permission
-
ఆత్మహత్యకు అనుమతించండి
భూపాలపల్లి: ‘ఓ ఎస్సై, అతడి కుటుంబసభ్యులు మా పొలంలోని వెళ్లనివ్వకుండా దారిని తొలగించారు. పైగా కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించా’లంటూ వృద్ధ దంపతులు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ భవనం ఎదుట ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ అధికారులను వేడుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి వెళ్లడానికి దారి ఉండగా, రెండున్నరేళ్లుగా కన్నాయిగూడెం ఎస్సై (ములుగు జిల్లా)గా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి సదరు మార్గాన్ని మూసివేశారని దంపతులు ఆరోపించారు. ‘దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, భూపాలపల్లి ఆర్డీవో రమాదేవి విచారణ చేపట్టి దారి మూసివేసిన విషయాన్ని నిర్ధారించారు. అయినా, ఎస్సై వెంకటేష్, అతని బంధువులు దారివ్వకపోగా, మాపై అక్రమ కేసులు బనాయించారు. మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదు’ అని ఆ దంపతులు వాపోయారు. ఎస్సై బాధలు తట్టుకోలేకపోతున్నామని, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని సులోచన, ప్రతాప్రెడ్డి కోరారు. కలెక్టర్ రాహుల్శర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో రవి వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీనిచ్చారు. -
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ధర్నాకు ఒకరోజు ముందు అనుమతి నిరాకరించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి.బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణకు పోలీసులు పలు కారణాలను వెల్లడించారు. నల్లగొండ డీఎస్పీ పేరుతో లేఖను అందజేశారు. గడియారం సెంటర్లో తలపెట్టిన మహా ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న సమాచారం తమకు ఉందని అందులో పేర్కొన్నారు. అయితే గడియారం సెంటర్లో అందుకు సరిపడా స్థలం లేదని, అన్ని రోడ్లకు జంక్షన్ అయిన గడియారం సెంటర్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పైగా అటునుంచి రాకపోకలు సాగించే వాహనాలను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని, పార్కింగ్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, ఇతర పథకాలకు లబ్ధిదారులు గుర్తింపు కోసం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని, పోలీస్ యంత్రాంగం అంతా ఆ బందోబస్తులో ఉంటుందని వివరించారు. మరోవైపు సంక్రాంతికి వెళ్లిన ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారంతా హైదరాబాద్ వస్తున్నందున జాతీయ రహదారిపై కూడా రద్దీగా ఉంటోందని, ఈ పరిస్థితిలో మహాధర్నాకు వచ్చే జనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు లేఖలో వివరించారు.ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ) మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఇవాళ.. ఈ నెల 28న ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. -
యూకే వెళ్లేందుకు వైఎస్ జగన్కు అనుమతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా పాస్పోర్ట్ పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) జారీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్ జగన్కు పాస్పోర్ట్ జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారులను ఆదేశించింది. కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం ఈ నెల 16న యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వెళ్లేందుకు జగన్మోహన్రెడ్డికి అనుమతి ఇచ్చింది. ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.తాజాగా ఐదేళ్ల కాల వ్యవధితో పాస్పోర్ట్ జారీకి ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనంటూ విజయ వాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం వాదనలు విన్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ‘క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం అడగటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. క్రిమినల్ ప్రొసీడింగ్స్కు దరఖాస్తు దారు అందుబాటులో ఉండేలా చూడటమే. పాస్పోర్ట్ కలిగి ఉండటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. విదేశాలకు వెళ్లేందుకు తగిన పాస్పోర్ట్ కలిగి ఉండాలి.జగన్ మోహన్రెడ్డి ఈ నెల 16న తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాల్సి ఉంది. జగన్మోహన్రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే.. ఇదే హైకోర్టు గత నవంబర్లో ఉత్తర్వులిచ్చింది. జగన్ తరఫున ఆయన న్యాయవాది హాజరైతే సరిపోతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా పాస్పోర్ట్ పొందేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఎన్వోసీ జారీ చేయాలన్న జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలేవీ చెల్లవు. అందువల్ల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని శ్రీనివాసరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. -
సీనియర్లు, కూటమి శ్రేణులకు అడుగడుగునా అవమానం..
సాక్షి, టాస్క్ఫోర్స్: సీఎం చంద్రబాబు పర్యటనలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిని సీనియర్ నేతలు కలిసేందుకు సైతం ఆంక్షలు విధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కార్యకర్తలనైతే తన నిరంకుశ వైఖరితో అడుగడుగునా అవమానించారని పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని మండిపడుతున్నాయి. ఆయన అనుమతి లేనిదే సీఎం సమీపంలోకి సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన చెందుతున్నాయి. చివరకు పోలీసులు.. ఉన్నతాధికారులను తన కనుసన్నల్లోనే నడిపించారని ఆరోపిస్తున్నాయి. అభిమానంతో అధినేతను కలవాలని వస్తే ఇదెక్కడి పెత్తనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం నియోజకవర్గానికి విచ్చేశారు. ఇక అప్పటి నుంచి మొత్తం పర్యటన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కనుసన్నల్లోనే సాగడం టీడీపీ శ్రేణులను అసంతృప్తికి గురిచేసింది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్సీ చెప్పాలి. అది ఎమ్మెల్యే అయినా.. సీనియర్, టీడీపీ, జనసేన నేతలైనా సరే. ఆయన చెప్పకపోతే సీఎంని కలిసే అవకాశమే లేదు.అలా ఒకరోజంతా ఓపికగా వేచి చూసిన కూటమి నేతలు, కార్యకర్తలు సహనం నశించి బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎట్టకేలకు సీఎం చంద్రబాబుని కలిసేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు మొదటి సారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి వచ్చారు. మంగళవారం కుప్పానికి చేరుకున్న చంద్రబాబు.. బుధవారం సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబుని కలిసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా.. అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రిని కలవొచ్చని ఆశగా కుప్పానికి చేరుకున్న వారికి నిరాశే ఎదురైంది.అడ్డంకులు.. అవమానాలు!ఎమ్మెల్యేల నుంచి.. సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో సీఎం చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అడుగడుగునా అడ్డంకులు, అవమానాలే ఎదురైనట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం అంటే సెక్యూరిటీ సహజమే అయినా.. ఎమ్మెల్యే అయితే పెద్దగా తనిఖీలు లేకుండా నేరుగా పంపేస్తుంటారు. అలాంటిది కుప్పంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవమే ఎదురైంది.తాను ఎమ్మెల్యేని చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదని, పంపేందుకు ససేమిరా అన్నారని తెలిపారు. ఐడీ కార్డు ఉందా? మీరు ఎమ్మెల్యేనేనా? రుజువు ఏంటి? అంటూ సవాలక్ష ప్రశ్నలతో తీవ్ర అవమానాలకు గురిచేసినట్లు చెబుతున్నారు. ‘సీఎంని కలవాలంటే.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ నుంచి ఫోన్ చేయించండి లేదా చెప్పించండి’ అంటూ సమాధానం ఎదురైందంటున్నారు. సరే శ్రీకాంత్తో చెప్పిద్దాం అంటే ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులే కాకుండా.. అధికారులు సైతం ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడిచినట్లు వివరించారు. ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నాయకులకు కూడా సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులందరినీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం లోటే..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మంత్రి వర్గంలో పెద్దపీట వేశారు. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విప్ పదవి సైతం ఇచ్చారు. జిల్లాపై తనకున్న అభిమానం చాటుకున్నారు. అయితే ఇప్పుడు అదే స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడంపై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒక్కరికై నా మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఇలా ఉండేది కాదనే అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లా ఎమ్మెల్యేలకే న్యాయం చేయకపోతే ఎలా? అని ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.ఆందోళనతో దిగొచ్చినా ప్రయోజనం శూన్యం!కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం.. సీఎం కుప్పానికి రావడంతో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేననేతలు చంద్రబాబుని కలిసేందుకు ఉత్సాహం చూపించారు. మంగళవారం ఉదయం నుంచి వేచి ఉన్న వారికి బుధవారం కూడా చంద్రబాబుని కలిసే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్తోపాటు పోలీసులను ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహించిన కూటమి శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ వారిని లోనికి పంపించమని పోలీసులను ఆదేశించారు. అయితే లోపలికి వెళ్లినా.. కొందరికి మాత్రమే సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం దొరికిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ కూడా శ్రీరామ కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుని అనుమతివ్వడం గమనార్హం. కాగా, భద్రాచల శ్రీరాముని కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం సీఈవో వికాస్రాజ్కు లక్ష్మణ్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు. -
Lok Sabha elections 2024: కోయంబత్తూర్ రోడ్ షోకు హైకోర్టు ఓకే
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్ను ఆదేశించారు. -
‘సలార్’ టికెట్ ధర పెంపునకు ప్రభుత్వ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు ప్రశాంత్నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’కు టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సలార్’చిత్రం ప్రదర్శించే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ ధరపై రూ.65, మల్టిప్లెక్స్లో ఒక్కో టికెట్పై రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ టికెట్ ధర పెంపు ఈనెల 22 నుంచి 28 వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు షో కు, ఆరోజు ఆరో షో వేసేందుకు అనుమతించారు. ఈనెల 22న తెల్లవారుజామున ఒంటిగంటకు ‘సలార్’చిత్రం బెనిఫిట్ షో వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 థియేటర్లకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మాంసం దుకాణాలపై కొరడా ఝుళిపిస్తున్న అధికారులు
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సూచనల మేరకు గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో అనుమతి లేకుండా బహిరంగంగా మాంసం, చేపలను విక్రయించడాన్ని నిషేధించింది. దీనిని అమలు చేసేందుకు అధికారులు నగరంలోని పలు మార్కెట్లలో దాడుల నిర్వహిస్తున్నారు. గ్వాలియర్ మార్కెట్లో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఏడు మాసం దుకాణాలను అధికారులు మూసివేయించారు. అలాగే పలువురు వ్యాపారుల నుంచి వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. దీనికితోడు ఆయా వ్యాపారుల నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హర్ష్సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనూజ్ శర్మ, డాక్టర్ వైభవ్ శ్రీవాస్తవ నేతృత్వంలో నగరంలో బహిరంగంగా మాంసం, చేపలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు బృందాలుగా ఏర్పడి చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు విక్రయిస్తున్న వారి నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక దుకాణాల ఆక్రమణలను కూడా తొలగించారు. నిబంధనలను పాటించని దుకాణదారుల నుంచి మూడు వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేశారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి
-
ఆడియెన్స్ను ఉర్రూతలూగించే రియా పాటలు
పాట లక్ష్యం హుషారుగా స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు. పరుగును ఆపి మనలోకి మనం వెళ్లడం. మంచి ఊహలకు స్వాగతం పలకడం అంటోంది రియ సంగీతం. సాంగ్ రైటర్, సింగర్ రియ పాటలు హుషారెత్తిస్తూనే స్వీయ క్రమశిక్షణ నుంచి ఆత్మబలం వరకు ఎన్నో మంచి విషయాలను చెబుతాయి... దిల్లీలో పుట్టిన రియ రెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో యూకే వెళ్లింది. పాప్–బాలీవుడ్ మ్యూజిక్ను వింటూ పెరిగింది. చిన్న వయసులోనే స్టేజీపై ప్రదర్శనలు ఇచ్చింది. రియ ‘పర్మిషన్’ ట్రాక్ శ్రోతలను అలరించింది. ‘పర్మిషన్’ కోసం కలం కూడా పట్టింది రియ. ఇద్దరు ప్రేమికుల గురించి కావచ్చు, స్నేహం, కుటుంబ బంధాల గురించి కావచ్చు స్టోరీ–డ్రైవెన్ లిరిక్స్ రాయడం అంటే రియకు ఇష్టం. క్లాసికల్ సింగింగ్లో డిప్లొమా చేసిన రియకు థియేటర్ మ్యూజిక్ అంటే ఇష్టం. ‘పర్మిషన్’ తరువాత వచ్చిన ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’కు మంచి పేరు వచ్చింది. ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు అనే దానికి ఉదాహరణ...డోన్ట్ హ్యావ్ ది టైమ్. ఒక ఫెస్టివల్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఈ పాటకు ఆలోచన తట్టింది. ఆడియెన్స్ కూడా లీనమై తనతో పాటు డ్యాన్స్ చేసే పాట సృష్టించాలనుకుంది రియ. అలా పుట్టిందే... డోంట్ హ్యావ్ ది టైమ్. అయస్కాంతంలా ఆకట్టుకునే పాట ఒకటి సృష్టించాలనుకుంది. అలా అని ఆ పాట అల్లాటప్పాగా ఉండకూడదని దానిలో సందేశం ఉండాలనుకుంది. మనలో ఎంత టాలెంట్ ఉంటే మాత్రం? టైమ్ లేకపోతే అంతే! అందుకే టైమ్ విలువను క్షణ, క్షణం గుర్తు చేసుకునేలా ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’ను తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉండడమే ఈ పాట సక్సెస్ సాధించడానికి కారణం అయింది. ‘ప్రతి నిమిషం అపూర్వమైనది. వెల కట్టలేనిది’ అని గుర్తు చేసే ‘డోంట్ హ్యావ్ ది టైమ్’పై పాప్ బీట్ మాత్రమే కాదు బాలీవుడ్ మ్యూజిక్ ప్రభావం కూడా కనిపిస్తుంది. ట్రాక్ వీడియోల షూట్ కోసం ఎన్నో సార్లు దిల్లీకి వచ్చిన రియ ప్రతిసారి ఒక కొత్త అనుభవాన్ని సొంతం చేసుకుంది. ‘సాంస్కృతిక వైవిధ్యంతో వెలిగిపోయే దిల్లీలో అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి’ అని దిల్లీ గురించి మురిపెంగా చెబుతుంది రియ. ‘ప్రతి నెల ఒక సింగిల్ విడుదల చేయాలనుకుంటున్నాను’ అంటున్న రియ తన రచనలు, సంగీతంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఇండియాలోని ప్రొడ్యూసర్లు, మ్యూజిషియన్లతో పనిచేయాలని, లైవ్ షోలలో పాల్గొనాలనేది రియ కల. మరి నెక్స్›్ట ఏమిటి? ‘చెప్పుకోతగ్గ అద్భుతమైన ఆనందకరమైన విషయాలు మున్ముందు ఉన్నాయి. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, బీబీసీ ది హండ్రెడ్ ప్రోగ్రామ్లో ప్రదర్శన ఇవ్వబోతున్నాను’ అంటుంది రియ. -
హెచ్-1బీ: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త
US-Canada H-1B visa holders: అమెరికా హెచ్-1 బి వీసాదారులకు కెనడా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బీ వీసాదారులు ఇకపై కెనడాలో కూడా పనిచేయవచ్చని తాజాగా ప్రకటించింది. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించేందుకు యూఎస్ హెచ్-1 వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది. (హిండెన్బర్గ్ రిపోర్ట్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ) ఈ కొత్త పథకం ద్వారా కెనడా ప్రభుత్వం10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ వీసా హోల్డర్లు కెనడాలో మూడు సంవత్సరాల పాటు పని చేయడానికి అనుమతిస్తుంది. ఈ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యుల చదువుకోవచ్చు లేదా దేశంలో పని చేసుకోవచ్చు. ఇందుకు తాత్కాలిక నివాస వీసా, వర్క్ లేదా స్టడీ పర్మిట్ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా యూఎస్లో పని చేసే హెచ్-1 బీ హోల్డర్లు స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను ఉపయోగించేవారు. కాగా 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్లు, వారితో పాటు కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడా ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల ఉద్యోగులను నియమించు కుంటాయి. (అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు) -
తెలంగాణలో 13 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 13 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పూర్తిగా రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేస్తున్నవేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగానీ కేంద్రం రూపాయి ఇవ్వలేదని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోద ముద్ర అని సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఎన్ఎంసీ అటానమస్ బాడీ అని, నిర్దేశించిన అన్ని నిబంధనలు సంతృప్తి పరిచేలా ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాతే మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందని ఆయన తెలిపారు. -
ఇక నో మోర్ పర్మిషన్.. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనపై పోలీసుల నిర్ణయం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.. कुश्ती पहलवानों का धरना और प्रदर्शन निर्बाध तरीक़े से जंतर मंतर की सूचित जगह पर चल रहा था। कल, प्रदर्शकारियों ने तमाम आग्रह और अनुरोध के बावजूद कानून का उन्मादी रूप से उल्लंघन करा। अतः चल रहे धरने को समाप्त कर दिया गया है। — DCP New Delhi (@DCPNewDelhi) May 29, 2023 ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు. VIDEO | Security heightened at Jantar Mantar in Delhi ahead of the 'Mahila Samman Mahapanchayat' called by protesting wrestlers today. pic.twitter.com/rP0EXvLuwg — Press Trust of India (@PTI_News) May 28, 2023 Video Source: PTI News అవి మార్ఫింగ్ ఫొటోలు ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’.. అరెస్టు తర్వాత వ్యానులో వినేష్, సంగీత ఫొగాట్లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రెజ్లర్ సాక్షి మాలిక్ పై విధంగా స్పందించారు. ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం? -
రిజిస్ట్రార్ కుర్చీ కోసం ఎత్తుకుపైఎత్తులు
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ నియామకంలో బుధవారం హై డ్రామా నెలకొంది. వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ హైకోర్టు మధ్యంతర రద్దు ఉత్తర్వుల ఆధారంగా ఈసీ నియమించిన ప్రొఫెసర్ యాదగిరి స్థానంలో వర్సిటీ కొత్త రిజిస్ట్రార్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవిని నియమించారు. ఆమె బుధవారం ఉదయం ఓయూ నుంచి ఏడాది కాలానికి లీన్ తీసుకుని తెయూ రిజిస్ట్రార్గా సా యంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే పాలనాపరమైన కారణాల వల్ల లీన్ను రద్దు చేస్తూ బు ధవారం సాయంత్రం ఓయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఆమెను యథాస్థానంలో తిరిగి చేరాలని కోరుతూ ఉత్తర్వులు జారీచేయడం కలకలం రేపింది. రిజిస్ట్రార్గా నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె లీన్ రద్దు చేస్తున్నట్లు ఓయూ జారీ చేసిన ఉత్తర్వులు అందినప్పటికీ వీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మల రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించగానే వీసీ కార్యాలయం ద్వారా ఆగమేఘాలపై రిజిస్ట్రార్ సిగ్నేచర్ను బ్యాంక్ ఆథరైజేషన్ కోసం పంపించడం గమనార్హం. అయితే అప్పటికే బ్యాంకు పని వేళలు ముగియడంతో బ్యాంక్ అధికారులు సిగ్నేచర్ అథరైజేషన్ చేయలేకపోవడం కొసమెరుపు. వీసీ వర్సెస్ నవీన్ మిట్టల్ వ్యవహారం తెలంగాణ యూనివర్సిటీని మరింత వివాదంలోకి నెట్టేసింది. గత నెల 19న హైదరాబాద్లో జరిగిన 55వ తెయూ పాలకమండలి సమావేశాన్ని వీసీ వాకౌట్ చేయడం సంచనలం రేపింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటీ కరుణ, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, పాలకమండలి సభ్యులు రెండేళ్ల కాలానికి తెయూ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్గా విద్యావర్ధినిని తొలగిస్తూ, పాలకమండలి ప్రమేయం లేకుండా వీసీ రవీందర్ హయాంలో జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, విచ్చలవిడి కొనుగోళ్తు, చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై విచారణ జరపాలని తీర్మానం చేశారు. వీసీ అధికారాలకు కత్తెర వేసి రిజిస్ట్రార్కు హక్కులు కట్టబెట్టారు. దీంతో ఈసీ నిర్ణయాలను వీసీ హైకోర్టులో సవాల్ చేశారు. తుది తీర్పు వచ్చే వరకు ఈసీ నిర్ణయాలను రద్దు చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం వీసీ రవీందర్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకంగా నవీన్ మిట్టల్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రార్గా యాదగిరి నియామకం చెల్లదని, వారం రోజుల్లో ఓయూ నుంచి ఒకరిని రిజిస్ట్రార్గా నియమిస్తామని పేర్కొన్నారు. చెప్పినట్టే బుధవారం ఓయూ ఈసీఈ హెచ్వోడీ ప్రొఫెసర్ నిర్మల దేవిని తెయూ రిజిస్ట్రార్గా నియమించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఓయూ నుంచి లీన్ను రద్దు చేస్తున్నట్లు నిర్మల దేవిని వెనక్కు తిరిగి రావాని కొత్త ఉత్తర్వులు జారీ కావడం సంచనలం కలిగించింది. రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ నిర్మల దేవి తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ ఎల్.నిర్మల దేవి నియామకమయ్యా రు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వీసీ డి.రవీందర్ ఆమెకు ఉత్తర్వులు అందజేశారు. వెంటనే ఆమె రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిర్మ ల దేవి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. నిర్మలదేవి 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రిజిస్ట్రార్గా బాధ్య తలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీచింగ్, నాన్–టీచింగ్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరి సహకారంతో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమన్నారు. మీడియా నిజమైన వార్తలు ప్రచురించాలని వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వీసీ రవీందర్ మాట్లాడుతూ.. త్వరలోనే తెయూలో ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభిస్తామన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత నిచ్చే నిర్మల దేవిని రిజిస్ట్రార్గా నియమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం వీసీ రవీందర్, రిజిస్ట్రార్ నిర్మలదేవిని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ విషయమై నిర్మల దేవిని సంప్రదించగా ఓయూ నుంచి లీన్ అనుమతి ఇస్తేనే తాను తెయూ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించానని, రద్దు ఉత్తర్వులు తనకు తెలియవన్నారు. తెయూ రిజిస్ట్రార్గా కంటిన్యూ అవుతానని స్పష్టం చేశారు. అయితే లీన్ రద్దు చేసినా నిర్మల దేవి తిరిగి వెళ్లకపోతే ఓయూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం.. ఈసీ నిర్ణయాలను రద్దుచేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పై గురువారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. వీసీ తెచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తే (స్టే వెకేట్) మళ్లీ అప్పుడు రిజిస్ట్రార్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారనుంది. దీనికి తోడు శుక్రవారం తెయూ ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. ముందు గా ఆన్లైన్లో వర్చువల్గా ఈసీ సమావేశం ని ర్వహించాలని భావించినా వర్సిటీలో జరుగుతు న్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న ఈసీ స భ్యులు ప్రత్యక్షంగా సమావేశం జరపాలని భావి స్తున్నట్లు తెలుస్తోంది. వీసీ దుందుడుకు చర్య లు, నవీన్ మిట్టల్పై ఆరోపణలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వీసీపై మరి న్ని చర్యలకు తీర్మానం చేసే అవకాశాలున్నాయి. రెండేళ్ల పదవీ కాలంలో వీసీ రవీందర్ ఆరుగురు రిజిస్ట్రార్లను మార్చారు. దీంతో వర్సిటీలో పాలన, టీచింగ్, పరిశోధన అటకెక్కాయి. తెయూ పాలకమండలి సభ్యుడు గంగాధర్గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వీసీ రవీందర్ తన చర్యలతో వర్సిటీ పరువును గంగలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆమోదం లేకుండా నూతన రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన నిర్మల దేవి వర్సిటీ నిధుల్లో నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసక్తికర పరిణామాల మధ్య తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ పాలకమండలి నిర్ణయాన్ని కాదని యాదగిరి స్థానంలో ఆమెను వీసీ రవీందర్ నియమించారు. నిర్మల లీన్ను రద్దు చేస్తూ ఓయూ నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ తెయూ వర్సిటీగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కొసమెరుపు. ఈ పరిణామాలతో పాలక మండలి, వీసీ మధ్య పోరు తారాస్థాయికి చేరినట్లయ్యింది. -
విజయనగరం: ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు అయినట్లు జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. చదవండి AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం -
TS: వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి
సాక్షి, వరంగల్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తిరిగి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర చేసుకునేందుకు ఆమెకు వరంగల్ సీపీ రంగనాథ్ అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉంటే షరతులతో కూడిన అనుమతి షర్మిల యాత్రకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కిందటి ఏడాది నవంబర్ 28వ తేదీన వరంగల్ జిల్లా లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షరతులు.. ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పదవాఖ్యలు చేయవద్దు. ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది. -
లోకేశ్ పాదయాత్ర.. సాధారణ షరతులతో అనుమతి
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అతి సాధారణ షరతులతో అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు అంబులెన్స్లకు దారి ఇవ్వాలని, మారణాయుధాలతో సంచరించరాదని దేశవ్యాప్తంగా పోలీసులు షరతులు విధిస్తున్నారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిబంధనలను అనుసరించే లోకేశ్ పాదయాత్ర, బహిరంగ సభలకు పోలీసులు మంగళవారం విడివిడిగా అనుమతులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని డీఎస్పీలకు దరఖాస్తు చేసుకుంటే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని పోలీసుశాఖ తెలిపింది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్న కుప్పం నియోజకవర్గం పలమనేరు డీఎస్పీ అనుమతి ఇచ్చారు. పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొనేవారి భద్రత కోసమే నిబంధనల మేరకు అనుమతి జారీ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. అతి సాధారణ షరతుల్లో ముఖ్యమైనవి ఇవీ.. ►పాదయాత్రతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగించరాదు. ►ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్రదేశాల్లో ముఖాముఖి నిర్వహించుకోవాలి. ►పురుషులు, మహిళా వలంటీర్లను తగినంత మందిని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక యూనిఫాం కేటాయించాలి. రోప్లు అందచేసి నియంత్రించేలా చూడాలి. ►పాదయాత్రలో డీజే సౌండ్ బాక్సులు, పెద్ద స్పీకర్లకు అనుమతి లేదు. ►పాదయాత్రలో పాల్గొనేవారు, సభలకు హాజరయ్యేవారు ఎలాంటి మారణాయుధాలు, రాళ్లు తదితరాలను తేకూడదు. ►మద్యం, మత్తు పదార్ధాలను సేవించరాదు. ►పాదయాత్రలో పాల్గొనేవారి వ్యక్తిగత భద్రత, ఆరోగ్య బాధ్యతలను నిర్వాహకులు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు, ఇతర దుర్ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. తగినంత మంది వైద్య సిబ్బంది, అత్యవసర మందులతో కూడిన అంబులెన్స్ను ఏర్పాటు చేయాలి. రాత్రి బస చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తగినంత లైటింగ్ సమకూర్చుకోవాలి. ►ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►బహిరంగ సభలను రోడ్లపై కాకుండా ఏదైనా మైదానంలోగానీ ప్రత్యేక ప్రదేశంలోగానీ ఏర్పాటు చేసుకోవాలి. అంచనా కంటే 20 శాతం మంది అధికంగా పట్టేందుకు వీలున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ►ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్తు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి. -
డెక్కన్ మాల్కు అనుమతి పత్రాలపై జీహెచ్ఎంసీ అధికారుల మధ్య వాగ్వాదం
-
పార్వతీపురం మన్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి
సాక్షి, అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.600 కోట్లతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు పరిపాలనపరమైన అనుమతిని మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. టీచింగ్ ఆస్పత్రితోపాటు హస్టళ్లు, క్వార్టర్లు, నర్సింగ్ కాలేజీ, అనుబంధ భవనాలతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీకి పరిపాలన అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా వైద్యవిద్య సంచాలకులను ఆదేశించింది. (క్లిక్ చేయండి: లక్ష్మీపురంలో ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి) -
బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ
-
గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతి
-
చంద్రబాబు హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతులు
-
గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి!
సాక్షి, ఆదిలాబాద్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకొనే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆగస్టు 31న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడంతో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని గణేశ్ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, విద్యుత్ అధికారులు పలు సూచనలు చేశారు. పోలీస్శాఖ సూచనలు.. ► గణేశ్ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు. ►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి. ►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి. ►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి. ►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి. ►ఆగస్టు 31న ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం. ►సౌండ్ బాక్స్లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. మండపం వద్ద ఒక బాక్స్ టైపు స్పీకర్ మండప ప్రాంగణంలో మాత్రమే ఇన్స్టాల్ చేయబడాలి. ►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్లను ఉపయోగించకూడదు. ►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి. ►ఏదైన సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి. విద్యుత్శాఖ సూచనలు.. ►వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ షాక్లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందంటున్నారు. ►మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్డ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ద్వారా మాత్రమే చేపట్టాలి. ►విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్ను అమర్చుకోవాలి. ►మండపానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండరాదు. ► ప్రతి సర్క్యూట్పై 800 వాట్ల కంటే అధిక లోడ్ వేయరాదు. ►వరుస విద్యుద్దీపాల కోసం సిల్క్వైర్లను వాడడం మంచిదికాదు. దీని వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంటుంది. ►ప్రతి సర్క్యూట్కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్త్వైర్ను తీసుకోవాలి. ►మండపాల వద్ద ఎర్తింగ్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. 25 ఎంఎం డయామీటర్, 3 మీటర్ల లోతైన గుంత తీసి ఎర్తింగ్ పైప్ను అమర్చుకోవాలి. ►మండపాల్లో విద్యుత్ ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్లను వాడరాదు. ►ప్రతి మండపం వద్ద 5 కేజీల కార్బన్డయాక్సైడ్ నిండి ఉన్న అగ్నిమాపక సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. -
వరంగల్లో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: హనుమకొండలో బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడి సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో శనివారం బహిరంగ సభ నిర్వహించుకునేందుకు బీజేపీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవల రాష్ట్రంలో పలు బహిరంగ సభలకు అనుమతినిచ్చి, ఈ సభకు నిరాకరించడం సరికాదని పేర్కొంది. అయితే ఎలాంటి రెచ్చగొట్టే, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని షరతు పెట్టింది. ప్రదర్శనలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, దానిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. అయితే సభ ఎంతసేపు నిర్వహిస్తారు, ఎందరు జనం వస్తున్నారు, పార్కింగ్ ఏర్పా ట్లు తదితర వివరాలను వరంగల్ సీపీకి అందజేయాలని బీజేపీ నేతలకు సూచించింది. సభలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా అందుకు పిటిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సభకు అనుమతి కోరుతూ కోర్టుకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. 27న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభ చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సభ నిర్వహణ కోసం ఈ నెల 23న అనుమతి తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్టు 25వ తేదీన ప్రిన్సిపాల్ ప్రకటించారు. శాంతిభద్రతల కారణాలతో సభకు అనుమతించబోమని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిన్సిపాల్ సభకు అనుమతి ఇచ్చినా పోలీసుల ఒత్తిడి వల్ల రద్దు చేశారని.. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని విన్నవించారు. ఏదైనా పార్టీకిగానీ, సొసైటీకిగానీ సభలు, సమావేశాలు నిర్వహించుకునే ప్రాథమిక హక్కు ఉందంటూ.. గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను తమ పిటిషన్కు జత చేశారు. మధ్యాహ్నం కొనసాగిన వాదనలు.. బీజేపీ నేతల పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్కుమార్ శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. యూనివర్సిటీలు, కాలేజీలు రాజకీయ సభలు, సమావేశాలకు వేదిక కారాదని గతంలో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, సభ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ప్రిన్సిపాల్ సభకు అనుమతి రద్దు చేశారని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఇతర పాదయాత్రలు, సభలకు అనుమతిచ్చి.. ఈ సభకు ఇవ్వకపోవడం సరికాదని న్యాయమూర్తికి వివరించారు. ప్రత్యేక రాజకీయ ఎజెండాతోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇలా దాదాపు 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి తన తీర్పు వెలువరించారు. రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలేమీ లేవని గుర్తు చేశారు. గత వారం రోజుల్లో పలు సభలకు అనుమతి ఇచ్చి ఈ సభకు నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సభను నిరాకరించిన కారణాలు ఇక్కడ వర్తించవని చెప్పారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని కాలేజీలపైనే వీసీకి అధికారం ఉంటుందని.. మరో ప్రాంతంలోని కాలేజీలపై నిర్ణయాధికారం ఉండదని పేర్కొన్నారు. అయినా ఇక్కడ కాలేజీ, గ్రౌండ్ రెండూ కలిసి లేవని.. సభ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. సభ నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం వరంగల్ పోలీస్ కమిషనర్కు మాత్రమే ఉంటుందని.. కిందిస్థాయి అధికారులకు ఉండదని చట్టం చెబుతోందని వివరించారు. సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. చదవండి: అదే జరిగితే.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! -
గణేష్ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపాల ఏర్పాటుకు, ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ►బలవంతపు చందాలు, వసూళ్లు చేయరాదు. దర్శనాల టికెట్లు పెట్టకూడదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డయల్ 100 గానీ ఫిర్యాదు చేయవచ్చు. ►పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీలైనంత మేరకు ప్లాస్టర్ ఆఫ్ కృత్రిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను కొనుగోలు చేయవద్దు. మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమివ్వాలి. ►విగ్రహం సైజు, బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. నిమజ్జనం చేసే తేదీ, కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే తెలియజేయాలి. ►దీపారాధనలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ►శబ్దకాలుష్యం అరికట్టేందుకు పాల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమాలు విధిగా పాటించాలి. పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్ దాటి శబ్దం రాకూడదు. బాక్స్ టైపు స్పీకర్లను మాత్రమే వినియోగించాలి. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. ►కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి. ►మండపాల ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేయకూడదు. ►ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు వేసినా, డ్యాన్సులు చేసినా, మందుగుండు సామగ్రి కాల్చినా చర్యలు తప్పవు. ►వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రారంభించి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. ►ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి. -
‘నారాయణ’ నాటకాలు.. స్కూల్ భవనం లేదు, అనుమతులు లేవు! కానీ ఫీజులు మాత్రం..
సాక్షి,పుత్తూరు రూరల్(తిరుపతి): ‘‘ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’’అన్న సామెత పుత్తూరు పట్టణంలో నారాయణ విద్యా సంస్థ నాటకాలకు తెరదీసింది. సదరు సంస్థ గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను ప్రలోభ పెడుతూ అడ్మిషన్ల పేరిట వేల రూపాయలను వసూలు చేస్తోంది. నారాయణ స్కూల్ పేరుతో బస్సు ఒకటి పట్టణంలో తిరుగుతూ, అందులోంచి కొంత మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించామని, కరపత్రాలను పంచుతూ తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు రూ.3,500 అని, 6వ తరగతికి రూ.28 వేలు, 8వ తరగతికి రూ.30 వేలుగా చెబుతూ వాట్సాప్, ఫోన్ల ద్వారా ఊదరగొట్టేస్తున్నారు. కనీసం భవనం లేకుండా అడ్మిషన్లు ఏంటని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే చూపిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొందరు అడ్మిషన్ ఫీజులు చెల్లించి సీటును రిజర్వు చేసుకుంటున్నారు. వాస్తవానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి పుత్తూరు పట్టణంలో ఎక్కడా భవనం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం నారాయణ విద్యా సంస్థకు పుత్తూరులో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తొందర పడి వేలాది రూపాయలను చెల్లించి మోసపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ‘నారాయణ’కు అనుమతులు లేవు నారాయణ విద్యా సంస్థకు పుత్తూరు పట్టణంలో ఎలాంటి అనుమతులు లేవు. దరఖాస్తు చేసుకోలేదు. అయినా పుత్తూ రు ప్రచారం నిర్వహిస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. విషయాన్ని డీఈఓ దృష్టికి తసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. – ఎంఈఓ తిరుమలరాజు -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పరిపాలనా అనుమతి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకించి సుభిక్షం చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు రూ.17,050.20 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తొలిదశ పనుల అంచనా వ్యయం రూ.2,022.20 కోట్లు కాగా రెండో దశ పనుల అంచనా వ్యయం రూ.15,028 కోట్లు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు కోసం 63.20 టీఎంసీల గోదావరి నికర జలాలను కేటాయించడం గమనార్హం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి, రెండో దశలో 63.99 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 3.98 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. ప్రధాన కాలువలో మిగిలిన పనులతోపాటు భూదేవి రిజర్వాయర్ (6.55 టీఎంసీలు), వీరనారాయణపురం రిజర్వాయర్ (6.2 టీఎంసీలు), తాటిపూడి రిజర్వాయర్ (3.8 టీంసీలు) నిర్మాణం, సబ్ లిఫ్ట్ల పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖను ఆదేశించారు. ఆ పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా పూర్తి చేసేలా అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దిక్సూచిలా నిలుస్తుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి... ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించాలనే ముందుచూపుతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం నుంచి రోజుకు 17,561 క్యూసెక్కులు (1.51 టీఎంసీలు) తరలించేలా పోలవరం ఎడమ కాలువను చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తూనే 162.409 కి.మీ. నుంచి రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినా ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచి్చన పాలకులు చంద్రబాబుతో సహా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా చేపట్టారు. డిస్టిబ్యూటరీల పనులు ప్రారంభం ♦పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో భాగంగా 3.15 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, 13.5 కి.మీ. పొడవున లీడింగ్ కెనాల్తోపాటు జామద్దులపాలెం, తీడ వద్ద రెండు లిఫ్ట్లు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్టిబ్యూటరీల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ♦రెండో దశలో 20.05 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, పాపయ్యపాలెం లిఫ్ట్తోపాటు 63.995 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 2.68 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ఇప్పటికే ప్రారంభించారు. మిగిలిన పనులు వేగవంతం.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశలో మిగిలిన పనులు అంటే.. ప్రధాన కాలువలో మిగిలిన 37.585 కి.మీ. పొడవున తవ్వకం, ప్రధాన కాలువకు అనుబంధంగా 6.20 కి.మీ. వద్ద భూదేవి(అనకాపల్లి జిల్లా), 50 కి.మీ. వద్ద వీరనారాయణపురం(విజయనగరం జిల్లా), 69.10 కి.మీ. వద్ద తాటిపూడి(విజయనగరం జిల్లా) రిజర్వాయర్ల నిర్మాణం– వాటికి అనుబంధంగా ఎత్తిపోతలు, కొండగండేరు లిఫ్ట్, బూర్జువలస లిఫ్ట్, జి.మర్రివలస లిఫ్ట్, 4.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక వైపు భూసేకరణ చేస్తూనే మరోవైపు పనులు చేపట్టడం ద్వారా వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
'సర్కారు వారి పాట'కు 'సర్కారు' గుడ్ న్యూస్.. ఆరోజు 6 షోలు
Telangana Government Permission To Sarkaru Vaari Paata Special Show: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మూవీ స్పెషల్ షోకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూవీ విడుదల రోజు అంటే మే 12న ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించుకేందుకు అనుమతినిచ్చింది. అయితే ఈ స్పెషల్ షోను కేవలం నాలుగు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. కూకట్పల్లిలోని భ్రమరాంబ, మల్లీ కార్జున, విశ్వనాథ్ థియేటర్లు, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఇవి కాకుండా ఇతర థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తి మేరకు ఈ సినిమాను మే 12న ఒక స్పెషల్ షోను నిర్వహించుకునేందుకు అనిమతి ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా పేర్కొన్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పెంపు కూడా వారం రోజులు అంటే మే 12 నుంచి 18 వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అయితే గురువారం (మే 12) ఒక్క రోజు మాత్రం హైదరాబాద్లో ఆరు షోలు పడనున్నాయి. చదవండి: సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా ! ‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎట్టకేలకు ములాఖత్కు రాహుల్ గాంధీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు ఎట్టకేలకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి అనుమతి దొరికింది. ములాఖత్కు అనుమతించాలని మరోసారి విజ్క్షప్తి చేయండంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ ధృవీకరించారు. రాహుల్తో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. శనివారం మధ్యాహ్నాం సమయంలో జైల్లో ఉన్న పద్దెనిమిది మంది ఎన్ఎస్యూఐ నేతలను ముగ్గురు కీలక నేతలు పరామర్శిస్తారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నిరసనలు చేపట్టగా.. పోలీసులు వాళ్లందరినీ అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. -
బార్లకేమో బంపర్ ఆఫర్.. దీక్షపై ఆంక్షలా?: బండి సంజయ్
సాక్షి,కాగజ్నగర్: ప్రజలు తాగి ఊగాలని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకూ వైన్స్లు, బార్లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ‘మేం నిరుద్యోగదీక్ష చేపడతామంటే ఒమిక్రాన్ పేరుతో అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వరకూ జనం తాగి ఊగితే వైరస్ వ్యాప్తిచెందదా?’అని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల మీద వచ్చే పైసల కోసమే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. కాగజ్నగర్లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చిబియ్యం ఎంతైనా కొంటామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ‘బాయిల్డ్ రైస్ నువ్వు తినవు, కానీ పక్క రాష్ట్రంలో తినాలా’ అని సీఎంను నిలదీశారు. ‘మీ ఫాంహౌస్లో మీరు చేస్తున్నదమేమిటీ.. అక్కడ వరి పండిస్తూ, రైతులు పండిస్తే మాత్రం ఉరి అంటారా’అని మండిపడ్డారు. -
న్యూఇయర్ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం పేరిట ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటూ పిటిషన్లో పేర్కొని ఉంది. ఇతర రాష్ట్రల మాదిరి ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని, పైగా ప్యాండమిక్, ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్ విన్నవించారు. పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసుల్ని కట్టడి చేయకుండా.. ఇష్టానుసారంగా టీ సర్కార్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న పిటిషనర్.. తెలంగాణలో 62 ఒమిక్రాన్ కేసులు నమోదయిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట ప్రస్తావించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఉత్తర్వులను వెనక్కి తీసుకుని.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఇక పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం.. రేపు(గురువారం) విచారిస్తామని పిటిషనర్కి తెలిపింది. సంబంధిత వార్త: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ పర్మిషన్ -
తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ పర్మిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు, యూత్కి ఖుష్ ఖబర్ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది చివరిరోజున మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31న ఈ ప్రత్యేక అనుమతులు వర్తిస్తాయి. మద్యం దుకాణాలకు రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. అలాగే బార్స్, ఈవెంట్స్, పబ్లకు అర్దరాత్రి ఒంటిగంటకు వరకు అనుమతి ఇచ్చింది. ఓవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని చోట్ల ఆంక్షలు విధిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల పేరిట సడలింపులు ఇవ్వడం విశేషం. అదే సమయంలో ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే!. ఒమిక్రాన్ అలర్ట్: తెలంగాణలో మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలే! -
‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’
మల్కన్గిరి(భువనేశ్వర్): జిల్లాలోని చిత్రకొండ సమితి, ధూళిపూట్ పంచాయతీలో గిరిజనుల ప్రజా మేళా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొద్దిరోజులుగా పోలీసులు ధ్వంసం చేస్తున్న గంజాయి సాగుపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సాగుతో తమకు ఎంతో కొంత ఉపాధి కలుగుతోందన్నారు. ఇప్పుడు వాటిని అధికారులు నాశనం చేసి, తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేరే పంటలు పండించేందుకు చాలా పెట్టుబడి అవుతుందని, అంత స్తోమత తమకు లేదన్నారు. దీంతో పెట్టుబడి అవసరం లేని గంజాయి సాగుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. ఉపాధి అవకాశాలైనా కల్పించాలని, లేకపోతే గంజాయి సాగుకి అనుమతి అయినా ఇవ్వాలని వారు కోరారు. అనంతరం చిత్రకొండ తహసీల్దారు టి.పద్మనాబ్ బెహరాకి వారు వినతిపత్రం అందజేశారు. 85 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం మల్కన్గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి, బోడపోదర్ పంచాయతీలో ఉన్న రేఖపల్లి, పల్సన్పోదర్, కుమార్గూడ ప్రాంతాల్లో అక్రమంగా 85 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని చిత్రకొండ పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. నాశనం చేసిన గంజాయి సాగు విలువ దాదాపు రూ.12 కోట్లు చేస్తుందని పోలీసులు తెలిపారు చదవండి: Karnataka: ఆ ప్రాంతం మరో గోవా కానుంది.. -
టపాసుల దుకాణాలకు అనుమతి.. ఇలా అప్లై చేయండి
సాక్షి, హైదరాబాద్: దీపావళి నేపథ్యంలో టపాసులు విక్రయించే దుకాణాదారులు అనుమతి తీసుకోవాలని పోలీసు విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీసు విభాగం ప్రకటన విడుదల చేసింది. దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు సమర్పించాల్సిన వెబ్సైట్లు: www.tspolice.gov.in https://eservices.tspolice.gov.in/ అప్లోడ్ చేయాల్సిన పత్రాలు ► డివిజినల్ ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్ఓసీ. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేసే వాళ్లు జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి పత్రం. ► ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసే వాళ్లు స్థల యజమానుల నుంచి ఎన్ఓసీ. ► గతంలో దుకాణాలు ఏర్పాటు చేసి ఉంటే ఆ లైసెన్స్ ప్రతి. పక్కా భవనంలో దుకాణం ఏర్పాటు చేస్తున్నట్లైతే చుట్టు పక్కల వారి నుంచి ఎన్ఓసీ. ► దుకాణం బ్లూ ప్రింట్ కాపీ గన్ఫౌండ్రీ ఎస్బీఐలో చెల్లించిన రూ.600 లైసెన్స్ రుసుము ఒరిజినల్ రసీదు. ► ఈ పత్రాలు లేకుండా వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. -
కొత్త థర్మల్ ప్లాంట్లపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంగా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర అవసరాలుపోగా విద్యుత్ మిగులు కూడా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని విరమించుకోవాలనే భావనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. సింగరేణి సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ను నిర్మించింది. విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి 2019 డిసెంబర్ 18న కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇంకా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. తెలంగాణలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో తొలిదశ కింద 1,600 మెగావాట్ల ప్లాంట్ను రామగుండంలో చేపట్టారు. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్ కట్టాల్సి ఉంది. ఎన్టీపీసీ దీనికి పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటివరకు దరఖాస్తే చేసుకోలేదు. రెండోదశ ప్లాంట్కు సంబంధించి ఇంతవరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు లేవని ఎన్టీపీసీ అధికారవర్గాలు తెలిపాయి. 800 మెగావాట్ల సింగరేణి, 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు కనిపిస్తున్నా.. కొద్దిరోజులుగా విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులోనూ వాటిని చేపట్టే అవకాశాలు తక్కువని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భారీగా అందుబాటులోకి.. ప్రస్తుతం రాష్ట్రంలో.. 3,772.5 మెగావాట్ల తెలంగాణ జెన్కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,645 మెగావాట్ల కేంద్ర ప్లాంట్లు, 839 మెగావాట్ల సెమ్కాబ్ (ప్రైవేటు) కలిపి మొత్తం 8,456 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న 270 మెగావాట్ల భద్రాద్రి, 4 వేల మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర థర్మల్ విద్యుత్ సరఫరా సామర్థ్యం 14,326.5 మెగావాట్లకు పెరుగుతుంది. దీనికి అదనంగా 2,531.76 మెగావాట్ల జెన్కో జలవిద్యుత్ కేంద్రాలు, 3,472 మెగావాట్ల సౌర, 128 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా థర్మల్, హైడల్, సోలార్, విండ్ ప్లాంట్లు అన్నీ కలిపి దాదాపు 25 వేల మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరనుంది. పెట్టుబడి గిట్టుబాటు కాదు.. కాళేశ్వరం, పాలమూరు వంటి కొత్త ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్రంలో 8వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. 2022–23 నాటికి పూర్తికానున్న యాదాద్రి, ఎన్టీపీసీ ప్లాంట్లతో ఈ డిమాండ్ తీరిపోయి, ఇంకా మిగులు విద్యుత్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఆశించిన మేర విద్యుత్ డిమాండ్ పెరగకపోతే.. కొత్త థర్మల్ ప్లాంట్లపై పెట్టే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. అందువల్ల కొత్త థర్మల్ ప్లాంట్లు చేపట్టకపోవడమే మేలు అని చెప్తున్నారు. -
ఆన్లైన్ రమ్మీ.. అంతా డమ్మీ.. ఆశకు పోతే ప్రాణాలుండవు!
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్కు చెందిన సీపతి అభిలాష్ (25) అనే సీఏ విద్యార్థి.. ఆన్లైన్ రమ్మీకి బానిసయ్యాడు. అప్పులు చేసి మరీ ఆడాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. గత ఏడాది డిసెంబర్ 29న విషం తాగి చనిపోయాడు. హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టాడు. మొదట్లో కొంత లాభం రావడంతో తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు, అప్పులు చేసినవి కలిపి ఏడు లక్షలు పెట్టి ఆడాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. డబ్బు లన్నీ తిరిగి సాధించాలని మళ్లీ 8 లక్షలు అప్పులు చేశాడు. ఈ సొమ్ము కూడా పోవడంతో.. ఆందోళనకు గురై గత ఏడాది నవంబర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధాన్ని తొలగించుకునేందుకు ముంబై గేమ్ మాఫియా రంగంలోకి దిగింది. పేకాట, ఆన్లైన్ గేమింగ్లను బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ఆన్లైన్ రమ్మీకి సడలింపు ఇచ్చేలా చేయాలని ఓ కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్తో సంప్రదింపులు జరిపింది. దీనికి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు అంగీకరించారని.. కొన్నికోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని, అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసిన సదరు ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి.. అనుకున్న ‘పని’ సాధించలేకపోయారు. ఈలోగా విషయం పెద్దలకు తెలియడంతో.. చీవాట్లు పెట్టారని తెలిసింది. ఇప్పుడీ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పేకాట, ఆన్లైన్ గేమ్స్పై నిషేధం టీఆర్ఎస్ సర్కారు 2016లోనే రాష్ట్రంలో పేకాటను నిషేధించింది. దానితోపాటు ఇంటర్నెట్లో ఆడే ‘ఆన్లైన్ రమ్మీ’, ఇతర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటలపైనా నిషేధం విధించింది. పేకాటతోపాటు యువతను వ్యసనాలకు గురిచేసే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఈ నిర్ణయంపై మహిళలతోపాటు అన్నివర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆన్లైన్ పేకాట వందలు, వేల కోట్ల వ్యాపారం కావడంతో.. ముంబై వేదికగా ఆన్లైన్ వెబ్సైట్లు, యాప్లను నిర్వహిస్తున్న మాఫియా సంస్థలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటకు అనుమతి వచ్చేలా చేయాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను సంప్రదించాయి. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నాలు ఆన్లైన్ రమ్మీ మాఫియా ‘ఆఫర్’కు లొంగిపోయిన ఒక కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్.. ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో సదరు సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఒప్పందం కుదుర్చుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అడ్వాన్స్గా కొన్నికోట్ల మొత్తాన్ని తీసుకున్నారని వెల్లడించాయి. ఇది జరిగి రెండు, మూడు నెలలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. దీనితో రమ్మీ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి రంగంలోకి దిగి సదరు ప్రజాప్రతినిధిని, సీనియర్ అధికారిని నిలదీశారని.. వారం, పది రోజుల్లో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారని సమాచారం. ఈ పది రోజుల గడువు తీరినా స్పందన లేకపోవడంతో అడ్వాన్స్ తిరిగివ్వాలని ఒత్తిడి పెంచారని.. ఈ క్రమంలో విషయం మరో కీలక ప్రజాప్రతినిధి ద్వారా ప్రభుత్వ పెద్దలకు చేరిపోయిందని తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, మాఫియాకు డ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా అడ్వాన్స్ సొమ్ము తిరిగి ముంబై మాఫియాకు తిరిగి పంపారని తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా.. స్పందించలేదు. నిషేధమున్నా.. ఏటా వేల కోట్ల దందా రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటపై నిషేధం ఉండటంతో.. గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ వంటివాటిలో సదరు యాప్స్ అందుబాటులో ఉండవు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్ల ద్వారా సదరు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు ప్రచారం చేస్తూ.. లింకులు పెడతాయి. ఆ లింక్స్ను షేర్ చేస్తే పాయింట్లో, నగదో రివార్డు ఇస్తామని ఆశపెడ్తాయి. అలా ఒకరి నుంచి ఒకరికి లింకులు షేర్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇలా 12లక్షల మందికి పైగా సదరు యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గతంలోనే కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇచ్చాయి. వీటిద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుగా దందా సాగుతోందని అంచనా వేశాయి. 2018లో తెలంగాణ నుంచి రూ.1,200 కోట్ల మేర ఆన్లైన్ యాప్స్లో దందా సాగిందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫేక్ లొకేషన్తో జిమ్మిక్కులు ఆన్లైన్ రమ్మీ యాప్లు మొబైల్ఫోన్ల లొకేషన్ డేటాను తీసుకుంటాయి. రాష్ట్రంలో అధికారికంగా నిషేధం ఉండటంతో ఇక్కడి మొబైల్ లొకేషన్ ఉంటే గేమ్ ఆడటానికి వీలుకాదని చూపిస్తాయి. అయితే ఆన్లైన్ గేమ్ మాఫియా సంస్థలు ఫోన్లలో ఫేక్ జీపీఎస్ లొకేషన్ చూపించే యాప్స్ను షేర్ చేస్తున్నాయి. వీటిసాయంతో ఆన్లైన్ రమ్మీ ఆడేవారు ఫోన్లో అసలు జీపీఎస్ లొకేషన్ను డిసేబుల్ చేసి.. ఫేక్ జీపీఎస్ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నట్టు లొకేషన్ పెడుతూ.. ఆన్లైన్ పేకాట ఆడుతున్నారు. ఏమిటీ ఆన్లైన్ రమ్మీ వ్యవహారం? పేకాట క్లబ్బుల్లో, బయటా ‘మూడు ముక్కలాట, రమ్మీ’ ఆడినట్టుగానే.. ఆన్లైన్లోనూ డబ్బులు పెట్టి ఆడేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని నియంత్రణలను పెట్టింది. అందుకు అనుగుణంగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రత్యేక యాప్లను రూపొందించి దందా చేస్తున్నాయి. ఆన్లైన్ పేకాట, గ్యాంబ్లింగ్ను తమ రాష్ట్రాల్లో అనుమతించాలా, నిషేధించాలా అన్ని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ పేకాటను నిషేధించాయి. మొదట్లో ‘ఎర’ వేసి.. ఆన్లైన్ పేకాట ఆడేవారు సదరు వెబ్సైట్/యాప్లకు బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించి.. డబ్బులను వాటిలోకి బదిలీ చేసుకుంటారు. ఆ డబ్బులతో పేకాడుతారు. గెలిచినవారికి డబ్బులు ఇవ్వడం, ఓడిపోతే కట్ చేయడం జరుగుతాయి. సర్వీస్చార్జీల పేరిట కొంత మొత్తాన్ని మినహాయించుకుంటాయి. అయితే ఈ ఆన్లైన్ గేమ్స్లో చాలా వరకు మోసమే. వీటిలో ఆడటం మొదలుపెట్టినవారికి కొద్దిరోజులు కావాలనే డబ్బులు గెలుచుకున్నట్టు చూపిస్తారని.. వారు ఆన్లైన్ పేకాటకు బానిసలయ్యాక ఉన్న డబ్బంతా ఊడ్చేస్తాయని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలా మంది లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. అవన్నీ పోగొట్టుకుని అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు ఎన్నో నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా హాజిపూర్కు చెందిన చిందం పోశెట్టి.. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డాడు. మొదట్లో కొంత డబ్బులు రావడంతో.. తర్వాత అప్పులు చేసి మరీ ఆడాడు. డబ్బులన్నీ పోవడంతో ఆవేదనలో మునిగిపోయాడు. ఈ ఏడాది జనవరి 27న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
మంచి కబురు!
కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 2–18 సంవత్సరాల మధ్యవారికి కోవాగ్జిన్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించవచ్చని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్నుంచి పూర్తిస్థాయిలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ప్రపంచంలోనే తొలిసారి రెండేళ్లు, అంతకుపైబడిన పిల్లలకు టీకా వినియోగించే దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ వ్యాక్సిన్ను రూపొందించిన భారత్ బయోటెక్ ఇప్పటికే మూడు దశల క్లినికల్ పరీక్షల డేటాను అందజేసింది. తుది దశ సమాచారం రావాల్సివుంది. జైకోవ్–డీ అనే టీకాకు సైతం అత్యవసర విని యోగానికి అనుమతులు లభించాయి. అయితే అది 12–18 సంవత్సరాల మధ్యవారి కోసం రూపొందించింది. అలాగే 5–18 మధ్య వయసున్న పిల్లలకు కార్బీవ్యాక్స్, 2–18 ఏళ్ల మధ్యవారికి తయారైన కోవోవ్యాక్స్లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారి మూడో దశ మన దేశంలోనూ విరుచుకుపడే అవకాశమున్నదని, ఈసారి ప్రధానంగా పిల్లలపైనే అది ప్రతాపం చూపబోతున్నదని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో వారి కోసం రూపొందించిన కోవాగ్జిన్ టీకా అందుబాటులోకి రాబోతుండటం దేశ ప్రజలకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. ఏడాదిన్నరకుపైగా పాఠశాలలు మూతబడి, ఆన్లైన్లో మాత్రమే చదువులు సాగుతున్న తీరు అత్యధిక శాతంమంది పిల్లలను చదువులకు పూర్తిగా దూరం చేసింది. ఒక అంచనా ప్రకారం 5 కోట్ల మంది పిల్లలు ఆన్లైన్ చదువులకు అవసరమైన సెల్ఫోన్లు, కంప్యూటర్లు కొనుక్కునే స్థోమత లేక పూర్తిగా వెనకబడ్డారు. ఇక క్రీడా శిక్షణ సంస్థలు, కోచింగ్ కేంద్రాలు వగైరాలు కూడా చాన్నాళ్లుగా మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే వాటిని మళ్లీ తెరుస్తున్నారు. బడులు తెరుచుకున్నా ఇప్పటికీ తమ పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు సందేహిస్తూనే ఉన్నారు. ఇంటికే పరిమితమైతే పిల్లల చదువు లకు మాత్రమేకాక... వారి మానసిక, శారీరక ఎదుగుదలకూ అది అవరోధమవుతుందని వారికి తెలుసు. అలాగని ప్రాణాలకు ముప్పు పొంచివుందన్న భయాందోళనలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. ఇక బడుల్లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది. మాస్క్లు ధరించటం, శాని టైజర్ వాడకం, దూరం పాటించడం తదితరాలతో తరగతి గదులు కూడా గతంలో మాదిరి స్వేచ్ఛా యుత వాతావరణానికి దూరమైనాయి. బడులకు వెళ్లొస్తున్నారన్న మాటేగానీ... అంతా సవ్యంగా ఉందో లేదోనన్న చింత అటు పిల్లలకూ, ఇటు తల్లిదండ్రులకూ కూడా ఉంటున్నది. పిల్లలకు సైతం వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులుండవు. అయితే కరోనా వ్యాక్సిన్ అనుమతుల విషయంలో గతంలో వచ్చిన విమర్శలవంటివి తలెత్త కుండా డీసీజీఐ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. వ్యాక్సిన్ల వాడకం సురక్షితమైనదని నిపుణుల కమిటీ మాత్రమే అభిప్రాయపడితే చాలదు. సీజీఐ సంస్థ వెలుపల కూడా ఆరోగ్య రంగంలో పని చేసే నిపుణులు ఉన్నారు. వారు కూడా అధ్యయనం చేసేందుకు వీలుగా డీసీజీఐ ఆ డేటాను అందు బాటులో ఉంచాలి. ప్రభుత్వం అనుమతించిందన్న ఒక్క కారణంతో సంతృప్తిపడి టీకాలు తీసుకోవ డానికి అనేకులు ముందుకొస్తారు. అందులో అనుమానం లేదు. కానీ అత్యధికులు సంతృప్తిపడే విధంగా చేయాలంటే ఇది తప్పనిసరి. క్లినికల్ పరీక్షల్లో వెల్లడైన అంశాలేమిటో, వాటి లోతుపాతులే మిటో ఆరోగ్యరంగ నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు. ఒక దశ ప్రయోగానికీ, మరో దశ ప్రయో గానికీ మధ్య ఉన్న వ్యవధి, టీకాలు తీసుకున్నవారిలో వెల్లడైన లక్షణాలు అధ్యయనం చేస్తారు. వ్యాక్సిన్ల విషయంలో పెదవి విరిచేవారిని సైతం అటువంటివారి అభిప్రాయం సంతృప్తి పరు స్తుంది. పెద్దల కోసం రూపొందించిన టీకా యధాతథంగా పిల్లలకు ఇవ్వటం సాధ్యపడదు. ఈ విష యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు సూచించింది. శారీరక ఎదుగుదల చక్కగా ఉండే శైశవ, బాల్య, కౌమార, యౌవన దశల్లోనివారు కావటం, వారికుండే భిన్నమైన వ్యాధి నిరోధకత ఇందుకు కారణం. క్లినికల్ పరీక్షకు ముందుకొచ్చిన పది పన్నెండేళ్లలోపు వయసున్న పిల్లలు తమను అడిగే ప్రశ్నలకు విస్పష్టంగా సమాధానాలివ్వటం కొంత కష్టం. అంతకన్నా చిన్న వయసు పిల్లలనుంచి సమాధానాలు రాబట్టడం అసాధ్యం. ఇప్పటికే 12–18 ఏళ్ల వారికి టీకాలం దించిన ఇజ్రాయెల్కు ఈ విషయంలో కొంత అనుభవముంది. బహుశా డేటా రూపకల్పనలో ఔషధ సంస్థలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. పెద్దల టీకాల విషయంలోనే అనేకమందిలో ఇంకా సందేహాలున్నాయని, అందుకే అనేకులు వాటికి దూరంగా ఉన్నారని మరిచిపోకూడదు. ఆ పరిస్థితి పిల్లల టీకాల విషయంలో తలెత్తకూడదనుకుంటే, అంతా సజావుగా సాగిపోవాలనుకుంటే పారదర్శ కత ప్రాణప్రదమైనది. అది ప్రజానీకం హక్కు కూడా. ప్రభుత్వాలు ఎటూ పిల్లల టీకాలను కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే బయట కొనదల్చుకున్నవారికి సైతం అందుబాటులో ఉండేలా ఆ టీకాల ధర నిర్ణయించాలి. పౌరు లకు టీకాలందించే కార్యక్రమం మన దేశంలో జోరందుకుంది. అనేక రాష్ట్రాలు పట్టుదలగా దీన్ని కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జనాభాలో మూడొంతులమంది ఒక టీకా లేదా రెండు తీసు కున్నట్టవుతుంది. పిల్లలకిచ్చే టీకాలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకొచ్చి, సాధ్యమైనంత ఎక్కువమందికి అందించగలిగితే జనాభాలో అత్యధికులు సురక్షిత స్థితికి చేరుకున్నట్టవుతుంది. చదువులు మళ్లీ చురుకందుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. -
చనాకా–కొరటకు వన్యప్రాణి సంరక్షణ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ నదిపై మహారాష్ట్ర, తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా చేపట్టిన చనాకా–కొరట బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని వన్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో భాగంగా గతనెల 24న ప్రాజెక్టుపై పర్యావరణ శాఖమంత్రి ఆధ్వర్యంలోని స్టాండింగ్ కమిటీ ఈ ప్రాజెక్టు అనుమతులపై చర్చించింది. 0.80 టీఎంసీ సామర్థ్యంతో రూ.368 కోట్లతో బ్యారేజీ చేపట్టారు. 13,500 ఎకరాల ఆయకట్టు తెలంగాణలో, మరో 3 వేల ఎకరాల ఆయకట్టు మహారాష్ట్రలో దీనిద్వారా సాగు జరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మహారాష్ట్రలోని తాపేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉంది. దీనికి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో 213.48 హెక్టార్ల అటవేతర (నాన్ ఫారెస్ట్) భూమి అవసరం కానుండగా, మరో 5 వేల హెక్టార్ల అటవేతర భూమి రెండు రాష్ట్రాల్లోని బ్యారేజీ నిర్మాణం, ముంపు ప్రాంతంలోకి వస్తుంది. దీని పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం కమిటీకి పంపగా, అటవీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు జర గడం లేదని, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అనుమతులు జారీచేసింది. అయితే సంరక్షణ కేంద్రానికి చుట్టు పక్కల పెద్ద శబ్దాలొచ్చే యంత్రాలను వాడరాదని, కెనాల్ పనుల నిమిత్తం ఉండే కార్మికుల క్యాంపులు సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉండాలని, అటవీ శాఖకు కెనాల్ నీటిని పూర్తి ఉచితంగా అందించాలని షరతులు విధించింది. చదవండి: Sitarama project: ముంపు సంగతేంటి...? -
హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అడ్డంకులు తొలిగాయి. ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. (చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య) ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ అన్నారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ ఆర్డర్ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు. హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసు అని సీఐజే అన్నారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రపరిచేందుకు, సుందరీకరణకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. 22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేశామని, కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. చదవండి: టికెట్ తీసి సాధారణ ప్రయాణికుడిలా.. -
ఏపీకి అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏపీ సహా 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 15 శాతం టార్గెట్ పూర్తి చేసింది. ఏపీకి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జీఎస్డీపీలో నాలుగు శాతం నికర రుణాల పరిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. ఇవీ చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు -
తెలంగాణలో నేటి నుంచి ములాకత్ లకు అనుమతి
-
భయపెట్టే బోయింగ్కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఏపీ: 20,403 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో పట్టణాలు, నగరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–అర్బన్(పీఎంఏవై–యూ) పథకం కింద మంజూరై నిర్మాణాలు మొదలవ్వని, పునాది దశ కూడా పూర్తి చేసుకోని ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. పీఎంఏవై–వైఎస్సార్ (అర్బన్) పథకం కింద 20,403 ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు తొలి దశ కార్యక్రమంలో భాగంగా వీటి నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఒక్కో ఇంటికి పీఎంఏవై–వైఎస్సార్(అర్బన్) పథకం కింద ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేయనుంది. మొత్తం 20,403 ఇళ్లలో 2016–17కి సంబంధించి 2,529 ఇళ్లు, 2017–18కి సంబంధించి 7,465, 2018–19కి సంబంధించి 10,409 ఇళ్లున్నాయి. -
లైట్హౌస్లు స్వాగతిస్తున్నాయ్..!
సాక్షి, అమరావతి: విద్యార్థులు, సామాన్య ప్రజల సందర్శనార్థం లైట్హౌస్ల తలుపులు తెరుచుకున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నలైట్ హౌస్ల సందర్శనకు కేంద్రం అనుమతించింది. కోస్టల్ సర్వెలెన్స్ రాడార్ సిస్టమ్ కలిగిన లైట్హౌస్లను సైతం చూసే అవకాశాన్ని సామాన్యులకు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 లైట్హౌస్లను మనం సందర్శించొచ్చు. నేటి నుంచి 15వ తేదీ వరకు.. అంటే మూడ్రోజుల పాటు వీటిని ఎంచక్కా చూసి రావొచ్చు. 15వ తేదీ వరకు విద్యార్థులకు అనుమతినివ్వగా, సామాన్య ప్రజలకు మాత్రం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ అనుమతించారు. పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా, పదేళ్లు పైబడిన వారు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అత్యంత పురాతన లైట్హౌస్ ‘శాంతపల్లి’ భారీ నౌకల నుంచి చిన్న చిన్న బోట్ల వరకూ సముద్రంలో దారి చూపే దిక్సూచి లైట్హౌస్. ఎలక్ట్రానిక్ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా తీరప్రాంతంలో ఇప్పటికీ అవి సేవలందిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 185 లైట్హౌస్లుండగా.. రాష్ట్రంలో 16 ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత పురాతన లైట్హౌస్ విజయనగరం జిల్లా శాంతపల్లిలో ఉంది. ఇక్కడి లైట్హౌస్ను 1840లో నిర్మించారు. తర్వాత 1853లో ఆర్మగన్ షోల్(మోనపాలెం), 1858లో మచిలీపట్నం, 1868లో పెంటకోట(తుని), 1860లో నిజాంపట్నం, 1874లో డాల్ఫిన్నోస్ లైట్హౌస్(విశాఖ), 1877లో కళింగపట్నం, 1895లో శాంక్రిమెంటో(కరవాక.. తూర్పుగోదావరి), 1903లో భీమునిపట్నం, 1938లో కృష్ణపట్నం లైట్హౌస్లను నిర్మించారు. రాష్ట్రంలోని ఇక మిగిలిన లైట్హౌస్లన్నీ స్వాతంత్య్రానంతరం నిర్మించినవే. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఒక్కోలైట్ హౌస్ ఒక్కో విశిష్టత, చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం డాల్ఫిన్నోస్, శాంక్రిమెంటో, అంతర్వేది, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం లైట్హౌస్లు కోస్టల్ సర్వెలెన్స్ రాడార్ సిస్టమ్తో పనిచేస్తున్నాయి. డాల్ఫిన్నోస్ లైట్హౌస్ పూర్తిగా నావీ ఆధీనంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న లైట్హౌస్లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రం మెరైన్ ఎయిడ్ టూ నావిగేషన్–2021 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం లైట్హౌస్ల చారిత్రక ప్రాధాన్యం, సంప్రదాయ విలువలను కాపాడుతూ పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 13 లైట్హౌస్లుండగా, ఏపీలో డాల్ఫిన్నోస్ ఉంది. ప్రస్తుతం కోస్టల్ సర్వెలెన్స్తో పనిచేస్తున్న లైట్హౌస్లు 300 కి.మీ దూరంలో సముద్రంలోని కదలికలను కూడా గుర్తిస్తాయి. ఒకప్పుడు సముద్రంలో తిరిగే నౌకలు, బోట్లకు దారిచూపిన ఈ లైట్హౌస్లను.. ఇప్పుడు సముద్ర జలాల్లోకి చొచ్చుకొచ్చే విదేశీ నౌకలు, ఇతర అక్రమ కార్యకలాపాలను కూడా గుర్తించేంతగా టెక్నికల్గా తీర్చిదిద్దారు. ప్రజలకు తెలియజేయాలనే.. చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిషేధిత ప్రాంతాల సందర్శనకు సామాన్య ప్రజలకు అనుమతివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైట్హౌస్ల సందర్శనకు అవకాశం ఇచ్చింది. –అనురాగ్మణి, ఇన్చార్జి, డాల్ఫిన్స్నోస్ లైట్హౌస్ -
Bhadrachalam: రామాలయంలో ఇక ‘పెళ్లిసందడి’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఇకపై పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2018 వరకు రామాలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఉపాలయం పక్కన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుమతి ఇచ్చేవారు. అనంతరం పలు కారణాలతో ఆలయ ప్రాంగణంలో శుభకార్యాలను నిరాకరించారు. భక్తుల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, ఈలోపు కోవిడ్ కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. తాజాగా కరోనా నిబంధనలు సడలించడం, భక్తుల నుంచి సైతం విజ్ఞప్తులు పెరగడంతో ఆలయ ఈవో శివాజీ తాజాగా వైదిక కమిటీతో చర్చించారు. వైదిక కమిటీ, ఈవో తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.1,116 చెల్లించి శుభకార్యాలు జరుపుకోవచ్చు. అలాగే, చిత్రకూట మండపంలోని విశాలమైన వేదిక వద్ద శుభకార్యాల నిర్వహణకు రూ.10,116 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ శుభకార్యాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అల్పాహారం, భోజనాలకు మాత్రం అనుమతించరు. కాగా, వివాహాది శుభకార్యాల్లో అన్యమతాలకు చెందిన వస్తువులు, ఇతర సామగ్రి వినియోగించకుండా చూడాలని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
రైతుల ధర్నాకు అనుమతి
-
ఐపీవోల్లోనూ పెన్షన్ ఫండ్ మేనేజర్ల పెట్టుబడులు
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీవోలు), ఎన్ఎస్ఈ–200 కంపెనీల్లో కూడా పెన్షన్ ఫండ్ల మేనేజర్లు (పీఎఫ్ఎం) ఇన్వెస్ట్ చేసేందుకు త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు పింఛను రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో కొత్త నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు జారీ చేసే డెట్ సాధనాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పీఎఫ్ఎంలను అనుమతించే అవకాశాలు ఉన్నాయని బందోపాధ్యాయ్ వివరించారు. ప్రస్తుతం పీఎఫ్ఎంలు తమ కార్పస్లోని ఈక్విటీ విభాగం నిధులను రూ. 5,000 కోట్ల పైచిలుకు మార్కెట్ క్యాప్ ఉండి, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ సెగ్మెంట్లో ట్రేడయ్యే స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. దీనివల్ల ఫండ్ మేనేజర్లు మెరుగైన రాబడులు అందించే అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ఎంలు.. ఐపీవోలు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు, ఆఫర్ ఫర్ సేల్ మొదలైన వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ట్రేడయ్యే టాప్ 200 స్క్రిప్స్లోనూ ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. ఈక్విటీలపరంగా ఎదురయ్యే రిస్కులను తగ్గించేందుకు తగిన నిబంధనలు ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులు మెరుగైన రాబడులు అందిస్తున్న నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా ఈక్విటీ పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతానని బంద్యోపాధ్యాయ్ తెలిపారు. -
మార్కెట్లోకి కొత్త బంకులు.... పెట్రోలు ధర తగ్గేనా ?
న్యూఢిల్లీ: ఆటో ప్యూయల్ మార్కెట్లో కొత్త పోటీకి కేంద్రం తెర లేపింది. ఇప్పటి వరకు మార్కెట్లో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ కంపెనీలకు పోటీగా మరి కొన్ని సంస్థలను మార్కెట్లోకి ఆహ్వానించింది. కొత్త ప్లేయర్లు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలకు తోడుగా మరో ఏడు కంపెనీలకు అనుమతులు జారీ చేసింది కేంద్రం. 2019లో మార్కెట్ ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ నిబంధనలకు సంబంధించిన నిబంధనల సడలింపుల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చినట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది. అనుమతి పొందినవి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్, ఇథనాల్ వంటి ఆటో ఫ్యూయల్స్ అమ్మేందుకు కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియన్ మోలాసిస్ కంపెనీ (చెన్నై బేస్డ్), అస్సాం గ్యాస్ కంపెనీ, ఆన్సైట్ ఎనర్జీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్బీఎంఎల్ సొల్యూషన్స్, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బల్క్, రిటైల్గా పెట్రోలు, డీజిల్ను అమ్మడానికి అనుమతి ఉంటుంది. 100 బంకులు ఏడాదికి రూ. 500 కోట్ల నెట్వర్త్ కలిగిన కంపెనీల నుంచి కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. అనుమతులు సాధించిన కంపెనీలు ఐదేళ్లలో కనీసం వంద పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం బంకులను పూర్తిగా రిమోట్ ఏరియాల్లోనే ఏర్పాటు చేయాలనే నిబంధన కేంద్రం పొందు పరిచింది. వ్యాపారం జరిగేనా ఇంధన వ్యాపారానికి సంబంధించి కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో ఒక్క రిలయన్స్ ఇండస్ట్ట్రీస్కి తప్ప మరే కంపెనీకి దేశవ్యాప్తంగా నెట్వర్క్ లేదు. అస్సాం గ్యాస్ కంపెనీకి మౌలిక వసతులు ఉన్నా అది కేవలం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైంది. మిగిలిన కంపెనీల్లో చాలా వరకు బల్క్ ఫ్యూయల్ సెల్లింగ్కే అనుకూలంగా ఉన్నాయి. ధర తగ్గేనా ప్రస్తుతం ఆటో ఫ్యూయల్ విభాగంలో పోటీ నామామత్రంగా ఉంది. హెచ్పీ, ఇండియన్ ఆయిల్, భారత్ వంటి కంపెనీలు ఉన్నా ధరల్లో వత్యాసం లేదు. కొత్త ప్లేయర్లు మార్కెట్లోకి రావడం వల్ల ఫ్యూయల్ ధరలు ఏమైనా కిందికి దిగుతాయోమో చూడాలి. -
డ్రోన్లు ఎగరాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంపై డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ వాటి ముప్పు గురించిన చర్చ మొదలైంది. అయితే, డ్రోన్ల వల్ల తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ముందే పసిగట్టిన మన రాష్ట్ర పోలీసులు వాటికి విరుగుడుగా గత ఏడాది గరుడదళం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దళం ఉనికి, పనితీరు గురించిన పురోగతిని ఇంతవరకూ పోలీసు శాఖ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రధానంగా మావోయిస్టులను కట్టడి చేయడమే ధ్యేయంగా ఈ గరుడదళానికి పురుడుపోశారు. ఛత్తీస్గఢ్–మహారాష్ట్రల నుంచి మావోలు అప్పుడప్పుడూ రాష్ట్రంలోకి ప్రవేశించేవారు. డ్రోన్ల సాయంతో కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి–ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే అనుమానాస్పద డ్రోన్లను పట్టుకునేందుకు ‘‘గరుడస్క్వాడ్’’పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయా లని 2020 ఆగస్టులో పోలీసు శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని గద్దలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా నియమించింది. ఈ శిక్షణ 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఆ తరువాత అవి విధుల్లో చేరతాయని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది జూలై వచ్చినా వీటి గురించి ఎలాంటి సమాచారం లేదు. జిల్లాల్లో ఇష్టానుసారంగా.. జిల్లాల్లో కొందరు ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం డ్రోన్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. కొందరు అర కిలోమీటరు ఎత్తు వరకు ఎగిరే డ్రోన్లను కిరాయికి తీసుకు వస్తున్నారు. మరికొందరు నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బర్త్డే పార్టీలు, పెళ్లిళ్లు, బారసాలలు, జాతరలు, ర్యాలీలు, ఉత్సవాలు, రాజకీయనేతల సభలు, సమావేశాల్లో వీటిని ఎడాపెడా వాడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల నివాసాలు, సాగునీటి ప్రాజెక్టుల సమీపంలో ఎగరేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ డ్రోన్లు దాదాపు 500 గ్రాముల బరువును మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి. 90 శాతం డ్రోన్లకు అనుమతుల్లేవు.. పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల వివరాలు సేకరిస్తోంది. అధికారిక కార్యక్రమాలు మినహా ప్రైవేట్ కార్యక్రమాలలో వినియోగించే డ్రోన్లపై దృష్టి సారించింది. ఎక్కడైనా డ్రోన్లను ఎగరేయాలనుకుంటే ముందుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అనుమతి తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 నుంచి 2,000 వరకు డ్రోన్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. గ్రేటర్ పరిధిలోనే 800లకుపైగా ఉన్నట్టు సమాచారం. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం... వీటిలో 90 శాతం డ్రోన్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అని 2014లోనే కేంద్రం హెచ్చరించింది. నెదర్లాండ్స్ స్ఫూర్తితో... డ్రోన్లను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ దేశంలోని పోలీసులు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో వీరిబాటనే పలు దేశాలు అనుసరిస్తున్నాయి. డ్రోన్లతో ఉగ్రముప్పు ఉన్న విషయాన్ని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు ఆ మేరకు గతేడాదే సంసిద్ధులయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్టుల ఆటకట్టించే దిశగా ఎంపిక చేసిన గద్దలకు శిక్షణ ప్రారంభించారు. కానీ, వాటి పురోగతిని మాత్రం తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారు. -
ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు
జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్కు అనుగుణంగా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. మూతపడిన ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమలపై దృష్టి సారించి ప్రభుత్వంతో చర్చించారు. వెనువెంటనే అనుమతులను మంజూరు చేయించి ఉత్పత్తికి మార్గం సుగమం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆక్సిజన్ నిల్వ ప్లాంటుతో పాటు ఆక్సిజన్ సరఫరా పైపులైన్లను ఇదివరకే ఏర్పాటు చేయడంతో ‘సెకెండ్ వేవ్’ను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడటం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్ ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత దేశ వ్యాప్తంగా వణుకు పట్టిస్తున్నా.. జిల్లాలో అధికార యంత్రాంగం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యలు ఫలితాలనిస్తోంది. శింగనమలలోని లైఫ్ ఆక్సిజన్ ప్లాంటుతో పాటు హిందుపురం నియోజకవర్గంలో తూముకుంట వద్ద ఉన్న సాయికృష్ణ ఆక్సిజన్ గ్యాసెస్ ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గుర్తించారు. అయితే ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తికి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేయించారు. తద్వారా ఈ రెండు ప్లాంట్లలో ఏకంగా ప్రతి రోజూ 700 సిలిండర్ల మేర ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడిందని కలెక్టర్ గంధం చంద్రుడు ‘సాక్షి’కి తెలిపారు. ఉత్పత్తి ప్లాంట్ల సమస్యలకు పరిష్కారం వాస్తవానికి ఏదైనా ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి(ఫారం–25) అవసరం. అంతేకాకుండా ఆక్సిజన్ రవాణా కోసం కూడా అదే శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అయితే శింగనమలలోని లైఫ్ ఆక్సిజన్ ప్లాంటుకు ఈ అనుమతులు లేవు. ఫలితంగా సదరు కంపెనీ ఆక్సిజన్ ఉత్పత్తిని నిలిపేసింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు వెంటనే ఔషధ నియంత్రణశాఖ అధికారులతో మాట్లాడటంతో పాటు అనుమతుల కోసం సదరు కంపెనీతో ఆన్లైన్లో దరఖాస్తు చేయించారు. వెంటనే అనుమతులు వచ్చేలా కృషి చేశారు. ఆ మేరకు ప్లాంటులో 300 సిలిండర్ల మేర ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో 150 నుంచి 200 సిలిండర్లు జిల్లా ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు కంపెనీ అంగీకరించింది. ఇక తూముకుంట వద్దనున్న సాయికృష్ణ ఆక్సిజన్ గ్యాసెస్ కంపెనీ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల వల్ల ఈ ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ.19 లక్షల విద్యుత్ బకాయిలను 18 నెలల పాటు వాయిదా వేయాలని సదరు కంపెనీ అభ్యర్థించింది. దీనిపై వెంటనే ఎస్పీడీసీఎల్ సీఎండీతో కలెక్టర్ మాట్లాడారు. అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం కాస్త సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక్కడ రోజుకు 500 సిలిండర్ల మేర ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా ప్రతి రోజూ జిల్లాలోనే ఏకంగా 700 సిలిండర్ల మేర ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది. ఇది కాస్తా జిల్లా ప్రస్తుత అవసరాల్లో సగం మేర ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో జిల్లాలోనే ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్న జిల్లా యంత్రాంగంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రభుత్వ ముందుచూపుతో.. వాస్తవానికి కోవిడ్ కంటే ముందు జిల్లాలోని ప్రధాన ఆసుపత్రితో పాటు ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆక్సిజన్ నిల్వ కోసం ప్లాంటు లేదు. సరైన ఆక్సిజన్ పైపులైన్లు కూడా లేని దుస్థితి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వ ప్లాంటుతో పాటు రోగులకు నేరుగా ఆక్సిజన్ సరఫరా పైపులైన్ల ఏర్పాటుకు ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది. ఇలా ఏకంగా రూ.5 కోట్లకుపైగా నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వ ప్లాంటుతో పాటు పైపులైన్లను ఏర్పాటు చేశారు. మరో 100 టన్నుల ఆక్సిజన్ జిల్లాలో అర్జాస్ స్టీల్ కంపెనీ ఉంది. తన పరిశ్రమ అవసరాల కోసం ఈ కంపెనీ ఆక్సిజన్ను నిల్వ ఉంచుకుంది. ఇక్కడ సుమారు 100 టన్నుల ఆక్సిజన్ నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్టు సమాచారం. ఈ ఆక్సిజన్ను కూడా ప్రజల అవసరాల కోసం వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఆక్సిజన్ నిల్వలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సగం ఆక్సిజన్ ఇక్కడి అవసరాలకే.. జిల్లాలో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్లాంట్లను గుర్తించాం. రెండు ప్లాంట్లపై దృష్టి సారించాం. అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్తో జిల్లాలో ప్రస్తుత ఆక్సిజన్ అవసరాల్లో సుమారు సగం మేర తీరే అవకాశం ఉంది. – గంధం చంద్రుడు, కలెక్టర్ చదవండి: అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్కోర్టులే.. ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు! -
హీరోయిన్తో ముద్దు సీన్.. తండ్రికి ఫోన్ చేసిన ప్రభాస్
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభాస్ అంటే ఆరడుగుల మంచితనం..ఇదీ ప్రభాస్ను దగ్గరనుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. ప్రభాస్ ఎంతో మొహమాటస్తుడని అంటుంటారు వాళ్లు. అంతేకాకుండా కొత్త వాళ్లతో మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడుతుంటారని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. రియల్ లైఫ్లోనే కాదు, రీల్ లైఫ్లోనూ ప్రభాస్ సిగ్గరి. హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేనప్పుడు ప్రభాస్ చాలా మొహమాటపడుతుంటాడని, డైరెక్టర్ రాజమౌళి సైతం ఓ సందర్భంలో చెప్పారు. బాహుబలి సినిమా సమయంలో తనకు యాక్షన్ సీన్లు డైరెక్ట్ చేయడం కంటే ప్రభాస్తో రొమాన్స్ చేయించడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. 2003లో ఆర్తి అగర్వాల్తో కలిసి ప్రభాస్ అడవి రాముడు అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు ప్రభాస్.. వాళ్ల నాన్నకు ఫోన్ చేశాడట. ముద్దు సీన్ చేయడానికి తండ్రి వద్ద నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే నటించాడట. ఈ విషయాన్ని ప్రభాస్ మేనేజర్, నటుడు ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్కు వాళ్ల నాన్న గారంటే ఎంతో గౌరవం అని, ఏ చిన్న విషయాన్నైనా ఆయన అనుమతి తీసుకునేవారని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరొచ్చినా, ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్దని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. చదవండి : ప్రభాస్ లగ్జరీ కారు! ఖరీదు ఎంతంటే? ప్రభాస్ ‘ఆదిపురుష్’: కేవలం ఈ ఒక్క పార్ట్కే రూ.300 కోట్లు ఖర్చు! -
సినిమా షూటింగ్లకు కేంద్రం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్లాక్-3 ఆగస్టు 31తో ముగియనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సినిమా షూటింగ్లకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్లకు కేంద్రం అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్లు జరుపుకోవాలని అనుమతులు జారీ చేసింది. (పంజాబ్ ప్రభుత్వం: బ్రేక్ పడిన సినిమా షూటింగులకు అనుమతి!) షూటింగ్ దగ్గర ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. ఇక చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. చిత్రీకరణలో పాల్గొనే నటీనటులు ఆరోగ్య సేతు యాప్ను ఉపయోగించాలని సూచించింది. సినిమా షూటింగ్ సమయంలో విజిటర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని కేంద్రం ఆదేశించింది. హెయిర్ స్టైలిస్ట్లు, మేకప్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలని పేర్కొంది. కాస్ట్యూమ్స్, లోకల్ మైక్లను ఎవరికి వారే ఉపయోగించుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. -
అగ్నిమాపక శాఖ అనుమతుల్లేవు
సాక్షి, విజయవాడ : కరోనా రోగులకు చికిత్స అందించేందుకు స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేష్ ఆస్పత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్ కోవిడ్ కేంద్రానికి ఏ విధమైన అగ్నిమాపక అనుమతుల్లేవు. హోటల్గా వినియో గిస్తున్నట్లయితే 15 మీటర్ల ఎత్తుకు నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) అనుమతులు తీసుకోవాలి. అదే కోవిడ్ సెంటర్కు కనీసం 9 మీటర్ల ఎత్తుకు అనుమతులు పొందాలి. కానీ, ఈ రెండు అనుమతుల్లేవని సమాచారం. కోవిడ్ సెంటర్కు ఉండాల్సిన సౌకర్యాలు.. ► కోవిడ్ సెంటర్ కానీ ఆస్పత్రి కాని నిర్వహించాలంటే రోగులను అత్యవసర పరిస్థితుల్లో స్ట్రెచ్చర్పై తరలించేందుకు వీలుగా ర్యాంపు ఉండాలి. ► అగ్నిప్రమాదం జరిగితే మంటలను వెంటనే అదుపుచేసేందుకు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ► మూడు చదరపు మీటర్లు దూరం వరకు నీటిని చిమ్మే స్ప్రింక్లర్లు ఉండాలి. ► ప్రమాదం జరిగిన వెంటనే నీరు వచ్చేందుకు ఆటోమేటిక్ డిటెక్టరు, పై అంతస్తుల్లో ఉన్న రోగులను అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం ఉండాలి. ► ముఖ్యంగా భవనంపై వాటర్ ట్యాంకును నిర్మించాలి. ఇవేమీ ఈ హోటల్లో లేవు. ► ఆ హోటల్లో కరోనా కేర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ దృష్టికి కూడా తీసుకురాలేదు. చెక్కతో చేసిన అలంకరణతో.. కాగా, గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంది. దాని పక్కనే మెట్లు, లిఫ్ట్ ఉంది. రిసెప్షన్ నుంచే అన్ని గదులకు కేబుల్స్ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్వల్ల కేబుల్స్లో అంతర్గతంగా (మౌల్డింగ్లో ఇంటర్నల్ కంబర్షన్) మంటలు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక అధికారి ఒకరు చెప్పారు. మంటలు బయటకు రాగానే ఆక్సిజన్తో కలిసి మంటలు ఒక్కసారిగా ఎగసిపడి ఉంటాయంటున్నారు. రిసెప్షన్ నుంచి రెండో అంతస్తు వరకు (డూప్లెక్స్ తరహాలో) అలంకరణకు చెక్కను బాగా వినియోగించడంవల్లే మంటలు తీవ్రంగా వ్యాప్తిచెందడానికి కారణమైంది. -
టూరిస్టుల కోసం గోవా రెడీ!
పనాజీ : కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్లతో బోసిపోయిన గోవా మళ్లీ పర్యాటకులతో కళకళలాడనుంది. అక్కడి బీచ్లు సందడిగా మారనున్నాయి. పర్యాటకులను గురువారం నుంచి అనుమతించనున్నట్టు గోవా ప్రభుత్వం పేర్కొంది. 250 హోటళ్లకు ప్రభుత్వం టూరిస్టులను అనుమతించవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కాగా గోవాలో పర్యాటకులు ప్రవేశించాలంటే కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ చూపనిపక్షంలో గోవాలోనే కోవిడ్-19 పరీక్షకు సంసిద్ధం కావాలని టూరిజం మంత్రి ఎం అజగోంకర్ చెప్పారు.చదవండి : 90 శాతం పేషెంట్లు వాళ్లే: గోవా సీఎం -
షూటింగ్లకు త్వరలోనే అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: సినిమా షూటింగ్లకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నామని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేరోజు తెరుచుకునేలా చూస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చారు. శనివారం తెలు గు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సినీ రంగ ప్రముఖులతో ఈ సందర్భం గా చర్చించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల, అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు మంత్రి దృ ష్టికి షూటింగులకు అనుమతి, థియేటర్ల ప్రారంభం, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటీటీలో సినిమా రిలీజ్, రీజినల్ జీఎస్టీ, టీడీఎస్, సినిమా కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు తెచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ షూ టింగ్లకు త్వరలోనే అనుమతి లభిస్తుందని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంటామని, అలాగే పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలి పారు. ప్రాంతీయ భాషా సినిమాలు పెరిగేలా రీజి నల్ జీఎస్టీ మీద కూడా ఆలోచన చేస్తామని, సిని మా పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం విద్యుత్తు శాఖ మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సీఎంలతో మాట్లాడి సాయం చేస్తా.. జమ్మూ కశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూ టింగ్లు, స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎంలతో మాట్లాడి సహాయం చేస్తానని కిషన్రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక సమావేశం పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని సూచించారు. ప్రజలంతా ఈ కష్టకాలంలో రాజకీ య, మత, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా ఉం డాలని సూచించారు. కరోనా నుంచి బయటపడితే దేశం మళ్లీ పురోగతి సాధిస్తుందన్నారు. వీడియో కా న్ఫరెన్స్లో పాల్గొన్న సినీ ప్రముఖులను పేరుపేరు నా మంత్రి యోగక్షేమాలు అడిగారు. సినిమా ప్ర ముఖులు కూడా కిషన్ రెడ్డిని అభినందిస్తూ, ప్రభుత్వం బాగా పని చేస్తోందంటూ కితాబు ఇచ్చారు. -
ప్రభుత్వ నిర్ణయంతో ఆవేదన చెందా: ఒబెరాయ్
ముంబై: లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం హోటల్ పరిశ్రమకు అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని ఒబెరాయ్ హోటల్ గ్రూప్ ఎండీ, సీఈవో విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని పరిశ్రమలకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఒబెరాయ్ ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేని విధంగా హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా హోటల్ పరిశ్రమను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హోటల్ పరిశ్రమ బతకాలంటే తెరవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. హోటల్ అసోసియేషన్లు నిరంతరం ప్రభుత్వంతో చర్చిస్తున్న హోటల్ నిర్వహణకు అనుమతి లభించలేదని వాపోయారు. ఇటీవల వివిధ రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల హోటల్ పరిశ్రమకు ఎలాంటి లాభం లేదని తెలిపారు. కరోనాను నివారించేందుకు ప్రభుత్వ నియమాలను ఆచరించేందుకు అన్ని హోటల్ యాజమాన్యాలు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో 33 అత్యాధునిక ఫైవ్ స్టార్ హోటల్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఒమెరాయ్ హోటల్ తమ సేవలను అప్రతిహాతంగా అందిస్తున్నాయి. చదవండి: ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్.. -
ఊరెళ్తామని 696 మంది దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ అనుమతి నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు నేరేడ్మెట్ ఠాణాతో పాటు తహసీల్దార్ కార్యాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం ఉదయమే వివిధ రంగాల్లో పని చేస్తున్న డివిజన్ పరిధిలోని వలస కార్మికులు, కూలీలు పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో నేరేడ్మెట్ సీఐ నర్సింహా్మస్వామి, తహసీల్దార్ గీత పర్యవేక్షణలో పోలీసులు కార్మికులతో మాట్లాడారు. తమ సొంత ఊళ్లకు వెళతామని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. ఆధార్కార్డు, ఫోన్ నంబర్లతోపాటు పూర్తి వివరాలతో వలస కారి్మకులకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్, ఓడిశా రాష్ట్రాల్లోని సొంత గ్రామాలకు వెళ్లేందుకు 696మంది వలస కారి్మకులు దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్ గీత ‘సాక్షి’తో చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతితో కారి్మకులను వారి సొంత గ్రామాలకు తరలించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. -
పాసుల దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణలో మే 7 వరకూ లాక్డౌన్ కొనసాగింపు నేపథ్యంలో పాసుల దుర్వినియోగంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాసుల రివ్యూ చేయడానికి ప్రత్యేకంగా ఓ పోలీస్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఒకవేళ పాసులు దుర్వినియోగం అవుతున్నట్లు తేలితే వాటిని క్యాన్సిల్ చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ విస్తృతం అవుతున్నందున ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. (మే 7 వరకు ఇళ్లలోనే..!) లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ఉల్లంఘించి యధేచ్చగా బయట తిరుగుతున్నారు. దీంతో లాక్డౌన్ పాసుల జారీలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే అనుమతి ఇవ్వనున్నారు. (తెలంగాణలో రోజూ సగటున 17 కేసులు) పోలీసు వెబ్సైట్ నుంచి ఈ–పాస్ నగర పోలీసు విభాగ అధికారిక వెబ్సైట్ (www.hyderabadpolice.gov.in)కు ఈ–పాస్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభమైంది. ఇకనుంచి ఎవరూ పోలీసు కమిషనరేట్, ఇతర కార్యాలయాకు రాకుండానే వీటిని పొందవచ్చు. అత్యవసర, కీలక, నిత్యావసర సర్వీసులు అందిస్తున్న వ్యక్తులు, వాహనాలు, కార్యాలయాలకు చెందినవారికి మాత్రమే ఈ–పాస్లు జారీ చేస్తామని కొత్వాల్ అంజనీకుమార్ ప్రకటించారు. పోలీసు వెబ్సైట్లో ఉన్న అప్లై ఫర్ పాస్ అనే విభాగంలోకి ముందుగా ప్రవేశించాలి. అక్కడ పాస్ కోరుతున్న వారి గుర్తింపు కార్డు, ఫొటో అప్లోడ్ చేసి, ఫోన్ నంబరు, ఇతర వివరాలు పొందుపరచాలి. వీటిని పరిశీలించిన తర్వాత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ–పాస్ జారీ చేస్తూ పొందుపరిచిన ఫోన్ నంబర్కు సందేశం పంపుతారు. ఇందులో ఉన్న లింకు ఆధారంగా సదరు వ్యక్తులు ఈ–పాస్ డౌన్లోడ్ చేసుకుని, కలర్ ప్రింట్ ఔట్ తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులకు కూడా ఈ–పాస్ పైన ఉండే క్యూఆర్ కోడ్ను రీడ్ చేసే పరికరాలు అందిస్తున్నారు. ఈ–పాస్లను వీటితో స్కాన్ చేసిన వెంటనే పూర్తి వివరాలు వారికి తెలుస్తాయి. ఈ నేపథ్యంలోనే అప్లోడ్ చేసిన గుర్తింపు కార్డును తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ–పాస్లను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. In the wake of Telg govt decision to extend the lock down , city police will review passes on the roads . Passes will be cancelled if Anyone is found misusing it . There will be separate teams to check misuse of passes . We do this to protect you against the Corona virus . — Anjani Kumar, IPS (@CPHydCity) April 20, 2020 -
డిస్కోలు,ఆర్కెస్ట్రాలకు సుప్రీంకోర్టు అనుమతి
-
అడుక్కుంటాను అనుమతివ్వండి
ముంబై : ప్రభుత్వం నాకు రెండు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి పోలీసు యూనిఫామ్లోనే అడుక్కునేందుకు నాకు అనుమతివ్వండి అంటు ముంబై కానిస్టేబుల్ ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు ఒక వినతి పత్రం ఇచ్చారు. ముంబైకి చెందిన ద్యనేశ్వర్ అహిర్రావ్ తొలుత స్థానిక మురోల్ ఆయుధ విభాగంలో పనిచేసేవాడు. కొన్ని రోజుల కిందట ఇతన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి మార్చారు. సరిగా ఆ సమయంలోనే అతని భార్య కాలు విరగడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గాను మార్చి 20 నుంచి 22 వరకు సెలవు పెట్టాడు. ఈ విషయం గురించి ఇంచార్జికి ఫోన్లో తెలియజేసాడు. అనంతరం మరో ఐదు రోజులు కూడా సెలవు తీసుకున్నాడు. భార్యను ఆస్పత్రి నుంచి తీసుకువచ్చిన తర్వాత మార్చి 28న వచ్చి తనకు కేటాయించిన మాతోశ్రీలో విధుల్లో చేరాడు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకూ అతనికి జీతం రాలేదు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో పోలీసు దుస్తుల్లోనే అడుక్కునేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ద్యనేశ్వర్ మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావుకు అలానే ముంబై పోలీసు కమిషనర్కు లేఖ రాశాడు. ఆ ఉత్తరంలో తను సెలవు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందువల్ల తనకు యూనిఫామ్లో అడుక్కునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీని గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇంచార్జికి తెలపకుండా విధులకు హాజరు కాని వారికి మాత్రమే జీతం ఇవ్వకుండా ఆపుతారు. అందువల్లే ద్యనేశ్వర్కు రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదని తెలిపారు. ద్యనేశ్వర్ రాసిన లేఖ -
44 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపుపై సందిగ్ధత!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 44 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులపై సందిగ్ధత నెలకొంది. ఆయా కాలేజీలు 111 జీవో పరిధిలోని ప్రదేశాలు, భూదాన్ భూముల్లో ఉండటంతో వాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీలకు అనుమతులపై గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 212 ఇంజనీరింగ్ కాలేజీలుండగా 168 కాలేజీల్లో ప్రవేశాలకే ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది. జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు జాబితాను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 7లోగా అనుబంధ గుర్తింపు జాబితాను ఇస్తామని జేఎన్టీయూహెచ్ పేర్కొనగా, వచ్చే నెల 15లోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఏఐసీటీఈ గుర్తింపు లభించని కాలేజీల్లో ప్రముఖుల కాలేజీలు ఉండటంతో ఈలోగా వాటికి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మే 2 నుంచి ఎంసెట్.. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను మే 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు జేఎన్టీయూహెచ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 2,20,990 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,47,912 మంది, అగ్రికల్చర్ ఎంసెట్ రాసేందుకు 73,078 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. -
సల్మాన్కు కోర్టు గ్రీన్ సిగ్నల్
జోధ్పూర్ : కృష్ణ జింకల వేట కేసులో బెయిల్పై ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు మరో ఊరట లభించింది. జోధ్పూర్ జిల్లా సెషన్స్ కోర్టు రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే నిబంధనలపై ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టుని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం కోర్టు తన తీర్పును వెలువరించింది. మే 25 నుంచి జూలై 10 మధ్యకాలంలో కెనడా, నేపాల్, అమెరికా వెళ్లేందుకు సల్మాన్కు అనుమతినిచ్చింది. అయితే సల్మాన్ ఎందుకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నాడనేది మాత్రం తెలియరాలేదు. ఈ కేసులో సల్మాన్ దోషిగా తెలడంతో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు రోజులు జైల్లో గడిపిన అనంతరం సల్మాన్ బెయిల్పై బయటకొచ్చిన విషయం విదితమే. -
క్యాన్సర్తో బాధపడుతున్నా..
సాక్షి, బెంగళూర్ : బోర్డు పరీక్షలంటేనే విద్యార్థులు, తల్లితండ్రులకు విషమ పరీక్షగా మారాయి. క్యాన్సర్తో బాధపడుతున్న పదోతరగతి విద్యార్థి తనకు సహకరించేందుకు మరొకరిని అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని సీబీఎస్ఈ నిర్థయగా తోసిపుచ్చినట్టు సమాచారం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడు ఎక్కువసేపు కూర్చోలేనందున అతని తరపున పరీక్ష రాసేందుకు సహకరించేలా వేరొకరినీ అనుమతించాలని బాధిత విద్యార్థి తల్లితండ్రులు సీబీఎస్ఈకి లేఖ రాశారు. పరీక్ష కేంద్రంలోకి బాలుడి మందులు, ఆహారాన్ని అందుబాటులో ఉంచడానికి అనుమతించాలని కూడా లేఖలో వారు కోరారు. బెంగళూర్కు చెందిన మణిపాల్ హాస్పిటల్లో అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడికి కీమోథెరఫీ చికిత్స అందచేస్తున్నామని వారు బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తమ వినతిని బోర్డు తిరస్కరించిందని బాధిత విద్యార్థి మామ పనున్ కాశ్మీర్ కార్యకర్త పవన్ దురాని ట్వీట్ చేశారు. బోర్డు నిర్ణయం తనకు కన్నీళ్లు తెప్పించిందని, ఇంక మానవత్వం ఎక్కడ మిగిలుందని ప్రశ్నించారు. బాధిత విద్యార్థికి న్యాయం చేసేలా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి, మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్లకు ఆయన ట్వీట్ చేశారు. తమ వద్ద అన్ని మెడికల్ రిపోర్టులున్నాయని చెబుతూ ఆస్పత్రి సిఫార్సు లేఖనూ ఆయన జత చేశారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతించబోం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని హైదరాబాద్ జిల్లా పరీక్షల కమిటీ స్పషం చేసింది. పరీక్ష కేంద్రంలోకి 8.30 నుంచి అనుమతిస్తామని, 9 గంటల తర్వాత నిమిషం ఆల్యమైనా అనుమతి ఇవ్వబోమని వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి సుమారు 1,65, 695 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం సుమారు 196 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల నిర్వహణకు సుమారు 69 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 200 మంది ఇన్విజిలేటర్లను వినియోగించనున్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అధికారి సరళా వందనం తన చాంబర్లో పరీక్షల ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 28 నుంచి జరగనున్న పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష హాల్లోకి క్యాలికిలేటర్లు, సెల్ఫోన్, పెన్డ్రైవ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని సూచించారు. ఏవేనా సందేహాలున్నవారు డిస్ట్రిక్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్లు హరింద్రనాథ్ 99893 56245, డి భద్రేషన్లను 93910 12604, డీఐఈవో 98487 81805లలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ ఇంటర్మీడియట్ పరీక్షల అధికారి, కన్వీనర్ జయప్రదబాయి, ఏసీపీ భిక్షం రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
31న ట్రాఫిక్ ఆంక్షలుంటాయ్
విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 31వ తేదీన డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తామని డీసీపీలు కాంతి రాణా, గజరావ్ భూపాల్రావులు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ రోజున రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, హైస్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని వాహనదారులకు సూచనలు చేశారు. నగరంలో బైక్ ర్యాలీలకు అనుమతి లేదని, పోలీసుల అనుమతితోనే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలన్నారు. హాస్పటల్స్ సమీపంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం రోజున రూరల్ ఏరియాలో కోడి పందేలు, పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే లాటరీలు వస్తున్నాయని ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. -
భార్యను కలిసేందుకు జాధవ్కు అనుమతి
ఇస్లామాబాద్: భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది. జాధవ్ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది. -
పర్మిషన్ ఈజీ
పాలమూరు: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5నుంచి ఈ–దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఎక్కువ మంది వ్యాపారులకు దరఖాస్తు చేసుకోవడం సులవైంది. దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లో అనుమతి లభించడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరళీకృత వ్యాపార విధానం అభివృద్ది చేయడానికి ఈ విధానం అమలు చేశారు. నూతన పరిశ్రమ కోసం ఆన్లైన్ ద్వార లబ్దిదారుడు దరఖాస్తు చేసుకుంటే దానిని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పరిశీలన చేసిన తర్వాత 30రోజుల్లో అనుమతి లభిస్తుంది. దరఖాస్తు చేసుకున్నవారు ఇలా.. 2015లో ఉమ్మడి జిల్లానుంచి 285 దరఖాస్తులు వస్తే 250 పరిశ్రమలకు అనుమతి లభిచింది. 2016 మే 25 నుంచి 2017 ఆగష్టు 5వరకు 551 దరఖాస్తులు 2107 ఆగస్టు 6నుంచి అక్టోబర్ 20వరకు 80 పరిశ్రమలకు 105 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులకు ఇప్పటి వరకు 98శాతం అనుమతి లభించగా మరో 20శాతం ప్రక్రియ కొనసాగుతున్నాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 31లోపు అనుమతి పత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 31 వరకు అనుమతి పత్రం రాకపోతే మళ్లీ వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెండింగ్లో నిధులు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి పరిశ్రమలకు, వాహనాలకు ఇస్తున్న రాయితీలు దాదాపు కోట్లలలో పెండింగ్లో ఉన్నాయి. 2014 మే నుంచి 2015 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత రాయితీని ఖాతాలో జమ చేశారు. 2015 జూన్ నుంచి 2017 అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు రావాల్సి ఉంది. అయితే ఈ రెండేళ్ల కాలంలో దాదాపు కోట్లలో బకాయిలు ఉన్నాయి. పారదర్శకత పెరుగుతోంది ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకోవడంతో కార్యాలయం చూట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సెక్షన్స్లలో సంబంధిత అధికారులను అడగాల్సిన అవసరమూ ఉండదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రెండు రోజుల్లోనే దరఖాస్తులను పరిశీలన చేసి అన్ని పత్రాలు ఉన్నాయా లేదా చూసి సక్రమంగా ఉంటే విచారణకు వెళ్తున్నాం. నెల రోజుల లోపు అనుమతి పత్రం వస్తుంది. ఈ విధానంతో పారదర్శకత పెరిగింది. – సురేష్కుమార్, జనరల్ మేనేజర్ పరిశ్రమల శాఖ, మహబూబ్నగర్ -
రాహుల్ టూర్ ఆగలేదు
సాక్షి,అమేథి: రాహుల్ పర్యటనను వాయిదా వేసుకోమని కోరినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన క్రమంలో ఆయన టూర్కు అమేథి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగే రాహుల్ అమేథి పర్యటన కోసం తాము సంసిద్ధంగా ఉన్నామని అమేథి జిల్లా మేజిస్ర్టేట్ యోగేష్ కుమార్ చెప్పారు. ఈనెల 4-6 తేదీల్లో రాహుల్ నియోజకవర్గ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించలేదని, కేవలం ఆయన భద్రత పట్ల ఆందోళనతోనే వాయిదా వేసుకోవాలని కోరారని తెలిపారు. దుర్గా విగ్రహాల నిమజ్జనం, మొహర్రం సందర్భంగా భద్రతా సిబ్బంది బిజీగా ఉంటారనే కారణంతోనే రాహుల్ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ చీఫ్కు అధికారులు లేఖ రాశారని వివరణ ఇచ్చారు.అయితే రాహుల్ గతంలో ఇచ్చిన షెడ్యూల్ మేరకే పర్యటిస్తానని పేర్కొనడంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. అయితే రాహుల్ టూర్ వాయిదా వేయాలని అధికారులు కోరడాన్ని యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ తప్పుపట్టారు. -
అనుమతి లేనిదే జిల్లాను వదిలి వెళ్లొద్దు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో అన్ని శాఖల అధికారులు సాధారణ సెలవులు, ప్రభుత్వ సెలవుదినాల్లో అనుమతి తీసుకున్న తర్వాతనే జిల్లా దాటి వెళ్లాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు పనిచేసే ప్రదేశంలో నివాసం ఉండకుండా విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి ప్రతి రోజు జిల్లాకు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలో ఏదైనా అనుకోని ప్రమాద సంఘటన జరిగినప్పుడు సంబంధిత శాఖాధికారులు అందుబాటులో లేకుంటే పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారన్నారు. ఇ–ఆఫీస్లో జిల్లా అధికారులు సెలవులు పెట్టి తన అనుమతి లేనిదే వెళ్లకూడదని కలెక్టర్ చెప్పారు. చంద్రన్న బీమా క్లెయిమ్ల మీద సమీక్షిస్తూ పోలీస్ శాఖ దగ్గర ఎఫ్ఐఆర్లు 10 పెండింగ్లో ఉన్నాయని వాటన్నింటినీ 48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసం ద్వారా వచ్చిన, మీ సేవలో వచ్చిన అర్జీలు సెల్ఫీ లేదా వీడియోలో చిత్రీకరించి నమోదు చేయాలని ఆదేశించినా కొన్నిశాఖలు నమోదు చేయడం లేదన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ సూచించారు. నూరు శాతం టీకాలు వేయించాల్సిందే పొంగు, తట్టు వ్యాధి నిరోధక టీకాలు జిల్లాలో 100శాతం పిల్లలకు వేయించాలని జిల్లా వైద్యాధికారి, ఇమ్యునైజేషన్ అధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన 3వ జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలో పల్స్ సర్వే ప్రకారంగా 8లక్షల 36వేల మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ సెప్టెంబరు 8వ తారీకు లోపల వైద్యాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బాధ్యత వహించి అందరికీ తట్టు, పొంగు నివారణ టీకాలు వేయించాలని, వారి వివరాలన్నీ ఆన్లైన్ యాప్లో నిర్ణయించిన ప్రొఫార్మాలో పొందు పరచాలని ఆదేశించారు. గతంలో చేసిన నిర్లక్ష్యం ప్రస్తుతం చేయొద్దని సూచించారు. టీకాలు వేయించడంలో విద్యాశాఖ, శిశు సంక్షేమశాఖ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ, మైనార్టీ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటింటా సర్వే నిర్వహించండి స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా జిల్లాను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా గుర్తించేందుకు ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకూ నివేదిక సమర్పించకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలను గుర్తించి నివేదికను త్వరితగతిన ఎంపీడీఓలు పంపాలని ఆదేశించారు. జిల్లాకు నూతనంగా వచ్చి నివాసం ఉంటున్న కుటుంబాల వివరాలు సేకరించి వారి గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించేందుకు స్త్రీశిశు సంక్షేమశాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్త్రీశిశు సంక్షేమశాఖ సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నెలా 31వ తేదీ నాటికి ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యావతిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, డీఆర్ఓ కె.హైమావతి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని, డీఎస్ఓ షరీఫ్, డీఎం పీ.కొండయ్య, డీఎంఅండ్హెచ్ఓ కె.కోటేశ్వరి జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ నూతన సెక్రటేరియట్కు గ్రీన్సిగ్నల్
-
పర్మిషన్ లేని పాఠశాల మూసివేత
పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబలదిన్నెలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీఎన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలను విద్యాశాఖాధికారులు సోమవారం మూసివేశారు. నెలరోజులుగా అనుమతి లేకుండా స్కూలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం ధర్నా చేయడంతో మేలుకున్న ఎంఈఓ ఖాజామోహిద్దీన్ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డుల కోసం ఆరా తీయగా సిబ్బంది తెలియదని చెప్పడంతో మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులను బయటకు పంపి తాళం వేశారు. ఈ కారణంగా స్కూల్లో చేరిన 124 మంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. -
ట్రాక్టర్లతో సరిపెట్టేశారు!
13 నియోజకవర్గాలకు 40 చొప్పున మంజూరు ఎస్డీపీ కింద రూ.12.85 కోట్లు కేటాయింపు ఇతర పరికరాలకు రూ.7.36 కోట్లు అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు యాంత్రికీకరణ పథకానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ట్రాక్టర్లు, కొన్ని రకాల యంత్ర పరికరాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ వాటి ధరలు, రాయితీలు, విధి విధానాలు విడుదల చేయకపోవడంతో అమలు చేయడానికి వ్యవసాయశాఖ సిద్ధం కాలేని పరిస్థితి నెలకొంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఏప్రిల్, మే నెలల్లో యాంత్రికీకరణ పథకానికి అనుమతి ఇచ్చిఉంటే ఉపయోగరకంగా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎస్డీపీ కింద రూ.20.21 కోట్లు బడ్జెట్ కేటాయింపు : ప్రస్తుతం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీపీ) కింద 520 ట్రాక్టర్లకు రూ.12.85 కోట్లు, ఇతర పథకం కింద మరికొన్ని యంత్ర పరికరాలకు రూ.7.36 కోట్లు మంజూరు చేసినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ట్రాక్టర్ల విషయానికొస్తే జిల్లాకు 520 మంజూరు కాగా అందులో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒక్క ట్రాక్టర్ కూడా కేటాయించలేదు. మిగతా 13 నియోజక వర్గాలకు 40 చొప్పున కేటాయించారు. అధికారికంగా ఇన్చార్జ్ మంత్రి అనుమతులు తప్పనిసరి చేయడంతో అధికార పార్టీకి చెందిన నేతలు తమ అనుచరులకు ఇచ్చుకునే పరిస్థితి నెలకొనడంతో సామాన్య రైతులకు ట్రాక్టర్లు దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇకపోతే జిల్లా వ్యవసాయశాఖ రూ.40.93 కోట్లు బడ్జెట్తో 14,739 యూనిట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనరేట్కు ప్రతిపాదనలు పంపింది. రూ.20.21 కోట్ల బడ్జెట్తో ట్రాక్టర్లు, కొన్ని యంత్రపరికరాలకు అనుమతివ్వడం గమనార్హం. -
వసతి..కిరికిరి
- అనుమతుల్లేకుండా హాస్టళ్ల నిర్వహణ - ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఇష్టారాజ్యం - 16 కాలేజీలకు అనుమతులు లేవని నివేదిక - వీటిలో టీడీపీ నాయకుల అనుచరుల కాలేజీలు - త్వరలో షోకాజ్ నోటీస్లు జారీ చేస్తామన్న ఇంటర్ బోర్డు అధికారులు కర్నూలు సిటీ: జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధలు పాటించకుండా ఇంటర్ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ప్రైవేట్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసుల విచారణ జరపగా..ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థుల బలవన్మరణాలకు ఆయా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లలో సరైన సదుపాయలు లేకపోవడమే కారణమని తేలింది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, భద్రత కోసం సరైన సిబ్బందిని నియమించక పోవడమూ కారణమని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇలా నిర్వహిస్తున్న కాలేజీలు 16 ఉన్నట్లు తేలింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు నివేదిక పంపారు. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి...! జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిలో జిల్లాలో నంద్యాలోని రాపూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్తో కూడిన అనుమతి ఉంది. మిగతా వాటికి ఒక్కదానికి అనుమతి లేదు. హాస్టళ్లతో కలిపి కాలేజీలను నిర్వహిస్తున్నవి సుమారు 30 శాతం ఉంటాయి. అయితే ఇంటర్ బోర్డు అధికారులు కేవలం 16 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలతో కూడిన నివేదికను బోర్డుకు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై తనిఖీ చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు ముందే గుర్తించిన కాలేజీలకు నోటీస్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నాయకుల అనుచరులకు చెందిన విద్యా సంస్థలు కూడా అనుమతులు లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అయితే ఆ కాలేజీలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. తనిఖీలు చేయని బోర్డు అధికారులు...! జిల్లాలో ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇస్తున్న అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రతి కాలేజీని తనిఖీ చేసిన నివేదికను ఇంటర్ బోర్డుకు అందజేయాలి. అయితే అధికారులు ప్రైవేట్ కాలేజీలను తనిఖీ చేయడంలేదు. కాలేజీల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసి తూతూ మంత్రంగా నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమన్యాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి – వై.పరమేశ్వరరెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి జిల్లాలోని ప్రైవేట్ కాలేజీల్లో కేవలం నంద్యాలలోని రావూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్ అనుమతి ఉంది. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డుకు అందజేశాం. వీరిపై చర్యలు తీసుకునే అంశం కమిషనర్ పరిధిలో పరిశీలనలో ఉంది. -
పాదయాత్రకు అనుమతి కోరితే పరిశీలిస్తాం
గతంలో జరిగిన అల్లర్య దృష్ట్యా భారీ బందోబస్తు పోలీసు వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తుంది ∙ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కిర్లంపూడి : పాదయాత్రకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అనుమతి కోరితే పరిశీలిస్తామని గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. బుధవారం కిర్లంపూడిలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కిర్లంపూడి పోలీస్స్టేష¯ŒSలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లు జరిగినా బాధ్యత వహిస్తానని హామీ పత్రాన్ని ఇస్తే షరతులతో కూడిన అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. నెల్లూరు ఎస్పీ విశాల్గున్ని, ఏఎస్పీలు ఫకీరప్ప, అద్నా¯ŒSనమూమ్ ఆజ్మీ ఉన్నారు. -
చెయ్యాలా?మానాలా?
పంచాయతీల పరిధిలో అనేక అనధికారిక లే అవుట్లు క్రమబద్ధీకరణకు ఫిబ్రవరిలోనే జీఓ నం: 12 విడుదల స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రక్రియకు జంకుతున్న పలువురు కార్యదర్శులు క్రమబద్ధీకరిస్తున్న చోట దళారుల హవా మండపేట : ‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావం’డన్న చందాన ఉంది సర్కారు తీరు. పంచాయతీల పరిధిలోని అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు జీఓ నం: 12 విడుదల చేసిన ప్రభుత్వం.. అందుకు అవసరమైన మార్గదర్శకాలపై స్పష్టతను విస్మరించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఏం చేయా లో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రమబద్ధీకరిస్తే ఏం కొంప మునుగుతుందోనని అధికశాతం మంది కార్యదర్శులు వెనుకడుగేస్తుండగా, కొందరు కార్యదర్శులు ధైర్యంగా క్రమబద్ధీకరణ చేసేస్తున్నారు. ఇదే అదనుగా దళారులు స్థలయజమానుల నుంచి కాసులు దండుకుంటున్నారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 604 అనధికారిక లే అవుట్లు లే అవుట్లు వేసేటప్పుడు నిబంధనల మేరకు 33 అడుగుల రోడ్డు, 10 శాతం కామన్ సైట్లను పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయించాలి. రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ సదుపాయం యాజమాన్యమే కల్పించాలి. నిబంధనల అతిక్రమణ జరిగిన లేఅవుట్లను అనధికారిక లే అవుట్లుగా గుర్తిస్తారు. జిల్లావ్యాప్తంగా 604 అనధికారిక లేఅవుట్లు ఉన్నాయి. రాజమండ్రి డివిన్లోలో 156, కాకినాడ డివిజన్లో 177, అమలాపురం డివిజన్లో 170, పెద్దాపురం డివిజన్లో 101 అనధికారిక లేఅవుట్లను గుర్తించారు. పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు కల్పించేందుకంటూ అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఫిబ్రవరిలో ప్రభుత్వం జీఓ నం:12ను విడుదల చేసింది. అనధికారిక లే అవుట్లలో రిజిస్ట్రేష¯ŒSశాఖ నిర్ధారించిన విలువలో 14 శాతం అపరాధ రుసుముగా వసూలు చేయవచ్చని సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాల స్థాయిని బట్టి అపరాధ రుసుం వసూలు చేయాలని, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ కు రూ.ఐదు వేల వరకు, తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.మూడు వేల వరకు ఫీజు వసూలు చేయొచ్చంది. లిఖితపూర్వక ఆదేశాలు కరువు.. కాగా 14 శాతం అపరాధ రుసుము వసూలు చేసిన లే అవుట్లలో రోడ్ల విభజన తదితర నిబంధనల అమలుపై స్పష్టత లేకపోవడం, లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులు సూచనలు చేయకపోవడం కార్యదర్శులను అయోమయానికి గురిచేస్తోంది. పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర వసతులు కల్పించాల్సి ఉండటంతో ఈ అపరాధ రుసుం సరిపోక పోగా పంచాయతీకి అదనపు భారం పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఓ ప్రకారం చేయమని సూచించడమే తప్ప లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడం లేదని కార్యదర్శులంటున్నారు. జీఓలో స్పష్టత లేకపోవడంతో తర్వాత ఏం ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళనతో క్రమబద్ధీకరణకు ఎక్కువమంది కార్యదర్శులు ముందుకు రావడం లేదు. భారీగా దళారుల వసూళ్లు, అధికారులకు వాటాలు.. జిల్లాలో కొందరు కార్యదర్శులు మాత్రం14 శాతం అపరాధ రుసుంతో క్రమబద్ధీకరణ చేసేస్తున్నారు. మండపేట, అనపర్తి, రాజమండ్రి రూరల్ తదితర ప్రాంతాల్లో పలు లే అవుట్లను క్రమబద్ధీకరించినట్టు సమాచారం. ఇదే అదనుగా దళారులు క్రమబద్ధీకరణ చేయిస్తామంటూ లే అవుట్లలోని స్థలాలు కొన్న వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోం ది. జీఓపై స్పష్టత ఇవ్వడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఇన్ చార్జి డీపీఓ పద్మను వివరణ కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
హడ్కో రుణం పొందేందుకు జీహెచ్ఎంసీకి అనుమతి
సాక్షి, సిటీబ్యూరో అసంపూర్తిగా మిగిలిన, కనీస సదుపాయాలు కల్పించాల్సిన జేఎన్ఎన్ యూఆర్ఎం, వాంబే ఇళ్లలో సదరు సదుపాయాలు పూర్తిచేసేందుకు హడ్కోనుంచి రూ. 338.72 కోట్లు రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అనుమతినిచ్చింది. ఈమేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జీఓ జారీ చేసింది. వాంబే, జేఎన్ఎ యూఆర్ఎం పథకాల కింద నిర్మించిన ఇళ్లలో 24,648 ఇళ్లకు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందుకుగాను దాదాపు రూ. 448.42 కోట్లు అవసరమని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. అందులో లబ్ధిదారుల కంట్రిబ్యూషన్ పోను రూ.338.72 కోట్ల రుణానికి ప్రభుత్వం అనుమతించింది. జీహెచ్ఎంసీ గ్యారంటీ కమిషన్ గా 2శాతం నిధుల్ని ప్రభుత్వం వద్ద ఉంచాలని స్పష్టం చేసింది. అవసరాన్ని బట్టి దశలవారీగా ఈ రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన గ్యారంటీనివ్వనుంది. -
అనుమతి లేకుండా విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం తెలపకుండా పాఠశాలల విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వారం రోజులలోగా వివరణ ఇవ్వాలని డీఈఓ వై.చంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.విమల 2011 నుంచి, మునగాల మండలం నెలమర్రీ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పి.సౌజన్య 2005 నుంచి, నల్లగొండలోని ఆర్పీ రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సబియా జబీన్ 2013 నుంచి, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కె.శ్రీదేవి 2013 నుంచి విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఏలాంటి వివరణ ఇవ్వకుంటే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలిపారు. -
ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం తెలపకుండా పాఠశాలల విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వారం రోజులలోగా వివరణ ఇవ్వాలని డీఈఓ వై.చంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.విమల 2011 నుంచి, మునగాల మండలం నెలమర్రీ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పి.సౌజన్య 2005 నుంచి, నల్లగొండలోని ఆర్పీ రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సబియా జబీన్ 2013 నుంచి, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కె.శ్రీదేవి 2013 నుంచి విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఏలాంటి వివరణ ఇవ్వకుంటే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలిపారు. -
అనుమతి లేని బోర్లు మూసివేత
కలకోవ(మునగాల): మండలంలోని కలకోవలో అనుమతి లేకుండా వివాదస్పదంగా మారిన నాలుగు బోర్లను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. తహసీల్దార్ ఎల్.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వాల్టా చట్టానికి వ్యతిరేకంగా గ్రామానికి చెందిన ఓ రైతు అనుమతి లేకుండా బోర్లు వేశాడని గ్రామానికి చెందిన ఓ మాజీ విశ్రాంత ఉద్యోగి తహసీల్దాకు గతంలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్కు ఓ నివేదిక అందచేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతి లేని బోర్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం తహసీల్దార్ ఎల్.భద్రయ్య తన సిబ్బందితో సహా గ్రామానిక చేరుకోవడంతో బోర్ల యజమానితో పాటు పలువురు గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. తిరిగి మంగళవారం గ్రామానికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీసుల సాయంతో ఎట్టకేలకు బోర్లను సీజ్ చేశారు. అంతే కాకుండా విద్యుత్ శాఖ ఏఈ సదరు బోర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను కూడా తొలగించారు. దీంతో బోర్ల వివాదం సమసిపోయంది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ స్వప్న, వీఆర్వోలు అస్మా సుల్తానా, సురేష్, నరేష్, భిక్షంలు పాల్గొన్నారు. -
నంద్యాల మీదుగా నూతన రైళ్లకు అనుమతి
నూనెపల్లె: నంద్యాల మీదుగా వెళ్లేందుకు నూతన రైళ్లకు రైల్వేబోర్డు నుంచి అనుమతి లభించిందని గుంటూరు డివిజన్ ఆర్యూసీసీ సభ్యులు ఊకొట్టు వాసు, కశెట్టి కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో డీఆర్ఎం విజయశర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నూతన రైళ్లు, అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. గుంటూరు నుంచి నంద్యాల మీదుగా గుంతకల్కు డబ్లింగ్ లైన్ సర్వే పూర్తి చేశారని, పనులు చేసేందుకు రైల్వేబోర్డులో అనుమతి లభించిందన్నారు. గుంటూరు నుంచి నంద్యాల మీదుగా ముంబాయికి రెండు నెలల్లో కొత్త రైలు నడుస్తుందని చెప్పారు. విజయవాడ నుంచి కడపకు ఎర్రగుంట్ల మీదుగా వెళ్లేందుకు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను నంద్యాలకు పొడిగించాలని కోరగా బోర్డు అనుమతి రావాల్సి ఉందన్నారు. అరక్కొణం నుంచి కడప వరకు వచ్చే రైలును నంద్యాల మరకు వరకు పొడిగించాలని కోరగా ఒప్పుకున్నారని చెప్పారు. గుంటూరు – నంద్యాల వరకు ఎలక్ట్రిఫికేషన్ లైన్ మార్చినాటికి పూర్తి చేస్తామన్నారు. -
వినాయక పందిళ్లకు అనుమతి తప్పనిసరి
నిబంధనలను జారీచేసిన విజయవాడ సీపీ విజయవాడ : వచ్చేనెల 5వ తేదీన జరగనున్న వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కమిషనరేట్ పరిధిలో పందిళ్లు, మండపాలు ఏర్పాటుచేసుకునే ఉత్సవ కమిటీ నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి కోసం కమిషనర్ కార్యాలయంలోని యూపీఎస్సీ (యూనిపైడ్ పోలీస్ సర్వీస్ సెంటర్)లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. యూపీఎస్సీ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేస్తుందని వివరించారు. దరఖాస్తు ఫారాలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ కింది నిబంధనలు విధించామని సీపీ పేర్కొన్నారు. నియమ నిబంధనలు – ముందస్తు జాగ్రత్తలు – పోలీస్ శాఖతో పాటు మున్సిపల్, అగ్నిమాపక, పంచాయతీ శాఖలు సమన్వయంతో చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతిస్తారు. – పోలీస్ వారికి దాఖలుచేసే అర్జీ పూర్తిచేయాలి. – ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాకు ఒక పోలీస్ అధికారిని, మిగతా శాఖలు, మండపాల ఆర్గనైజింగ్ కమిటీలు సమన్వయంతో పనిచేస్తాయి. ఆర్గనైజింగ్ కమిటీకి ఎలాంటి సమస్య, సందేహాలున్నా సమన్వయ అధికారిని గానీ, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ను గానీ, 100 నంబరులో గానీ సంప్రదించాలి. – శబ్ద కాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నిబంధనలు–200 ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాలో పగలు 55, రాత్రి 45 డెసిబుల్స్కు మించకుండా బాక్స్ టైపు స్పీకర్లను ఉపయోగించాలి. లౌడ్ స్పీకర్లు ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించరాదు. – బాక్స్ స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే ఉపయోగించాలి. మైక్ను ధ్రువతరంగాలు–శబ్ద కాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నిబంధనలు–2000 ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. – విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను తెలియజేయాలి. బాక్స్ టైపు స్పీకర్లు వాడుతున్నదీ లేనిది వివరించాలి. – భద్రత కోసం రాత్రి సమయాల్లో మండపాల వద్ద కాపలా ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నీరు, ఇసుక సిద్ధంచేయాలి. – మండప పటిష్టతను దృష్టిలో పెట్టుకుని పూజ నిర్వహించే సమయంలో ఎక్కువ మంది జనం లేకుండా చూడాలి. పందిళ్ల చుట్టుపక్కల వాహనాలు పార్క్ చేయకూడదు. – పందిళ్లు రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు రోడ్లపై కట్టరాదు. – ఊరేగింపు సమయంలో ఇతర కులాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు, బ్యాన ర్లు ప్రదర్శించడం చేయరాదు. ఊరేగింపుతో పాటు వెళ్లే మత నాయకులు వేరే మతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా మత సామరస్యం పాటించాలి. – పందిళ్ల ఏర్పాటు, ఊరేగింపు సమయంలో వినియోగించే స్పీకర్ల యాంపిల్ వైర్ సిస్టమ్ను ముందుగా తనిఖీ చేసి వినియోగించాలి. – ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి. – నిమజ్జన ఊరేగింపులో రంగులు చల్లడం, బాణాసంచా పేల్చడం చేయరాదు. – ఊరేగింపు సమయంలో పోలీస్ అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్దం వచ్చే వాయిద్యాలు, తీన్మార్లు అనుమతించరాదు. – ఊరేగింపు సమయంలో భారీ వాహనాలు పెట్టరాదు. లారీలు, ట్రైలర్స్, ఆర్కెస్ట్రా వినియోగించరాదు. – ఊరేగింపులో కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి పాల్గొనరాదు. – రూట్ చ్చితంగా పాటించాలి. – ఊరేగింపు సమయంలో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. – ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్జీదారుడు, కార్యనిర్వాహకులు బాధ్యత వహించాలి. -
పేక మేడల్లా కూలుతున్నాయి
గచ్చిబౌలి/మాదాపూర్: నగరంలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్లు కూలుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ప్రమాదాల్లో కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. నిర్మాణ సంస్థలు మాత్రం ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదు. తాజాగా... సోమవారం మాదాపూర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు, ఒక సైట్ ఇంజినీర్ గాయపడ్డాడు. మరో ఇద్దరు కూలీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు... మాదాపూర్ కాకతీయహిల్స్లో రెండు వేల చదరపు గజాల స్థలాన్ని అయ్యన్న ఇన్ఫ్రా ప్లాటినా కన్స్ట్రక్షన్ సంస్థ డెవలప్మెంట్కు తీసుకుంది. సెల్లార్, స్టిల్ ప్లస్ ఐదు అంతస్తులు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందింది. ఇప్పటికే సెల్లార్ శ్లాబ్ వేశారు. సోమవారం తెల్లవారుజామున 2వ శ్లాబ్ వేస్తున్నారు. కాంక్రీట్ను చదును చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్తో పాటు పిల్లర్ నెలకొరిగాయి. దీంతో శ్లాబ్పై ఉన్న నలుగురు కూలీల్లో వెంకట్రెడ్డి(25), అప్పన్న(35) అనే ఇద్దరు పక్కకు దూకడంతో స్వల్ప గాయాలయ్యాయి. జూనియర్ ఇంజినీర్ సునీల్(26) శ్లాబ్పై నుంచి జారీ పడటంతో గాయపడ్డాడు. వెంకట్రెడ్డి, అప్పన్నలు మాదాపూర్లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వెంటనే డిశ్చార్జి అయ్యారు. క్షతగాత్రులను వెస్ట్ జోనల్ కమిషనర్ బీబీ గంగాధర్ రెడ్డి, ఉప కమిషనర్ మమత పరామర్శించారు. కాగా, ఈ ప్రమాదంలో బిల్డర్పై ఐపీసీ 237 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వూదాపూర్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
కిరికిరి
‘డిజిటల్ కీ’ వ్యవహారం కమిషనర్, ఎస్ఐలకు అందని ‘కీ’ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం దరఖాస్తుదారుల ఇబ్బందులు జిల్లాలోని పలు ఠాణాల్లో ఇదే సమస్య జోగిపేట: పోలీసు, మున్సిపల్ శాఖలకు డిజిటల్ కీ తలనొప్పులు పట్టుకున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ‘కీ’ పర్మిషన్ రాకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఫలితంగా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్టిఫికెట్లు, సెల్ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, టైటిల్ డీడ్ మిస్ అయితే.. వాటిని పొందాలంటే అవస్థలు పడాల్సిందే. ‘కీ’లేక కుదరని ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటేఽ, వాటిని మండల పరిధిలోని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వారంలో వాటిని జారీ చేయాల్సి ఉంటుంది. జోగిపేట ఎస్సైగా టి.శ్రీధర్ గత నెల 15వ తేదిన బాధ్యతలు చేపట్టారు. డిజిటల్ కీ కోసం ఆయన అర్జీ పెట్టుకున్నా ఇప్పటి వరకు రాలేదు. జోగిపేట సర్కిల్ పరిధిలోని పెద్దశంకరంపేట పోలీసుస్టేషన్కు కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైది కూడా ఇదే పరిస్థితి. గత నెలలో బదిలీ అయిన చాలా మంది ఎస్సైలకు ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. నగర పంచాయతీలో... నగర పంచాయతీ ద్వారా పొందే సర్టిపికెట్లన్నీ ముఖ్యమైనవే. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో నాన్అవెయ్లెబులిటీ సర్టిఫికెట్, వాటిల్లో మార్పులుచేర్పులు నగర పంచాయతీ ద్వారానే డిజిటల్ కీ ద్వారా ధ్రువీకరిస్తారు. విదేశాలకు వెళ్లేవారికి తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ అవసరం. ఇలాంటి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు పత్రాలు సకాలంలో జారీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జూలై 12వ తేదిన కమిషనర్గా ఉన్న రవీందర్రావును పలు కారణాలతో కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా ఆర్వీఎం పీఓ యాశ్మిన్భాషకు ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు గత నెల 29న రాష్ర్ట మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 4వ ఆమె బాధ్యతలు చేపట్టినా డిజిటల్ కీ అనుమతి రాకపోవడంతో అనేక సర్టిఫికెట్లు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. సర్టిఫికెట్ కోసం 15 రోజులుగా తిరుగుతున్నా.. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పోయిందని జూలై 23న జోగిపేట మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు సర్టిఫికెట్ రాలేదు. ఇదే విషయం ఎస్సైని అడిగితే డిజిటల్ కీ లేదని, కాబట్టి సర్టిఫికెట్ ధ్రువీకరించలేదని చెప్పారు. ఇంకా నెల పడుతుందన్నారు. - పొట్టిగల్ల కృష్ణ, డాకూర్ గ్రామం -
'ఈ ఏడాది కొత్త మద్యం షాపులుండవ్'
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఈ ఏడాది కొత్తగా మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఉన్నటువంటి మద్యం షాపుల విషయంలోనూ స్థానికంగా ఉన్న మొహల్లా సభ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్.. మొహల్లా సభలో స్థానికంగా మద్యం షాపు ఉండకూడదని తీర్మానం చేస్తే దానిని వేరే చోటుకి తరలిస్తామని వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కనీస వేతనాలను పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేజ్రీవాల్ అన్నారు. అంబానీ, అదానీల వద్ద కాకుండా.. పేద, మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బుంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందన్నారు. -
హైవే దుకాణాలకు ఊరట
మంత్రిని కలిసిన బాధితులు దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతి నాదెండ్ల: గణపవరం జాతీయ రహదారి సర్వీసు రోడ్డు వెంబడి ఉన్న దుకాణాల యజమానులకు ఊరట కలిగింది. ఇటీవల ఈ సెంటర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతుపడిన నేపథ్యంలో నేషనల్ హైవే అధారిటీ అధికారులు, రవాణాశాఖ, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించి రోడ్డు వెంబడి సర్వీసు రోడ్డులో దుకాణాలు ఉన్నందునే ప్రమాదాలు జరుగుతున్నాయని, దుకాణాలు తొలగించాల్సిందేనని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ కె.చంద్రశేఖర్ మంగళవారం ఆ ప్రదేశానికి వెళ్లి దుకాణాలను తొలగించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. దీంతో దిక్కుతోచని దుకాణదారులు 25 మంది బుధవారం వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా రోడ్డు వెంబడి దుకాణాలు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నామని, ఇప్పటికిప్పుడు దుకాణాలు తొలగిస్తే తమ గతేం కావాలని వాపోయారు. దీంతో మంత్రి రూరల్ సీఐ శోభన్బాబుతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా, దుకాణదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దుకాణదారులు సీఐ శోభన్బాబును కలవగా, తాను మార్కింగ్ చేసిన ప్రదేశంలో మాత్రమే దుకాణాలు నడుపుకోవాలని, గురువారం ప్రదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు. దుకాణాల ముందు వైపున్న పందిళ్లు, రేకులను తొలగించాలని ఆదేశించారు. -
‘అనుమతితోనే మైనింగ్ పనులు’
పెబ్బేరు: మండల పరిధిలోని వైశాఖాపూర్ పెద్దగుట్ట మైనింగ్ కు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని ఎస్వీఆర్ మినరల్స్ కంపెని యజమాని పద్మారావు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దగుట్ట మైనింగ్ వ్యవహారం పై వైశాఖాపూర్ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కేçసువేసినా కోర్టులో అన్ని అనుమతులు అందజేయడంతో కోర్టు కేసును కొట్టేసిందన్నారు.మైనింగ్ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని గ్రామస్తులు మైనింగ్ ఏడీ కి లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారన్నారు. కాని కొందరు గ్రామస్తులు మాత్రమే తప్పుడు ఆరోపణలతో అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.మైనింగ్ వద్ద మృతి చెందిన బాలుడు ప్రశాంత్ తల్లిదండ్రులు చిన్నఓబులేష్, లక్ష్మిదేవమ్మ లు మాట్లాడుతూ తన కుమారుడికి అనారోగ్యంతోనే మృతి చెందాడని తెలిపారు. బ్లాస్టింగ్ వల్ల మృతి చెందినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. -
‘అడ్డదారి’ అనుమతి
ఇసుక రవాణాలో అక్రమాలు లబ్ధిదాలరుల పేరుతో వ్యాపారుల దోపిడీ అధికారులపై మండిపడుతున్న ప్రజలు మునుగోడు: అక్రమ ఇసుక రవాణాపై పోలీస్లు, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపడంతో గహ నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమార్కులను అరికట్టాలని అధికారులు చర్యలు చేపట్టగా.. అసలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు కొంత సడలింపు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని ఇసుక వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు అధికారులతో చేతులు కలిపి యధేచ్ఛగా ఇసుక రవాణ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారంలో రెండు రోజులు... మండలంలోని మునుగోడు, చీకటిమామిడి, కొరటికల్, ఇప్పర్తి తదితర గ్రామాల నుంచిlఇసుక రవాణా చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతి సోమ, గురువారాల్లో అనుమతులు ఇస్తున్నారు. అయితే ఇసుక అవసరమైన ఇంటి యజమాని దరఖాస్తు రాసుకొని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శితో ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నట్లు ధ్రువీకరణ పొంది తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. దానిని పరిశీలించి ఆయన టైంమ్తో కూడిన అనుమతి ఇస్తారు. అయితే దానిని ఆసరాగా చేసుకున్నlకొంతమంది వ్యాపారులు సంబంధిత మండల అధికారిని మచ్చిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బినామీ వ్యక్తుల పేర్ల మీద దరఖాస్తు చేసుకొని ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే అనుమతులు పొందుతున్నారు. అలా అడ్డదారిలో అనుమతులు ఇచ్చినందుకు సదరు అధికారికి ఒక్కోSట్రాక్టర్ యజమాని రూ.750 చొప్పున ముడుపులు ఇస్తున్నారని సమాచారం. ఇలా అనుమతులు పొందినవారు వాగుల నుంచి ఇసుకను ఎత్తుకొని పరిసర మండలాలైనా చిట్యాల, నారాయణపురం, నార్కట్పల్లి మండలాలకు తరలించి ఒక్కో ట్రిప్పు రూ.3500 నుంచి రూ.4 వేల వరకు విక్రయింస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిజమైన లబ్ధిదారులు ఇసుక అనుమతి కావాలని దరఖాస్తు చేసుకుంటే సదరు అధికారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతులు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాక డబ్బులు ఇవ్వని ట్రాక్టర్ యజమానులపై వాల్టా చట్టం కేసులను నమోదు చేస్తున్నాడని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యాపారులకు అండగా నిలిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. డబ్బులు ఇచ్చినవారికేSఅనుమతులు – సురిగి చలపతి, సీపీఐ మండల కార్యదర్శి ఇసుక అవసరం ఉందా లేదా అనేది కాదు. తమకు డబ్బులు ఎవ్వరూ ఇస్తే వారికే రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా అనుమతులకు వెళ్లినవారిపై అధికారి మండిపడుతూ రోజుల తరబడి తిప్పుతున్నారు. ఈ రకంగా కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతులు దక్కుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే ఆందోళనలు చేపడుతాం. ఆరోపణల్లో నిజం లేదు –వై.శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ అక్రమ వ్యాపారులను ప్రొత్సహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. లబ్ధిదారులు ఆ గ్రామ కార్యదర్శితో ధ్రువీకరణ పత్రం తీసుకోని వస్తేనే అనుమతులు ఇస్తున్నాం. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని జరిమానాలు విధిస్తున్నాం. ఇకా నుంచి ఇంటి యజమానితో పాటు ఆ గ్రామ వీఆర్ఏను వెంట ఉంచి రవాణా చేసేలా ఆదేశిస్తాం. -
200 ఎంబీబీఎస్ సీట్లు కొనసాగింపునకు ఓకే
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో 200 ఎంబీబీఎస్ సీట్లు కొనసాగింపునకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి వచ్చింది. గుంటూరు వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ప్రభుత్వం 2013లో రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు వైద్య కళాశాలతోపాటు పలు వైద్య కళాశాలలకు 50 సీట్లు అదనంగా కేటాయించింది. అదనంగా కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లకు వసతులు కల్పించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండటంతో అదనపు సీట్లకు కోత విధించేందుకు ఎంసీఐ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి గుంటూరు వైద్య కళాశాలలో 200 సీట్లను కొనసాగించేలా అనుమతి పొందింది. -
రాప్తాడు ధర్నాకు పోలీసులు నో
రాప్తాడు(అనంతపురం): కర్నూలులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా రాప్తాడు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తుండగా రాప్తాడులో మాత్రం పోలీసులు అనుమతించక పోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ముస్లిం మహిళలకు కఠిన నిబంధనలు!
ముస్లిం మతాచారాలు కట్టుబాట్లలో ఇప్పటికే మహిళలకు ఎన్నో నిబంధనలు ఉన్నాయి. బ్రిటన్ లోని ఓ మసీదు తాజాగా మరిన్ని నిబంధనలు విధించింది. భర్త అనుమతి లేకుండా ముస్లిం మహిళలు ప్యాంట్లు వేసుకోకూడదని, సామాజిక మాధ్యమాలు వాడకూడదని, ఒంటరిగా ఇంటినుంచి బయటకు వెళ్ళకూడదంటూ కఠిన నిబంధనలు జారీ చేసింది. టైమ్స్ పరిశోధన నివేదికలో తాజాగా.. విస్మయపరిచే ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటన్ లోని ముస్లిం సంఘాలు, మసీదులు ప్రచురించిన నిబంధనలను 'ద టైమ్స్' ఓ నివేదికలో ప్రస్తావించింది. లండన్ ఇస్లామిక్ సెంటర్, క్రోయ్ డాన్ మసీదు, సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్ కొత్త నిబంధనలు జారీ చేసినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం ఆ దేశంలో భర్త అనుమతి లేకుండా ఇంటినుంచి మహిళలు బయటకు రావడం ఎంతో ప్రమాదకరమని, అలాగే భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయొద్దని సూచించింది. ముఖ్యంగా మహిళలు ప్యాంట్లు ధరించకూడదని, ఫేస్ బుక్ వాడకూడదని, ఒక వేళ ఇప్పటికే అకౌంట్లు ఉన్నవారు వెంటనే డిలీట్ చేసేయాలని తెలిపింది. సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్.. డేంజర్స్ ఆఫ్ ఫేస్ బుక్ తన వెబ్ పోస్టులో మద్యపానం పాపం అనే ఖురాన్ సూక్తిని ప్రస్తావిస్తూ, ఇది మహిళలు సామాజిక మాధ్యమాల వినియోగానికి వర్తింస్తుందని, దీని ద్వారా ముస్లిం మహిళలు బలవుతున్నారని వివరించింది. అంతేకాక ముస్లిం మహిళలు మోడలింగ్, యాక్టింగ్ చేయడంతో పాటు, గర్భస్రావం చేయించుకోవడం కూడ అనైతిక చర్య అని, అది మహాపాపం అంటూ మరో పోస్టులో ప్రస్తావించింది. అయితే మసీదులు, ఇస్లామిక్ సంఘాలు వెబ్ సైట్లో జారీ చేసిన నిబంధనలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అనంతరం ముస్లిం మతపెద్ద, క్రాయ్డాన్ అండ్ ఇస్లామిక్ సెంటర్ ట్రస్టీ షుహైబ్ యూసఫ్ మాత్రం ఈ ఆంక్షలు తప్పని అంగీకరించారు. వెబ్ సైట్ లింక్ ను వెంటనే తొలగించామని, సాహిత్యాత్మక తప్పిదాలు జరిగినట్లు అభిప్రాయపడ్డారు. సైట్ లో రాసిన వివరాలను శుద్ధీకరించి, ప్రభావవంతమైన కథనాలను ప్రచురించాలని సూచించారు. అయితే ముస్లిం సంఘాల నిబంధనలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలు ఆధునిక యుగంలోనూ వ్యక్తుల సంకుచిత ధోరణికి అద్దం పడుతున్నాయంటూ ఆరోపిస్తున్నాయి. -
విద్యుత్ బాదుడుకు ఈఆర్సీ ఒకే
► రూ.1400 కోట్ల చార్జీల పెంపునకు సమ్మతి ► సర్కారుకు చేరిన కొత్త టారిఫ్ ► పాలేరు ఉప ఎన్నిక తర్వాత పెంపు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్త టారిఫ్ ఉత్తర్వులను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సిద్ధం చేసి ప్రభుత్వ అభిప్రాయం కోసం ఇంధన శాఖకు పంపింది. రూ.1,958 కోట్ల చార్జీల పెంపు కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈఆర్సీకి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లను సమర్పించడం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ అనంతరం స్వల్ప మార్పులతో కొత్త టారిఫ్ను ఈఆర్సీ ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చార్జీల పెంపు భారాన్ని దాదాపు రూ.1,400 కోట్లకు తగ్గించినట్టు సమాచారం. ఈ కొత్త టారిఫ్ ప్రతిపాదనలపై ప్రభుత్వం తీవ్రంగా తర్జనభర్జన పడుతోంది. ట్రాన్స్కో, డిస్కంల సీఎండీలు డి.ప్రభాకర్రావు, జి.రఘుమారెడ్డిలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించి టారిఫ్పై చర్చించినట్టు తెలిసింది. టారిఫ్లో కొన్ని మార్పుచేర్పులు సూచించాలని ప్రభుత్వం భావిస్తోంది. మే 16న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నందున కరెంటు చార్జీల పెంపును అప్పటిదాకా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. డిస్కంలు నిబంధనల మేరకు గత నవంబర్లోపే చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తే ఈ నెల 1 నుంచే పెంపు అమల్లోకి వచ్చేది. కానీ వరుసగా వరంగల్ లోక్సభ, నారాయణ్ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పురపాలికల ఎన్నికలు రావడంతో డిస్కంలు తమ ప్రతిపాదనలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. ఎన్నికల ఫలితాలపై చార్జీల పెంపు ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వరుసగా వాయిదాలను కోరగా ఈఆర్సీ కూడా అంగీకరించింది. పై ఎన్నికలు ముగిశాక మార్చిలో డిస్కంలు రూ.1,958 కోట్ల మేరకు చార్జీల పెంపును ప్రతిపాదించాయి. ఈ నెల 23న కొత్త టారీఫ్ను ఈఆర్సీ ప్రకటిస్తుందని, మే 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని భావించాయి. కానీ పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో చార్జీల పెంపుపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆ ఎన్నిక ముగిశాక మే మూడో వారంలో ఈఆర్సీ నుంచి కొత్త టారిఫ్ ఉత్తర్వులు వస్తాయని, జూన్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
కన్హయ్యకు నో ఎంట్రీ
హైదరాబాద్: జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కు హెచ్సీయూ అధికారులు వర్సిటీలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. బుధవారం ఆయన హైదరాబాద్ రానున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు’లో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన తర్వాత నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్సీయూలో సభ జరిపేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అనుమతించకున్నా సభ జరిపి తీరుతామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
అద్దె బస్సులకు ఏపీ సర్కార్ రైట్..రైట్
-
శిక్షణకు అనుమతి తప్పదు
ట్యుటోరియల్, కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలంటే అందుకు సంబంధించి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవడం తప్పనిసరైంది. ప్రత్యేక శిక్షణతోనే ఉద్యోగాలు వస్తాయనే ధీమా యువతలోనూ బలంగా నాటుకుంది. ఈ పరిస్థితిని అదనుగా చేసుకున్న కొందరు.. ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్ను తెరిచేస్తున్నారు. వీటి ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తున్నారు. అధికమొత్తంలో ఫీజులు వసూలు చేయడంపై విద్యాశాఖకు ఫిర్యాదులు సైతం వస్తున్నాయి . ఈ క్రమంలో అడ్డగోలు వసూళ్లకు కళ్లెం వేయడంతోపాటు ఆయా సంస్థల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి కోచింగ్ సెంటర్, ట్యుటోరియల్ ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న వాటికి సంబంధించి యాజమాన్యాలు కూడా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులు కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్కు సంబంధించి అనుమతి కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు కేటగిరీల వారీగా ఫీజును సైతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి ఉన్న వాటిల్లోనే ప్రవేశాలు చేయాలనే నిబంధనను సైతం కచ్చితం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమికంగా కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్పై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో బ్యాచ్లు నిర్వహిస్తూ పరపతి సాధించిన సంస్థల కేటగిరీలో 323 సంస్థలున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే చిన్నా, చితకా అన్నీ కలుపుకుంటే వేల సంఖ్యలో ఉంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఇకపై ప్రభుత్వ అనుమతితోనే కొనసాగించాల్సిందేనని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ‘సాక్షి’తో అన్నారు. -
పీటర్కు లై డిటెక్షన్ పరీక్షకు అనుమతి
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులు శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు. ఆయనకు నవంబర్ 30న ఈ పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు సన్ని హిత వర్గాలు చెబుతున్నాయి. పీటర్ ముఖర్జియాను షీనా బోరా హత్య కేసులో గత వారం రోజుల కిందటే సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇప్పటికే పలుమార్లు ఈ కేసుకు సంబంధించి కోర్టు అనుమతితో ప్రశ్నించినా సరైన విధంగా సమాధానాలు చెప్పకపోవడంతోపాటు విచారణకు సహకరించని నేపధ్యంలో ఆయనకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి ఆమేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
ఆందోళన బేఖాతరు.. బాక్సైట్ తవ్వకాలకు ఓకే
-
ఆందోళన బేఖాతరు.. బాక్సైట్ తవ్వకాలకు ఓకే
విశాఖపట్నం: ఆందోళనలు, నిరసనలు పట్టించుకోకుండా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మైనింగ్కు అనుమతిస్తూ జీవో నంబర్.97ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. దీని ప్రకారం నర్సీపట్నంలోని రిజర్వ్ ఫారెస్ట్ డివిజన్లోని 1212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఏపీఎండీసీకి మైనింగ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి మైనింగ్ కార్యక్రమాలు జరపాలని ఇందులో పేర్కొంది. దీంతోపాటు గిరిజనులు అధికంగా ఉండే చితపల్లి, జర్రెల అటవీ ప్రాంతంలో కూడా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు అక్కడ ఉన్న గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. చాలా ఏళ్లుగా ఇక్కడ బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిని పట్టించుకోకుండా తాజాగా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, గిరిజన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో ఎదురు చూడాల్సిందే. -
ఎమ్మార్పీఎస్ సభకు దొరకని అనుమతి
రాజధాని ప్రాంతంలో తలపెట్టిన ఎమ్మార్పీఎస్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ చేసేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సిద్దమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు మోహరించారు.కాగా.. ఏపీ రాజధాని ప్రాంతంలో దళితులకు జీవన భద్రత కల్పించాలంటూ ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. -
దుబాయ్కి సల్మాన్.. కోర్టు ఓకే
-
దుబాయ్కి సల్మాన్.. కోర్టు ఓకే
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ పరిస్థితి అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఉంది. ఈ కండల వీరుడికి దుబాయ్ వెళ్లేందుకు అనుమతి మంజూరుచేస్తూ ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ సంబరాల్లో మునిగితేలుతున్నాడు. విదేశీ ప్రయాణానికి అనుమతిని కోరుతూ మే 21న సల్మాన్ ఖాన్ పెట్టుకున్న అర్జీకి ముంబై హైకోర్టు సానుకూలంగా స్పందించి, అనుమతిని మంజూరు చేసింది. కాగా హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి శిక్షపడిన అనంతరం అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదనే నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో మే 29న జరగనున్న షో కోసం దుబాయ్ వెళ్లడానికి అనుమతిని కోరుతూ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశాడు. అనూహ్యంగా బెయిల్ లభించడంతో ఈ దబాంగ్ హీరో తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పనిలో తలమునకలై ఉన్నాడు. -
నా పాటలను సొమ్ము చేసుకుంటున్నారు!
‘‘నా అనుమతి లేనిదే నా పాటలను వాడకూడదు’’ అని సంగీత జ్ఞాని ఇళయరాజా ఇప్పుడు కాదు.. ఎప్పట్నుంచో వాపోతున్నారు. అయినప్పటికీ రేడియో, టీవీ, అంతర్జాలం.. ఇలా ఎక్కడి పడితే అక్కడ ఆయన అనుమతి లేకుండా పాటలను వాడేసుకుంటున్నారు. లాభం లేదనుకుని, ఇళయరాజా ఆ మధ్య మద్రాస్ హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన విన్నపాన్ని పరిశీలించి, ఇళయరాజా అనుమతి లేకుండా పాటలను ఎవరూ వినియోగించకూడదంటూ న్యాయస్థానం ఓ ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వును కూడా చాలామంది ఖాతరు చేయడంలేదు. దాంతో తన పాటలను వాడుకుంటున్న రికార్డింగ్ కంపెనీలను, రేడియో స్టేషన్లను, ఆన్లైన్ పైరసీని అడ్డుకోవడానికి అభిమానుల ద్వారా ఇళయరాజా చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్ఐలకు లేఖ రాశారు. ‘‘నా పాటలను తస్కరిస్తున్నారు. నా అనుమతి లేకుండా సొమ్ము చేసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఇళయరాజా కోరారు. ఇప్పుడైనా రాజాగారికి ఫలితం కనిపిస్తుందో? లేదో? -
'ఆత్మహత్యే శరణ్యం...అనుమతివ్వండి'
పంజగుట్ట (హైదరాబాద్) : 'ఓ వ్యక్తి మోసంతో ఆర్థికంగా చితికిపోయాం... చనిపోయేందుకు అనుమతివ్వండి' అని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది ఓ కుటుంబం. బాధితుడి కుటుంబం బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ నివాసి మునీర్ ఖాన్ ఇళ్లకు సీలింగ్ వేసే పనులు చేస్తుంటాడు. ఇతడు రెడ్హిల్స్లోని న్యూడెక్కన్ ట్రావెల్స్ ద్వారా 12 మందిని మక్కా యాత్రకు పంపేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం 12 మంది నుంచి రూ.70 వేలు చొప్పున వసూలు చేశాడు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం రూ.8.23 లక్షలను ట్రావెల్స్ యజమాని మహ్మద్ సయీద్ ఖాన్కు అందించాడు. అయితే అతడు 12 మందికి గాను ఏడుగురినే మక్కాకు తీసుకెళ్లాడు. మిగతావారి విషయం అడిగితే మహ్మద్ సయీద్ఖాన్ ముఖం చాటేశాడు. ఆ ఐదుగురూ తమ ఇంటికి వచ్చి నిత్యం గొడవ పడుతుండటంతో తట్టుకోలేక ఉన్నదంతా ఊడ్చి వారికివ్వాల్సిన రూ.4.42 లక్షలను చెల్లించాడు. ప్రస్తుతం తన వద్ద ఇంటి అద్దెకు కూడా డబ్బు లేదని, ఈ నెల 16న జరగాల్సిన తన కూతురి వివాహం కూడా ఆగిపోయిందని, పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టలేక చదువులు మధ్యలో ఆగాయని బాధితుడు చెప్పాడు. ఇక తమకు చావు తప్ప మరే మార్గం లేదని అన్నాడు. తమ వద్ద డబ్బు తీసుకున్న న్యూడెక్కన్ ట్రావెల్స్ యజమాని మహ్మద్ సయీద్ కార్యాలయం మూసుకున్నాడని, ఇదే విషయమై ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తే తన కుటుంబంలోని తొమ్మిదిమంది ఆత్మహత్య చేసుకుంటామన్నారు. తమ ఆత్మహత్యలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే రాష్టపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాసినట్లు వారు వెల్లడించారు. -
జగన్ పర్యటనకు అనుమతి
వరంగల్ క్రైం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించి పోలీసు శాఖ నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం విదితమే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 12న జగన్ జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆ పార్టీ నేతలు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, మునిగాల విలియమ్స్, మునిగాల కల్యాణ్రాజ్, ఎర్రంరెడ్డి మహిపాల్రెడ్డి, అప్పం కిషన్ వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ఝాను కలిసి అనుమతి తీసుకున్నారు. -
ఫాంహౌస్లపై పోలీసుల దాడి, పలువురి అరెస్ట్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పలు ఫాంహౌస్లపై పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా మద్యం, హుక్కాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని అమ్దాపూర్లోని మల్లేష్యాదవ్ ఓ ఫాంహౌస్పై దాడి చేసిన పోలీసులు...అనుమతి లేకుండా ఫాంహౌస్లో విందు ఏర్పాటు చేసినవారిపై కేసు నమోదు చేసి 20మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఈ ఫాంహౌస్పై పోలీసులు దాడి చేసి సుమారు 40మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పలు ఫాంహౌస్ల్లో పేకాడుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్దికాలంగా నగర శివార్లలో ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారటంతో పాటు, రేవ్ పార్టీలు జోరుగా సాగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. -
అనుమతి లేకుండా ఫాంహౌస్లో విందు
మొయినాబాద్: అనుమతి లేకుండా ఫాంహౌస్లో విం దు ఏర్పాటు చేసినవారిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థులు దశరథ్, సుధీర్లు కళాశాలలోని విద్యార్థులతో కలిసి పార్టీ(విందు) ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. కళాశాలలోని 40 మంది విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్ రెవెన్యూలో ఉన్న మల్లేష్యాదవ్ ఫాంహౌస్లో విందు ఏర్పాటు చేసేందుకు రూ.30 వేలకు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం విందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థులంతా ఫాంహౌస్కు చేరుకున్నారు. విందు విషయం తెలుసుకున్న సీఐ రవిచంద్ర సిబ్బందితో కలిసి ఫాంహౌస్పై దాడి చేశారు. మొత్తం 40 మంది విద్యార్థుల్లో పది మంది అమ్మాయిలు ఉన్నారు. 8 కార్టన్ల బీరు బాటిళ్లు, 6 హుక్క బాటిళ్లు, డీజేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన విద్యార్థులు దశరథ్, సుధీర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఫాంహౌస్ యజమాని మల్లేష్యాదవ్, సూపర్వైజర్ శ్రీనివాస్యాదవ్లపైనా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కొత్త సంవత్సరం స్వాగతం సందర్భంగా అనుమతులు లేకుండా విందులు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈసందర్భంగా సీఐ హెచ్చరించారు. -
డబ్బులున్నాయా.. అనుమతులు వచ్చేస్తాయిలే..!
-
వీహెచ్ కు చేదు అనుభవం
హైదరాబాద్: గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వి. హనుమంతరావు(వీహెచ్)కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా వేదికపైకి పంపడానికి పోలీసులు నిరాకరించారు. ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్ కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్ కు అనుమతించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్న ఇంటర్ బోర్డు తొలిసారిగా ఈ పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన అమలు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1 పరీక్షతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. నిమిషం నిబంధన అమలు చేయడం ఈసారి ఇంటర్ పరీక్షల ప్రత్యేకత. ఎంసెట్ తరహాలో ఇంటర్ బోర్డు కూడా మొదటిసారిగా నిమిషం నిబంధనను అమల్లోకి తెచ్చింది. అంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థులను ఉదయం 8:30 గంటలనుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పడొద్దని స్పష్టం చేసింది. గతంలో పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతించేవారు. ఈసారి అలా కుదరదు. అరగంట ముందుగానే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్నందున ఆ వెసులుబాటును తొలగించినట్లు బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థుల్ని సాధారణంగా 8:45 గంటలవరకు పరీక్ష హాల్లోకి పంపుతారు. అయితే 8:45 గంటల నుంచి 9 గంటల వరకూ అనుమతిస్తారు. అయితే ఆలస్యానికి గల కారణాల్ని విద్యార్థులు రాతపూర్వకంగా తెలపాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 19.78 లక్షలమంది హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పేర్లు, మీడియం, పరీక్ష రాసే సబ్జెక్టు వివరాలు, హాల్టికెట్లో ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యార్థులు సంతకాలు చేసేముందు ఓఎంఆర్ బార్కోడ్ షీట్పైనా రిజిస్టర్ నంబరు, పేర్లు, సబ్జెక్టు వివరాలను చూసుకోవాలి. కొత్త సిలబస్, పాత సిలబస్ వివరాలను సరిచూసుకోవాలి. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రం లోకి సెల్ఫోన్లు తేరాదు. సెల్ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి ఉన్న డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరిం టెండెంట్ల ఫోన్లపై ట్యాపింగ్ తరహా నిఘా ఉంటుంది. పరీక్షలపై సీఎస్ సమీక్ష: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం సెకండరీవిద్య ముఖ్య కార్యదర్శి(ఇన్చార్జి) పూనం మాల కొండయ్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్శంకర్ నాయక్లతో సమీక్షించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేం దుకవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నరేంద్ర మోడీ హెలీకాప్టర్కు అనుమతి నిరాకరణ
కోల్కతా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రయాణించే హెలీకాప్టర్ను ల్యాండ్ చేయడానికి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. కోల్కతాలో బుధవారం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ ర్యాలీలో మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం రేస్ కోర్సు గ్రౌండ్లో మోడీ హెలీకాప్టర్ను ల్యాండ్ చేయడానికి అనుమతివ్వాలంటూ బీజేపీ నేతలు ఆర్మీని కోరారు. ఈ గ్రౌండ్ ఆర్మీ పరిధిలో ఉంది. అయితే మోడీ హెలీకాప్టర్ను ల్యాండ్ చేయడానికి ఆర్మీ అనుమతి నిరాకరించింది. దీని వెనుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఆరోపించారు. ఈ విషయం రెండు మూడు రోజులు ముందే చెబినట్టయితే తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవారమని అన్నారు. -
ఏపీఎన్జీవోల ధర్నాకు షరతులతో అనుమతి
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు హైదరాబాద్లో నిర్వహించదలచిన ధర్నాకు షరతులతో కూడిన అనుమతి లభించింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ముగించాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. పదివేలకు మించి ధర్నాకు రాకూడదని, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ధర్నాను ఇందిరాపార్క్కు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. -
ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వొద్దు
చెన్నూర్, న్యూస్లైన్ : చెన్నూర్, కోటపల్లి మండలాల్లో అధికారులు ఇసుక రవాణాకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇకపై అనుమతి ఇవ్వొద్దని రైతులు చెన్నూర్ తహశీల్దార్ వీరన్న, వీఆర్వో జామీరుద్దీన్ను ఘోరావ్ చేశారు. పట్టణంలోని గోదావరి నది సమీపంలో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే నల్లాలు ఓదేలు చేపట్టిన మహాధర్నా శిబి రాన్ని సందర్శించడానికి బుధవారం తహశీల్దార్ వచ్చా రు. ఈ సందర్భంగా ఆయనను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డి, సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. రోజూ వందలాది లారీలు ఈ ప్రాంతం నుంచి వెళ్లడం ద్వారా చేలపై దుమ్ముధూళి చేరి దెబ్బతిన్నాయని తెలిపారు. దిగుబడి రాక నష్టాల పాలయ్యూమని ఆవేదన వ్యక్తంచేశారు. దెబ్బతిన్న పంటలకు కాంట్రాక్టర్లు పరిహారం చెల్లించేలా చూడాలని, ఇసుక రవాణాకు అనుమతి రద్దు చేయూలని డిమాండ్ చేశారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తహశీల్దార్ పేర్కొన్నారు. ఆయన వెంట డెప్యూటీ తహశీల్దార్ శేఖర్ ఉన్నారు. రెండో రోజుకు మహాధర్నా.. ఇసుక లారీల రాకపోకలతో రోడ్డు పక్కనున్న పంటలు దెబ్బతింటున్నాయని, ఆయూ రైతులకు పరిహారం అందించాలని ఎమ్మెల్యే నల్లాల ఓదేలు చేపట్టిన మహాధర్నా బుధవారం రెండో రోజుకు చేరింది. కాంట్రాక్టర్లు రైతులకు పరిహారం చెల్లించే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఐదు వందల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, అధికారులు ఇసుక తరలింపునకు అనుమతి రద్దు చేయూలని కోరారు. దీక్షలో సర్పంచ్ ఎస్.కృష్ణ, టీఆర్ఎస్ చెన్నూర్, కోటపల్లి, మందమర్రి, జైపూర్ మండలాల నాయకులు దామోదర్రెడ్డి, రాజిరెడ్డి, బాపురెడ్డి, జాడి తిరుపతి, చేకూర్తి సత్యనారాయణరెడ్డి, గద్దల హన్మంతు, ప్రభాకర్రెడ్డి, వెన్నపురెడ్డి బాపురెడ్డి, ఆయూబ్, కొండపర్తి వెంకటరాజం, మల్లికార్జున్ యాదవ్, వార్డు సభ్యులు సాలక్క, మల్లయ్య, రాజబాపు, టీఆర్ఎస్వీ నాయకులు ప్రభాకర్, సంతోష్ పాల్గొన్నారు. కొల్లూరు వద్ద రిలే దీక్షలు కోటపలి : కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలోని గోదావరి నది నుంచి ఇసుక తరలింపునకు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ త్రివేణి సంగమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం కొల్లూరు, బోరంపల్లి గ్రామస్తులు కొల్లూరు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గోదావరి నది నుంచి ఇసుక తరలింపు పేరిట కాంట్రాక్టర్లు జీవన విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇసుక తరలింపుతో కొల్లూరు, దేవులవాడ, రావులపల్లి, బోరంపల్లి తదితర నదీ తీర ప్రాంతాలకు భవిష్యత్తులో తాగు, సాగునీరు లభించని పరిస్థితి ఏర్పడనుందని ఆందోళన వ్యక్తంచేశారు. బోరంపల్లి గోదావరి వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం వృథాగా మారనుందని పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్షలో గ్రామస్తులు సోదారి మొగిలి, దుర్గం కృష్ణదాస్, జుమిడి పోచం, పోచం, కామెర రాజలింగు తదితరులు పాల్గొన్నారు. -
మమత, అఖిలేష్ లను కలవనున్న జగన్
-
అడ్డదారి
భైంసా, న్యూస్లైన్ : మన రాష్ట్రానికి చెందిన తెల్ల బంగారాన్ని కొంత మంది వ్యాపారులు, దళారులు గుజరాత్, మహారాష్ట్రకు అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. రోజూ వందల సంఖ్యలో లారీల్లో తీసుకెళ్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో పత్తి కొనుగోలు చేసి.. ఆ పత్తిని యథేచ్ఛగా అక్రమంగా ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. దీంతో మన ప్రభుత్వానికి రావాల్సిన ఐదు శాతం వ్యాట్, ఒక శాతం సెస్ కోల్పోవాల్సి వస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన మధ్య దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆరంభమైన పత్తి సీజన్లో వీరి దూకుడును అడ్డుకోకపోతే రోజూ కోట్ల రూపాయల పన్నులను ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. కలెక్టర్ ఆదేశాలతో... ఆదిలాబాద్ కలెక్టర్ అహ్మద్బాబు పత్తి కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగాా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు యార్డులకు, రోడ్లపై కనిపించే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 29 రాత్రి కుభీర్ మండలం మాలేగాం మార్గం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ఆరు పత్తి లారీలను ఎస్సై తోట సంజీవ్ పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గత నెల 31న తానూరు మండల బెల్తరోడ గ్రామం వద్ద రెండు సోయా లారీలతోపాటు ఒక పత్తి లారీని ఎస్సై మసూద్ పట్టుకున్నారు. భైంసా పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు దాటి 61వ జాతీయ రహదారి నుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్తున్నాయంటే అధికారుల పనితీరు స్పష్టమవుతోంది. జాతీయ రహదారిపైనే అనుమతులు లేకుండా పత్తి లారీలు వెళ్తున్నాయంటే అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ముథోల్ నియోజకవర్గంలో పోలీసులు పత్తి లారీలను పట్టుకోవడంతో తేరుకున్న చెక్పోస్టు అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో రోజూ వందకుపైగా లారీలు చెక్పోస్టుపై కనిపిస్తున్నాయి. కలెక్టర్ పకడ్బందీ ఆదేశాలు అమలు చేసే కోణంలో కొంత మేర తేరుకున్న అధికారులు పత్తి లారీలపై పన్నులు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అడ్డదారుల్లో మాత్రం నిత్యం లారీలు తరలుతూనే ఉన్నాయి. వాటిపైనా దృష్టి సారిస్తే మంచిదేమో. జీరోలో కొనుగోళ్లు... రైతుల వద్ద మధ్య దళారులు, వ్యాపారులు జీరోలో కొనుగోళ్లు చేసి అధికారులను మచ్చిక చేసుకుని పన్నులు చెల్లించకుండానే మహారాష్ట్రకు పత్తి లారీలను తరలిస్తున్నారు. మొన్నటి వరకు చక్కెర, బియ్యం, నిన్నటి వరకు సోయాతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు పాత ధోరణినే ఎంచుకున్నారు. పత్తిని అక్రమ మార్గంలోనే పక్కరాష్ట్రానికి చేరవేసి వ్యాపారులు మధ్య దళారులకు సహకరించి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఆలోచనవైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది సోయా కొనుగోళ్ల ఆధారంగా తీసుకుంటే జీరోలో పంటలను దళారులు పక్క రాష్ట్రాల్లోకి ఎలా తరలిస్తున్నారో స్పష్టం అవుతుంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో సోయా సాగైంది. అప్పటి ధరతో సుమారుగా రూ.2 కోట్లకుపైగా మార్కెట్ సెస్ రూపేనా ప్రభుత్వానికి రావాల్సి ఉండగా.. కేవలం రూ. 17.74 లక్షలే వచ్చింది. వందల లారీల్లో... ఒక్కో లారీలో 150 క్వింటాళ్ల మేర పత్తి రవాణా చేయొచ్చు. క్వింటాలు ధర రూ. 4,500 వేసుకున్నా మొత్తం విలువ రూ.6.75 లక్షలు. ఐదు శాతం వ్యాట్ కింద రూ.33,750, ఒక శాతం సెస్ కింద రూ.6,750. మొత్తంగా రూ. 40,500 ఒక్కో లారీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి. కానీ.. ఇవేమీ చెల్లించకుండా సరిహద్దులు దాటిస్తునానరు. పంట పండించిన రైతులకు మినహాయింపు ఉన్నా వ్యాపారులకు మాత్రం అది వర్తించదు. ఒక రైతు ఒకేసారి 150 క్వింటాళ్ల పత్తిని మార్కెట్కు తీసుకురావడం అసాధ్యం. మధ్య దళారులు రైతుల పేరు చెప్పి ప్రభుత్వానికి బురిడీ కొట్టిస్తున్నారు. భైంసా చెక్పోస్టు నుంచి కలెక్టర్ ఆదేశాల అనంతరం పత్రాల అనుమతితో 50 నుంచి 60 లారీలు వెళ్తున్నాయి. కాని అక్రమ మార్గంలో రోజూ వందల సంఖ్యలో లారీలు ఎలాంటి పత్రాలు లేకుండానే తరులుతున్నాయి. అధికారులు కూడా ఏమీ పట్టించుకోవడంలేదు. ఇష్టారాజ్యంగా.. ఒక రాష్ట్ర సరిహద్దు దాటి సరుకు రవాణా చేయాలంటే నిబంధనల మేరకు పన్నులు చెల్లించాలి. అన్ని పత్రాలు ఉన్న వారు నేరుగా చెక్పోస్టు నుంచి వెళ్లవచ్చు. కానీ.. కొంత మంది దళారులు అక్రమ మార్గాల గుండా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు, మధ్య దళారులు ఈ అక్రమ రాజమార్గాలను ఎంచుకుంటున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భైంసా, బాసర మార్గాల్లో మహారాష్ట్రకు చేరుకుంటున్నారు. బాసర వద్ద అటవీ శాఖ చెక్పోస్టు ఉండడంతో అక్కడి నుంచి బిద్రెల్లి మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్, నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లు మహారాష్ట్రకు సరిహద్దు కావడంతో ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ లారీలు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా, ఆదిలాబాద్ జిల్లా భైంసా వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఉన్నా వీటిని తప్పించేస్తున్నారు. చెక్పోస్టు లేని మార్గాల గుండా లారీలు పంపించేస్తున్నారు. తానూరు మండలం హిప్నెల్లి, కుభీర్ మండలం పల్సి, కుంటాల మండలం అంబుగాం ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు చేరుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని ఖండ్గాం నుంచి మహారాష్ట్రలోని కొండల్వాడికి చేరుకోవచ్చు. అదే జిల్లాలోని కందకుర్తి నుంచి దర్మాబాద్ చేరుకోవచ్చు. మద్నూర్ నుంచి దెగ్లూర్కు, బాన్సువాడ ప్రాంతంలోని పొతంగల్ నుంచి మంజీర వంతెన మీదుగా మహారాష్ట్రకు చేరుకోవచ్చు. ఈ అక్రమ మార్గాల్లో రోజు 500లకుపైగా పత్తి లారీలు వెళ్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన మన ప్రభుత్వం రోజుకు రూ. 4 కోట్ల మేర నష్టం చవిచూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు తేరుకుని రైతుల ముసుగులో మధ్య దళారులు, వ్యాపారులు సాగించే జీరో దందాను అక్రమమార్గాల్లో తరలించే లారీలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. -
అర్ధరాత్రి దాకా దుకాణాలు
సాక్షి, ముంబై: దీపావళి పర్వదినం పురస్కరించుకుని కొనుగోలుదార్ల సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు మేయర్ సునీల్ ప్రభు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇటు ముంబైకర్లతో పాటు దుకాణ యజమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గడియారంలోని ముల్లులాగా ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులు తీసే ముంబైకర్లకు పండుగలు వస్తే షాపింగ్ చేయడానికి సమయం దొరకదు. సాధారణంగా ముంబైలో రాత్రి తొమ్మిది గంటల వరకు షాపులన్నీ మూసివేస్తారు. రోడ్లపై అక్రమంగా వ్యాపారంచేసే హాకర్లు మినహా లెసైన్స్ షాపులన్ని బీఎంసీ నిర్ధేశించిన సమయానికే మూసివేస్తారు. కానీ ఉత్సవాల సమయంలో టపాకాయలు, మిఠాయి, దుస్తులు విక్రయించే షాపుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. అయినప్పటికీ బీఎంసీ సూచించిన సమయానికి షాపులు మూసివేయక తప్పడం లేదు. సమయం లేక కొనుగోలు చేయడానికి వచ్చిన నగరవాసులను ఖాళీ చేతులతో తిరిగి పంపిస్తున్నారు. విధులు ముగించుకుని షాపింగ్కు వచ్చిన ఉద్యోగులు వివిధ వస్తు సామగ్రిని కొనుగోలు చేయడానికి కొన్ని షాపుల బయట క్యూ కడుతుంటారు. కానీ సమయం మించిపోవడంతో మరుసటిరోజు రావాలని షాపు యజమానులు చెప్పి పంపిస్తుంటారు. వీటిని దృష్టిలో ఉంచుకుని దీపావళి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నట్లు ప్రభు ప్రకటించారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్తో ఫోన్లో సంప్రదించారు. షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడం వల్ల శాంతిభద్రతల ఇబ్బందులు తలెత్తుతాయా అనే దానిపై చర్చించారు.ఇందుకు సింగ్ సానుకూలంగా స్పందించారు. అన్ని పోలీసుస్టేషన్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఉత్సవాల సందర్భంగా అర్థరాత్రి వరకు షాపు తెరిచి ఉంచిన యజమానులపై ఎలాంటి చర్యల తీసుకోరాదని సింగ్ స్పష్టం చేశారు. స్వీట్లపై వెండి కాగితం నిషేధం: బీఎంసీ మిఠాయిలపై ఏర్పాటుచేసే పల్చని వెండి కాగితాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆరోగ్య శాఖ నిషేధించింది. అయితే కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు మిఠాయిలపై వెండి కాగితాన్ని ఏర్పాటు చేస్తున్న తయారీదారులకు ఈ నిర్ణయం రుచించడం లేదు. ఈ సన్నని కాగితాన్ని తినడంవల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్య రంగంలో ఉన్న నిపుణులు నిర్ధారించారు. దీంతో మిఠాయిలపై ఇలాంటి తాపడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మేయర్ సునీల్ ప్రభు సర్క్యులర్ జారీ చేశారు. దీన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు పోలీసులు సహకరించాలన్నారు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్తో స్వయంగా భేటీ అయి చర్చించానని తెలిపారు. వ్యాపారులపై చర్యలు తీసుకునే సమయంలో బీఎంసీ అధికారులకు తోడుగా పోలీసులు ఉంటారని ఆయన హామీనిచ్చారన్నారు. కాగా, సాధారణంగా మిఠాయి షాపుల్లో విక్రయించే వివిధ బర్ఫీ, హల్వ తదితర ఖరీదైన స్వీట్లపై తెల్లని వెండి కాగితం అలంకరించి ఉంటుంది. అది కొనుగోలుదార్లను ఆకట్టుకుంటుంది. ఇలాంటి మిఠాయిలపై వాటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కొందరు కార్మికులు ఉంటారు. కానీ మిఠాయితోపాటు వెండి కాగితాన్ని తినడంవల్ల అది ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఈ మేరకు బీఎంసీ ఆరోగ్య శాఖ ఆ కాగితంపై నిషేధం విధించింది. దీనివల్ల ఈ పనిపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి గండిపడుతోంది. -
సమైక్య శంఖారావం సభ పిటీషన్ రేపటికి వాయిదా
-
APNGOల సభకు షరతులతో కూడిన అనుమతి