపించింది. దాన్ని చూడగానే ‘యురేక’ అంటూ పరుగెత్తుకు వెళ్లారు.ఆ తరువాతే అసలు సీన్ స్టార్ట్ అయింది. ‘ఇది నాది’ అంటూ ఆ ఇద్దరు దొంగలు వాదులాడుకోవడమే కాదు ఒకరి ముఖంపై ఒకరు పంచ్లు ఇచ్చుకున్నారు. ఫైటింగ్ సీన్లు ఎన్నో ప్రదర్శించారు. డోర్ బెల్ కెమెరా ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఇంటి యజమాని షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.‘దొంగలు ప్యాకేజీని యాదృచ్ఛికంగా చూశారా? లేదా సాంకేతిక మాయాజాలంతో ఫలానా చోటుకి కొరియర్లో ప్యాకేజీ రానుందని తెలుసుకున్నారా? రెండోది నిజమైతే చాలా ప్రమాదమే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు నెటిజనులు.ఇవి చదవండి: ఏ దారెటు పోతుందో..? ఎవరినీ అడగక.. -
CABI: 'కాబి' ఉచిత డిజిటల్ టూల్స్..
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్’ (సిఎబిఐ – కాబి) రైతులకు అవసరమైన ప్రామాణికమైన శాస్త్రీయ సమాచారాన్ని తన వెబ్సైట్, యాప్ల ద్వారా తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత 110 సంవత్సరాల నుంచి పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై పరిశోధనలు చేస్తున్న ‘కాబి’తో 48 దేశాలకు చెందిన వ్యవసాయ సంస్థలు కలసి పనిచేస్తున్నాయి. మన ఐసిఎఆర్ కూడా ఇందులో మెంబరే.ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో ప్లాంట్వైస్ ప్లస్ టూల్ కిట్’ పేరుతో డిజిటల్ టూల్స్ని ‘కాబి’ ఇటీవల తెలుగు, హిందీల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. రైతులకు, విస్తరణ అధికారులకు, డీలర్లకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఇవి ఉపయోగకరం.వెబ్సైట్, అనేక యాప్ల ద్వారా రైతులకు శాస్త్రీయంగా సరైన సలహాలు పొందొచ్చు. ఇందులో నాలెడ్జ్ బ్యాంక్ పోస్టర్లు, కరపత్రాలు, రైతుల కోసం ఫ్యాక్ట్షీట్లు, వీడియో ఫ్యాక్ట్షీట్లు అందుబాటులో ఉన్నాయి. పంట ఆరోగ్యంపై సమాచారం తెలుసుకోవటం, పురుగుమందుల మోతాదులను లెక్కించటం, ఎరువుల అవసరాలను నిర్ణయించటం, పంట సమస్యను గుర్తించటం, చీడపీడల నియంత్రణకు పురుగుమందులను కనుగొనటం, పురుగులను– తెగుళ్లను గుర్తించే నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం, చీడపీడల నియంత్రణ పద్ధతులను సిఫారసు చేయటం, తెగుళ్ల నిర్వహణపై శిక్షణ.. తదితర సమాచారం / నైపుణ్యాలను కాబి వెబ్సైట్, డిజిటల్ టూల్స్ అందిస్తాయి.కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్ను స్కాన్ చేయండిఇవన్నీ తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉండటం వల్ల మహిళా రైతులు కూడా సులువుగా వాడుకునేందుకు వీలవుతుంది. ఈ వనరులను ఉపయోగించుకోవడానికి మనకు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ /ల్యాప్టాప్తో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.మొక్కల ఆరోగ్య సమాచారం విభాగంలో.. మన దేశానికి సంబంధించిన పంటల ఆరోగ్యం, తెగుళ్ల నిర్వహణపై సమాచారం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్లాంట్వైజ్ ఫ్యాక్ట్షీట్ లైబ్రరీ’ అనే ఉచిత యాప్ను డౌన్లోడ్ చేసుకొని తెగుళ్ల నిర్థారణ, సురక్షిత నిర్వహణకు ఉపయోగపడే తాజా సమాచారం తెలుసుకోవచ్చు. మొక్కల రక్షణ మద్దతు విభాగంలో.. ‘క్రాప్ స్ప్రేయర్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాబి క్రాప్ స్ప్రేయర్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్ను స్కాన్ చేయండిసురక్షితమైన పురుగుమందులు, వాటి మోతాదును లెక్కించడానికి సహాయపడుతుంది. ‘కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్’ అనే ఉచిత వెబ్సైట్ పంట తెగుళ్లను నయం చేయటానికి స్థానికంగా నమోదైన బయో పెస్టిసైడ్స్ను కనుగొనటంలో, ఉపయోగించటంలో సహాయపడుతుంది. రైతులకు లోతైన అవగాహన కలిగించడం కోసం డిజిటల్ లెర్నింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. పంట తెగులు నిర్థారణ కోర్సు, పంటల చీడపీడల యాజమాన్య కోర్సు, బయోప్రొటెక్షన్ ్రపోడక్ట్స్ కోర్సు అందుబాటులో ఉంది.26న ‘బయోచార్ కార్బన్ క్రెడిట్స్’పై సదస్సు..బయోచార్ (కట్టె బొగ్గు)ను పంట వ్యర్థాలు, తదితర బయోమాస్తో భారీ ఎత్తున యంత్రాలతో ఉత్పత్తి చేస్తూ ‘కార్బన్ క్రెడిట్స్’ పొందుతున్న వాణిజ్య సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటువంటి సంస్థలకు మార్గదర్శకత్వం నెరిపేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ’ ఇటీవల ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ‘బయోచార్ ఉత్పత్తి పరికరాలు–కార్బన్ క్రెడిట్స్’ అనే అంశంపై జూన్ 26న ఉ. 9.30 గం. నుంచి హైదరాబాద్ యూసఫ్గూడలోని నిమ్స్మే ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ముఖ్య అతిథి. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 63051 71362.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే!
‘బారెంట్స్ అండ్ ఫిషింగ్.. నార్త్ అట్లాంటిక్ ఫ్రాంఛైజీలకు సీక్వెల్గా వచ్చిన గేమ్ షిప్స్ ఎట్ సీ. ఈ బ్రాండ్–న్యూ గేమ్ప్లేలో రకరకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న మల్టీప్లేయర్ మోడ్లో వచ్చిన ఈ గేమ్ ద్వారా మహా సముద్రాలకు సంబంధించి రియలిస్టిక్ ఎక్స్పీరియెన్స్ను సొంతం చేసుకోవచ్చు.నెక్ట్స్ జనరేషన్ షిప్ స్టిమ్యులేషన్గా వచ్చిన ఈ గేమ్లో మొదటిసారిగా సర్వీస్, కార్గో నౌకలను పరిచయం చేశారు. వీటిలో సరికొత్త గేమ్ప్లే ఫీచర్లో ఉంటాయి. ‘స్నేహితులతో కలిసి నార్వేజియన్ సముద్రంలోకి వెళ్లండి. సినిమాటిక్–క్వాలిటీ ఓషన్ స్టిమ్యులేషన్ దీని సొంతం. సముద్ర సాహసాలు చేయాలనే ఉత్సాహం మీలో ఉందా? అయితే షిప్స్ ఎట్ సీలోకి వచ్చేయండి’ అంటుంది గేమ్ డెవలపర్ మిస్క్ గేమ్స్.జానర్స్: ఎర్లీ యాక్సెస్, స్ట్రాటజీ వీడియో గేమ్,ల్యాట్ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్,ఇంజిన్: అన్రియల్ ఇంజిన్ 5.ఇవి చదవండి: ఈ టేస్టీ స్నాక్స్తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..! -
World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్తో జాగ్రత్త!
ఇటీవల మానవ అక్రమ రవాణాలో ఆధునికత చోటు చేసుకుంది. సాంకేతిక యుగంలో మనం ఉపయోగించే రకరకాల మాధ్యమాలు ఇందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ నవీన కాలంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుందో అవగాహన పెంచుకుంటే, జాగ్రత్త పడటం సులువు అవుతుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీజ (పేరుమార్చడమైంది) తన తల్లి ఫోన్ని ఉపయోగిస్తుండేది. శ్రీజకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ముగ్గురు ఉన్నారు. తండ్రి మరణించడంతో తల్లి నాలుగిళ్లలో పాచి పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఒక రోజు మొత్తం శ్రీజ కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను సంప్రదించారు. రెండు రోజులు వెతకగా శ్రీజ కలకత్తాలో ఉన్నట్టు తెలిసింది. అపరిచిత వ్యక్తి ప్రేమ పేరుతో ఫోన్ ద్వారా నమ్మబలికి, శ్రీజ ను రప్పించినట్టుగా, అటు నుంచి ఆమెను మరో చోటుకి తరలించే ప్రయత్నం చేసినట్టు గుర్తించి, తిరిగి తీసుకొచ్చి, తల్లికి అప్పజెప్పారు. ఆడపిల్లలు/మహిళలను తప్పుదోవ పట్టించే నేర ప్రక్రియలో ఇంటర్నెట్ ఒక మాధ్యమంగా మారింది. సామాజిక మాధ్యమాలలో కనిపించిన ‘కిడ్నీ కావలెను’ అనే ప్రకటన చూసిన రమేష్ (పేరు మార్చడమైనది) అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ను సంప్రదించాడు. అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు విని, ఒక కిడ్నీ ఇస్తే తనకు ఆర్థిక బాధలు తొలగిపోతాయని భావించాడు. చెప్పిన చోటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. లైంగిక అత్యాచారం, శ్రమ దోపిడి, శిశువుల అమ్మకాలు, అవయవాలు, వధువుల అక్రమ రవాణాలో ఇప్పటి వరకు ఒక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్రాఫికర్లు సైబర్ స్పేస్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్గా నిలిచింది. ► సైబర్ ట్రాఫికింగ్లో లైంగిక దోపిడీ ప్రాబల్యం రకరకాల రూపాలను చూపుతుంది. యుఎన్ డాట్ జిఎఫ్టి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సైబర్ ట్రాఫికింగ్లో లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణా 79 శాతం ఉన్నట్టు గుర్తించింది. బాలికలు 13 శాతం, పురుషులు 12 శాతం, బాలురు 9 శాతం అక్రమ రవాణాకు గురైనట్టు పేర్కొంది. సైబర్ ఫేక్... ► ట్రాఫికర్లు మహిళలపై హింసకు సోషల్ మీడియా ద్వారా కొత్త మార్గాలను తెరిచారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షించడం, మోసగించడం, ట్రాప్ చేయడం ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా అమ్మాయిలను /మహిళలను ట్రాప్ చేయడానికి నేరస్తులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేక్ ఐడీలను సృష్టించి స్కూల్, కాలేజీ యువతుల భావోద్వేగాలపైన తమ ప్రభావం చూపుతుంటారు. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ, కానుకల ద్వారా ఆకర్షిస్తూ, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా బెదిరిస్తూ ఇల్లు దాటేలా చేస్తుంటారు. ► సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో బాధితులను తమకు అనుకూలంగా మార్చడం, నియంత్రించడం వంటివి జరుగుతున్నాయి. ► ఉద్యోగాల పేరుతో యువకులను ఆకర్షించి, వారు సైబర్ నేరాలకు పాల్పడేలా వేధింపులకు లోను చేయడం. ► అద్దె గర్భం (సరోగసీ విధానం) కూడా ఇప్పుడు ఆన్లైన్ వేదికగా కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి వెళ్లిన వాళ్లు కొత్త సమస్యలలో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది. ► పోర్నోగ్రఫీ అక్రమ రవాణాకు ప్రతి క్షణం ఆజ్యం పోస్తూనే ఉంది. ఈ విష చట్రంలోకి ప్రపంచ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు చేరుతున్నట్టు, ఈ అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. డిజిటల్ వేగం వాడుకలో సౌలభ్యంతో పాటు వేగం ఉండటం వల్ల కూడా నేరస్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని ఇంటర్నెట్ మాధ్యమాల్లో వాటిని చూపుతున్నారు. దీని వల్ల డిజిటల్ జాడలు కనిపెట్టి, మనవారిని రక్షించడం అనేది పెద్ద ప్రయాసగా మారింది. అప్రమత్తతే అడ్డుకట్ట ఇంటర్నెట్ వాడకం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నట్టే, సరిహద్దులు దాటి సుదూర దేశాల నుండి మనల్ని మరో మార్గంలో ప్రయాణించేలా చేయడానికి సైబర్ ట్రాఫికర్స్ పొంచి ఉన్నారు. అందుకే, సోషల్ మీడియా వాడకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఇంటర్నెట్ వాడకం ద్వారా జరిగే నష్టాలు, మానవ అక్రమ రవాణాకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. డార్క్ టీమ్స్ ఉంటాయి జాగ్రత్త సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కొత్త పదం వచ్చింది. మన దేశం నుంచి విదేశాలకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి, సైబర్ క్రైమ్ చేయిస్తుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అధికంగా ఉన్నవారిని గుర్తించి ఈ విధానానికి ఎంచుకుంటారు. తాము చెప్పినట్టుగా ఒప్పుకోనివారిని వేధిస్తారు. లేదంటే, వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు వసూలు చేసి, వదిలేస్తారు. ఆ తర్వాత సైబర్ ట్రాఫికింగ్లో ఆర్గాన్ ట్రేడింగ్, సరోగసి కూడా ప్రధానంగా ఉన్నాయి. నేరస్థులు సైబర్ డార్క్ టీమ్స్ను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా అమాయకులను ట్రాప్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అందుకని అపరిచితులతో పరిచయాలను పెంచుకోవద్దు. ఒంటరి మహిళలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. మన వివరాలను ఆన్లైన్లో బహిరంగ పరచకూడదు. ఆన్లైన్ అగ్రిమెంట్లాంటివి చేయకూడదు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోకూడదు. – అనీల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్వేర్ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్వేర్ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
15 నిమిషాల ఛార్జ్తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్లోని గీలీ హోల్డింగ్ గ్రూప్కు చెందిన బ్యాటరీ ప్లాంట్లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
రంగంలోకి గూగూల్ ఏఐ ‘జెమినీ’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో టెక్ దిగ్గజం గూగుల్ కొత్త శకానికి నాంది పలికింది. 'గూగుల్ జెమిని' (Google Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఈ కొత్త ఏఐ ఎన్ని వేరియంట్లలో ఉంటుంది, దీని వల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ జెమిని అనేది టెక్ట్స్, ఫోటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలుస్తోంది. ఇది డేటా సెంటర్లలో, కార్పొరేట్ అవసరాలకు మాత్రమే కాకుండా మొబైల్ డివైజ్లలో కూడా పనిచేస్తుందని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) వెల్లడించారు. గూగుల్ జెమిని ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్, క్రోమ్ బ్రౌసర్ వంటి అన్ని గూగుల్ సర్వీసుల్లో ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వేరియంట్స్ గూగుల్ జెమిని మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి జెమిని నానో, జెమిని ప్రో, జెమిని అల్ట్రా వేరియంట్లు. జెమిని నానో జెమిని నానో అనేది మొబైల్ డివైజ్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏఐ టెక్నాలజీ. ఇది గూగుల్ పిక్సెల్ 8 ఫోన్కు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ 4 వెర్షన్లో కూడా పనిచేస్తుంది. జెమిని నానో డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా చాట్, మెసేజింగ్ యూప్లు ఆఫ్లైన్లో కూడా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జెమిని ప్రో గూగుల్ బార్డ్ ఏఐకు జెమిని ప్రో అనేది అడ్వాన్స్డ్ వె ర్షన్. ఇది వేగవంతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుందని గూగుల్ వెల్లడించింది. ఇది కూడా డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. జెమినీ అల్ట్రా గూగుల్ కొత్త ఏఐ టెక్నాలజీలో జెమిని అల్ట్రా అనేది శక్తివంతమైన వెర్షన్. ఇది కార్పొరేట్ సంస్థల అవసరాలకు కూడా ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. పైథాన్, జావా వంటి అనేక ప్రోగ్రామింగ్ భాషలను అర్థం చేసుకుని కావలసిన రిజల్ట్ అందిస్తుంది. ఇది 2024 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Everything you need to know about Gemini — Google’s largest and most capable AI model — in just 90 seconds. #GeminiAI pic.twitter.com/b7j08bV0YN — Google (@Google) December 7, 2023 గూగుల్ జెమిని స్పెషాలిటీ గూగుల్ జెమిని కేవలం కమర్షియల వినియోగాలకు మాత్రమే కాకుండా.. విద్యార్థులు హోంవర్క్ విషయంలో కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్ హోంవర్క్ను ఫోటో తీసి జెమిని ఏఐలో అప్లోడ్ చేస్తే ఖచ్చితమైన సమాధానం లభిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా గూగుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం!
Sweden Electrified Road: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఎదురవుతున్న ఛార్జింగ్ సమస్యల దృష్ట్యా కొందరు ఫ్యూయల్ వాహనాలనే ఎంచుకుంటున్నారు. భారతదేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు రంగంలోకి దిగి, సంబంధిత సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే స్వీడన్ ఈ సమస్యకు కొత్త టెక్నాలజీతో చెక్ పెద్దటానికి సిద్ధమైంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ వేసుకుంటూ ఉండాలి, ఛార్జింగ్ తగ్గితే గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి ముందుగానే ఫుల్ ఛార్జింగ్ చేసుకుని, దాని రేంజ్ ఎంతో.. అంత దూరం ప్రయాణించడానికి ప్లాన్ వేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్లాలంటే మళ్ళీ ఛార్జింగ్ వేసుకోక తప్పదు. తద్వారా ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ఇప్పుడు స్వీడన్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎలక్ట్రిఫైడ్ రోడ్స్' నిర్మిస్తోంది. వీటి ద్వారా కారు నడుస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడే ఛార్జ్ చేసుకోగలదు. ఛార్జింగ్ వేసుకోవడానికి ప్యత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. దీని కోసం సరికొత్త టెక్నాలజీ కండక్టీవ్ రెయిల్స్, ఇండక్టివ్ కాయిల్స్తో 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన జాతీయ రహదారి స్వీడన్ ప్రధాన నగరాలైన స్టాక్హోమ్, గోథెన్బర్గ్, మాల్మో మధ్యలో నిర్మితమవుతోంది. ఇది 2025 నాటికి వినియోగంలో రానున్నట్లు సమాచారం. -
స్కిల్ పెంచండి బాబులూ..!
స్కిల్స్ పలు రకాలు.. ఏ ‘స్కిల్’ ప్రమాదకరమో మొన్నీమధ్యే చూశాం కదా, అలాంటివి కాదు. మనకూ జనానికీ ఉపయోగపడేవి. ఆ స్కిల్స్ చూడండి సరదాగా... సేల్స్.. స్కిల్ ఓ పెద్దమనిషి, అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. జోరు వర్షంలో గొడుగేసుకుని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పుస్తకాలు అమ్ముతున్నాడు. అప్ప టికే బాగా చీకటి పడింది. ఇది ఆసక్తిగా అనిపించి ఓ యువకుడు కారులోనుంచే.. ‘పుస్తకం ఎంత’ అని అడిగాడు. ‘మూడువేల రూపాయలు. కానీ, నీకు అమ్మబోను. నీకు ఈ పుస్తకం చదివే ధైర్యం ఉన్నట్టు లేదు,’ అన్నాడు ‘‘నాకు చాలా ధైర్యం ఉంది. గంటలో లాగించేస్తాను.’ – అన్నాడా యువకుడు కాస్త రోషంతో. ‘‘..అయితే ఒక షరతు మీద ఈ పుస్తకం నీకు అమ్ముతా, అది ఓకే అయితే నీకు ఓ వంద డిస్కౌంట్ కూడా ఇస్తా..’’ అన్నాడా పెద్దమనిషి ‘‘ఏమిటా షరతు?’’ ‘‘నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. చాలా బాధపడతావు.’’ ‘‘ఓకే ప్రామిస్!.. నేను ధైర్యవంతుడినే అయినా, చివరి పేజీ చదవను, ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు..’’ అంటూ మనీ పెద్దమనిషి చేతిలో పెట్టాడు. పెద్దమనిషి డబ్బులు తీసుకుని పుస్తకం ఇస్తూ షరతు గురించి మళ్లీ గుర్తు చేశాడు. పుస్తకం తీసుకున్న యువకుడు ఇంటికి వెళ్లి భయం, భయంగా పుస్తకం చదివేశాడు. క్రైమ్ థ్రిల్లర్ బుక్ అది.. కొంచెం క్రైమ్, కొంచెం సస్పెన్స్ ఉన్నా... మరీ అంత భయంకరంగా లేదు. చివరి పేజీ ఎందుకు చదవ వద్దన్నాడా పెద్దమనిషి? దానిలో అంత తట్టుకోలేని బాధ ఏముంటది? అని మనవాడికి డౌట్ వచ్చింది. చదువుదామని మనసు పీకింది. కాస్త భయం వేసింది. ప్రామిస్ను పక్కన పెట్టి... గుండె దిటవు చేసుకుని భయం భయంగా చివరి పేజీ చూస్తే నిజంగానే గుండె ఆగినంత పనైంది.. ఆ చివరి పేజీలో ఇలా ఉంది ‘పుస్తకం ఖరీదు 50 రూపాయలు...’ ఇదీ సేల్స్ స్కిల్... అంతే కదా? ... ఇక ఈ తరహా తెలివితేటలు చూడండి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మేడిన్ ఇండియా! ఒకసారి అమెరికా కంపెనీలో సబ్బుల ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది. కొన్ని కవర్లు ప్యాక్ అయ్యాయి కానీ, అందులో సబ్బుల్లేవు. డీలర్లు, కస్టమర్ల గొడవ.. పెద్దగోలయ్యింది. దానితో యాజమాన్యం కంపెనీలో ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడూ రాకూడదనీ, పరువు పోకూడదనీ జాగ్రత్త కోసం ఆరు కోట్లు పెట్టి ఎక్స్రే మెషీన్ కొన్నదట. ప్యాకైన సబ్బులు వెళుతుంటే అందులో సబ్బు ఉన్నదీ లేనిదీ ఆ మెషీన్ ద్వారా కనుక్కుని తీసేయడానికి వీలయ్యింది. ఈ విషయం హైదరాబాద్ సబ్బుల కంపెనీలో మీటింగ్లో ప్రస్తావనకు వచ్చింది. ఆ అమెరికా కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆ దేశ టెక్నాలజీని, వాళ్ల స్కిల్ను. శ్రద్ధను చిలవలు పలవలుగా వివరిస్తున్నాడు. ఆ మీటింగ్లో చాయ్ బిస్కట్ ఎంజాయ్ చేస్తున్న మనోడు లేచి,‘‘ఎందుకు సర్ 6 కోట్లు తగలేశారు. ఓ 3వేలు పెట్టి ‘పెడెస్టెల్ ఫ్యాన్’ కొని స్పీడ్గా తిప్పితే ఖాళీ ప్యాకెట్లు ఎగిరిపోతాయిగా. పొరపాటున ఖాళీగా వచ్చేవి ఒకటీ రెండేగా’’... అనేసి మళ్లీ చాయ్ బిస్కట్ మీద పడ్డాడు. దీనితో అమెరికా ఎగ్జిక్యూటివ్ అవాక్కయ్యాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అన్న సామెత అన్నిచోట్లా వర్తించదు. ఎంత పాముకు అంత కర్ర.. అదీ సరైన సమయంలో. – ఇదీ ఓ రకమైన జాబ్ స్కిల్లే కదా! నో స్కిల్... 81 పర్సెంట్... ఇంతకీ స్కిల్లు గురించి ఎందుకీ సొల్లు అంటారా? అత్యుత్తమ ఔట్పుట్ ఇవ్వగల నైపుణ్యాలు ఉద్యోగుల్లో ఉండటం లేదట. ఒకటో, రెండో కాదు.. ఐటీ రంగంలో ఏకంగా 81 శాతం సంస్థలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఈవై, ఐమోచా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన అంశాలపై ఈవై, ఐమోచా సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ‘టెక్ స్కిల్స్లో మార్పులు – ఆ తర్వాత పని పరిస్థితులు’ పేరిట ఇటీవల నివేదికను విడుదల చేశాయి. – ప్రస్తుత డిజిటల్ యుగంలో పోటీలో నిలిచేందుకు వీలుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయనీ.. కానీ వాటికి తగినట్టుగా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోందనీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఐటీ రంగం మాత్రమే కాకుండా... బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, డేటా అనాలసిస్ వంటి ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. – అప్లికేషన్ డెవలపర్లు, పవర్ యూజర్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరగడం కూడా కొరత నెలకొనడానికి కారణమని నివేదిక పేర్కొంది. స్కిల్ ఉంటేనే జాబులు... – సర్వేలో పాల్గొన్న చాలా సంస్థలు డెవలపర్, పవర్ యూజర్ నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. కొత్త టెక్నాలజీలు, అవసరాలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికి ఏ నైపుణ్యాలు తప్పనిసరి అనే విభజనను అనుసరిస్తున్నామని 19 శాతం కంపెనీలు తెలిపాయి. 43 శాతం కంపెనీలు ఉద్యోగుల స్థాయిలో నైపుణ్యాల పరిశీలన చేపట్టామన్నాయి. ఈ విభజన/పరిశీలన క్రమంలో చాలా మంది ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలు లేనట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఈ క్రమంలో ఓవైపు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మరోవైపు మంచి స్కిల్స్ ఉన్నవారిని చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించాయి. స్కిల్స్ పెంచేద్దాం... ప్రస్తుతం ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు, అందుకు అవసరమైన నైపుణ్యాల్లో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి తమ సంస్థల్లోని మూడో వంతు ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించాల్సిన అవసరం ఉందని 28 శాతం సంస్థలు భావిస్తున్నాయనీ వివరిస్తోంది. మరో 62శాతం కంపెనీలు కనీసం 15 శాతం మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపు తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలోనూ అంతే.. భారతదేశంలోని 60 శాతానికి పైగా కంపెనీలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నట్టు ఇటీవలి ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ నివేదికలో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) కూడా పేర్కొంది. ముఖ్యంగా చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నవారికి తగిన నైపుణ్యాలు ఏమాత్రం ఉండటం లేదని వెల్లడించింది. ఉద్యోగుల్లో నైపుణ్యాల కల్పనకు తోడ్పడే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి వాటిని భారత్లో ఉపేక్షిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్స్ కల్పించేలా విద్యా రంగంలో సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడింది. సరికొండ చలపతి -
B20 Summit 2023: నైతిక ‘కృత్రిమ మేధ’ అత్యావశ్యం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు. ‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు. వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు ‘ప్రస్తుతం భారత్లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది. దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు. -
ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినా నేరమేనా?
సాక్షి, అమరావతి: ‘కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నట్టు తనకు గిట్టని ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడంలో, విష ప్రచారం చేయడంలో ఈనాడు రామోజీరావుది కూడా ఇదే తీరు. ఇందులో భాగంగానే బుధవారం తన విష పుత్రిక ‘ఈనాడు’లో ‘ఉచిత సాఫ్ట్వేర్ మాకొద్దు.. రూ.34 కోట్లిచ్చి కొంటాం’ అనే శీర్షికతో ఒక తప్పుడు కథనం వండివార్చారు. మారుతున్న ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతున్నా రామోజీ ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు సరికొత్తగా అత్యాధునిక సేవలు అందించడం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పాత టెక్నాలజీకి స్వస్తి పలకడం ‘ఈనాడు’కు కంటగింపుగా మారింది. కొత్త టెక్నాలజీ ముందుకు వస్తుంటే పాత టెక్నాలజీని వదిలించుకోవడం ఎక్కడైనా జరిగే సర్వ సాధారణమైన విషయం. అయితే ఇది ఘోర తప్పిదంలాగా కళ్ల నిండా పచ్చవిషం నింపుకున్న రామోజీరావుకు కనిపించింది. అందుకే ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారకుండా... కేంద్రం ఉచితంగా సాఫ్ట్వేర్ ఇస్తోంది కాబట్టి దాన్నే వాడాలంటూ ఈనాడు తన కథనంలో వితండ వాదానికి దిగింది. అప్గ్రేడ్ చేసే స్థాయి వనరులు తనకు లేవన్న ఎన్ఐసీ 1999 నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ ఆధారిత సేవలు అందిస్తోంది. అప్పటి అవసరాలకనుగుణంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ).. సీఏఆర్డీ (కార్డ్) అప్లికేషన్ను రూపొందించినా ఆ తర్వాత ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోయింది. అప్పట్లో సంవత్సరానికి కేవలం 2 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు మాత్రమే ఈ అప్లికేషన్ను రూపొందించారు. ప్రస్తుతం ఏటా 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసే సామర్థ్యం లేక రెండు దశాబ్దాల నాటి కార్డ్ సాఫ్ట్వేర్ చతికిలపడింది. సర్వర్లు మొరాయించడం, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడడాన్ని ఈనాడు పలుసార్లు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులను తప్పించడానికి కార్డ్ అప్లికేషన్ను అప్గ్రేడ్ చేయడం అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కార్డ్ను కార్డ్ ++ గా అప్గ్రేడ్ చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన ఎన్ఐసీ 2017లో అందుకు ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం దాని అమలుకు రూ.13.14 కోట్లను మంజూరు చేసింది. ఆ అప్లికేషన్ కోసం రూ.11.82 కోట్లను ఎన్ఐసీ ఢిల్లీకి చెల్లించింది. డబ్బు తీసుకున్నా టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడంలో ఎన్ఐసీ విఫలమైంది. అనేకసార్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఎన్ఐసీతో చర్చలు జరిపినా తమకు ఆ స్థాయి వనరులు లేవని చెబుతూ వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ల సేవల్లో తరచూ అంతరాయాలు, ఇబ్బందులు తలెత్తేవి. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 వేల సచివాలయాల్లో ఆ సేవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కార్డ్ అప్లికేషన్ను అవసరాలకు తగ్గట్టు అత్యవసరంగా ఆధునికీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్డ్ ++ అప్లికేషన్ను అప్గ్రేడ్ చేయలేకపోయిన ఎన్ఐసీకి తాము ఇచ్చిన సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాలని, కొత్త టెక్నాలజీ పార్టనర్ను చూసుకుంటామని రిజిస్ట్రేషన్ల శాఖ ఆ సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఎన్ఐసీ రూ.6.20 కోట్లు వెనక్కి ఇచ్చేసింది. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ.. ఎన్ఐసీ చేతులెత్తేయడంతో గతేడాది రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీజీఎస్ ద్వారా కొత్త టెక్నాలజీ పార్ట్నర్ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో ఐదు కంపెనీలు పాల్గొన్నాయి. రూ.33.99 కోట్లతో ఎల్–1గా నిలిచిన క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ కొత్త పార్ట్నర్గా ఎంపికైంది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రైమ్ కార్డ్ అప్లికేషన్ను ఆ కంపెనీ రూపొందించింది. ప్రజలకు ఇబ్బందులు తప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని అభినందించాల్సింది పోయి తనకలవాటైన రీతిలోనే ‘ఈనాడు’ విషం చిమ్మింది. కేంద్రం ఉచితంగా సాఫ్ట్వేర్ ఇస్తానంటే వద్దని ప్రభుత్వం రూ.34 కోట్లతో తమకు కావాల్సిన వారికి ఆ కాంట్రాక్టు ఇచ్చిందని అడ్డగోలు అబద్ధాలను తన కథనంలో వండివార్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలనే ఉద్దేశంతో ఎన్జీడీఆర్ఎస్ సాఫ్ట్వేర్ను కేంద్రం 2012లో తెచ్చింది. అప్పటికి 14 ఏళ్లకు ముందే మన రాష్ట్రంలో కార్డ్ అప్లికేషన్ ద్వారా అంతకుమించిన ఐటీ ఆధారిత రిజిస్ట్రేషన్ సేవలు అమలవుతున్నాయి. కేంద్రం ఇచ్చిన సాఫ్ట్వేర్ను ఉచితంగా తీసుకుంటే మళ్లీ మనం పాత టెక్నాలజీనే వాడాల్సి ఉంటుంది. ఆ టెక్నాలజీ అప్పటికి ఐటీ సేవలు ప్రారంభించని రాష్ట్రాలకు ఉపయోగం తప్ప అప్పటికే టెక్నాలజీ సేవల్లో ముందున్న మన రాష్ట్రానికి కాదు. ఈ విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కేంద్రానికి చెప్పి తాము ఇంకా ఆధునిక టెక్నాలజీలోకి వెళుతున్నట్లు చెప్పగా అంగీకరించింది. కానీ ‘ఈనాడు’ మాత్రం పాత టెక్నాలజీనే వాడాలంటూ వింత వాదనలు చేస్తోంది. కొత్త టెక్నాలజీ ద్వారా అత్యాధునిక సేవలు.. రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగా తెచ్చిన ప్రైమ్ కార్డ్ అప్లికేషన్ అత్యాధునిక టెక్నాలజీతో అన్ని అవసరాలను తీర్చేలా పనిచేస్తుంది. దీనిద్వారా త్వరలో ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందించబోతున్నారు. వినియోగదారులు తమ డాక్యుమెంట్లను ఆన్లైన్లో తామే తయారు చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. రెవెన్యూ, మున్సిపల్ శాఖల డేటాబేస్లకు అనుసంధానమై అత్యంత కీలకమైన ఆటోమ్యుటేషన్ విధానాన్ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారానే అందుబాటులోకి తేనున్నారు. ఈ–సైన్, ప్రైమ్ మొబైల్ యాప్ల ద్వారా సరికొత్త రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ముంగిటకు రానున్నాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ చెల్లింపులు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలన్నింట్లోనూ ఈ కొత్త టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలన్నింటినీ ఎన్జీడీఆర్ఎస్ సాఫ్ట్వేర్ ద్వారా, ఎన్ఐసీ పాత సాఫ్ట్వేర్తో చేసే పరిస్థితి ఏమాత్రం లేదు. ఆధునిక అవసరాలకు తగ్గట్టు ఈ సేవలన్నీ అందించేలా ప్రైమ్ కార్డ్ టెక్నాలజీని నడిపే సామర్థ్యం ఉండడం వల్లే క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ కంపెనీని టెక్నాలజీ పార్ట్నర్గా ఎంపిక చేశారు. ఇది ఈనాడుకు మింగుడుపడకే తన కథనంలో దుష్ప్రచారానికి దిగింది. -
పాఠశాల విద్యలో ఏఐ టెక్నాలజీతో పక్కాగా వివరాలు
-
రోబోటిక్స్పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్రంజన్ పేర్కొన్నారు. నానక్రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
భయపడుతున్న ఫోన్పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..
UPI Plugin: యూపీఐ చెల్లింపులు అమలులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బు పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఫోన్పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ రోజు మొబైల్ నెంబర్ టైప్ చేసి కూడా అమౌంట్ పంపించేస్తున్నాము. కాగా ఈ రెండు యాప్లకి ఓ కొత్త టెక్నాలజీ సవాళ్ళను విసురుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫోన్పే, గూగుల్ పే వంటి వాటికి సరైన ప్రత్యర్థిగా నిలువడానికి 'యూపీఐ ప్లగిన్' (UPI Plugin) అందుబాటులోకి రానుంది. దీనిని మర్చెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (SDK) అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే సులభంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ చెల్లించడానికి థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు మనం ఎప్పుడైనా జొమాటో లేదా స్విగ్గీ వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే అమౌంట్ చెల్లించడానికి యూపీఐ ఆప్సన్ ఎంచుకుంటాము. ఇలా చేసినప్పుడు కొన్ని సార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ప్లగిన్ దీనికి చెక్ పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే? పేటీఎమ్, రేజర్పే, జస్పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్ చేసుకొనేందుకు మర్చంట్స్కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా. ఇది అమలులోకి వచ్చిన తరువాత తప్పకుండా వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫోన్పే, గూగుల్ పే ఆదరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ప్రస్తుతం ఫోన్పే మార్కెట్ వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 33 శాతం వరకు ఉంది. అయితే స్విగ్గి, జొమాటో, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థలు ఈ కొత్త వ్యవస్థకు మారితే మిగిలిన యాప్స్ సంగతి అధోగతి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
యంగ్ కమల్.. ఓ టెక్నిక్
పాతికేళ్ల క్రితం కమల్హాసన్ వయసుకు మించి కనిపించిన పాత్రల్లో ‘ఇండియన్’లో సేనాపతి, ‘భామనే సత్యభామనే’లో వృద్ధురాలి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసులో ఆరు పదుల వయసుకి మించి కమల్ కనిపించిన పాత్రలివి. ఇప్పుడు ఇంకో ఏడాదికి కమల్ ఏడు పదుల వయసుని టచ్ చేస్తున్న నేపథ్యంలో యువకుడిలా కనిపించాల్సి వస్తోంది. ‘ఇండియన్’లో కమల్ని యంగ్ అండ్ ఓల్డ్ పాత్రల్లో చూపించిన దర్శకుడు శంకర్ ఈ చిత్రం సీక్వెల్ ‘ఇండియన్ 2’లో కూడా వృద్ధుడిగా, యువకుడిగా చూపించనున్నారు. యువకుడి పాత్ర కోసం సాంకేతిక సహాయం తీసుకుంటున్నారట. ప్రస్తుతం శంకర్ లాస్ ఏంజిల్స్లో ఉన్నారు. ‘‘లాస్ ఏంజిల్స్లోని లోలా వీఎఫ్ఎక్స్లో అధునాతన సాంకేతికతను పర్యవేక్షిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. కమల్ని యువకుడిగా చూపించడానికే లోలా సంస్థని శంకర్ సంప్రదించి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘డీ–ఏజింగ్’ (యంగ్గా చూపించడం) టెక్నాలజీకి లోలా పాపులర్. -
మీకు తెలుసా.. ఈ గిటార్ మడతపెట్టుకోవచ్చు
గిటార్ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్ది మంది ఉంటే, కాలక్షేపంగా గిటార్ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్ను జాగ్రత్తగా బాక్స్లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్’ సులువుగా మడిచేసుకునే గిటార్ను ‘ఎసెండర్ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే! -
వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?
సాక్షి, ముంబై: టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా గాడ్జెట్స్కు సంబంధించి అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ల్యాండ్ ఫోన్లనుంచి ఫీచర్ ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఒక ఎత్తు అయితే. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల దాకా మరో ఎత్తు అని చెప్పవచ్చు. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీలు, రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా, 5జీ దాకా ఈ ప్రస్థానం చాలా గొప్పది. ఈ క్రమంలో భవిష్యత్తు ఫోన్లు ఎలా ఉంటాయో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. ఇవీ చదవండి: ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు ఐపీఎల్ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్ స్లిమ్ అండ్ స్లీక్ మాత్రమే కాదు. అత్యంత ట్రాన్సపరెంట్గా స్మార్ట్ఫోన్ లవర్స్ను ఇట్టే ఆకట్టుకుంటోంది. The Future of Smartphones!#Smartphone #mobile #gadgets pic.twitter.com/IDIgxyRwnx — The Pakistan Affairs (@ThePKAffairs) May 28, 2023 డోంట్ మిస్ టు క్లిక్ హియర్ సాక్షి బిజినెస్ -
రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ - ప్రత్యేకతలివే!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లు కొత్త కొత్త అవతారాలలో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ మార్కెట్లో విడుదలవుతున్నాయి. కానీ గూగుల్ సంస్థ మొదటి సారి తన ఫిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ దేశీయ విఫణిలోకి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మొబైల్ ప్రైస్, ఫీచర్స్ వంటి వాటితో పాటు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ భారతదేశంలో తన కొత్త ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ చేసింది. 'గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్' అని పిలువబడే ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 1,47,500 & రూ. 1,57,300. ఈ మొబైల్స్ అమ్మకాలు ఫ్లిప్కార్ట్లో మొదలయ్యాయి. ఒబ్సిడియన్, పోర్సెలాయిన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదలైంది. గూగుల్ ఫోల్డబుల్ మొబైల్ 7.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ OLED ఇన్నర్ డిస్ప్లేతో పాటు 5.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఔటర్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఈ డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో ఔటర్ డిస్ప్లే పొందుతాయి. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) ఈ లేటెస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో మూడు రియర్ కెమెరాలను పొందుతుంది. అవి 48 మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరా, 10.8 మెగాఫిక్సల్ అల్ట్రావైడ్, 10.8 మెగాఫిక్సల్ డ్యూయెల్ పీడీ టెలిఫోటో లెన్స్ కెమెరా. అయితే సెల్ఫీలు, వీడియోల కోసం ఔటర్ డిస్ప్లేకి 9.5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు 8 మెగాఫిక్సల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక బ్యాటరీ, ఛార్జింగ్ వంటి విషయాలకు వస్తే.. ఇందులో 4821mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మొత్తం బరువు 283 గ్రాములు మాత్రమే. ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. -
యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!
ప్రీమియం ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం యాపిల్ దిమ్మతిరిగే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ఐఫోన్లు, ఐపాడ్లు కింద పడినా ఏమీ కాకుండా రక్షిస్తుంది. ఫోన్లు కింద పడే సందర్భంలో వీటికున్న సెన్సర్లు వెంటనే గ్రహించి వాటి ఫ్లెక్సిబుల్ స్క్రీన్లు మడతపడేలా చేస్తాయి. దీంతో ఫోన్ కింద పడినా స్క్రీన్లకు ఎటువంటి దెబ్బా తగలదు. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి.. ‘సెల్ఫ్-రిట్రాక్టింగ్ డిస్ప్లే డివైస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్ యూజింగ్ డ్రాప్ డిటెక్షన్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీపై యాపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేసేదీ కంపెనీ పేటెంట్ దరఖాస్తులో పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! ఈ టెక్నాలజీలో ఫోల్డబుల్, రోలబుల్ డిస్ప్లేలు కలిగిన మొబైల్ ఫోన్లు కింద పడిపోతున్నప్పుడు గుర్తించేందుకు సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ కింద పడుతున్నట్లు సెన్సార్ గుర్తించిన వెంటనే అది నేలను తాకే లోపు సున్నితమైన డిస్ప్లే నేలకు తగలకుండా ముడుచుకునిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇలా ముడుచుకునే క్రమంలో ఫోన్లోని రెండు స్క్రీన్లకు మధ్య కోణం తగ్గిపోతుంది. దీని వల్ల ఆ స్క్రీన్లకు దాదాపుగా దెబ్బ తాకే అవకాశం ఉండదు. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
మూడేళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యం.. ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్బీలు బిగ్ డేటా అనలైటిక్స్ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది. మరింత బలోపేతం గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. -
ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్
సాక్షి, హైదరాబాద్: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు (అప్గ్రెడేషన్)కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ, ఎస్ఆర్పీసీ చైర్మన్ ప్రభాకర్రావు తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్ లోసాగ్ కండక్టర్స్ (హెచ్టీఎల్ఎస్) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్టీఎల్ఎస్ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్రావు వివరించారు. హెచ్టీఎల్ఎస్ తీగలు 210 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి. ఎన్టీపీసీపై ఎస్ఆర్పీసీ అసంతృప్తి 2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్ఆర్పీసీ చైర్మన్ హోదాలో ఆదేశించారు. -
సిమ్కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!
స్మార్ట్ఫోన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సాధారణ సిమ్కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్లు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 14, 14ప్రో మోడల్లలో ఇప్పటికే ఈ-సిమ్ టెక్నాలజీ ఉంది. అంటే ఈ ఫోన్లలో ప్రత్యేకంగా సిమ్ ట్రేలు ఉండవు. ఇదే క్రమంలో మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది. క్వాల్కామ్ (Qualcomm), థేల్స్ (Thales) సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్(ఐ-సిమ్) సర్టిఫికేషన్ను ప్రకటించాయి. దీంతో ఫోన్లలో సాధారణ సిమ్ కార్డులతో పని ఉండదు. Snapdragon 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్ల ప్రధాన ప్రాసెసర్లో ఈ ఐ-సిమ్ను పొందుపరుస్తారు. దీంతో ఇక ప్రత్యేకమైన చిప్ అవసరం ఉండదు. ఈ ఐ-సిమ్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న ఈ-సిమ్ల మాదిరిగానే డిజిటల్ సైనప్లు, సేఫ్టీ ఫీచర్స్ను అందిస్తుంది. కానీ దీంతో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్ కూడా ఈ-సిమ్ లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్ను సపోర్ట్ చేస్తుంది. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫోన్లను ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేయనవసరం లేదు. ఫోన్లలో సిమ్ స్లాట్ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) జీఎస్ఎం అసోసియేషన్ ఆమోదించిన ఈ ఐ-సిమ్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్కాం టెక్నాలజీస్, థేల్స్ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఈ-సిమ్తో పాటు థేల్స్ 5జీ ఐ-సిమ్ టెక్నాలజీ.. తమ కస్టమర్లకు మెరుగైన ఎయిర్-ది-ఎయిర్ కనెక్టివిటీ, ఉత్సాహకరమైన ఉత్పత్తులను అందించేందుకు మొబైల్ తయారీదారులు, ఆపరేటర్లకు మరింత అవకాశాన్ని ఇస్తుందని థేల్స్ మొబైల్ ఉత్పత్తుల విభాగం వైస్ ప్రెసిడింట్ గుయిలామ్ లాఫయిక్స్ పేర్కొన్నారు. -
Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?
లవర్స్ అంటేనే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రపంచంలో గడిపేస్తారు. దూరంగా వున్న లవర్స్ అయితే రోజూ ఫోన్లో మాట్లాడుకోవడంతో సరిపోతుంది. ఇప్పుడు అలాంటి లవర్స్ కోసం కిస్సింగ్ డివైజ్ అనే కొత్త పరికరం పుట్టుకొచ్చింది. చైనాకు చెందిన 'జియాంగ్ జోంగ్లీ' కిస్సింగ్ డివైజ్ కనుగొన్నాడు. వర్చువల్గా రొమాన్స్ చేసుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించాడు. లాంగ్ డిస్టెన్స్ కపుల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ డివైజ్ ఒక యాప్ ద్వారా పనిచేస్తుంది. ఈ డివైజ్ సిలికాన్తో తయారు చేసిన పెదాలను కలిగి ఉండటం వల్ల రియల్ కిస్ ఫీలింగ్ అందిస్తాయని చైనాలోని గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దీని కోసం ప్రెజర్ సెన్సార్లు, యాక్యురేటర్లు ఇందులో అమర్చబడి ఉన్నాయి. ఈ డివైజ్ పనిచేయాలంటే తప్పకుండా యాప్ ఉండాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఛార్జింగ్ పోర్టుకి ఈ డివైజ్ కనెక్ట్ చేయాలి. ఈ తరువాత వీడియో కాల్ చేసి పార్ట్నర్ డివైజ్కు కిస్లను పంపవచ్చు. ఇది నిజ అనుభూతిని అందిస్తుందని చైనాలోని కొంతమంది చెబుతున్నారు. మరి కొంతమంది ఇలాంటి డివైజెస్ అసభ్యకరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరికరాలు పిల్లల జీవితాలమీద ప్రభావం చూపుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Remote kissing device recently invented by a Chinese university student. The device is designed specifically for long-distance relationships and can mimic and transfer the kiss of a person to the "mouth on the other side" pic.twitter.com/G74PrjfHQA — Levandov (@blabla112345) February 23, 2023 -
వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?
సాధారణంగా చలికాలంలో దుప్పట్లు అవసరమవుతాయి. వేసవిలో ఏసీ గదుల్లో గడిపేవాళ్లు తప్ప మరెవరూ దుప్పట్లు వాడరు. అయితే ఏడాది పొడవునా వాడగలిగే దుప్పటిని అమెరికన్ కంపెనీ తయారు చేసింది. ‘హిలు’ బ్రాండ్ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ దుప్పటి సాదాసీదా దుప్పటి కాదు, ఇది ‘థర్మో రెగ్యులేటింగ్ బ్లాంకెట్’. పూర్తి గ్రాఫీన్ ఫైబర్తో అడాప్టెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ దుప్పటి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంచుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. చూడటానికి ఇది చాలా భారీగానే కనిపించినా, తేలికగా ఉంటుంది. పదేళ్ల వారంటీతో వివిధ సైజుల్లో లభించే ‘హిలు’ బ్లాంకెట్స్ 175 డాలర్లు (రూ.14,465) మొదలుకొని 550 డాలర్ల (రూ.45,464) వరకు వివిధ ధరల్లో దొరుకుతాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్) -
ఇక చైనా ‘చాట్బాట్’.. రేసులో ఆలీబాబా!
చాట్జీపీటీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో మారుమోగుతున్న పేరు. గూగుల్, మైక్రోసాఫ్ట్ తర్వాత చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా కూడా ఈ రేసులోకి వచ్చింది. తాము కూడా చాట్ జీపీటీ తరహా సాధనం తీసుకొస్తున్నామని, ఇప్పటికే దీనిపై తమ ఉద్యోగులు టెస్టింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆలీబాబా సంస్థ ప్రతినిధి ఏఎఫ్పీ వార్తాసంస్థకు తెలియజేశారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించేది స్పష్టం చేయలేదు. ఏఐ చాట్బాట్పై తమ టెస్టింగ్ వచ్చే మార్చిలో పూర్తవుతుందని మరో చైనీస్ సంస్థ.. సెర్చ్ ఇంజిన్ బైదు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆలీబాబా నుంచి ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు గూగుల్ కూడా ఈ చాట్ జీపీటీకి పోటీగా ‘బార్డ్’ పేరుతో ఏఐ చాట్బాట్ సర్వీస్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ చాట్బాట్ సర్వీస్ను శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఏఐ సంస్థ రూపొందించింది. కోరిన అంశాలపై వ్యాసాలు, పద్యాలు, ప్రోగ్రామింగ్ కోడ్స్ను ఇది సెకండ్ల వ్యవధిలో అందిస్తోంది. మరోవైపు దీని ద్వారా విద్యార్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రొఫెసర్లు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్థిక నేరాలు, వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే కూడా వ్యక్తమవుతున్నాయి. (ఇదీ చదవండి: Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ.. కారణం ఇదే..) -
ఆంగ్ల బానిసత్వం మనకొద్దు
అదాలజ్/గాంధీనగర్: ఆంగ్ల భాష పట్ల బానిస మనస్తత్వం నుంచి నూతన విద్యా విధానంతో దేశం బయట పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, స్మార్ట్ బోధనా రీతులు అందుబాటులోకి వస్తాయన్నారు. గుజరాత్లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మోదీ బుధవారం ప్రారంభించారు. ‘‘ఇంగ్లిష్ కేవలం ఒక భావప్రసార మాధ్యమమే. అయినా ఆ భాషలో పరిజ్ఞానముంటేనే మేధావులుగా పరిగణించే పరిస్థితి ఉంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువత ఇంగ్లిష్లో నైపుణ్యం లేదన్న కారణంతో డాక్లర్లు, ఇంజనీర్లు కాలేకపోతున్నారు’’అని వాపోయారు. ఇతర భాషల్లోనూ ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం ఇప్పుడుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు లబ్ధి తన స్వరాష్ట్రం గుజరాత్లో విద్యారంగంలో గత రెండు దశాబ్దాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మించారని, 2 లక్షల మంది టీచర్లను నియమించారని ప్రశంసించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మరో 50,000 క్లాస్రూమ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. లక్ష క్లాస్రూమ్లను 5జీ టెక్నాలజీతో స్మార్ట్ తరగతి గదులుగా మార్చబోతున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో పాఠాలు వినొచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతారని వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావొచ్చని, రోబోటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శాల ప్రవేశోత్సవ్, గుణోత్సవ్’ వంటి కార్యక్రమాలు ప్రారంభించానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మోదీ సంభాషించారు. రక్షణ స్వావలంబన గర్వకారణం ఇకపై దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ పరికరాలనే కొనుగోలు చేయాలని మన రక్షణ దళాలు నిర్ణయించుకోవడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనమన్నారు. గుజరాత్లో ‘డిఫెన్స్ ఎక్స్పో–2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021–22లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, రూ.40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దీసాలో వైమానిక స్థావరం నిర్మాణానికి మోదీ పునాదిరాయి వేశారు. -
ఆధునిక టెక్నాలజీతో.. కొత్త ఫ్లైఓవర్
అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పటి వరకు మహానగరాల్లోనే నిర్మించిన విధంగా నెల్లూరు నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో వెంకటేశ్వరపురం, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి ప్రాంతాల్లో మూడు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. తాజాగా మినీబైపాస్లో హరనాథపురం సర్కిల్లో నాల్గో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఫ్లై ఓవర్ గతంలో నిర్మించిన మూడింటి కంటే సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో విభిన్నమైందిగా చెప్పుకోవచ్చు. నెల్లూరు (బారకాసు): నగరంలోని ముత్తుకూరురోడ్డులో రామలింగాపురం కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మార్గంలో నాలుగు వైపులా వాహనాల రాకపోకలను రెండు రోజుల నుంచి నిలిపివేసి పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే కీలకమైన పిల్లర్ల నిర్మాణం పూర్తికావడంతో గడ్డర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానంగా ఫ్లై ఓవర్కు రెండు వైపులా ఎర్త్ వర్క్ పనులు ముమ్మరం చేశారు. నెల్లూరు నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా జనాభా సంఖ్య కూడా పెరగడంతో పాటు వాహనాల రాకపోకలు అధికమవుతున్నాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడం కారణంగా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గుర్తించిన నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం కేంద్రం నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం మంజూరు చేయించి అవసరమైన నిధులు కూడా విడుదల చేయించింది. కరోనాతో పనులు ఆలస్యం 2020 ఆగస్టులో రూ.41.88 కోట్ల అంచనాలతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులు 2022 ఆగస్టు కల్లా పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అడుగులు ముందుకేశారు. అయితే ఓవైపు కరోనా, మరో వైపు వర్షాలు కారణంగా నిర్మాణ పనులు నెమ్మదిగా జరిగే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జరిగేలా తగు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పనులను పూర్తి చేసేందుకు మరో ఆరో నెలలు పొడిగింపునకు అనుమతి ఇచ్చింది. 2023 ఫిబ్రవరి కల్లా పూర్తి చేసేలా ఇటు అధికారులకు, అటు కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పూర్తికి మరో ఐదు నెలలు గడువు ఉన్నప్పటికీ అధికారులు మరో మూడు నెలల్లోపు పూర్తి చేయాలనే ప్రయత్నంతో పనుల్లో వేగాన్ని పెంచారు. ఆధునిక టెక్నాలజీతో.. రామలింగాపురం కూడలిలో జరుగుతున్న ఫ్లై ఓవర్ మొట్టమొదటి సారిగా మహానగరాల్లో నిర్మించిన ఆధునిక టెక్నాలజీ తరహాలో నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇటువంటి టెక్నాలజీతో ఫ్లై ఓవర్ వంతెనల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లై ఓవర్ టెక్నాలజీతో మహానగరాలైన హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లోనే జరిగాయి. ఈ వంతెన పొడవు 810 మీటర్లు. 10 పిల్లర్లు ఆధారంతో వంతెనను నిర్మిస్తున్నారు. ఒక పిల్లర్కు మరో పిల్లర్కు మధ్యలో (సెంటర్ స్పాన్) భీమ్లను డయాఫ్రంభీమ్లో అమర్చుతున్నారు. ఈ సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో 9 అడుగుల ఎత్తు, 100 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయడం విశేషం. ఈ వంతెన నిర్మాణం పూర్తితో త్వరలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. త్వరతగతిన పూర్తికి చర్యలు నగరంలోని రామలింగాపురం సెంటర్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ త్వరతిగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. 2023 ఫిబ్రవరి కల్లా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనత త్వరగా మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతంగా జరిపిస్తున్నాం. త్వరతిగతిన వంతెన నిర్మాణం పూర్తికి మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. – అనిల్కుమార్రెడ్డి, డీఈఈ, ఎన్హెచ్ విభాగం, ఏపీ ఆర్అండ్బీ శాఖ -
ఎర్రచందనానికి సాంకేతిక రక్ష
సాక్షి, అమరావతి: ఎర్రచందనం అక్రమంగా రవాణాను మరింత సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనుంది. ఇప్పటికే బేస్క్యాంప్లు, స్ట్రైకింగ్ ఫోర్స్లు, చెక్పోస్టులు, ఈ–నిఘా ద్వారా స్మగ్లర్ల కార్యకలాపాలను చాలావరకు నిరోధించింది. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుని స్మగ్లర్లు అడుగు ముందుకువేసే పరిస్థితి లేకుండా చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. హై రిజల్యూషన్ శాటిలైట్, లైడార్ డేటా ద్వారా ప్రతి చెట్టును పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. చెట్లు కూలిపోయినప్పుడు తెలుసుకునేందుకు సౌండ్ అండ్ మోషన్ సెన్సార్ను కొన్ని కీలకమైన పాయింట్లలో అమర్చనున్నారు. అలాగే జియో రిఫరెన్సింగ్ద్వారా కూడా చెట్లను పర్యవేక్షించనున్నారు. అటవీ ప్రాంతాల్లోని రోడ్లు, వ్యూ పాయింట్ల వద్ద హై రిజల్యూషన్ ఐపీ కెమెరాలు అమర్చడం ద్వారా చీమచిటుక్కుమన్నా తెలిసిపోయేలా నిఘాను పటిష్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. డ్రోన్ కెమెరాలతో అడవిలోని మారుమూల ప్రాంతాలను సైతం స్పష్టంగా జల్లెడ పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమంగా అడవి దాటించడం అంత ఈజీ కాదు ఎర్రచందనం వృక్షాలున్న అటవీ ప్రాంతాల్లో తిరిగే వాహనాల సమాచారం తెలుసుకునేందుకు నంబర్ ప్లేట్ రీడర్స్ ఉన్న ఆటోమేటిక్ కెమెరాలను (నంబర్ ప్లేట్ను స్కాన్చేసి ఆ వాహనం వివరాలు తెలుపుతుంది) సిద్ధం చేస్తున్నారు. దుంగలను తరలించే వాహనాలను గుర్తించేందుకు అడ్వాన్స్డ్ వెహికల్ స్కానర్లను వినియోగించనున్నారు. దీనికితోడు ఎర్రచందనం కేసుల్లో ఉన్న పాత నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను సమకూరుస్తున్నారు. వారి పూర్తి సమాచారంతో డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. ఈ డేటాను చెక్పోస్టులు, ఫేస్ డిటెక్షన్ యాప్స్తోపాటు పోలీసు, కస్టమ్స్ విభాగాలతో అనుసంధానం చేస్తున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఎర్ర చందనం దుంగల్ని నరకడం, అక్రమంగా తరలించడం దాదాపు అసాధ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోపే ఈ వ్యవస్థలను అమల్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధమవుతోంది. 20 సంవత్సరాల్లో 17 వేల కేసులు గత 20 సంవత్సరాల్లో అక్రమంగా తరలిస్తున్న 15 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగల్ని, 10 వేల వాహనాల్ని పోలీసు, అటవీశాఖల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 17 వేల కేసులు పెట్టి 30 వేలమందికిపైగా నిందితుల్ని అరెస్టు చేశారు. 2021–22లో 133.57 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. 255 కేసులు నమోదు చేసి 635 మందిని అరెస్ట్ చేసి 144 వాహనాలను సీజ్చేశారు. అంతరించే దశలో.. అంతరిస్తున్న వృక్షాల జాబితాలో ఉన్న ఎర్రచందనం రాయలసీమ అటవీ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా ఎర్రచందనం వృక్షాలు పెరగవు. అందుకే ఈ దుంగల్ని అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తారు. ఉమ్మడి వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో 5.30 లక్షల హెక్టార్లలో ఈ వృక్షాలున్నాయి. సుమారు 5,300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్రచందనం చెట్లు ఉన్నట్లు అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 3,063 చదరపు కిలోమీటర్లలో, నెల్లూరు జిల్లాలో 671.17, చిత్తూరు జిల్లాలో 1,090, ప్రకాశం జిల్లాలో 263, కర్నూలు జిల్లాలో 212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. -
రెల్వేకు రక్షణ కవచం
సాక్షి, హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 1,445 రూటు కిలోమీటర్లను కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించారు.‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రైల్వేశాఖ ఈ కవచ్ ప్రాజెక్టును చేపట్టింది. గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో 859 కిలోమీటర్లను కవచ్ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఈ పరిధిని 1,445 కిలోమీటర్లకు విస్తరించారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) ఆధ్వర్యంలో ‘కవచ్’ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడం, రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా నియంత్రించడం, ఒకవేళ రైలు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పుడు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయినా బ్రేకింగ్ వ్యవస్థ ఆటోమెటిక్గా పని చేయడం కవచ్ సాంకేతికతలోని ప్రత్యేతలు. దశలవారీగా అభివృద్ధి.. దక్షిణమధ్య రైల్వే కవచ్ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేసింది. మొదట ‘వాడి’ నుంచి వికారాబాద్ వరకు, సనత్నగర్– వికారాబాద్ – బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్ల పరిధిలో 264 కిలోమీటర్ల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అనంతరం అదనంగా 32 స్టేషన్లకు, 322 కిలోమీటర్లకు విస్తరించారు. గత ఏడాది కవచ్ను మరో 77 స్టేషన్లలో 859 కిలోమీటర్లకు పొడిగించారు. ప్రస్తుతం కవచ్ వ్యవస్థ 133 రైల్వేస్టేషన్లు, 29 ఎల్సీ గేట్లను, 74 లోకోమోటివ్లను కవర్ చేస్తూ 1,445 కిలోమీటర్లకు విస్తరించినట్లయింది. ప్రత్యేకతలివీ.. రైళ్లు, లోకోమోటివ్లు ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడాన్ని కవచ్ నివారిస్తుంది. సిగ్నలింగ్ తాజా స్థితిగతులను నిరంతరం డ్రైవర్ మెషిన్ ఇంటర్ఫేస్ (డీఎంఐ), లోకో పైలట్ ఆపరేషన్ కమ్ ఇండికేషన్ ప్యానెల్ (ఎల్పీఓసీఐపీ)లో– అధిక వేగ నియంత్రణకు ఆటోమెటిక్ బ్రేకింగ్ వ్యవస్థగా కవచ్ పని చేస్తుంది. రైళ్లు లెవల్ క్రాసింగ్ దాటే సమయంలో గేట్ల వద్ద ఆటో విజువలింగ్ వ్యవస్థగా ఇది అప్రమత్తం చేస్తుంది. నెట్వర్క్ మానిటర్ సిస్టం ద్వారా రైలు నడిచే మార్గాలపై ప్రత్యేక కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుంది. (చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి) -
‘అత్తారింటికి దారేది’లో పరిస్థితే వస్తే.. ఈ కారే చూసుకుంటుంది
సూపర్హిట్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేశ్ కారులో ఎయిర్పోర్టుకి వెళ్తుంటే దారి మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. సాయం చేసేందుకు పక్కన ఎవరూ ఉండరు. సమయానికి హీరో రావడంతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకుంటాడు. నిజ జీవితంలో ఇదే పరిస్థితి ఎదురయితే వెంటనే అలెర్టయ్యి పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే టెక్నాలజీతో ఓ కారు తయారవుతోంది. కెమెరాల సాయంతో జపాన్కి చెందిన ఆటో మేకర్ కంపెనీ మజ్దాకి ఇండియాతో అనుబంధం ఉంది. స్వరాజ్ కంపెనీతో కలిసి గతంలో ఈ సంస్థ పలు వాహనాలను ఇండియన్ మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా ఎమర్జెన్సీ సమయంలో స్పందించే విధంగా సరికొత్త కారుని తయారు చేస్తోంది. కారులో అమర్చే ప్రత్యేకమైన కెమెరా సెన్సార్లు కారు చుట్టు పక్కలతో పాటు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని గమనిస్తుంటాయి. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకుంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు కారు నడిపే వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఎదురైనా, ప్రమాదాలు సంభవించినా వెంటనే అలెర్టయి పోతుంది. కారు వేగాన్ని తగ్గించి సురక్షితంగా రోడ్డు పక్కన ఆగేలా ఆటో పైలెట్ మోడ్లోకి వెళ్లిపోతుంది. తద్వారా రోడ్డు యాక్సిడెంట్లను అరికట్టగలుగుతుంది. దీంతోపాటు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితులను అనుసరించి అంబులెన్స్, హస్పిటల్తో పాటు కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ మెజేస్ పంపిస్తుంది. 2025 కల్లా సిద్ధం కెమెరాల ద్వారా మనిషి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా స్పందిపంచే టెక్నాలజీపై మజ్ధా సంస్థ కొంత కాలంగా పని చేస్తోంది. అందులో భాగంగా సుకుబా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు ఇతర మెడికల్ ఎక్స్పర్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నిపుణులతో కలిసి టెక్నాలజీ డెవలప్ చేసింది. రియల్టైంలో మరికొన్ని సార్లు పరీక్షలు నిర్వహిస్తామని, ఏమైనా లోపాలు ఎదురైతే సవరించి 2025 కల్లా ఈ కొత్త టెక్నాలజీ కారును మార్కెట్లోకి తెస్తామంటూ మజ్దా ఘంటాపథంగా చెబుతోంది. ఎంట్రీ లెవల్కి కోటి రూపాయలు ఆపై ధర ఉన్న హైఎండ్ కార్లలో డ్రైవర్ను అలెర్ట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను కొన్ని కార్ల కంపెనీలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇందులో ఖర్చు అధికంగా ఉండే లేజర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. లేజర్ సాయం లేకుండా కేవలం కారులో అమర్చిన కెమెరాల ద్వారానే అలెర్ట్ సిస్టమ్ రూపొందించడమే టార్గెట్గా మజ్దా ముందుకు కదులుతోంది. ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే ఎంట్రీ, మిడ్ రేంజ్ కార్లలో కూడా భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని మజ్దా హామీ ఇస్తోంది. ఇది సాధ్యమేనా ఓనర్కి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎస్ఓఎస్ మెసేజ్లు పంపి రక్షించే టెక్నాలజీ యాపిల్ సంస్థ ఇటీవల పరిచయం చేసింది. జాగింగ్ వెళ్తూ గుండెపోటుకు గురైన వ్యక్తికి కేవలం యాపిల్ వాచ్ పంపిన మెసేజ్ కారణంగా సత్వరమే వైద్య సాయం అందింది. అతని ప్రాణాలు దక్కాయి. మజ్దా టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. -
యాంటీ డ్రోన్ కొత్త టెక్నాలజీని అభివృద్ధి పరిచాం
జమ్మూ: తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చీఫ్ జి.సతీశ్రెడ్డి వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో డ్రోన్లను ఎదుర్కొనే విధంగా రూపకల్పన చేసిన వ్యవస్థలను ఈ పరిశ్రమలు రక్షణ, భద్రతా సంస్థలకు అవసరమైన విధంగా తయారు చేసి అందజేస్తాయని ఆయన తెలిపారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు. వాటిని స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయంలో మోహరించినట్లు వివరించారు. గురువారం జమ్మూలో సెంట్రల్ యూనివర్సిటీలో డీఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కేసీఎస్టీ) శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. -
మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ త్వరలోనే మరో అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించనుంది. స్మార్ట్ఫోన్లనుపయోగించి ముందుగానే భూకంపాలను గుర్తించగల టెక్నాలజీని షావోమీ అభివృద్ధి చేస్తోంది. అందుకు సంబంధించిన పేటెంట్ హక్కులను షావోమీ రిజిస్టర్ చేసింది. ‘ మెథడ్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ రియలైజింగ్ సెసిమిక్ మానిటరింగ్ ఆఫ్ మొబైల్ డివైజెస్’ పేరిట ఒక రిపోర్ట్ను షావోమీ ప్రచురించింది. భూకంపాలను గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగించబడుతుందని గిజ్మోచైనా నివేదించింది. చదవండి: SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా? ఈ టెక్నాలజీలో భాగంగా స్మార్ట్ఫోన్స్ గుర్తించిన డేటాను భూకంప ప్రాసెసింగ్ యూనిట్కు బదిలీచేస్తోంది. అంతేకాకుండా స్మార్ట్ఫోన్లలో ఏర్పాటుచేసిన టెక్నాలజీతో ముందుగానే భూకంపాలను గుర్తించడంతో పాటు, హెచ్చరికలను కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో షావోమీ సౌండ్నుపయోగించి స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసే పేటెంట్ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
లేటెస్ట్ టెక్నాలజీతో.. సరికొత్త లుక్లో ఎడ్యుకేషన్.సాక్షి.కామ్
సాక్షి, ఎడ్యుకేషన్: విద్యార్థులు, అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు, ఉద్యోగాన్వేషణకులకు శుభవార్త. విద్యా ప్రపంచంలో విశేష ఆదరణ కలిగిన education.sakshi.com (sakshieducation.com) వెబ్సైట్ సరికొత్త హంగులతో మీ ముందుకు వచ్చింది. నూతన సాంకేతికతతో వెబ్సైట్ రూపకల్పన జరిగింది. ఈ వెబ్సైట్లో కేంద్ర, రాష్ట్ర పోటీపరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, బిట్బ్యాంక్, స్టడీ మెటీరియల్, గైడెన్స్, జీకేతో పాటుగా కరెంట్ అఫైర్స్(తెలుగు మీడియం&ఇంగ్లీషు మీడియం) అందుబాటులో ఉన్నాయి. అలాగే పది, ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే సిలబస్, స్టడీ మెటీరియల్, ఈ–బుక్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, కేరిర్ గైడెన్స్ కథనాలు ఉన్నాయి. తాజా ఉద్యోగ సమాచారం, విద్యా సంబంధిత సమాచారం, కరెంట్ ఆఫైర్స్, ఆన్లైన్ టెస్టులు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాలు, స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్, వీడియోలు, ప్రాక్టీస్ టెస్టులతోపాటు ఈ–బుక్లు కూడా నూతన వెబ్సైట్లో ఉన్నాయి. కావాల్సిన సమాచారాన్ని కేటగిరి వైజ్ ఎంపిక చేసుకుని తెలుసుకునే సౌలభ్యం ఉంది. నాణ్యమైన విద్యా సంబంధిత కంటెంట్ను అందించడమే education.sakshi.com లక్ష్యం. మీ బంగారు భవిష్యత్కు ఎడ్యుకేషన్.సాక్షి తోడుగా ఉంటుంది సగౌరవంగా చెప్పగలం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న సాక్షి ఎడ్యుకేషన్ వీక్షకులకు కృతజ్ఞతలు..ఇలాగే ఇకపై మరింత ఎక్కువగా ఆదిస్తారని కోరుకుంటున్నాం. -
ఎల్ఎంఎల్ మళ్లీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన రంగంలోకి తిరిగి ప్రవేశించనున్నట్టు ఎల్ఎంఎల్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్లతో రంగ ప్రవేశం చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. ఓ భాగస్వామి భారీ పెట్టుబడులతో బ్రాండ్ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వినూత్న ఉత్పత్తిని పరిచయం చేయడానికి అభివృద్ధి వ్యూహాలపై చురుకుగా పనిచేస్తున్నట్టు ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ఎండీ యోగేశ్ భాటియా తెలిపారు. కాగా, ఇటలీకి చెందిన పియాజియో భాగస్వామ్యంతో ఎల్ఎంఎల్ వెస్పాను కంపెనీ గతంలో తయారుచేసి విక్రయించింది. 1983లో 100 సీసీ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభించింది. 1999లో పియాజియోతో భాగస్వామ్యం తెగిపోయాక కంపెనీ పతనం ప్రారంభమైంది. 2006లో కాన్పూర్ ఫ్యాక్టరీ లాకౌట్ అయింది. -
కొత్త టెక్నాలజీ ద్వారా ఈ ఏడాది గణేష్ నిమజ్జనాలు
-
వాయుసేనకు అందుబాటులో అధునాతన చాఫ్ టెక్నాలజీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు శత్రు రాడార్ పరిధి నుంచి రక్షించుకొనేందుకు చాఫ్ టెక్నాలజీని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. జోధ్పూర్లోని డీఆర్డీఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ, పుణేలోని డీఆర్డీఓ ప్రయోగశాలలు సంయుక్తంగా ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా ‘అధునాతన చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్–118/ఐ’ను అభివృద్ధి చేసింది. శత్రువులు ప్రయోగించే రాడార్ నిర్దేశిత మిస్సైల్స్ను ఇది తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా వాయుసేన విమానాలకు ముప్పు తప్పుతుంది. చాఫ్ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్ నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత అని రక్షణశాఖ తెలిపింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతల్లో ‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా డీఆర్డీఓ మరొక అడుగు ముందుకేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి సహకరించిన రక్షణ శాఖ ఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి బృందాలను రాజ్నాథ్ అభినందించారు. -
పెట్రోల్, డీజిల్లతోకాదు.. ..ఇథనాల్తో నడిచేలా ..
పెరగడమే తప్ప తరగడం అనే మాట లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఫ్యూయల్ ఛార్జీలకు ప్రత్యామ్నయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుదామంటే వాటి ధర ఎక్కువ. దీంతో వాహనదారుల సమస్యలకు ఇథనాల్ ఇంజన్లు ప్రత్యామ్నాయంగా నిలవబోత్నున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు పెట్రోలుతోనే కాకుండా ఇథనాల్తో కూడా నడిచే విధంగా ‘ఫ్లెక్స్ ఇంజన్లు’ డిజైన్ చేయాలంటూ వాహన తయారీ కంపెనీలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇటీవల కోరారు. ఫ్లెక్స్ ఇంజన్లు అంటే రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహనాలు. ప్రస్తుతం మనకు పెట్రోల్, సీఎన్జీ (గ్యాస్)తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్, ఇథనాల్లతో నడిచే ఫెక్స్ ఇంజన్లు రూపొందించేందుకు వాహన తయారీ సంస్థలు ముందుకు వచ్చేలా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేయనుంది. పంట ఉత్పత్తులతో విదేశాల్లో గోధుమలు, మొక్కజోన్న, వరి ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ముడి పదార్థాలను తయారు చేస్తున్నారు. మనదగ్గర ఇథనాల్ తయారు చేసేందుకు కేవలం చెరుకు ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర సమృద్ధిగా ఉన్న చెరుకుతో పాటు వరి, గోదుమ, మొక్కజొన్నల నుంచి భారీ ఎత్తున ఇథనాల్ తయారు చేసేందుకు అవకాశాలున్నాయి. ఇలా చేయడం వల్ల రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలోనూ గతంలో పలు కంపెనీలు ఇథనాల్తో నడిచే వాహనాలు తయారు చేసినా అవేవీ మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు కొత్తగా ఇథనాల్ ఉత్పత్తి పెంచడంతో పాటు ఇథనాల్ బంకులు కూడా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఇంజన్ వాహనాల తయారీపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది. 20 శాతం గత ఎనిమిదేళ్లుగా పెట్రోలులో ఇథనాల్లు కలిపే విక్రయిస్తున్నారు. అయితే పెట్రోలులో కలిపే ఇథనాల్ శాతాన్ని క్రమంగా ఒక శాతం నుంచి 10 వరకు తీసుకొచ్చారు. రాబోయే మూడేళ్లలో 20 శాతం ఇథనాల్ను పెట్రోల్, డీజిల్లో కలపాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి : దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ -
WhatsApp: మల్టీ లాగిన్, స్కాన్ అవసరం లేకుండానే..
శాన్ఫ్రాన్సిస్కో: వాట్సాప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్. స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా ఒకేసారి నాలుగు డివైజ్లకు అకౌంట్ లాగిన్ అయ్యి వాడుకునేలా ఫీచర్ త్వరలో రాబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో విల్ క్యాథ్కార్ట్ ధృవీకరించారు. వ్యాబేటాఇన్ఫో ఇంటర్వ్యూలో విల్ క్యాథ్కార్ట్ మాట్లాడుతూ.. వాట్సాప్ను ఒకేసారి నాలుగు డివైజ్లలో లాగిన్ అయ్యేలా ఫీచర్ తేబోతున్నాం. ఈ సౌకర్యంతో ఐప్యాడ్లో వాట్సాప్ లాగిన్ అయ్యేందుకు వీలు ఉంటుంది(ఇంతవరకు ఆ సపోర్ట్ లేదు). ప్రస్తుతం వాట్సాప్ వెబ్, డెస్క్టాప్ యాప్ కోసం స్మార్ట్ ఫోన్తో లాగిన్(స్కాన్) చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మీదట మెయిన్ యాప్, స్మార్ట్ ఫోన్ యాప్ సపోర్ట్ లేకుండా మల్టీ డివైజ్ ఫీచర్(లింక్)తో లాగిన్ కావొచ్చు అని ఆయన వివరించాడు. కాగా, ఈ విషయాన్ని మార్క్ జుకర్బర్గ్ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ప్రైవసీ సమస్యలున్నప్పటికీ దీన్నొక టెక్నికల్ ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించాం. ఫోన్ స్విచ్ఛాప్ అయినా కూడా మల్టీ డివైజ్ లాగిన్ ద్వారా వాట్సాప్ పని చేసేలా ఫీచర్ పరిశీలనలో ఉంది అని జుకర్బర్గ్ తెలిపాడు. అలాగే ‘వ్యూ వన్స్’.. అవతలి యూజర్ ఒకసారి ఫొటో, వీడియో చూడగానే దానంతట అదే మాయమయ్యే ఫీచర్ కూడా ఫ్యూచర్ అప్డేట్ పరిశీలనలో ఉందని గుర్తు చేశాడు. చదవండి: వాట్సాప్పై ఆసక్తికర వ్యాఖ్యలు -
ఒక్క క్లిక్తో భూగర్భజలాల లెక్కింపు తెలుసుకోవచ్చు
సాక్షి, మహబూబ్నగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భజలాల లెక్కింపు సులభతరం కానున్నది. గతంలో నెలకు ఒకసారి ఆయా ప్రాంతాలకు వెళ్లి భూగర్భజల శాఖ అధికారులు జలమట్టాన్ని లెక్కించేవారు. ఇకపై అలా కాకుండా కార్యాలయం నుంచే ఒక్క క్లిక్ ద్వారా భూగర్భ జలమట్టాన్ని తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ప్రతి ఆరు గంటలకోసారి లెక్కించేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూగర్భ జలాలను కొలిచేందుకు డిజిటల్ వాటర్ లెవల్ రికార్డు (డీడబ్ల్యూఎల్ ఆర్)ను ఉపయోగించనున్నారు. తొలిసారిగా ఆరు ప్రాంతాల్లో ఈ విధానంతో భూగర్భ జలాలను కొలుస్తున్నారు. గతంలో నెలకోసారి.. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 25 ఫిజోమీటర్ల ద్వారా నీటి మట్టాన్ని నెలకోసారి కొలిచేవారు. అయితే జలాన్ని కొ లిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫిజోమీటర్ల నుంచి డీడబ్ల్యూఎల్ఆర్ను ఉపయోగించి నీటిని కొలత వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలిసారి ఆరు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి ఆరు గంటలకోసారి భూగర్భ జలాలను లెక్కించడంతో అది నెట్వర్క్ ద్వారా సర్వర్కు అప్లోడ్ అవుతుంది. భూగర్భ జలమట్టంతో పాటు భూగర్భ పీడనం ఉష్ణోగ్రత, బారోమెట్రిక్ పీడనంను కొలుస్తారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కార్యాలయం నుంచే పర్యవేక్షణ.. కొత్త విధానంతో భూగర్భ జలమట్టాన్ని కార్యాలయంలో ఉండి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన డీడబ్ల్యూఎల్ఆర్ ద్వారా ప్రతి ఆరు గంటలకోసారి భూగర్భ జలాన్ని లెక్కిస్తారు. అధికారులు ఫిజియోమీటర్ వద్దకు వెళ్లి మానవాధారంగా నీటిని లెక్కించినప్పుడు ఆ ప్రాంతాల్లో బోరు నడవకపోతే ఒకలా లెక్క చూపుతుంది. అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో బోర్లు నడిస్తే భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉంది. చదవండి: కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఆరు గంటలకోసారి ఫిజియోమీటర్ వద్ద ఎంత భూగర్భ జలస్థాయి పడిపోయిందన్నది తెలుసుకోవచ్చు. ఫిజయోమీటర్ల వద్ద కొత్త సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డీడబ్ల్యూఎల్ఆర్ను ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక సాఫ్ట్వేర్కు ఫిజియోమీటర్ అనుసంధానమై ఉండటంతో ఫిజియోమీటర్ కేంద్రానికి వెళ్లి భూగర్భజల మట్టాన్ని లెక్కించాల్సిన అవసరం లేదు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి వెబ్సైట్ దానంతట అదే భూగర్భజల మట్టాన్ని నమోదు చేసుకుంటుంది. ఆరు గంటలకోసారి తెలుసుకోవచ్చు నూతన విధానం ద్వారా ప్రతి ఆరు గంటలకు ఒకసారి భూగర్భ జల నీటిమట్టం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారి ఫిజియోమీటర్ వద్దకు వెళ్లి కొలతలు తీసుకునే వాళ్లం. డీడబ్ల్యూఎల్ఆర్ ద్వారా నీటిమట్టం ప్రతి ఆరు గంటలకోసారి నేరుగా వెబ్సైట్కు నమోదవుతుంది. నీటి మట్టాల్లో ఏమైనా తేడాలు ఉన్నట్లు తెలియగానే స్థానికులను అప్రమత్తం చేసేందుకు వీలుంటుంది. – రాజేందర్కుమార్, భూగర్భ జలశాఖ అధికారి, మహబూబ్నగర్ జిల్లా ఆరు ప్రాంతాలు ఇవే ► మహబూబ్నగర్ అర్బన్ మండలం ఏనుగొండ ► గండీడ్ మండలంలో సల్కర్పేట ► భూత్పూర్ మండలం భూత్పూర్ ► నవాబుపేట మండలం నవాబుపేట ► మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూర్ ► దేవరకద్ర మండలం దేవరకద్ర -
శ్రీవారి ఆలయంలో ఆధునిక టెక్నాలజీతో ‘బూందీ పోటు’
తిరుమల: తిరుమలలోని లడ్డూ ప్రసాదాల బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటోంది. థర్మోఫ్లూయిడ్ స్టవ్ల ఏర్పాటు ద్వారా నిప్పు లేకుండానే నెయ్యిని కరిగించి లడ్డూలు తయారు చేస్తోంది. మామూలు రోజుల్లో తిరుమలలో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూలను శ్రీవారి పోటులో తయారు చేస్తారు. 2007లో బూందీ పోటును ఆలయం వెలుపలకు తరలించారు. అక్కడ బూందీ తయారు చేసి, అనంతరం దానిని ఆలయంలోకి తీసుకెళ్లి లడ్డూలు తయారు చేస్తున్నారు. అదే సమయంలో పోటులోని నెయ్యి స్టవ్లను వేడిచేసేప్పుడు ఆవిరి కారణంగా చిమ్నీలో ఏర్పడిన తేటకు మంటలంటుకుని తరచూ అగ్ని ప్రమాదాలు జరిగేవి. టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టాక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పోటును ఏర్పాటు చేశారు. చెన్నైలోని అడయార్ ఆనందభవన్ ఏర్పాటు చేసిన థర్మోఫ్లూయిడ్ స్టవ్లను గుర్తించారు. ఇక్కడ కూడా ప్రయోగాత్మకంగా రెండు స్టవ్లను ఏర్పాటు చేసి, పరిశీలించి ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ రూ.15 కోట్లు ఇచ్చారు. ఎలా పనిచేస్తాయంటే.. తిరుమల పోటులో మొదటి దశలో 40 థర్మో స్టవ్లను ఏర్పాటుచేశారు. నెయ్యి తెట్టు, ఆవిర్లు అంటుకోకుండా ఎత్తయిన అత్యాధునిక భవనంలో చిమ్నీలను ఏర్పాటు చేసి.. గోడలకు స్టీల్ పలకలను అమర్చారు. వీటివల్ల ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే వీలు కలిగింది. దశల వారీగా 20 స్టవ్ల చొప్పున పెంచుకుంటూ వెళతారు. ఎక్కడా అగ్గితో పనిలేకుండా ఈ స్టవ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక బిల్డింగ్లో థర్మోఫ్లూయిడ్ ట్యాంకును నిర్మించి అందులో ప్లూయిడ్ను నింపుతారు. దానిని బాయిలర్ ద్వారా వేడి చేస్తారు. అలా వేడెక్కిన ప్లూయిడ్ను ఉష్ట వాహక విధానంలో పైపుల ద్వారా స్టవ్లకు పంపుతారు. వాటిల్లో నింపిన నెయ్యిని పైపు నుంచి వచి్చన ఫ్లూయిడ్ వేడి చేస్తుంది. పైపుల్లో ఈ వేడి ఫ్లూయిడ్ నిరంతరం వచ్చి వెళుతుండటంతో నెయ్యి పూర్తి స్థాయిలో కరిగిపోతుంది. దీంతో బూందీని తయారు చేస్తారు. ఈ ఆధునిక బూందీ పోటును త్వరలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదాల నివారణ పోటులో అగ్ని ప్రమాదాలు నివారించేలా ఆధునిక టెక్నాలజీతో థర్మోఫ్లూయిడ్ స్టవ్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్లూయిడ్ టెక్నాలజీ వినియోగంతో పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యమవుతోంది. – ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈవో -
సరికొత్త టెక్నాలజీతో హైయర్ అత్యాధునిక ఏసీ
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైయర్ సెల్ఫ్ క్లీన్కూల్ టెక్నాలజీతో కూడిన ఏసీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అన్ని కాలాల్లోనూ అనుకూలమైన ఏసీ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. 1.5 టన్ కెపాసీటీతో కూడిన ఈ హాట్ అండ్ కోల్డ్ 3 స్టార్ ఏసీ.. ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఏసీ తనంతట తానే శుభ్రం చేసుకోవడంతోపాటు, గదిలో ఉష్ణోగ్రతను తగినట్టు కూలింగ్ను మార్చుకోవడం చేస్తుందని, 65 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపింది. 60 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఏసీ పనిచేస్తుందని ప్రకటించింది. మైక్రో డస్ట్ ఫిల్టర్తో కూడిన ఈ కొత్త క్లీన్కూల్ ఏసీ గాలి నుండి దుమ్ము, బ్యాక్టీరియా వైరస్ను తొలగిస్తుంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం నుండి వినియోగదారులను రక్షిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, బెస్ట్-ఇన్-క్లాస్ మోటారు, ఆప్టిమైజ్డ్ ఫ్యాన్ ఎయిర్ డక్ట్తో అమర్చబడి ఉంటుందనీ, ఇది 15 మీటర్ల వరకు గాలిని వీచేలా చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఫీచర్ గదిలోని అన్ని మూలలను చాలా వేగంగా చల్లబరుస్తుందని చెప్పింది. -
షియోమీ నుంచి సరికొత్త టెక్నాలజీ
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షియోమీ సరికొత్త వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ "ఎంఐ ఎయిర్ ఛార్జ్"ను ఆవిష్కరించింది. పేరుకు తగ్గట్టే ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీతో షియోమీ యూజర్లు కేబుల్స్, ప్యాడ్లు లేదా వైర్లెస్ ఛార్జింగ్ స్టాండ్లు లేకుండా స్మార్ట్ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఒకేసారి రిమోట్గా ఛార్జ్ చేయవచ్చు. "ఒకేసారి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎటుంవంటి కేబుల్ సహాయం లేకుండా ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇది, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో పెను మార్పులను తీసుకొస్తుందని ఆశిస్తున్నాం"అని షియోమి తన ట్విటర్ లో తెలిపింది.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) ఈ వైర్లెస్ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ షియోమీ స్పేస్ పొజిషనింగ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినట్లు షియోమీ సీఈఓ తెలిపారు. దీనిలోని 144 యాంటెన్నాలతో కూడిన ఫేస్ కంట్రోల్ అర్రే మిల్లీమీటర్ తరంగాలు నేరుగా బీమ్ఫార్మింగ్ ద్వారా ఛార్జింగ్ అవసరమయ్యే స్మార్ట్ఫోన్కు వెళతాయి. దీనిలోని బిల్ట్ ఇన్ 5- ఫేస్ ఇంటర్ఫేస్ యాంటెన్నా మనం ఛార్జ్ చేయాలనుకునే డివైజ్ను ఖచ్చితంగా గుర్తించగలదు. ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ బేస్ మోడల్ ద్వారా 5వాట్ కి సపోర్ట్ చేసే అనేక పరికరాలను ఒకేసారి ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మాయ కాదని ఇది ఒక సైన్స్ అద్భుత సృష్టి అని వీడియో చివరలో పేర్కొంది. ఇది వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. -
అద్భుతమైన సోలార్ కారు..
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా అద్భుతమైన ఓ కార్ల మోడల్ను తీసుకొస్తోంది. గంటకు 110 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఈ కార్లను ఎన్నడూ 24 గంటల లోపల చార్జింగ్ చేయాల్సిన అవసరమే లేదట. కారుకు అమర్చిన సోలార్ పానెళ్లతో చార్జవుతూ కారు ముందుకు దూసుకెళుతుంది. రాత్రి ప్రయాణాల్లో సూర్య కిరణాలు తగలవు కనుక వెయ్యి మైళ్ల వరకు సునాయాసంగా తీసుకెళ్లే బ్యాటరీని దీనికి అమర్చారు. దాన్ని కూడా ప్రత్యేకంగా చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదట. సోలార్ ప్యానెళ్ల సహకారంతో కారు నడుస్తున్నప్పుడే ఈ బ్యాటరీ చార్జవుతుందట. (చదవండి: టాటా మోటార్స్ ఉద్యోగులకు షాక్!) సోలార్ కార్ల రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెల్సా కంపెనీ మోడల్ కార్ల స్పేర్ బ్యాటరీతో 370 మైళ్లు మాత్రమే నడిచే అవకాశం ఉండగా, తమ మోడల్ సరికొత్త సోలార్ కారు వెయ్యి మైళ్ల వరకు బ్యాటరీ సహాయంతో దూసుకెళుతుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. వెయ్యి మైళ్లు ఇచ్చే సోలార్ బ్యాటరీ చార్జింగ్ పూర్తిగా అయిపోతే లేదా ఐదారు రోజుల వరకు కారును బయటకు తీయకపోతే బ్యాటరీని చార్జి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందట. రోజు ఈ కారును నడిపే వారికి ఎన్నడూ బ్యాటరీని చార్జి చేసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారు ఖరీదు 26 వేల డాలర్లు (దాదాపు 19 లక్షల రూపాయలు). ఇందులో ఖరీదైన మోడళ్లు 47 వేల డాలర్ల (దాదాపు 35 లక్షల రూపాయలు) వరకున్నాయి. ఈ కార్లు మూడున్నర క్షణాల్లోనే జీరో వేగం నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందట. డిసెంబర్ నాలుగవ తేదీ నుంచే ప్రీ లాంచింగ్ బుకింగ్ను ప్రారంభించగా, నేటికి పలు కార్లు బుక్కయ్యాయట. (చదవండి: పరిశ్రమలు రయ్రయ్..!) -
హ్యాలో కాపాడింది...
సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో ఆదివారం పెను ప్రమాదమే జరిగినా... హాస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ స్వల్ప గాయాలతో బయటపడటం గొప్ప విశేషం. కారుపై నియంత్రణ కోల్పోయి బారికేడ్లను ఢీకొట్టడంతో కారు రెండు ముక్కలైంది. కాక్పిట్, చాసిస్ వేరుపడ్డాయి. దీంతో పెట్రోల్ లీకేజితో ఒక్కసారిగా సిలిండర్ పేలినట్లు మంటలు చెలరేగాయి. ఇంతటి ఘోరప్రమాదం జరిగినా గ్రోస్యెన్ ప్రాణం మీదికి రాకపోవడంతో ఫార్ములావన్ (ఎఫ్1), బహ్రెయిన్ వర్గాలకు పెద్ద ఊరటే లభించింది. 34 ఏళ్ల గ్రోస్యెన్ను హుటాహుటిన హెలికాప్టర్లో మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని చేతి వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఇది మినహా ఎలాంటి ఫ్రాక్చర్, ప్రాణాపాయ సమస్యలు లేవు. ఇంకా చెప్పాలంటే అంతపెద్ద మంటల్లో... ఫైర్ మార్షల్స్ మంటల్ని అదుపు చేస్తుంటే అతనే ఎంచక్కా బారికేడ్ను దూకుతూ దాటాడు. ఇద్దరు సాయమందించినా... తనే నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కాడు. పెను ప్రమాదం నుంచి అతను చిన్న చిన్న గాయాలతో బయటపడటం నిజంగా అద్భుతమని 1996 ఎఫ్1 చాంపియన్ డామొన్ హిల్ అన్నారు. అదే రక్షించింది... ఫార్ములావన్ ఆధునికతే గ్రోస్యెన్కు ఊపిరి పోసింది. కొన్నేళ్లు పరీక్షించిన మీదట డ్రైవర్ల ప్రాణాలను నిలుపుతుందని భావించిన ఎఫ్1 సంస్థ 2018లో రేస్ కార్లలో హ్యాలో సిస్టమ్ను అమలు చేసింది. డ్రైవర్ తలకు ఏమాత్రం గాయమవ్వకుండా ఉండే రక్షణ కవచం ఇది. కారు కాక్పిట్లో ఓ ఫ్రేమ్గా తలపై భాగాన్ని కవర్ చేస్తుంది. 2016లో వచ్చిన హ్యాలో సిస్టమ్కు లేటెస్ట్ వర్షన్ (ఆధునిక) తోడవడంతో 2017లో ఎఫ్1 సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 17 శాతం ప్రాణాపాయాన్ని తగ్గించగలదని ధ్రువీకరించుకున్న ఎఫ్1 ఆ మరుసటి ఏడాది అధికారికంగా అమల్లో పెట్టింది. కానీ ఆనాడు దీన్ని రొమైన్ గ్రోస్యెన్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘హ్యాలో అంటే నాకు అసహ్యం. ఇదేం బాగోలేదు. దీంతో నాకు అస్వస్థత అయిన అనుభవం కలిగింది’ అని స్పందించాడు. కానీ ఇప్పుడదే సంజీవనిగా అతనికి ఉపయోగపడింది. బరిలోకి పియెట్రో... హాస్ టీమ్ డ్రైవర్ గ్రోస్యెన్ తదుపరి రేసుకు దూరమవ్వడంతో హాస్ టీమ్ అతని స్థానాన్ని బ్రెజిల్ రిజర్వ్ డ్రైవర్ పియెట్రో ఫిటిపాల్డికి ఇచ్చింది. దీంతో సాఖిర్లోనే ఈ వారాంతంలో జరిగే రేసుతో పియెట్రో ఫార్ములావన్లో అరంగేట్రం చేయనున్నాడు. పియెట్రో కుటుంబానికి ఎఫ్1తో సుదీర్ఘ అనుబంధం ఉంది. పియెట్రో తాత ఎమర్సన్ 1972, 1974లో ఎఫ్1 వరల్డ్ చాంపియన్గా నిలిచారు. ఎమర్సన్ సోదరుడు విల్సన్... విల్సన్ తనయుడు క్రిస్టియన్ ఫిటిపాల్డి కూడా ఎఫ్1 రేసుల్లో పాల్గొన్నారు. కొన్నేళ్ల క్రితం నేను హ్యాలో సిస్టమ్ను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడదే నన్ను కాపాడింది. ఇప్పుడు అది లేకుంటే నేనిలా మీ ముందు మాట్లాడేవాణ్నే కాదు. –గ్రోస్యెన్ -
డీఎస్ఎస్ ఆధారంగా ‘కాళేశ్వరం’ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్హౌస్లు, జలాశయాలు, కాలువలను సమర్థవంతంగా నిర్వహించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడానికి ప్రభుత్వం సంకల్పించిందని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డెసిషన్ సపోర్టు సిస్టం (డీఎస్ఎస్)పై బుధవారం జలసౌధలో ఒక రోజు వర్క్షాప్ను ప్రారంభిస్తూ ప్రాజెక్టు నిర్వహణ కోసం సమగ్ర సమాచారం ఈ సపోర్ట్ సిస్టమ్లో అందుబాటులో ఉం టుందని, ఆ సమాచారం ఆధారంగా పంప్హౌస్లు, జలాశయాలు, కాలువల నిర్వహణ సాధ్యం అవుతుందని తెలిపారు. జలాశయాల్లో ఎంత నీరు ఉన్నది, ఆయకట్టుకు ఎంతనీరు అవసరం, భూగర్భ జలాల పరిస్థితి, వర్షపాతం, నదుల ద్వారా ఎంత పరిమాణంలో నీరు వస్తోంది.. తదితర సమస్త సమాచారం ఈ సిస్టమ్ ద్వారా అందుబాటు లోకి రానుందని వివరించారు. ఈ అత్యాధునిక వ్యవస్థను తయారు చేయడానికి వాసర్ ల్యాబ్స్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఈ సిస్టమ్కు అవసరమయ్యే సాఫ్ట్వేర్లను, మొబైల్యాప్ లను తయారు చేయడంతోపాటు ఐదేళ్లు వారే నిర్వహిస్తారని, సాగునీటి శాఖ ఇంజనీర్లకు ఈ సాఫ్ట్వేర్ నిర్వహణ, వినియోగంపై శిక్షణ కూడా ఇస్తారని ఈఎన్సీ పేర్కొన్నారు. బుధవారం నుంచి మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారని, ఈ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వినియోగంలో ఉందని వెల్లడించారు. ఈ వ్యవస్థ కాళేశ్వరం లాంటి అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజనీర్లకు ఎంతో తోడ్పాటునందిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ తన కార్యాలయం నుంచే ఈ సపోర్ట్ సిస్టమ్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంజనీర్లకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. -
5జీ ఐఫోన్ 12 వచ్చేసింది..
కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తమ 5జీ టెక్నాలజీ ఆధారిత ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 12 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్ 12 రేటు 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మినీ పరిమాణం 5.4 అంగుళాలు, ఐఫోన్ 12 స్క్రీన్ 6.1 అంగుళాలు కాగా, ప్రో స్క్రీన్ సైజు 6.1 అంగుళాలు, ప్రో మ్యాక్స్ డిస్ప్లే 6.7 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 నలుపు, తెలుపు, ఎరుపు తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఐఫోన్ 11తో పోలిస్తే ఇది 11 శాతం నాజూకైనది, 16 శాతం తేలికైనది. ఇందులో రెట్టింపు పిక్సెల్స్ ఉంటాయి. మరింత దృఢమైన సెరామిక్ షీల్డ్తో తయారైంది. స్మార్ట్ డేటా మోడ్ కారణంగా అవసరాన్ని బట్టి ఇది 5జీ, ఎల్టీఈ నెట్వర్క్పై పనిచేస్తుంది. 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యుయల్ కెమెరా, అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉంటాయి. ఐఫోన్ బాక్స్లో ఇకపై అడాప్టర్ ఉండదని సంస్థ తెలిపింది. 5జీని అత్యంత వేగవంతమైన, అధునాతనమైన టెక్నాలజీగా కంపెనీ సీఈవో టిమ్ కుక్ అభివర్ణించారు. ఐఫోన్లతో పాటు హోమ్ పాడ్ మినీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. అక్టోబర్ 16 నుంచి ప్రి–అర్డర్లు, 23 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. -
టెక్నాలజీతో సన్నగా...
కరీనా కపూర్ రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఆమె ఈ తీపి వార్తను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్ మధ్యకాలంలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు. అందుకే ‘లాల్సింగ్ చద్దా’ సినిమా టీమ్ ఓ నిర్ణయం తీసుకుందట. ఆమిర్ ఖాన్ సరసన కరీనా నటిస్తున్న చిత్రం ఇది. కరీనా శరీరాకృతిలో బాగా మార్పు వచ్చేలోపు ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. దాదాపు 100 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో సెప్టెంబర్ మొదటి వారంనుండే ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. అయినా నెలలు గడిచేకొద్దీ కరీనా బరువు పెరుగుతారు కాబట్టి, బేబీ బంప్ (పొట్ట ఎత్తుగా) కనబడకుండా వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని వాడాలనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం కరీనా చేతిలో ‘లాల్సింగ్ చద్దా’ చిత్రంతో పాటు ‘వీరే ది వెడ్డింగ్’ సీక్వెల్, ‘తక్త్’ కూడా ఉన్నాయి. మరి.. ఈ చిత్రాల షెడ్యూల్స్ని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. -
రక్త పరీక్షతో కేన్సర్ గుట్టు రట్టు!
కేన్సర్.. దీనిని కనీసం నాలుగేళ్ల ముందే గుర్తించేందుకు తామొక టెక్నాలజీని అభివృద్ధి చేశామంటున్నారు చైనీస్ శాస్త్రవేత్తలు. కొన్నేళ్ల క్రితం లిక్విడ్ బయాప్సీ పేరుతో ఓ కొత్త కేన్సర్ గుర్తింపు పరీక్ష అందుబాటులోకి వచ్చింది. రక్త పరీక్షల్లోనే కేన్సర్ కణితులు లేదా కణాలు వది లేసిన కొన్ని అవశేషాలను గుర్తించి వాటి ఆధారంగా వ్యాధి సోకిందని నిర్ధారించుకోవడం ఈ లిక్విడ్ బయాప్సీలో ప్రధానాంశం. వ్యాధి లక్షణాలు కనిపించే ముందుగానే గుర్తించడం వీటి ద్వారా కూడా సాధ్యమే కానీ ఫలితాలపై భరో సా తక్కువ. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు ‘పాన్సీర్’ పేరుతో సరికొత్త లిక్విడ్ బయాప్సీ పద్ధతిని అభివృద్ధి చేశారు. దీని ద్వారా కనీసం ఐదు రకాల కేన్సర్లను లక్షణాలు కనిపించేందు కు కనీసం నాలుగేళ్ల ముందే గుర్తించవచ్చునని నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. ఇది కేన్సర్ను ముందుగానే గుర్తించే పరీక్ష కానేకాదని, వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయటపడేందుకు ఇంకా సమయం ఉండగానే తెలుసుకోవడం దీంట్లోని ముఖ్యాంశమని శాస్త్రవేత్తలు తెలిపారు. మిథైల్ గ్రూపుల ఆధారంగా.. చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన రక్త పరీక్ష డీఎన్ఏ పోగుల్లోని ప్రత్యేక ప్రాంతాలను పరి శీలించడం ద్వారా జరుగుతుంది. కేన్సర్ కణితుల డీఎన్ఏలో తరచూ కనిపించే మిథైల్ గ్రూపులను ఈ రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అత్యంత సూక్ష్మస్థాయి డీఎన్ఏ మిథైల్ గ్రూపులను కూడా గుర్తించేందుకు తాము సరికొత్త పద్ధతులను ఉపయోగించామని శాస్త్రవేత్తలు తెలిపారు. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల ద్వారా రక్తంలో కనిపించే మిథైల్ గ్రూపులతో కూడిన డీఎన్ఏ కేన్సర్ కణితి నుంచి వెలువడిందా? లేదా? అన్నది నిర్ధారిస్తామని వారు చెప్పారు. ఈ పరీక్షను అభివృద్ధి చేసేందుకు తాము 2007–2014 మధ్యకాలంలో చైనాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 414 మంది రక్తపు ప్లాస్మాను సేకరించామని చెప్పారు. రక్తం సేకరించే సమయానికి ఐదేళ్ల ముందు నుంచి వీరు కేన్సర్ బారిన పడని వారు. ఆ తరువాత నాలుగేళ్లలో 191 మంది ఉదర, కోలోరెక్టల్, కాలేయ, ఊపిరితిత్తుల, శ్వాసకోశ సంబంధిత కేన్సర్ల బారినపడ్డారు. ఈ 5 రకాల కేన్సర్లబారిన పడ్డ మరో 223 మంది రోగుల ప్లాస్మాలను కూడా సేకరించారు. మెషీన్ లెర్నింగ్ ద్వారా ఈ వివరాలను కంప్యూటర్ సాఫ్ట్వేర్కు అందించారు. ఈ దశ తరువాత పరీక్షలు జరపగా పాన్సీర్ పరీక్ష కేన్సర్ ఉన్న వారిని 88% వరకు గుర్తించింది. రక్తం సేకరించేటప్పుడు లేకున్నా తరువాతి కాలంలో వ్యాధి బారినపడ్డ 95% మందిని కూడా ఈ పరీక్ష విజయవంతంగా గుర్తించింది. మరింత విస్తృత స్థాయిలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల సమాచారం సేకరించి సాఫ్ట్వేర్ను ఆధునికీకరిస్తే వ్యాధి నిర్ధారణలో మరింత కచ్చితత్వం వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
‘ఎమర్జింగ్’పై దృష్టి
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతికత (ఎమర్జింగ్ టెక్నాలజీ)ను అందిపుచ్చు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యక లాపాల్లో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించు కోవాలని నిర్ణయించింది. ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు 2016లో విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీలో పలు ప్రతిపాదనలు చేసింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చెయిన్, డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగానికి ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విభిన్న రంగాల్లో కృత్రిమ మేధస్సు... 2020ని కృత్రిమ మేథో సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన పలు ప్రాజెక్టులను పాలన, పౌర సేవల్లో వినియోగిస్తోంది. మేడారం జాతరలో క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిజిస్ట్రేషన్ కార్యాలయం చిరునామా పౌరులు తెలుసుకునేందుకు ‘మేధ’ చాట్బోట్ వంటివి ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని చేనేత, వస్త్ర పరిశ్రమలోనూ ఉపయోగించి నేత కార్మికులు, వినియోగదారులకు మేలు చేసే దిశగా ఓ ప్రాజెక్టు రూపొందుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి రంగాల్లోనూ ఏఐ ఆధారంగా పలు ఆవిష్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రయత్నాలు చేస్తోంది. బ్లాక్ చెయిన్తో పౌర సేవల్లో పారదర్శకత ప్రభుత్వ, పౌర సేవల్లో పారదర్శకత, రక్షణ పెంపు లక్ష్యంగా బ్లాక్ చెయిన్ ఆధారిత ప్రాజెక్టులు సుమారు పది వరకు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా భూ రికార్డులు తారుమారు చేయకుండా ‘సీడాక్’ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు మంచి ఫలితాలు సాధించింది. చిట్ఫండ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రూపొందించిన ‘టీ చిట్స్’ జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించింది. విద్యార్హత సర్టిఫికెట్లు, ఔషధాల్లో నకిలీల నివారణ, ప్రజాపంపిణీ వ్యవస్థ, న్యాయ వ్యవహారాలు, రవాణా, భూ రికార్డుల్లో పారదర్శకత వంటి రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ ఆధారిత ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మరిన్ని రంగాలకు డ్రోన్ టెక్నాలజీ విస్తరణ డ్రోన్ల దిగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం నిర్మాణ, వ్యవసాయ, ఆరోగ్య, బీమా, సినిమాటోగ్రఫీ, పోలీసు తదితర రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అటవీ సంరక్షణ, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ పేరిట దేశంలోనే తొలి డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్టును చేపట్టింది. సైబర్ సెక్యూరిటీ.. ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక, బ్యాంకింగ్, రక్షణ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులతోపాటు నేర పరిశోధనలో సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీపై రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్సీఐ) భాగస్వామ్యంతో హైదరాబాద్లో రూ. 22 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటైంది. మరోవైపు ఈ–వేస్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉండటంతో ఈ రంగంలో ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, ఈ–వేస్ట్ నిర్వహణ తదితరాలకు సంబంధించి రూ. 36 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది. ఎమర్జింగ్ టెక్నాలజీకి తెలంగాణ కేంద్ర బిందువుగా మారుతుండటంతో భవిష్యత్తులో ఉద్యోగాలు అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. -
టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు
బెంగళూరు: భారత్ 2022లో చేపట్టనున్న గగన్యాన్ అంతరిక్ష ప్రయోగానికి అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రేడియోధార్మికత ప్రభావాలను గుర్తించడం, నివారించడంతోపాటు అంతరిక్షంలో వ్యోమగాముల ఆహారం తదితర 18 అంశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వాడేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. రెండేళ్ల తరువాత జరిగే గగన్యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పటికే రష్యాలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయస్థాయి పరిశోధన, విద్యా సంస్థలు కొత్త టెక్నాలజీల తయారీకి దరఖాస్తు చేసుకోవచ్చునని బెంగళూరులోని ఇస్రో కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 15వ తేదీలోగా తమ దరఖాస్తులు పంపాలని కోరింది. అంతరిక్షంలో మనిషి మనగలిగేందుకు కీలకమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన కోసం ఇస్రో ఒక కమిటీ ఏర్పాటు చేస్తుందని, శాస్త్రీయ ప్రయోజనాలు, అవసరం, సాంకేతికత, సాధ్యాసాధ్యాల వంటి అంశాల ప్రాతిపదికన టెక్నాలజీల ఎంపిక ఉంటుందని తెలిపింది. -
ఎంజీ మోటార్స్ కార్లలో కరోనా నియంత్రణ సాంకేతికత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ తన కార్లలోని క్యాబిన్ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు క్యాబిన్ స్టెరిలైజేషన్ టెక్నాలజీ పేటెండ్ పొందిన సింగపూర్కు చెందిన మెడ్క్లిన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. హెక్టార్, జెడ్ఎస్ ఈవీ కార్లలో ఏర్పాటుకు పరిశోధనలు జరుగుతున్నాయని కంపెనీ ఇండియా ఎండీ అండ్ ప్రెసిడెంట్ రాజీవ్ చాబా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కస్టమర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా కార్ల ఉపరితల భాగాలను వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవటం అత్యవసరమన్నారు. -
శత్రువుల డ్రోన్లను హ్యాక్ చేస్తాయి
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు మొదలుకొని వ్యవసాయం వరకు.. డ్రోన్లను వాడని రంగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే.. ఉగ్రవాదులెవరైనా ఈ డ్రోన్లను వాడితే? దేశ రక్షణకు కీలకమైన స్థావరాలపై దాడులకు పాల్పడితే? ఏం ఫర్వాలేదంటున్నారు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. ఇలాంటి శత్రు డ్రోన్లను గుర్తించేందుకు వీరు ఓ కొత్త రకం డ్రోన్లను డిజైన్ చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తూ, శత్రువుల డ్రోన్లను హ్యాక్ చేసి, వాటి దిశ మార్చి సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేస్తాయని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రోన్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రిం చొచ్చు. ఇవి పోలీసులు, మిలిటరీ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఇవి ఎంతో భిన్నం.. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల పని తీరుకు ఇవి పూర్తి భిన్నంగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ ద్వారా డ్రోన్లను నియంత్రించే అవకాశం ఉండటం వల్ల ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లను ఏకకాలంలో ఉపయోగించొచ్చు. వాహనాలు, మానవులు, ఇతర వస్తువులను గుర్తించేందుకు ఒకేసారి బోలెడన్ని ఈ డ్రోన్లను వాడొచ్చన్నమాట. చీకట్లోనూ పనిచేస్తుంది.. ఈ డ్రోన్లను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి వసు గుప్తా, ఐఐటీ మద్రాస్లోని ఆర్ఏఎఫ్టీ ల్యాబ్కు చెందిన రిషభ్ వశిష్టలు కలసి రూపొందించారు. ‘ఇవి తమ చూపుతోనే నేరుగా వస్తువులను, వ్యక్తులను కచ్చితంగా గుర్తించగలవు. నమూనా డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాత అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకొస్తాం’అని ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ మోహన్ వివరించారు. అవసరాలకు తగ్గట్టుగా వీటితో పనిచేయించుకోవచ్చని, ఒకేసారి బోలెడన్ని వాహనాలను ట్రాక్ చేయడమూ సాధ్యమని తెలిపారు. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ సాయంతో పనిచేసే ఈ కొత్త డ్రోన్ల సాయంతో చీకటిలోనూ కదలికలను గుర్తించొచ్చనని, ఇందుకు పరారుణ కాంతి కిరణాలను వాడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. గాల్లోనే హ్యాక్ చేస్తాయి.. ఈ కొత్త డ్రోన్లు నకిలీ జీపీఎస్ సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా శత్రు డ్రోన్లను తప్పుదోవ పట్టిస్తాయని, నకిలీ జీపీఎస్ ప్యాకెట్లను విడుదల చేస్తూ వాటిని కావాల్సిన చోట సురక్షితంగా దింపేస్తాయని వసు గుప్తా, రిషభ్ వశిష్టలు తెలిపారు. శత్రువుల డ్రోన్ల కోసం ప్రత్యేకంగా జీపీఎస్ సంకేతాలను అభివృద్ధి చేసి వాటిని హ్యాక్ చేస్తాయన్నమాట. తాము ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ ఆధారిత నకిలీ జీపీఎస్ సంకేతాలను అందుబాటులో ఉన్న అన్ని రకాల జీపీఎస్ రిసీవర్లతో పరిశీలించి చూశామని, నాలుగైదు సెకన్లలోనే శత్రువుల డ్రోన్లను తమ అధీనంలోకి తీసుకురావడం సాధ్యమైందని వివరించారు. -
చైనాలో 10 రోజుల్లోనే ఆస్పత్రి నిర్మాణం
-
10 రోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం
బీజింగ్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందించే చికిత్స ఏమాత్రం వేగంగా ఉంటుందో అక్కడికి వెళ్లివచ్చిన వారిని ఎవరిని అడిగినా వెంటనే చెప్పేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై ఎప్పుడూ ఏదో ఒక విషయం మనం నిత్యం వింటూనే ఉంటాం. అలానే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం కూడా ఏళ్లు గడిచినా పూర్తి కాకుండా నిర్లక్ష్యంగా సాగుతూ ఉంటాయి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. కానీ.. చైనాలో మాత్రం 1000 పడకల గదిని ఏకంగా 10 రోజుల్లోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద ఆస్పత్రిని కేవలం ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం అంటే సాహసమనే చెప్పాలి. దీని కోసం ఆ దేశం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవడం విశేషం. (చైనాలో కరోనా కల్లోలం) దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు ఓ వైపున ప్రయత్నిస్తూనే, పెరుగుతున్న రోగులను ఒకే చోట ఉంచి చికిత్సను అందించే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రామిక శక్తి అపారంగా ఉన్న చైనా, కేవలం పది రోజుల్లో 1000 పడకల సామర్థ్యమున్న భారీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే వందలాది జేసీబీలు పునాదుల పని ప్రారంభించాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా, పనులు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్వయంగా వెల్లడించారు. ఇదిలావుండగా.. చైనాలో ప్రజలు కరోనా వైరస్ పేరు వింటేనే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అనేక ఆసుపత్రుల్లో బయట టెంట్లు వేసి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. మరోవైపు సుమారు 3000మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 300మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా సర్కార్ పేర్కొంది. -
టెక్నాలజీతో ఓటింగ్ పెంచుతాం
న్యూఢిల్లీ: టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఓట్ల శాతాన్ని పెంచుతామని, పలు కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఓటేసేలా చేస్తామని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రణ్బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. త్వరలోనే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ కోడ్లు, సోషల్ మీడియాల ద్వారా ఓటర్లను ఆకర్షిస్తామని చెప్పారు. ‘జోష్ టాక్స్’ ప్రతినిధుల ద్వారా కాలేజీలు, ఇతర సంస్థల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రముఖ రేడియో జాకీ నవీద్ ఖాన్, కథక్ డాన్సర్ అలక్నంద దాస్గుప్త, క్రీడాకారులు మానిక బాత్రా, రిషభ్ పంత్ పాల్గొననున్నట్లు చెప్పారు. మొత్తం 1.4 కోట్ల మంది ఓటర్లని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పత్పార్గంజ్ నుంచి బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు. 15 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారారు. 24 మంది కొత్త వారు కాగా మొత్తం 8 మంది మహిళలు కూడా బరిలో ఉన్నట్లు తెలిపారు. -
పొగమంచు ఉన్నా.. కూ చుక్చుక్
సాక్షి, హైదరాబాద్: చలికాలంలో పొగమంచుతో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వాహనదారులకు రోడ్డు కనిపించక జరిగే ప్రమాదాలెన్నో. ఇలాగే రైల్వే వ్యవస్థలో కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయి. పొగమంచు కారణంగా సిగ్నల్స్ కనిపించకపోతే ఇక అంతే సంగతులు. భారీ ప్రమాదాలు జరుగుతాయి. అందుకే మంచు దట్టంగా కమ్ముకునే సమయంలో రైళ్లను కనిష్ట వేగానికి నియంత్రించి నడుపుతుంటారు. లొకోపైలట్ రైలును నెమ్మదిగా నడుపుతూ, సిగ్నల్స్ను గమనిస్తూ ముందుకు సాగుతుంటారు. దీంతో చాలా రైళ్లు ఆలస్యంగా నడవటం, కొన్నింటిని రద్దు చేయాల్సి రావటం జరుగుతాయి. ఇప్పుడీ సమస్యకు అధికారులు పరిష్కారం కనుగొన్నారు. ఫాగ్ పాస్.. ఈ పొగమంచు సమస్యకు పరిష్కారంగా ‘ఫాగ్పాస్’పేరుతో ఓ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు అధికారులు. జీపీఎస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో స్క్రీన్ ఉంటుంది. సంబంధిత రైలు మార్గాన్ని జీపీఎస్ ద్వారా ఈ పరికరానికి అనుసంధానిస్తారు. ఆ మార్గంలో ఎక్కడెక్కడ సిగ్నళ్లు ఉన్నాయి.. ఎక్కడ సూచిక బోర్డులున్నాయి.. స్టేషన్లు.. మలుపులు, లెవల్ క్రాసింగ్స్.. ఇలా అన్ని వివరాలు అందులో కనిపిస్తాయి. రైలు వెళ్తున్న కొద్దీ మార్గంలో ముందున్న మూడు వివరాలు స్క్రీన్లో కనిపిస్తాయి. అవి ఎంత దూరంలో ఉన్నాయో స్పష్టం చేస్తుంది. 500 మీటర్ల దూరంలో ఉందనగా వాయిస్ రూపంలో అప్రమత్తం చేస్తుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేకుండానే ముందుకు దూసుకెళ్లొచ్చు. కకోద్కర్ కమిటీ సలహాతో.. 2011లో హైలెవల్ సేఫ్టీ రివ్యూ కమిటీని కకోద్కర్ నేతృత్వంలో రైల్వే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రైల్వే భద్రతకు సంబంధించి 106 సిఫారసులు చేసింది. వాటిల్లో 68 పూర్తిస్థాయిలో అమలు చేయదగ్గవని రైల్వే బోర్డు గుర్తించింది. మరో 19 పాక్షికంగా అమలు చేయదగ్గవని గుర్తించింది. 68 సూచనల్లో ఈ ఫాగ్ పాస్ పరికరం కూడా ఉంది. దీన్ని స్థానికంగానే అభివృద్ధి చేశారు. కిలోన్నర బరువుండే ఈ పరికరంలో దృశ్య, శ్రవణ విధానం ఉంటుంది. క్రూ బుకింగ్ కేంద్రాల వద్ద వీటిని ఉంచి, రైలు బయల్దేరే సమయంలో లోకోపైలట్లకు అందిస్తారు. మళ్లీ డ్యూటీ పూర్తి కాగానే వారు దాన్ని సంబంధిత విభాగానికి అప్పగించాల్సి ఉంటుంది. గతేడాది ఈశాన్య భారతంలోని కొన్ని రైల్వే జోన్లకు ఈ పరికరాలు అందించారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. తొలి దఫాగా జోన్ పరిధిలో 250 పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. కాగా, పొగమంచు కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలను ఈ పరికరంతో అధిగమించొచ్చని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. -
ఐటీ సేవలే కాదు.. అంతకుమించి
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ.. ఐటీ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి రంగాలకు కూడా చిరునామాగా మారుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్ వంటి కొత్త సాంకేతికతలపై జరిగే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. మరోవైపు ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావి స్తోంది. ఐటీ రంగంలో ఆఫీసు వసతి, ఉద్యోగాల కల్పన విషయంలో వచ్చే ఐదేళ్లలో బెంగళూరుపై పైచేయి సాధిస్తామని ఐటీ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఐటీ రంగంతో పాటు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ వాతావరణాన్ని హైదరాబాద్లో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో గత ఐదేళ్లలో 30 వేల ఉద్యోగాలు సృష్టించగా, వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో సాధించాలని భావి స్తోంది. ఇటీవల చైనాకు చెందిన స్కైవర్త్ కంపెనీ 50 ఎకరాల్లో రూ.700 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగంలో పరిశోధన, అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలు కృత్రిమ మేధస్సుకు సంబంధించి జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి కోసం దేశంలో 5 సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ (కోర్), 20 ఇంటర్నేషనల్ సెంటర్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఇక్టయ్) ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను కేంద్రం తెలంగాణకు అప్పగించింది. మరోవైపు వ్యవసాయం, పట్టణీకరణ, రవాణా, ఆరోగ్య రంగాల్లో కీలక సవాళ్ల పరిష్కారానికి ఏఐ సాంకేతికత అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020ను ’ఇయర్ ఆఫ్ ఏఐ’ (కృత్రిమ మేధో సంవత్సరం)గా ప్రకటించింది. రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ’బ్లాక్చెయిన్’ ఐటీ సాంకేతికతను పరిష్కారమని భావిస్తూ ఎస్సెస్సీ బోర్డు, బాసర ట్రిపుల్ ఐటీలో ఈ టెక్నాలజీని ఐటీ శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. త్వరలో జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలు కూడా బ్లాక్చెయిన్ టెక్నాలజీతో అనుసంధానించనున్నారు. గేమింగ్, వినోద రంగాలకూ గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 150కి పైగా వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, 2డీ, త్రీడీ యానిమేషన్, గేమింగ్ కంపెనీలు సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, 90 వేల మందికి పరోక్ష ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాయి. 2020–25 నాటికి గేమిగ్ రంగం 300 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాల్లో లక్షలకొద్ది ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని అంచనా వేస్తోంది. అత్యాధునిక స్టూడియోలు, సదుపాయాలతో కూడిన ఇమేజ్ టవర్స్ 2022 నాటికి అందుబాటులోకి రానుంది. డిజైనర్స్, ఎంట్రప్రెన్యూర్స్, స్టార్టప్లకు ఉపయోగపడేలా ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ ప్రొటోటైపింగ్, మెకానికల్ డిజైనింగ్ రంగంలో భారత్లోనే తొలి ప్రోటోటైప్ సౌకర్యం కలిగిన ’టీ వర్క్స్’ మూడు నాలుగు నెలల్లో అందుబాటులో రానుంది. నైపుణ్య శిక్షణ, నూతన ఆవిష్కరణలకు సంబంధించి టీహబ్, వీహబ్లు ఐఐటీ, ట్రిపుల్ ఐటీతో పాటు పలు ప్రైవేటు ఐటీ సంస్థలు భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ ఘనత.. 2018–19లో ఐటీ ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లు 2017–18తో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, తెలంగాణ 17 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. 2017–18లో ఐటీ రంగంంలో 4.85 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2018–19లో 5.5 లక్షలకు చేరింది. వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఏఐ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్చెయిన్, డేటా ఎనలిటిక్స్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. 2019 తొలి అర్ధభాగం నాటికి 38.5 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉండగా, వచ్చే ఐదేళ్లలో 50 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని అంచనా. -
మొబైల్ సర్వీస్ పొందాలంటే ఫేస్ స్కాన్ చేయాల్సిందే !
బీజింగ్ : చైనాలో ఇక నుంచి కొత్త మొబైల్ ఫోన్ సర్వీస్ పొందాలంటే తమ ముఖాన్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సింది ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చైనా ప్రభుత్వం సెప్టెంబర్లోనే నిబంధనలను ప్రకటించింది. తాజాగా ఆదివారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 'కొత్త నిబంధనల ప్రకారం కొత్త మొబైల్ కొన్నప్పుడు గానీ, లేదా మొబైల్ డేటా కాంట్రాక్టులను తీసుకున్నప్పుడు జాతీయంగా గుర్తింపు ఉన్న కార్డు చూపిస్తే సరిపోయేది. కానీ ఇక నుంచి గుర్తింపు కార్డుతో వారి ముఖాన్ని కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు ఇచ్చిన ఐడీ సరైందో కాదో గుర్తించే అవకాశం ఉందని' చైనా ప్రభుత్వం పేర్కొంది. చైనాలో చాలా రోజుల క్రితమే అక్కడి ప్రజలు ఇంటర్నెట్ వాడాలంటే వారి అసలు పేరుతోనే లాగిన్ అయ్యేలా ఏర్పాటు చేసింది. 2017 నుంచి ఎవరైనా ఆన్లైన్లో కొత్త విషయాన్ని పోస్టు చేయాలంటే అసలు ఐడీని ఎంటర్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. తాజాగా టెలికామ్ సంస్థల కోసం అమల్లోకి తెచ్చిన ఫేస్ స్కానింగ్ వల్ల వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించే అవకాశం కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మొబైల్స్ వినియోగించి ఇంటర్నెట్ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. -
‘టెర్రకోట’ ఉపాధికి బాట
ప్రజలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. చేపలను ఇవ్వడం కన్నా.. వాటిని పట్టే వలను అందించి ప్రోత్సహించడం మిన్న. సరిగ్గా ఈ విధానానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరికో స్వయం ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పించి స్థానికులకు శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే వారు తయారు చేసే వస్తువులను అంతర్జాతీయ విపణిలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ‘టెర్రకోట’ కళను ప్రోత్సహించడం ద్వారా పలువురి ఉపాధికి నడుం బిగించింది. పలమనేరు: జిల్లాలో టెర్రకోట కళాకారులకు పలమనేరు ప్రసిద్ధి. పట్టణానికి సమీపంలోని టెర్రకోట కాలనీలో సుమారు వంద కుటుంబాలకు ఈ కళే జీవనోపాధి. వీరికి మరింత చేయూతనందించడమే లక్ష్యంగా గంటావూరు సమీపంలో రూ.2కోట్లతో డీఆర్డీఏ ‘టెర్రకోట హబ్’ను ఏర్పాటు చేసింది. ఇందులో టెర్రకోట కళాకారులు ఇప్పటి వరకు తయారు చేస్తున్న వస్తువులకు పశ్చిమ బెంగాల్, ఒడిశా డిజైన్లను జోడించి విభిన్న ఆకృతులను సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే అధిక సంఖ్యలో యువతీయువకులను టెర్రకోట కళలో నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. నెలరోజుల శిక్షణ.. టెర్రకోట హబ్లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఏపీఎస్డీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్), సీఎఫ్సీ (కామన్ ఫెసిలిటీ సెంటర్), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్, రీచ్ సంస్థల ఆధ్వర్యంలో యువతకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి ప్రత్యేకంగా శిక్షకులను రప్పించారు. వీరి పర్యవేక్షణలో 50మంది నెల రోజులపాటు శిక్షణ పొందారు. తొలి బ్యాచ్కు టెర్రకోట హబ్లోనే ఉపాధి కల్పించారు. కావాలనుకుంటే వారు ఇళ్ల వద్ద కూడా కళాకృతులను తయారు చేసుకుని ఉపాధి పొందవచ్చు. విభిన్న ఆకృతులకు డిమాండ్.. నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్న టెర్ర కోట కళాకారులు విభిన్న ఆకృతులను తయా రు చేస్తున్నారు. వాటికి ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొళాయి అమర్చిన మట్టి కూజాలు, వేలాడే కుండీలతోపాటు శుభకార్యాల్లో బహుమతులు గా ఇచ్చేందుకు పలు కళాకృతులను రూపొందిస్తున్నారు. చివరకు ఫొటోఫ్రేమ్లను సైతం మ ట్టితో తయారుచేయడం విశేషం. పాత పద్ధతులకు స్వస్తి.. గతంలో మట్టికుండలు తయారీలో వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రిక్ వీల్ మెషీన్ వచ్చింది. బంకమట్టిని కాళ్లతో తొక్కాల్సిన అవసరం లేకుండా ప్లగ్మిల్ మిక్చర్ అనే యంత్రం అందుబాటులో ఉంది. మట్టి వస్తువులను బట్టీ్టలో కాల్చే పనిలేకుండా విద్యుత్లో నడిచే సిలన్ వచ్చింది. దీంతోపాటు బాల్మిల్, ఫిల్టర్లు, కట్టర్లు.. ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి బొమ్మల తయారీకి యంత్రాల వాడకంపై హస్త కళాకారులకు టెర్రకోట హబ్లో శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్లోనూ అమ్మకాలు... టెర్రకోట హబ్లో తయారైన కళాకృతులను బెంగళూరుకు చెందిన పలు కంపెనీల ద్వారా ఆన్లైన్లో దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. అయితే టెర్రకోట కళాకారులే ఆన్లైన్లో విక్రయించుకునేలా డీఆర్డీఏ ప్రయత్నిస్తోంది. ఏదేమైనా పలమనేరు మట్టి విదేశాలకు సైతం చేరుతుండడం విశేషం. ఎవరైనా ఉచితంగా నేర్చుకోవచ్చు.. ప్రభుత్వం నెలకొల్పిన శిక్షణ కేంద్రంలో టెర్రకోట కళను ఉచితంగానే నేర్చుకోవచ్చు. చేతిలో పని ఉంటే ఎక్కడైనా బతకవచ్చు. హబ్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నాం. ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. -రామకృష్ణ, టెర్రకోట హస్తకళాకారుల సంఘం, పలమనేరు టెర్రకోట వస్తువుల తయారీపై శిక్షణపొందా.. మాది గంటావూరు గ్రామం. ఉపాధి కోసం ఇక్కడ శిక్షణ పొందా. ఇప్పుడు కొంతవరకు పని నేర్చుకున్నా. ఇందులో చాలా వస్తువులను తయారు చేయవచ్చు. ఇంటి వద్దే పీస్ వర్క్ చేసుకుంటున్నాం. -స్నేహ, గంటావూరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు... మట్టిబొమ్మల తయారీపై కొత్త టెక్నిక్లతో శిక్షణనిస్తున్నా. ఇక్కడి వారు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. నెలరోజుల శిక్షణ పూర్తయితే ఇక్కడే పీస్ వర్క్ చేసుకోవచ్చు. సొంతవూర్లోనే ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ తయారైన వస్తువులకు మంచి గిరాకీ ఉంటుంది. -గణేష్పాల్, శిక్షకుడు, కలకత్తా చేతిలో పని ఉంటే ఎలాగైనా బతకవచ్చు ఊరికే ఇంట్లో ఉండే బదులు ఇక్కడ శిక్షణ తీసుకుని ఉపాధి పొందడం ఆనందంగా ఉంది. పని నేర్చుకున్నాక పీస్ వర్క్ చేసుకున్నా చాలు. ప్రభుత్వం మాలాంటి వాళ్లకు మంచి అవకాశం కల్పించింది. -లలిత, గంటావూరు -
అశోక్ లేలాండ్ బీఎస్–6 వాహనాలు
చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్లేలాండ్.. భారత్ స్టేజ్(బీఎస్)–6 ప్రమాణాలకు అనుగుణంగా తన భారీ శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా సీట్లు, స్టీరింగ్ వంటి వాటిని మార్చుకుని కొనుగోలు చేసే సౌకర్యాన్ని వీటిలో అందుబాటులో ఉంచింది. మాడ్యులర్ బిజినెస్ ప్రోగ్రామ్గా పిలిచే ఈ విధానం టైలర్మేడ్ తరహాలో ఉంటుందని వివరించింది. మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ నూతన తరం వాహనాలు వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్దమవుతాయని ప్రకటించింది. ప్రస్తుత ధరల శ్రేణి రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ ఉండగా, నూతన మోడళ్ల విడుదల సమయంలో ధరలను వెల్లడిస్తామని సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా అన్నారు. ఈ కామర్స్, పార్సిల్స్కు తగిన ట్రక్కుల నుంచి సిమెంట్ను తరలించే వాహనాలతోపాటు, డిఫెన్స్, టూరిస్ట్ బస్సులను ఆయన సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల వాహనాల విక్రయాలు నమోదు కాగా, త్వరలోనే అమ్మకాలను 4 లక్షల యూనిట్లకు పెంచడం ద్వారా ప్రపంచంలోనే టాప్–10 స్థానంలోకి చేరనున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను విడుదల చేయడం ద్వారా మార్కెట్ వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీ డ్రైవర్లకు స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు ఇంజన్లో ఎటువంటి లోపం తలెత్తినా వెంటనే డ్రైవర్కు సమాచారం వస్తుందని వెల్లడించారు. నూజివీడు ప్లాంట్కు మందగమనం సెగ ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లోని నూజివీడులో ప్లాంట్ ఏర్పాటు చేయగా, ఆ నాటి నుంచి ఆటో పరిశ్రమలో మందగమనం నెలకొనడంతో విస్తరణ పణులను చేపట్టలేకపోతున్నామని ధీరజ్ హిందుజా అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రైవేటు ప్యాసింజర్ సంస్థలకు అవసరమైన బస్సులను ప్రస్తుతానికి తాము ఉత్పత్తి చేయడం లేదన్నారు. -
అరచేతిలో ‘e’ జ్ఞానం
సాక్షి, బాపట్ల(గుంటూరు) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆండ్రాయిడ్ సెల్ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడో జరిగిన విషయాలను క్షణాల్లో మన ముందుంచడంతో పాటు, సక్రమంగా ఉపయోగించుకుంటే, చిన్న పిల్లల బొమ్మల దగ్గర నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన సమాచారం లభిస్తోంది. ఈ కోవలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు డిజిటల్ రూపంలో వివిధ వెబ్సైట్లలో లభిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేయలేని విద్యార్థులకు ఉచితంగా ఆయా పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండటంతో ‘ఈ’ జ్ఞానం ఎంతో ఉపయోగకరంగా మారింది. గ్రంథాలయ శాఖ పుస్తకాలను డిజిటల్ రూపంలో ఉంచింది. ఇందులో నుంచి చాలా రకాలైన పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పుస్తకాలు అందుబాటులో.. మన దేశంలో 18 శతాబ్దంలో కోల్కతాలో పౌర గ్రంథాలయం, ఇంపీరియర్ గ్రంథాలయాలు ఉన్నాయి. 1953లో ఇంపీరియర్ గ్రంథాలయాన్ని భారత ప్రభుత్వం జాతీయ గ్రంథాలయంగా ప్రకటించింది. ఇక్కడ విలువైన వేలాది పుస్తకాలను భద్రపరిచారు. ఆ గ్రంథాలయంలోని పుస్తకాలను 2002లో ఇంటర్నెట్కు అనుసంధానించారు. ఇంటర్నెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) వారి సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ను ప్రారంభించింది. అందులో విలువైన పుస్తకాలను డిజిటల్ రూపంలో చదువుకునేందుకు వీలుగా ఉంచింది. తిరిగి ఇచ్చేయవచ్చు ఇంటర్నెట్లో అనేక రకాలైన పుస్తకాలు లభ్యమవుతున్నా కాఫీరైట్ ఉన్న పుస్తకాలు లభించే అవకాశం లేదు. అలాంటి వాటిని కొనుగోలు చేయడం లేదా, అద్దెకు తీసుకునే అవకాశం కల్పించారు. రెంట్ మై టెక్ట్స్, కాఫీ కితాబ్ టెక్టŠస్ బుక్స్ వంటి వెబ్సైట్ల ద్వారా 30 నుంచి 70 శాతం వరకు పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త పుస్తకాలు చదవాలంటే వాటిని కొనుగోలు చేసి చదివిన తర్వాత తిరిగి ఇచ్చేస్తే, కొనుగోలు చేసిన ధరలో మనకు 70 శాతం నగదు మళ్లీ ఇచ్చేస్తారు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఉపయోగం ఇంజినీరింగ్, ఐటీ, మెడికల్ కోర్సులు చాలా ఖరీదైనవి. వాటికి సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.500 నుంచి రూ.1000 పైనే ధర ఉంటుంది. ఆ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఆయుర్వేదం, యునానీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పుస్తకాల ధర అధికంగా ఉన్నా, కొనుగోలు చేయాలన్నా మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైకోర్సులకు సంబంధించి పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ కోర్సుల పుస్తకాలు లభ్యం ఐఏఎస్, ఐపీఎస్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఉచితంగా ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. విజ్ఞానానికి పనికివచ్చే ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలు, చరిత్రాత్మక, విజ్ఞాన సంబంధం, వినోద సంబంధ పుస్తకాలు చదువుకోవచ్చు. పుస్తకాలు డౌన్లోడ్కు ఉపయోగించే వెబ్సైట్లు ► www.nationallibrary.com ► www.bookbum.com ► www.medicalstudent.com ► www.onlinelibrary.com ► www.rentmytext.com ► www.compitative.com -
కొత్త ప్రపంచం 28th July 2019
-
ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్టాప్
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటివరకూ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, టీవీలను చూశాం. తాజాగా మడతపెట్టే ల్యాప్టాప్లురానున్నాయి. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్ కంపెనీ లెనోవో ప్రోటోటైప్ ఫోల్డబుల్ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో వెల్లడించింది. ల్యాప్టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్. ఫోల్డబుల్ స్క్రీన్తో ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాప్టాప్ అని కంపెనీ తెలిపింది. ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇక ఫీచర్స్ విషయానికొస్తే..13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్బీ పోర్ట్స్, ఇన్ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి. 2020 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నామని పేర్కొంది. ధర వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించిపోయినప్పటికీ, మూడు నుంచి 4వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ డివైస్కు సంబంధించిన దీంతో ల్యాప్టాప టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
క్యాబ్ ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్’
సాక్షి, హైదరాబాద్ : క్యాబ్ ప్రయాణికులను ప్రత్యేకించి మహిళలను మరింత భద్రంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు దేశీ క్యాబ్ సేవల దిగ్గజం ఓలా త్వరలో హైదరాబాద్లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. నిర్దేశిత మార్గం నుంచి వాహనం దారితప్పిన లేదా ఆగిన సమయాల్లో ప్రయాణికులను నేరుగా ఫోన్లో సంప్రదించడం, డ్రైవర్ ప్రవర్తనపై ఫిర్యాదులుంటే తక్షణమే సమీప పోలీసుస్టేషన్కు సమాచారం పంపే ఏర్పాట్లతో కూడిన రియల్టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ ‘గార్డియన్’ను ప్రవేశపెట్టనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్ టూల్స్ ఆధారంగా ట్రాకింగ్ వ్యవస్థ పనిచేయనుంది. స్ట్రీట్ సేఫ్ పేరిట చేపడుతున్న దేశవ్యాప్త రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవస్థను ఓలా తీసుకొచ్చింది. ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లో ఓలా గతవారమే ‘గార్డియన్’ను ప్రారంభించింది. ఈ నెలాఖర్లోగా ఢిల్లీ, కోల్కతా సహా మరికొన్ని నగరాలకూ దీన్ని విస్తరించనుంది. ముందస్తు రక్షణ... రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల భద్రత పోలీసులు, క్యాబ్ సంస్థలకు తరచూ సవాల్గా మారుతోంది. ప్రస్తుతం క్యాబ్లు బుక్ చేసుకొనే సమయంలోనే వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ ఫొటో తదితర వివరాలు ప్రయాణికుల స్మార్ట్ఫోన్లలో కనిపిస్తున్నా ప్రయాణ సమయాల్లో డ్రైవర్ల ప్రవర్తనను అంచనా వేయడం మాత్రం కష్టసాధ్యమవుతోంది. రాత్రి వేళల్లో డ్రైవర్ల ప్రవర్తనపై తరచుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక మహిళ క్యాబ్లో ఎయిర్పోర్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ట్వీట్ చేశారు. ఈసీఐఎల్ ప్రాంతంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. దీంతో రాత్రి 10 దాటాక మహిళలు క్యాబ్లలో వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాతే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ముందస్తు రక్షణ వ్యవస్థ మాత్రం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఓలా ప్రవేశపెట్టనున్న ‘గార్డియన్’వ్యవస్థ ద్వారా వాహనం గమనాన్ని ప్రతిక్షణం ట్రాక్ చేస్తూ ప్రయాణ సమయంలోనే ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవకాశం లభించనుంది. భద్రతకు భరోసా ... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్లు, తదితర ప్రధాన కూడళ్ల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులతోపాటు హైటెక్సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్లలో క్యాబ్ సర్వీసులను వినియోగించే సాఫ్ట్వేర్ నిపుణులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఓలా ‘గార్డియన్’దొహదపడనుంది. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్’బలమైన అస్త్రంగా పనిచేస్తుందని, ప్రజారవాణా రంగంలో తొలిసారి దీన్ని ప్రవేశపెట్టామని ఓలా ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఎలా పనిచేస్తుంది... – ‘గార్డియన్’వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు, ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్ (ఎస్ఆర్టీ)కు మధ్య ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బృందం ప్రతి వాహనాన్ని నిరంతరం ట్రాక్ చేస్తుంది. – ప్రయాణికులు ఎంపిక చేసుకున్న మార్గంలో కాకుండా డ్రైవర్ వేరే మార్గంలోకి మళ్లినట్లుగా అనుమానం వస్తే వెంటనే ప్రయాణికులకు ఈ బృందం ఫోన్ చేస్తుంది. ఆ మార్గం సరైనదేనా లేక ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. – అదే సమయంలో డ్రైవర్ల ప్రవర్తనపై ఫిర్యాదులుంటే స్వీకరించి వెంటనే ఆ సమాచారాన్ని పర్యవేక్షక బృందం సమీప పోలీస్ స్టేషన్కు చేరవేస్తుంది. – ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్ నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ప్రయాణికులకు వెంటనే రక్షణ కల్పిస్తారు. 50 వేల మందికి పైగా ప్రయాణం... గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణికులు ఓలా సేవలను వినియోగించుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయంతోపాటు ఐటీ కారిడార్లలో ఓలా క్యాబ్ల వినియోగం ఎక్కువగా ఉంది. 5 వేల మందికిపైగా లీజు పద్ధతిలో ఓలా వాహనాలను నిర్వహిస్తుండగా మరో 20 వేలకుపైగా ఓలాతో అనుసంధానమైన వాహనాలు నడుస్తున్నాయి. ఉబెర్, మేరు వంటి ఇతర క్యాబ్ సంస్థలు ఉన్నప్పటికీ ప్రజారవాణా రంగంలో వినూత్న చర్యలు చేపట్టడం ద్వారా ఈ సంస్థ ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చింది. -
ఇక సాఫీగా ట్రాఫిక్!
క్షణాల్లో నిర్ణయం.. చకచకా ట్రాఫిక్ నియంత్రణ.. రద్దీని ముందే పసిగట్టి ఏ వైపు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలో.. ఎటువైపు మళ్లించాలో ఆదేశిస్తుంది. ట్రాఫిక్ నిర్వహణకు మానవ సిబ్బంది అవసరం లేదనే రోజు మరెంతో దూరంలో లేదు. చిత్రాలు, గణాంకాల విశ్లేషణతో ఆధునిక కంప్యూటర్ వ్యవస్థలే వాహన రద్దీని నియంత్రిస్తాయి. అమెరికా, యూరప్ దేశాల్లో వాడుకలో ఉన్న ‘ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)’ విజయవాడ వాహన చోదకులకు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఆధునిక పరిజ్ఞానంతో నగర ట్రాఫిక్ వ్యవస్థను నిర్వహించే ఐటీఎంఎస్ వల్ల నగరంలో ఇక ట్రాఫిక్ జామ్లకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలో ఐటీఎంఎస్ పనితీరుపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణ మొత్తం పోలీసు సిబ్బంది మీదే ఆధారపడింది. సుమారు 63కు పైగా జంక్షన్లలో సిగ్నల్ లైట్లున్నా పనిచేస్తున్నవి కొన్నే. ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది ఎంత శ్రమిస్తున్నా నిత్యం అనేక కూడళ్లలో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు నలిగిపోతున్నారు. ఫలితంగా రోజూ పనిగంటలు, పెద్ద ఎత్తున ఇంధనం వృథా అవుతోంది. రాజధానిలో విజయవాడ ప్రాంతం భాగంగా మారిన తరుణంలో దేశ విదేశాల నుంచి ప్రముఖుల రాకపోకలు అనూహ్యంగా పెరిగాయి. అమరావతికి సింహ ద్వారమైన గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, గుంటూరు, తుళ్లూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఇక విమానాశ్రయం నుంచి విజయవాడకు అధికార, అనధికార ప్రముఖులు, వారి కాన్వాయ్ల సంచారం, ఇతరత్రా రద్దీ గతంలో కంటే నాలుగు రెట్లు పెరిగినట్లు ట్రాఫిక్ వర్గాల అంచనా. ప్రస్తుతం అన్ని రకాలు కలిపి నగరంలో 11 లక్షలకుపైగా వాహనాలున్నాయి. పనిచేస్తుంది ఇలా.. సాంకేతికతతో ట్రాఫిక్ను అత్యంత సమర్థతతో నిర్వహించడమే ఐటీఎంఎస్ లక్ష్యం. సంక్షిష్టమైన టెక్నాలజీ సాయంతో ఇది పనిచేసే విధానాన్ని సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. నగర కూడళ్ల మొత్తాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు, ఆధునిక తరం సిగ్నల్ దీపాలు, బ్యారికేడ్లు, సూచన, హెచ్చరిక బోర్డులు, ధ్వని వ్యవస్థ తదితరాలు ఇమిడి ఉంటాయి. ఒక కేంద్రీకృత వ్యవస్థ అనుక్షణం నగర ట్రాఫిక్ను పర్యవేక్షిస్తుంటుంది. ఎక్కడైనా జంక్షన్లో ఒకవైపు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటే.. ఆ దారిలో గ్రీన్ లైట్లు ఎక్కువ సేపు వెలుగుతాయి. రద్దీ ఉన్న రోడ్ల నుంచి లేని రహదార్ల వైపు మళ్లిస్తాయి. ఏ రహదారిలో రద్దీ ఎలా ఉందో, ఎలా వెళ్తే సులభంగా గమ్యం చేరుకోవచ్చో పౌరుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపే వ్యవస్థ ఐటీఎంఎస్ సొంతం. నగరంలో ప్రవేశించే ట్రాఫిక్ వల్ల ఎటువైపు ఒత్తిడి ఏర్పడుతుందో ముందే ఊహించి అందుకు అనుగుణంగా ట్రాఫిక్ను నిర్వహిస్తుంది. ఇప్పటిదాకా ట్రాఫిక్ కూడళ్లలో నిలబడి గంటలసేపు విధులు నిర్వహించే పోలీసులు ఈ వ్యవస్థ ఏర్పాటయ్యాక ఇక కూడళ్లలో నిలబడితే చాలు. ఐటీఎంఎస్ ఉపయోగాలు.. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థ వల్ల నగరంలోని రహదారులను మెరుగ్గా వినియోగించుకోవచ్చు. అలాగే ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. రోడ్డు ప్రమాదాల శాతం కూడా తగ్గుతుంది. ట్రాఫిక్ కూడళ్ల వద్ద నిరీక్షణ 45 శాతం తగ్గే అవకాశం ఉంది. సాఫీ ట్రాఫిక్ వల్ల పర్యావరణానికీ మంచిది. ఇంధన వినియోగం 20 శాతం పొదుపు అవుతుంది. అయితే ఈ పథకానికి భారీ కసరత్తే అవసరం. నగరంలో రోడ్లు, వాటి విస్తీర్ణం, వాటి వాహన సామర్థ్యం, లింక్రోడ్లు, మలుపులు, ప్రస్తుత వాహనాలు.. ఇలా అనేక అంశాలను క్రోడీకరించి సాంకేతిక సంస్థలు సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను రూపొందిస్తాయి. రాబోయే పది, ఇరవై ఏళ్ల అవసరాలనూ ఇక్కడ దృష్టిలో ఉంచుకుంటారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో ఇది విజయవంతంగా నడుస్తోంది. -
టెక్ బడి.. ‘బిజ్ ఏక్టివ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఐ, బ్లాక్ చెయిన్ వంటి కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలంటే సిటీకి రావాలా? ట్రెయినింగ్ సెంటర్లో చేరాలా? ఇవన్నీ వద్దంటోంది స్టార్టప్ కంపెనీ ‘బిజ్ ఏక్టివ్’. ఒకటీ రెండూ కాదు ఏకంగా 87 రకాల టెక్నాలజీ కోర్సులు తమ సైట్ ద్వారానే నేర్చుకోవచ్చని చెబుతోంది ఈ సంస్థ. ‘వరంగల్’ కేంద్రంగా సేవలందిస్తున్న బిజ్ ఏక్టివ్లో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల నుంచి కూడా విద్యార్థులున్నారు. మరిన్ని వివరాలు బిజ్ ఏక్టివ్ ఫౌండర్ మహ్మద్ యాకుబ్ పాషా మాటల్లోనే.. ‘‘మాది వరంగల్ జిల్లా మల్లంపల్లి. ఆర్ధిక పరిస్థితుల కారణంగా బీటెక్ను మధ్యలోనే ఆపేసి వరంగల్లో ఢిల్లీకి చెందిన ఓ ఎడ్యుకేషన్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. గ్రామీణ ప్రాంతం నుంచి రావటంతో టెక్నాలజీ కోర్సులను అంత త్వరగా అందుకోలేకపోయా. ఇది నా ఉద్యోగంపై ప్రభావం చూపించింది. నాలా ఇతర గ్రామీణ యువత ఇబ్బంది పడకూడదన్న అభిప్రాయంతో అందుబాటు సమయంలో తక్కువ ఖర్చుతో సాంకేతిక కోర్సులను అందించాలనే లక్ష్యంతో బిజ్ఏక్టివ్ సర్వీసెస్ను ఆరంభించా. 2016 మార్చిలో లక్ష రూపాయల పెట్టుబడితో వరంగల్ కేంద్రంగా ‘బిజ్ఏక్టివ్’ సర్వీసెస్ను ప్రారంభించా. తెలుగు, హిందీ భాషల్లో గ్రామీణులకు అర్థమయ్యేలా సులువైన పద్ధతుల్లో కోర్సులను అందించడమే మా ప్రత్యేకత. బిజ్ఏక్టివ్లో 2 ప్యాకేజీలు.. ప్రస్తుతం బిజ్ఏక్టివ్లో 2 రకాల ప్యాకేజీలున్నాయి. 1. ఎడ్యు అడ్వాన్స్డ్. ధర రూ.2,999. ఇందులో 152 అంశాలకు సంబంధించిన 87 రకాల కంప్యూటర్ కోర్సులుంటాయి. హిందీ భాషలో 10 రకాల కోర్సులుంటాయి. ఇవన్నీ ఆడియో, వీడియో ట్యుటోరియల్స్ రూపంలో ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుతో పాటూ 200 రకాల ఈ–పుస్తకాలను కూడా అందిస్తాం. ఇంటర్నెట్ అందుబాటులో లేనివాళ్ల కోసం ఆయా ప్యాకేజీ కోర్సుల పుస్తకాలను పెన్డ్రైవ్లో అందిస్తాం. రెండోది, ఎడ్యు అల్టిమేట్. ధర రూ.6,600. ఇందులో మొదటి ప్యాకేజీతో పాటూ షాపింగ్ చేసుకునేందుకు వీలుగా స్మార్ట్ కార్డ్ను ఇస్తాం. బిజ్కార్ట్.కామ్లో షాపింగ్ చేసుకోవచ్చు. 4 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. రీచార్జ్, కరెంట్ బిల్లుల వంటి యుటిలిటీ సేవలతో పాటూ బస్, రైలు, విమాన టికెట్లను కూడా బుకింగ్ చేసుకోవచ్చు. నేపాల్, దుబాయ్లకు విస్తరణ... ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటూ చెన్నై, ముంబై, కోల్కత్తా, బెంగళూరు నగరాల్లో సేవలందిస్తున్నాం. 18 వేల మంది కస్టమర్లున్నారు. మా ఉత్పత్తులకు నేపాల్, దుబాయ్ల నుంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఆయా ప్రాంతా ల్లో కేంద్రాలను ఆరంభించనున్నాం. అనుమతికి దరఖాస్తు చేశాం. ఏడాదిలో లక్ష కస్టమర్లను చేరుకోవాలన్నది లక్ష్యం. అందుకే ఆఫ్లైన్లో శిక్షణ ప్రారంభించాం. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ వేణుగోపాల్ లక్ష్మీపురంను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నాం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మాకు 200 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఏడాదిలో 500 మందికి చేర్చుతాం. మా ప్యాకేజీ అమ్మకం మీద దాదాపు 10 శాతం కమీషన్ ఉంటుంది. గత రెండేళ్లలో రూ.3 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.10 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది టార్గెట్. ప్రస్తుతం మా సంస్థలో 8 మంది ఉద్యోగులున్నారు. పలు ఎన్జీవో, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు చేస్తున్నాం. ఏడాదిలో రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని పాషా వివరించారు. -
ఒప్పో ఎఫ్9 ప్రొ : విత్ వూక్ ఫ్లాష్ చార్జ్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఒప్పో ఎఫ్9 ప్రొ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. సరికొత్త ఫీచర్స్ తో అధునాతనమైన టెక్నాలజీ తో యూజర్లను మురిపించబోతుంది. వూక్ ఫ్లాష్ చార్జ్ 5 నిమిషాల చార్జింగ్ 2 హవర్స్ టాక్ అంటూ సరికొత్త టెక్నాలజీతో ఈ డివైస్ను లాంచ్ అందుబాటులోకి తేనుంది. ముఖ్యంగా గేమింగ్ లవర్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ఫోన్ ను తయారు చేసామని కంపెనీ తెలిపింది. భారీ స్క్రీన్, భారీ సెల్పీ (25ఎంపీ) కెమెరాతో వస్తుందని అంచనాలు నెలకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12.30లకు భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఒప్పో ఎఫ్9 ప్రొ ధర సుమారు రూ. 23,300 గా ఉంటుందని అంచనా. అలాగే ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 6.3 అంగుళాల డిస్ప్లే 2280 x 1080 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 16+2 ఎంపీ రియర్ కెమెరా 25ఎంపీ సెల్ఫీ కెమెరా (ఏఐ ఫీచర్స్) 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇక నిఘా నేత్రాన్ని తప్పించుకోలేరు
నేర నియంత్రణలో అర్బన్ జిల్లా కొత్తపుంతలు తొక్కుతోంది. హైటెక్ టెక్నాలజీతో ఇప్పటికే అర్బన్ పోలీసులు ముందంజలో ఉన్నారు.తిరుపతిలోని సీసీ కెమెరాలను రాష్ట్రంలోనేనెంబర్ వన్గా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్బన్ జిల్లాపరిధిలో 2వ కమాండెంట్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్బన్ జిల్లాఅంతటా ఈ నిఘానేత్రాలు విస్తరించనున్నాయి. జిల్లాకు వచ్చే భక్తులు, ప్రజలకు మరింత భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ.. శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. నెల రోజుల్లో తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లోని రెండో అంతస్తులో అధికారికంగా ఈ నిఘా నేత్ర కేంద్రాన్ని ప్రారంభించేందుకుఎస్పీ అభిషేక్ మొహంతి సిద్ధం చేసుకున్నారు. తిరుపతి క్రైం: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని భద్రతానగరంగా తీర్చిదిద్దే పని చురుగ్గా సాగుతోంది. 2012లోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుపతి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు కెమెరాలను ప్రారంభించారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ను ఆధునీకరించేందుకు 2014లో రూ.50 లక్షలు ప్రభుత్వం కేటా యించింది. అదే ఏడాది డిసెంబరులో సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ను ఈస్ట్ పోలీస్స్టేషన్లో వీడియో వాల్తో అప్పటి డీజీపీ జేవీ రాముడు ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలోని 59 ప్రధాన సర్కిల్స్లో 324 సీసీ కెమెరాలున్నాయి. ఇందులో హై టెక్నాలజీ కలగిన 41 జూమింగ్ కెమెరాలు ప్రధాన సర్కిళ్లలో ఏర్పాటయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 285 కెమెరాలను ఏర్పాటు చేశారు. అభిషేక్ మొహంతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 150 కెమెరాలు ఏర్పాటు కావడం విశేషం. గతంలో సీసీ కెమెరాలు లేని ప్రాంతాలైనచెర్లోపల్లి నుంచి పద్మావతిపురం వరకు ఉన్న చాముండేశ్వరీ ఆలయం, వైకుంఠపురం, అవిలాల, ఉప్పర పల్లి, ఆంధ్రాబ్యాంక్ కాలనీ, పద్మావతిపు రం, శ్రీనివాసపురం, కేశవాయని గుంట, ట్విన్ టవర్స్ వద్ద ఏర్పాటు చేశారు. నూతన కెమెరాల వివరాలు ♦ అర్బన్ జిల్లా పరిధిలో 852 సీసీ కెమెరాల్లో వివిధ రకాలు ఉన్నాయి. ఇందులో ఆర్ఎల్వీడీ సీసీ కెమెరాలు 33, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద రెడ్ లైట్ పడి ముందుకు వెళ్లిన వాహనాలను గుర్తిస్తాయి. ♦ ఎన్పీఆర్ సీసీ కెమెరాలు 250 ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఆటోమేటిక్గా వాహన నెంబర్ ప్లేట్లు గుర్తిస్తాయి. ♦ ఎఫ్ఆర్ఎస్ సీసీ కెమెరాలు 103 ఏర్పాటు చేయనున్నారు. ఇవి మనిషి ముఖాన్ని పూర్తిస్థాయిలో గుర్తించగలవు. ♦ 58 వీడీఏ సీసీ కెమెరాలు నిరంతరం వీడియోలు తీస్తాయి. బస్టాండ్, ఆలయాల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి వీడియో తీసిన సమయంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగు, వాహనాలు, వస్తువులు ఉంచి ఆపై నిర్ణీత గడువులోపల తీసుకోకపోతే అలాంటి వస్తువును ఇది గుర్తించి అప్రమత్తం చేస్తుంది. ♦ 200 జనరల్ సర్వైలెన్స్లు సాధారణ కెమెరాల్లా పనిచేస్తాయి. ♦ 208 పీటీజెడ్ కెమెరాలు అత్యంత నాణ్యత కల్గిన ఫొటోలను తీయగలవు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, రంగంపేట, వడమాలపేట ప్రాంతాల్లో 500, నగరంలో మరో 300 ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ప్రవేశించే ప్రతి వాహనాన్ని, వ్యక్తిని గుర్తించే లక్ష్యంగా పోలీసులు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ఫైబర్తో అనుసంధానం అర్బన్ జిల్లా పరిధిలో సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రం విజయవాడలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంలో ఉంది. ప్రభుత్వం రియల్టైం గవర్నెన్స్ లింక్ (ఆర్టీజీ) కలిగి ఉంటుంది. తిరుపతిలోని సీసీ కెమెరాల నిఘా కల్గిన ప్రతి ప్రాంతాన్ని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా పరిశీలించవచ్చు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న నిఘాకేంద్రాన్ని ఆర్టీజీకి అనుసంధానం చేయనున్నారు. -
ఔటర్పై ‘స్మార్ట్’ రైడ్..!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణం మరింత స్మార్ట్ కానుంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, ప్రయాణం సులభతరం చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తోంది. టోల్ ప్లాజాల వద్ద డబ్బులిచ్చే పద్ధతికి స్వస్తి పలికి ఏటీఎం కార్డును పోలి ఉండే ట్రాన్సిట్, టచ్ అండ్ గో కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లోని 19 ఇంటర్చేంజ్ల వద్ద ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రారంభించింది. టోల్ గేట్ సిబ్బందికి కార్డుల విధానంపై అవగాహన రాగానే మరో 3 రోజుల్లో అమలులోకి తీసుకురానుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేయనున్న ఈ కార్డులతో వాహనదారుల సమయం ఆదా కానుంది. కార్డుల కొనుగోలు, రీచార్జ్ కోసం ప్లాజా కార్యాలయాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను ఏర్పాటు చేశారు. నానక్రామ్గూడలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం ఈ సేవలను పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఓఆర్ఆర్ చుట్టూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ కార్డుతో.. ప్రస్తుతం ఔటర్పైకి వాహనం ఎక్కే ముందు కంప్యూటర్లో వివరాలు నమోదు చేసి ఓ స్లిప్ను వాహనదారుడికి ఇస్తున్నారు. దిగే చోట (ఎగ్జిట్ పాయింట్) ఉన్న కౌంటర్లో ఆ స్లిప్ ఇస్తే ప్రయాణ దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతున్నారు. దీంతో చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా టోల్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)ను హెచ్ఎండీఏ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్డు విధానం ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో ఔటర్పైకి వాహనం ఎక్కగానే క్షణం ఆలస్యం చేయకుండా స్మార్ట్ కార్డును సిబ్బంది ఇస్తారు. దిగే దగ్గర ఆ కార్డు ఇస్తే స్కాన్ చేసి ఎంత చెల్లించాలో సిబ్బంది చెబుతారు. బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. రోజువచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారికి ఈ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుందని అంటున్నారు. టచ్ చేసి వెళ్లడమే... ఓఆర్ఆర్పై 19 టోల్ప్లాజాలు దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు చాలా సమయం పడుతోంది. ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువైనపుడు డబ్బులు తీసుకొని రశీదు ఇవ్వడమూ సిబ్బందికి భారమవుతోంది. కొంతమంది సిబ్బంది తమకు తెలిసిన వారి నుంచి డబ్బులు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వసూళ్లలో పారదర్శకత, సులభతర ప్రయాణం కోసం ‘టచ్ అండ్ గో’కార్డును పరిచయం చేస్తున్నారు. కారు, లారీలు.. ఇలా ఏ వాహనదారుడికైనా ప్రత్యేక రంగు, ఆ వాహనం గుర్తుతో కార్డులివ్వనున్నారు. ప్లాజాల వద్ద ఉండే స్క్రీన్కు ఆ కార్డు చూపించి వెళ్లాలి. ఆ సమయంలో కార్డులోని సొమ్మును ఆటోమేటిక్గా చెల్లించినట్లవుతుంది. ఓఆర్ఆర్పై 157 మాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.200లకు అందుబాటులోకి తీసుకురానున్న ఈ కార్డులో ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోసీలో రీచార్జ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మొబైల్ రీచార్జ్ సేవలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఒక వాహనం కోసం తీసుకున్న కార్డు మరో వాహనానికి పనిచేయకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ‘యాంటీనా’తోనే క్లియరెన్స్... జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) కార్డులు కూడా ఓఆర్ఆర్పై పని చేసేలా చర్యలు చేపట్టారు. ఈ కార్డులున్న వాహనాలను 23 లేన్లలోనే అనుమతించనున్నారు. ఈ లేన్లోకి వెళ్లే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటు చేసిన తొలి యాంటీనా.. కార్డు సరైనదా కాదా స్క్రీన్ చేస్తుంది. లారీ కోసం రీచార్జ్ చేసుకుని కారుకు వాడాలనుకుంటే తిరస్కరిస్తుంది. అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ తెరుచుకుంటుంది. తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్ఆర్ ఎక్కిందని రికార్డు చేసుకుంటుంది. ఎగ్జిట్ టోల్ బూత్ నుంచి నిష్క్రమించగానే కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ కార్డులను కూడా టోల్ ప్లాజాలో వద్ద ఏర్పాటు చేసే పీవోఎస్లో రీచార్జ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
నకిలీ వార్తలకు చెక్ పెట్టే టెక్నాలజీ
సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లువెత్తుతున్న నకిలీ వార్తల వల్ల కలుగుతున్న నష్టాలేమిటో అందరికీ తెలిసిందే. ఫేస్బుక్లోనో లేదా ట్విట్టర్లోనో వచ్చిన వార్త నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఇంత వరకు లేకపోవడం వల్ల ఆ వార్తలను నిజమని నమ్మిన కొందరు భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు అసలీనా నకిలీనా అన్ని నిగ్గుతేల్చే సాంతికేక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. బ్రిటన్లో ఇంజనీరింగ్ చదువుతున్న భారత సంతతికి చెందిన లిరిక్ జైన్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్త నిజమైనదో కాదో నిర్థారించే పరిజ్ఞానాన్ని అభివద్ధి చేశాడు. ఈ పరిజ్ఞానం(ఫ్లాట్ఫాం) సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను వడబోసి నిజమైన వార్తలను నిర్థారిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా కథనం లేదా సమాచారం రాగానే ఈ ఫ్లాట్ఫాం 70వేలకు పైగా డొమైన్ల నుంచి వాటికి సంబంధించిన కథనాల్ని సేకరిస్తుంది. ప్రతి కథనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ను ఉపయోగించి ఆ కథనం హేతుబద్ధంగా ఉందా... దాని వెనుక రాజకీయ ప్రయోజనాలేమైనా ఉన్నాయా? కథనంలో ఇచ్చిన గణాంకాలన్నీ సరైనవేనా? అన్నది పరిశీలించి ఆ వివరాలను బహిర్గతం చేస్తుంది. దానిని బట్టి వినియోగదారుడు ఆ కథనం నమ్మదగినదో కాదో నిర్థారించుకుంటాడు. ఈ పరిజ్ఞానం ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని,వచ్చే సెప్టెంబర్లో అమెరికా, బ్రిటన్లలో అందుబాటులోకి వస్తుందని లిరక్ జైన్ తెలిపారు. అక్టోబర్లో ఈ పరిజ్ఞానం భారత్లో ప్రవేశపెడతామని ఆయన అంటున్నారు.వార్తలు, కథనాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కత్రిమ మేథను కూడా ఉపయోగించుకుంటామని జైన్ చెప్పారు. భారత దేశంలో 20 కోట్ల మందికిపైగా వాట్సాప్ వినియోగదారులున్నారు.ఇటీవల వాట్సాప్లో వస్తున్న అసత్య ప్రచారాలు, నకిలీ కథనాలు అల్లర్లకు, హత్యలకు దారితీస్తున్నాయి. ‘వాట్సాప్లో వస్తున్న కథనాలు, వార్తలు ఉద్రేకపూరితంగా, భావోద్వేగాలను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం ఆ కథనాలు అసలైనవో కాదో తెలుసుకోవడానికి, అవాస్తవ కథనాలను నియంత్రించడానికి చాలా సమయం పడుతోంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ లోపాన్ని అధిగమించడం కోసం సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని అప్పటి కప్పుడే వడపోసే అవకాశాల కోసం మేం అన్వేషిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో దీనికి సంబంధించిన మా ప్రణాళికల్ని ప్రకటిస్తాం’ అని జైన్ అంటున్నారు. మైసూరు నుంచి కేంబ్రిడ్జి వరకు.. మైసూరు చెందిన 21 ఏళ్ల లిరిక్ జైన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. గత ఏడాది లాజిక్ అలే పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బ్రిటన్లో మొట్టమొదటి ఇంటెలిజెంట్ న్యూస్ ఫీడ్ కంపెనీ ఇదే. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను గుర్తించడం దీని పని. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,బ్రిటన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన నిపుణులతో 10లక్షల పౌండ్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు. బ్రిటన్,అమెరికా, భారత్లలో ప్రస్తుతం ఈ కంపెనీకి 38 మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని ఆలోచిస్తున్నట్టు జైన్ తెలిపారు. -
హానర్ 10జీటీ: కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: హువావే బ్రాండ హానర్ కొత్త స్మార్ట్ఫోన్నులాంచ్ చేసింది. జాంటర్ వేరియంట్ గా హానర్ 10జీటీని చైనాలో ప్రకటించింది. జీపీయూ టర్బో టెక్నాలజీ, 8జీబీ ర్యామ్తో దీన్ని విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన హానర్ 10 ను మాదిరి ఫీచర్లనే పోలి వున్న హానర్ 10జీటీ ఫీచర్లు ఇలా ఉన్నాయి. హానర్ 10జీటీ ఫీచర్స్ 5.84అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే,19: 9 కారక నిష్పత్తి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 1080x2160పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 24+16 ఎంపి డ్యుయల్రి యర్ కెమెరా విత్ AI ఫోటోగ్రఫీ మోడ్ 24 ఎంపీ సెల్పీ కెమెరా 3400ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు 26,800 రూపాయలు -
త్రీడీ.. రెడీ
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): సాంకేతిక రంగంలో భవిష్యత్ తరాలకు త్రీడీ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కంటే అత్యాధునిక అడ్వాన్స్డ్ త్రీడీ టెక్నాలజీ ఆవశ్యకత పెరుగనుంది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, వైద్య రంగంలో అవసరమైన వాటిని డిజైన్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన త్రీడీ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని నాన్టెక్నికల్ యూనివర్సిటీల్లో త్రీడీ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఏకైక విశ్వవిద్యాలయం రాయలసీమ విశ్వవిద్యాలయం కావటం గర్వకారణం. రూ.30 లక్షలతో త్రీడీ ల్యాబ్ను రెండు నెలల క్రితం అప్పటి వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వై.నరసింహులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్ ప్రారంభించారు. ఐదు కంప్యూటర్లు, అత్యాధునికమైన ఐదు ప్రింటర్లు, స్కానింగ్ మిషన్ ల్యాబ్లో అత్యంత కీలకమైన వస్తువులు. త్రీడీ స్కానర్ మనుషులు కొలవలేని, డిజైన్ చేయలేని వాటిని స్కానర్ ద్వారా స్కాన్ చేసి ప్రింటింగ్ తీసుకోవచ్చు. త్రీడీ టెక్నాలజీ.. త్రీ డైమెన్సనల్ ప్రింటింగ్ అనేది (త్రీడీ) అడిటివ్ మానుఫ్యాక్షరింగ్ అనే అంశంపై ఆధారపడి భౌతిక వస్తువులను త్రీ డైమెన్సన్లో అచ్చు వేస్తోంది. ఇది ఒక పొర మీద ఒక పొరను జమ చేస్తూ ఒక క్రమపద్ధతిలో ప్రింట్ చేస్తుంది. దీని కోసం త్రీడీ క్యాడ్ నమూనాను కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ద్వారా రూపొందిస్తారు. ఆర్యూ ల్యాబ్లో ఇలా.. ⇔ హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వారు టర్బైన్ బ్లేడ్స్ను త్రీడీ స్కానింగ్ చేసుకోడానికి ఆర్యూలోని త్రీడీ స్కానర్ను ఉపయోగించుకున్నారు. ⇔ ఏపీలోని అటానమస్ డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులకు సమ్మర్ స్కూల్ ప్రొగ్రామ్లో భాగంగా త్రీడీ ప్రిటింగ్పై శిక్షణ ఇచ్చారు. ⇔ ఆర్యూలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం విద్యార్థులు కొంత మంది హైదరాబాద్లోని ఆడెడ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శిక్షణ పొందారు. ⇔ ఆర్యూ క్యాంపస్లోని భవనాలు, వర్సిటీ పేరును త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేస్తున్నారు. త్రీడీ ల్యాబ్, స్కానర్తో ఉపయోగాలు ⇔ పరిశ్రమల్లో చాలా వేగంగా ప్రాథమిక నమూనాను తయారు చేసుకోవచ్చు. ⇔ త్రీడీ షూ లాస్ట్స్ (షూ మోడల్) తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ⇔ ఆర్ట్ అండ్ జ్యూవెలరీ ఫొటో టైప్ డిజైనింగ్కు అవకాశం. ⇔ దంత వైద్యాలయాల్లో పళ్ల నమూనాలు రూపొందిస్తారు. ⇔ ఇళ్లు, కాలనీలు, వెంచర్ల నమూనాల డిజైనింగ్కు నిర్మాణ రంగంలో ఉపయోగిస్తారు. ⇔ ఆటోమోటీవ్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. ⇔ యంత్రాల బాహ్య డిజైనింగ్ చేయుటకు ఉపయోగిస్తారు.