Prices Rise
-
కేరళలో ఓనం...కోనసీమకి వరం
కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు వరి కంటే మక్కువగా కొబ్బరికి ప్రాధాన్యమిస్తారు. కొబ్బరికాయ దిగుబడి ఇక్కడ బాగుంది అనుకునేలోపే తమిళనాడు, కేరళ రూపంలో గట్టి సవాల్ ఎదురయ్యేది. దాంతో కాయ ఉన్నా.. సరైన ధర ఎన్నడూ లభించేది కాదు. కానీ ఇప్పుడు కేరళలో ఓనం పండుగ వచ్చి అక్కడి కాయ అక్కడికే సరిపోతోంది. తమిళనాడు, కర్నాటకల్లో సరైన దిగుబడి లేకపోవడం, ఉత్తరాదిన దసరా, దీపావళి, కార్తికమాసం రూపంలో పండగలు క్యూ కట్టడంతో కోనసీమ కొబ్బరికి, రైతులకు ముందే పండగొచ్చింది. సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కేరళలో ఓనం పండుగ... తమిళనాడులో కొబ్బరికాయ అందుబాటులో లేకపోవడం... కోనసీమ కొబ్బరి రైతులకు పండగ వచ్చింది. కొబ్బరికాయ ధర రికార్డ్ స్థాయిలో పెరగడంతో వారికి దసరా... దీపావళి పండగ ముందే వచ్చింది. కొబ్బరి వెయ్యి కాయల ధర సైజును బట్టి రూ.17,500ల నుంచి రూ.18 వేల వరకు పలుకుతుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ హై. కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులకు ముందే దసరా, దీపావళి పండగ వచ్చినట్టయింది. వరుస పండగల నేపథ్యంలో కొబ్బరి ధరలు అనూహ్యంగా పెరిగాయి. నెల రోజుల క్రితం వెయ్యి కొబ్బరికాయల ధర రూ.8,500 మాత్రమే ఉండేది. తర్వాత నెమ్మదిగా పెరుగుతూ ఆగస్టు నెలాఖరు నాటికి రూ.10,500కు చేరింది. వినాయక చవితి సమయానికి రూ.11,500 నుంచి రూ.12 వేల వరకు ధర రావడంతో రైతులు చాలా వరకు కోలుకున్నారు. కానీ గత వారం రోజుల నుంచి ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది, తమిళనాడు, కర్ణాటకల్లో కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉన్నాయి. కేరళలో ఓనం పండగ కారణంగా స్థానికంగా కొబ్బరి వినియోగం ఎక్కువగా ఉంది. దీనితో ఆ రాష్ట్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు మందగించాయి. ఈ కారణంగా ఉత్తరాది మార్కెట్ అవసరాలను ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంత ధర రావడం విశేషం. విజయదశమి, దీపావళి, కార్తికమాసం దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కొబ్బరి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాలకు డొక్క ఒలిచిన కొబ్బరి ఎగుమతి అవుతుంటుంది. కానీ ఈసారి డొక్కా ఒలుపు చేయని కాయను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రాసుల రూపంలో రూ.18 వేల వరకు ధర ఉండగా 60 రకం (పెద్ద కాయ) డొక్కతో వెయ్యి కాయలు ధర రూ.20 వేలు పలుకుతుంది. ఏడేళ్ల తర్వాత రికార్డు ధర ఏడేళ్ల తర్వాత కొబ్బరికాయకు రికార్డు స్థాయి ధర వచ్చింది. 2017లో కొబ్బరికాయకు జాతీయ మార్కెట్లో రూ.17 వేల ధర రాగా ఈసారి అంతకుమించి ధర పలుకుతుండటం విశేషం.మార్కెట్లో ఈ స్థాయి ధర రావడం అరుదైన విషయమని కొబ్బరి రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయతో పాటు మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి. ప్రస్తుతం పాత కురిడీ కాయ గండేరా వేయింటికి రూ.14 వేలు, గటగటా రూ.17,500, కురిడీ కొత్త కాయ గండేరా రూ.13 వేలు, గటగట రూ.15,500 పలుకుతుంది. -
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కాంచీపురం పట్టు చీరలు పెళ్లిళ్లకు ప్రసిద్ధి. పెళ్లి కోసం కొనుగోలు చేసేవాటిలో బంగారం తర్వాత పట్టు చీరలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆకాశమే హద్దుగా రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలు కాంచీపురం పట్టు చీరల ధరలపైనా ప్రభావం చూపిస్తున్నాయి.బంగారం, పట్టు చీరల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మొత్తంగా పెళ్లిళ్ల బడ్జెట్పై భారం పడుతోంది. గత ఎనిమిది నెలల్లో కాంచీపురం పట్టు చీరల ధరలు 50 శాతం పెరిగాయి. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తక్కువ స్థాయిలో ఉన్న లేదా పూర్తిగా లేని చీరలను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.క్షీణించిన విక్రయాలుధరల పెరుగుదల కారణంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు 20 శాతం క్షీణించినట్లు కాంచీపురం పట్టు చీరల అమ్మకానికి పేరుగాంచిన రీటైల్ టెక్స్టైల్ చైన్ ఆర్ఎంకేవీ పేర్కొంటోంది. తక్కువ సమయంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పట్టు చీరల ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని ఆర్ఎంకేవీ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ చెబుతున్నారు.22 క్యారెట్ల బంగారం ధర 2023 అక్టోబర్ 1న గ్రాముకు రూ. 5,356 ఉండగా 2024 మే 21 నాటికి అది రూ. 6,900 లకు పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు గ్రాముకు రూ. 75.5 నుంచి రూ.101 కి పెరిగాయి. రూ. 10,000 కోట్ల విలువైన కాంచీపురం పట్టు చీరల పరిశ్రమ దీని ద్వారా గణనీయంగా ప్రభావితమైంది.50 శాతం పెరిగిన ధరలుకాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘానికి చెందిన దామోధరన్ ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే మధ్య ఈ చీరల ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయి. కాంచీపురం పట్టు చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండితో తయారు చేసిన జరీని ఈ చీరల తయారీలో ఉపయోగిస్తారు. పురాతమైన కాంచీపురం చీరలకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ధర రూ.20 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. -
కొండెక్కిన వెల్లుల్లి ..ఈ చిట్కాలు ఫాలోకండి!
దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నమొన్నటి నుంచి తగ్గుతూ రాగా, ఇప్పుడు వెల్లుల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. ఇలాంటప్పుడూ మహిళలు స్పైసీ కూరలు ఎలా వండి పెట్టగలం అన్న సందిగ్ధంలో పడిపోతారు. పైగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని తాలింపుల దగ్గరి నుంచి ప్రతి దాంట్లోని తప్పనిసరిగా వాడేస్తుంటారు. అలాంటిది వెల్లుల్లి వాడకం లేకుండా గడపడం అంటే..కొందరికి చాల కష్టం. అలాంటివారు ప్రత్యామ్రాయంగా ఇలాంటి వాటితో వెల్లుల్లి ప్లేస్ని భర్తీ చేసుకోవచ్చు. వెల్లుల్లి బదులుగా ఏం ఉపయోగించొచ్చంటే.. సింపుల్ చిట్కాలు.. ముందుగా మీ కిచెన్ కప్బోర్డ్లో ఎన్ని వెల్లులిపాయలు ఉన్నాయో చూడండి. వాటిని పాయలుగా విడదీయండి. ఆ తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. ఇక వాటిని చక్కగా పొడి చేసుకుని పాడవ్వకుండా చిన్న లవంగ మొగ్గ వేసి గాలి చొరబడి డబ్బాలో నిల్వ ఉంచండి. ఈ పొడి వెల్లులి మాదిరి రుచిని సువాసనను తెప్పిస్తుంది కూరకి. ఇది మంచి ప్రత్యామ్నాయం. అలాగే ఈ వెల్లుల్లి పొడికి కాస్త ఉప్పు చేరిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కూరల్లో ఈ పొడిని ఉపయోగిస్తున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గించండి. అప్పుడు కూర రుచికి వెల్లుల్లికి దగ్గదగ్గరగా మంచి రుచిని అందిస్తుంది. అస్సలు ఇంట్లో వెల్లుల్లి లేదంటే పచ్చి ఉల్లిపాయాలను ఎండలో ఎండబెట్టి చక్కగా పొడి చేసుకుంటే వెల్లులి మాదిరిగా టేస్ట్ వస్తుంది కూరకి. అయితే కూరలో తక్కువ ఉల్లిపాయలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థిక పరంగా సమస్య రాకుండా కొద్దిపాటి చిట్కాలతో ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటే ఆరోగ్యానికా ఆరోగ్యమే గాక ధరల సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!) -
భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ ధరలు - కారణం ఇదే..
2024 జూన్ నుంచి స్మార్ట్ఫోన్ ధరలు భారీగా పెరిగే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకంటే సుమారు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెమొరీ చిప్ల ధరలు పెరగడంతో వచ్చే త్రైమాసికం నుంచి స్మార్ట్ఫోన్ ధరలు పెరగనున్నట్లు సమాచారం. మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్ఫోర్స్ DRAM (మెమరీ చిప్స్) ధరలలో పెరుగుదల ఉందని సూచించింది. ఎందుకంటే శాంసంగ్, మైక్రాన్ కంపెనీలు మార్చి నుంచి ధరల పెరుగుదలను అమలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రభావం స్మార్ట్ఫోన్లపై కూడా ఉంటుందని ట్రెండ్ఫోర్స్ తెలిపింది. స్మార్ట్ఫోన్, పర్సనల్ కంప్యూటర్ల వినియోగం భారీగా పెరగడం వల్ల ఏఐ, అధిక పనితీరు కలిగిన మెమొరీ చిప్ల డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు చిప్ల ధరలను పెంచనున్నాయి. ఇది మాత్రమే కాకుండా.. చైనీస్ కరెన్సీ యువాన్ బలపడటం వల్ల, అక్కడ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాల ఖర్చు కూడా భారీగానే ఉన్న కారణంగా ధరలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించింది. ఇది స్మార్ట్ఫోన్ పరిశ్రమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం బడ్జెట్ను పెంచింది. అయినప్పటికీ ఇప్పటికే తయారై సరఫరాకు సిద్దమైన ఫోన్స్ ధరలు 3 నుంచి 8 శాతం, కొత్తగా తయారవుతున్న ఫోన్ల మీద 5 నుంచి 10 శాతం ధరలు పెరగవచ్చని, డిమాండ్ను బట్టి ధరలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు?
ఇకపై టీవీలు కొనడం మరింత భారం కావచ్చు. తయారీదారులు ఉత్పత్తిని తగ్గించడంతో కీలకమైన ఓపెన్ సెల్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీనివల్ల టీవీలు ధరలు కూడా మరింత పెరుగుతాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. కోవిడ్ సమయం నుంచే పరిశ్రమ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. గత డిసెంబర్ నుంచి ఓపెన్-సెల్ ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి మరో 15 శాతం పెంచే యోచనలో టెలివిజన్-ప్యానెల్ తయారీదారులు ఉన్నారు. ఏమిటీ ఓపెన్ సెల్? టెలివిజన్ సెట్ల తయారీలో ఓపెన్ సెల్ ప్రధాన భాగాలలో ఒకటి. టీవీల ఉత్పత్తిలో 60-65 శాతం ఓపెన్ సెల్లకే ఖర్చవుతుంది. వీటిని చైనాలోని నాలుగైదు కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీని కారణంగా ధరల అధికారం వారి చేతుల్లోనే ఉంటోంది. -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నది అక్కడే.. కొనడం కష్టమే!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్న నగరాల జాబితాలో భారత్కు చెందిన నగరాలు ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ (Knight Frank) విడుదల చేసిన ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరం ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో నాలుగో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 6.5 శాతం పెరుగుదలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్లో ఉన్న 22వ ర్యాంక్ నుంచి ఈసారి 18 స్థానాలు ఎగబాకింది. అలాగే న్యూ ఢిల్లీ, బెంగళూరు నగరాలు కూడా తమ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో మెరుగుదలను నమోదు చేశాయి. న్యూ ఢిల్లీ ఎన్సీఆర్ 4.1 శాతం వృద్ధితో ఏడాది క్రితం 36వ ర్యాంక్ నుంచి ఈ ఏడాది 10వ స్థానానికి ఎగబాకిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. బెంగళూరు ర్యాంక్ గతేడాది 27 నుంచి ఈ ఏడాది 2.2 శాతం వృద్ధితో 17కి పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 12 నెలల కాలంలో 46 మార్కెట్లలో వార్షిక ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో సగటు పెరుగుదల 2.1 శాతంగా నమోదైంది. ఇది గతేడాది మూడో త్రైమాసికం నుంచి నమోదైన అత్యంత బలమైన వృద్ధి రేటు. మొత్తంగా 67 శాతం నగరాలలో ఇళ్ల ధరలు పెరుగుదలను నమోదు చేసినట్లుగా నైట్ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. టాప్లో మనీలా ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా 21.2 శాతం వార్షిక ధరల పెరుగుదలతో ఈ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచింది. బలమైన దేశ, విదేశీ పెట్టుబడులు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గత ఎనిమిది త్రైమాసికాల నుంచి వరుసగా అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న దుబాయ్ ఈసారి టాప్ ర్యాంక్ను కోల్పోయింది. ఈ ఏడాది కేవలం 15.9 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఈ జాబితాలో శాన్ఫ్రాన్సిస్కో అట్టడుగున నిలిచింది. -
ఏటీఎఫ్ ధర 6 శాతం తగ్గింపు..
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది. ఎయిర్లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి. -
ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన
ముంబై: ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ప్రస్తుతానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (6.5 శాతం) యథాతథంగానే కొనసాగించాలని ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్లతో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ‘మా పని (ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం) ఇంకా ముగియలేదు. కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయి. అదే సమయంలో, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ–రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మేము సిద్ధంగా ఉండాలి. దీనికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోంది’’ అని దాస్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 2022 నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంపు ఉక్రేయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని ఈ నెల తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. తాజాగా వెలువడిన మినిట్స్ కూడా ఇదే విషయాన్ని సూచించింది. అంచనాలకు అనుగుణంగానే... ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగానే పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఆర్బీఐ కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్సా్గ పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్లో 4.87గా నమోదయ్యింది. జూలైలో మళ్లీ తీవ్ర రూపం దాలి్చంది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51%గా నమోదయ్యింది. జూన్లో ఈ రేటు 4.55%. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలై లో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13 శాతం పెరిగాయి. కీలక అంచనాలు ఇవీ... వృద్ధి తీరు: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ1లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6%గా అంచనా. ద్రవ్యోల్బణం ధోరణి: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2%, క్యూ3లో 5.7%, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. -
పెరగనున్న హోండా కార్ల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా వచ్చే నెల నుంచి సిటీ, అమేజ్ కార్ల ధరలను పెంచనుంది. ముడిసరుకు వ్యయం క్రమంగా అధికం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. అయితే ధర ఎంత పెంచేదీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్షోరూంలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధర రూ.7.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యస్థాయి సెడాన్ సిటీ రూ.11.57 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక హైబ్రిడ్ మోడల్ అయిన సిటీ ఈ:హెచ్ఈవీ రూ.18.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!
Today Gold and Silver Rate: దేశీయంగా గత రెండు మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర శనివారం బులియన్ మార్కెట్లో మళ్లీ ఎగిసాయి. అటు వెండి ధర కూడా మళ్లీ పరుగందుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 వద్ద కొనసాగుతున్నది. (అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత) హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 200 ఎగిసి రూ.55150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 210 రూపాయలు పుంజుకని 60,160గా పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర విషయానికి వస్తే కొనుగోలు దారులకు షాక్ తగిలింది. ఏకంగా 300 రూపాయలు ఎగిసి కిలోవెండి 78500గా ఉంది. గ్లోబల్గా ఔన్స్ బంగారం ధర పుంజుకుంది .యూఎస్ జాబ్ డేటా అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ క్షీణత అని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) ఇదీ చదవండి: తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ -
హార్లే-డేవిడ్సన్ లవర్స్కు భారీ షాక్, ఏకంగా పదివేలు!
Harley Davidson X440:హార్లే-డేవిడ్సన్ లవర్స్కు భారీ షాక్. హీరో మోటోకార్ప్ హార్లే-డేవిడ్సన్ బైక్స్ లేటెస్ట్ బైక్ ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 10,500 మేర ధరలను పెంచింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ ధృవీకరించింది. ధర పెంపు తర్వాత, హార్లే-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ. 2,39,500 నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుత ప్రారంభ ధర ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బైక్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు హీరో మోటోకార్ప్ గత నెలలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ ఎక్స్440 కొత్త ధరను ప్రకటించింది. కంపెనీ ప్రయోగ ధరతో పోలిస్తే రూ.10,500 ఖరీదు ఎక్కువ. ఇది 2,29,000 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, హార్లీ-డేవిడ్సన్ ఎక్స్ 440 ప్రారంభించినప్పటి నుంచి మంచి ఆదరణ లభించిందనీ, ఆన్లైన్ బుకింగ్ల తదుపరి విండోకు వర్తించే కొత్త ధరను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. హీరో మోటో భాగస్వామ్యంతో, అమెరికా ప్రీమియం ఆటోమొబైల్ హార్లే-డేవిడ్సన్ భారత మార్కెట్లో తన పోర్ట్ఫోలియోను అందుబాటులోకి తెస్తోంది. డిమాండ్కనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ధృవీకరించింది.సెప్టెంబర్లో భారతదేశంలోని రాజస్థాన్లోని నీమ్రానాలోని వారి గార్డెన్ ఫ్యాక్టరీలో హార్లే-డేవిడ్సన్ X440 ఉత్పత్తిని ప్రారంభిస్తారు. బుకింగ్ తేదీల ఆధారంగా అక్టోబర్ 2023లో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. కాగా హార్లే-డేవిడ్సన్ ఎక్స్ 440 సెగ్మెంట్లో అత్యంత సరసమైన బైక్గా చెప్పవచ్చు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హెచ్నెస్ CB350, బెనెల్లీ ఇంపీరియాలే 400 వంటి ఇతర ప్రసిద్ధ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. -
టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు విమాన ఇంధన (ఏటీఎఫ్) రేటును ఏకంగా 8.5 శాతం పెంచాయి. అటు వాణిజ్య వంట గ్యాస్ ధరను సిలిండర్కు రూ. 100 మేర తగ్గించాయి. తాజా మార్పులతో ఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 7,728 పెరిగి రూ. 98,508కి చేరింది. దీంతో వరుసగా రెండో నెలా విమాన ఇంధనం రేటు పెరిగినట్లయింది. జూలై 1నే ఇది 1.65శాతం మేర (కిలోలీటరుకు రూ. 1,477) పెరిగింది. అంతకు ముందు ఆయిల్ కంపెనీలు నాలుగు సార్లు తగ్గించాయి. కొత్త రేట్లు మంగళవారంనుంచి అమల్లోకి వచ్చాయి. పెంపు తర్వాత, న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్కు రూ.7,728 పెరిగి రూ.98,508.26కి చేరుకుంది. ముంబైలో కిలోలీటర్కు రూ.84,854.74 నుంచి రూ.92,124.13కి పెరిగింది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మెట్రోలలో (రూపాయిలు/కేఎల్) ఏటీఎఫ్ ధరలు న్యూఢిల్లీ - 98,508.26 కోల్కతా - 1,07,383.08 ముంబై - 92,124.13 చెన్నై- 1,02,391.64 ఇంటర్నేషనల్ రన్లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మెట్రోలలో ఏటీఎఫ్ ధరలు (డాలర్లు/కిలో) ఢిల్లీ-902.62 కోల్కతా-941.09 ముంబై-900.73 చెన్నై- 897.83 ఇక 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 100 తగ్గి రూ. 1,680కి లభించనుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ రేటు యథాతథంగా రూ. 1,103 (14.2 కేజీల సిలిండర్) ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. -
గ్యాస్ ధర పెంపు.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను పెంచింది. జులైలో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mBtu)కు 7.48 (సుమారు రూ. 615) డాలర్లు ఉన్న ధరను ఆగస్టులో 7.85 (సుమారు రూ. 645) డాలర్లకు పెంచింది. అయితే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన నామినేషన్ ఫీల్డ్ల నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ మాత్రం గరిష్టంగా ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్కు 6.50 డాలర్లు ఉంటుందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నోటిఫికేషన్ పేర్కొంటోంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 8న ఓఎన్జీసీ, ఓఐఎల్, ఇతర లైసెన్సింగ్ పాలసీ బ్లాక్ల లెగసీ నామినేషన్ ఫీల్డ్ల నుంచి ఉత్పత్తి చేసిన నేచురల్ గ్యాస్ ధరను భారత క్రూడ్ బాస్కెట్కు లింక్ చేసింది. ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే నేచురల్ గ్యాస్ ధరను ఇండియన్ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో 10 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు 2014 డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ప్రైసింగ్ కొత్త గైడ్లైన్స్ ప్రకారం గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించేవారు. నాలుగు గ్లోబల్ గ్యాస్ ట్రేడింగ్ హబ్లలో ఉన్న వాల్యూమ్-వెయిటెడ్ ధరల ఆధారంగా ఈ గ్యాస్ ధరలు ఉండేవి. గ్యాస్ ధరల సమీక్షలో జాప్యం, ధరలలో అధిక అస్థిరత కారణంగా పాత మార్గదర్శకాలను సవరించారు. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. ఇది సేంద్రీయ పదార్ధాల పొరలు (ప్రధానంగా సముద్ర సూక్ష్మజీవులు) వాయురహిత పరిస్థితులలో కుళ్లిపోయినప్పుడు, మిలియన్ల సంవత్సరాలుగా భూగర్భంలో తీవ్రమైన వేడి, ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ నేచురల్ గ్యాస్ను వంటకు, విద్యుత్ ఉత్పత్తికి , ప్లాస్టిక్ తయారీకి వినియోగిస్తారు. దీంతో పాటు వాహనాల్లో ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. -
పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే
Today Gold and Silver Price పసిడి ధరలు శనివారం మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విలువైన రెండు లోహాల ధరలు ఊపందుకున్నాయి. హైదరాబాద్లో శుక్రవారం 350 రూపాయలకు పైగా పడిన 22 క్యారెట్ల పసిడి శనివారం 10 గ్రాములు రూ.250 ఎగిసి రూ.55,350 స్థాయికి చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ 270 రూపాయలు పుంజుకుని రూ.60,380గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, పొద్దుటూరు, గుంటూరు నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర కిలోకి మరోసారి 80వేలకు చేరింది. 500 రూపాయలు పెరిగి కిలోకు రూ.80,000 పలుకుతున్నది. శుక్రవారం 2వేల రూపాయల మేర క్షీణించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.55,600గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,640 పలుకుతోంది. f వెండి కిలో 600 రూపాయలు పెరిగి 77,000 పలుకుతోంది. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్
Gold And Silver Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లి పరుగందుకున్నాయి. ఒక వైపు ఎడతెగని వర్షాలతో దేశంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు గురువారం జోరందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. (బ్లాక్రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగి, రూ. 55,450 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగాం పది గ్రాములు 330 రూపాయలు ఎగిసి రూ. 60,490కి చేరింది. వెండి కూడా ఇదే బాటలో ఉంది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) హైదరాబాద్ మార్కెట్లె పుత్తడి పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 55,450 గానూ, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గానూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలో కొన సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది. వెండి ధగ ధగలు దేశీయంగా వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. వెండి కిలో ధర 1100 రూపాయిలు ఎగిసింది. హైదరాబాద్లో కిలో వెండి 8,1500గా ఉంది. అమెరికా ఫెడ్ నిర్ణయం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేటు పెంపు మరింత ఆందోళనకు దారి తీసింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు దీంతో వడ్డీరేటు పెంపు ఉండదన్న ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు జల్లినట్టైంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనుందని అంచనాలు ఊపందుకున్నాయి. -
శ్రావణం అలా వచ్చిందో లేదో,రూ. 60వేల ఎగువకు బంగారం
Today Gold and Silver rates: ఆషాఢం ముగిసి శ్రావణ మాసం అలా షురూ అయిందో లేదో బంగారం ధరలు ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ధరల్లో హెచ్చు తగ్గులను నమోదు చేస్తున్న బంగారం మంగళవారం ఆరంభంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ. 60వేల ఎగువకు చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల రూ. 120 పెరిగి రూ.55100 స్థాయికి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.60,100 పలుకుతోంది. అటు వెండి ధర మాత్రం (హైదరాబాద్లో) స్వల్పంగా తగ్గింది. ఆరంభంలో కిలోకు రూ.200 పెరిగిన వెండి ధర ప్రస్తుతం 100 క్షీణించి 81,400 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కీలో వెండి 300 పెరిగి ధర 78 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.55,130 గాను, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.60,130 స్థాయివద్ద ఉంది. డాలరు బలహీనం, గ్లోబల్ గోల్డ్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఔట్లుక్ను ప్రభావితం చేసే అమెరికా రిటైల్ అమ్మకాల డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నాయి. డాలర్ వీక్నెస్ అంతర్జాతీయం పసిడి ధరలను ప్రభావితంచేస్తున్నాయి. స్పాట్ బంగారం 0.4శాతం పెరిగి ఔన్సుకు 1,961.67 డాలర్లకు చేరుకుంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.5శాతం పెరిగి 1,965.40డాలర్లకు చేరింది. కొనుగోళ్లతో షేర్లు షైన్ అస్థిర బంగారం ధరలు ఉన్నప్పటికీ 2023లో బంగారు ఆభరణాల రిటైలర్ల స్టాక్లు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్లో 13 శాతం లాభంతో పోలిస్తే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, పిసి జ్యువెలర్స్, తంగమయిల్ జువెలరీ , త్రిభోవందాస్ భీమ్జీ జవేరి (టిబిజెడ్) ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 21-72 శాతం ర్యాలీ చేశాయి. బంగారం ఆల్-టైమ్ హై ,బలమైన వినియోగదారుల కొనుగోలు నుండి 6 శాతం పడిపోయిన నేపథ్యంలో ఈ ర్యాలీ ఊపందుకుంది. -
మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా
July 14th Gold Silver Prices: దేశంలో వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్లో తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు పెరిగాయి. అటు వెండి కూడా భారీగా పెరిగింది.(జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 22క్యారెట్ల 10గ్రా. పసిడి రూ. 350 పెరిగి, రూ. 55,000కి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 ఎగిసి రూ. 60,00కి చేరింది. ముంబై, కోల్కతా, కేరళ, బెంగళూరు, హైదరాబాద్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,000, 24 క్యారెట్ల బంగారం రూ.60,000గా చేరడం గమనార్హం. అటు హైదరాబాద్మార్కెట్లో వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు ఎగిసింది. ప్రస్తుంతం రూ.813మేర పెరిగి కిలో వెండి 81, 300 పలుకుతోంది. ఇదీ చదవండి: తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా? -
మెక్డొనాల్డ్స్కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?
చెట్టెక్కి కూర్చున్న టొమాటో ధర సామాన్య ప్రజల్నే కాదు.. కార్పొరేట్ ఫుడ్ చైన్లను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్డొనాల్డ్స్ కి టొమాటో మంట సెగ బాగా తగిలింది. టొమాటో ధర ఆకాశాన్నంటడంతో సాధారణ జనం టొమాటో లేకుండానే కాలం గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రెస్టారెంట్లు కూడా టొమాటో లేకుండానే వంటకాలను వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాయి. (నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!) రికార్డు స్థాయికి చేరిన ధరల సెగతో మెక్డొనాల్డ్స్ మెనూ నుంచిటొమాటోను తొలగించేసింది. పెరిగిన ధరలు, సరఫరా లేకపోవడంతో టొమాటో లేకుండానే బర్గర్లు, పిజ్జాలాంటి వాటిని సరఫరా చేస్తోంది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగినసరఫరా లేకపోవడమే కారణమంటూ నోటీసులు అంటించడం ఇపుడు హాట్టాపిక్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(World Richest Beggar Bharat Jain: వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యతా ప్రమాణాలకు తగిన టొమాటో దొరకడం లేదు. అందుకే కొన్నాళ్లు టొమాటో లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోంది. దిగుమతికీ కష్టపడుతున్నాం' అంటూ ఢిల్లీని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు అతికించింది. సప్లయ్ చెయిన్లో నాణ్యమైన సమస్యలే కాకుండా,ధరల సమస్య కూడా తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) కాగా వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలతో దేశంలో టొమాటో దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా అనేక నగరాల్లో కిలో టొమాటో రూ. 100 నుంచి 200వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టొమాటాల కొరత కారణంగా ప్రత్యామ్నాయాల్ని వాడటమని సూచనలు, ప్రకటనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా “టొమాటో ధరలు పెరుగుతున్నాయా? బదులుగా టొమాటోప్యూరీ వాడుకోండి” అంటూ టాటా బిగ్బాస్కెట్ షాపింగ్ యాప్ ప్రకటనను విశేషంగా నిలుస్తోంది. గతంలో ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరిగినపుడు ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
మోదీ లూటీ విధానాల వల్లే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వ చేతగానితనమే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వ డొల్ల నినాదాలను ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడమే పనిగా పెట్టుకుందని, అందుకే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జనం కష్టాల్లో ఉంటే బీజేపీ మాత్రం అధికారం కోసం పాకులాడుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఖర్గే బుధవారం ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయని, నిరుద్యోగం 8.45 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, పనులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అచ్చే దిన్, అమృత్ కాల్ అంటూ నినాదాలు ఇచి్చన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించారని ఖర్గే ఆక్షేపించారు. ఈసారి ఎన్నికల్లో ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా ఫలితం ఉండదని, బీజేపీని జనం ఓడించడం తథ్యమని జోస్యం చెప్పారు. -
కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం యాప్ ద్వారా రోజూ క్షేత్రస్థాయిలో కూరగాయల ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తోంది. ఉల్లి, ఇతర కూరగాయల ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా.. టమాటా ధర పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, కృష్ణా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోనే టమాట ధర పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా టమాటాతో పాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఉల్లి, బంగాళదుంపలు, మిరప వంటి ఇతర కూరగాయల ధరలను సమీక్షిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపింది. ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో టమాటా ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ. 32 నుంచి రూ. 65 మధ్యలో, ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి 25 మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఈ రెండింటి ధరలు బహిరంగ మార్కెట్కంటే తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టారు. టమాటా కిలో రూ.100 దాటితే మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో రైతుబజార్ల సీఈవో నందకిషోర్ సమీక్షించనున్నారు. సీఎం యాప్ ద్వారా రోజూ జిల్లాలవారీగా కూరగాయల ధరలను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైతే మార్కెట్లో జోక్యం చేసుకుంటామని చెప్పారు. మిర్చి రైతుకు పండగే కంకిపాడు: రాష్ట్రంలో మిర్చి రైతుకు పండగొచ్చింది. సంవత్సర కాలంగా కిలో రూ.50 కి మించని పచ్చి మిర్చి ప్రస్తుతం రూ. 100 దాటింది. వారం, పది రోజులుగా మిర్చి ధర రూ 35 నుంచి క్రమేపీ పెరిగింది. వేసవి కారణంగా మిర్చి సాగు తగ్గింది. డిమాండ్కు సరిపడా దిగుబడి లేకపోవడంతో ధర పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టమాటా రూ.100 పచ్చిమిర్చి రూ.160
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వరకు రూ.వందకు నాలుగు కిలోల చొప్పున అమ్మిన టమాటాల ధర ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ.100కు చేరింది. పావుకిలో కొనాలంటే రూ.30 ఇస్తే తప్ప దొరకని పరిస్థితి. అలాగే, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడుతోపాటు అన్ని కూరల్లో వాడే అల్లం, వెల్లుల్లి ధరలు కూడా సామాన్యుడికి ఏమాత్రం అందనంతగా పెరిగిపోయాయి. పచ్చిమిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు తప్ప బెండకాయలు, బీరకాయలు, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కిలో రూ.60–80కి మధ్య ఉండటం గమనార్హం. రైతుబజార్లు, మార్కెటింగ్ శాఖ మొబైల్ వ్యాన్లలో విక్రయించే చోట ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ దుకాణాల్లో కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్మార్కెట్లలో రిటైల్ మార్కెట్ల కన్నా కిలోకు రూ.10–15 వరకు అధికంగా ఉంది. అల్లం కిలో రూ.300 కూరల్లో రుచికి తప్పనిసరైన అల్లం ధర ఊహించని విధంగా కిలో రూ.300కి చేరింది. మంగళవారం హైదరాబాద్ చింతలబస్తీలో బండ్లపైన అల్లం పావుకిలో రూ.80 ఉండగా, కిలోకు రూ.300 చెప్పడం గమనార్హం. వెల్లుల్లి కిలో రూ.200 ఉండగా, మేలురకం ధర రూ.240 ఉంది. మూడు నెలల క్రితం వరకు కిలో రూ.100కి లభించిన అల్లం, వెల్లుల్లి ధరలు ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయి సామాన్యుడు కొనలేనంత పైకి చేరుకున్నాయి. బీన్స్ నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి రూ.160 వరకు ఉండగా, చిక్కుడుకాయలు కిలో రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. వేసవిలో కూరగాయలు పండించకనే.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మూడునెలలుగా రాష్ట్రంలో కూరగాయల పంటలు ఆశించిన స్థాయిలో లేవు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో అకాల వర్షాలు, మే, జూన్లలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీ నుంచి కూడా ఆశించినస్థాయిలో తెలంగాణకు దిగుమతులు లేవు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, క్యారెట్ వంటివి తప్ప నిత్యం వండుకునే కూరగాయల దిగుమతులు తక్కువగానే ఉన్నట్లు హైదరాబాద్ రైతుబజార్ ప్రతినిధి ఒకరు చెప్పారు. -
వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!
సాక్షి, ముంబై: దేశీయంగా పసిడి పైపైకి చేరుతూ కొనుగోలుదారులకు షాకిస్తోంది. దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది. అటు వెండి కూడా ఇదే బాటలో ఉంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పై రూ. 10 పెరిగి.. రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.19 పెరిగి రూ.61,340కి చేరుకుంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.55,300గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏక ంగా వెయ్యి రూపాయలు ఎగిసి రూ.60,330గా ఉంది. కాగా ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 360 గా ఉంది. అటు ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61, 510 గా ఉంది. ఇక హైదరాబాద్లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి ఏకంగా రూ. 2900పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. బలహీనమైన అమెరికా ఆర్థిక డేటాతో ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీ రేటు వడ్డన ఆందోళనతో గోల్డ్ ఔన్సు 2వేల డాలర్లు అధిగమించింది. తద్వారా ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీక్స్ గోల్డ్ బుధవారం రూ. 61,130 వద్ద ఉంది. కిలో వెండి 3.7 శాతం ఎగిసి రూ. 74,700 కి స్థాయిని తాకింది. -
యూకేలో పాస్పోర్ట్ సిబ్బంది సమ్మె
లండన్: దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగబాకిందని, ధరలు పెరిగిపోతున్నాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పాస్పోర్ట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సోమవారం సమ్మె ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పాస్పోర్ట్లు సకాలంలో అందకపోతే ప్రయాణాలు మానుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. తక్షణమే వేతనాలు పెంచాలన్న డిమాండ్తో వైద్యులు, ఉపాధ్యాయులు, రైళ్లు, బస్సుల డ్రైవర్లు, ఎయిర్పోర్టుల్లో పనిచేసి సిబ్బంది, పోస్టల్ సిబ్బంది ఇదివరకే సమ్మెకు దిగారు. మళ్లీ టీచర్ల సమ్మెబాట యూకే ప్రభుత్వం ఆఫర్ చేసిన వేతన 4.5 శాతం పెంపు, 1,000 పౌండ్ల వన్టైమ్ చెల్లింపును టీచర్లు తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27, మే 2న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ ప్రకటించింది. -
Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?
సాక్షి, ముంబై: పసిడి ధరల్లో ఊగిసలాట కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దూకుడు మీద రికార్డు స్థాయిలను తాకిన బంగారం ధరలు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంతో కాస్త వెనక్కి తగ్గాయి. అయితే సమీప భవిష్యత్తులో స్వర్ణం సరికొత్త ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని తాకేందుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అమెరికా బ్యాంకుల సంక్షోభం, ఫెడ్ వడ్డీ రేపు పెంపులాంటి బంగారంపై పెట్టుబడిని సురక్షితమైందిగా ఇన్వెస్టర్లు భావించే అవకాశం ఉందని అంచనా వేశారు. (ఇదీ చదవండి: సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) ఇది ఇలా ఉంటే బుధవారం బంగారం ధరలు లాభ నష్టాల మధ్య ఇన్వెస్టర్లను ఊరించాయి. ఉదయం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.210 మేర తగ్గి రూ.54,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.240 మేర తగ్గి 59,450 కి చేరింది. మరోవిలువైన మెటల్ వెండి కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి రూ.73,000లుగా ఉంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,600వద్ద, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450 హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500, 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 పలుకింది. కిలో వెండి హైదరాబాద్లో రూ.75,700కు చేరింది. మళ్లీ ఎగిసిన పసిడి ధర కానీ మధ్యాహ్నం తరువాత పసిడి ధర మళ్లి పుంజుకుంది బంగారం ధర 10 గ్రాములకు రూ. 200 చొప్పున పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ. 59,670 ఉంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. -
మందులు వాడేవారికి ధరల దెబ్బ!
వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఉపశమనం కోసం మందులు వాడుతున్నవారికి ధరల దెబ్బ తగలనుంది. పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటిబయాటిక్స్ వరకూ పలు రకాల మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్లూపీఐ)లో మార్పునకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి పలు రకాల మందుల ధరలను 12 శాతం మేర పెంచుకోడానికి ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం.. ఈమె స్విమ్మింగ్ చాంపియన్ కూడా... ధరలు పెరుగుతున్న మందులలో చాలా వరకు యాంటీ ఇన్ఫెక్టివ్లు, పెయిన్కిల్లర్లు, కార్డియాక్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్లో చేర్చిన దాదాపు 800 ఔషధాల రిటైల్ ధరపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ జాబితాలో కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల దగ్గర నుంచి ఓఆర్ఎస్, డిస్ఇన్ఫెక్టెంట్ మందుల వరకు దాదాపు అన్ని అవసరమైన మందులు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే మందులు ఇవే... హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తు మందులు, ఆక్సిజన్ మందులు. పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్ పాయిజనింగ్లో యాంటీడోట్స్: యాక్టివేటెడ్ చార్కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్ యాంటికాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్ పార్కిన్సన్స్, డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజైల్పెనిసిలిన్, సెఫాడ్రోక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోమ్ కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు యాంటీ టీబీ ఔషధం: అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ మొదలైనవి. యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ తదితరాలు యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్ వంటివి. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే అబాకావిర్, లామివుడిన్, జిడోవుడిన్, ఎఫవిరెంజ్, నెవిరాపైన్, రాల్టెగ్రావిర్, డోలుటెగ్రావిర్, రిటోనావిర్ తదితర మందులు. మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ వంటి రక్తహీనత మందులు ప్లాస్మా, ప్లాస్మా ప్రత్యామ్నాయాలు కార్డియోవాస్కులర్ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి. చర్మసంబంధమైన మందులు యాంటిసెప్టిక్స్, క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి. బుడెసోనైడ్, సిప్రోఫ్లోక్సాసిన్, క్లోట్రిమజోల్ మొదలైన ఈఎన్టీ ఔషధాలు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మందులైన ఓఆర్ఎస్, లాక్టులోజ్, బిసాకోడిల్ వంటివి. హార్మోన్లు, ఇతర ఎండోక్రైన్ మందులు, గర్భనిరోధకాలు వ్యాక్సిన్లు: హెపటైటిస్ బి, డీపీటీ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్ మొదలైనవి. ఆప్తాల్మోలాజికల్ మందులు, ఆక్సిటోసిక్స్, యాంటీఆక్సిటోసిక్స్ మానసిక రుగ్మతల చికిత్సకు ఉపయోగించే మందులు శ్వాసకోశ సంబంధ రుగ్మతలకు వినియోగించే మందులు, విటమిన్లు, మినరల్స్. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? -
టాటామోటార్స్: వాణిజ్య వాహనాల ధరలు 5 శాతం పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను మోడల్, వేరియంట్నుబట్టి 5 శాతం వరకు పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయి. వచ్చే నెల నుంచి అమలులోకి వస్తున్న బీఎస్–6 రెండవ దశ కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేసిన నేపథ్యంలో ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ఇది కూడా చదవండి కిమ్స్లో వాటాను విక్రయించిన పోలార్ క్యాపిటల్ న్యూఢిల్లీ: వైద్య సేవల్లో ఉన్న కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో (కిమ్స్) 1.38 శాతం వాటాలను పోలార్ క్యాపిటల్ ఫండ్స్ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. వీటి విలువ రూ.143.7 కోట్లు. డిసెంబర్ త్రైమాసికంలో కిమ్స్లో పోలార్కు 1.87 శాతం వాటాలు ఉన్నాయి. -
‘హీరో’ లవర్స్కు షాక్: ఏప్రిల్ 1 నుంచి షురూ!
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ మేకర్ హీరో మోటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై వచ్చే నెల నుండి 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్ , మార్కెట్లను బట్టి మారుతూ ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. (ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !) OBD-2 నిబంధనలకు అనుగుణంగా మారడం, ఉద్గార ప్రమాణాల అమలుతో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకోసం తమ తమ వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. (ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్బర్గ్ ఆగ్రహం) హీరో మోటోకార్ప్ తాజా లాంచ్లు: హీరో మోటోకార్ప్ ఇటీవల భారతదేశంలో రూ. 68,599 (ఎక్స్-షోరూమ్) వద్ద సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. అలాగే రూ. 83,368, ఎక్స్-షోరూమ్ ధరతో సూపర్ స్ప్లెండర్ కొత్త హైటెక్ XTEC వేరియంట్ను కూడా పరిచయం చేసింది. కాగా ఇలీవలి కాలంలో హీరో కంపెనీ ధరల పెంపు ఇదిరెండోసారి. అటు టాటా మోటార్స్ సైతం తాజాగా తన కమర్షియల్ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది. -
అమాంతంగా పెరిగిన నిమ్మ ధర.. రేటు ఎంతంటే..?
హనుమంతునిపాడు/కనిగిరి రూరల్: నిమ్మ రైతు పంట పండింది. నిన్న మొన్నటి వరకూ సరైన ధరల్లేక దిగాలుగా ఉన్న రైతుకు మార్కెట్ ధరలు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. వారం రోజుల కిందట వరకూ కిలో రూ.10 నుంచి రూ.15 పలికింది. నేడు మార్కెట్లో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వరకూ పలుకుతున్నాయి. నాణ్యత పెరగడంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో నిమ్మకు డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా నిమ్మతోటల సాగు కనిగిరి నియోజకవర్గంలోనే జరుగుతోంది. వ్యాపారులు, రైతుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల వరకు నిమ్మ సాగవుతోంది. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే సుమారు 32 వేల ఎకరాల వరకు సాగు ఉన్నట్లు అంచనా. అందులో హెచ్ఎం పాడు మండలంలో 20 వేల ఎకరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత సీఎస్ పురం, వెలిగండ్ల మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల వరకు సాగవుతోంది. యర్రగొండపాలెం, చీమకుర్తి, దర్శి, చినారికట్ల, కొణిజేడు తదితర ప్రాంతాల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ హాయంలో వర్షాలు లేక చాలా వరకు నిమ్మ తోటలను రైతులు నరికేశారు. వర్షాలు పడక, బోర్ల కింద సాగుచేసిన పంటలకు పెట్టుబడులు పెరిగి వాటికి గిట్టుబాటు ధరల్లేక అల్లాడారు. చాలా మంది తోటలపైనే కాయలు వదిలేశారు. అయినప్పటికీ జిల్లాలో హెచ్ఎం పాడులోనే అత్యధికంగా నిమ్మ సాగు ఉంది. ఈ మండలంలోని ఎర్రనేలలో పండే నిమ్మకు ఎక్కువ శాతం గిరాకీ ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కలిసి వచ్చిన కాలం... ప్రస్తుత కాలంలో వర్షాలు పడి భూగర్భ జలాలు పెరగడంతో రైతులు మళ్లీ నిమ్మతోటల సాగుకు ముందుకొచ్చారు. ఫలితంగా లేత తోటలు అధికంగా ఉండి ముదురు తోటలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో దిగుబడి రోజుకు నాలుగు, ఐదు లారీలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు లారీల లోడు మాత్రమే మార్కెట్కు వస్తోంది. దీంతో సీజన్ ప్రారంభం కావడం, డిమాండ్కు తగిన సరుకు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా రూ.10 నుంచి రూ.15 వరకు ధర పెరిగింది. గతంలో ఆటోలు, కూలీల ఖర్చులకుపోను నామ్కే వాస్తే ఆదాయంతో దిగాలు చెందుతున్న రైతన్నకు ఒక్కసారి ధరలు పెరగడంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో నిమ్మ ధర రూ.25 నుంచి రూ.30 మధ్య పలుకుతోంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవిలో రూ.50కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కనిగిరి టూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు... కనిగిరి పట్టణంలో సుమారు 6 వరకు హోల్సేల్ వ్యాపార దుకాణాలున్నాయి. సీజన్లో రోజుకు సుమారు 5 నుంచి 6 లారీలు 50 వేల టన్నుల నిమ్మకాయలను చెన్నై, హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా చెన్నై, బెంగళూరు మార్కెట్కు వెళ్తాయి. అయితే ప్రస్తుతం 2 లారీల నిమ్మకాయలు మాత్రమే మార్కెట్కు వస్తున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.30 వరకు తీసుకుంటున్నాం వారం రోజుల వరకు కూడా పండు కాయ కేజీ రూ.10కి, పచ్చి కాయ రూ.15కి కొనేవాళ్లం. ప్రస్తుతం కాయ ఎగుమతికి డిమాండ్ రావడం, సరుకు దిగుబడి, ఉత్పత్తి తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పండు కాయ రూ.15కు, పచ్చికాయ రూ.28 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నాం. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరునాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. – నర్సయ్య, హోల్ సేల్ వ్యాపారి -
వామ్మో..రికార్డు స్థాయికి బంగారం ధర, కారణాలేంటో తెలుసా?
సాక్షి, ముంబై: బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది.యూనియన్ బడ్జెట్లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యూఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి గురువారం తాజా రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర రూ. 58,826 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్టస్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీకి కారణమని బులియన్ పండితులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,951.79 డాలర్ల స్థాయి కి పెరిగింది, ఏప్రిల్ 2022 నుండి ఇదు అత్యధిక స్థాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 600 రూపాయలు ఎగిసిన 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53, 600 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,880 గాను ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 58,470 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470గా, 8 గ్రాముల బంగారం ధర రూ. 46,776 గాను, బడ్జెట్ 2023లో బంగారం, ప్లాటినం డోర్, బార్లతో సమానంగా సిల్వర్ డోర్, బార్లు,వస్తువులపై సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. వెండిపై దిగుమతి సుంకం, 7.5 నుంచి 10 శాతానికి పెంపు, అలాగే 5 శాతం వ్యవసాయం, మౌలిక సదుపాయాల సెస్తో పాటు, మొత్తంగా 15శాతం నికర సుంకాన్ని వసూలు చేయనున్నారు. అలాగే దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, వస్తువులపై దిగుమతి సుంకం 20శాతం 25 శాతానికి పెరిగింది. -
మళ్లీ షాకిచ్చిందిగా హ్యుందాయ్: ఐ20 ఎన్-లైన్ ధరల పెంపు, ఆ వేరియంట్లు ఔట్
సాక్షి, ముంబై: దక్షిణ ఆఫ్రికా కారు దిగ్గజం హ్యుందాయ్ తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ కార్ల ధరలును మరోసారి పెంచేసింది. ఈ మేరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఐ20 లైనప్ కార్ల ధరలు పెరగడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఫెస్టివల్ సీజన్ ముందు సెప్టెంబర్లో ధరలను పెంచింది. ఐ 20 లైనప్లో వేరియంట్లను బట్టి రూ.21,500 వరకు ధర పెరగనుంది. ఐ20 హ్యాచ్బ్యాక్ మోడల్ లైనప్ నుండి1.0L టర్బో-పెట్రోల్ iMT వేరియంట్లను (స్పోర్ట్జ్ టర్బో ఆస్టా టర్బో) తొలగించింది. ఇపుడిక టర్బో-పెట్రోల్ ఇంజన్ స్పోర్ట్జ్ , ఆస్టా ట్రిమ్లలో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్బాక్స్తో మాత్రం ఐ20 అందుబాటులో ఉంటుంది. వేరియంట్ లైనప్ను అప్డేట్ చేయడంతో పాటు, కార్మేకర్ హ్యుందాయ్ ఐ20 ధరలను రూ. 21,500 వరకు పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత, హ్యాచ్బ్యాక్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 7.18 లక్షల నుండి రూ. 10.91 లక్షల వరకు ఉంటుంది. మోడల్ లైనప్లో మూడు 1.0L టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి . Sportz DCT, Asta DCT , Asta DCT డ్యూయల్-టోన్ - ధర రూ. 10.11 లక్షలు, రూ. 11.68 లక్షలు, రూ. 11.83 లక్షలు. నాలుగు 1.5L డీజిల్ వేరియంట్లు లలో మాగ్నా (రూ. 8.42 లక్షలు), స్పోర్ట్జ్ (రూ. 9.28 లక్షలు), ఆస్టా (ఓ) (రూ. 10.83 లక్షలు) , ఆస్టా (ఓ) డ్యూయల్-టోన్ (రూ. 10.98 లక్షలు). పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు. -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ: అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి 2 శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. పెరిగిన తయారీ ధరల భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకే ధరలను పెంచాల్సి వస్తున్నట్టు వివరణ ఇచ్చింది. పెరిగిన వ్యయాల్లో ఎక్కువ మొత్తాన్ని తామే సర్దుబాటు చేసుకున్నట్టు, కొంత మేర కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తున్నట్టు పేర్కొంది. జనవరి నుంచి రేట్లను పెంచనున్నట్టు టాటా మోటార్స్ లోగడే ప్రకటించగా, తాజాగా ఎంత మేర పెంచేదీ ప్రకటించింది. చదవండి: మారుతి కార్ లవర్స్కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..! ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
వినియోగదారులకు షాక్.. విజయ పాల ధరలు పెంపు!
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కృష్ణా మిల్క్ యూనియన్(విజయ పాలు) పాలు లీటర్కు రూ.2 పెరగనున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయని విజయ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం విజయ లోఫాట్(డీటీఎం) అర లీటర్ ప్యాకెట్ రూ.25 ఉండగా, సోమవారం నుంచి రూ.26 కు విక్రయించనున్నారు. విజయ ఎకానమి(టీఎం) అరలీటర్ ప్యాకెట్ రూ.27 నుంచి రూ.28కు పెరిగింది. విజయ స్పెషల్(ఫుల్ క్రీమ్) పాలు అర లీటర్ రూ.33 నుంచి రూ.34కు పెరిగింది. ఇక కృష్ణా మిల్క్ యూనియన్ అత్యధికంగా విక్రయించే విజయ గోల్డ్ ప్రస్తుతం రూ.34 ఉండగా, రూ.35కు పెరగనుంది. నెల వారీ పాల కార్డు కొనుగోలు చేసిన వినియోగదారులకు అక్టోబర్ 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని యాజమాన్యం పేర్కొంది. -
Bharat Jodo Yatra: చీతాలు సరే, కొలువులేవి?
హరిపాద్ (కేరళ)/న్యూఢిల్లీ: ‘‘దేశంలో ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనం ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను ప్రధాని గాలికొదిలేశారు. చీతాలను తెప్పించడంలో, వాటిని ఫొటోలు తీయడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇది అర్థంపర్థం లేని పని అని వ్యాఖ్యానించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర శనివారం కేరళలోని అలప్పుజ జిల్లా చేప్పాడ్లోకి ప్రవేశించింది. యువత ‘జాతీయ నిరుద్యోగ దినం’ అని తమ ఒంటిపై రాసుకొని ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. అనంతరం భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. చీతాలను రప్పించానంటున్న మోదీ గత 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ముందు నిరుద్యోగం, ధరల కట్టడిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ‘‘చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు, శ్రామికులపై కేంద్రం వ్యవస్థీకృతంగా దాడి చేస్తోంది. ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తలే దేశ సంపదనంతా నియంత్రిస్తున్నారు. వారు ఏ వ్యాపారంలోకైనా ప్రవేశించి, అప్పటికే ఉన్నవారిని వెళ్లగొట్టగలరు. ఉద్యోగాలు దొరక్క యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోట్లాది జనం పేదరికంలోకి జారుకుంటున్నారు. ఈ బడా వ్యాపారులు మాత్రం దేశంలో ఓడరేవులు, ఎయిర్పోర్టులు, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి అన్ని రంగాలను సొంతం చేసుకుంటున్నారు’’ అంటూ వాపోయారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ గత ఎనిమిదేళ్లలో ఇచ్చింది కేవలం 7 లక్షల కొలువులంటూ మండిపడ్డారు. ‘‘ఉద్యోగాలు సాధించే తీరతామంటూ యువత నినదిస్తోంది. వినిపిస్తోందా?’’ అంటూ ట్వీట్ చేశారు. జాతీయ నిరుద్యోగ దినం అంటూ హాష్టాగ్ జత చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా శనివారాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా యువత జరుపుకుంటోందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయిని కరునాగపల్లి సమీపంలోని ఆమె ఆశ్రమంలో రాహుల్ కలుసుకున్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమానికి ఎనలేని కృషి సాగిస్తున్నారని కొనియాడారు. నల్ల దుస్తులతో కాంగ్రెస్ నిరసనలు నిరుద్యోగ సమస్యను తక్షణం పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యువజన కాంగ్రెస్ నేతలు శనివారం దేశవ్యాప్తంగా నల్ల దుస్తులు ధరించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరుద్యోగ మేళాలు నిర్వహించారు. ‘‘దేశంలో నిరుద్యోగిత రేటు కరోనాకు ముందే 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. 20–24 ఏళ్ల వయసువారిలో 42 శాతం నిరుద్యోగులే’’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కుబేరుల వ్యాపారాలే ముందుగా లబ్దిపొందుతున్నాయి. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మోదీ సర్కార్ పథకాల ప్రయోజనాలు చిట్టచివరన దక్కుతున్నాయి’’ అని అన్నారు. మోదీ ప్రభుత్వమొచ్చి యువతకు నిరుద్యోగాన్ని బహుమతిగా ఇచ్చిందని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ అన్నారు. -
ఉడుకుతున్న పప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై రెండో వారం నుంచి పప్పుల ధరల్లో పెరుగుదల ఉంటుందన్న కేంద్రం అంచనాలకు అనుగుణంగానే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళలో కిలో కందిపప్పు ధర రూ.135–140కి చేరగా, ప్రస్తుత వర్షాలతో జరిగిన పంట నష్టం కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. వరదలతో పెరిగిన నష్టం.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు తగ్గినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 1.27 కోట్ల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కాగా, ఈ ఏడాది అది 1.18 కోట్ల హెక్టార్లకు తగ్గింది. దేశంలో ఎక్కువగా సాగు చేసే కంది పంట విస్తీర్ణం గత ఏడాది 47 లక్షల హెక్టార్లుంటే అది ఈ ఏడాదికి 41 లక్షల హెక్టార్లకు తగ్గింది. అధికంగా సాగయిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగింది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపై ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. ఇదే అవకాశంగా తీసుకొని వ్యాపారులు పప్పుల ధరలను క్రమంగా పెంచుతున్నట్లు కేంద్రం గుర్తించింది. జూలై మొదటి వారంలో కందిపప్పు జాతీయ సగటు ధర కిలో రూ.100 ఉంటే అది ఇప్పుడు రూ.109కి చేరింది. మినప, పెసర, శనగ పప్పులు ధరలు సైతం ఏకంగా రూ.10 మేర పెరిగాయి. కేంద్రం అంచనా వేసిన ధరల కన్నా రూ.10–15 మేర అధికంగా బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్రేడ్–1 రకం కందిపప్పు ధర కిలో రూ.135–140మధ్య ఉంది. ఇక్కడ ధరలు నెల రోజుల వ్యవధిలోనే రూ.20–25 వరకు పెరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరలు రూ.100 నుంచి రూ.115 మధ్య ఉన్నాయి. ఢిల్లీలోనూ కిలో కందిపప్పు ధర రూ.120 ఉండగా, మినపపప్పు ధర రూ.125గా ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్ మొదలయింది. ఆగస్టు మొదలు అక్టోబర్ వరకు పండగ సీజన్ నేపథ్యంలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టిస్తే ఈ ధరల పెరుగుదల మరింతగా ఉండవచ్చని కేంద్రం అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గట్టి నిఘా ఉంచండి.. ధరల కట్టడిలో భాగంగా దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. పప్పుధాన్యాల స్టాక్ హోల్డర్లు నిల్వలను బహిర్గతం చేసేలా చూడాలని కోరింది. నిల్వల వివరాలను ఆన్లైన్ మానిటరింగ్ పోర్టల్లో అప్డేట్ చేసే వివరాలను సమీక్షించాలని తెలిపింది. -
ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం విఫలం.. తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చలో ఆయన మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఉందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం 6 శాతానికిపైనే ఉంటుందని ఆర్బీఐ ప్రకటించడం గమనార్హమన్నారు. పరాయి దేశాల్లో ద్రవ్యోల్బణం రేటుతో పోల్చుకుని మనం మెరుగైనస్థితిలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అనేది చట్టబద్ధత లేని పన్నుల వడ్డింపు వంటిదన్నారు. ఈ రకమైన వడ్డింపులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 38ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. అన్నింటికీ జీఎస్టీ విధిస్తున్నారని చివరికి తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ విధించారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చానన్నారు. బీజేపీ సభ్యులు చాలామంది తిరుమల దేవుణ్ని ప్రార్థిస్తారని, కానీ పన్ను వేయడం మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధవర్గాల ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు రూపుమాపి, సామాజిక అంతరాలు తొలగించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతని, కానీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కొందరు సభ్యులు పేర్కొన్నట్లు హోల్సేల్ ధర సూచికతో పోలుస్తూ ద్రవ్యోల్బణం 15.1 శాతం ఉందనడం సరికాదన్నారు. కొనుగోలు ధర సూచికతో పోల్చడమే సరైన పద్ధతి అని, ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7.1 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఇది ఎక్కువే అయినప్పటికీ యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం 10.4 శాతం ఉందని గుర్తుచేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని చెప్పారు. 2000 సంవత్సరంలో రూ.లక్ష ఇప్పుడు రూ.27 వేలకు సమానమన్నారు. దేశంలో ప్రజలకు సామాజిక, ఆర్థికభద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నందున తగిన చర్యలు చేపట్టి ధరల పెరుగుదలను అదుపుచేయాలని సూచించారు. వలస కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి కోవిడ్ మహమ్మారి కారణంగా వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని, వారికి ఉపాధి కల్పించడం, ఉద్యోగ భద్రత ఇవ్వడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చని సూచించారు. 2022 జనవరి–మార్చి మధ్యలో 47.3 శాతంగా ఉన్న లేబర్ భాగస్వామ్యం ఒక్క మార్చి నెలలోనే 39.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. 3.8 లక్షలమంది శ్రామికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఆయిల్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఏడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక ధరలు నమోదయ్యాయని, అదే సమయంలో దేశీయంగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని తెలిపారు. చిన్న పొదుపు స్కీములపై వడ్డీ రేట్లు పెంచాలి కేంద్ర ప్రభుత్వ 10 సంవత్సరాల బాండ్లపై వడ్డీ రేట్లు 6.4 శాతం నుంచి 7.46 శాతానికి పెంచినట్లుగానే చిన్న పొదుపు స్కీములు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, వయోవృద్ధుల పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెంచాలని కోరారు. తద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో నగదు లభ్యత పెరుగుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. రూ.46 వేల కోట్లు నష్టపోయిన ఏపీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం (సెంట్రల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ)లో ఆంధ్రప్రదేశ్కు నిర్ణయించిన వాటా మేరకు కేంద్రం చెల్లించనందున గత ఏడేళ్లలో రాష్ట్రం రూ.46 వేల కోట్లు నష్టపోయిందని చెప్పారు. పన్నుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వలన దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి రూ.11.26 లక్షల కోట్లు నష్టపోయాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆదాయాన్ని లూటీ చేసిందని చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించినట్లు సెంట్రల్ గ్రాస్ టాక్స్ రెవెన్యూలో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వడం లేదని, కేవలం 31 నుంచి 32 శాతం వాటా మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. సెస్, సర్చార్జీలను ఎడాపెడా విధిస్తూ కేంద్రం రాష్ట్రాలను లూటీ చేస్తోందని పేర్కొన్నారు. -
‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఆరేళ్ల పాప లేఖ
PM Narendra Modi: జీఎస్టీ (GST) బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఇది సామాన్యుల బిల్లని వారికి ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. దీన్ని అమలు తర్వాత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని మాటలు చెప్పారు నేతలు. అయితే జీఎస్టీ మాత్రమే కాదు ఏది వచ్చినా ప్రజలపై బాదుడు ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని తాజాగా మరోసారి నిరూపించింది కేంద్రం. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కొత్తగా కొన్ని నిత్యవసరాల వస్తువులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిన్నటి వరకు ఎలా ఉన్నా, ప్రస్తుత పన్నుల ప్రభావం, ధరల భారం దెబ్బకు పసి పిల్లలు కూడా భయపడుతున్నారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిన ఓ చిన్నారి లేఖ. ధరలు మండిపోతున్నాయని ఒకటో తరగతి చదివే ఓ బాలిక ఏకంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పాపం ఎంత కష్టం వచ్చిందో.. ఆ చిట్టి తల్లికి! ఏముంది ఆ లేఖలో.. పేపర్, పెన్సిల్ తీసుకొని నేరుగా ప్రధాని మోదీని ఉద్దేశించి.. మీరు ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా? అని ప్రశ్నించింది. "నా పేరు కృతి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మోదీజీ, మీరు విపరీతంగా ధరల పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నా పెన్సిల్, రబ్బరు (ఎరేజర్) కూడా ఖరీదైనవిగా మారిపోయాయి. అంతేనా నా మ్యాగీ ధర కూడా పెరిగింది. స్కూల్లో ఎవరో నా పెన్సిల్ని దొంగిలించారు. ఇప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. పెన్సిల్ అడుగుతున్నారు. నేను ఏమి చేయాలి? మీరే చెప్పండంటూ నేరుగా ప్రధానికే లేఖ పేరుతో తన బాధని అక్షరాల రూపంలో రాసి పంపింది. కాగా ఈ చిన్నారి యూపీలోని కనౌజీ జిల్లాలో చదువుకుంటోంది. ప్రస్తుతం ఈ లేఖ వైరల్గా మారి నెట్టింట హల్ చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలనే మాత్రమే కాదు పసి పిల్లలను కూడా కదిలిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో! -
ఓ మై గాడ్, మళ్లీ పెరగనున్న ధరలు!
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో పోరాడి, లాక్డౌన్లో ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడు వాటి నుంచి బయటపడుతున్నారు. అయితే దేశంలో పెట్రోలు, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారం కావడంతో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ తరుణంలో కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయన్న వార్త వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే.. పండుగ సీజన్ లోపు మరోసారి వాహనాలు ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రూపాయి మారక విలువ బలహీనపడడం, పెరిగిన రవాణా వ్యయం, ఇక గతంలో కోల్పోయిన మార్జిన్లను తిరిగి పొందాలన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు టైర్లు,ఇతర ఆటో పరికరాల ధరలను కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రేట్లు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల వాహన ధరలు మరింత పైకి కదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే పండుగ సీజన్ కంటే ముందే రేట్ల పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. చదవండి: Tata Power Group Q1 Results: టాటా పవర్ ఫలితాలు: డబుల్ ధమాకా! -
ప్రయాణికులకు భారీ షాకిచ్చిన భారతీయ రైల్వే!
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, డుర్యాంటో ఎక్స్ప్రెస్లతో సహా భారతీయ ప్రీమియం రైళ్లకు ఈ క్యాటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. భారతీయ రైల్వే బోర్డు జూలై 15న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొత్త ధరలు ఉంటాయని పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం. ఇకపై ప్రీమియం రైళ్లలో.. అల్పాహారం రూ.105 ఉండగా, రూ. 155 చేరింది. భోజనం రూ. 185 ఉండగా, రూ. 235, స్నాక్స్ రూ. 90 ఉండగా, రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో టీ లేదా కాఫీ ముందుగా బుక్ చేసుకుంటే రూ. 20, బుక్ చేసుకోకుంటే రూ. 70 వసూలు చేసేవాళ్లు. ప్రస్తుతం బుక్ చేసినా, చేయకపోయినా వాటి ధరను రూ. 20గా నిర్ణయించారు. చదవండి: Google Play Store: యాప్ డెవలపర్లకు గూగుల్ కొత్త రూల్స్.. యాప్లు ఇన్స్టాల్ చేసేముందు అలా చేయాల్సిందే! -
‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు?
సాక్షి,హైదరాబాద్: ‘బీర్’ప్రియులకు చేదు వార్త. బీర్ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం. బీర్ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్ ధరల పెంపుపై ఎ క్సైజ్ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు. ఈ కసరత్తు అనంతరం ఒక్కో బీర్ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్ బీర్ రూ.140 ఉండగా దాన్ని రూ.150, స్ట్రాంగ్ బీర్ రూ.150 ఉండగా, దాన్ని రూ.170 చేయనున్నట్లు సమాచారం. చదవండి: హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ -
రికార్డు స్థాయికి ఏటీఎఫ్ రేటు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఎగిసిన నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇంధనాల మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ రేటును ఆదివారం 3.22 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 3,649.13 మేర పెరిగి రూ. 1,16,851.46 (లీటరు రేటు రూ. 116.8)కి చేరింది. ఏటీఎఫ్ రేట్లను పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది తొమ్మిదోసారి. ముంబైలో కిలో లీటరు ధర రూ. 1,15,617.24కి, కోల్కతాలో రూ. 1,21,430.48కి, చెన్నైలో రూ. 1,20,728.03కి చేరింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాన్ని బట్టి రేట్లు మారతాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 25వ రోజూ యధాతథంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లను బట్టి విమాన ఇంధనం ధరలను ప్రతి నెలా పదిహేను రోజులకోసారి, పెట్రోల్..డీజిల్ రేట్లను రోజువారీ సవరిస్తారు. -
Sakshi Cartoon: ఉక్రెయిన్పై దాడి తర్వాత రష్యాలో ధరలు పెరిగాయి
ఉక్రెయిన్పై దాడి తర్వాత రష్యాలో ధరలు పెరిగాయి -
ఇంటిపై ఇటుక భారం
దేశవ్యాప్తంగా గతేడాది నిర్మించిన పలు థర్మల్ ప్రాజెక్టుల యాష్ పాండ్లకు నిర్వహించిన వేలంలో రామగుండం ఎన్టీపీసీకి పక్కనే ఉన్న కుందనపల్లి యాష్కు అత్యధికంగా టన్ను బూడిదకు రూ.402 పలికింది. అందుకే ఇక్కడ గతంలో ఇటుకబట్టీ కేంద్రాల్లో రూ.5.50 చొప్పున లభించే ఇటుక అమాంతం రూ.7.50కు చేరింది. ఇది రవాణాను బట్టి మారుతుంటుంది. అదే ఢిల్లీలో టన్నుకు రూ.160, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో టన్నుకు రూ.200లోపే పలికింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంటిపై ఫ్లై యాష్ ఇటుక భారం పడింది. 6 నెలల్లో ఈ ఇటుక రేటు ఏకంగా రూ. 2 పెరిగింది. ఎన్టీపీసీ బూడిదకు టెండర్లు వేయడంతో రేట్లు రెండింతలయ్యాయని, దీంతో ఇటుకల రేట్లు పెరిగాయని బట్టీల వ్యాపారులు చెబుతున్నారు. 2021 సెపె్టంబర్కు ముందు టన్ను బూడిద ధర రూ. 23 ఉండగా ఇప్పుడు అది అమాంతం రూ. 400కు పెరిగిందని అంటున్నారు. బూడిద రేట్ల ప్రభావం ఇటుక ధరలపై పడటంతో ఇళ్ల నిర్మాణ భారం రూ. 30 వేల నుంచి రూ. లక్షల్లో పెరిగింది. ఎన్టీపీసీ బూడిదే బంగారమాయేనా! రాష్ట్ర నిర్మాణ రంగానికి కావాల్సిన 50% ఇటుకలు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల నుంచే ఉత్పత్తి అవుతాయి. జిల్లాలో ఉత్పత్తి అయ్యే 50% ఇటుకల్లోనూ 60 శాతం పెద్దపల్లి జిల్లా నుంచే వస్తుంటాయి. గోదావరి తీరం, ఎన్టీపీసీ బూడిద, మట్టి నిక్షేపాలు మెండుగా ఉండటమే దీనికి కారణం. అయితే మొన్నటిదాకా ఎవరికీ పట్టని ఎన్టీపీసీ బూడిద ఇపుడు బంగారమైంది. 2021 సెపె్టంబర్ ముందు వరకు ఎన్టీపీసీ బూడిద ధర 30 టన్నుల లారీకి రూ.700గా ఉండేది. అంటే టన్నుకు రూ.23.30, క్వింటాలుకు రూ.2.3 గాను. కిలో రూ.0.023 (పైసలు)గా ఉండేది. కానీ.. టెండర్లు వేశాక అదే 30 టన్నుల లారీకి రూ.12,000 వరకు వసూలు చేస్తున్నారు. బూడిద ప్రియమవడంతో దాని ఆధారంగా తయారయ్యే ఇటుకల ధరలూ అమాంతం పెరిగాయి. దీంతో రాష్ట్రంలో భవనాల నిర్మాణ వ్యయం కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్షల్లో పెరిగింది. సాక్షి కథనాలపై సీఎం కార్యాలయం ఆరా! ఎన్టీపీసీ బూడిద వ్యవహారంలో ‘సాక్షి’కొంతకాలంగా ప్రచురిస్తున్న వరుస కథనాలపై సీఎం కార్యాలయం ఆరా తీసినట్లు తెలిసింది. కొందరు నేతల సాయంతో రోజూ రూ.లక్షల విలువైన బూడిదను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవల ప్రచురితమైన కథనాలపై స్థానిక అధికారులతో నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకునేందుకు ఏ అధికారి కూడా ముందుకు రాకపోవడం స్థానికంగా ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అద్దం పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ విక్రయాల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 2021 సెప్టెంబర్ ముందు బూడిద ధరలు 30 టన్నుల బూడిద లారీ రూ.700 టన్ను బూడిద రూ.23.30 కిలో బూడిద రూ.0.023 2021సెప్టెంబర్ తరువాత ధరలు 30 టన్నుల బూడిద లారీ ధర రూ.12,000 టన్ను బూడిద ధర రూ.400 కిలో బూడిద ధర రూ.0.4 -
ధరలు తగ్గించాలి.. ధాన్యం కొనాలి
సాక్షి, నెట్వర్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల్ని తగ్గించాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయా లనే డిమాండ్లతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కలెక్టరేట్ల ఎదుట, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్షలు నిర్వహించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు శనిలా దాపురించారన్నారు. మహబూబాబాద్లో బెల్లయ్యనాయక్, ఖమ్మంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్, ఇల్లెందులో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ నాయకులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ కలెక్టరేట్ వద్ద బైఠాయించిన నాయకులు సంగారెడ్డిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించగా, ఏఐసీసీ నేత మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం గ్యాస్బండకు దండవేసి ప్రధాన రహదారిపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. కాగా, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించడంతో పాటు తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చే క్రమంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. -
నాటకాలు ఆపి ధాన్యం కొనండి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ఆందోళనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు. అసలు సమస్యను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయని నాయకులు ధ్వజమెత్తారు. నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆపి ధాన్యం కొనాలని, పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వరంగల్లో కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. మహబూబాబాద్లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ములుగు జిల్లా మంగపేటలో ఎమ్మెల్యే సీతక్క, వనపర్తిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ కలెక్టరేట్కు చేరుకున్నారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. -
5% పెరగనున్న ఏసీల ధరలు
న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సీజన్లో అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో కంపెనీలు మార్జిన్లపై ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ సీజన్లో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని అంచనా వేసుకుంటున్న కంపెనీలు.. తయారీ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచాలనుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో వేసవి సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు అవుతాయంటూ భారత వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా ఏసీల విక్రయాలపై కంపెనీల్లో ఆశలు పెంచాయి. గత రెండు వేసవి సీజన్లలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా అమ్మకాలు ఆశించిన మేర లేవు. దీంతో అప్పుడు నిలిచిన డిమాండ్ కూడా తోడయ్యి, ఈసీజన్లో అమ్మకాలు జోరుగా ఉండొచ్చని వోల్టాస్, హిటాచి, ఎల్జీ, ప్యానాసోనిక్, గోద్రేజ్ అప్లయన్సెస్ అంచనా వేస్తున్నాయి. ఏసీ తయారీ కంపెనీలు గత త్రైమాసికంలో ధరలను ఒక విడత పెంచాయి. ఏసీల తయారీలో వినియోగించే అల్యూమినియం, కాపర్ ధరలు గణనీయంగా పెరగడంతో ఈ పనిచేయక తప్పలేదు. ఉదాహరణకు గతేడాది వరకు 3 స్టార్ ఇన్వర్టర్ స్లి్పట్ ఏసీ ధర రూ.33,500 స్థాయిలో ఉంటే, తాజాగా దీని ధర రూ.36,500–37,000కు చేరడం గమనార్హం. మరోవైపు ధరల భారం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు ఆకర్షణీయమైన ఈఎంఐ పథకాలను కూడా అందిస్తున్నాయి. ‘‘2021–22లో ధరలను రెండంకెల స్థాయిలో పెంచాల్సి వచ్చింది. ఇది ఈ వేసవి సీజన్లో వినియోగదారుల కొనుగోళ్లకు ప్రతికూలంగా మారదని భావిస్తున్నాం. కస్టమర్ల సౌలభ్యం కోసం ఆఫర్లకుతోడు, సులభ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నాం’’అని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి తెలిపారు. మే నుంచి ధరల భారం.. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) వార్షిక విక్రయాల్లో 40–50 శాతం మేర ఈ వేసవి సీజన్లో నమోదవుతాయని అంచనా వేస్తోంది. గడిచిన 18 నెలల్లో కన్జ్యూమర్ అప్లయన్సెస్ ధరలు 15 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. కమోడిటీ ద్రవ్యోల్బణం, ముడిసరుకుల ధరల పెరుగుదల భారాన్ని పరిశ్రమ చూస్తున్నట్టు పేర్కొంది. ‘‘ధరల పెరుగుదల ప్రభావం వినియోగదారులపై వెంటనే ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్చి–ఏప్రిల్ నెలలకు సరిపడా నిల్వలు ఇప్పటికే సమకూర్చడం జరిగింది. మే నుంచి తదుపరి ధరల పెరుగుదల అమల్లోకి రావచ్చు’’ అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. ఈ సీజన్లో వినియోగ డిమాండ్ దెబ్బతినకుండా రేట్ల పెంపును అమలు చేయడం తమకు సవాలని జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఎయిర్ కండీషనింగ్ ఇండియా చైర్మన్, ఎండీ, గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ధరల భారం సర్దుబాటు చేసుకునేందుకు తమవైపు నుంచి వీలైనంత ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గతేడాది ఇచ్చి న ఆఫర్లను సైతం ప్రస్తుత సీజన్కు వచ్చే సరికి తగ్గించేసినట్టు గుర్మీత్సింగ్ తెలిపారు. తాము ధరల పెంపు విషయంలో వేచి చూస్తున్నట్టు గో ద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్నంది తెలిపారు. ‘గత 2 వేసవి సీజన్లపై లాక్డౌన్ ప్రభావం పడింది. దాంతో చాలా మంది కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడం, హైబ్రిడ్ పని నమూనా వినియోగ డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నాం’ అని కమల్ నంది తెలిపారు. -
ఎండలే కాదు ధరలు మండుతున్నాయ్.. కొనలేం.. తినలేం
సాక్షి,కౌటాల(అదిలాబాద్): జిల్లాలో ఈ ఏడాది కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయల పంటను రైతులు సాగు చేశారు. కాగజ్నగర్ డివిజన్లోని మోసం, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో 25 ఎకరాల్లో, ఆసిఫాబాద్ డివిజన్లోని, కెరమెరి, రెబ్బెన మండలాల్లో కేవలం 5 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగవుతున్నట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆరెగూడ, ఈజ్గాం, నజ్రుల్నగర్, సిర్పూర్(టి), వెంపల్లి, రెబ్బెన, గురుడుపేట, డబ్బా, బాబాసాగర్ గ్రామాల్లో రైతులు పుచ్చకాయ పంట అధికంగా సాగుచేస్తున్నారు. వేడిమి నుంచి ఉపశమనం.. వేసవి కాలంలోనే కాకుండా ప్రతీ కాలంలో ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వీటిపై ఆసక్తి చూపుతారు. రుచిగా, తియ్యగా ఉండే ఈ కాయల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ప్రస్తుతం కర్భూజాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయలు రుచి చూడడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే జిల్లాలో ప్రస్తుతం వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అధిక ధరలు జిల్లాలో ఒక్కో పుచ్చకాయ ధర కనిష్టంగా రూ.40 నుంచి గరిష్టంగా రూ.120కు పైబడి ధర పలుకుతున్నాయి. కాయ సైజును బట్టి వ్యాపారులు ధర చెబుతున్నారు. వేసవిలో మాత్రమే పండించే పుచ్చకాయలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడడంతో సహజంగానే వ్యాపారులు ధర పెంచి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎండతీవ్రత పెరిగే కొద్ది పుచ్చకాయల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆశించిన స్థాయిలో రైతులు పుచ్చకాయ పంటను సాగు చేయకపోవడంతోనే జిల్లాలో పుచ్చకాయల ధరలు మండిపోతున్నాయని పుచ్చకాయ ప్రియులు పేర్కొంటున్నారు. పేద, సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని స్థితిలో రేట్లు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ధరలు భారీగా పెరిగిపోవడంతో పుచ్చకాయలను తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు ఆసక్తి చూపని రైతులు గతంలో జిల్లాలో వందల ఎకరాల్లో పుచ్చకాయ పంటను రైతులు సాగు చేసేవారు. పుచ్చకాయ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు సాగునీటి సౌకర్యం లేకపోవడంతో పంటను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ సంవత్సరం రైతులు జిల్లా వ్యాప్తంగా కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయ పంటను సాగు చేశారు. ఏటేటా పుచ్చకాయ పంట సాగు తగ్గుతుందని, పంటకు సాగునీరు అందక సరైన ఉత్పత్తి లేక పుచ్చకాయ ధర పెరిగిందని పలువురు చెబుతున్నారు. ధరలు తగ్గించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కొనలేని పరిస్థితులు ఉన్నాయి మార్కెట్లో పుచ్చకాయ ధర చూస్తే కొనలేని పరిస్థితులు ఉన్నాయి. సాధారణ సైజు పుచ్చకాయ ధర కూడా పేదలకు అందుబాటులో ఉండటం లేదు. జిల్లాలో రైతులు పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేయడం లేదు. అందుకే పుచ్చకాయ ధరలు అమాంతం పెరిగాయి. – జె.రాందాస్, ముత్తంపేట ధరలు బాగా పెరిగాయి పుచ్చకాయల ధరలు అమాంతం పెరిగాయి. మేం ఒక ట్రాక్టర్ పుచ్చకాయలను రూ.10 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. దీంతో పుచ్చకాయకు రూ. 40 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నాం. పుచ్చకాయల ధరలు అధికంగా ఉండండతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. – డి.గంగారం, పండ్ల వ్యాపారి, కౌటాల -
హీరో వాహనాలు మరింత ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ మోటార్సైకిల్స్, స్కూటర్స్ ధర పెంచుతోంది. మోడల్నుబట్టి రూ.2,000 వరకు ఈ పెంపు ఉంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ముడిసరుకు వ్యయాలు అధికం అయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. -
జ్వరం గోలీకి ధరల సెగ!
సాక్షి, హైదరాబాద్: నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సగటు జీవిపై మందుల భారం కూడా పడనుంది. జ్వరం బిళ్ల మొదలు బీపీ గోలీ వరకు సామాన్యులు ఎక్కువగా వినియోగించే దాదాపు 800 రకాల షెడ్యూల్డ్ మందులపై కేంద్రం ధరాభారం మోపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆయా మందుల ధరలను 10.76 శాతం మేర పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. 2020తో పోలిస్తే 2021 క్యాలెండర్ సంవత్సరానికి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం మేర వచ్చిన మార్పునకు అనుగుణంగా ధరలను సవరించుకొనేందుకు సంబంధిత వర్గాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మెమొరాండం విడుదల చేసింది. ఎక్కువ మంది వినియోగించేవే పెరుగుతాయి... జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరుగుతాయి. ఇవిగాకుండా అత్యధికంగా వినియోగంలో ఉండే పారాసిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాల ధరలు కూడా పెరుగుతాయి. బలం కోసం వినియోగించే మల్టీ విటమిన్ల మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నుంచే వేగంగా పెరుగుదల... దేశంలో ఔషదాల ధరల పెరుగుదల రెండేళ్లుగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి లాక్డౌన్, అనంతర పరిస్థితులకు అనుగుణంగా పలు రకాల మందుల ధరలు 20 శాతం దాకా పెరిగాయి. -
పత్తి విత్తన ధర పైపైకి..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ధరలను పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం వద్దని మొరపెట్టుకున్నా వినలేదు. విత్తన ధరలు పెంచితే రైతులకు నష్టం వస్తుందని అధికారులు లేఖ రాసినా పట్టించుకోలేదు. పత్తి విత్తన ధరల పెంపుపై కేంద్రం నిర్వహించిన సమావేశాల్లోనూ తెలంగాణ వ్యవసాయశాఖ వ్యతిరేకించింది. రెండేళ్లుగా పత్తి విత్తన ధరల పెంపు కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా 475 గ్రాముల బీజీ–2 పత్తి ప్యాకెట్పై రూ.43 అదనంగా పెరిగింది. 2020–21లో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.730 ఉండగా, 2021–22లో రూ.767కు పెంచింది. ఇప్పుడు 2022–23లో ప్యాకెట్ ధర రూ.810కు పెంచుతూ కేంద్రం తాజాగా గెజిట్ జారీ చేసింది. కరోనా సమయంలో ఇలా పెంచుతూపోవడం సమంజసం కాదని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. కాటన్ సీడ్ కంట్రోల్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు...: రాష్ట్రంలో ఖరీఫ్లో వరి, పత్తి అత్యధికంగా సాగవుతాయి. గతేడాది 50.94 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ ఖరీఫ్లో వరికి ప్రత్యామ్నాయంగా ఇతరత్రా పంటలను సాగు చేయించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఇందులో పత్తిపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనా.. ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున 1.20 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. అయితే కంపెనీలు అవసరానికి మించి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాయి. పెరిగిన ధరల ప్రకారం.. రూ.కోట్లలో రైతులపై భారం పడనుంది. ఒక్కోసారి సకాలంలో వర్షాలు కురవక, విత్తనాలు మొలకెత్తక భూమిలోనే ఎండిపోతాయి. అప్పుడు రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి వేస్తారు. పత్తి విత్తన ధరల పెంపుపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని వ్యవసాయ వర్గాలు కోరుతున్నాయి. కంపెనీలకు లాభం చేకూర్చేందుకే.. విత్తన కంపెనీలకు లాభం చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ధరలను ఏటేటా పెంచుతూ వస్తోంది. అంతేగాకుండా సీడ్ ఆర్గనైజర్ల జేబులు నింపేలా కుట్ర పన్నుతోంది. కొందరు పెద్దల కనుసన్నల్లో ఇది జరుగుతోంది. ఈ పెంపుతో పత్తివిత్తన రైతులకు ఒరిగేది కూడా ఏమీలేదు. వారికి ప్యాకెట్పై కేవలం 32 శాతమే ఇస్తున్నారు. మిగతాది కంపెనీలకే వెళ్తుంది. కాబట్టి ఇది విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లకు లాభం చేకూరుస్తుందనేది అర్థమవుతోంది. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
వంట నూనె ధరలు తగ్గుతున్నాయి.. ఐనా హోల్సేల్ ధరలు భయం వీడలేదు !
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్లో 13.56 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. నిజానికి నాలుగు నెలల ఎగువముఖ ధోరణి నుంచి వెనుకడుగువేసినా, 13.56 శాతం స్థాయి కూడా తీవ్రమైనదే కావడం గమనార్హం. కాగా నవంబర్లో 14.23%గా నమోదయింది. 2021 ఏప్రిల్ నుంచి తొమ్మిది నెలల పాటు టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగువనే కొనసాగడం గమనార్హం. సమీక్ష నెల్లో సామాన్యునికి సంబంధించి ఆహార ధరలు తీవ్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మొత్తం సూచీలో దాదాపు 20 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్లో ద్రవ్యోల్బణం డిసెంబర్లో 9.56 శాతంగా ఉంది. నవంబర్లో ఇది 4.88 శాతమే. కూరగాయల ధరలు ఏకంగా 31.56 శాతం ఎగశాయి. నవంబర్లో ఈ రేటు 3.91 శాతంగా ఉంది. ఈ విభాగంలో పప్పులు, గోధుమలు, తృణ ధాన్యాలు, ధాన్యం ధరలు పెరగ్గా, ఆలూ, ఉల్లి, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. మరోవైపుప వంట నూనె ధరలు కూడా గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే టోకు ధరల పెరుగుదల సూచీ ఇంకా రెండు అంకెల స్థాయిలో కొనసాగుతుండటం ధరల అదుపుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. -
దేశంలో ఇక్కట్లకు హిందుత్వే కారణం
అమేథి: దేశంలో ధరల పెరుగుదల, బాధలు, విచారాలన్నింటికీ హిందుత్వే ప్రత్యక్ష కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2019లో ఓటమి అనంతరం శనివారం ఆయన రెండో మారు అమేథిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్లో హిందుత్వవాదుల వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ‘హిందువులు, హిందుత్వవాదులకు మధ్య పోరు నడుస్తోంది. హిందువులు సత్యాగ్రహంపై నమ్మకం ఉంచగా, హిందుత్వవాదులు సత్తాగ్రహ్(రాజకీయ దురాశ)ను నమ్ముతున్నారు’ అని అన్నారు. పార్టీ నేత ప్రియాంక గాంధీతో కలిసి అమేథిలో ఆయన ఆరు కి.మీ.ల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగితపై మోదీ మాట్లాడరని, గంగలో మునకలు మాత్రం వేస్తారని ఎద్దేవా చేశారు. ‘హిందువులు కోట్లాదిమంది తోటివారితో కలిసి గంగలో స్నానాలు చేస్తుంటే, హిందుత్వ మాత్రం ఒంటరిగా గంగలో మునుగుతోంది’ అన్నారు. కనీసం తోటి నాయకులకు తనతో కలిసి గంగాస్నానం ఆచరించే అవకాశాన్ని మోదీ ఇవ్వలేదన్నారు. కీలక అంశాల పైనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్ వ్యూహాలు అవలంబిస్తోందని విమర్శించారు. గాంధీ హిందూ కాగా, గాడ్సే హిందుత్వ వాది అని విమర్శించారు. మోదీకి వ్యాపారవర్గాలపై ప్రేమ అని, నోట్ల రద్దు, సాగు చట్టాలు, జీఎస్టీ వంటివన్నీ వారి ప్రయోజనాల కోసమే తెచ్చారని దుయ్యబట్టారు. 2004 నుంచి అమేథిలో గెలుస్తూ వస్తున్న రాహుల్ను 2019లో స్మృతీ ఇరానీ ఓడించారు. నాటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన రాహుల్ కేరళలోని వయనాడ్లో గెలుపొందారు. -
షాకిచ్చిన టాటా మోటార్స్.. కార్ల ధరల పెంపు
TATA Motors Increase Prices On All Vehicles: కొత్త సంవత్సరంలో కొత్తకారు కొనాలనుకుంటున్న వాళ్లకు టాటా మోటార్స్ షాకిచ్చింది. ఈ వాహన తయారీ సంస్థ అన్ని ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను జనవరి 1వ తేదీ నుంచి పెంచుతోంది. దీంతో టాటా మోటార్స్ కార్లు ఖరీదు కానున్నాయి. అయితే ఎంత శాతం సవరిస్తున్నదనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేశ్ చంద్ర తెలిపారు. మరోవైపు కమర్షియల్ వెహికల్స్ ధరలను సైతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ఈమధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ, మధ్య, తేలిక వాహనాలతో పాటు చిన్నస్థాయి వాణిజ్య వాహనాలు, బస్సులకు ఈ పెంపు వర్తించనుందని తెలిపింది. ఇక ఈ కమర్షియల్ వాహనాలపై 2.5 శాతం పెంపు జనవరి 1, 2022 నుంచి అమలుకానుంది. డుకాటీ సైతం కాగా, లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ డుకాటీ సైతం వచ్చే నెల 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతోంది. ‘ఇక్కడి మార్కెట్లో అత్యంత పోటీతత్వంతో వాహనాల ధరలను ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. ముడి సరుకు, ఉత్పత్తి, రవాణా ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ధరలను మార్చవలసి వస్తోంది’ అని వివరించింది. ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకి కార్ల ధరలను పెంచుతున్నట్టు హఠాత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే హోండా, రెనాల్ట్ కంపెనీలు కూడా ధరలను ధరల పెంపును సమీక్షించే యోచనలో ఉండగా.. అడీ కంపెనీ ఏకంగా 3 శాతం పెంచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది,. కానీ, కార్ల తయారీలో కీలకమైన స్టీలు, రోడియం మెటీరియల్ల ధరలు బాగా పెరగడం, దీనికి తోడు సెమికండర్ల కొరత సైతం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఈ కారణాలతో ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీలు చెప్తున్నాయి. కార్ల రేట్లు రయ్.. రయ్! -
హోటల్ ఫుడ్ ఇక మరింత ప్రియం.. 30 శాతం మేర పెరగనున్న ధరలు
సాక్షి, ముంబై: రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు మరింత ప్రియం కానున్నాయి. త్వరలో 30 శాతం మేర ధరలు పెరగనున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా ఖర్చులూ పెరుగుతుండటం, దానికి తోడు కూరగాయల ధరలు, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని ‘ఆహార్’ సంఘటన అధ్యక్షుడు శివానంద్ శెట్టి పేర్కొంటున్నారు. దీంతో సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు హోటల్కు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ‘కరోనా’ నుంచి కోలుకోకముందే కరోనా సంకట కాలంలో హోటల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల మధ్య హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినప్పటికీ అనుకున్న మేర లాభాలు కాదుకదా కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ఖర్చులు పెరిగి, ఆదాయం గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు ఆర్థికంగా భారీ దెబ్బతిన్నారు. ఈ ఏడాది మే, జూన్ తర్వాత దశల వారీగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో హోటల్ వ్యాపారాలు మెల్లమెల్లగా పుంజుకోసాగాయి. అయితే గతేడాది చవిచూసిన నష్టాన్ని పూడ్చుకోవాలని హోటల్ వ్యాపారులు భావించారు. కానీ ధరలు పెంచితే మొదటికే మోసం వస్తుందని భావించి పాత ధరలతోనే నెట్టుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆహారపదార్థాల ధరలను కనీసం 30 శాతం పెంచక తప్పని పరిస్థితి నెలకొందని శివానంద్ అంటున్నారు. చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!) పెరిగిన ధరలు హోటల్, రెస్టారెంట్లు, క్యాంటీన్లలో గ్యాస్ సిలిండర్ వినియోగం తప్పనిసరి. స్టార్ లేదా పెద్ద హోటళ్లలో రోజుకు ఐదు సిలిండర్లు, చిన్న హోటళ్లలో రోజుకు రెండు గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తుంటారు. ఆయా వ్యాపార సంస్థలు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్కు ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ కంటే ఎక్కువే చెల్లిస్తారు. అవి కూడా పెరగడంతో ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోవడంతో రవాణా చార్జీలు పెరిగాయి. విద్యుత్ బిల్లులు, కార్మికులు, సిబ్బంది వేతనాలు, సామగ్రి కొనుగోలు ఖర్చు అన్నీ పెరగడంతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రతీ హోటల్కు గ్రేడ్ను బట్టి ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. అదే తరహాలో మెనూ ధరలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్లలలో మెనూ చార్జీలు పెంచాల్సి వస్తోందని శివానంద్ స్పష్టం చేశారు. లేకపోతే హోటళ్లు, రెస్టారెంట్లు నడపలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే 30 శాతం ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలో హోటల్, రెస్టారెంట్ల యజమానులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
టమాటా ధర పైపైకి.. కిలో రూ.42
మదనపల్లె (చిత్తూరు): టమాటా ధరలు రోజురోజుకీ పుంజుకుంటున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం కిలో రూ.42 వరకు పలికింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగుబడి దెబ్బతినడం, అందుబాటులో ఉన్న టమాటా నాణ్యత లేకపోవడం తదితర కారణాలతో మార్కెట్కు ఆశించిన మేర సరుకు రావడం లేదు. మదనపల్లె మార్కెట్కు తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలతో పాటుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన రాయల్పాడు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల నుంచి రైతులు బుధవారం మార్కెట్కు 189 మెట్రిక్టన్నుల టమాటాను తీసుకొచ్చారు. ఈ వారంలో సోమవారం మొదటి రకం కిలో టమాటా ధర రూ.38, మంగళవారం రూ.36 పలికితే బుధవారం రూ.42కు చేరుకోవడం విశేషం. చదవండి: Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు -
జీన్స్, టీషర్ట్స్ లవర్స్కు షాకింగ్ న్యూస్...!
జీన్స్, టీ షర్ట్స్ అంటే యువతకు విపరీతమైన మోజు. ఏదైనా షాపింగ్ మాల్స్కు వెళ్లినప్పుడు మనలో ఎక్కువగా ఫ్రీఫర్ చేసేది జీన్స్, టీషర్ట్సే...! కాగా రానున్న రోజుల్లో జీన్స్, టీషర్ట్స్ ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి.దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా కాటన్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, షిప్పింగ్ కంపెనీలు కాటన్ రవాణాకు భారీగా ఛార్జీలను వసూలు చేస్తుండటంతో కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! భారత్తో సహా, అమెరికా లాంటి దేశాల్లో పత్తి పంటకు భారీ సమస్యలు తలెత్తడంతో కాటన్ దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా చైనా, మెక్సికో దేశాలు రికార్డు స్ధాయిలో కాటన్ను కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది నుంచి ఈ దేశాల నుంచి అమెరికా పూర్తిగా దిగుమతులను నిలిపివేసింది. భారీ మొత్తంలో కాటన్ను కొనుగోలు చేసి కృత్రిమ కొరతను సృష్టించేలా చైనా ముందుకు సాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్లలో తొలిసారి కాటన్ ఫ్యూచర్స్ పౌండ్ (సుమారు 453 గ్రాములు)కు ఒక డాలర్కు చేరింది. అంతర్జాతీయంగా కాటన్ ధరలు పెరగడంతో పలు జీన్స్, టీ షర్ట్స్ కంపెనీలు త్వరలోనే భారీగా ధరలను పెంచేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది. కాటన్ ధరల పెరుగుదల లివైస్ స్ట్రాస్లాంటి పెద్ద కంపెనీలకు భారీ ఎత్తున్న ప్రభావితం చేస్తున్నాయి. న్యూయర్క్లో డిసెంబర్ నెలలో కాటన్ షిప్పింగ్ ఛార్జీలు ఒక పౌండ్కు 3.6 శాతం పెరిగి 1.0155 డాలర్లకు చేరుకుంది. 2011, నవంబర్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మొత్తంగా ధర 28 శాతం పెరిగింది. ఎందుకైనా మంచిది ఈ పండుగ సీజన్లో ఓ నాలుగైదు జీన్స్ ఎక్కువ కొనుక్కోవడం మంచిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: Netflix: ఓటీటీలో సినిమా, వెబ్సిరీస్లేకాదు..గేమ్స్ కూడా..! -
ఈ బైక్ ధరలను మరోసారి పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్..!
Royal Enfield Meteor 350: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్కు కంపెనీ మరోసారి షాక్ను ఇచ్చింది. మిటీయోర్ 350 సిరీస్ మోడల్ బైక్ల ధరలను మరోసారి పెంచింది. 2021 జులైలో ఈ బైక్ మోడల్ ధరలను సుమారు రూ. 10,048 మేర పెంచింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి బైక్ ధరలను రాయల్ఎన్ఫీల్డ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫైర్బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు వేరియంట్లపై సుమారు రూ. 6,428 మేర పెంచింది. చదవండి: Apple: మాకు ఎవరీ సహాయం అక్కర్లేదు..! మిటీయోర్ 350 ఫైర్బాల్ వేరింయట్ కొత్త ధర రూ.198,537 గాను, స్టెల్లార్ వేరియంట్ కొత్త ధర రూ. 204,527గాను, సూపర్నోవా 350 వేరియంట్ ధర రూ. 214,513 గా నిర్ణయించింది.ఈ ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ కు చెందినవి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును. రాయల్ ఎన్ఫీల్డ్ మిటీయోర్ 350 బైక్లను గత ఏడాది నవంబర్ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. థండర్బర్డ్ స్థానంలో మిటీయోర్ 350ను రాయల్ ఎన్ఫీల్డ్ ప్రవేశపెట్టింది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! -
పర్సనల్ కంప్యూటర్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్సెట్ కొరత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్టాప్లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్టాప్, డెస్క్టాప్, ఆల్ ఇన్ వన్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం. నిలిచిపోయిన సరఫరా.. ల్యాప్టాప్స్లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్ అంతా హై ఎండ్ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్ ఎండీ అహ్మద్ తెలిపారు. లో ఎండ్ ల్యాప్టాప్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. పేరుతోపాటు ధర కూడా.. కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్ వచ్చిందంటే మోడల్ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్సెట్ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్టాప్ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్టాప్ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్ ఇన్ వన్ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్జెట్ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్జెట్ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు. -
‘డ్రై ఫ్రూట్స్’పై తాలిబన్ ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి డ్రై ప్రూట్స్ సహా అనేక వస్తువులను భారత్తో పాటు అనేక దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో దేశంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్గానిస్తాన్ సరిహద్దులను తాలిబన్లు మూసివే యడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపో యాయి. ఈ ప్రభావం అన్నింటికంటే ఎక్కువగా భారత్లోని డ్రైప్రూట్స్ వ్యాపారంపై పడింది. కళ తప్పిన ఢిల్లీలోని కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్ ఏటా భారత్లో అమ్ముడవుతున్న డ్రై ప్రూట్స్లో 80% అఫ్గాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. ఇందులో ఎండుద్రాక్ష, బాదం, అంజీర్, వాల్నట్స్, పిస్తా, కాజు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు అఫ్గానిస్తాన్ నుంచి మన దేశానికి సరుకు రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల వ్యవధిలోనే దేశంలోని అతిపెద్ద డ్రై ప్రూట్స్ హోల్సేల్ మార్కెట్ అయిన ఢిల్లీ చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో 30% నుంచి 40% వరకు ధరల్లో పెరుగుదల నమోదైందని వ్యాపారులు తెలిపారు. ఒక్కొక్క డ్రైఫ్రూట్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.400 వరకు పెరిగాయి. 10 రోజుల్లో ఎంత మార్పు?: ఒకవైపు దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు డ్రైఫ్రూట్స్ వినియోగంతో సాధారణ ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్య నిఫుణులు తెలపడం కారణంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వాటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అఫ్గాన్ పరిణామాల నేపథ్యంలో ధరల పెరుగుదల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని డ్రైఫ్రూట్స్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో అడుగుపెట్టడానికి స్థలం ఉండని పరిస్థితి నుంచి నేడు చాలా తక్కువ మంది షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ హోల్సేల్ మార్కెట్ నుంచే డ్రైఫ్రూట్స్ సరఫరా అవుతుంటాయి. 10 రోజుల క్రితం వరకు కిలో రూ.700 చొప్పున అమ్ముడైన క్వాలిటీ బాదం ఇప్పుడు రూ.1000–1200కి అమ్ముడవుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అంజీర్ ధర గతంలో కిలోకు రూ.800–1000 వరకు ఉండగా, తాజా పరిణామాలతో ఒక్కసారిగా రూ.1100–1200 వరకు చేరింది. ప్రస్తుతానికి సరిపడ నిల్వలు బాదం, ఎండు ద్రాక్ష, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యపోతున్నారని డ్రై ఫ్రూట్ రిటైల్ వ్యాపారి బల్వీర్ సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతానికి తమ వద్ద నిల్వలు సరిపడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం హోల్సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న పరిమిత స్టాక్ ధరను నెమ్మదిగా పెంచి విక్రయిస్తున్నారని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వారు చెబుతున్నారని సింగ్ తెలిపారు. అఫ్గానిస్తాన్లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరిన తర్వాత ధరల్లో స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారుల ముందు జాగ్రత్త రానున్న రోజుల్లో దిగుమతులు జరగకపోవడం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును నిల్వ చేయడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు తాము ఏ రేటుకు పొందుతామనే భయం వ్యాపారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తక్కువ ధరలో ఎందుకు విక్రయించాలని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం పరిష్కారం కనుక్కోవాలి రాబోయే కొద్ది రోజుల్లో అఫ్గానిస్తాన్ నుండి కొత్త సరుకు వస్తుందని డ్రైప్రూట్స్ వ్యాపారి గౌరవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గతంలోనే తమకు రావాల్సిన స్టాక్కు సంబంధించిన అక్కడి వ్యాపారులకు ముందుగానే చెల్లించామని, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని గౌరవ్ తెలిపారు. అంతేగాక అఫ్గానిస్తాన్లోని వ్యాపారులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని, ఈ వ్యాపారంలో తమ కోట్లాది రూపాయలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని, లేకపోతే డ్రైఫ్రూట్స్ వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దేశంలో 80 శాతం డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్తాన్ నుంచి వచ్చినవే ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని ప్రభావితం చేసిందని, దీని కారణంగా ధరలు పెరగడం సహజమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు చేస్తోందని, త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దుబాయ్ నుంచి డ్రైఫ్రూట్స్ ఉత్పత్తుల దిగుమతులకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. -
Petrol Prices: పెట్రో పరుగు, చెన్నైలో కూడా సెంచరీ
సాక్షి, ముంబై: రెండు రోజులు విరామం తరువాత ఇంధన ధరలు శుక్రవారం మళ్లీ పరుగందుకున్నాయి. పెట్రోల్పై 35పైసలు పెరగ్గా, డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. జూలై నెలలో మొదటి పెరుగుదల. తాజా పెంపుతో ఎనిమిది రాష్ట్ర రాజధానులలో పెట్రోలు ధర సెంచరీ మార్క్ను దాటి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. పెట్రోలు ధర 100 రూపాయలు దాటి నగరాల్లో ఇపుడు చెన్నై చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.100.13 డీజిల్ రూ.93.72 పలుకుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు 12 రాష్ట్రాలున్నాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 99.16, డీజిల్ రూ. 89.18 ముంబైలో పెట్రోల్ రూ.105.24; డీజిల్ రూ. 96.72 కోల్కతాలో పెట్రోల్ రూ.99.04, డీజిల్ రూ. 92.03 బెంగళూరులో పెట్రోల్ రూ.102.48; డీజిల్ రూ.94.54 హైదరాబాద్లో పెట్రోల్ రూ103.05; డీజిల్ రూ.97.20 చదవండి: Stockmarkets: ఆటో జోరు, ఐటీ బేజారు -
Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం కంపెనీ షావొమీ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సరసమైన ధరలు, అద్భుత ఫీచర్ల స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ టీవీలతో వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుని, భారత మార్కెట్లో టాప్ పొజిషన్లోకి దూసుకొచ్చిన షావోమి తన ఉత్పత్తులపై ధరలను 3-6 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది. డిమాండ్-సరఫరా మధ్య అంతరాయం పెరగడంతో విడిభాగాల ధరలు పెరుగుతూ వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో జూలై 1 నుంచి తమ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలను 3-6 శాతం పెంచిన ధరలు అమల్లో ఉంటాయని షావోమి ప్రకటించింది. షిప్పింగ్ చార్జీల భారం, కాంపోనేట్స్ కొరత కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండియా ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం నుండి భారీ డిమాండ్-సరఫరా అసమతుల్యత నెలకొంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లలో (చిప్సెట్లు, డిస్ప్లే ప్యానెల్లు, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ ప్యానెల్లు, బ్యాటరీ మొదలైనవి) ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని తెలిపారు. కాగా గ్లోబల్ మార్కెట్లో ప్యానెళ్ల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. సముద్ర సరుకు రవాణా ఛార్జీలూ కూడా పెరిగాయి. ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్లో బాగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ టీవల విభాగంలో ఇతర సంస్థలు కూడా ఈ నెలలో ధరలను 3-4 శాతం పెంచనున్నాయని అంచనా. చదవండి: Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్! -
అన్నీ ధరలు పెరుగుతున్నాయ్, కార్ల ధరల్ని పెంచుతున్నాం
ముంబై: మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో మరోసారి కార్ల ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే నెల(జూలై) నుంచి తమ పోర్ట్ఫోలియోలోని అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లో కమోడిటీలు, స్టీల్తో సహా ముడిసరుకుల వ్యయాలు పెరగడంతో తమ ఉత్పత్తులపై ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు మోడళ్ల ఆధారంగా ఉంటుందని, ఏ మోడల్పై ఎంత ధర పెంచుతామనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో మరోసారి కార్ల ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగం మీకలనా, అయితే ఈ టెక్నాలజీ నేర్చుకోండి -
Petrol diesel prices: పెట్రో రికార్డు పరుగు
సాక్షి, ముంబై: ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి. తాజాగా మరోసారి రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక రోజు విరామం తరువాత, జూన్ 14 న పెట్రోల్ 29 పైసలు, డీజిల్పై 31 పైసలు పెంచుతూ కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా రికార్డ్స్థాయికి చేరాయి.ముంబైలో పెట్రోల్ ఆల్ టైం గరిష్ట స్థాయి 102.58 రూపాయలను తాకింది. అటు హైదరాబాద్లో కూడా లీటర్ పెట్రోల్ సెంచరీ దాటేసింది. పెట్రోల్ రూ.100.20వద్ద, డీజిల్ రూ.95.14గా ఉంది. దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, లడఖ్ సహా ఏడు రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు మార్కుకు రూ .100 పైన ఉంది. మే 4 నుంచి ఇప్పటివరకు ఇంధన ధరలు పెరగడం 25వసారి. దేశంలోని పలున గరాల్లో పెట్రోలు,డీజిలు ధరలు, లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ ధర 96.41, , డీజిల్ రూ .87.28 కోలకతాలో పెట్రోలు ధర 96.34,, డీజిల్ రూ. 90.12 బెంగళూరులో పెట్రోలు ధర 99.63, డీజిల్ రూ. 92.52 ముంబైలో పెట్రోలు ధర 102.58, డీజిల్ రూ. 94.70 హైదరాబాద్లో పెట్రోలు ధర 100.20 , డీజిల్ రూ. 95.14 అమరావతిలో పెట్రోలు ధర 102.31, డీజిల్ రూ. 96.92 చదవండి: ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ -
Petrol Price: రూ.102 దాటేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక రోజుగా గ్యాప్ తరువాత వరుసగా శుక్రవారం, నేడు(శనివారం) రెండు రోజూ ఇంధన ధరలు ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇప్పటికే పెట్రో ధర రూ.100 మార్క్ను దాటేసింది. తాజాగా పెట్రోల్పై లీటర్కు 28 పైసలు, డీజిల్పై 27 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది . ఈ పెంపుతో వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 102 మార్క్ను దాటగా, విజయవాడలో సుమారు 102 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని నగరంలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98 గా ఉంది. ఈ నెలలో 12 రోజుల కాలంలో ఇప్పటివరకు ఏడు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి. తొలిసారి 100 దాటిన డీజిల్ ధర: దేశంలో తొలిసారిగా డీజిల్ ధర100 రూపాయలు దాటింది, రాజస్థాన్లో లీటరు డీజిల్ ధర ఇపుడు రూ. 100.05 వద్ద అమ్ముడవుతోంది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ.96.12, డీజిల్ రూ.86.98 ముంబైలో పెట్రోల్ రూ.102.30, డీజిల్ రూ.94.39 చెన్నైలో పెట్రోల్ రూ.97.43, డీజిల్ రూ. 91.64 కోల్కతాలో రూ.96.06 డీజిల్ రూ.89.83 హైదరాబాద్లో పెట్రోల్ రూ.99.90, డీజిల్ రూ.94.82 విజయవాడలో పెట్రోల్ రూ.101.88, డీజిల్ రూ.96.23 వైజాగ్లో పెట్రోల్ రూ.101.05, డీజిల్ రూ.95.41 చదవండి: Weekend love: ఈ వీడియోలను చివరిదాకా చూస్తే.. H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట -
Gold Prices: మళ్లీ పెరుగుతున్న ధరలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో పుత్తడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. శుక్రవారం అంతర్జాతీయంగా యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి బంగారం ధరలు ఔన్స్ ధర 1,902.90 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 5 డెలివరీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారు ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 49,346 రూపాలు పలుకుతోంది. డాలరు బలహీనం, బ్లాండ దిగుమతి పుత్తడి ధరలను ఊతమిస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాల మధ్య ఫెడరల్ రిజర్వ్ సరళ ద్రవ్య విధానం సరిపోదని విశ్లషకులు భావిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అధికారిక ట్విటర్ సమాచారం ప్రకారం స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 48,750 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి పది గ్రాములకు రూ. 47,090, 18 క్యారెట్ల బంగారం రూ. 39,000 గాను ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 300 రూపాయలు ఎగిసిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 50,500 వద్ద, 22 క్యారెట్ల బంగారం 10 గ్రా ధర రూ.46,100గా ఉంది. 1000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర రాజధాని నగరంలో వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 71224 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా 1000 రూపాయలు ఎగిసింది. కిలో వెండి రూ. 77100 గా ఉంది. కాగా గత వారం 10 గ్రాముల బంగారం ధర 49,700 రూపాయల వద్ద ఐదు నెలల గరిష్ట స్థాయిని తాకిన తరువాత బంగారం ధరలు దిగొచ్చాయి. వరుసగా సెషన్లలో క్షీణించి రికార్డు స్థాయి నుంచి సుమారు 7వేల రూపాయలు మేర పడిపోయింది. అయితే 49500 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంచనాలకు అనుగుణంగానే పసిడి ధర మళ్లీ పుంజుకుంటోంది. చదవండి: Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ! stockmarkets: రికార్డుల మోత -
Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలకు అదుపులేకుండా పోతోంది. మంగళవారం స్థిరంగా ఉన్న ధరలు బుధవారం మరో రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ , ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. బుధవారం (జూన్ 9)పెట్రోలు ధరను లీటరుకు 23-25 పైసలు, డీజిల్పై 23-27 పైసలు మేర పెంచాయి. మే 4 నుంచి 22 వ పెంపు. ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు 1.07 రూపాయలు పెరిగింది. తాజాగా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .95.56 (25 పైసల పెరుగుదల) డీజిల్ ధర లీటరుకు రూ .86.47 స్థాయికి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకు 102 (రూ.101.76) రూపాయల వద్ద అత్యధిక స్థాయిని తాకింది. అలాగే దేశంలో రాజస్థాన్, శ్రీగంగానగర్లో పెట్రోలు రూ.106.64 వద్ద, డీజిల్ రూ.99.50వద్ద గరిష్ట ధరను నమోదు చేయడం గమనార్హం. దేశంలోని నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోలు ధర రూ.101.76 డీజిల్ రూ. 93.85 చెన్నైలో పెట్రోలు ధర రూ.96.94, డీజిల్ రూ. 91.15 బెంగళూరులో పెట్రోలు ధర రూ.99.75, డీజిల్ రూ. 91.67 కోలకతా పెట్రోలు ధర రూ. 95.52, డీజల్ రూ. 89.32 హైదరాబాదులో పెట్రోలు ధర రూ.99.31, డీజిల్ రూ. 94.26 అమరావతిలో పెట్రోలు ధర రూ101.73, డీజిల్ రూ. 96.08 విశాఖపట్టణంలో పెట్రోలు ధర రూ100.49, డీజిల్ రూ. 94.88 చదవండి: బ్యాంకుల జోరు, నిఫ్టీ ఆల్టైం హై బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే -
తెలంగాణలో సెంచరీ కొట్టిన ప్రీమియం పెట్రోల్ ధర
సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతూ సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశంలో కంపెనీలు చమురు ధరలను పెంచుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గున మండుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రీమియం పెట్రోల్ ధర తొలిసారి వంద మార్కును దాటింది. సాధారణ పెట్రోల్ ధర సైతం వందను చేరేందుకు పరుగులు పెడుతోంది. గత పది రోజుల్లో ఆయిల్ కంపెనీలు ఆరుసార్లు ధరలను పెంచేశాయి. మంగళవారం పెట్రోల్పై మళ్లీ 28 పైసలు పెంచాయి. పది రోజుల కిందట లీటర్ రూ.94.86 ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్లో రూ.96.50కి చేరింది. అంటే రూ.1.64 పైసల మేర పెరిగింది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందించే ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర రూ.100.63, హెచ్పీసీఎల్ వారి పవర్ పెట్రోల్ ధర రూ.100.13, బీపీసీఎల్ స్పీడ్ పెట్రోల్ రూ.99.09కి చేరింది. పెట్రోల్తోపాటే డీజిల్ ధరలూ పైకి ఎగబాకుతున్నాయి. పదిరోజుల కిందట డీజిల్ ధర రూ.90.73గా ఉండగా, అది రూ.1.93 పైసల మేర పెరిగి ప్రస్తుతం 91.04కు చేరిం ది. ఈ పది రోజుల్లో పెరిగిన ధరల కారణం గా రాష్ట్రంలోని వినియోగదారులపై సుమా రు రూ.25 కోట్ల భారం పడినట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు చెబుతు న్నారు. గత ఏడాదికన్నా పెరిగిన వినియోగం గత ఏడాది లాక్డౌన్ ఉన్న మే నెలతో పోలిస్తే ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న సమయంతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. గత ఏడాది మేలో 1 నుంచి 15వ తేదీ వరకు పెట్రోల్ వినియోగం 72 వేల కిలోలీటర్లుగా ఉండగా, ఈ ఏడాది మే నెలలో లక్ష కిలో లీటర్లను దాటేసింది. డీజిల్ అమ్మకాల విషయానికొస్తే.. గత ఏడాది మే నెలలో 1.70 లక్షల కిలో లీటర్ల మేర ఉండగా, ఈ ఏడాదిలో 2.05 లక్షల కిలో లీటర్లుగా ఉంది. గత ఏడాది సంపూర్ణ లాక్డౌన్తో అత్యవసర వాహనాలు మినహా, ఏ ఇతర వాహనాలు రోడ్లపైకి రాలేదు. కానీ ఈ ఏడాది ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తప్ప మిగిలిన సమయమంతా లాక్డౌన్ ఉండటం, జాతీయ రహదారులపై వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో వినియోగం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే జాతీయ రహదారులకు దూరంగా ఉన్న పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకే పెట్రోల్ బంకులు తెరిచి ఉంచుతున్నారు. మిగతా సమయాల్లో మూసివేస్తున్నారు. అయితే కనీసం మధ్యాహ్నం 3 గంటల వరకైనా బంకులు తెరిచి ఉంచాలని పెట్రోల్బంకుల యాజమాన్యాలు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు, ఇతర వ్యవసాయ పనులను దృష్టిలో పెట్టుకొని బంకులు నడిపే సమయం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నెల బడ్జెట్ 2 వేలు పెరిగింది నేను ఎన్పీడీసీఎల్ (విద్యుత్తు శాఖ)లో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నా. జనగామ మండలం పెంబర్తి నుంచి రోజూ బచ్చన్నపేట వెళ్లి బిల్లుల కలెక్షన్ చేస్తా. రోజూ వంద కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గతంలో నెలకు 56 లీటర్ల పెట్రోల్కు రూ.4,400 ఖర్చు వచ్చేది. ఇప్పుడు ధరలు పెరగడంతో నెల బడ్జెట్ మరో రూ.2 వేలు పెరిగింది. మధ్యలో నెల రోజుల పాటు ప్రీమియం (పవర్) పెట్రోలు వినియోగించా. ఇప్పుడు దాని ధర రూ.100 దాటి పోవడంతో రెగ్యులర్ పెట్రోల్నే వాడుతున్నా. – ఎండీ ఖదీర్, ఎన్పీడీసీఎల్ బిల్ కలెక్టర్, బచ్చన్నపేట, జనగామ -
ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం ఏదో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్ల ధరల పెరుగుదల విషయంలో 2020 అక్టోబరు-డిసెంబరు కాలంలో టాప్-150 గ్లోబల్ అర్బన్ సిటీస్ జాబితాలో భారతీయ నగరాలు వెనుకంజలో ఉన్నాయి.నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ క్యూ 4 2020’ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో గృహాల ధరలు 2020 లో సగటున 5.6శాతం పెరిగాయి. ఇది 2019 లో 3.2శాతం మాత్రమే. ముఖ్యంగా 2020 క్యూ 4 లో ఇళ్ల ధరలు పుంజుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ కావడం విశేషం. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. జాబితాలో చోటు సంపాదించుకున్న ఎనిమిది భారతీయ నగరాల్లో హైదరాబాద్ మాత్రమే 0.2 శాతం వార్షిక వృద్ధి సాధించి 122 ర్యాంకును దక్కించుకుంది. 150వ ర్యాంకు సాధించిన చెన్నైలో గృహాల ధరలు 9 శాతం తగ్గాయి. బెంగళూరులో 0.8 శాతం, అహ్మదాబాద్ 3.1, ముంబై 3.2, ఢిల్లీ 3.9, కోల్కత 4.3, పుణేలో 5.3 శాతం తగ్గాయి. తొలి ర్యాంకు కైవసం చేసుకున్న టర్కీలోని అంకారాలో ఇళ్ల ధరలు 30.2 శాతం అధికమయ్యాయి. 2019తో పోలిస్తే అంతర్జాతీయంగా గతేడాది 150 నగరాల్లో గృహాల ధరల సగటు వృద్ధి 5.6 శాతం నమోదైంది. 2019లో ఈ వృద్ధి 3.2 శాతంగా ఉంది. 2020లో 81 శాతం నగరాల్లో ధరలు పెరిగాయి. -
పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్
సాక్షి,ముంబై: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రో ధరలపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ విమర్శలు గుప్పించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై సోషల్ మీడియాలో తన దాడిని ఎక్కుపెట్టారు. ‘మామి తరువాతి స్థాయికి చేరుకున్నారు. ‘ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు.. మామి రాక్స్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధరలు దిగొచ్చే అవకాశం ఉందని నిర్మలా గతవారం వ్యాఖ్యానించారు. ధరల అదుపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు హద్దే లేకుండా పెరుగుతున్నపెట్రోలు, డీజిల్ ధరలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే మీమ్స్, వ్యంగ్యోక్తులతో బీజేపీ సర్కార్పై నెటిజన్లు విరుచుక పడుతున్నారు. పెట్రోలు ధరలను భారీగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడిన నిర్మలా సీతారామన్, తాజా పెంపుపై మాత్రం ఆర్థికమంత్రిగా విభిన్నంగా స్పందించారు. దీనికి ఆయిల్ కంపెనీలే బాధ్యత వహించాలని, ఇంధన ధరల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదని పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి మాసంలో రికార్డు స్తాయిలో పుంజుకున్న పెట్రోలు, డీజిల్ గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. Maami is next level flexible in her belief system. No onions, no memory, no principles. Maami rocks! https://t.co/4WZ791m1HV — Siddharth (@Actor_Siddharth) February 22, 2021 -
వంట గ్యాస్పై 50 పెంపు
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. 14.2 కేజీల గృహావసర సిలిండర్పై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 50 పెంచాయి. పెంపు అనంతరం ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 769కి చేరింది. ఈ పెంపు నేటి(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా నెలవారీగా చమురు సంస్థలు ఈ ధరను సమీక్షిస్తాయి. గృహావసర ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం ప్రభుత్వం సబ్సీడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఆగని పెట్రో మంట న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రో ల్ ధర లీటరుకు 29 పైసలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగింది. దీంతో రాజస్తాన్లోని గంగానగర్ టౌన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.29కి చేరగా డీజిల్ ధర రూ. 91.17కి చేరింది. దేశంలోకెల్లా రాజస్తాన్లో అత్యధిక పన్ను లు ఆయిల్ రేట్లపై వడ్డిస్తున్న కారణంగా ఈ రేట్లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవిత కాల గరిష్టానికి రూ. 88.73కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 79.06కు చేరకుంది. -
‘టిఫిన్’ తినేదెట్లా?
సిటీలో అల్పాహారం తినడం ఇక కష్టమే. ఇడ్లీ, దోసె, వడ, మైసూర్ బజ్జీ, పూరీ లాంటి టిఫిన్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కరోనా లాక్డౌన్ కారణంగా కొద్దిరోజులుగా మూతపడిన టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రోడ్డు వెంబడి బండ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ ఐటమ్స్ రేట్లు మాత్రం విపరీతంగా పెంచేశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సాక్షి, హైదరాబాద్: టిఫిన్ సెంటర్ లేదా హోటల్కు వెళ్లి ప్లేట్ ఇడ్లీ తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కుటుంబంతో కలిసి హోటల్కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ ఇచ్చే ముందు పర్స్ చెక్ చేసుకోవాల్సి వస్తోంది. ఇంట్లో టిఫిన్ రెడీ చేయకపోతే టిఫిన్ సెంటర్కు వెళ్లి రూ.వంద ఇస్తే నలుగురికి సరిపడా టిఫిన్ వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అన్ని ధరలతో పాటు టిఫిన్ ఐటమ్స్ రేట్లూ పెరిగిపోయాయి. దీంతో చాలా మంది టిఫిన్ సెంటర్కు వెళ్లకుండా ఇంట్లో ఏది ఉంటే అది తినేందుకు సిద్ధపడుతున్నారు. కరోనా ప్రభావం గ్రేటర్లో కాస్త తగ్గుతున్న నేపథ్యంలో గ్రేటర్ ప్రజలు ఇప్పడుడిప్పుడే బయటి ఫుడ్కు అలవాటు పడుతున్నారు. దీంతో హోటల్ వ్యాపారం కాస్త పుంజుకుంటుంది. అయితే ధరలు మాత్రం విపరీతంగా పెంచారు. గత ఐదు నెలలుగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్ సైడ్ బండ్లు సైతం నడవక తీవ్ర నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడంతోపాటు ప్రస్తుతం నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో అల్పాహారం రేట్లు పెంచాల్సి వస్తోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇడ్లీ, వడ, దోసె, పూరీ, మైసూర్ బోండా ధరలు గతం కంటే 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. స్పెషల్ టిఫిన్ల ధరలు ఇంకా భారీ స్థాయిలోనే పెరిగాయి. కరోనా సంక్షోభానికి ముందు ఇడ్లీ ప్లేట్ రూ.15 నుంచి రూ.20 ఉండగా, ఇప్పుడు దాదాపు రెట్టింపు ధర పెట్టాల్సి వస్తోంది. కొన్ని టిఫిన్ సెంటర్లలో ధర అంతగా పెంచకపోయినా, పరిమాణం మాత్రం బాగా తగ్గించారు. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లపై ప్లేట్కు నాలుగు ఇడ్లీలు ఇస్తుండగా, పెద్ద టిఫిన్ సెంటర్లలో రెండు మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కొన్ని టిఫిన్ సెంటర్లలో రూ.30 నుంచి రూ. 50 వరకు చేరుకుంది. స్పెషల్ సాంబార్ ఇడ్లీ రూ.50 నుంచి రూ.70 వరకు బిల్ వేస్తున్నారు. గతంలో రూ.20 ఉన్న సాదా దోసె ఇప్పుడు రూ.30కి పెరిగింది. మసాల దోసె, ఆనియన్ దోశ, ఆమ్లెట్, ఉప్మా దోసె రూ.50 నుంచి రూ.70 వరకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల స్పెషల్ దోశలకు రూ.100 కూడా ఇవ్వాల్సి వస్తోంది. మైసూరు బజ్జీ ప్లేట్ గతంలో రూ.25 ఉండగా, ఇప్పుడు కొన్ని చోట్ల రూ.50 వరకు తీసుకుంటున్నారు. ఇక వడ రూ.50 నుంచి రూ.60 పెడితే కాని తినలేని పరిస్థితి. పూరీ, చపాతీల ధరలూ పెరిగిపోయాయి. సరుకుల ధరలు పెరగడంతోనే... కరోనా అనంతరం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో టిఫిన్ల ధరలూ పెంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు. లాక్డౌన్ తరువాత నిత్యావసర సరుకుల ధరలు దాదాపు 30 నుంచి 40 శాతం పెరిగాయి. ప్రస్తుతం కిలో మినపప్పు రూ.120 నుంచి రూ. 140, పల్లీలు రూ.100 నుంచి రూ.120, పుట్నాలు రూ.40 నుంచి రూ. 60, నువ్వులు కిలో రెండు వందలపైనే లభిస్తున్నాయి. ఇక వంటనూనెల ధరలు కూడా కిలోకు రూ.20 వరకు పెరిగాయి. సరుకుల ధరతో పాటు కూరగాయాల ధరలు కూడా పెరిగాయి. టమాట బెండకాయ, క్యాప్సికం, పందిరి బీర, క్యారెట్ తదితర కూరగాయల ధరలు మండుతున్నాయి. సిబ్బంది జీతాల భారం కరోనాతో చాలా మంది పనివాళ్లు ఊళ్లకు వెళ్లారు. దీంతో లేబర్ సమస్య కూడా ఏర్పడింది. టిఫిన్ సెంటర్లలో మాస్టర్లు, ఇతర సిబ్బంది జీతాలు కూడా పెరిగాయి. గతంలో మాస్టర్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు పనిచేస్తే రూ.300 నుంచి రూ.600 వరకు చెల్లించే వారు. ఇప్పుడు రూ.600 నుంచి రూ. వెయ్యి ఇస్తే కానీ మాస్టర్లు దొరకడం లేదు. ఇతర సిబ్బంది జీతాలు కూడా రెట్టింపు స్థాయిలో పెరిగిపోయాయి. -
బంగారం ధరలు మళ్లీ పైపైకి..
ముంబై : గత కొద్దిరోజులుగా దిగివచ్చిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. డాలర్ పతనంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1988 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్లో మంగళవారం పదిగ్రాముల బంగారం 252 రూపాయలు పెరిగి 51,953 రూపాయలకు ఎగిసింది. కిలో వెండి ఏకంగా 1797 రూపాయలు భారమై 69,115 రూపాయలకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల బంగారం 418 రూపాయలకు చేరి 52,963 రూపాయలు పలికింది. కరోనా వైరస్ ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ రికవరీకి వడ్డీరేట్ల తగ్గింపునకే ఫెడరల్ రిజర్వ్ మొగ్గుచూపడం, డాలర్ బలహీనపడటంతో పసిడికి డిమాండ్ పెరిగిందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి : ఆల్టైం హై నుంచి రూ . 5000 దిగివచ్చిన బంగారం -
15 రోజుల్లో రూ.8 పెరిగిన పెట్రోల్ ధర
సాక్షి, ఢిల్లీ : దేశంలో పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారమైన 15వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. పెట్రోల్పై లీటర్కు 35 పైసలు, డీజిల్పై లీటరుకు 56 పైసలు పెంచాయి. గడిచిన 15 రోజుల్లో లీటర్ పెట్రోల్కు 8.03 రూపాయలు, డీజిల్ 8.27 రూపాయల మేర పెరిగాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే.. లీటర్ పెట్రోల్ ధర : చెన్నైలో 82.27 రూపాయలు ఢిల్లీలో 78.88 రూపాయలు కోల్కతా 80.62 రూపాయలు ముంబైలో 85.70 రూపాయలు హైదరాబాద్లో 81.88 రూపాయలు లీటర్ డీజిల్ ధర : చెన్నైలో 75.29 రూపాయలు ఢిల్లీలో 77.67 రూపాయలు కోల్కతాలో 73.07 రూపాయలు ముంబైలో 76.11 రూపాయలు హైదరాబాద్లో 75.91రూపాయలకు చేరుకున్నాయి. -
వామ్మో! పెట్రో బాదుడు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు ధరలు వరుసగా ఆరో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారం ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్ ధరను లీటరుకు 57 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు పెంచేసాయి. తాజా పెంపుతో ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.31, డీజిల్ ధర లీటరుకు రూ. 3.42 ఎగిసింది. (పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే) ప్రధాన నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీ : పెట్రోల్ రూ. 74.57 డీజిల్ రూ. 72.81 ముంబై: పెట్రోల్ రూ. 81.53. డీజిల్ రూ.71.48 చెన్నై: పెట్రోల్ రూ. 78.47. డీజిల్ రూ. 71.14 బెంగళూరు: పెట్రోల్ రూ.76.98. డీజిల్ రూ. 69.22 హైదరాబాద్: పెట్రోల్ రూ. 77.41. డీజిల్ రూ. 71.16 అమరావతి : పెట్రోల్ రూ.77.94, డీజిల్ రూ. 71.69 చదవండి : స్టాక్ మార్కెట్ భారీ పతనం -
పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే
సాక్షి, న్యూఢిల్లీ : ఇంధన ధరలు గురువారం కూడా పెరిగాయి. వరుసగా ఐదవ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు పెంచాయి. పెట్రోల్ , డీజిల్ రెండింటిపైనా లీటరుకు 60 పైసలు చొప్పున వడ్డించాయి. దీంతో గత ఐదు రోజులలో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.74, డీజిల్ ధర రూ. 2.83 (ఢిల్లీ) మేర పెరగడం గమనార్హం. (పెట్రో షాక్ : నాలుగో రోజూ) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీ : పెట్రోలు రూ. 74. డీజిల్ రూ. 72.22 ముంబై: పెట్రోల్ రూ. 80.98. డీజిల్ రూ. 70.92 చెన్నై: పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ.70.64 బెంగళూరు: పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66 హైదరాబాద్: పెట్రోల్ రూ.76.82. డీజిల్ రూ. 70.59 అమరావతి : పెట్రోల్ రూ.77.36. డీజిల్ రూ. 71.18 -
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రీటైలర్ల తాజా నిర్ణయంతో లీటరుకు రూ. 60 పైసలు పెరిగింది. ఇంతకు ముందు మార్చి 16న చివరిసారిగా ఇంధన ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రం.. పెట్రోల్, డీజిల్పై స్పెసిఫిక్ ఎక్సైజ్ డ్యూటీ వేయటంతో మార్చి 14న లీటర్పై మూడు రూపాయలు పెరిగింది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గుకుంటూ వచ్చాయి. అయినప్పటికి ఇంధన రీటైలర్లు నష్టాల దృష్టా్య తగ్గిన ధరలతో అమ్మకాలు చేపట్టలేదు. ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 1) హైదరాబాద్ : పెట్రోల్ రూ. 74.61, డీజిల్ రూ. 68.42 2) బెంగళూరు : పెట్రోల్ రూ. 74.18, డీజిల్ రూ. 66.54 3) చెన్నై : పెట్రోల్ రూ. 76.07 , డీజిల్ రూ. 68.74 4) న్యూఢిల్లీ : పెట్రోల్ రూ. 71.86, డీజిల్ రూ. 69.99 5) ముంబై: పెట్రోల్ రూ. 78.91, డీజిల్ రూ. 68.79 6) గురుగావ్ : పెట్రోల్ రూ. 71.68 , డీజిల్ రూ. 63.65 -
కోడికూర @ 250
అల్లిపురం(విశాఖ దక్షిణ): కరోనా వైరస్ ప్రభావం వల్ల పడిపోయిన చికెన్ ధరకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మొన్నటి దాకా కరోనా ప్రభావంతో జనాలు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. కనీస ధర లేక పోవడంతో యజమానులు ఫారాల్లో కోళ్లను గోతుల్లో పూడ్చిపెట్టారు. మరికొన్ని చోట్ల కోళ్లను ఉచితంగా పంచిపెట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా కోళ్ల ఫారాల యజమానులు కోళ్లను బాగా తగ్గించుకోవడంతో పాటు కోడిపిల్లల ఉత్పత్తి కూడా తగ్గించుకున్నారు. మరో వైపు చికెన్ తినటం వల్ల కరోనా రాకపోగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం సాగటంతో చికెన్కు డిమాండ్ పెరిగింది. నెలరోజుల కిందట కిలో రూ.80 కిలో చికెన్ నెల కింద రిటైల్లో రూ.80, హోల్ సేల్గా రూ.30 కూడా పలికింది. అదే సమయంలో కోళ్లకు వ్యాధి సోకడంతో చాలా చోట్ల అవి చనిపోయాయి. చికెన్ తినటంతో కరోనా వస్తుందని వదంతులు ప్రచారం సాగడంతో అమ్మకాలు తగ్గాయి. తర్వాత చికెన్కు కరోనాకు సంబంధం లేదని ప్రచారం జరగడంతో ఇప్పుడు చికెన్ ధర అమాంతంగా పెరిగిపోయింది. వారం రోజుల కిందట కిలో చికెన్ రూ.320 కూడా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం రూ.250 పలుకుతుంది. చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోవటంతో వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు. ప్రభుత్వం చేయూత నివ్వడంతో వెలుగు 45 రోజుల కింద పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం రవాణా సదుపాయాలు కల్పించడంతో పుంజుకుంది. రైతు బజార్లు, మార్కెట్లలో కోడిగుడ్లు విక్రయాలకు ఏర్పాట్లు చేయడంతో గుడ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. కోడి గుడ్లుకు డిమాండ్ కోడిగుడ్లకు సైతం డిమాండ్ భారీ పెరిగింది. గుడ్లు అమ్మే దుకాణాల వద్ద సైతం వినియోగదారులు క్యూ కడుతున్నారు. డజను గుడ్లు ప్రస్తుతం రూ.60 పలుకుతోంది. చికెన్కు డిమాండ్ పెరిగింది చికెన్కు డిమాండ్ పెరిగింది. రెండు నిలల కిందట రోజుకు 50 నుంచి 60 కిలోలు మాత్రమే అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం రేటు పెరిగినా ఆదివారం సమయంలో 200 నుంచి 350 కిలోలు అమ్ముతున్నాం. ప్రస్తుతం హోటల్స్ లేక పోవడంతో అందరూ ఇంటి వద్దే చికెన్ వంటకాలు ప్రిపేర్ చేసుకుంటున్నారు. దీంతో చికెన్కు డిమాండ్ పెరిగింది. –భీమవరపు శ్రీనివాస్(సీతంపేట శ్రీను),ఎస్.ఎస్.చికెన్స్ ఎన్నడూ ఈ రేట్లు చూడలేదు చికెన్ కిలో రూ.100 పలకడం చూశాను. లాక్డౌన్ నేపథ్యంలో చికెన్ కిలో రూ.320 అమ్మడం మొదటి సారి చూశాను. ఎన్నడే ఈ రేట్లు చూడలేదు. ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి చేయూత నిస్తున్నా నిర్వాహకులు మాత్రం ధరలు పెంచుతున్నారు. –మద్దాల వెంకట వర లక్ష్మి, పాతవెంకోజిపాలెం -
పసిడి ధరలు పైపైకి
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో కాస్త నెమ్మదించిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బులియన్ మార్కెట్లో పసిడి ధర మళ్లీ 39 వేల రూపాయల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి. ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు మంగళవారం 7వారాల గరిష్టాన్ని నమోదు చేసాయి. దేశీయంగానే ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం రూ. 191 పెరిగి 10 గ్రాముల ధర రూ. 39,239 పలికింది. అటు వెండి ధర ఇదే బాటలో పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 943 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,146కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6డాలర్ల పెరిగి 1,495 స్థాయికి చేరింది. నవంబర్ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి విశేషం. ఈ నవంబర్లో అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు రెకెత్తాయి. అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.101లు పెరిగి రూ.38358.00 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నరాత్రి అమెరికాలో పసిడి ర్యాలీ కారణంగా నిన్న మార్కెట్ ముగిసే సరికి రూ.266 లాభంతో రూ.38,257ల వద్ద స్థిరపడింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం తదితర పండుగల నేపథ్యంలో డిమాండ్ స్వల్పంగా పుంజుకునే అవకాశం ఉందని బులియన్ వర్తకులు భావిస్తున్నారు. -
మీసం మెలేస్తున్న రొయ్య!
సాక్షి, అమరావతి : రొయ్య మీసం మెలేస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు అంతంతమాత్రంగా ఉన్న రొయ్య ధర ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చాన్నాళ్లుగా ప్రతికూల పరిస్థితులతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అక్వా రైతుకు వీటి ధర పెరుగుదల, ప్రభుత్వం విద్యుత్ యూనిట్ చార్జీని సగానికి పైగా తగ్గించడం వెరసి ఉపశమనం కలిగిస్తోంది. దీంతో ఇప్పుడు ఒకింత ఒడ్డున పడ్డామన్న ఆనందం వీరిలో వ్యక్తమవుతోంది. ఆక్వా సాగులో భాగమైన రొయ్యల సాగు జూదంలా మారింది. ఒక ఏడాది లాభాల పంట పండితే మరో ఏడాది నష్టాల పాల్జేస్తోంది. దీంతో రైతులు ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా కలిసొస్తుందన్న ఆశతో దీనిని వదులుకోలేకపోతున్నారు. ఇలా ఏటికేడాది చెరువులకు ఎదురీదుతున్నారు. కొన్నేళ్ల నుంచి పరిస్థితి మరింతగా దిగజారింది. ఒకపక్క ప్రకృతి ప్రతికూలత, మరోపక్క నాణ్యత లేని సీడ్, అదుపు లేని ఫీడ్ ధర, వ్యాధుల బెడద, గిట్టుబాటు కాని రొయ్యల రేటు వెరసి ఈ రైతును నిలువునా ముంచుతున్నాయి. అన్నింటికీ మించి విద్యుత్ చార్జీలు పెను భారంగా మారుతూ వచ్చాయి. ఈ తరుణంలో రొయ్యల ధర పెరగడం, అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రంగానికి విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.3.85 నుంచి 1.50కి (రూ.2.35) తగ్గించడం ఈ రైతును కోలుకునేలా చేస్తోంది. కృష్ణా జిల్లాలో 50 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఎకరానికి 2 నుంచి 2.50 టన్నుల దిగుబడి వస్తుంది. నాలుగు నెలలకు ఒక దఫా పంట చేతికొస్తుంది. ఇలా ఏడాదికి రెండు పర్యాయాలు మాత్రమే రొయ్యల సాగుకు వీలుంటుంది. ఇలా వీటి ద్వారా ఏటా 1.50 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎగబాకుతున్న రొయ్యల ధర రొయ్యల ధర ఇప్పుడిప్పుడే ఎగబాకుతోంది. ఉదాహరణకు నెల రోజుల క్రితం 100 కౌంట్ రొయ్య టన్ను ధర రూ.1.90 లక్షలుండగా ఇప్పుడది 2.40 లక్షలకు చేరుకుంది. 70 కౌంట్ 2.45 నుంచి 2.70 లక్షలకు, 30 కౌంట్ 4.50 నుంచి 5 లక్షల చొప్పున ఎగబాకింది. ఏ కౌంట్ ఎంత? (టన్నుల్లో) ఎగుమతులకు ఊపు.. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న రొయ్యలను అధికశాతం తైవాన్ మార్కెట్కు ఎగుమతి అవుతున్నాయి. తైవాన్లో జూన్ నెలతో రొయ్యల సాగు పూర్తయింది. మరో రెండు మూడు నెలల పాటు అక్కడ రొయ్యల ఉత్పత్తి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాదు. అందువల్ల అప్పటిదాకా రొయ్యల ఎగుమతికి ఊపు కొనసాగుతుందని, ప్రస్తుత ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని ఆక్వా రైతులు ఆశాభావంతో ఉన్నారు. విద్యుత్ చార్జీ తగ్గింపుతో ఊరట! గతంలో ఆక్వా రంగానికి యూనిట్కు రూ.3.85 చెల్లించే వారం. అసలే గిట్టుబాటు కాని ధరలతో నష్టాలను తట్టుకోవడం కష్టంగా ఉండేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక యూనిట్ చార్జీని రూ.1.50కి తగ్గించడం ఊరటనిస్తోంది. దీనికి రొయ్య రేటు ఆశాజనకంగా ఉండడం ఆక్వా రైతును బతికిస్తోంది. గతంలోలా పాత ధరలు కొనసాగితే కుదేలే. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో రొయ్యలకు వైట్గట్ అనే వ్యాధి సోకి నష్టాల పాల్జేసింది. –వెంకట్, రొయ్యల సాగు రైతు, ఎదురుమొండి, నాగాయలంక