puvvada ajay kumar
-
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి..
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రుణమాఫీ విషయంలో మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడంతో తెలంగాణ అధోగతి పాలైంది. ప్రజలు తిడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చింది. సీఎం నియోజకవర్గంతోపాటు తెలంగాణలోని ప్రతీ పనికి సంబంధించిన కాంట్రాక్టు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతున్నాయి. కాంట్రాక్టుల మంత్రి ఇచ్చే కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం 30శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.ప్రత్యేక కారణాలతోనే బీఆర్ఎస్కు నష్టం‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అసాధారణ అభివృద్ధి జరిగినా అక్కడి ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా వరదల సమయంలో ప్రజలకు పైసా ఉపయోగ పడలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినా ఏడాది కాలంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.ఈ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవాల కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది’ అని కేటీఆర్ హెచ్చరించారు. త్వరలో తాను ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ తదితరులు పాల్గొన్నారు.కేసీఆర్ పుట్టిన రోజున ‘వృక్షార్చన’బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ప్రతీ ఒక్కరూ మూడు మొక్కల చొప్పున నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘వృక్షార్చన’ పేరిట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేటీఆర్ మంగళవారం విడుదల చేశారు. -
కాంగ్రెస్ వల్లే ఖమ్మం వరదలు: పువ్వాడ అజయ్
సాక్షి,హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే తమపైన దాడి చేశారని మాజీ మంతత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని విమర్శించారు. తెలంగాణభవన్లో పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప,జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్యి. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్కు చుక్క నీరు రాలేదు. నా హాస్పిటల్కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు..? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ.650 కోట్లు మంజూరు చేయించాను. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా..? మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవిన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు మంత్రుల ఫంక్షన్ హాళ్లు,విల్లాలతో మొదలు పెట్టండి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారు’అని అజయ్కుమార్ మండిపడ్డారు. -
పువ్వాడపై రాళ్ల దాడి..
-
ఖమ్మంలో ఎవరిదో పైచేయి?
ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ ప్రచారం సాగించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా... ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అటు గులాబీ పార్టీ.. ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడ్డాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది. -
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
అది నాకు సెంటిమెంట్.. ఆయన వస్తే గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదని విమర్శించారు. ఈ మేరకు ముస్లిం, మైనార్టీ సభలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముస్లింల కోసం సీఎం రూ. 32 వందల కోట్లు ఖర్చు చేశారని.. అదే ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రూ. 50 లక్షలు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో ముస్లిం పిల్లలకు సీఎం కేసీఆర్ మంచి విద్యను అందిస్తున్నారని తెలిపారు. పేద వాడి కోసం పని చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని అన్నారు. షాదీముబారక్తో ముస్లిం మహిళలకు ఆసరాగా నిలిచారన్నారు. ‘నా తమ్ముడు అజయ్, ఆయన 10 సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నాడు. నా తమ్ముడికి తోడుగా మీరంతా ఉండాలి. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎన్నో నిధులు ఇచ్చారు. హైదరాబాద్ వ్యక్తులు వచ్చి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని వెళ్తున్నారు. నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా, అన్నింటి కంటే ఎక్కువగా ఖమ్మం అభివృద్ధి చెందింది. పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చిన ప్రతిసారీ ఖమ్మం అభివృద్ధికి కావాల్సిన నిధులు అడుగుతుంటారు. కాంగ్రెస్ పార్టీవి మొత్తం మాటలే. ముసలి పార్టీని పట్టించుకునే వాడు లేడు. వీల్ చైర్లో తిరిగే ముసలి వాడు మీకు కావాలా? యువకుడైన పువ్వాడ అజయ్ కావాలా నిర్ణయించుకోండి. చదవండి: తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మంచి మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం నియోజకవర్గం పట్ల అతనికి ఉన్న నిబద్దత ఇంకా ఎవరికి లేదు. ముస్లిం, క్రిస్టియన్లు ఇరువురు అన్నా దమ్ములు వారి పండుగ మేము, మా పండుగ వారు జరుపుకుంటారు. అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు మీ ఓటు వృథా చేయకుండా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. అజయ్ అన్నకు మరోసారి అవకాశం ఇవ్వండి. పోయినసారి కంటే భారీ మెజార్టీతో నా తమ్ముడు పువ్వాడ అజయ్ను గెలిపించండి’ అని హోంమంత్రి కోరారు. 2018 నవంబర్లో ఖమ్మం ప్రాంతంలో పెట్టిన మైనార్టీ సభ తనకు సెంటిమెంట్ సభ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో హోం మంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే 16కు 16 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. ఆయన వస్తే గెలుపు తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ సీఎం పదవి ముస్లింలకు సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. దీన్ని బట్టి ఆయనకు మైనార్టీల పట్ల ఉన్న నిబద్దత అర్థమవుతోందన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ స్థానం కేసీఆర్ గుండెల్లో పదిలలంగా ఉంటుందన్నారు. -
తెలంగాణలో ధర్మానికి అధర్మానికి ఎన్నికలు జరుగుతున్నాయి: అజయ్
-
ఆయనకు ఓటమి కనిపిస్తోంది..! : పువ్వాడ అజయ్కుమార్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం పట్టుకుని తన నామినేషన్ తిరస్కరింపజేయాలని కుట్ర పన్నాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ధీరోదా త్తుడు ఽధైర్యంగా పోరాడుతాడని, పిరికివాడు వెన్నుపోటు పొడవాలని చూస్తాడని ఎద్దేవా చేశారు. 2014లో తనపై ఓడిపోయినప్పుడు, గత ఎన్నికల్లో పాలేరులో ఉపేందర్రెడ్డిపై కూడా ఇలాగే అధర్మ పోరాటం చేసినా విజయం దక్కలేదని తెలిపారు. ఇకనైనా ఆయన పిచ్చి ప్రయత్నాలు మానుకుని హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలి కారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తన నామినేషన్లో అన్ని వివరాలు పూర్తి చేశానని పువ్వాడ తెలిపారు. ఒకవేళ వివరాలు సరిగా లేకపోతే స్క్రూటినీ రోజు ఉదయమే నోటీసు ఇస్తారని, అలాంటేదేమీ ఆర్ఓ నుంచి తనకు అందలేదని చెప్పారు. హెచ్యూఎఫ్ కాలమ్లో డిపెండెంట్ 1, 2, 3లో తనపై ఆధారపడే పిల్లలు ఎవరూ లేరని పేర్కొన్నానని, తన కుమారుడి వివాహమై ఉద్యోగం చేస్తున్నందునే అలా వెల్లడించానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కామారెడ్డి, కొడంగల్లో సమర్పించిన అఫిడవిట్లలో పోలీస్ కేసులు చెప్పాల్సిన ఫార్మెట్ మూడు బాక్సుల్లో, ఏడు బాక్సుల్లో వివరాలు రాశారని తెలిపారు. అఫిడవిట్లో అడిగిన సమాచారాన్ని పొందుపరిచిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరికై నా అపోహలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపారు. ఈవిషయాన్ని గుర్తించి అసత్య ఆరోపణలను తుమ్మల ఇకనైనా మానుకోవాలని, ప్రజలు కూడా గుర్తించి ధర్మం వైపు నిలబడాలని పువ్వాడ కోరారు. ఈ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, మార్కెట్, కూరాకుల నాగభూషణం, దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త గుండాల కృష్ణతోపాటు బచ్చు విజయ్కుమార్, శీలంశెట్టి వీరభద్రం, పగడాల నాగరాజు, ఖమర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటా..! -
తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
-
హాట్ సీట్.. ఆ అసెంబ్లీ సెగ్మెంట్!
వారిద్దరూ పాత ప్రత్యర్థులే. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఒకరు ప్రస్తుత మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఇప్పుడిద్దరూ ఖమ్మం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్నారు. లోకల్గా ఓటర్లను ప్రభావితం చేయగల తమ సామాజికవర్గం మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి తను మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లి బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఏకంగా టీడీపీ ఆఫీస్కు వెళ్ళి పచ్చ కండువా కప్పుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే మాటలతూటాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల 18 వేల ఓట్లు ఉండగా...ఇందులో 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా...ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారుతున్నాయి. అటు గులాబీ పార్టీ..ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ కమలం పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవడంతో...బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు చేజారకుండా ఇద్దరు అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంగటున్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కంటి చికిత్సకోసం లభించిన తాత్కాలిక బెయిల్ విషయంలో అదే జరిగింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినా...ఖమ్మంలోని కమ్మ నేతలు మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు తన పాత పార్టీ బాస్, తమ కుల నేత చంద్రబాబుకు బెయిల్ వచ్చినందుకు ఆయనకు సంఘీభావం తెలియచేయడానికి టిడిపి జిల్లా కార్యాలయంలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన జిల్లాలోని టిడిపి కార్యాలయానికి ఎప్పుడూ రాలేదు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి తుమ్మలను ఆహ్వానించడంతో ఆయన అక్కడకు వెళ్ళారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జై తుమ్మల అంటూ నినదిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్న ఆయనకు టీడీపీ కండువా వేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది టీడీపీ కార్యాలయమే అని చెప్పారు. చంద్రబాబు తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చిన సందర్భంగా..టీడీపీ శ్రేణుల సంతోషంలో భాగస్వామిని కావాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇదే కేరింతలతో రానున్న 30 రోజులూ తన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని టీడీపీ శ్రేణులను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అటు బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సైతం చంద్రబాబు బెయిల్పై విడుదలైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ మీదున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చారని ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ను తాను ఖండించినట్లు చెప్పుకున్నారు. రెండు సార్లు విజయం సాధించి..మూడోసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పువ్వాడ అజయ్ తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పడం మానేసి.. చంద్రబాబు భజన చేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పదేళ్ళ నాడు ఆరు వేల ఓట్ల తేడాతో పువ్వాడ ఆజయ్కుమార్ మీద ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎలాగైనా ఆయన మీద గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అదవిధంగా తుమ్మలను మరోసారి ఓడించి..హ్యాట్రిక్ సాధిస్తానని పువ్వాడ చెబుతున్నారు. రెండు బలమైన పార్టీలు..ఇద్దరు పాత ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటుండటంతో ఖమ్మం నియోజకవర్గం హాట్ సీట్గా మారింది. ఇద్దరూ తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...తమ సామాజికవర్గమైన కమ్మవారి మద్దతు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఖమ్మం ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి. -
నేనే గెలుస్తా..హ్యాట్రిక్ తీస్తా..
-
తుమ్మలపై పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్
-
మాజీ బాస్ సంఘీభావం చెప్పడానికి టీడీపీ ఆఫీస్కు తుమ్మల
-
తుమ్మల.. నీ వల్ల తెలంగాణ రాలేదు: మంత్రి పువ్వాడ ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే ఇప్పటికే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితులు ఉండేవని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి పువ్వాడ అజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్పై తుమ్మల వ్యాఖ్యలు సరికాదు. తుమ్మల నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరం. గత ఎన్నికల్లో నా చేతిలో ఓడిపోయిన తర్వాత రాజకీయ అవకాశం కల్పించకపోతే ఈనాటికి తుమ్మల రిటైర్ అయ్యేవారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు తుమ్మల. నువ్వు లేకపోతే తెలంగాణ రాలేదా?. నీ వల్ల తెలంగాణ రాలేదు ఈ విషయం గుర్తు పెట్టకో. జై తెలంగాణ అన్న వారిని జైలులో పెట్టించావు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వేమైనా సీఎంవా తుమ్మల? ఇదే సమయంలో, తుమ్మల మాటలు నమ్మశక్యంగా లేవు. టికెట్లు ఇప్పించడానికి నువ్వేమైనా పార్టీ అధినేతవా లేక ముఖ్యమంత్రివా?. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించడం కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ అర్ధ రహితం. కందాలకు కేటీఆర్ డబ్బులు ఇప్పించారన్న మాటలు హాస్యాస్పదం. మమతా ఆసుపత్రి మా కష్టార్జితం. కేటీఆర్, అజయ్లు గుండెలు కోసుకునేతం మిత్రులం. నీ ఆస్తులు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారు. నువ్వే పార్టీలు ఫిరాయించావు. ముందు టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్లో చేరావు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉండి భక్త రామదాసును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తుమ్మల మనసాక్షికి తెలుసు.. మరోవైపు.. నామా నాగేశ్వర రావు కూడా తుమ్మలకు కౌంటరిచ్చారు. శనివారం నామా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా ఆశీర్వాద సభను ప్రజలు దీవించారు. తుమ్మల గురించి ముఖ్యమంత్రి వందకు వంద శాతం నిజం చెప్పారు. తుమ్మల మనసాక్షికి అది తెలుసు. కేసీఆర్ నన్ను పిలిచి మరీ ఎంపీని చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు వేసింది నేనే. అందుకే నాకు ఎంపీ సీటు ఇచ్చారు. ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. అది కూడా నీ అకౌంట్లో వేసుకోవాలని చూస్తున్నావా తుమ్మల. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నా గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు. మా నాయకులు అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నావ్. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకో’ అని అన్నారు. చర్చకు సిద్దమా.. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సత్యాలే చెప్పారు. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నాపై ఆరోపణలు చేసే ముందు రుజువులు చూపించంది. అప్పుడు పాలేరు నుండి పోటీలో తప్పుకుంటాను. దీని కోసం ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్లో నో టికెట్.. పార్టీ మార్పుపై విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
తండ్రీ కొడుకు.. భిన్న నేపథ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్కు తండ్రీకొడుకు రెండేసిసార్లు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు గెలిచిన పువ్వాడ 1989లో పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.దుర్గానర్సింహారావుపై విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో సీపీఐ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి జహీర్అలీ మహ్మద్పై గెలుపొందారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచే పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మూడోసారి బరిలో అజయ్ పువ్వాడ అజయ్కుమార్ 2014లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి..టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5,609 ఓట్ల మెజారిట్టీతో గెలిచారు. 2018లోఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడో సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ చరిత్రలో మంత్రి పదవి సైతం పువ్వాడ అజయ్కుమార్నే వరించింది. -
తుమ్మల వర్సెస్ పువ్వాడ..
వారంతా సీనియర్ నాయకులే. అనేక యుద్ధముల ఆరితేరినవారే. పలుసార్లు విజయం సాధించినవారే. ఇప్పుడందరికీ తాజా ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఓడితే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలకు తాజా ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయనే చెప్పాలి. ఓడినవారికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీలక నేతలకు ఈ ఎన్నికలు రాజకీయంగా డూ ఆర్ డై అనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో తుమ్మల పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి తన 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యంతో గెలుపే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి ప్రచారంకు వెళ్లుతున్నారు తుమ్మల. ఇక జిల్లాలో మరో కీలక నేత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ నుంచి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగారు. మూడవసారి గెలిచి ఖమ్మం గడ్డపై హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అంతేకాదు తనకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చని..ఈసారి గెలిస్తే మిగిలిపోయిన అభివృద్ది ఏమైనా ఉంటే పూర్తి చేస్తానని ఈ ఒక్కసారి తనను ఆశీర్వాదించాలని ఖమ్మం ప్రజలను కోరుతున్నారు. లోకల్ ఫీలింగ్ తీసుకు వస్తూ ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పొటీ చేసి ఓడిపోయి.. పక్క నియోజకవర్గంకు వెళ్ళి అక్కడా ఓడిపోయిన నేత ఇప్పుడు మళ్ళీ ఖమ్మం వచ్చారంటూ తుమ్మల నాగేశ్వరరావు పేరెత్తకుండా సెటైర్లు వేస్తున్నారు పువ్వాడ అజయ్. ఖమ్మం ప్రజలు విజ్ణతతో ఆలోచించాలని కోరుతున్నారు మంత్రి అజయ్ కుమార్. ఖమ్మం నియోజకవర్గంలో 2 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులు చేశానని చెప్పుకుంటున్నారు. ఖమ్మం నియోజకవర్గం అటు తుమ్మలకు..ఇటు పువ్వాడకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారయని చెప్పాలి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. మొదటి సారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి..పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉండటంతో..పాలేరు నియోజకవర్గంలో విజయం కోసం తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. పొంగులేటికి తోడుగా ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడ పాలేరు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్లుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కందాల ఉపేందర్రెడ్డి తర్వాత గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కందాల బీఆర్ఎస్ తరపున పాలేరు బరిలో దిగారు. 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెంది...ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు..ఇప్పటికే మొదటి విడత ప్రచారం సైతం పూర్తి చేశారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేస్లో ఉండే నేత భట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మధిర నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచిన విక్రమార్క నాలుగోసారి గెలవడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నారు. కాని భారీ మెజారిటీ సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. భట్టి విక్కమార్కకు గతంలో చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు మధిరలో భట్టిపై పోటీ చేసి ఇప్పటికి మూడుసార్లు ఓడిపోయిన ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కు ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయి. మూడు సార్లు ఓడినా గులాబీ బాస్ నాలుగోసారి టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా కమల్ రాజ్ ఓడితే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అవుతుంది. అందుకే లింగాల కనకరాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగోసారైనా గెలిపించండని ప్రజల్ని ప్రాధేయపడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు సీనియర్ నేతలకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయని చెప్పాలి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల్లోని ఆ నేతలు గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. -
తుమ్మల ఫైర్.. మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్ పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తుమ్మల శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో మంత్రి అజయ్ కుమార్ను కాశీం రజ్వీతో పోల్చారు తుమ్మల. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. పోలీసులు కూడా అధికారం ఉన్న వారి వైపే ఉన్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటు. చిన్నతనం నుంచి పోరాడేతత్వం నాది. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అది కూడా తెలియదా?.. రాహుల్పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు.. -
కేసీఆర్ పై పొంగులేటి ఫైర్
-
KCR అధికారంలోకి రాగానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు
-
అదే జరిగితే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయేమో!: పువ్వాడ
సాక్షి, ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం మహిళ రిజర్వడ్ అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు అయితయేమోనని అన్నారు. ఒకవేళ ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్ అయితే తమ ఇంట్లో నుంచిమెవరిని నిలబెట్టనని అన్నారు. పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు .మహిళల కోసం మనమంత ముందు పడాలని.. కేటిఆర్ చెప్పినట్లు తన స్థానం త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే తాను ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేయాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నియోజకవర్గాన్ని ఖమ్మం జిల్లాను వదిలిపెట్టేది లేదన్నారు. ఎవరెవరో వచ్చి దండాలు పెట్టి మళ్లీ మాయమైపోతారని, అలాంటి వారికి దూరంగా ఉండాలని తెలిపారు. ఖమ్మం అభివృద్దిని సాదుకోవాలో చంపుకోవాలో మీరు డిసైడ్ చేయండి. గతంలో ఇక్కడ గెలిపించిన ఏవరైన సరే రెండవసారి ఖమ్మంలో ఉండే ప్రయత్నం చేయలేదు. ఏవరిని గెలిపించిన అటో ఇటో చూసి పారిపోయారు. కాని అజయ్ అన్న మాత్రం ఇక్కడే ఉన్నాడు. కళ్లబొల్లి మాటలు చెప్పేవారు ఎన్నికలపుడే వస్తారు. ఎన్నికలు అయిపోతే మాయమైపోతారు. నిత్యం మీ వెంట ఉండేది అజయ్ అన్న మాత్రమే. మూడవసారి నన్ను గెలిపించుకొని మళ్లీ 5 ఏళ్లు మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ -
చక్రం తిప్పడం పక్కా.. ఈ బరువు నాకొక లెక్కా
సాక్షి, ఖమ్మం, సూర్యాపేట: విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని మున్యానాయక్ తండాలో గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్త భానోతు రవి తాను కొనుగోలు చేసిన ఆటో ప్రారంభించాలని మంత్రిని కోరారు. వెంటనే మంత్రి జగదీశ్రెడ్డి ఆటో నడుపుతూ శంకుస్థాపన చేయనున్న ఇంటి వరకు వెళ్లారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి మహిళల ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వెయిట్ లిఫ్టింగ్ బార్ను సరదాగా ఎత్తి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. -
ఓడినా కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నుంచి పోటీ చేసి తనపై ఓడిపోయిన వ్యక్తికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని, ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ కష్టపడి గెలిపించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తాను తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదని గుర్తు చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఒకసారి ఖమ్మం, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచన తనది కాదని, తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తనతో పాటు ఖమ్మం ఎంపీగా, లోక్సభా పక్ష నాయకులుగా నామా నాగేశ్వరరావుకు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా కొండబాల కోటేశ్వరరావుకు, ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజకు.. ఇలా ఒకే సామాజికవర్గానికి చెందిన పలువురికి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. తమకు ఎవరు మేలు చేశారో ఈ సామాజికవర్గం వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
TS Election 2023: గత ప్రభుత్వాలు ఖమ్మాన్ని పట్టించుకోలేదు!
ఖమ్మం: ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నూతన బస్టాండ్ పక్కన ఆర్టీసీకి చెందిన 1.7 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఏసీ కన్వెన్షన్ హాల్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. 72 ఏళ్ల కాలంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖమ్మంలో మరో బస్టాండ్ నిర్మాణానికి ఆలోచన చేయలేదని, నాటి పాలకులు, ప్రజాప్రతినిధులు దాని ఊసే ఎత్తలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తాను రవాణా శాఖ మంత్రిగా నియమితులైన తర్వాత బస్టాండ్ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమించానని, కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టినా.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా బస్టాండ్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొందరు వస్తున్నారని, మాయ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ను గద్దె దింపుతామని, బంగాళాఖాతంలో కలుపుతామని మాట్లాడుతున్న వ్యక్తి ఖమ్మంలో ఏ ఒక్క అభివృద్ధి పనికై నా శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. ఎక్కడైనా శిలాఫలకంపై ఆయన పేరు ఉందా అన్నారు. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులని, ఇక్కడ వామపక్ష అభ్యుదయ భావాలతో ప్రజలు ఉన్నారని, వారంతా ఆలోచించాలని కోరారు. మంత్రిగా నాలుగేళ్లలోనే ఇంత అభివృద్ధి చేసుకున్నామని, మరోసారి అవకాశం వస్తే మరింతగా అభివృద్ధి చేసే వీలు కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో రెండో ఆర్టీసీ కన్వెన్షన్ హాల్.. ఖమ్మం నూతన బస్టాండ్ పక్కన 1.7 ఎకరాల్లో రూ.40 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఆర్టీసీ ఏసీ కన్వెన్షన్ హాల్ రాష్ట్రంలోనే రెండోదని మంత్రి పువ్వాడ అన్నారు. హైదరాబాద్లో కన్వెన్సన్ హాల్ ఉన్నా.. అది నాన్ ఏసీ అన్నారు. 2 వేల మంది కూర్చునేలా ఈ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ సంస్థపై భారం తగ్గించేందుకు ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి, సర్కారు ఖజానా నుంచి వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకుంటున్నారని కొందరు మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఆస్తులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఒక్క ఖమ్మంలోనే నూతన బస్టాండ్ నిర్మాణం ద్వారా రూ.200 కోట్ల ఆస్తి సమకూరిందని, ఇక కన్వెన్షన్ హాల్ ద్వారా మరో రూ.100 కోట్ల ఆస్తి సమకూరనుందని తెలిపారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, కరీంనగర్ ఈడీ వినోద్కుమార్, ఈడీ కమర్షియల్ కృష్ణకాంత్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డిప్యూటీ మేయర్ ఫాతిమ జొహరా, ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
హాట్రిక్పై పువ్వాడ కన్ను.. ఖమ్మంలో రసవత్తర పోటీ!
ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హట్టాపిక్గా మారనుంది. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి పార్టీలు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా. 2004లో సిపిఏం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా ఆ తర్వాత టీఆర్ఏస్లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశం : ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరోవైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీసెంటర్ కాల్వడ్డు వంటి ప్రాంతాలను వర్షపు నీరు ముంచేత్తుతుంది. కాలనీలు చెరువులను తలపించే పరిస్థితిలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతు వస్తున్నారు...ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు కోరుతున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్లేదు. దీంతో 3 టౌన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సరైన లబ్ధిదారులకు అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి.. స్థానికంగా కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి.. అంతేకాదు కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న టాక్ సైతం లోకల్ గా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు వచ్చే ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదు అన్న ప్రచారం సైతం ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చుపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22కోట్ల రూపాయలతో లకారం ట్యాంక్ బండ్, 8కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు..తీగల వంతెన పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 21కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, 25కోట్ల రూపాయలతో ఐటీ హబ్, 110 కోట్ల రూపాయలతో గొల్లపాడు ఛానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు. నూతన కార్పొరేషన్ భవనాన్ని ర్మించారు. దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం మూడు లక్షల పదకొండు వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సమాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఏక్కువగా ఉంటాయి. సిపిఏం, సిపిఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గం లో బలంగా ఉన్నాయి..అయితే వచ్చే ఎన్నికల్లో బీఅరెఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలో ఏవరితో పోత్తు పెట్టుకుంటారన్నది ఇంకా క్లారిటీ లేదు..వీరు ఏటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి కొంత కమ్యూనిస్ట్ ల ఓట్లు ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.. ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఖమ్మం సీటుపై కీలక నేతలు గురిపెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన పోటీ నెలకోనే అవకాశం ఉంది. ఇప్పిటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మంత్రి పువ్వాడ అజయ్కే మరోసారి టికెట్ కట్టబెట్టింది. దాంతో ఆయన హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు. ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన డికొనడానికి కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడకు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు పొంగులేటి. పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నారు. ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటిపై ఒత్తిడి తెస్తున్నారట. అటు జావిద్ కూడా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద టికెట్ ఆశిస్తున్నారు. వృత్తిపరంగా ఓటర్లు : పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఏక్కువగా ఉంటారు. రఘనాథపాలెం మండలంలో రైతులు ఏక్కువగా ఉంటారు. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతు ఉంటారు.కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి. మతం/కులం పరంగా ఓటర్లు : యాదవులు 45 వేల ఓట్లు, కమ్మ 48వేల ఓట్లు, మైనార్టీ ఓట్లు 30వేలు ఉంటాయి. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు విరివే. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది.ఖమ్మం నగరంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు.ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు.పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్,చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది.ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది. -
బస్సు నడిపిన పువ్వాడ..
ఇల్లెందు: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్గా మారారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్ డిపోను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సును కాసేపు నడిపారు. అంతకుముందు జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం సభలో రైతుల గురించి మాట్లాడారని, ఆయనకు ఆ అర్హత లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు దేశ రాజధానిలో ఎన్నో రోజులు ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడడమా? అని ప్రశ్నించారు. ఆ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఖమ్మంలో పువ్వాడ హ్యాట్రిక్ కొడతారా?.. మంత్రిని ఢీకొట్టేది ఎవరు?
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం హాట్ సీట్గా మారనుందా? తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇప్పటికే రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పువ్వాడకు పోటీగా నిలిచి గట్టి అభ్యర్థి ఎవరు? బలమైన ప్రత్యర్థి బరిలో నిలిస్తే పువ్వాడకు ఇబ్బందేనా? అసలు ఖమ్మంలో మంత్రి మీద పోటీ చేయబోయేది ఎవరు? రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాల్లో సంచలనాలు సృష్టించబోతున్నాయి. పలు కీలక నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. అటువంటి వాటిలో ఖమ్మం అసెంబ్లీ సీటు కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇప్పటికి రెండు సార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచేది తానే అంటూ ధీమాగా ఉన్నారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు.. ఖమ్మంలో చేసిన అభివృద్దిని చెప్పుకుంటు వచ్చే ఎన్నికల్లో తననే మరోసారి దీవించాలని కోరుతున్నారు. మళ్లీ గెలిపిస్తే ఖమ్మం నగరాన్ని ఇంకా అభివృద్ది చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పువ్వాడ అజయ్కు కాంగ్రెస్ నుంచి పొటీ తీవ్రంగా ఉండబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొంగులేటి అనుచరులు ఆయనపై ఖమ్మంలో పొటీ గురించి తీవ్రస్తాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని పొంగులేటి అనుకుంటున్నప్పటికీ... అనుచరుల ఒత్తిడి మేరకు ఖమ్మంలోనే నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా పొంగులేటికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. అనుచరబలం కూడ గట్టిగానే ఉంది. కొత్తగూడెంలో ఓటు బ్యాంక్ ఉన్నా అనుచరుల బలం అంతగా లేదని టాక్. దీంతో ఫైనల్ గా తన అనుచరుల అభిప్రాయం మేరకు పొంగులేటి ఖమ్మం సెగ్మెంట్నే తన ఎన్నికల రణ క్షేత్రంగా ఏంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు కీలక నిర్ణయాలను అనుచరుల సూచన మేరకే పొంగులేటి తీసుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి, ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిస్తే ఈ సెగ్మెంట్ హాట్ సీట్ గా మారనుంది. అజయ్ వర్సెస్ పొంగులేటి మధ్య సై అంటే సై అన్నట్లు రసవత్తరమైన పోరు కొనసాగుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఏస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేయబోతున్నారని ఇప్పటికే ఖమ్మం ఓటర్లు డిసైడ్ అయిపోయారు. చదవండి: గులాబీ బాస్ ప్రయోగం చేయబోతున్నారా?.. నిజంగానే అలా జరిగితే.. ఖమ్మంలో ప్రస్తుతం ఏ ఇద్దరిని కదిలించిన పొంగులేటి, పువ్వాడ అజయ్ పొటీ చేస్తే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. అధికార బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్కుమార్ పోటీ చేయడం అనేది ఖాయమైంది. మరి కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆయన పేరు కూడా ఖరారైంతే ఇక ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. -
కరెంట్ ఇచ్చే పార్కింగ్ షెడ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–కలెక్టరేట్)లో మొదటగా ఖమ్మంలో సోలార్షెడ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్ ప్యానళ్లతో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు. 200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్కు అనుసంధానం చేసి కలెక్టరేట్ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్ షెడ్తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్ ప్లాంట్తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్ బిల్డింగ్గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది. -
ప్రగతి రథచక్రాలు ఎన్నటికీ ఆగవు: పువ్వాడ
ఖమ్మం మయూరిసెంటర్: సీఎం కేసీఆర్ సారథ్యాన టీఎస్ ఆర్టీసీని బతికించుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రగతి రథచక్రాలు ఇక ఎన్నటికీ ఆగవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం చేరుకున్న మంత్రి పువ్వాడకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్లు ప్రవేశపెట్టడమే కాక మున్నేరుకు ఇరువైపులా రూ.150 కోట్లతో ఆర్సీసీ వాల్ నిర్మాణానికి కేబినెట్లో ఆమోదం పొందేలా కృషి చేసినందుకు మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, 43 వేలమంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాబోతున్నారని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపిన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు కథ సుఖాంతమైంది. ఆదివారం ఉభయసభలు బిల్లును ఆమోదించాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు గవర్నర్ నుంచి ఈ బిల్లుకు గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. కొన్ని అంశాలపై సూచనలు చేస్తూ.. గవర్నర్ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెట్టడానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టగా సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో పాటు బాన్సువాడ మున్సిపాలిటీ నుంచి కోయగుట్ట తండా వార్డును, ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెం వార్డును తొలగించి విడిగా గ్రామపంచాయతీలుగా చేస్తూ రెండు బిల్లులకు కూడా సభలు ఆమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సభ ముందు పెట్టారు. ఆర్టీసీ బిల్లుతో పాటు ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలుపుతున్నట్టు శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి ప్రకటించారు. ఆస్తులు యధాతథంగా కార్పొరేషన్లోనే ఉంటాయి : మంత్రి అజయ్ సంస్థ ఆస్తులు యధాతథంగా ఆర్టీసీ కార్పొరేషన్లోనే ఉంటాయని మంత్రి అజయ్ స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంలో భాగంగా వారితో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించి త్వరలోనే నియమ, నిబంధనలను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పూర్తి పీఆర్సి వర్తిస్తుందని, టీఎస్ఆర్టీ కార్పొరేషన్ అనేది కొనసాగుతున్నందున ఆస్తులు, అప్పులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కార్పొరేషన్ చెలిస్తుందని, సీసీఎస్ బకాయిలు వంటివి దాని పరిధిలోకే వస్తాయని చెప్పారు. జీతభత్యాల వరకే ప్రభుత్వం చూస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలోనూ బిల్లు పాసయ్యాక వీలైనంత తొందరలో మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. ఆయా అంశాలపై ఉద్యోగులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్.. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం 43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్కు సంబంధించినదని, 240 మంది కాంట్రాక్ట్ డెయిలీవేజ్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్.. కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులో కొనసాగుతారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఐతే ఉద్యోగులకు భద్రత, సీసీఎస్ బకాయిలు, టీఏ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,డెయిలీవేజ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో స్పష్టత నివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. వాటిపై స్పందిస్తూ మంత్రి అజయ్ వివరణనిచ్చారు. ఈ బిల్లుకు ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్ మద్దతు తెలిపారు. -
ఖమ్మంలో హీట్ పుట్టిస్తున్న ‘వరద’ పాలిటిక్స్
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో వరద పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. వరద ముంపును ముందే అంచనా వేయకపోవడం వల్లే నష్టం తీవ్రత ఎక్కువ జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి వస్తాయా అంటూ భట్టి విక్రమార్కను పువ్వాడ ప్రశ్నించారు. అయినా ముందస్తుగా వరద ముంపు గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. కావాలనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. చదవండి: కేటీఆర్కు పిండ ప్రదానం.. రేవంత్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరి తర్వాత నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. భద్రాచలంలో గోదావరి వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. -
ఇక అన్ని ప్రయాణాలకూ ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు. పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పువ్వాడ
-
ఖమ్మంలో బెదిరింపు లేఖ కలకలం.. శవాలు కూడా మిగలవంటూ..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభ, హస్తం పార్టీలోకి కీలక నేతలు చేరుతున్న సందర్బంగా పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ పోస్టర్లు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. పొంగులేటి ఖబడ్దార్ అంటూ పోస్టర్లలో రాసి ఉండటం సంచలనంగా మారింది. మరోవైపు.. పొంగులేటి అనుచరుడు డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వ విజయబాబుకు వార్నింగ్ లేఖ కూడా వచ్చింది. ఇక, ఆ లేఖలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలంటూ హెచ్చరించారు. చీకటి కార్తిక్కు పట్టిన గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో వారి శవాలు కూడా దొరకవు అంటూ రాసుకొచ్చారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ బిగ్ షాక్ -
ఆ రోజే రాజకీయాల నుంచి వైదొలుగుతా: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: ఖమ్మానికి తన అవసరం తీరిన రోజు మాత్రమే రాజకీయాల నుంచి వైదొలుతానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణంలో ఎర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరవలేక అనేక మంది అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అభివృద్ధి చేశామన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి కారణం మంత్రి కేటీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి పేరు కేటీఆర్ అంటూ అజయ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దమ్ముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి రహిత కార్పొరేషన్గా నిలిచిందని, ఐఏఎస్ పరిపాలన వచ్చిన తర్వాతనే ఖమ్మం అభివృద్ధి చెందిందన్నారు. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే -
ఖమ్మం పిట్టలదొర పొంగులేటి: పువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని.. చేసిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని మంత్రి అజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటికి, మంత్రి పువ్వాడ అజయ్కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి పువ్వాడ ఆజయ్ పై తాను పోటీ చేసి గెలవడం కాదు... అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు పువ్వాడ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. ‘‘పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. పొంగులేటి చెప్పకపోయినా నేను చెబుతున్నా రాస్కోండి. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా. పిట్టల దొర కూడా. ఫ్రస్టేషన్లో ఉన్న పొంగులేటి.. పిట్టలదొరలాగా రోజూకో వేషం వేస్తున్నాడు. అలాంటి పిట్టల దొర మాటలకు భయపడే రకం కాదు నేను. ఖమ్మం లో తనపై బచ్చాగాడినెవిడైనా నిలబెడుతానని పొంగులేటి అంటున్నాడు. ఎవరినైనా నిలబెట్టు.. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది’’ అని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నువ్వు సీఎం అవుతావని మురిసిపోతున్నావు. నువ్వు సీఎం ఏంటయ్యా?.. సీఎం కావాలంటే ఓ చరిత్ర కావాలి. వందల కోట్లు దోచుకున్నావు. ఎన్నెస్పీ కెనాల్ పనులలో దోపిడీ చేసిన విషయం మర్చిపోయావా? బిడ్డా అన్నీ ఇంకా ఉన్నాయి. ఆ కేసులెక్కడికీ పోలేదు. రేపు రా బిడ్డా.. నీ చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు ఖమ్మం వస్తున్నారు. డబ్బుందనే మదంతో విర్రవీగుతున్నావు. నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానం. ఖమ్మం రాజకీయ చరిత్ర లో పుట్టిన వాడే పువ్వాడ. ఆ పువ్వాడ కు పుట్టిన వాడే ఈ పువ్వాడ. నీ పక్కన ఉన్న అరాచక శక్తుల గురించి ముందు మాట్లాడు. ఖమ్మంలో నాకు దమ్ము ఉంది. అరాచక శక్తులను అణచివేశా. రౌడీ షీటర్లను అణచివేశా. మట్టి దందా అంటున్నావు. నా మనుష్యులు ఎవరు దందా చేశారో నిరూపించే దమ్ము ఉందా?. నువ్వు ఎంపీగా ఖమ్మంకు చేసిన మేలు ఏంటో చెప్పగలవా?. పిచ్చోడా.. ఖమ్మం లో లైట్లు పెడితే అభివృద్దా? అంటున్నావు. ఒక్క లైట్లు కాదు అన్ని రంగాలలో అభివృద్ది చేశా. ఎవరో బచ్చాను నిలబెట్టి నాపై గెలిపిస్తా అంటున్నావు. రా.. ఎవడినైనా ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది. నీ చేతిలో మోసపోయిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు. మదన్ లాల్ ని నువ్వు ఓడించలేదా?. ప్రతీ ఎన్నికలో పార్టీ అభ్యర్థుల కు వెన్నుపోటు పొడవలేదా? అంటూ పువ్వాడ, పొంగులేటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతిపెడతాం -
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ
ఖమ్మం మయూరిసెంటర్: దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. మరోపక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మొదటి స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు తిండి గింజల కోసం పక్క రాష్ట్రాలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ముందుందన్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగం పొందలేరని, అలాంటి వారి కోసం జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మంలో పోలీస్ శాఖ ఆధ్వర్యాన 140 కంపెనీలతో 8,120 మందికి ఉద్యోగాలు ఇప్పించేలా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వీ.పీ.గౌతమ్తో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన మంత్రి పువ్వాడ.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్పై ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపునకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్మెంట్తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. చదవండి: యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు) ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్లో ఆస్తులు -
ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్..
ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటలే మంటలు రేపుతున్నాయి. పంచ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్ను పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలవాలని రేణుకకు కౌంటర్ ఇచ్చారు పువ్వాడ అజయ్. కారు, కాంగ్రెస్ సై అంటే సై అంటున్న ఖమ్మంలో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మధ్య మంటలు రేగుతున్నాయి. ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఖమ్మంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాల్గొన్న నిరుద్యోగ ర్యాలీలో మాట్లాడుతూ..మంత్రి అజయ్ను అరే అంటూ సంభోదిస్తూ.. అజయ్ను పాతాళంలోకి తొక్కాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అజయ్ కూడా రేణుకకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేణుకకు దమ్ముంటే ఖమ్మంలో తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తన మీద రేణుక గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా మంత్రి అజయ్ సవాల్ చేశారు. రాష్ట్ర మంత్రి అజయ్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి..రాజకీయ విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగిపోయారు. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలతో ఖమ్మంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒరిజినల్గా బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కరే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పుకుంటున్న ఇతరులంతా కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కినవారే. అందుకే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ మీద రివెంజ్ తీర్చుకోవాలనే కసితో రగలిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందంటూ మైండ్ గేమ్కు తెర తీసారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుక ఖమ్మం జిల్లాకు గాని, నగరానికి గాని చేసిందేమీ లేదని, రేణుక అంటే పబ్బులు, గబ్బుల చరిత్రే గుర్తుకు వస్తుందని పువ్వాడ అజయ్ రివర్స్లో కౌంటర్ వేశారు. ఖమ్మం నుంచి రెండుసార్లు గులాబీ పార్టీ తరపున గెలిచిన మంత్రి పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం కూడా తక్కువేమీ కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మంత్రి అజయ్ను ఓడించాలని కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకుని కసితో పనిచేస్తున్నారు. రేణుకకు దమ్ముంటే తనపైన ఖమ్మంలో పోటీ చేయాలంటూ పువ్వాడ అజయ్ విసిరిన సవాల్కు కాంగ్రెస్ నేత ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీచేస్తారనే ప్రచారం ఓ వైపు..అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారం మాత్రమే చేస్తారంటూ మరోవైపు కాంగ్రెస్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ రేణుక బరిలో ఉంటే ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. పువ్వాడ, రేణుక ఇద్దరూ ఒకే సామాజికవర్గం గనుక ఆ వర్గంలోనే చీలిక తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు పువ్వాడ అజయ్ సవాల్ను రేణుక ఎలా స్వీకరిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? -
రా చూసుకుందాం..హీటెక్కిన ఖమ్మం పాలిటిక్స్
-
రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్.. దమ్ముంటే పోటీ చేసి గెలువ్!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నాయకులు సై అంటే సై అంటున్నారు. ఖమ్మం వేదిక నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీలో మంత్రి అజయ్ కుమార్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రేణుకా చౌదరి. అరే మంత్రి అజయ్ అని సంబోధిస్తూ.. అజయ్ను పాతాళంలోకి తొక్కలని వ్యాఖ్యలను చేశారు. ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ గుట్టలను మింగేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. దమ్ముంటే రేణుక తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ‘చిల్లరమల్ల మాటలు కాదు నువ్వు నా మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు సంస్కారం ఉంది. నా తల్లిదండ్రులు అది నాకు నేర్పించారు. నాకు రేణుక చౌదరి లాగా మాట్లాడటం రాదు. న్యాయపరంగా నీచులపై పోరాటం చేస్తాను. అజయ్ కుమార్ను మాటలు అనడమే లక్ష్యంగా ఖమ్మంలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్ధులకు కలలో కూడా నేనే వస్తున్నట్లు ఉంది. రేణుకా చౌదరి అంటే పబ్భులు, గబ్భులు చరిత్ర అని ఫైర్ అయ్యారు మంత్రి. కేంద్రమంత్రిగా చేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు చేసింది ఏంటి? ఖమ్మానికి గుండు సున్నా చూపించిన ఘనత రేణుకా చౌదరికే దక్కుతుంది’ అని మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. చదవండి: Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్ శెట్టర్.. -
ఎవడెన్ని ట్రిక్లు చేసిన హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డిపాజిట్లు రాని బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటుందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలో కషాయ పార్టీకి ఓటమి తప్పదని అమిత్ షా మాటలతో అర్థమైందన్నారు. ఎవడు ఎన్ని ట్రిక్లు చేసిన తెలంగాణలో బీర్ఎస్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి మంత్రి హరీష్ రావు సోమవారం శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయంగా ఉండేదని, నేడు కరువు అనే పదాన్ని డిక్షనరీ నుండి తొలగించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు కేసీఆర్ అండగా ఉంటారని తెలిపారు. చదవండి: ‘రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు’ రాష్ట్రంలో వరిసాగు 14 లక్షల నుంచి 56 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దీనికి రైతు బీమా, సాగునీరు, 24 గంటలు కరెంటు తదితర పథకాలే కారణమన్నారు. పేపర్ లీకేజ్ కేసులో ఇరుకున్న దొంగలను, బెయిల్ మీద వచ్చిన వాళ్ళను పక్కన పెట్టుకొని దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలే హైకమాండ్గా పనిచేసే పార్టీ బిఅర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే లంచాలు, అవినీతి, పదవులు కోసం ఆలోచించే పార్టీ అని దుయ్యబట్టారు. అంతకముందు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ... ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకుండా అబద్ధాలు ఆడుతూ కేంద్రం వివక్ష చూపుతుంది. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేస్తామని రెచ్చగొట్టేలా అమిత్షా మాట్లాడుతున్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి జిల్లాలో 10కి 10 స్థానాలను గెలిపించాలి’ అని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు. -
ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలుస్తాం: మంత్రి పువ్వాడ అజయ్
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వనని ఒకరు ‘మంగమ్మ శపథం’చేస్తున్నారని, అయితే ప్రజలే తమను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వార్థపూరిత, డబ్బు రాజకీయాలు నడవవని, జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని మంత్రి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్తో అనవసరంగా వైరం పెంచుకున్నవారికి శంకరగిరి మాన్యాలే శరణ్యమని ఎద్దేవా చేశారు. పారీ్టకి కార్యకర్తలే బలం, బలగం అని, త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ సత్తా చాటుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి అవగాహన, అభివృద్ధి, సంక్షేమంపై విస్తత ప్రచారం కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు -
ఇద్దరిద్దరే
-
ఉమెన్స్ డే రోజున కవితకు నోటీసులివ్వడం దుర్మార్గం : పువ్వాడ అజయ్
-
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
ఉమ్మడి ఖమ్మంలో పాగా వేద్దాం! కేడర్ కారుదిగకుండా చూద్దాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో అన్ని సీట్లను కైవసం చేసుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. జిల్లా పరిధి లో చేసిన అభివృద్ధిని ప్రచారం చేయడం, నేతలందరినీ ఏకతాటిపై ఉంచడం, విస్తృతంగా సమావేశాలు నిర్వహించి పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా మిగతా 3వ పేజీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేయాలని, ఇందుకోసం వచ్చే పదిహేను రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని తీర్మానించింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లాలో చేసిన పర్యటన, ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించాలని.. మాజీ ఎంపీ పొంగులేటి వెంట కేడర్ వెళ్లకుండా బ్రేక్ వేయాలనే అంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. సీఎం హామీలు ప్రచారం చేసేలా.. సీఎం కేసీఆర్ గతనెల 12న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్, పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించారు. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక గత నెల 18న ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో.. ఖమ్మం కార్పొరేషన్కు రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున, తల్లాడ, కల్లూరు, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున.. 589 పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గవ్యాప్తంగా 15 రోజుల పాటు విస్తృతంగా పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు. నేతలంతా కలిసి ముందుకు.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం నేపథ్యంలో ఈ ఊపును కొనసాగించి అన్ని నియోజకవర్గాల్లో పాగా వేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా నాయకత్వం భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సీఎం ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు చర్చించినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలంతా నియోజకవర్గాల్లో కలిసి తిరగాలని తీర్మానించినట్టు సమాచారం. కేడర్ కారు దిగకుండా.. బీఆర్ఎస్లో ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తిలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తిరుగుబావుటా ఎగురవేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. పార్టీపై, సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు. పొంగులేటి బాటలో నడిచిన వైరా మున్సిపల్ చైర్మన్ సుతకాని జైపాల్, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మరికొందరు నేతలపై బీఆర్ఎస్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా పొంగులేటి వెంట వెళ్లిన నేతలపై చర్యలు తీసుకోవాలని తాజా సమావేశంలో తీర్మానించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండలాల వారీగా ముఖ్య నేతలతో టచ్లో ఉండి నిత్యం పార్టీ కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాసం, మరికొన్ని స్థానిక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ భేటీలో ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి షాక్! -
తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం.. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. ఇక, శనివారం సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే.. వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా ఈ బిడ్డింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 231 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టీసీకి ప్రతి రోజు కోటి 77 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. మరోవైపు.. తెలంగాణలో ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. త్వరలో 1,360 ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా 26 ఆర్టీసీ డిపోలు లాభల్లోకి వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారంలో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. -
‘నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్’
వైరా: ‘నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ‘పార్టీ నిన్ను బహిష్కరిస్తే సానుభూతి పొందాలని చూస్తున్నావు.. చర్యలు తీసుకునే ఎజెండా మాది కాదు’ అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. పిల్లి ఊపులకు సీఎం కేసీఆర్ భయపడే రకం కాదన్నారు. కేసీఆర్ చేయి వదిలిన వారు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ జెండాను వదిలితే వారి బొంద వారే తవ్వుకున్నట్లు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. వైరా ఎమ్మెల్యేగా రాములునాయక్ ఉండగానే మరో వ్యక్తిని వైరా నియోజకవర్గ అభ్యర్థిగా ఎలా ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదేనని, కేసీఆర్కు ద్రోహం తలపెట్టాలనుకునే వారు పార్టీ నుండి వెళ్లిపోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. -
వాడ వాడ పువ్వాడ! కానీ, రంగంలోకి పొంగులేటి వస్తే.. పరిస్థితి ఏంటి?
ఖమ్మం జిల్లా కేంద్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. జిల్లాలోని కీలక నేతలు ఖమ్మం సీటు మీదే గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యర్ధి ఎవరైనా బలంగా ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు పువ్వాడ. కాంగ్రెస్, బీజేపీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. మంత్రి వువ్వాడ అజయ్ గురించి ఖమ్మం ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ హాట్ సీట్ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్గా మారబోతోంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ సాధించాలనే ఉత్సాహంతో ఉన్నారు. దీనిలో భాగంగానే వాడ వాడ పువ్వాడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంతో జనంకి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మతోన్మాద పార్టీలకు ఖమ్మంలో చోటు లేదనే స్లోగన్ తో ముందుకు సాగుతున్నారు. బీజేపీ నుంచి ఒకవేళ గట్టి అభ్యర్థి బరిలో ఉన్నా గెలుపోందే విధంగా పక్కా కార్యాచరణ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడ..2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి విజయం సాధించి మంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2004లో సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం గెలుపొందారు. గత నాలుగు ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మంలో బలంగా ఉన్న కమ్మ, మైనార్టీ, కాపు వర్గాల్లో రెండు సామాజికవర్గాలు ఏ పార్టీవైపు మొగ్గితే ఆ పార్టీకే విజయం దక్కుతుంది. కన్నేసిన పొంగులేటి ఇదిలా అంటే బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. పొంగులేటి బీఅర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారు అయినప్పటికీ... ఏ పార్టీలో చేరతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఏ పార్టీలో చేరతారన్న విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరుల్లో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే పొంగులేటి అనుచరుల్లో మెజారిటీ మాత్రం ఖమ్మం నుంచే పోటీ చేయాలని గట్టిగా సూచిస్తున్నారు. జనవరి ఒకటో తారీఖున నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నవారంతా ఖమ్మం నుంచే పోటీ చేయాలని కోరారు. అందువల్ల ఖమ్మంకే తొలి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. చేతి పార్టీలో ఎవరు? మరో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం నియోజవర్గంపై సీరియస్ గా గురిపెట్టింది. అయితే అజయ్ లాంటి బలమైన నేతను ఢీకొట్టడానికి ప్రస్తుతం కాంగ్రెస్లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. అందుకే మాజీ ఎంపీ రేణుకచౌదరి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఖమ్మంలో నూతన క్యాంప్ కార్యాలయాన్ని కూడా రేణుక చౌదరి ప్రారంభించారు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం.. లోకల్ గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం బలంగా ఉండటంతో రేణుక చౌదరి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో లోకల్ గా గ్రూపుల గొడవలు ఉండటంతో వ్యతిరేక వర్గం రేణుకకు ఏ మేర సపోర్ట్ చేస్తుందన్న అనుమానాలూ ఉన్నాయి. కారుతో కమ్యూనిస్టుల జోడి ఇక బీజేపీకి కూడా ఖమ్మం నియోజకవర్గంలో బలమైన నేతలు ఎవరూ లేరు. ఇతర పార్టీల నుంచి నేతలు చేరితే తప్ప ఖమ్మంలో కాషాయపార్టీ పుంజుకునే అవకాశాలు లేవు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బిజెపి బలం పెరిగే అవకాశం ఉంది. పొంగులేటి పోటీ చేస్తే అజయ్ కు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీఅర్ఎస్తో పొత్తు దాదాపు ఖరారైంది. ఇది గులాబీ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ , 8 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. తీగల వంతెన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నూతన బస్టాండ్, ఐటీ హబ్, గొల్లపాడు చానల్ ఆధునీకరణ, నూతన కార్పొరేషన్ భవనం, సమీకృత నూతన కలెక్టరేట్ భవనాలు వంటివి అజయ్ కుమార్కు కలిసి వచ్చే అంశాలే. ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెంను ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్లకు విస్తరింపచేశారు. రఘునాధపాలెం మండలం సాగు నీటి సమస్య తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టు చేపట్టారు. కాని ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుండటంతో.. ట్రాఫిక్ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే వర్షాకాలం వరద ముంపు సమస్య పరిష్కారం అవుతుందని..అందువల్ల ఆ విషయాన్ని ఆలోచించాలని నగరవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చదవండి: పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా? కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారన్న టాక్ సైతం లోకల్ గా వినిపిస్తోంది. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదనే వార్నింగ్లు ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు సైతం మంత్రికి ఇబ్బందులు తెస్తున్నాయి. కీలక నేతల చూపు ఖమ్మం అసెంబ్లీ సీటు వైపు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం హట్ సీట్ గా మారనుంది. ఏ పార్టీ అయినా ఖమ్మం అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థిని రంగంలో దించితే దాని ఎఫెక్ట్ పాలేరు, వైరా స్థానాలపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ ఫీజులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి, మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని పలు కాలేజీలను ఆదేశిస్తూ ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ అధిక ఫీజు వసూలు చేస్తే దాన్ని తిరిగి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను మమతా కాలేజీ యాజమాన్యం పాటించకపోవడంతో వరంగల్కు చెందిన డాక్టర్ నిఖిల్ గుర్రపు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది సామ సందీప్రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను మమతా కాలేజీ పలు కాలేజీలు కావాలనే పాటించలేదని.. దీంతో విద్యార్థులు అధిక ఫీజు చెల్లించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఆ ఫీజు తిరిగి ఇచ్చేలా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మంత్రి పువ్వాడకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. చదవండి: సాహితీ ఇన్ఫ్రా పిటిషన్పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు.. -
బండి సంజయ్కు ‘కంటి వెలుగు’ పరీక్షలు అవసరం
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభ ద్వారా దేశ రాజకీయాలతోపాటు జిల్లా రాజకీయాలు కూడా మారుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పార్టీ నేతల సమన్వయంతో సభ విజయవంతమైందని, ఖమ్మం చరిత్రలో ఈ తరహా సభ ఎన్నడూ జరగలేదని అన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో కలిసి గురువారం బీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో అజయ్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభ ఫ్లాప్ అయిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంతటి భారీసభను కూడా చూడలేకపోయిన ఆయనకు కంటి వెలుగు పరీక్షలు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 24 గంటల కరెంటు గురించి సంజయ్కు సందేహాలు ఉంటే, రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకుని చూడాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ సుపారీ ఇచ్చారంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే సరిపోతారన్నారు. సభలో ఖమ్మం జిల్లాకు సీఎం నిధుల వరద పారించారని, అభివృద్ధికి గుమ్మంలా ఖమ్మం మారిందని పువ్వాడ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా 2001లో జరిగిన కరీంనగర్ సభ తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసినట్లే, ఖమ్మం బీఆర్ఎస్ సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతుందని రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రగతిశీల శక్తుల కలయికకు ఖమ్మం సభ బాటలు వేసిందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ రంగాన్ని బడా పారిశ్రామికవేత్త అదానికి కట్టబెట్టే కుట్రలను ప్రతిఘటించడంతోపాటు తెలంగాణ తరహాలో దేశమంతా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదని బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా తేలిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు కూడా రావని రవిచంద్ర అన్నారు. -
ఖమ్మం సభ విజయవంతమైంది : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
-
కరెంట్ ఉందో లేదో అలా తెలుసుకో.. సంజయ్కు పువ్వాడ కౌంటర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సహా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సభలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు. ఇక, కేసీఆర్ కామెంట్స్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనను తానే ఓడించుకుంటోంది. కంటి వెలుగులో బండి సంజయ్ అద్దాలు తీసుకోవాలి. బండి అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థలను కేంద్రం మూసివేస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్లోనైనా బండి సంజయ్ వేలు పెట్టి చూడాలని చురకలంటించారు. మాకు వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం. ఇంత పెద్ద సమావేశానికి ప్రత్యేకమైన ఆహ్వానం అవసరం లేదు.. బొట్టుపెట్టి పిలవరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మక సభ జరిగింది. కరీంనగర్ సింహగర్జన సభం తెలంగాణ ఏర్పాటుకు స్పూర్తి. ఖమ్మం సభ దేశ అభివృద్దికి నాంది కాబోతోంది. ఖమ్మం సభ విజయంతో బీఆర్ఎస్ పార్టీ మొదటి అడుగు ప్రారంభమైంది. సభపై ఎంత మంది విమర్శలు చేసినా, వక్రభాష మాట్లాడిని ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని రుజువైంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సభకు వారెందుకు రాలేదు.. బండి సంజయ్ సూటి ప్రశ్న -
సీఎంలు ‘ఏమిటీ జనం?’ అని ఆశ్చర్యపోయారు..’శభాష్ అజయ్’
సాక్షి, ఖమ్మం: ‘శభాష్ అజయ్.. ఆవిర్భావ సభ సక్సెస్ చేశారు. ఖమ్మం చరిత్రలోనే ఇలాంటి సభ ఎన్నడూ జరగలేదు. కమ్యూనిస్టు నాయకులు, మిగతా నేతలు అందరూ సభ అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ‘ఏమిటీ జనం?’ అంటూ ఆశ్చర్యపోయారు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను అభినందించారు. సభావేదిక పైనే కాకుండా సభ ముగించుకుని వెళ్లిన తర్వాత కూడా సీఎం ప్రత్యేకంగా మంత్రికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. హెలి కాప్టర్ నుంచి ముఖ్యమంత్రులు దారి పొడవునా ఉన్న జనాన్ని చూసి ‘ఇంతమంది జనమా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్ ఉందంటూ కొనియాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ ప్రకటన నాటి నుంచి మంత్రి అజయ్ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులొడ్డారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణకు కసరత్తు చేశారు. అంతేకాకుండా ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచే వెయ్యి మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సభ ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా ముగిసేలా చూశారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
ఖమ్మం గులాబీ వనం.. ఐదు లక్షల మంది వీక్షించేలా ప్రాంగణం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సభ పురస్కరించుకుని నగరమంతా గులాబీ తోటలా మారింది. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్ ఐదు రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లు చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల జాతీయ స్థాయి నేతలు హాజరవుతుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్కు ప్రారంభోత్సవం, మెడికల్ కళాశాలకు శంకుస్థాపన, కంటివెలుగు రెండో దశ ప్రారంభ కార్యక్రమంలో కూడా అతిథులు పాల్గొంటారు. వీరంతా ప్రసంగించాక చివర్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందింది. మంత్రి పువ్వాడతో పాటు పలువురు ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా వేదికపైకి ఆహ్వానిస్తారు. 13 నియోజకవర్గాలు.. 5 లక్షల మంది ఖమ్మం సమీపాన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోని వంద ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ఐదు లక్షల మంది వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఇక ఖమ్మానికి తూర్పు, పశ్చిమం వైపు మొత్తం 20 పార్కింగ్ ప్రాంతాలకు 448 ఎకరాలు కేటాయించారు. సభ ప్రాంగణంలో 25 ఎల్ఈడీలు, లక్ష మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 12 లక్షల తాగునీటి ప్యాకెట్లు సిద్ధం చేశారు. సీనియర్, జూనియర్ ఐపీఎస్లు, పోలీసు సిబ్బంది కలిపి 5,200 మంది బందోబస్తులో పాల్గొంటుండగా, కలెక్టరేట్, సభా ప్రాంగణంలో 100కు పైగా సీసీ కెమెరాలు అమర్చారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి, డీఐజీ, వరంగల్ సీపీ ఏ.వీ.రంగనాథ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ బందోబస్తులో నిమగ్నమయ్యారు. సీఎంల పర్యటన షెడ్యూల్ ►పినరయి విజయన్ మినహా మిగతా ముగ్గురు సీఎంలు, ముఖ్య నేతలు బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరతారు. (పినరయి విజయన్ నేరుగా ఖమ్మంకు వెళ్తారు.) ►10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుని 10.40 గంటలకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేశారు. ►11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ►ఖమ్మంలో నూతన కలెక్టరేట్తో పాటు కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ►2.25 గంటలకు కలెక్టరేట్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. ►2.30 నుంచి 5 గంటల వరకు సభలో పాల్గొంటారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ముగ్గురూ హెలీకాప్టర్లో విజయవాడ వెళ్లి అక్కడినుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు బయలుదేరతారు. ►సీఎం కేసీఆర్ ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేకంగా ప్రధాన వేదిక ప్రధాన వేదికను వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ జర్మనీ స్ట్రక్చర్ రూఫ్తో సిద్ధం చేయగా, గులాబీ రంగు జోడించారు. వేదికపై భారత్ రాష్ట్ర సమితి పేరు, వరుసగా సీఎంలు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డి.రాజా ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. 200 మంది కూర్చునేలా వేదికను నిర్మించారు. వేదిక వెనుక నాలుగు విశ్రాంతి గదులు, వేదిక ఎదురుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు కూర్చునేలా గ్యాలరీ సిద్ధం చేశారు. నగరంలోకి ప్రవేశించేది మొదలు చుట్టూరా గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, జిల్లా నేతల ఫొటోలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో కటౌట్లు, హోర్డింగ్లు ఏర్పాటయ్యాయి. మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి తదితరులు మంగళవారం సాయంత్రం సభా ప్రాంగణం, కలెక్టరేట్ను పరిశీలించారు. భారీ సభ దృష్ట్యా బుధవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఖమ్మం వైపు వచ్చే సాధారణ, భారీ వాహనాలన్నింటినీ దారి మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వస్తూ సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లాల్సిన వాహనాలను కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు మళ్లిస్తారు. ఇలావుండగా టీఆర్ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి భారీ ఎత్తున జరిగిన సభల జాబితాలో ఖమ్మం బీఆర్ఎస్ సభ కూడా చేరుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2016లో ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత ఉమ్మడి జిల్లాలో పార్టీ పరంగా ఇదే భారీ సభ కావడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు సభల ఏర్పాట్లను హైదరాబాద్కు చెందిన సుజాత సౌండ్స్ నిర్వాహకులే చూస్తుండడం మరో విశేషం. -
తప్పుడు ప్రచారం చేసేవారిని కూకటివేళ్లతో పీకేస్తా: మంత్రి పువ్వాడ
-
పొంగులేటిపై మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పనికిమాలిన బ్యాచ్ ఉందంటూ మాజీ ఎంపీ పొంగులేటి వర్గాన్ని ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కూకట్పల్లి నుంచి పోటీ చేయడం లేదని, ఖమ్మంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. జనవరి 18న ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు అధిక సంఖ్యలో జన సమీకరణే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గం సన్నాహాక సభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కొద్ది మంది పనికిమాలిన బ్యాచ్ ఉందన్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలవదని మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు ఒక అబద్ధాల గ్రూప్ ఉందని, అజయ్ అన్న కూకట్పల్లి పోతుండు అని కొత్త ప్రచారం మొదలు పెట్టారన్నారని విమర్శించారు. ‘అజయ్ అన్న కూకట్ పల్లి ఏం పీకటానికి పోతాడు. ఇక్కడి వాళ్ళని పీకటానికి అజయ్ అన్న ఉన్నాడు.. ఇంకా దంచాల్సిన వాళ్ళని దంచాకనే అజయ్ అన్న ఎటైనా పోతాడు.. అజయ్ అన్న సైన్యం చూసి ఎంత భయపడుతున్నారంటే.. అజయ్ అన్నను లోకల్ నుంచి పంపించి ప్రశాంతంగా ఉండాలని చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారన్నారు. అజయ్ అన్న ఖమ్మం ను అభివృద్ధి చేసిండు.. పాత బస్టాండ్ తీసి కొత్త బస్టాండ్ పెట్టిండు.. మళ్ళీ పాత బస్ స్టాండ్ను సిటీ బస్ స్టాండ్గా మార్చిండు అని ఈర్ష పడుతున్నారు. తాగడానికి నీళ్లు లేని ఖమ్మానికి గలగల నీళ్లు పారే విధంగా చేసిన.. అక్క చెల్లెళ్ల బుగ్గల మీద సొట్టలు ఉన్నాయి కానీ బిందెల మీద సొట్టలు లేని పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. రెండుసార్లకు ఇవన్నీ చేస్తే మూడోసారి మనకు ముప్పతిప్పలే అని ఈ అబద్దపు నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అవకాశాన్ని 33 జిల్లాల్లో మన ఖామ్మానికి కేసీఆర్ ఇచ్చారని, ఖమ్మం మీద గాని ఖమ్మం ప్రజల మీద గాని కేసీఆర్కి ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరే ఆలోచించాలి. ఇలాంటి బంగారు అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మీరు వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్, ట్విట్టర్లు మీరు కూడా యాక్టివ్ ఉండాలి. ఖమ్మం సభను విజయవంతం చేయాలి’ అని పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. -
ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు ఆదాయం: పువ్వాడ
అఫ్జల్గంజ్: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కార్గో సర్వీసులు, పెట్రోల్ పంపులతో పాటు తాజా గా మంచినీటి బాటిళ్ల విక్రయానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. సోమవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుద్ధి చేసిన మంచినీటి బాటిళ్ల (జీవా జలం) విక్రయాలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్... టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఈడీలు వినోద్కుమార్, యాదగిరి, ఆర్ఎం శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. -
ఖమ్మం పాలిటిక్స్లో కలకలం
నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నాం. కానీ పార్టీలో దక్కిన గౌరవం ఏమిటి? భవిష్యత్లో జరగబోతున్నది ఏమిటి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు నా టీం సిద్ధంగా ఉంది.. – మాజీ ఎంపీ పొంగులేటి గతంలో నన్ను దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బుతోనే అన్నీ సాధ్యం కావు. క్యారెక్టర్, గుణం అవసరం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరం.. – మంత్రి పువ్వాడ అజయ్ నా రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశాను. ఉమ్మడి జిల్లాకు నేనేం చేశానో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశానో అందరికీ తెలుసు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పాలేరు నుంచే పోటీ చేస్తా. నా వెంట నిలిచేవారికి అండగా ఉంటా.. – మాజీ మంత్రి తుమ్మల ..ఒకరు మాజీ ఎంపీ, మరొకరు మంత్రి, ఇంకొకరు మాజీ మంత్రి.. ముగ్గురూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలే.. జిల్లాలో అనుచరులు, అభిమానగణం ఉన్నవారే.. పార్టీలో, ప్రభుత్వంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తితో ఉన్నవారు ఇద్దరు, ఆ అసంతృప్తిని దీటుగా ఎదుర్కొని నిలబడాలన్న ఆలోచనతో ఉన్నవారు మరొకరు.. మొత్తానికి ఆధిపత్యం కోసమో, రాజకీయ భవిష్యత్తు కోసమో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కార్యచరణకు పదును పెట్టుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలు వేదికగా అనుచరులతో సమావేశాలు పెట్టి బల ప్రదర్శన చేసుకున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం మయూరి సెంటర్ తుమ్మల.. ఎన్నికల రిహార్సల్! మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నూతన సంవత్సర వేడుకల పేరిట ఖమ్మం రూరల్ మండలంలో తన అనుచరగణం, కేడర్తో ఆత్మీయ సమ్మేళనంనిర్వహించారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన తుమ్మల.. ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు ఏమేం చేశారో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశారో వివరించారు. అయితే ఈ కార్యక్రమం వచ్చే ఎన్నికలకు రిహార్సల్గా, బల ప్రదర్శనగా చెప్పవచ్చని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల పాలేరు నియోజకవర్గంలో స్పీడ్ పెంచారని అంటున్నారు. నన్ను దెబ్బతీసే ప్రయత్నాలు ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గతంలో తనను దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఆయన ఆదివారం ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తనపై నేరుగా ఆరోపణలు చేయలేక కార్పొరేటర్లను తులనాడి, వారిపై విషప్రచారం చేసి తనకు నష్టం చేయాలని చూశారని పువ్వాడ ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదని, క్యారెక్టర్, గుణం అవసరమని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరమని.. ఆ విలువలకు కట్టుబడి ప్రజల అవసరాలు తీరుస్తూ ఎవరి దగ్గరా ఏమీ ఆశించకుండా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందుకుపోతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నా టీమ్ పోటీ చేస్తుంది బీఆర్ఎస్లో జరిగిన గౌరవం ఏమిటో ఆలోచించాల్సి ఉంది: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కీలకనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పొంగులేటి అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది, తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ రోజు బీఆర్ఎస్లో ఉన్నామని, కానీ ఆ పార్టీలో జరిగిన గౌరవమేంటి? భవిష్యత్లో జరగబోతున్న గౌరవం ఏమిటనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందిన, పొందుతున్న ప్రతీ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శీనన్న (తన) టీమ్ అంతా సిద్ధంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. ఎంపీగా గెలిచి.. బీఆర్ఎస్లో చేరి.. వైఎస్సార్సీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులు, అభిమానులను సంపాదించుకున్నారు. 2014లో ఎంపీగా గెలిచారు. వైరా, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కానీ తర్వాతి రాజకీయ పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు. ఈ క్రమంలో రాజకీయ జీవితం కొంత ఒడిదుడుకులకు లోనైంది. సిట్టింగ్ అయిన ఆయనను కాదని.. నామా నాగేశ్వరరావుకు గులాబీ పార్టీ టికెట్ దక్కింది. ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని పొంగులేటి ఆశించినా ఫలితం రాలేదు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన పువ్వాడ అజయ్కు ప్రాధాన్యం దక్కడం, తుమ్మల నాగేశ్వర్రావు తిరిగి పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. -
‘ప్రైవేటు’ను తట్టుకుని ఆర్టీసీ నిలవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల సంఖ్య కోటిన్నరను మించినందున వాటి రూపంలో ఆర్టీసీకి భారీగానే పోటీ ఉంటుందని, ఆ పోటీని తట్టుకుని ఆర్టీసీ నిలవాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటే ప్రచారం అవసరమని, ప్రజల్లోకి వెళ్లి ప్రయాణికులను తనవైపు తిప్పుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు చొరవ తీసుకుని పనిచేయాలన్నారు. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న 50 బస్సులను ఆయన శనివారం ట్యాంక్బండ్పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులన్నింటితో పరేడ్ చేయించటం విశేషం. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాబోయే మూడు నెలల్లో మరో 760 బస్సులు కొత్తగా వస్తాయన్నారు. దీంతో ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య 10 వేలకు చేరుతుందన్నారు. కరోనా, ఆర్టీసీలో భారీ సమ్మె ప్రభావంతో నష్టాలు భారీగా పెరిగాయని, ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతున్నాయని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో నెలకు రూ.100 కోట్లను మించి ఉన్న నష్టాలను ఇప్పుడు రూ.70 కోట్లకు తగ్గించామని తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇటీవల డీజిల్ సెస్ను మాత్రమే సవరించామని, టికెట్ చార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ కొత్త బస్సుల్లో ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందే ప్రయాణికులను హెచ్చరించే అలారం, ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, లైవ్ ట్రాకింగ్ వసతి ఉన్నాయని వివరించారు. కొద్ది రోజుల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, యాదగిరి, వినోద్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎంలు విజయ్కుమార్, జీవన్ప్రసాద్, మోహన్(అశోక్ లేలాండ్), ఎంజీ ఆటోమోటివ్స్ ఎండీ అనిల్ ఎం కామత్ పాల్గొన్నారు. -
దశలవారీగా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మంలో సోమవారం రాత్రి జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్లు, 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల తీర్మానాలను వెల్లడించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు మూడు డీఏలు మంజూరు చేయాలని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, 317 జీవోతో బదిలీపై వెళ్లిన భార్యాభర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. -
Hyderabad: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్ను ట్విటర్లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను కోరారు. దీంతో నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దె ప్రాతిపదికన తీసుకుని.. ► ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు తీసుకొని నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్ను మరో వారంలో ఆహ్వానించనుంది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్లను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆహ్వానించనుంది. బిడ్ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్ఆర్టీసీ అద్దెను ఫిక్స్డ్గా చెల్లిస్తుంది. ► చార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాలవైపు పరుగులు తీసుకేందుకు టీఎస్ఆర్టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఈ– డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏ రూట్లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్లోనే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్లు ఫైనలైజ్ చేశారని వార్తలొస్తున్నాయి. ► పటాన్చెరు– కోఠి, జీడిమెట్ల–సీబీఎస్, అఫ్జల్గంజ్– మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ 22 మోడల్ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి. (క్లిక్ చేయండి: బస్టాప్లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..) -
Puvvada Ajay Kumar; అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎన్నో పోరాటాల ఫలితం. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి అనన్యం. ‘రైతుబంధు’ నేడు దేశానికే ఆదర్శవంతమైన పథకం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి కార్యక్రమాలతో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా తెలంగాణ నిలుస్తున్నది. ఒక నాడు ఎక్కడ చూసినా నెర్రెలు– మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ... ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? మీకు వ్యవసాయం వస్తదా? అని ప్రశ్నించిన నోళ్లతోనే మీకే వ్యవ సాయం వస్తదని చెప్పించాలంటే ఎంత సమర్థ వంతమైన నాయకత్వం కావాలి? ఎంతటి అకుంఠిత కార్యాచరణ అవసరం. అంత అద్భుతం జరిగింది కేసీఆర్ వల్లనే. దేశంలో 20, 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు కట్టడానికే ఎన్నో ఏండ్లు తీసుకుంటున్న సమయంలో 200 టీఎంసీల నిలువ సామర్థ్యం, అవసరాన్ని బట్టి దాదాపు 500 టీఎంసీల వరకు సామర్థ్యం పెరిగే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలో పూర్తిచేసి ప్రారంభించడం కేసీఆర్ దక్షతకు నిదర్శనం. ఒకవైపు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూనే మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను సైతం సర్కారు అంతే వేగంగా నిర్మించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్ల తరబడి సాగదీతకు గురై, వెనక్కి నెట్టివేయ బడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, భీమా, మిడ్ మానేరు, సింగూరు, కొమ్రం భీం, నీల్వాయి, జగన్నాథ్పూర్, కోయిల్సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇక చనఖా– కొరటా, సదర్మట్, సీతమ్మసాగర్, గట్టుప్రాజెక్టులు చివరిదశలో ఉండగా సమ్మక్క బ్యారేజీ ఇప్పటికే పూర్తయింది. ఇవేకాదు, నీటిపారుదల రంగంలో రికార్డులు తిరగ రాస్తూ 11 నెలల్లోనే ఖమ్మంలో భక్త రామదాసు, జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోత లను పూర్తిచేసింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందు తుంది. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమికి సాగునీరు చేరుతుంది. తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన కోటి 40 లక్షల ఎకరాల భూమిలో సగానికి కొంచెం అటూ ఇటుగా రైతులు సాగుచేసేవారు. కానీ నేడు 2 కోట్ల 5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. వ్యవసాయరంగం ఏటా 14.5 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ ప్రగతి అప్రతిహతంగా కొన సాగాలి. మనమందరం ఈ అభివృద్ధిలో భాగస్వా ములం కావాలి. ప్రతీ ఒక్కరు తనవంతు సహ కారం ప్రభుత్వానికి అందించాలి. ఈ నిలువెత్తు ప్రగతి విమర్శకులకు కనిపించదా? అవసరం కోసం, అవకాశాల కోసం రాజకీయాలు చేసేవాళ్లు ఎన్నైనా మాట్లాడుతుంటారు, కానీ బాధ్యతల్ని భుజాలపై మోసే నాయకత్వానికే తెలుస్తుంది కదా ప్రజల జీవితాలను ప్రగతిపథం వైపు ఎట్లా నడిపించాలో! తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పట్ల బీజేపీ శ్రద్ధ ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ప్రాంతీయ అస్తిత్వాలను జాతీయ పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. గడిచిన ఐదారు దశాబ్దాల్లో జరిగిందిదే. జాతీయ స్థాయి పథకాల గురించి మాట్లాడే బీజేపీ తెలంగాణకు ఒరగ బెట్టిందేమీ లేదు. కాళేశ్వరానికి కానీ, ఇక్కడి మరొక నీటి పథకానికి కానీ జాతీయ హోదాను ఇవ్వడం లేదు. ఆర్థిక సహాయం చేయడం లేదు. పసుపు బోర్డుపై చేసిన వాగ్దానం అట కెక్కింది. కాజీపేట వర్క్ షాపు కాగితాల్లో మురిగింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ, బడుగు బలహీన వర్గాల ఉన్నతిని గురించి కానీ ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ ఎంతనో తెలంగాణలో అందరికీ స్పష్టం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందిన ఈ పార్టీ టీఆర్ఎస్కు ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా నిలువ లేదని ప్రజలకు స్పష్టమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని వచ్చే దశాబ్దాలకు కూడా కాపాడగలిగిన యువనాయకత్వం కూడా టీఆర్ఎస్కే ఉన్నది. ప్రాంతీయ అస్తిత్వాలను, ఆత్మ గౌరవాన్నీ కాపాడగలిగేది ప్రాంతీయ పార్టీలే అని చాలా రాష్ట్రాల్లో రుజువైంది. తెలంగాణ అస్తి త్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేది నేడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజల్లో స్థిరభావం ఏర్పడింది. ఇటీవల అందరూ తమ దృష్టిని కేంద్రీకరించి ఉన్న మునుగోడు ఉప ఎన్నికలో అధికారం కోసం పాకులాడే పార్టీలు ఒకవైపు, తెలంగాణను బల మైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండ వర్గాల ఆర్థిక స్థితి గతులను పెంచటానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయి. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి టీఆర్ఎస్ పక్షాన నిలబడి ఉద్యమ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీని ప్రతిపక్షాలు నమ్ముకుంటే, టీఆర్ఎస్ పార్టీ గల్లీ ప్రజలనే నమ్ముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలం గాణ వ్యతిరేకులకు ప్రజలు బుద్ధిచెప్పాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. (క్లిక్ చేయండి: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?) - పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి -
పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు
ఖమ్మం మయూరిసెంటర్: పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో 64మందికి రూ.6.40కోట్ల విలువైన కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మంత్రి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో 7,515 మందికి రూ.70.21 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, సాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. అనంతరం లబ్ధిదారులు, వారి కుటుంబీకులతో కలిసి పువ్వాడ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు: బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొరటికల్ గ్రామంలో నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళన సహపంక్తి భోజన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గొర్రె పిల్లలిచ్చింది కేసీఆర్ ఒక్కరే తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులవారి జీవనోపాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పువ్వాడ చెప్పారు. నిన్నటివరకు కురుమలు ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లలను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, మొదటిసారిగా వారికి గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కురుమ సంఘం నేతలు పాల్గొన్నారు. -
సైద్ధాంతిక శూన్యతను పూరించేందుకే...
నాడు తెలంగాణ ఉద్యమం లాగా నేడు దేశం సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. మోదీ–షా నేతృత్వం లోని బీజేపీ పాలనలో భారతదేశం తన మూలసూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకి కత్వం, సమాఖ్యతత్వాన్ని పోగొట్టుకునే దుర్దశలో ఉంది. దేశాన్ని కాపాడుకోవటం, మూసదోరణులను విడిచిపెట్టి నవ్య మార్గాన అభివృద్ధి చేయటం తక్షణ అవ సరం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఒక కొత్త ఎజెండాకు రూప కల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకోవటానికి చిట్టచివరి క్షణం వరకూ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించిన శక్తులు... ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఎలా నగుబాటు చేయాలా అన్నదానిపై దృష్టి పెట్టాయి. తెలంగాణలోనే పుట్టినప్పటికీ, జన్మభూమి మీద ఎంతమాత్రం మమకారం లేని కిరాయి వ్యక్తులను ఉపయోగించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు జరిపాయి. కరెంటు, సాగునీరు వంటి మౌలిక రంగాల్లో సహాయ నిరాకరణకు దిగాయి. ఇన్ని దాడులనూ అక్షరాలా ఒంటి చేత్తో ఎదుర్కొని, ఆ కుట్రలను బద్దలు చేశారు కేసీఆర్. ఇటీవల పలు సమావేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న భూమి, జల వనరులు, విద్యుత్తు, వ్యవసాయం, నిరుద్యోగం, జీడీపీ, స్వాతంత్య్రా నంతరం దేశాన్ని పాలించిన పార్టీల విధానాలు... మొదలైన అంశాలపై గణాంకాల సహితంగా వివరిస్తున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఎంత లోతైన అధ్యయనం చేశారో దేశ పరిస్థి తుల గురించి కూడా అంతే సీరియస్గా ఆలోచిస్తున్నారని ఆయ నతో సన్నిహితంగా గడిపిన నాలాంటి వాళ్ళకు అర్థమయింది. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి విషయాలపై సీఎం ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోరకంగా వ్యవహరిస్తున్న వివక్షను ఎండగడుతున్నారు. దేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న నాయకుడు నేతృత్వం వహించాల్సిన అవసరం ఏర్పడింది. మతం పేరిట యాగీ చేస్తూ సంక్షేమాన్నీ, అభివృద్ధినీ పట్టించుకోని బీజేపీ ద్వంద్వ నీతిని ప్రజలు గ్రహించారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను ప్రాధాన్యతగా పెట్టుకొని సేవ చేసే వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలని జనమంతా కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: విమోచన కాదు, సమైక్యత!) కలగూర గంప వ్యవహారాలతో, రాజకీయ అధికారం వస్తుందేమో గానీ, దేశాన్ని మార్చటం సాధ్యపడదు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన ఉన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకున్న అసాధారణ ప్రతిభ, పట్టు, సమస్యల మీద పోరాడగల ధీర గుణం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని పలువురి అభిప్రాయం. పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ పార్టీ నిష్క్రియాపరత్వం, ఆ పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్ డెడ్ స్థితికి చేర్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి ప్రత్యామ్నాయ ఎజెండాను బలపరచి దేశ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ, సైద్ధాంతిక శూన్యతను పూరించడం ఒక చారిత్రక అనివార్యత. (క్లిక్ చేయండి: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి -
బండి సంజయ్ ఖమ్మం పర్యటన పై మంత్రి పువ్వాడ స్పందన
-
పోలవరం డ్యాం ఎత్తుతో భద్రాచలం మునగడమనేది హాస్యాస్పదం: పేర్ని నాని
-
1986లో పోలవరం లేదు.. అప్పుడు భద్రాచలం మునగలేదా?: పేర్నినాని
సాక్షి,విజయవాడ: పోలవరం డ్యామ్ వల్ల భద్రాచలం మునిగిందనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి అవుతుందని, ప్రస్తుతం వచ్చిన వరద కేవలం 28 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ వారే ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆధార్ కార్డులను ఏపీ అడ్రస్తో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. 1986లో పోలవరం లేదని, అప్పుడు భద్రాచలం మునగలేదా అని ప్రశ్నించారు. అవగాహన లేకుండా పువ్వాడ అజయ్ మంత్రి ఎలా అయ్యారోనని సందేహం వ్యక్తం చేశారు. మంథని, ఏటూరు నాగారం ప్రాంతాలు కూడా మునిగిపోయాయని, ఆ ప్రాంతాలను ఎక్కడ కలుపుతారని పేర్ని నాని ప్రశ్నించారు. 1953లో భద్రాచలం ఏపీలోనే ఉండేదని గుర్తు చేశారు. భద్రాద్రిపై తెలంగాణ సవితి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. యాదాద్రి నిర్మించినట్లే.. భద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. చదవండి: పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దు: మంత్రి అంబటి తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలంపై ప్రేమ లేకుంటే ఏపీకి ఇచ్చేయాలని, తాము అభివృద్ధి చేసుకుంటామన్నారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణ నేతలు, మంత్రి పువ్వాడ పోలవరం డ్యాం గురించి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానేనని ప్రస్తావించిన పేర్ని నాని.. చంద్రబాబు చేసిన తప్పు వల్ల హైదరాబాద్ను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. చదవండి: పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి: బొత్స -
పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలి: మంత్రి బొత్స
-
మాకు న్యాయం చేయాలి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తీరం వెంట ఉన్న పట్టణాలు, గ్రామాలను గడగడలాడించిన గోదావరి నెమ్మదించింది. అయితే అప్పటికే వరద తీవ్రత ధాటికి తీర ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయారు. వరద వెనక్కి మళ్లితే తప్ప నష్టం ఎంతో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. సరైన సమాచారం ఇవ్వకుండా తీరని నష్టం కలిగించిన ప్రభుత్వాధికారులే తమను ఆదుకోవాలంటూ భద్రాచలంలో సుభాష్నగర్ కాలనీవాసులు శనివారం పట్టణంలో ఆందోళన నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ కూనవరం రోడ్డులో బైఠాయించారు. వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తుండటంతో తమను ఆదుకుంటారనే ఆశల్లో వరద బాధితులు ఉన్నారు. భద్రాచలం దగ్గర నిర్మించిన కరకట్ట ఈ కాలనీ దగ్గర ముగుస్తుంది. దీంతో వరద తీవ్రత పెరగడంతో కరకట్ట చివర నుంచి నీళ్లు సుభాష్ కాలనీలోకి వచ్చాయి. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు గురువారమే ఈ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ సమయంలో వరద 64 అడుగుల ఎత్తుకు రావొచ్చని అంచనా వేశారు. దీంతో ఈ కాలనీ ప్రజలు వరద ఎత్తును దృష్టిలో ఉంచుకుని ఇంట్లోని మంచాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర విలువైన సామాన్లను అటక మీద పెట్టడం, తాళ్లతో కట్టి పైకప్పు వరకు చేర్చి కేవలం కట్టుబట్టలతో పునరావాస శిబిరాలకు చేరుకున్నారు. అయితే వరద ఏకంగా 71 అడుగులకు చేరుకోవడంతో సామగ్రి నీట మునిగింది. ఇక్కడ నివసిస్తున్నవారిలో అత్యధికులు రోజువారీ కూలీలే. చనిపోతామంటూ... తమకు న్యాయం చేయాలంటూ సుభాష్నగర్ కాలనీవాసులు గంటల తరబడి రోడ్డుపై ధర్నా చేశారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ‘సర్వం కోల్పోయిన తాము బతడం దండగ’అంటూ తిరిగి వరద నీటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయకుంటే రాజకీయ నాయకులెవరూ ఓట్లు అడిగేందుకు తమ వాడకు రావొద్దంటూ నినాదాలు చేశారు. సుభాష్నగర్ ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. బురద సమస్య: గోదావరి వరదనీరు వెనక్కి తగ్గగానే ముంపు ప్రాంతాలు ఎదుర్కొనే సమస్యలో బురద తొలగింపు ప్రధానమైనది. ఈ బురద కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్తోపాటు పదిహేను మున్సిపాలిటీల నుంచి 195 మంది పారిశుధ్య కార్మికులను భద్రాచలం ఏజెన్సీకి తరలిస్తున్నారు. వీరితో జెట్టింగ్, ఫాగింగ్ మెషీన్లు, బురద తొలగించే యంత్రాలను తీసుకొస్తున్నారు. అంటురోగాలు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నీళ్లలోనే పంటపొలాలు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు తగ్గితేనే ఏజెన్సీ ప్రాంతాలు ముంపు నుంచి బయటపడతాయి. అయితే శనివారం అర్ధరాత్రి వరకు నీటిమట్టం 60 అడుగులకుపైనే ఉంది. ముఖ్యంగా కిన్నెరసాని, గోదావరి నదులు సంగమ ప్రదేశానికి సమీపాన ఉన్న బూర్గంపాడు పూర్తిగా ముంపునకు గురైంది. ఈ మండలంలో ఏకంగా 7,955 మంది పునరావాస కేంద్రాల్లోనే మగ్గుతున్నారు. వరదనీరు వెనక్కి మళ్లితేనే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది, ఎన్ని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయాయి, ఎంత మేర రోడ్లు కొట్టుకుపోయాయి, ఎన్ని కాజ్వేలు దెబ్బతిన్నాయనే విషయం తేలుతుంది. -
పోటెత్తే.. గేట్లెత్తే!
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఎగువన మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి నదిలో వరద పోటెత్తింది. ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల ప్రవాహాలు కూడా కలిశాక మహోగ్ర రూపంతో పరుగు పెడుతోంది. భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో 53 అడుగుల మట్టంతో ఉరకలెత్తుతోంది. మొత్తంగా ఎగువన ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ దాకా గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. జూలై రెండో వారంలోనే ఈ స్థాయిలో గోదావరికి వరదలు రావడం, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల వానతోనే.. నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షా లు కురుస్తున్నాయి. దీనితో అటు మహారాష్ట్ర నుంచే గోదావరిలో వరద పోటెత్తి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. దానితో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు కడెం వాగు, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెర సాని తదితర ఉప నదుల ప్రవాహాలూ చేరుతుండటంతో.. సోమవారం గోదావరిలో వరద పోటెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకుల గూడెం) బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎక్కడిక్కడ వాగులు, ఉప నదుల ప్రవాహాలు కలుస్తుండటంతో గోదావరిలో వరద పెరుగుతూ పోతోంది. లక్ష్మి బ్యారేజీ వద్ద నుంచి 8.68 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ నుంచి 11.82 లక్షల క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ నుంచి 14.30 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. భద్రాచలం గోదావరి మట్టం గంట గంటకూ పెరుగుతూ.. 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నదిలో ప్రవాహాలు మొదలు.. ఎగువన కర్ణాటకలో వర్షాలతో కృష్ణా నదిలో వరద మొదలైంది. ఆల్మట్టి డ్యామ్లోకి 75 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఆది, సోమవారాల్లో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడం.. మలప్రభ, ఘటప్రభ వంటి ఉప నదులపై ప్రాజెక్టులన్నీ నిండటంతో.. కృష్ణాలోకి భారీ వరద వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దాంతో ఆల్మట్టి డ్యామ్ నిండటానికి మరో 40 టీఎంసీలు అవసరమున్నా.. ముంపు ముప్పు తప్పించడానికి గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆ నీళ్లు నారాయణపూర్ రిజర్వాయర్కు చేరుతున్నాయి. సోమవారం రాత్రి ఇక్కడి నుంచి 61.9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా జూరాల వైపు పరుగెడుతోంది. ఒకట్రెండు రోజుల్లో వరద జూరాలకు చేరనుంది. వరద రానుండటంతో జూరాలలో సోమవారం రాత్రి మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి 10,200 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద చేరుకోగానే జూరాల గేట్లు ఎత్తనున్నట్టు వెల్లడించారు. మరోవైపు భారీగా ప్రవాహం వస్తుండటంతో తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది. సోమవారం అర్ధరాత్రిగానీ, మంగళవారం ఉదయంగానీ తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీనితో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్కు వరద మొదలవనుందని అధికారులు చెప్తున్నారు. చిన్న ప్రాజెక్టులూ నిండి.. ఎగువ నుంచి వరద వస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి 5,622 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు, పాలేరు, వైరా రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో అప్రమత్తం గోదావరి ఉగ్రరూపం దాల్చడం, తీరం దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్తగూడెం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మండలాల వారీగా గజ ఈతగాళ్లు, మరబోట్లను సిద్ధంగా ఉంచారు. 20 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం భద్రాచలం ఇప్పటికే చేరుకుంది. నేనూ వరద బాధితుడినే: మంత్రి పువ్వాడ గోదావరి వరదలు ఎలా ఉంటాయో, క్షణాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో తెలుసని.. తానూ వరద బాధితుడినేనని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. భద్రాచలంలో సోమవారం వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన స్వీయ అనుభవాన్ని వివరించారు. ‘‘నేను పుట్టి పెరిగింది కూనవరంలో. ఆ గ్రామంలో మాకు రెండు అంతస్తుల ఇల్లు ఉండేది. సాధారణంగా మొదటి అంతస్తులోకి నీళ్లు వస్తే.. రెండో అంతస్తులోకి లేదా ఇంటి పైకప్పు మీదికి వెళ్లేవాళ్లం. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ అనుదీప్ తదితరులు ఓసారి గోదావరికి బాగా వరద వచ్చింది. మొదటి అంతస్తు ఖాళీ చేసి రెండో అంతస్తులోకి వెళ్లగా.. కొద్దిసేపట్లోనే రెండో అంతస్తులోకీ నీళ్లు రావడం మొదలైంది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో భయపడ్డాం. సహాయక బృందాలు పడవల్లో వచ్చి మమ్మల్ని రక్షించాయి.’’అని తెలిపారు. -
సీఎం చెప్పినా పట్టించుకోరా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులతో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని వారు గళం విప్పారు. అధికారుల తీరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి వేదికగా పోడు భూములపై వాడీ వేడి చర్చ జరిగింది. ఆవేదనతో చెబుతున్నా: వనమా పోడు భూములకు పట్టాల అంశంపై చర్చ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని తాము అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఖాతరు చేయడం లేదన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటుంటే అటవీ అధికారులు గిరిజనులను, గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. అడవి నుంచి కనీసం రోడ్డు నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకర్గంలో పలు రోడ్లకు రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరైనా అటవీ శాఖ అడ్డంకులతో పనులు జరగడం లేదన్నారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తాం: సత్యవతి రాథోడ్ పోడు అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ.. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో అనేక సమస్యలు ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సీఎం కేసీఆర్కు నివేదిక అందించిందని తెలిపారు. ఈనెల 11న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని, 15 నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ట్రెంచ్లు కొట్టొద్దు: పువ్వాడ పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వివాదం లేని పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆయన అటవీ శాఖకు సూచించారు. ఎక్కడైనా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ట్రెంచ్లు కొడితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తామ న్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. పంటలు వేసిన తర్వాత ట్రెంచ్లు కొట్టడం, ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ సమస్య జటిలంగా మారుతోందని అన్నారు. -
కేంద్రం నిర్ణయంతో అగ్గి రాజుకుంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సైనిక నియామకాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టాలన్న కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దేశవ్యాప్తంగా అగ్గి రాజుకుందని, యువత రగిలిపోతున్నా రని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రప్రభు త్వం వెంటనే అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డి శనివారం తొలిసారి ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికి.. ర్యాలీగా ఖమ్మం లోని సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం ఏర్పాటుచేసిన ‘కేసీఆర్కు కృతజ్ఞత సభ’కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ యువతను మోసం చేస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదం చేసిన ఖమ్మం గడ్డను ఎప్పటికీ మరువబోనని అన్నారు. బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో ముఖ్య మంత్రిగా కేసీఆర్ సాధించిన ప్రగతి అద్భుత మని కొనియాడారు. సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభలతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సభల్లో గత నాలుగు విడతలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను చదవడంతోపాటు.. చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పల్లెప్రగతి కార్యక్రమం కింద నియమించిన కమిటీలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి అభివృద్ధిపై ప్రణాళికలను సిద్ధం చేశాయి. చేపట్టాల్సిన పనులకు సంబంధించి గ్రామసభల్లో తీర్మానాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. త్వరలోనే పెండింగ్ బిల్లులకు మోక్షం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు లాంఛనంగా ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత రాయపర్తిలో, జనగామ జిల్లా కడవెండిలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొని.. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించి మాట్లాడారు. ‘‘2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా స్థానిక సంస్థలకు రూ.9,560.32 కోట్ల నిధులు విడుదలయ్యాయి. పెండింగ్లో ఉన్న రూ.474 కోట్లకు సంబంధించి త్వరలో టోకెన్/బిల్లులు/చెక్కులను క్లియర్ చేస్తాం.. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించే ప్రక్రియ తుది దశకు చేరిందని.. త్వరలోనే రాష్ట్రంలో 8 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిరసనలతో.. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల, మామకన్ను, పడుగోనిగూడెం, ముత్తాపురం సర్పంచులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. నిధుల్లేక ఇబ్బంది పడుతున్నామంటూ వార్డు సభ్యులతో కలిసి జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. ట్రాక్టర్ల రుణం కిస్తీ, డీజిల్, బ్లీచింగ్ కొనుగోలు బిల్లులు రావడం లేదని వాపోయారు. ♦హనుమకొండ జిల్లా ధర్మపురంలో, వరంగల్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో, జఫర్ఘడ్ మండలం రఘునాథపల్లిలో పల్లె ప్రగతి గ్రామసభలో గ్రామస్తులు పాల్గొనకుండా నిరసన తెలిపారు. ♦‘4వ విడత పల్లెప్రగతి పనుల నిమిత్తం రూ.8లక్షల అప్పులు తెచ్చిన. ఏడాదైనా బిల్లులు వత్తలెవ్వు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేది లేక ఉపాధి పనులకు పోతున్న. ఇప్పటికైనా బిల్లులు ఇప్పించండి సారూ’ అంటూ హనుమకొండ జిల్లా విశ్వనాథకాలనీ సర్పంచ్ వల్లెపు అనిత కలెక్టర్కు మొరపెట్టుకుంది. ♦పల్లె ప్రగతి తొలిరోజు కార్యక్రమానికి నల్లగొండ జిల్లాలో 59 మంది సర్పంచ్లు హాజరుకాలేదు. పెం డింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గుర్రంపోడు మండలంలోని 37 గ్రామాలు, అనుముల మండలంలోని 11 గ్రామాలు, చండూరు మండలంలోని 11 గ్రామాల సర్పంచులు గ్రామసభలను బహిష్కరించారు. పట్టణ ప్రగతి తీరు ఇదీ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో నాలుగో విడత పట్టణ ప్రగతి మొదలైంది. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, కొత్త పనులపై చర్చించారు. ♦ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. కలెక్టర్ గౌతమ్తో కలిసి ఉదయం ఆరు గంటల నుంచే సైకిల్పై తిరుగుతూ.. 53, 52, 41, 37 డివిజన్లలో పర్యటించారు. 41వ డివిజన్ డ్రైనేజీలో పిచ్చిమొక్కలను స్వయంగా తొలగించారు. -
మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ రేణుకా చౌదరి మధ్య మాటల యుద్ధం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సాయం చేయలేనివారు, ఇరవై ఏళ్ల పాటు పదవులు అనుభవించి స్వలాభం చూసుకున్నవారు.. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్న తన ను విమర్శించడం గర్హనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రూ.1.81 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 181 మంది లబ్ధిదారులకు సోమవా రం ఇక్కడ మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఓ నాయకురాలు పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి గోల్మాల్ చేసి ఓ గిరిజన డాక్టర్ బతుకును ఆగం చేసి, రోడ్డుమీద పడే పరిస్థితి తీసుకొచ్చారని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద లెక్కకట్టాలని రవాణా శాఖలో ఓ చట్టం ఉందని, అలాగే రాజకీయాల్లో కూడా స్క్రాప్ పాలసీ తీసుకురావాలని అన్నారు. ఖమ్మం జిల్లా, నగరాభివృద్ధికి చేసిందేమీ లేకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు డ్రామాలు చేస్తూ, గాజులేసుకుని.. పెద్ద కళ్లజోళ్లు పెట్టుకుని డ్యాన్స్ వేసుకుంటూ ప్రదర్శనలు చేస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది -
తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. ఏడు రోజుల్లో!
సాక్షి, ఖమ్మం లీగల్: ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈమేరకు హైదరాబాద్కు చెందిన న్యాయవాదులు పేరి వెంకటరమణ, పేరి ప్రభాకర్ ద్వారా ఆయన మల్లన్నకు నోటీసులు పంపించారు. ప్రజాసేవలో ఉన్న తమ క్లయింట్పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రచారం పొందాలనే దురుద్దేశంతో తీన్మార్ మల్లన్న తన చానల్, పత్రికలో అబద్ధాలు ప్రసారం చేశారని నోటీసులో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన మల్లన్న జర్నలిస్ట్గా చెలామణి అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని తెలిపారు. ఈమేరకు సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని, దీంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు బాధ్యులవుతారని పేర్కొన్నారు. కాగా, ఏడు రోజుల్లోగా తన క్లయింట్ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు నోటీసులో సూచించారు. చదవండి: VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా -
రాజకీయాల్లో రాక ముందే బెంజ్ కారులో తిరిగా: మంత్రి
ఖమ్మం (రఘునాథపాలెం) : ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని మండిపడ్డారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో శనివారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. ‘రఘునాథపాలెం మండలంలో మల్లెమడుగు గ్రామమే లేకపోగా.. నాకు ఈ గ్రామంలో 32ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని వారికి సవాల్ చేస్తున్నా.. ఒక్క ఎకరం భూమి ఉందని నిరూపించినా ఇక్కడిక్కడే పేదలకు రాసిస్తా’ అని వెల్లడించారు. ‘రాజకీయాల్లోకి రాక ముందే నేను బెంజ్ కారులో తిరిగా... కానీ ఇప్పుడు పార్చునర్ కారుకు వచ్చింది పరిస్థితి. వచ్చే ఎన్నికల తర్వాత అంబాడిసర్ కారుకో పోతదో, స్కూటర్కు పోతదో తెల్వదు’ అని పేర్కొన్నారు. అయితే, తనను ఎంత టార్గెట్ చేస్తే అంత వేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తానని స్పష్టం చేశారు. ఒకరికి ఇచ్చే వాడినే తప్ప పుచ్చుకునే వాడిని కాదని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. -
చార్జీల పెంపుపై త్వరలో సీఎంను కలుస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్ చార్జీల పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ను సంప్రదిం చనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీపై రూ.వందల కోట్ల భారం పడుతోందని, అయినప్ప టికీ ఇప్పటి వరకు ఆ భారం ప్రజలపై పడకుండా ఆర్టీసీ భరించిందని అన్నారు. తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్న సంస్థను బలోపేతం చేసేందుకు చార్జీలు పెంచక తప్పనిపరిస్థితి నెలకొందన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలను మంత్రి గురువారం ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో 50 మంది విద్యార్థినులతో దీనిని మొదలు పెట్టారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, పలువురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
స్టేజ్పై డ్యాన్స్తో అదరగొట్టిన మంత్రి
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కళాకారులతో కలిసి పాటలు డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గ పరిధిలో 1000 మందికి దళిత బంధు అమలు అవడమే కాకుండా అదనంగా చింతకాని మండలంలో 4500 మందికి దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని మంత్రి పువ్వాడ అన్నారు. చదవండి👉: తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్ రానున్న రోజుల్లో నియోజకవర్గ పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు పధకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. దళిత బంధు పథకంపై అవాకులు చెవాకులు పేలే వారిని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. దళిత బంధు పథకాన్ని ఉపయోగించుకుని దళిత సోదరులు ఆర్థికాభివృద్ధి చెందాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. -
రేవంత్ రెడ్డి సవాల్పై స్పందించిన మంత్రి పువ్వాడ.. దేనికైనా రెడీ!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. భూములు కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని వెల్లడించారు. సీబీఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని సూచించారు రేవంత్ రెడ్డి ఒక ఐటమ్ అని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చిన నువ్వా.. నా గురించి మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడని, సుపారీ ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని రేవంత్పై మండిపడ్డారు. అలాగే ఈనెల 29 తర్వాత సాయి గణేష్ ఘటనపై మాట్లాడుతానని.. కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు. చదవండి👉 అందుకే కాంగ్రెస్లో చేరడం లేదు: ప్రశాంత్ కిషోర్ కాగా అంతకముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పువ్వాడ ఓ సైకోనని, అతనికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈడీ కేసులు, కాంగ్రెస్ కార్యకర్తల మృతి, మమత కాలేజీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. దమ్ముంటే పువ్వాడే తనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి పువ్వాడ వేధింపులు తాళలేకే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్ ఆరోపించారు.మంత్రి పువ్వాడ తమ కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించాడు. మంత్రి వల్ల కమ్మ కులానికి చెడ్డపేరు వస్తుందని, అతన్ని కులం నుంచి బహిష్కరించాలని కమ్మపెద్దలను రేవంత్ కోరారు. చదవండి👉 కమలం వికసించేనా?.. కేడర్ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు! -
నాపై కుట్ర పన్నారు
వైరా: ఖమ్మంలో జరిగిన చిన్న ఘటనను ఆసరాగా చేసుకొని నిందలు మోపుతున్నారని, తనపై కుట్ర పన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారితో సూడో చౌదరిలు కూడా చేతులు కలిపారని ఆరోపించారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్క మంత్రినీ తొలగించారని.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కమ్మ సామాజిక మంత్రిని తానేనని పేర్కొన్నారు. ఇప్పుడు తనకు కూడా పొగ పెట్టారన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కమ్మ వారి ఏసీ కల్యాణ మండపాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. తర్వాత సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి సీఎం కేసీఆర్ తగిన ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగానే కాకుండా పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల్లో నియమిస్తున్నారని చెప్పారు. అతి పిన్న వయసులో తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఏ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి మేలు జరుగుతుందో ఆలోచించాలని, పార్టీలకతీతంగా కమ్మ కులస్తులందరూ ఐక్యంగా సామాజికవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. -
పువ్వాడ సంగతి తేలుస్తాం: బండి సంజయ్
సాక్షి, ఖమ్మం: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హత్యారాజకీయాలు చేస్తున్నాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న బండి సంజయ్.. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ సంస్మరణ సభ సందర్భంగా జూమ్ లైవ్ ద్వారా మాట్లాడారు. సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకరమన్న ఆయన.. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల కారణంగానే గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ‘‘సాయి గణేష్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. అతనిపై 16కేసులు పెట్టీ రౌడీ షీట్ ఒపెన్ చేశారు. బలవన్మరణానికి కారణం అయ్యింది ఈ ప్రభుత్వం. మంత్రి పువ్వాడ అజయ్ చిట్టా అంతా మాకు తెలుసు. పువ్వాడను విడిచిపెట్టేదే లేదు. సంగతి తేలుస్తాం. ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాం. సాయి గణేష్ ఘటనపై సీఎం కేసీఆర్ సీబీఐ విచారణకు కోరాలి. ఇప్పటికే ఈ వ్యవహారంపై పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపింది. -
Puvvada Ajay: నాపై కుట్ర జరుగుతోంది: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సాయి గణేష్ సూసైడ్ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆయన వైరాలో కమ్మ కళ్యాణం మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఖమ్మంలో చిన్న విషయం జరిగితే దానిని అడ్డం పెట్టుకొని తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. కొంత మంది సూడో చౌదరీలు వారితో చేతులు కలిపి తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గంలో తనకు మంత్రి పదవి ఇవ్వడం అదృష్టమని తెలిపారు. మంత్రి వర్గంలో నుంచి తనను తొలగించేందుకు తనపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అందుకే కమ్మ కులస్థులందరూ రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉద్యమం చేపట్టాలన్నారు. తాజాగా అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సాయి గణేష్ ఘటనలో మంత్రి అజయ్ కుమార్పై కేసు నమోదు చేయాలని బీజేపి, కాంగ్రెస్లు పాట్టుపడుతున్న విషయం తెలిసిందే. అజయ్ కుమార్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సాయి గణేష్ ఆత్మహత్య కేసులో దాఖలైన పిటిషన్ ఆధారంగా.. మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు తెలంగాణ హైకోర్టు నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29 లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
‘ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశాం’
హైదరాబాద్: ఖమ్మం నగరాన్ని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ జరుగుతుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంంలో ప్రతీ సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు అజయ్ కుమార్. ‘ఈనెల 16న ఖమ్మంలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ భవనాన్ని కేటీఆర్ ప్రారంబిస్తారు. పది కోట్లతో నిర్మించిన లక్కారం కేబుల్ బ్రిడ్జి ప్రారంబించబోతున్నాం. స్థంబాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంబోత్సవం చేయబోతున్నాం. మున్నేరు వాగులోకి మురుగు నీరు చేరకుండ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తాం. లక్కారం ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. గొంగళి పురుగు లాగ ఉన్న ఖమ్మం ను సీతాకోక చిలుక లాగ చేస్తున్నాం.ఖమ్మం లో దాదాపు వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపన లు మంత్రి కేటీఆర్ చేయబోతున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసాం. నా నియోజకవర్గంలో రెండు వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ పూర్తయింది’అని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. -
రైతన్నా.. మీసం తిప్పెయ్..
ఖమ్మం మయూరి సెంటర్: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ఓ రైతు మీసాలను తిప్పిన మంత్రి.. ‘రైతులు మీసం తిప్పుకుని సగర్వంగా జీవించేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. (చదవండి: యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్) -
భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో రాములవారి కల్యాణాన్ని చూసి తరించేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం అట్టహాసంగా, కన్నులపండుగగా జరుగుతోంది. స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక, టీటీడీ తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. కాగా, సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒకే దేశంలో ద్వంద్వ ప్రమాణాలా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నది. వారి నిర్ణయాలు పరిశీలిస్తే రైతులపై వారికున్న కక్ష, దుగ్ధలు అర్థమవు తాయి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం మూడు సాగు చట్టాలు తీసుకువచ్చి విఫలమైంది. ఇప్పుడు వ్యవసాయ కరెంట్ మోటర్లకు మీటర్లు బిగించే చట్టాన్ని తెచ్చి రైతులకు భారాన్ని మోపేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే రైతులు అనేక వ్యయభారాలతో కుంగి పోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరెంటు బిల్లులను వడ్డించాలనడం విడ్డూరం. రైతులను క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడే సేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్ని స్తోంది. అందులో భాగంగానే ఉచిత విద్యుత్తును అందిస్తు న్నది. అయినా కేంద్రం తెచ్చే రైతు వ్యతిరేక చట్టాల వల్ల మీటర్లను బిగించే పరిస్థితి ఏర్పడుతున్నది. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లయింది. కానీ సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి వారితో ఒరిగిందేమీ లేదు. కాగా కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతున్నది. రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్నది. రైతులు ఏ పంట పండించినా దానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. అయినా పంటల కొను గోళ్లపై ఆంక్షలు పెట్టడం వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీయడమే. ఆరేండ్లలో వరికి రూ. 470 మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం... యూరియా, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను అంతకన్నా ఎక్కువగా పెంచింది. ఇదంతా రైతాంగాన్ని దోచుకోవడమే. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకుంటే, కేంద్రంపై ఉద్యమ స్ఫూర్తితో యుద్ధం తప్పదు. తెలంగాణ రైతుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలుపెరుగని పోరాటం చేస్తున్నది. కేంద్ర వ్యవసాయ విధానంలోని డొల్లతనాన్ని టీఆర్ఎస్ బట్టబయలు చేస్తున్న తీరును పలువురు జాతీయ విపక్ష నేతలు ప్రశంసిస్తున్నరు. ఇప్పుడు జరగాల్సింది ఇదేన ంటున్నరు. ఒకవైపు టీఆర్ఎస్ రైతుల బాగు కోసం పోరాడుతుంటే మన రాష్ట్ర విపక్ష నేతలు సహాయ నిరాకరణతో పీత రాజకీయాలు చేస్తున్నరు. దేశానికి రైతే వెన్నెముక అని మాటల్లో చెప్తూనే మోదీ సర్కార్ కర్షకులను కన్నీట ముంచుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనమంటే కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను మార్కెట్ శక్తుల కోరలకు బలి చేస్తున్నది. తెలంగాణలో యాసంగి పంటగా వచ్చే వరిధాన్యాన్ని కొనేది లేదని చెప్పటం బాధ్యతా రాహిత్యమే కాదు, వివక్షాపూరితం కూడా. వానకాలం నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతుల ఇబ్బందులు, కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొన్నది. కేంద్రం మాత్రం రైతులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతానికి పుష్కలంగా సాగునీరు అంది వరి విస్తీర్ణం పెరిగింది. ఈ విషయం తెలుసుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కిరికిరీ పెడుతోంది. ఒకే దేశంలో రెండు విధానాలు ఎలా ఉంటాయి? పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరనేది సూటి ప్రశ్న! దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమా ధానం చెప్పడం లేదు. పైగా అవమానిం చేలా కేంద్ర మంత్రి మాటలున్నాయి. గత యాసంగితో పోల్చుకుంటే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు వరి సాగును కొంత తగ్గించారు. అయినా ధాన్యం కొనుగోలు చేయలేమని సవా లక్ష కారణాలను కేంద్రం ఏకరువు పెడుతోంది. మరో నెల రోజులైతే, యాసంగి ధాన్యం రైతుల చేతికి వస్తుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తెలంగాణ ప్రజలను నూకలు తినమని అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్టీకి నూకలు చెల్లడం ఖాయం. నూకలు తినాలన్న వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకో వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుండడంతో వారు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహ రించాల్సిన కేంద్రం, తెలంగాణ రైతాంగాన్ని తిప్పలు పెట్డడం సరికాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రేషన్ బియ్యం పరిస్థితి దారుణంగా ఉండేది. నూకలు, పురుగుల బియ్యం సరఫరా అయ్యేవి. పంజాబ్ నుంచి వచ్చిన బియ్యం ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉండేవి. అలాంటి బియ్యం తిన్న అనుభవమున్న తెలంగాణ ప్రజలకు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికంగా పండించిన ధాన్యాన్ని ఆడించిన తర్వాత వచ్చిన నాణ్యమైన బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తు న్నది. ఈ తరుణంలో యాసంగి బియ్యాన్ని మర ఆడించి వచ్చిన నూకల బియ్యాన్ని మీ ప్రజలకు తినడం అలవాటు చేయండని కేంద్రమంత్రే అనడం చూస్తే వారి అహంకారం ఏంటో అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే... రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితి రావాలని కేంద్రం కోరుకుంటున్నట్లుంది. తెలం గాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తున్నది. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంటూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిపోయి అన్యాయం చేస్తోంది. అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన చోట ఒకలా, నచ్చని చోట మరోలా చూస్తున్నది. ఇలా పక్షపాతంతో... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గోస పెట్టడం ఎంతవరకు సమంజసమో కేంద్రం ఆలోచించాలి. -పువ్వాడ అజయ్ కుమార్ వ్యాసకర్త రాష్ట్ర రవాణా శాఖ మంత్రి -
హోరెత్తిన వరి పోరు!
సాక్షి నెట్వర్క్: కేంద్రంపై ‘వరి పోరు’లో భాగంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపుమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఆందోళనలు చేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసనలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు మోకాళ్లపై కూర్చుని వడ్లు దోసిట్లో పట్టుకుని ఆందోళన చేశారు. కేంద్రం తీరు దున్నపోతుపై వానపడినట్టుగా ఉందంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ‘ధర్నా’లో దున్నపోతుపై నీళ్లు చల్లుతూ నిరసన తెలిపారు. వరి పోరులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ వాళ్లది పచ్చి మోసం: కేటీఆర్ కేంద్ర వైఖరిని ముందే గుర్తించిన సీఎం కేసీఆర్.. వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రం కొంటుందని చెప్పి, రెచ్చగొట్టి మరీ వరి వేయించారు. ఇప్పుడు ధాన్యం కొనాలని కోరితే.. తెలంగాణను అవమానించేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. బీజేపీది పచ్చి మోసం. వారికి ఎంత బలుపు.. నూకలు తినుమన్నోళ్ల తోకలు కత్తిరిస్తం. కేంద్రం ఉప్పుడు బియ్యం ఎగుమతి చేస్తూ.. చేయడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టి.. రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతాం. పట్టణాల్లో యువకులు బైక్ర్యాలీలు నిర్వహించాలి. ఈనెల 11న ఢిల్లీలో మోదీ ఇంటికి కూతవేటు దూరంలో ధర్నా చేస్తాం. – సిరిసిల్ల నిరసనల్లో మంత్రి కేటీఆర్ మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు: హరీశ్ నాడు రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం. నేడు తెలంగాణ రైతుల కోసం మళ్లీ రోడ్డెక్కాం. లక్ష్యాన్ని సాధిస్తాం. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పనిచేస్తోంది. బడా కార్పొరేట్లకు లక్షల కోట్లరుణాలు మాఫీ చేశారు. రైతుల పంటను కొనాలంటే నష్టం వస్తుందంటున్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందే. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కాదు.. ముందు తెలంగాణ రైతుల బాధలు వినాలి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు ఆయన అచ్చే దిన్ అని అధికారంలో వచ్చారు. కానీ ఇప్పుడు జనం సచ్చే దిన్ తీసుకొచ్చారు. మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అన్నట్టు తయారైంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కేంద్రంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు. – సిద్దిపేట దీక్షలో మంత్రి హరీశ్రావు మంత్రులు ఎవరేమన్నారంటే.. ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు. – మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో వరి కంకులతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య వనపర్తి: వరి కొనకుండా ఇబ్బందిపెడ్తున్న కేంద్రంపై రైతులు పెడుతున్న శాపం ఊరికే పోదు. కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి. – మంత్రి నిరంజన్రెడ్డి సంగారెడ్డి: పంజాబ్ మాదిరిగా తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించలేని రాష్ట్ర బీజేపీ నాయకులు దద్దమ్మలు – మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వరంగల్: వడ్లు కొనకుండా రైతులను మోసం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ వైఖరిని తిప్పికొట్టాలి. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ములుగు, మహబూబాబాద్: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆపేది లేదు. – మంత్రి సత్యవతి రాథోడ్ నిర్మల్: ధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. – మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కరీంనగర్: వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దున్నపోతుపై వానపడినట్టే వ్యవహరిస్తోంది. – మంత్రి గంగుల కమలాకర్ వికారాబాద్: రాష్ట్రంలో ధాన్యం బాగా పండితే కేంద్ర పెద్దలు ఓర్వలేకపోతున్నారు. – మంత్రి సబితారెడ్డి పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేదాకా కొట్లాడుతాం. – మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజామాబాద్, కామారెడ్డి: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలకు నూకల బియ్యం అలవాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ మాట్లాడటం దారుణం. – మంత్రి ప్రశాంత్రెడ్డి మహబూబ్నగర్: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులపై కక్ష సాధిస్తోంది. ప్రతి గింజను కేంద్రం కొనేదాకా పోరాటం చేస్తాం. – మంత్రి శ్రీనివాస్గౌడ్ నల్లగొండ: దేశంలో ఆహార పంటలపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. కేంద్రం మెడలు వంచుతారు. – మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి -
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఎన్ని విధాలుగా మాట్లాడిన ఫలితం లేదు
-
కేంద్రానిది అసత్య ప్రచారం
ఖమ్మం మయూరిసెంటర్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. శనివారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రశ్న కూడా లేవనెత్తకపోవడం గమనిస్తే రైతులపై వారికి ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోతోందన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపడతానని చెప్పడం గర్హనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ఉద్యోగాలు ఊడగొడుతున్నందుకు సంజయ్ దీక్ష చేపడుతున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 1.3 లక్షల ఉద్యోగాలు కల్పించిందని మంత్రి వెల్లడించారు. కాగా, బీజేపీ నాయకులు కలుషిత రాజకీయాలు చేస్తున్నారని, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతల సంస్కారం బయటపడిందన్నారు. -
‘మీతో ఇంపార్టెంట్ మ్యా టర్ ఉంది. మీకు నేను చెప్పాలి, మీరు నాకు ఒక మ్యాటర్ పంపాలి’
హిమాయత్నగర్: ‘మీతో ఇంపార్టెంట్ మ్యా టర్ ఉంది. మీకు నేను చెప్పాలి, మీరు నాకు ఒక మ్యాటర్ పంపాలి’ అంటూ టీఎస్ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్ కు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నుంచి ఈ నెల 4న మెయిల్ వచ్చింది. మంత్రి నుంచి మెయిల్ రావడమేమిటనుకుని చూసిన సదరు అధికారి ఇదేదో సైబర్ నేరగాడు చేసిన పని కావొచ్చని భావించి అప్రమత్తమయ్యారు. సోమవారం జీవన్ ప్రసాద్ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: కౌన్సిలర్లకు ‘కరెంటు’షాక్!) -
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. కిలోమీటర్కు ఎంతంటే..?!
-
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. కిలోమీటర్కు ఎంతంటే..?!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగునున్నాయి. ఖైరతాబాద్లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్కు 25 పైసలు, ఎక్స్ప్రెస్లు ఆపై సర్వీసులకు 30పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. చదవండి: (ఆ కుటుంబపై పాము పగపట్టింది.. ఒకేసారి ముగ్గుర్ని..) -
Khammam: ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న అదనపు కలెక్టర్ స్నేహలత, ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్లను రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభినందించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి.. స్నేహలతకు జన్మించిన చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. భార్యాభర్తలిద్దరూ ఉన్నతాధికారులైనా.. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. చదవండి: కాళ్లు కడిగి.. కన్యాదానం చేసి.. ఆదర్శంగా నిలిచిన ముస్లిం దంపతులు చిన్నారిని ఎత్తుకున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్. చిత్రంలో స్నేహలత, ఆమె భర్త శబరీశ్ తదితరులు కాగా ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత , భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీ శబరీస్ దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. స్నేహలత సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. డెలివరీ టైం అని వైద్య సిబ్బంది కలెక్టర్ స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. తల్లిబిడ్డా క్షేమమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ కలెక్టరమ్మ డెలివరీ న్యూస్ నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడుపోసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ స్నేహలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. చదవండి: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’ -
బురదలో కూరుకుపోయిన మంత్రి అజయ్ కారు
సాక్షి, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలం నర్సాపురానికి వచ్చిన రాష్ట్ర మంతి పువ్వాడ అజయ్కుమార్ అక్కడి రోడ్లతో ప్రజలు పడే బాధలను స్వయంగా అనుభవించారు. శనివారం మంత్రి పర్యటనకు వచ్చే సమయానికే నర్సాపురంలో వర్షం కురుస్తోంది. వర్షంలోనే పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అజయ్కుమార్, రైతువేదిక సమావేశంలో మాట్లాడి తిరుగు పయనమయ్యారు. అయితే మంత్రి ఎక్కిన కారు చిన్న వర్షం కారణంగా ఏర్పడిన బురదలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు, సెక్యూరిటీ అధికారులు కారును తోసి బయటకు తీశారు. ఆ తర్వాత మంత్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లారు. చదవండి: RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..? -
గన్ను పట్టారు.. నాట్లేశారు.. సారె తిప్పారు
మహిళాకూలీలను చూడగానే వారి మనసు వరిపొలం వైపు మళ్లింది... ఎంపీ, ఎమ్మెల్యేలమనే హోదాలను పక్కన పెట్టి సాదాసీదా మనుషులుగా మారిపోయి కూలీలతో కలిసిపోయారు.. బురదపొలంలోకి దిగి వారితోపాటే నాట్లేశారు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ. ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట బాల్యాతండాలో తీజ్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతూ ఇలా ‘సాక్షి’కెమెరాకు చిక్కారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గన్నుతో ఇలా కనిపించారు. – బయ్యారం, సాక్షి ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ సారె తిప్పారు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద కుమ్మరి సారెను కర్రతో కొద్దిసేపు తిప్పారు. – సాక్షి ఫొటో గ్రాఫర్, ఖమ్మం -
చిరంజీవి, ఎన్టీఆర్లను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్
సాక్షి, హైదరాబాద్ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుమారుడు నయన్తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, జూ. ఎన్టీఆర్లను కలిశారు. తొలుత ఎన్టీఆర్ను కలిసిన అజయ్ కుమార్, నయన్లు.. ఆపై చిరంజీవిని కలిశారు. నయన్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి అతనితో స్వయంగా కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి పువ్వాడ అజయ్ పోస్ట్ చేశారు. అయితే అకస్మాత్తుగా మంత్రి పువ్వాడ వరసగా సినీ ప్రముఖులు చిరంజీవి, ఎన్టీఆర్లను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పువ్వాడ నయన్ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా అంటూ కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్లో నయన్ ఎంట్రీ ఉండబోతుందంటూ అప్పుడే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మరోవైపు మంత్రి కేటీఆర్ను కూడా కలిశారు. 'నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది' అంటూ మంత్రి పువ్వాడ అజయ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ దంపతులు నయన్కు బర్త్డే విషెస్ అందజేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ @KChiruTweets గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలవడమైంది. @Koratala_fans pic.twitter.com/udJhDfg5zO — Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021 నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది. @TelanganaCMO @MinisterKTR @KTRTRS @trspartyonline pic.twitter.com/GfkdLcBNbt — Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021 -
మంత్రి పువ్వాడ సీరియస్.. డబ్బు వాపస్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రి
సాక్షి, ఖమ్మం: కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల భయాలను ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇటీవలే కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబం నుంచి అధిక బిల్లులను వసూళ్లు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై మంత్రి పువ్వాడ అజయ్ కూమార్ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో బాధిత కుటుంబం కట్టిన 5 లక్షల అధిక బిల్లులను ఆసుపత్రి యాజమాన్యం తిరిగి చెల్లించింది. వివరాలు.. ఖమ్మం పట్టణానికి చెందిన అలీమ్ కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటంబ సభ్యులు చేర్పించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అలీమ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన కుటుంబం నుంచి సదరు ఆస్పత్రి యాజమాన్యం చార్జీల రూపంలో 6 లక్షల 40 వేలు వసూలు చేసింది. అయితే ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ దృష్టికి మృతుని కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లడంతో ఆసుపత్రి యాజమాన్యంపై ఆయన మండిపడ్డారు. అధికంగా వసూలు చేసిన బిల్లులను వెనక్కి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో 5 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం చెల్లించింది. చదవండి: Khammam: మధిర ఎస్సీ కాలనీలో దారుణం.. భర్త చేత భార్య పన్ను పీకించి -
మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు
చింతకాని/సాక్షి, హైదరాబాద్: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలోని మరియమ్మ ఇంటికి సోమవారం మంత్రి పువ్వాడతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, సీపీ విష్ణు ఎస్. వారియర్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు మరియమ్మ కుమార్తెలు స్వప్న, సుజాతకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చెక్కులు, కుమారుడు ఉదయ్కిరణ్కు రూ.15 లక్షల చెక్కుతో పాటు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఖమ్మం ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి పువ్వాడ, భట్టి తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మరియమ్మ ఘటన సీఎం కేసీఆర్ దృష్టికి రాగానే, ఆయన స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 35 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. అఫిడవిట్ వేయండి: హైకోర్టు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్స్టేషన్ లాకప్డెత్ ఘటనలో మృతి చెందిన మరియమ్మ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. అలాగే ఆమె కుమారుడు, కుమార్తెలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. లాకప్డెత్ ఘటనపై న్యాయ విచారణ చేయించాలని, మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్థికసాయం అందించేలా ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. లాకప్డెత్ ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 2కు వాయిదా వేసింది. చదవండి: ‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’ -
ఎన్నికల ఎఫెక్ట్: మంత్రి పువ్వాడకు రెండోసారి కరోనా
సాక్షి, ఖమ్మం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు రెండోసారి కరోనా సోకింది. మొదటి వేవ్లోనే మంత్రి అజయ్కు కరోనా సోకగా తాజాగా మరొకసారి పాజిటివ్ తేలడం ఆందోళన రేపుతోంది. తేలికపాటి లక్షణాలు ఉండడంతో శుక్రవారం ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా శనివారం రిపోర్ట్ వచ్చింది. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెంటనే తన నివాసంలో హోం ఐసోలేషన్కు వెళ్లారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి వెల్లడించారు. వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే యథావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అని మంత్రి ట్వీట్ చేశారు. అయితే మంత్రి అజయ్ ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎన్నికల వలన పెద్ద ఎత్తున కరోనా సోకుతుందని ఖమ్మంలో ప్రచారం జరుగుతోంది. మొన్న నాగార్జున సాగర్ ఎన్నిక అనంతరం ఏ జరిగిందో చూశాం. సీఎం కేసీఆర్తోపాటు పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఖమ్మం నగరంలో కూడా అదే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం -
సైకిల్పై పువ్వాడ: చక్కర్లు కొడుతూ.. సూచనలిస్తూ
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి వైరా రోడ్ మీదుగా సైకిల్పై నగరంలోని ప్రధాన సెంటర్లలో పర్యటించారు. కొత్త మున్సిపల్ భవనం వరకు సైకిల్పై పర్యటించి రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన సైడు డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైపులైన్, పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి పనుల కొనసాగింపు కుదరదని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మంకు ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరాభివృద్ధిలో విద్యుత్ శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. నగరాభివృద్ధికి రూ.30కోట్ల ఎస్డీఎఫ్ నిధులను సీఎం మంజూరు చేశారని, ఆ నిధులను రోడ్ల మరమ్మతులు, డ్రెయిన్ల నిర్మాణానికి ఖర్చు చేస్తామన్నారు. బడ్జెట్లో ఖమ్మం కార్పొరేషన్కు రూ.150కోట్లు కేటాయించారని, ఆ నిధులను వినియోగించుకొని నగరంలోని మట్టి రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా ఆధునికీకరించడంతోపాటు అన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని, మరిన్ని అభివృద్ధి పనులు చేసేలా ప్రజలు తమను ఆశీర్వదించాలన్నారు. ఇంకా మంత్రి వెంట మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు. చదవండి: మంత్రి జగదీశ్ కంటతడి -
బడ్జెట్లో ఆర్టీసీకి రూ.3,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అప్పు.. దానిపై పేరుకుపోయిన వడ్డీ.. సొంతానికి వాడుకోవటంతో పేరుకుపోయిన కార్మికుల భవిష్య నిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం నిధులు, చమురు బిల్లులు, జీతాల భారం.. ఇలా ఎటుచూసినా సమస్యలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వం గతేడాది కంటే మెరుగ్గా బడ్జెట్లో నిధులు ప్రతిపాదించి ఊరటనిచ్చింది. తాజా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు ప్రతిపాదించారు. ఇవి కాకుండా బడ్జెటేతర నిధుల కింద మరో రూ. 1,500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వెరసి రూ. 3 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సహకార పరపతి సంఘం పాలకమండలి ఆర్టీసీపై హైకోర్టులో కేసు దాఖలు చేసింది. బకాయిలు చెల్లించకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని పీఎఫ్ యంత్రాంగం షోకాజ్ నోటీసులు పంపింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో వాటి బకాయిలు కొంత మేర తీర్చేందుకు ఆర్టీసీకి నిధులు అందనున్నాయి. కావాల్సింది రూ.5 వేల కోట్లు... కార్మికుల భవిష్య నిధి చెల్లించకపోతుండటంతో రూ. 1,200 కోట్లు పేరుకుపోయాయి. కార్మికులు పొదుపు చేసుకున్న సహకార పరపతి సంఘం బకాయిలు రూ. 850 కోట్లకు చేరుకున్నాయి. మరో రూ. 3 వేల కోట్లు బ్యాంకు అప్పులున్నాయి. వెరసి ఆర్టీసీకి రూ. 5 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో ఇచ్చే నిధులు కాక రూ. 2,500 కోట్లు కావాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం రూ. 3 వేల కోట్లే కేటాయించింది. గత కొన్ని నెలలకు ఆర్టీసీ తన ఉద్యోగులకు నికర వేతనం మాత్రమే చెల్లిస్తోంది. ఆ మొత్తం నెలకు రూ. 120 కోట్లు అవుతుంది. అదే స్థూల వేతనం చెల్లించాలంటే ప్రతినెలా రూ.185 కోట్లు కావాలి. ఇప్పుడు నిధులు అందుబాటులో ఉంటే స్థూల వేతనం చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక ఉన్నపళంగా వెయ్యి కొత్త బస్సులు కొనాల్సి ఉంది. వాటికి కొన్ని నిధులు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. రూ. 1,500 కోట్లు పూచీకత్తు రుణానికి బడ్జెట్లో రూ.1,500 కేటాయిస్తూ మరో రూ. 1,500 కోట్ల బడ్జెటేతర నిధులుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ రెండో మొత్తం బ్యాంకు నుంచి అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే పూచీకత్తుకు సంబంధించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదే నిజమైతే అలా తీసుకునే మొత్తం తిరిగి ప్రభుత్వమే చెల్లించేలా ఉండాలని వారు కోరుతున్నారు. అంటే ఓ రకంగా గ్రాంటుగా ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నారు. త్వరలో సీఎంతో భేటీ: మంత్రి పువ్వాడ ఆర్టీసీ కష్టాల్లో ఉన్న సమయంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా రూ.3 వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించటం ఎంతో శుభపరిణామమని, ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన నిధులను ఎలా ఖర్చు చేయాలన్న విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని, ఇందుకోసం ముఖ్యమంత్రితో భేటీ అయి చర్చించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రూ.3 వేల కోట్లు ప్రతిపాదించటం పట్ల అన్ని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
ఖమ్మంలో ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘శ్రీకారం’ వేడుక: ముఖ్య అతిథిగా మెగాస్టార్
సాక్షి, ఖమ్మం: హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్ జంటగా నటించిన శ్రీకారం చలన చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహక సంస్థ శ్రేయాస్ మీడియా ప్రతినిధి దొబ్బల వేణు తెలిపారు. ఆదివారం వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరవుతారని తెలిపారు. సినీ దర్శకుడు డి.కిషోర్, సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్, చిత్ర బృందం పాల్గొంటుందని తెలిపారు. ఎంట్రీ పాస్లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రేయాస్ మీడియా గ్రూపు ప్రతినిధులు నల్లి శ్యామ్, నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సినిమాల శాంపిల్ రెడీ.. చూసేందుకు మీరు సిద్ధమా -
‘ఆచార్య’కు తెలంగాణ మంత్రి బంపరాఫర్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ తెలంగాణ మంత్రిని కలిశారు. ఖమ్మం జిల్లాలో మంత్రిని కలిసి గనుల్లో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి అనుమతి ఇప్పించారని తెలిసింది. అయితే షూటింగ్ జరిగినన్ని రోజులు చిరంజీవి తన నివాసంలో ఉండాలని మంత్రి కోరారు. ఆయన విజ్ఞప్తితో చిరు మంత్రి నివాసంలో బస చేయనున్నారు. మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ మేరకు అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను దర్శకుడు కొరటాల శివ కలిసి విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఇవ్వడంతో పాటు మెగాస్టార్ చిరంజీవికి తానే ఆతిథ్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్లో షూటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు రామ్చరణ్పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని చిత్రబృందం తెలిపింది. మంత్రిని కలిసిన అనంతరం దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. ‘ప్రస్తుతం ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని… సినిమా షూటింగ్లకు జిల్లాలో చాలా అనువైన ప్రాంతాలున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఖమ్మం స్వరూపం నేడు పూర్తిగా మారిపోయింది’ అని తెలిపారు. దీనికి కృషి చేసిన మంత్రి పువ్వాడకు ఈ సందర్భంగా దర్శకుడు అభినందనలు తెలిపారు. అయితే కొన్నిరోజుల కిందట ఆచార్య షూటింగ్లోనే చిరంజీవిని, కొరటాల శివను మంత్రి కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. -
పీఏ తల్లి పాడె మోసిన మంత్రి
తన వ్యక్తిగత సహాయకుడి తల్లి అనారోగ్యంతో మృతిచెందగా.. ఆమె పాడె మోసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన అనుబంధాన్ని చాటుకున్నారు. ఆయన పీఏ, ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన చిరుమామిళ్ల రవికిరణ్ తల్లి దమయంతి (60) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్ నుంచి వచ్చి ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం దమయంతి అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. – ఖమ్మం, అర్బన్ చదవండి: టీకా వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి చదవండి: కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాక విచారణ చేస్తారా? -
ఖమ్మం సమావేశానికి కాంగ్రెస్ అతిరథ, మహారధులు
ఖమ్మం, ఫిబ్రవరి 6: పేదల కోసం ఇచ్చిన జీవోలను అడ్డం పెట్టుకుని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూములను రెగ్యులరైజ్ చేయించుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, దీపక్ చౌదరి, బాల గంగాధర్ తిలక్, పుచ్చకాయల వీరభద్రం, మలీద్ వెంకటేశ్వర్లు, నూతి సత్యనారాయణ, ఎర్రబోలు శ్రీను, మొక్క శేఖర్ గౌడ్, బొందయ్య తదితరాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల మీద రేపు బూత్ కమిటీ స్థాయి సమావేశం జరగనుందని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కమిటీల అధ్యక్షులు వస్తున్నారని భట్టి మీడియాకు వివరించారు. ఖమ్మం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో భట్టి విమర్శలు చేసారు. పట్టణంలో సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై భట్టి నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన వాళ్లపై కేసులు, అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. సొంత కాంట్రాక్ట్ సంస్థకు.. లేదంటే ఆయన మద్దతుదారులకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు కేటాయిస్తున్నారని అన్నారు. మంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. మంత్రి తీరుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. పేదల కోసం ఇచ్చిన జీవో 58, 59ని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారని భట్టి విమర్శలు చేసారు. వ్యాపారాల కోసం మంత్రి పదవిని అడ్డం పెట్టుకోవడం దుర్మార్గమని భట్టి అన్నారు.అభివృద్ధి పనులను నాసిరకంగా చేస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వున్నారు. మంత్రి అజయ్ చేస్తున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో సేకరించి విజిలెన్స్ కు అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ను గెలిపించాలి రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతురేక నల్ల చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేయడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోసం సమాయత్తం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా నాయకులతో రేపు మధ్యాహ్నం సమావేశం ఉంటుందని అన్నారు. ఖమ్మం పట్టణంలో ఉన్న నిరుద్యోగులు.. వాళ్ళ కోసం.. త్వరలో భారీ ర్యాలీ చేస్తున్నట్లు ప్రకటించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్పై ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం -
టీఎస్ఆర్టీసీలో ఉద్యోగ భద్రత; ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఎట్టకేలకు ఉద్యోగ భద్రత అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సంతకం చేశారు. 2019లో దీర్ఘకాలం పాటు జరిగిన సమ్మె అనంతరం ఆర్టీసీ ఉద్యోగులతో ప్రగతి భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉద్యోగ భద్రతపై సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు కొత్త మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అప్పటి నుంచి అది పెండింగులో ఉండటంతో కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైలుపై సీఎం సంతకం చేయటంతో అది త్వరలో అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపోమాపో విడుదల కానున్నాయి. చిన్న విషయాలకే సస్పెన్షన్.. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లపై చిన్న చిన్న అంశాలకే ఉద్యోగాలను తొలగించే కఠిన చర్యలు అమలవుతున్నాయి. టికెట్ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, టికెట్ల రూపంలో వచ్చిన డబ్బులో పూర్తి మొత్తాన్ని డిపోలో డిపాజిట్ చేయకపోవటం, ప్రయాణికులతో దురుసుగా వ్యవహరించటం వంటివాటికే కండక్టర్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. టిమ్ యంత్రాలు వచ్చాక డ్రైవర్లు కూడా టికెట్లు జారీ చేస్తుండటంతో వారిపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంటున్నారు. బస్సు నడపటంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలకు పాల్పడినా కూడా డ్రైవర్లపై చర్యలుంటున్నాయి. ఇప్పుడేం మార్చారు.. తప్పు చేసిన వెంటనే కఠినచర్య తీసుకోకుండా కొన్నిసార్లు అవకాశం ఇచ్చేలా తాజాగా మార్గదర్శకాలు రూపొందించారు. బస్సులో 100 శాతానికి మించి ప్రయాణికులున్నప్పుడు ఒకరిద్దరికి టికెట్లు జారీ చేయకపోతే వెంటనే చర్యలు తీసుకోరు. అలాగే డబ్బు కాస్త తగ్గినా వెంటనే చర్యలుండవు. రెండు, మూడుసార్లు అదే తప్పు చేస్తేనే సస్పెన్షన్ వేటు పడుతుంది. ఇటీవల హైదరాబాద్లో ఓ మహిళా కండక్టర్ ప్రయాణికుడితో ‘తెలుగు రానప్పుడు తెలంగాణలో ఎందుకున్నావ్’అన్నందుకే సస్పెండ్ చేశారు. అదే సమయంలో వరంగల్లో లేని ఉద్యోగులు ఉన్నట్లుగా చూపి నిధులు స్వాహా చేసిన విషయంలో అధికారిపై చర్యకు మీనమేషాలు లెక్కించారు. ఆ అధికారికి సహకరించారన్న ఆరోపణ ఉన్న మరో ఉన్నతాధికారిని మాత్రం వదిలేశారు. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో ఓ ఉన్నతాధికారి రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నా కూడా ఎలాంటి చర్యలు లేవు. టికెట్ డబ్బులు కలెక్ట్ చేయకపోవడం, టికెట్ ఇవ్వని సందర్భంలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ కండక్టర్లకు మొదటి దఫా చర్యలు ఉండవు. ఇది పునరావృతం అయితే తొల గించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్ అంతకన్నా పెద్ద బస్సు అయితే సీట్ల సంఖ్య కంటే ప్రయాణికులు తక్కువున్నప్పుడు ఈ తప్పుకు సస్పెన్షన్ చేస్తారు. రుసుము వసూలు చేసి టికెట్ ఇవ్వకుంటే డీలక్స్ కంటే తక్కువ కేటగిరీ బస్సుల్లో తొలగించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్ అంతకంటే ఎక్కువ కేటగిరీ బస్సులు అయితే సస్పెన్షన్లో ఉంచుతారు. అవసరం అయితే తొలగిస్తారు. ఇలా మార్గదర్శకాల్లో పలు మార్పులు చేశారు. వేధింపులుండవు: మంత్రి పువ్వాడ ఆర్టీసీ కార్మికులను కొందరు అధికారులు చిన్నచిన్న తప్పులకే వేధిస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యో గభద్రతకు అవకాశం కల్పించటం గొప్ప విషయం. వేధింపులు లేకుండా ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవచ్చు. సంబంధిత ఫైలుపై సంతకం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. వేధింపులు లేకుండా మాత్రమే ఉద్యోగ భద్రత, అలా అని తప్పులు చేసినా పట్టించుకోరని అనుకోవద్దు. -
ఆచార్యతో మంత్రి అజయ్.. సెట్లో సందడి
‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’గా వస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఆచార్య షూటింగ్ లొకేషన్లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వాలిపోయారు. చిరంజీవిని కలిసి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయాలను మంత్రి ట్విటర్లో పంచుకున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆచార్య సినిమా సెట్లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భారీ సెట్లో జరుగుతున్న షూటింగ్ ప్రదేశంలో మంత్రి కనిపించారు. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు కొరటాల శివ వివరించారు. ఈ మేరకు మంత్రి అజయ్ ట్వీట్ చేశారు. చిరంజీవితో దిగిన ఫొటోలు పంచుకున్నారు. ఆ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అయితే మంత్రి ఎందుకు కలిశారో అనేది తెలియడం లేదు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి పక్కన జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆచార్య చిత్ర యూనిట్ తో చిరు హాసం.. Megastar @KChiruTweets గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ. ఎం pic.twitter.com/INwVEVjduo — Ajay Kumar Puvvada (@puvvada_ajay) January 30, 2021 -
ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలు షర వేగంగా మారుతున్నాయి. ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లా టీఆర్ఎస్లోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం సైతం పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమచారం. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదని, తాను ప్రజాప్రతినిధి నీ కాదని ఎవరి పర్మిషన్ తీసుకోని రావాల్సిన అవసరం నాకు లేదనీ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. (సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి) ఇలాంటి సమయంలో హడావుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపెట మండలం గండుగుల పల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామ నాగేశ్వర్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన భేటీ కావడం పార్టీలో మరో చర్చ కు తెరలేపింది. అసలు ఖమ్మం టీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానిక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తుమ్మలతో భేటీ అయ్యారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు తొలి నుంచి వివాదంగా మారిన విషయం తెలిసిందే. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆ మధ్య తుమ్మల చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. మరోవైపు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డికి తాను అండగా ఉంటానంటూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. పదవులు ఎవరి సొత్తు కాదు.. ‘కొందరు మూడేళ్లు, కొందరు నాలుగేళ్లు.. మరికొందరు ఐదేళ్లు.. మంచిగా పరిపాలిస్తే తిరిగి పదవి దక్కుతుంది. అంతే తప్ప పదవులు ఎవడబ్బ సొత్తు కాదు’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలే మన సొత్తు అని ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవి అని ఆయన వివరించారు. ఆదివారం మండలంలోని జయలక్ష్మిపురం, చిన్నమల్లెల, కుంచపర్తి గ్రామాల్లో పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పలు కార్యక్రమాల్లో ఒకే పార్టీలో ఉంటూ కక్ష సాధిస్తున్నారని అభిమానులు పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడం సంస్కారం కాదని, నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని.. కష్టపెట్టిన వాడు ఒక్కడే వడ్డీతో సహా ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చేటప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగవని, పోయేటప్పుడు ఎక్కడా ఉన్నా పోతాయని, ప్రజాభిమానమే శాశ్వతమని చెప్పారు. అధికారం ఉంది కదా అని పొంగులేటి, దయానంద్, మువ్వా.. కార్యక్రమాలకు వెళ్లొద్దని ఎన్ని ఆంక్షలు పెట్టినా.. అభిమానం ఉన్న దగ్గరికే వస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. -
'కూకట్పల్లిలో బండి సంజయ్కు వ్యాక్సిన్ వేశా'
సాక్షి, ఖమ్మం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ మంత్రి పదవి ఆశించలేదు. ఎన్నికల సమయం కావడంతో కొందరు టూరిస్ట్లు వస్తుంటారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చింది. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తొండి సంజయ్. కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు ఓట్లు రాబట్టుకోవడం కోసమే ఆయన పర్యటించారు. టీఆర్ఎస్పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం అనే వ్యాఖ్యలకు సమాధానంగా.. ఖమ్మంలో ఎటువంటి వ్యాక్సిన్లు పనిచేయవు. వ్యాక్సిన్ వేసినా తిప్పికొట్టేందుకు ఇక్కడ ప్రజలకు బాగా రోగ నిరోధక శక్తి ఉంది. కూకట్పల్లి డివిజన్లో ఏడు కార్పొరేటర్లలో ఆరు గెలుచుకొని బండి సంజయ్కు నేను వ్యాక్సిన్ వేశాను' అని పేర్కొన్నారు. చదవండి: (‘టీఆర్ఎస్పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం’) దమ్ముంటే ఇప్పుడు నిరూపించు లక్షలాదిమంది ప్రజలకు మమత ఆస్పత్రి ద్వారా సేవలందిస్తున్నాం. అలాంటి ఆస్పత్రిపై సంజయ్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. సంజయ్ కార్పొరేటర్ కాక ముందే మమత ఆస్పత్రి ఏర్పడింది. ఆ విషయం సంజయ్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నాపై చేసిన ఆరోపణలు 2023వరకు కాదు.. దమ్ముంటే ఇప్పుడు నిరూపించు అంటూ సవాల్ విసిరారు. నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు. ఖమ్మం జిల్లాలో మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ మాకు పోటీనే కాదు. ఖమ్మంకు స్మార్ట్ సిటీ కావాలని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగాం. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఖమ్మంను స్మార్ట్ సిటీగా ప్రకటించలేని బీజేపీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు' అంటూ మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. చదవండి: (12న రాష్ట్రానికి వ్యాక్సిన్లు) -
‘టీఆర్ఎస్పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం’
సాక్షి, ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్తో కలిసి బండి సంజయ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామన్నారు. బీజేపీని విమర్శించడానికి మంత్రికి సిగ్గుండాలంటూ ఆయన మండిపడ్డారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ.. తమకు నీతులు చెప్పుతారా అంటూ నిప్పులు చెరిగారు. (చదవండి: 'ఎన్ని యాగాలు చేసినా ఆయన పాపాలు పోవు') ‘‘నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.. అక్రమ భూములను రెగ్యులర్ చేయించుకోవడానికి టీఆర్ఎస్లోకి చేరారు. మెడికల్ కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన అక్రమాలన్ని బయట పెడతాం. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పాలన పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పుడు ప్రభుత్వం పడి పోతుందో తెలియదు. వచ్చే రెండేళ్లు కొనసాగడం కష్టమే. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం.. రెండు చోట్ల విజయవంతం అయింది. తర్వాత ఖమ్మం కార్పొరేషన్లో వ్యాక్సిన్ ప్రయోగించ బోతున్నాం. తెలంగాణలో మంత్రులందరూ డమ్మిలేనంటూ’’ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.(చదవండి: 'బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది') -
చింతవర్రె బాధితుల కుటుంబాలతో మంత్రి భేటీ
సాక్షి, ఖమ్మం: చింతవర్రె గ్రామంలో లైంగిక వేధింపులకు గురైన బాధిత బాలికల కుటుంబ సభ్యులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బాలల హక్కుల పరిరక్షణ శాఖ చైర్మన్ దివ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. చింత్రవర్రె ఘటనను తీవ్రంగా ఖండించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రతి బాధిత కుటుంబాలకు ఆశ్వాసన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని, మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటపై చర్చించి బాధితక కుటుంబాలకు న్యాయం చేయాలని, పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక కుటుంబాల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. బాధిత బాలికల గుర్తింపు బయటకు రాకుండ చూడాలని ఆయన కోరారు. బాలికలంతా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో శిశువు కేంద్రంలో ఉంటూ మానసికంగా దృఢంగా తయరు అయ్యేటట్లు చుస్తామన్నారు. దీనికి పిల్లల తల్లిదండ్రులు కూడా అంగీకరించారని చెప్పారు. పోక్సో చట్టం కింద బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని, మంత్రిగా.. ఎమ్మెల్యేగా కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా ఎస్పీ ఉంటారని, ఐటీడీయే, పీఓఆర్డీఓ, మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి, అదనపు కలెక్టర్లతో విచారణ కమిటీ వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా చూస్తామని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు పోక్సో చట్టం కింద 1 లక్ష, ప్రభుత్వం తరపు 1 లక్ష రూపాయల చొప్పున మొత్తం 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాసరెడ్డిలు కలిసి రూ. 50 వేలు, ప్రభుత్వం విప్ రేగ కాంతారావు రూ. 50 వేలు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్లు కలిసి 5 కుటుంబాలకు చెరో లక్షల రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించారు. -
మంత్రి పువ్వాడ అజయ్కు కరోనా..
సాక్షి, హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్కు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగానే ఉందని స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు మంత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 2,78,599 సంఖ్యకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జ్ కాగా.. 1,499 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 7,272 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తాజా నివేధికలో వెల్లడించింది. -
హోం డెలివరీ బై ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా జంట నగరాల్లో సరుకుల హోం డెలివరీ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన కార్యాలయంలో ఈ సేవలను ప్రారంభించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరిగే ఏ ప్రాంతం నుంచైనా సరుకులు, పార్శిళ్లను నగరంలో సంబంధిత ఇళ్లకు చేరవేయడానికి అవకాశం కలుగుతుంది. ఇందుకు ఆర్టీసీ కార్గో విభాగం హోం డెలివరీలో అనుభవం ఉన్న డుంజో డిజిటల్, స్మార్ట్యాప్ లాజిస్టిక్స్, అడ్నిగమ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవలకోసం ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఏజెంట్లను నియమించుకోవటం విశేషం. హోం డెలివరీ చార్జీలు ఇలా.. 10 కేజీల వరకు రూ.80, 11 కేజీల నుంచి 30 కేజీల వరకు రూ.150, 31 కేజీల నుంచి 50 కేజీల వరకు రూ.225, 51 కేజీల నుంచి 100 కేజీల వరకు రూ.300, 101 కేజీలను మించితే అదనపు ప్రతి కిలోకి రూ.2 చొప్పున చార్జీ్జ చేస్తారు. పార్సిల్ కవర్ల ధరలు.. 500 గ్రాముల వరకు రూ.30, 501 నుంచి వేయి గ్రాముల వరకు రూ.50 వసూలు చేస్తారు. -
కార్గో పార్శిల్ హోం డెలివరీని ప్రారంభించిన పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్టు భవన్లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని, కష్టకాలంలో రూ. 200 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ మొత్తం 1200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చేయూతనిచ్చారని తెలిపారు. కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్లు మిస్ కావడం కానీ డ్యామేజ్ కావడం లాంటివి జరగీలేదన్నారు. ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారు. -
ఇక స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థులు, అర్హులైన నిరుద్యోగులకు ఐటీ హబ్ ద్వారా స్థానికంగానే ఉద్యోగాలు పొందే మహోన్నత అవకాశం లభించనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ నెల 7వ తేదీన తనతో సహా నలుగురు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం ఖమ్మం ఐటీ హబ్ను పరిశీలించిన అనంతరం ఆయన అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఐటీ ఉద్యోగాలకే ఈ హబ్ పరిమితం కాకుండా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేలా నిరుద్యోగులకు నిరంతరం శిక్షణ ఇచ్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే తన క్యాంప్ కార్యాలయంలో నడుస్తున్న టాస్క్ను ఐటీ హబ్కు తరలిస్తున్నామని, ఎటువంటి విద్యార్హత ఉన్నా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో ఇది కార్యరూపం దాల్చుతుందని అన్నారు. ఈ నెల 2న జరగాల్సిన మంత్రుల పర్యటన జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందని, ఈ నెల 5న మంత్రుల పర్యటన వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. 2017 అక్టోబర్లో శంకుస్థాపన చేసుకున్న ఐటీ హబ్లో స్వల్ప మార్పులతో అదనంగా మరో అంతస్తు ఏర్పాటు చేశామని, మొదటి దశ పూర్తి చేసి వివిధ ఐటీ కంపెనీలకుగాను 425 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకున్న ఐటీ హబ్లో ఇప్పటికే 16 కంపెనీలు భాగస్వాములయ్యాయని, ఇటీవలే నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 5వేల మందికి పైగా యువత జాబ్మేళాకు హాజరయ్యారని తెలిపారు. ఐటీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్, పతో తరగతి అర్హతపై కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన సంకల్పమని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పోటీపడి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని, నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా నిలుస్తోందన్నారు. ఈ ఏడాది కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి చొరవతో వందల కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నగరంలో నూతన హంగులతో అన్ని వసతులతో ఏర్పాటవుతున్న ఆర్టీసీ బస్టాండ్ను కూడా జనవరిలో ప్రారంభించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. నగరాభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఇప్పటికే సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్లను నాలుగు వరుసల రోడ్లుగా అభివృద్ధి చేసి.. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమపద్ధతిన బాధ్యతాయుతంగా నగరాభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు పునరావాసం కల్పించడంలో కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ డాక్టర్ జి.పాపాలాల్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, ట్రెయినీ కలెక్టర్ వరుణ్రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఎస్బీఐటీ విద్యాసంస్థల చైర్మన్ జి.కృష్ణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
బంట్రోతును కాను.. కేబినెట్ మంత్రిని..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీపీఐ నేత నారాయణ బీజేపీలో ఎప్పుడు చేరారో తనకు తెలియదని, కూకట్పల్లిలో బీజేపీ కార్యకర్తలు తనపై చేసిన హత్యాయత్నాన్ని నారాయణ సమర్థిస్తున్నారా?’అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ సందర్భం గా కూకట్పల్లి నుంచి తన వైద్య కళాశాలకు వెళ్తుండగా.. బీజేపీకి చెందిన 200 మంది కార్యకర్తలు తనపై దాడికి పాల్పడి హత్య చేసేందుకు ప్రయత్నించారన్నారు. తన సెక్యూరిటీ సిబ్బంది, అక్కడి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రతిఘటించడంతో తాను సురక్షితంగా బయటపడ్డానన్నారు. తనపై దాడి ఏవిధంగా జరిగిందో తెలుసుకో కుండా నారాయణ తనను బర్తరఫ్ చేయాలంటూ వ్యాఖ్యానించడంపై మం త్రి తీవ్రంగా మండిపడ్డారు. బర్తరఫ్ చేయడానికి తాను మఖ్దూం భవన్లో బంట్రోతును కాదని, కేసీఆర్ కేబినెట్లో మంత్రినని.. ఆ విషయాన్ని నారాయణ గుర్తించాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకనే బీజేపీ ఈ తరహా దాడులకు ఒడిగట్టిందని, బాధ్యత కలిగిన మంత్రిగా ఉండి పోలింగ్ కేంద్రాల వద్దకు ఎలా వెళ్తానని, తాను వెర్రిపువ్వును కాదన్నారు. పార్టీలు మార్చే చరిత్ర నాది కాదు మంత్రి అజయ్పై సీపీఐ నేత నారాయణ ధ్వజం పార్టీలు మారే అనైతిక చరిత్ర తనది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ‘సీపీఐ నారాయణ బీజేపీలో చేరారేమో!’అంటూ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన అనైతిక చరిత్ర అజయ్దేనన్నారు. తాను మగ్దూం భవన్ బంట్రోతును కాదంటూ మంత్రి పేర్కొనడంపై బుధవారం నారాయణ స్పందిస్తూ అజయ్ మఖ్ధూం భవన్ దయాదాక్షిణ్యాల మీదే ఎదిగారన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవుపలికారు. మంగళవారం జరిగిన ఘటనలో మంత్రి కారుపై ఒక యువకుడు కూర్చున్నపుడు దానిని వేగంగా తీసుకెళ్లడం వల్ల అతడి ప్రాణాల కు ప్రమాదం ఏర్పడి ఉండేదన్నారు. మంత్రి తప్పు చేయకపోతే ఎందుకు పరుగులు పెట్టారని ప్రశ్నించారు. అక్కడ బీజేపీ వాళ్లు తరిమారో వేరే వాళ్లు తరిమారో తనకు తెలియదన్నారు. వాస్తవాలు చెప్పినందుకు తనపై బురద చల్లితే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లే అవుతుందని నారాయణ పేర్కొన్నారు. -
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్
యాదాద్రి, భువనగిరి : దేశ, విదేశాల నుంచి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తుల రద్ధీకి అనుగుణంగా ఆలయ సమీపంలో 7 ఎకరాల్లో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయంలో నిర్మించే బస్ టెర్మినల్, బస్ డిపోకు కావల్సిన స్థలాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సైదాపురం గ్రామ శివారులో 150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదంతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలను చేపడతామన్నారు. ఆలయ ప్రారంభానికి ముందే బస్ టెర్మినల్, డిపోలను ప్రారంభించడానికి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకమైన స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు మరో స్టేషన్ నిర్మాణం నూతన బస్ టెర్మినల్ లో నిర్మించేలా ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారుఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ సుశీల్ శర్మ, కలెక్టర్ అనితా రామచంద్రన్, రవాణా శాఖ కమిషనర్ శ్రీ ఎం.ఆర్.ఎం. రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ పురుషోత్తం, శ్రీ పి.వి.మునిశేఖర్, నల్గొండ ఆర్.ఎం శ్రీ వెంకన్న, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈ ఓ గీత, ఆర్ అండ్ బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. కాగా.. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులను తిప్పనుంది. ఇక ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. విజయవాడ రూట్లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. కర్నూలు- హైదరాబాద్ రూట్లలో 213 బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. ఎంవోయూలోని ముఖ్యాంశాలు ♦మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు అవగాహన ఒప్పందంపై సంతకం. ♦అవగాహన ఒప్పందం ప్రకారం, టీఎస్ఆర్టీసీ 826 బస్సులతో ఏపీలో 1,61,258 కిలోమీటర్లు, ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 638 బస్సులతో 1,60,999 కిమీ దూరం బస్సులు నడవనున్నాయి. ♦విజయవాడ మార్గంలో, టీఎస్ఆర్టీసీ 273 బస్సులతో 52,944 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 192 బస్సులతో 52,524 కిలోమీటర్లు నడుస్తాయి. ♦కర్నూలు- హైదరాబాద్ మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఎపిలో 213 బస్సులతో 43,456 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 146 బస్సులతో 43,202 కిలోమీటర్లు నడుస్తుంది. ♦వడపల్లి మీదుగా పిడుగురాల్ల/ గుంటూరు మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 57 బస్సులతో 19,044 కిలోమీటర్లు, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 88 బస్సులతో 20,238 కిలోమీటర్లు నడుస్తుంది. ♦మాచర్ల మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 66 బస్సులతో 14, 158 కిలోమీటర్లు నడపనున్నది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 61 బస్సులతో 16,060 కిలోమీటర్లు నడపనున్నది. ♦నూజివీడు తిరువూర్, భద్రాచలం- విజయవాడ మార్గంలో టీఎస్ ఆర్టీసీ అదే కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధం. అంటే తెలంగాణ, ఏపీలో 48 బస్సులతో 12,453, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 65 బస్సులతో 14,026 కిలోమీటర్లు నడుస్తాయి. ♦ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మార్గంలో తెలంగాణ.. ఏపీలో 35 బస్సులతో 9, 140 కిలోమీటర్లు, ఏపీ తెలంగాణలో 58 బస్సులతో 11,541 కిలోమీటర్లు తిప్పనున్నారు. ♦హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో టీఎస్ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 19,004 కిలోమీటర్ల కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ నుంచి ఈ మార్గంలో బస్సులు నడపదు. ♦సత్తుపల్లి- ఏలూరు (2 మార్గాలు), భద్రాచలం మరియు మిగిలిన మార్గాల్లో కల్లూగుడెం, సత్తుపల్లి, విజయవాడ మార్గం మరియు ఇతర మార్గాల ద్వారా టీఎస్ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 8,159 కిలోమీటర్లు, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 28 బస్సులతో 3,408 కిలోమీటర్లు బస్సులు నడపనున్నాయి. -
తెలంగాణ-ఏపీ: మళ్లీ బస్సులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం విషయంలో తలెత్తిన ప్రతిష్టంభణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పరస్పర అవ గాహన కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధి కారులు సోమవారం హైదరా బాద్లో సమావేశమై ఒప్పం దం కుదుర్చు కోనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు బస్సులు మళ్లీ తిరగనున్నాయి. మారిన లెక్కలు...: కొత్త అవగాహన మేరకు తెలంగాణ ఆర్టీసీ ఏపీ పరిధిలో 1,61,258 కి.మీ. మేర బస్సులు తిప్పనుం డగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ తెలంగాణ పరిధిలో 1,60,919 కి.మీ. మేర బస్సులు తిప్పనుంది. ఇప్పటివరకు ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ పరిధిలో 1,009 బస్సులను ఏకంగా 2,65,367 కి.మీ. మేర తిప్పుతోంది. ప్రధాన పీటముడిగా మారిన హైదరాబాద్–విజయవాడ మార్గంలో ఇంతకాలం ఏపీఎస్ఆర్టీసీ 374 బస్సులు తిప్పుతుండగా ఇప్పుడు ఆ సంఖ్యను 192కు తగ్గించుకోనుంది. వెరసి ఈ మార్గంలో 51,178 కి.మీ. మేర వాటి పరిధిని తగ్గించుకోనుండటం గమనార్హం. ఇదే సెక్టార్లో తెలంగాణ బస్సులు ఏపీ పరిధిలో 162 మాత్రమే 33,736 కి.మీ. మేర తిరిగేవి. కొత్త నిర్ణయం ప్రకారం 273 బస్సులు 52,384 కి.మీ. మేర తిరగనున్నాయని సమాచారం. విజయవాడ సెక్టార్లోనే కాకుండా కర్నూలు సెక్టార్లో 25 వేల కి.మీ. మేర, భద్రాచలం సెక్టార్లో 13 వేల కి.మీ. మేర తెలంగాణలో తిరిగే పరిధిని ఏపీ తగ్గించుకుంది. మొత్తంగా బస్సుల సంఖ్య, వేళల విషయంలో మార్పుచేర్పులు జరిగాయి. ఇంతకాలం ఈ విషయంలో రెండు ఆర్టీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరక కాలయాపన జరిగింది. దసరా ఆదాయం ప్రైవేటుపరం.. కొత్త నిర్ణయంతో సాలీనా రూ. 270 కోట్ల మేర ఏపీ ఆదాయాన్ని కోల్పోనుంది. అంతే మొత్తంలో ఆదాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కొత్తగా పొందే అవకాశం ఉంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీలు ఒకేసారి అంత ఆదాయాన్ని కోల్పోవడమంటే సాధారణ విషయం కాదు. అంతమేర మరో రూపంలో ఆదాయం పెంచుకోకుంటే నష్టాలు మరింత పెరుగుతాయి. అందుకే తమ బస్సుల సంఖ్యను తగ్గించుకోవడం కంటే తెలంగాణ ఆర్టీసీ అంత మేరకు బస్సులను పెంచుకుంటే సరిపోతుందని ఏపీఎస్ఆర్టీసీ చెబుతూ వచ్చింది. అయితే ఇప్పటికే తాము తీవ్ర నష్టాల్లో ఉన్నందున అంతమేర బస్సుల సంఖ్య పెంచుకోవడం సాధ్యం కాదని, దానివల్ల ఆదాయం ఆ దామాషాలో పెరిగే అవకాశం ఉండదని, తద్వారా నష్టాలు మరింత పెరుగుతాయని టీఎస్ఆర్టీసీ వాదిస్తూ వచ్చింది. ఈ విషయమై వెంటనే ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో కీలకమైన దసరా ఆదాయాన్ని రెండు ఆర్టీసీలు కోల్పోయాయి. పండుగ రాబడిని ప్రైవేటు బస్సులు తన్నుకుపోయాయి. టీఎస్ఆర్టీసీకి లబ్ధి.. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ బస్సులు కాస్త మెరుగైన ఆక్యుపెన్సీ రేషియో స్థితికి చేరుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు రోజువారీ ఆదాయం రూ. 4 కోట్లకే పరిమితమవగా ప్రస్తుతం ఆ మొత్తం రూ. 7 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఏపీకి కూడా బస్సులు మొదలైతే ఆ మొత్తం రూ. 10 కోట్లకు చేరుకోనుంది. అంటే నెలకు రూ. 300 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. ఫలితంగా ఇకపై జీతాలు, డీజిల్ బిల్లులు చెల్లించడం పెద్ద కష్టం కాబోదు. ఇతర బకాయిలు తీరాలంటే మాత్రం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే తప్ప తీరే పరిస్థితి లేదు. లాక్డౌన్కు పూర్వం ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ. 12 కోట్లకుపైగా ఉండేది. క్రమంగా ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే మరో రెండు నెలల్లో దాన్ని చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే బస్సులు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు సమసిపోయాయి. మా న్యాయమైన డిమాండ్ను ఏపీఎస్ఆర్టీసీ అంగీకరించింది. ఆర్టీసీల మధ్య ఒప్పందం జరిగిన వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మొదలవుతాయి. – పువ్వాడ అజయ్కుమార్, రవాణా మంత్రి -
మంత్రిని అభినందించిన సీఎం కేసీఆర్
సాక్షి, ఖమ్మం: నగర పాలక సంస్థ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ దృష్టి సారించింది. నగర ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత గోప్యంగా చేయించిన అంతర్గత సర్వే అనుకూలమని తేల్చినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ వశమైన నగర పాలక సంస్థ.. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఖిల్లాపై పట్టు సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఇక సిట్టింగులు.. కొత్త ముఖాలు.. అసంతృప్తి ఉన్న ప్రాంతాలేమిటనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 50 డివిజన్లకు.. 34 డివిజన్లలో విజయం సాధించింది. నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది. అయితే త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రతి డివిజన్లో సర్వే చేసిన బృందం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ప్రతి డివిజన్లో 170 నుంచి 180 మందిని కలిసి.. ఇలా 8,754 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రభుత్వ పనితీరు, నగరాభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత, కొన్నిచోట్ల కార్పొరేటర్ల పనితీరుపై నెలకొన్న అసంతృప్తి సైతం వెల్లడైనట్లు తెలుస్తోంది. 50 డివిజన్లకు.. 46 డివిజన్లలో టీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. అనేక చోట్ల కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే సర్వే ఫలితాలు పార్టీ అధినేత కేసీఆర్కు చేరడం, నగరంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై చేసిన సర్వే గురించి సీఎం కేసీఆర్.. మంత్రి అజయ్తో ఫోన్లో ప్రస్తావించి మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నామని అభినందనలు తెలియజేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. దీంతో త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే నగర కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో కొత్త ముఖాలకు సైతం పార్టీ తరఫున అవకాశం లభించనుంది. దాదాపు పది డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్లలో పలువురు తిరిగి పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉండటంతో వారి స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్పొరేటర్లు 42 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారు సైతం ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు ఇందుకోసం సమాయత్తమవుతున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యత టీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యేగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై ఉండటంతో నగరంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు సర్వేకు తగ్గ ఫలితాలు వచ్చేలా డివిజన్లవారీగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం డివిజన్లవారీగా ప్రజాదరణ కలిగిన నాయకులు, సమస్యలపై అవగాహన ఉన్న నేతలకు సంబంధించి పార్టీ వివిధ రూపాల్లో అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నగరంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడంతోపాటు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రాతినిధ్యం వహించని డివిజన్లలో ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై పార్టీ ఇప్పటికే దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి డివిజన్ నుంచి పది మందికి పైగా ఆశావహులు కార్పొరేటర్లుగా రంగంలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
కేసీఆర్ గురి పెడితే టీఆర్ఎస్కు గెలుపు ఖాయం
సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ గురి పెడితే ఏ ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీదే విజయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమంలో మంత్రి పువ్వాడ పాల్గొని ఓటు నమోదు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో పట్టభద్రులకు చెప్పాలని అన్నారు. పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్లు తీసుకొని రావటం ద్వారా ఎక్కువ శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కలిగిందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్ఓటీని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఎల్ఓటీని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనాతో భయపడొద్దని, అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని మంత్రి పిలుపునిచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. శాశ్వత ఆక్సిజన్ ట్యాంక్తో కష్టాలు తొలగాయన్నారు. త్వరలో రూ.50 లక్షలతో రాష్ట్రంలో రెండో ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. -
‘సీతారామ’ను పర్యవేక్షించాలి
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంత్రి పువ్వాడకు సూచించారు. బుధవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సీఎం కేసీఆర్ను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఖమ్మం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు కేటాయించిన నిధులు, పనుల వివరాల గురించి మంత్రిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరు చేసిన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం వస్తుందన్నారు. 6.20 లక్షల ఎకరాలను గోదావరి జలాలతో తడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆయా బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. మంత్రి వెంట సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియనాయక్ ఉన్నారు. -
అంతరాష్ట్ర బస్సులు: మంత్రుల భేటీ లేదు
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదు. కిలోమీటర్ బేసిస్లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం జరుగుతుంది. అప్పటిదాకా కేవలం అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయి’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ ఈనెల 14న (సోమవారం) హైదరాబాద్లో సమావేశం కానున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు. దీనిపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి. (రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..) -
గులాబీ దండుకు కేసీఆరే బాస్..
సాక్షి, ఖమ్మం: ‘సీఎం కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అర్హుల చెంతకు చేర్చేందుకు సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేస్తున్నా. మంత్రిగా జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కేసీఆరే బాస్. ఆయన మాటే కార్యకర్తలకు శిరోధార్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ దండు ఏకతాటిపై ఉంది. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయని అయిన సీతారామ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రైతు కళ్లల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం. పార్టీలో వర్గాలకు తావే లేదు. గ్రూపులు కట్టడం నాకు అలవాటు లేదు’.. మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మనోగతం ఇది. కోవిడ్ విస్తృతిలోనూ ప్రజల మధ్యే ఉన్నా.. అంటున్న మంత్రి పువ్వాడతో ‘సాక్షి ప్రతినిధి’ ఇంటర్వ్యూ.. ప్రశ్న: మంత్రిగా జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో మీ పాత్ర ఏమిటి? జవాబు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అవగాహన ఉన్నవాడిని. వారి తక్షణావసరం ఏమిటో గుర్తెరిగిన వాడిని. అదే రీతిలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నాం. ధంసలాపురం ఆర్వోబీ, కొత్త ఆర్టీసీ బస్టాండ్, డబుల్ బెడ్రూం నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వం ద్వారా సమకూర్చి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. సీతారామ సాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాం. ఈ ఏడాదిలోపు పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనేది నా లక్ష్యం. ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల మాటేమిటి? జవాబు: సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో పల్లె ప్రగతి ఒకటి. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా పల్లె ప్రగతిలో మూడో స్థానం సాధించింది. దీనిని మొదటి స్థానానికి తెచ్చేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో నిరంతరం కృషి చేస్తున్నా. ప్రశ్న: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులేమిటి? జవాబు: సీతారామ సాగర్ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. భూసేకరణకు ఏర్పడిన ఇబ్బందులను స్వయంగా నేనే జోక్యం చేసుకుని పరిష్కరించి ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి ప్రయత్నిస్తున్నా. మూడో పంపుహౌస్ పనులు చకచకా సాగుతున్నాయి. నిధుల కొరత ఉత్పన్నం కాకుండా సీఎం కేసీఆర్ అవసరమైనన్ని నిధులు విడుదల చేస్తున్నారు. సీతమ్మ బ్యారేజీ నిర్మాణంతో సహా ప్రస్తుతం రూ.15వేల కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రశ్న: కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలేమిటి? జవాబు: ఆరు నెలలుగా జిల్లా ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకోకుండా ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు సమర్థంగా చేసింది. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది. జిల్లా మంత్రిగా కరోనా కోరల్లోనే ఉండి ప్రజల మధ్య పనిచేశా. జిల్లాలో కరోనా టెస్ట్లు చేయించుకోవడానికి 25వేల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాం. ప్రశ్న: అభివృద్ధి పనుల వేగిరానికి నిధులెలా సమకూరుస్తున్నారు? జవాబు: జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే లక్ష్యం. ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న నా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు వెళ్తున్నా. ప్రతి డివిజన్లో రూ.5కోట్ల నుంచి రూ.7కోట్లతో అభివృద్ధి పనులు చేశా. ప్రశ్న: ఉమ్మడి జిల్లాలో పట్టణ ప్రగతి వల్ల జరిగిన మార్పేమిటి? జవాబు: మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించేందుకు పట్టణ ప్రగతి ఎంతగానో ఉపయోగపడింది. తుప్పుపట్టిన, విరిగిపోయిన స్తంభాలను యుద్ధప్రాతిదికన మార్చాం. 215 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. శానిటేషన్పై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రశ్న: ఖమ్మం నగరంలో మంచినీటి సమస్య ఎంతమేరకు పరిష్కారమైంది? జవాబు: మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా నేనే పూర్తి బాధ్యత తీసుకుంటున్నా. మిషన్ భగీరథ వల్ల నగరంలో మంచినీటి సమస్య కొంత తీరుతున్నా.. అన్ని ప్రాంతాల వారికి ప్రతిరోజు మంచినీరు ఇవ్వాలన్నదే నా ఆశయం. రాబోయే రోజుల్లో ప్రతి మనిషికి రోజుకు 150 లీటర్ల మంచినీటిని అందించి తీరుతాం. ప్రశ్న: జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరు ఉందంటారు.. దీనిపై మీరేమంటారు? జవాబు: గ్రూపులు కట్టడం నాకు అలవాటు లేదు. ఆ మాటకొస్తే అది అత్యంత హేయమైన, అసహ్యకరమైన పనిగా భావిస్తా. ఎవరి నియోజకవర్గాల్లో వారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడా వర్గం అనే పదం లేకుండా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటున్నా. నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ప్రశ్న: నగరపాలక సంస్థ ఎన్నికలను మీ పార్టీ ఎలా ఎదుర్కొనబోతోంది? జవాబు: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, సహకార, మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు తిరుగులేని మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఖమ్మం ఇప్పుడు టీఆర్ఎస్కు పెట్టని కోటగా మారింది. ప్రశ్న: మంత్రిగా మీ ప్రాధాన్యత అంశాలేంటి? జవాబు: పూర్తి వ్యవసాయరంగంపై ఆధారపడిన ఖమ్మం జిల్లా ప్రజలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పంటకు గిట్టుబాటు ధరతోపాటు మార్కెట్ సౌకర్యం కల్పించాలన్న దిశగా వేసిన అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త బస్టాండ్, ఆర్వోబీ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి దసరాకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించాలని సంకల్పించాం. అలాగే నగరంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ప్రశ్న: నూతన పరిశ్రమలకు ఉన్న అవకాశాలేంటి? జవాబు: ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కొత్తగూడెంలో స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్ఈజెడ్) కింద 700 ఎకరాల భూమిని సేకరించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని, అలాగే అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించాం. ఇదే తరహాలో వైరా మండలంలోనూ 140 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాం. ఇక్కడ సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం. ప్రశ్న: మంత్రిగా ఏడాది కాలంలో సంతృప్తినిచ్చిన అంశాలేంటి? జవాబు: ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాననే సంతృప్తి ఉంది. ఇటు పార్టీపరంగా.. అటు ప్రభుత్వపరంగా ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ.. వారిలో ఒకరిగా మెలుగుతున్నాననే ఆనందం కలిగింది. ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ కరోనాపై ప్రజల్లో గల భయాందోళనలను తగ్గించగలిగాం. మంత్రిగా నా పనితీరుపై ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వ్యక్తం చేసిన సంతృప్తి.. భుజం తట్టిన తీరు మరింత స్ఫూర్తినిస్తోంది. -
ఆర్టీఏ: ఆన్లైన్లో మరో ఆరు సేవలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్లైన్తో అనుసంధానించారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, లైసెన్స్లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్ (హజార్డస్ లైసెన్స్) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్ లైసెన్స్ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్ లైసెన్స్ పొందటం, డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్ లైసెన్స్ జారీ తదితర ఆరు సేవలను ఆన్లైన్తో అనుసంధానించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. (కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి) జూన్ 24న, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, పాత లైసెన్స్ కార్డు స్థానంలో స్మార్ట్కార్డు పొందటం, లైసెన్స్ హిస్టరీ షీట్ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి మంచి స్పందన వస్తోందని, సేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణా శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో ఐదు సేవలు ఆన్లైన్ ద్వారా అందు బాటులో ఉండేవని, ఇప్పుడు వాటికి అదనంగా మరో ఆరు సేవలను చేర్చామని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వాహనదారులు జాప్యం లేకుండా సేవలు పొందే వీలు కలుగుతుందని తెలిపారు. (ప్రత్యేక రైళ్లకు అన్లాక్) -
లక్ష కి.మీ. తగ్గించుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించేందుకు వీలుగా రెండు తెలుగు రాష్ట్రా ల అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్తో అంతర్రాష్ట్ర బస్సులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి పునరుద్ధరించాలని రెండు వైపుల నుం చి ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రెండు రా ష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసుల సం ఖ్య, ఆయా బస్సులు తిరిగే కిలోమీటర్ల సం ఖ్యలో వ్యత్యాసం ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ నష్టపోతోంది. ఈ నేపథ్యంలో ఆ సం ఖ్యను సమం చేస్తూ ఒప్పందం కుదుర్చుకు న్నాకే బస్సులు తిప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆ సంఖ్యను తేల్చేందు కు వారంలో సమావేశం కావాలని ఆదివారం నిర్ణయించగా, సోమవారమే భేటీ అవుదా మంటూ ఏపీ అధికారులు ఆదివారం రాత్రి పొద్దుపోయాక∙ప్రతిపాదించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమై చర్చించారు. తెలంగాణ ప్రాం తంలో ఎక్కువ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, ఎ క్కువ కి.మీ. తిప్పుతుండటంతో తమకు న ష్టం వస్తోందని, కాబట్టి ఇకపై ఆ సంఖ్య స మంగా ఉండేలా బస్సుల సంఖ్యను, అవి తెలంగాణ భూభాగంలో తిరిగే కి.మీ.ను తగ్గించాలని తెలంగాణ అధికారులు ఏపీ అధికారులకు ప్రతిపాదించారు. తగ్గించాల్సిందే: మంత్రి పువ్వాడ ఈ భేటీకి ముందు తెలంగాణ అధికారులు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను సంప్రదించారు. తెలంగాణ నుంచి ఏపీ కి 746 బస్సులు తిరుగుతుండగా, ఏపీ నుం చి తెలంగాణకు 1,006 బస్సులు (లాక్డౌన్కు పూర్వం) వస్తున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణ బస్సు లు ఏపీలో 1,52,344 కి.మీ. తిరుగుతుంటే, ఏపీ బస్సులు తెలంగాణలో 2,64,275 కి. మీ. తిరుగుతున్నాయని చెప్పారు. దీంతో ఏపీ కూడా తెలంగాణ బస్సులు తిరుగుతు న్న పరిమాణంలోనే బస్సులను, అంతే సంఖ్యలో కి.మీ. మేర బస్సులు తిప్పాలని ప్రతిపాదించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ మేరకే ఏపీ అధికారు లకు ప్రతిపాదించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి..: తెలంగాణ అధికారుల ప్రతిపాదనను పరిశీలించిన ఏపీ అధికారులు.. తాము బస్సుల సంఖ్యను తగ్గించటం కంటే, తెలంగాణ ఆర్టీసీ అంతమేర బ స్సుల సంఖ్యను పెంచుకుంటే సరిపోతుంద ని తెలిపారు. అయితే దీనికి తెలంగాణ అధికారులు సమ్మతించలేదు. అయితే, దీనిపై త మ స్థాయిలో సమాధానం చెప్పలేమని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చర్చించి వివరాలను నాలుగైదు రోజుల్లో చెబుతామని ఏపీ అధికారులు చెప్పారు. దీంతో సమావేశం ముగిసింది. మరో వారంలో తదుపరి సమావేశం ఉండే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఈ భేటీలో టీఎస్ఆర్టీసీ ఈడీలు యాదగిరి, వినోద్కుమార్, సీటీఎం మునిశేఖర్, ఖమ్మం రీజినల్ మేనేజర్ మూర్తి, డీవీఎం సరిరామ్, ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్, సీటీఎం చిట్టిబాబు, విజయవాడ ఆర్ఎం నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీటీఎంలు నాథ్, సుధాకర్ పాల్గొన్నారు. -
ఉద్యోగులకు పల్స్ ఆక్సీమీటర్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులకు పల్స్ ఆక్సీమీటర్లతో కూడిన కరోనా కిట్ పంపిణీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆర్టీసీ ఎండీ సునీల్శర్మను ఆదేశించారు. రెండు రోజుల్లో ఆ కిట్లు సరఫరా కానున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో దాదాపు 450 మంది కోవిడ్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 20 మందికిపైగా చనిపోగా మిగతావారు కోలుకున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉండటంతో ఆర్టీసీలో కరోనా బారిన పడుతున్నవారి సం ఖ్య పెరుగుతోంది. ఒత్తిడి, వయసు ప్రభావం కారణంగా డ్రైవర్, కండక్టర్లలో చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి పల్స్ ఆక్సీమీటర్లు ఉచితంగా అందించాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంటే, ముందే గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేరితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్న వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి కిట్.. టిమ్స్లో వైద్యం కోవిడ్ సోకితే ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకునేవారికి వైద్యులు సూచించే మందులు, శానిటైజర్, మాస్కులు తదితరాలతో కూడిన కిట్ను పంపిణీ చేయనున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగానే వారికి ఈ కిట్ అందిస్తారు. ఆరోగ్య సమస్యలు లేకుంటే ఇంట్లోనే చికిత్స పొందుతారు. ఏవైనా సమస్యలు పెరిగి వైద్యుల పర్యవేక్షణ అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. ఇందుకోసం గచ్చిబౌలి లోని టిమ్స్ను గుర్తించారు. మంత్రి సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ వైద్య అధికారులతో చర్చించారు. ప్రస్తుతం టిమ్స్లో పడకలు కావాల్సినన్ని ఖాళీగా ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వైద్యం అవసరమైనవారు అప్పటికప్పుడు అటు, ఇటు వెతుక్కునే సమస్య లేకుండా నేరుగా టిమ్స్కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశం కల్పించండి: కార్మిక సంఘాలు ‘మంత్రిగారు టిమ్స్లో చేరేలా చర్యలు తీసుకున్నారు. కానీ, టిమ్స్కు ఎవరైనా వెళ్లొచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్సకు అవకాశం కల్పించాలి’అని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. వెయ్యి ఆక్సీమీటర్లు కొంటాం: పువ్వాడ ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. కోవిడ్ బారిన పడితే ఎక్కువగా శ్వాస సమస్యలు వస్తున్నాయి. నిరంతరం పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకుంటే సమస్యను ముందే గుర్తించొచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వేయి వరకు ఆక్సీమీటర్లు కొని అందిస్తాం. అవసరమైతే మరిన్ని కొంటాం’ -
లైసెన్సులన్నీ ఇక ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్ : స్వయంగా రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వివిధ రకాల పౌరసేవలను పొందే సదుపాయం దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జ్, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్కార్డులు వంటి ఐదు రకాల పౌరసేవలను ఆన్లైన్లోనే పొందవచ్చు. దీనికి సంబంధించిన పోర్టల్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్తులో మరో 12 రకాల పౌరసేవలను ఆన్లైన్లోనే పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్శర్మ, రవాణా కమీషనర్ ఎంఆర్ఎం రావు, టీఎస్టీసీ ఎండీ టి.వెంకటేశ్వర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ అందజేసే పౌరసేవలను మరింత సులభతరం చేసేవిధంగా ఆన్లైన్ సర్వీసులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంటి వద్దనే తమకు కావలసిన సేవలను పొందేవిధంగా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఇంటి నుంచే నేరుగా.... ఇప్పటివరకు ఆర్టీఏ అందజేసే వివిధ రకాల సేవల కోసం వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్లో కేటాయించిన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. కానీ తాజాగా ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే బ్యాడ్జ్, డ్రైవింగ్ లైసెన్సుల డాక్యుమెంట్ల స్థానంలో స్మార్ట్కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ షీట్ ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ (ఆర్టీడీఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రవాణాశాఖ ఈ సర్వీసులను అందజేస్తుంది. స్మార్ట్ఫోన్ ద్వారానే వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా లభిస్తాయి.... ►ఎంగవర్నెన్స్, టి యాప్ ఫోలియో ద్వారా రవాణాశాఖ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ను పొందవచ్చు. ►వినియోగదారులు తమ పేరు, తండ్రి పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్లతో పాటు సెల్ఫీ క్లిక్ చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ►ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా సెల్ఫీని తనిఖీ చేస్తారు. ►అలాగే వినియోగదారుడి పేరు, చిరునామాలలో ఏమైనా తప్పులు ఉంటే బిగ్ డేటా ఆధారంగా తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ►డీప్ లెర్నింగ్ ఆధారిత ఇమేజ్లతో ఫొటోల్లో ఉండే వైవిధ్యాలను కూడా గుర్తిస్తారు. ►అనంతరం వినియోగదారుడి మొబైల్ ఫోన్కు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది.ఆ తరువాత ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి. ► అనంతరం వినియోగదారులు ఎంపిక చేసుకొన్న పౌరసేవలు ఆన్లైన్లోనే తీసుకొనే అవకాశం లభిస్తుంది. మరో 15 రోజుల్లో 6 రకాల పౌరసేవలను కూడా ఆన్లైన్ ద్వారా అందజేయనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. శాశ్వత లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, పర్మిట్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు వంటివి ఆన్లైన్లో పొందవచ్చు. ఆ తరువాత మరో 6 సర్వీసులను కూడా ఆన్లైన్ పరిధిలోకి తేనున్నారు. ►వాహనాన్ని భౌతికంగా తనిఖీ చేయవలసిన సేవలు మినహా మిగతావన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. -
వచ్చే ఖరీఫ్కు ‘సీతారామ’ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. డిసెంబర్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, ఇందుకు అవసరమైన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్ నిర్మాణ పనులను నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీ రజత్కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రభుత్వ సాగు నీటి రంగ సలహాదారు పెంటారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం రామవరం పంప్హౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్యాకేజీల వారీగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పంప్హౌస్–2 పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతోందని, అలాగే.. నల్లగొండ జిల్లాకు కూడా నీరందుతోందని వివరించారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా అదనంగా 2 లక్షల ఎకరాలు సాగవుతాయని పేర్కొన్నారు. సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కోసం భూసేకరణ ప్రారంభమైందని, టెండర్లు సైతం ఖరారయ్యాయని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ మాట్లాడుతూ.. పంప్హౌస్–1, 2 నిర్మాణాలకు సంబంధించిన యంత్ర సామగ్రి సిద్ధంగా ఉందని, ఇక నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్యాకేజీల వారీగా పనులు పూర్తి చేస్తామన్నారు. అయితే.. 8వ ప్యాకేజీలో కొంత భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ విషయమై రైతులతో చర్చలు జరుపుతున్నామని, భూసేకరణపై పూర్తిగా దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 104 కిలోమీటర్ల పరిధిలో సీతారామ ప్రాజెక్టు కాల్వలు నిర్మాణం జరుగుతున్న తీరును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించినట్లు ఆయన వివరించారు. -
తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్ సీరియస్
సాక్షి, ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో ఇళ్లు కూల్చేందుకు వెళ్లిన అధికారులపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ఆర్.వీ కర్ణన్లు సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో ఇల్లు కూల్చడానికి వచ్చామన్న అధికారుల వాదనపై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ.. తాను ఆదేశాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. దేవాదాయ శాఖ కమిషనర్కు సంబంధిత అధికారులను సరెండర్ చేస్తామని అన్నారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొసీజర్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (సోషల్ మీడియాలో‘జస్టిస్ ఫర్.. పోస్టులు) కాగా, తీర్థాలలోని సంగమేశ్వరస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించారంటూ శనివారం అధికారులు వాటిని కూల్చేందు యత్నించారు. ఈ ఉదయం రెవెన్యూ, పోలీసులు, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అక్కడికి చేరుకోగా.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గూమిగూడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్పంచి బాలూనాయక్ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా.. సర్పంచి భార్య, ఆమె సోదరుడు రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో కోప్రోద్రిక్తులైన గ్రామస్థులు అధికారులతో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో దేవాదాయ అధికారులు అక్కడి పరిస్థితిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు ఫోన్లో వివరించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. -
ఇక ఆర్టీసీ పార్శిల్ సర్వీస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సొంతంగా పార్శిల్, కొరియర్ సేవలు ప్రారంభించింది. ఇప్పటికే సరుకు రవాణాకు కార్గో బస్సులను రంగంలోకి దింపిన ఆర్టీసీ.. దానికి అనుబంధంగా పార్శిల్, కొరియర్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్టు భవన్ ప్రాంగణంలో వీటిని ప్రారంభించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో పార్శిళ్ల తరలింపు ఉండేది. ఓ ప్రైవేటు సంస్థ ఆ వ్యవహారాన్ని చూసుకునేది. ఆ సంస్థ ఆర్టీసీకి నామమాత్రంగా రుసుము చెల్లించి రూ.కోట్లలో ఆదాయాన్ని పొందుతూ వచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో పార్శిళ్ల తరలింపును సొంతంగా నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవాలని సీఎం కేసీఆర్ గతం లో ఆదేశించారు. దీంతో మంత్రి అజయ్కుమార్ పాత ఒప్పందాలు రద్దు చేయించి పార్శిళ్లు, కొరియర్ సేవలను ఆర్టీసీ సొంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని బస్సుల్లోనూ సరుకుల తరలింపు... పల్లెవెలుగు మొదలు అన్ని కేటగిరీ ఆర్టీసీ బస్సుల్లో సరుకులు తరలించనున్నారు. ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో దిగువ భాగాన డిక్కీలుండగా, పల్లెవెలుగు బస్సుల్లో కొత్తగా డ్రైవర్ సీటు పక్క ఉండే సింగిల్ సీటు తొలగించి బాక్సు ఏర్పాటు చేశారు. అందు లో సరుకులు తరలిస్తారు. గరిష్టంగా ఓ వ్యక్తి 50 కిలోల వరకు పంపించొచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే 50 కిలోల చొప్పున విభజించి పంపించాల్సి ఉంటుంది. 180 కిలోమీటర్లకు 50 కిలోల పార్శిల్ తరలింపునకు క్లరికల్, హమాలీ, ఇన్సూరెన్స్ తదితర ఖర్చులన్నీ కలిపి రూ.165 వరకు చార్జీ చేస్తారు. కిలోమీటర్లు, బరువు పెరిగే కొద్దీ చార్జీ కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి బస్టాండుకు సరుకులు తీసుకెళ్లి అందిస్తే, గమ్యస్థానంలోని బస్టాండు వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సంబంధిత వ్యక్తులు వచ్చి తమ సరుకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరో 15 రోజు ల్లో ఆథరైజ్ట్ బుకింగ్ డీలర్లు, ఉత్సాహం ఉన్న ఆర్టీసీ సిబ్బంది ద్వారా ఇళ్లకే వచ్చి సరుకులు తీసుకెళ్లి, గమ్యస్థానంలోని ఇళ్లకు చేర్చే ప్రక్రియ మొదలుపెడతారు. ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని ఆర్టీసీ యోచిస్తోం ది. ప్రస్తుతం 140 బస్టాండ్లలో ఈ సేవలు ప్రారంభించారు. చార్జీల వివరాలను ఆర్టీసీ వెబ్సైట్లో పొందుపరిచారు. పార్శిల్, కొరి యర్ విభాగం బాధ్యతలను మంత్రి ఓఎస్డీ కృష్ణకాంత్కు అప్పగించారు. ఈ కార్యక్రమం లో ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ, ఈడీలు వినోద్, వెంకటేశ్వర్లు, టీవీరావు, పురుషోత్తం, యాదగిరి, ప్రత్యేకాధికారి కృష్ణకాంత్ పాల్గొన్నారు. మెరుగ్గా నిర్వహిస్తే మంచి ఆదాయం ‘ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబం ధించి సరుకులు తరలించేందుకు ఇటీవలే కార్గో సేవలను ప్రారంభించిన ఆర్టీసీ.. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పార్శిల్ సేవలను కూడా మొదలుపెట్టింది. దీన్ని మెరుగ్గా నిర్వహించటం ద్వారా సాలీనా రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయాన్ని పొందే వీలుంటుంది. కొద్ది రోజుల్లోనే సిబ్బంది ఇళ్లకే వచ్చి సరుకులు తీసుకెళ్లి గమ్యం చేర్చేలా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను సిద్దం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ–కామర్స్ విధానం ద్వారా సరుకుల తరలింపు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో అన్ని ఊళ్లకు అనుసంధానమై ఉన్న ఆర్టీసీ బస్సులను ఆయా సంస్థలు సరుకుల తరలింపునకు వాడుకోవాలి’ – పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి ఖైరతాబాద్లో ట్రాన్స్పోర్టు భవన్ ప్రాంగణంలో ఆర్టీసీ పార్శిల్ కొరియర్ సేవల్ని ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ -
టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రైవేట్ సేవలు రద్దు చేశామని.. కార్గో, పార్సిల్ విభాగానికి కృష్ణకాంత్ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని... ఇక ఈరోజు నుంచి పార్సిల్ సేవలను కూడా మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో ప్రయాణానికి మంచి స్పందన ఉందని.. అలాగే వస్తువుల రవాణాపై కూడా నమ్మకం ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా రూ. 180- 200 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బందిని ఈ సేవల్లో వాడుకుంటామని.. త్వరలోనే మొబైల్ యాప్ కూడా తీసుకొస్తామని పువ్వాడ తెలిపారు. అన్ని బస్స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అదే విధంగా.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా బుకింగ్లు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జీవో తీసుకురానున్నట్లు వెల్లడించారు.(తెలంగాణ సర్కార్కు హైకోర్టు నోటీసులు) సంస్థ ఖర్చులతో వైద్యం బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి జరగడం లేదని పువ్వాడ అన్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మే 19 నుంచి తెలంగాణలో బస్సులు నడుపుతున్నామని... ఆర్టీసీ బస్సుల్లో అందరూ ధైర్యంగా ఎక్కవచ్చన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జాబ్ సెక్యూరిటీపై త్వరలోనే జీవో తీసుకువస్తామని తెలిపారు. ఆర్టీసీ కష్టకాలంలో ఉందని.. అందుకే అవసరం మేరకే బస్సులు తిప్పుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిరోజు ఆర్టీసీకి రూ. 12 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా.. ప్రస్తుతం కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వస్తుందని తెలిపారు. అదే విధంగా.. ఆర్టీసీ ఉద్యోగులకు 50శాతం జీతం ఇస్తున్నామని.. కరోనా లక్షణాలు ఉన్న సిబ్బందికి.. సంస్థ సొంత ఖర్చులతో పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు.(‘డిజిటల్’ ప్రయోగాలే శరణ్యం) కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రైవేట్ పార్సిల్ ఏజెన్సీల ఒప్పందాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో సేవలందించిన కార్గో బస్సులు.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మధ్య నిత్యావసర వస్తువులు, అంగన్వాడీ వస్తువులను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఆర్టీసీకి మంచి ఆదాయం ఉంటుందన్నారు. దశల వారీగా పార్సిల్, కొరియర్ సర్వీసులను తీసుకొస్తామని తెలిపారు. -
మంత్రి అనుచరుడే సుడా చైర్మన్!
సాక్షి, ఖమ్మం టౌన్: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్గా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అనుచరుడు బచ్చు విజయ్ కుమార్ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా విజయ్కుమార్ నియామక ఉత్తర్వులు అందుకున్నారు. సుడా చైర్మన్తో పాటు అడ్వైజరీ కమిటీని కూడా గురువారం ప్రకటించారు. (విషాదం మిగిల్చిన విద్యుత్షాక్) -
బస్సు భద్రమే: భయపడకండి
సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో సిబ్బందికి వేతనాలు, ప్రజా రవాణా సంస్థకు మళ్లీ త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మరో రెండు నెలల్లో పరిస్థితి సానుకూలంగా మారుతుందని ఆశిస్తున్నాం..’అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. ‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అన్న నినాదం ఆది నుంచి ఉన్నట్టుగానే, కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా బస్సు ప్రయాణం భద్రంగా ఉండేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ప్రతి బస్సును శానిటైజ్ చేసిన తర్వాతనే బయటకు తీస్తున్నారు. అందులో ప్రయాణికులకు శానిటైజర్లు సిద్ధంగా ఉంచుతున్నారు. బస్సులో ప్రయాణం అంటే ప్రజలు భయపడాల్సిన పనిలేదు. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దాన్ని ప్రజలు కూడా గుర్తించాలి..’అని కోరారు. కరోనా భయంతో జనం బస్సెక్కేందుకు జంకుతున్న తరుణంలో మంత్రి పువ్వాడ ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రెండు నెలల్లో సానుకూలత.. ప్రస్తుతం కరోనాతో ఆర్టీసీ కూడా కుదేలైంది. లాక్డౌన్కు పూర్వం ఆర్టీసీకి నిత్యం సగటున రూ.12 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అంతర్రాష్ట్ర సర్వీసులు, సిటీ బస్సులు తిప్పకుండా కేవలం జిల్లా సర్వీసులు మాత్రమే నడుపుతున్నాం. బస్సు కంటే సొంత వాహనంలో ప్రయాణానికే జనం ఎక్కువగా మొగ్గుచూపుతున్నందున ప్రస్తుతం రోజువారీ ఆదాయం రూ.3.5 కోట్లు మాత్రమే సగటున ఉంటోంది. కిలోమీటరుకు వచ్చే ఆదాయం కూడా గతంలో సగటున రూ.43 ఉంటే ప్రస్తుతం అది రూ.20 గానే ఉంటోంది. బస్సులు తిరిగి ప్రారంభమైన కొత్తలో ఇది మరీ తక్కువగా ఉండేది. ఇప్పుడు రాత్రి సర్వీసులు, ఇమ్లీబన్ స్టేషన్లోకి బస్సులను అనుమతించటం ప్రారంభించాక పెరిగింది. మరో 2 నెలల్లో పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక్కసారి శుభకార్యాలు, రాష్ట్రవ్యాప్తంగా ఇతర కార్యకలాపాలు పుంజుకుంటే ఆర్టీసీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఆక్యుపెన్సీ రేషియో 45 శాతానికి.. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా నిత్యం దాదాపు 5 వేల బస్సులను తిప్పుతున్నాం. వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 45 శాతానికి చేరింది. ఇది కొంత శుభసూచకం. బస్సులను సురక్షితంగా ఉండేలా తీసుకుంటున్న చర్యలను ప్రయాణికులు కూడా క్రమంగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా.. ఎక్కడా బస్సుల వల్ల కొత్తగా కేసులు పెరిగినట్టు ఆధారాలు లేవు. ప్రభుత్వ పరంగా మేం చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బస్సుల్లో ప్రయాణానికి ముందుకు రావాలి. ఉద్యోగులకు ప్రభుత్వంపై అపారనమ్మకం ఇక సిబ్బందికి వేతనాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం ఇతర విభాగాల విషయంలో వ్యవహరిస్తున్నట్టుగానే చేస్తోంది. గత మూడు నెలలుగా సిబ్బందికి 50 శాతం వేతనాలు చెల్లిస్తోంది. టికెట్ల ద్వారా ఒక్క రూపాయి కూడా రాని సమయంలో కూడా ప్రభుత్వం వేతనాలు చెల్లించింది. ఇది ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకునే చర్యలో భాగం. గతంలోనే బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించాం. ఇక ప్రభుత్వ పూచీకత్తుతో రూ.650 కోట్ల వరకు బ్యాంకు రుణం అందింది. వీటితో సిబ్బందికి వేతనాల విషయంలో లోటు లేకుండా చూస్తున్నాం. వెరసి ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వంపై అపార నమ్మకం ఉంది. కేంద్రం పట్టించుకోలే.. ఇటీవల ఆత్మ నిర్భర భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇందులో ప్రజారవాణాకు చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఇది సరైన చర్య కాదు. అప్పట్లోనే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ప్రత్యేకంగా కోరాం. కానీ ఆయన పట్టించుకోలేదు. రాష్ట్రంలో తీవ్రంగా సమ్మె జరిగినపుడూ కేంద్రం ఇలాగే వ్యవహరించింది. ఏపీకి బస్సులపై ఏ నిర్ణయం తీసుకోలేదు.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించనప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగితే బాగుంటుందున్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యక్తం చేసింది. కానీ ఈ విషయంలో ఇంకా మేం నిర్ణయం తీసుకోలేదు. ఈ రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పితే ఎలా ఉంటుందన్న విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడాక తగిన నిర్ణయం తీసుకుంటాం. -
హైదరాబాద్లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
-
హైదరాబాద్: రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోనూ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో గత 70 రోజులుగా సిటీ బస్సులు రోడ్డెక్కని విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు ఏ విధంగా నడపాలనే దానిపై చర్చించారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. సిటీలో బస్సు సర్వీసులు లేకపోవటంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. ఇక షేర్ ఆటోల్లో ప్రయాణం ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారు. దాంతో నగర రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం అనంతరం సిటీ బస్సు సర్వీసులపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
డ్రైవర్ గారూ.. మాస్క్, శానిటైజర్ ఇస్తున్నారా?
ఖమ్మం: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మీవంతు బాధ్యతను నెరవేర్చండి డ్రైవర్ గారూ. మీ డిపోలో మాస్క్లు, శానిటైజర్లు ఇస్తున్నారా?’ అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం ఓ బస్సు డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చూడండి అంటూ సూచించారు. ఖమ్మం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ఆగి బస్సు డ్రైవర్ను మంత్రి అడుగుతున్న దృశ్యం ‘సాక్షి’ కంటపడింది. –సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం -
‘నిబంధనల’ రూటు తప్పిన బస్సు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కరోనా ప్రమాదకరంగా విస్తరిస్తున్న సమయంలోనూ ఆర్టీసీలో తీరు మారలేదు. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. బస్కెక్కే ప్రయాణికులకు కచ్చితంగా శానిటైజర్ అందుబాటులో ఉంచాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా, అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. బుధవారం శానిటైజర్ సీసాలు అందుబాటులో లేకుండానే కొన్ని బస్సులు తిరిగాయి. ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో కోదాడ డిపోకు చెందిన ఓ బస్సులో శానిటైజర్ లేని విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో కారణం అడగ్గా, తనకు శానిటైజర్ సరఫరా చేయలేదని కండక్టర్ సమాధానమిచ్చారు. దీంతో వెంటనే ఆ డిపో మేనేజర్ను సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి అజయ్కుమార్ సంబంధిత ఆర్ఎంను ఆదేశించారు. అయితే అసలు కొన్ని డిపోలకే శానిటైజర్ సరఫరా కాలేదని, ఆ కారణంతో డిపో మేనేజర్లు కొందరు కండక్టర్లకు అందివ్వలేదని తెలిసింది. కోదాడ డిపోకు సరఫరా అయిందీ లేనిదీ విచారణలో తేలనుంది. ఈ విషయం వెలుగు చూడటంతో తమ డిపోలకు కూడా శానిటైజర్ సరఫరా కాలేదంటూ పలువురు డిపో మేనేజర్లు ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి గందరగోళంగా ఉందని గుర్తించిన మంత్రి అజయ్కుమార్, గురువారం అత్యవసరంగా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్శర్మకు పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. బస్సుల్లో శానిటైజర్ ఎందుకు సరఫరా కాలేదో తేల్చి తనకు నివేదిక అందించాలని కోరారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సొంతంగా కొన్న డీఎంలు.. లాక్డౌన్కు పూర్వం దాదాపు వారం రోజులపాటు బస్సుల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచారు. అప్పట్లో కొన్ని డిపోల్లో స్థానిక డీఎంఅండ్హెచ్ఓల మార్గదర్శనంలో సొంతంగా శానిటైజర్ తయారు చేసుకున్నారు. నైపుణ్యం లేకుండా కెమికల్స్తో సొంతంగా తయారు చేయటం సరికాదని భావించి ఇప్పుడు జైళ్ల శాఖ రూపొందించిన శానిటైజర్ను వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు అక్కడి నుంచి పెద్దమొత్తంలో శానిటైజర్ను సరఫరా చేసినట్టు సమాచారం. తమ పరిధిలో డిపోలకు శానిటైజర్ పంపినట్టు ఆర్ఎంలు చెబుతుండగా, తమకు అందలేదని కొందరు డీఎంలు పేర్కొన్నారు. కోదాడ విషయంలోనూ ఇలాగే జరిగినట్టు తెలిసింది. శానిటైజర్ అందకపోవటంతో కొన్ని చోట్ల డీఎంలు ప్రైవేటు దుకాణాల్లో సొంతంగా కొని బస్సుల్లో ఉంచగా, కొందరు డీఎంలు అవి లేకుండానే బస్సులు పంపించారు. నిజంగా డిపోలకు శానిటైజర్ సరఫరా కాలేదా, అయినా డీఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్నది తేలాల్సి ఉంది. -
మాస్క్లు ధరించకుంటే టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఖమ్మం: ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకుంటే టికెట్ ఇవ్వొద్దని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజారవాణా ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రోజున ఖమ్మం బస్టాండ్ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సాకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్కు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని.. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాతే టికెట్ ఇవ్వాలని సూచించారు. మాస్కులు ధరించని ప్రయాణికులకు టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు. అనంతరం.. కోదాడు బస్సు డిపోను సైతం మంత్రి పరిశీలించారు. ప్రయాణికులకు స్వయంగా శానిటైజర్ స్ప్రే చేశారు. చదవండి: ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని ప్రతి బస్సుకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యటనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మేయర్ పాపాలాల్ మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. చదవండి: ధూంధాంగా నిశ్చితార్థం: 15 మందికి కరోనా -
కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : పువ్వాడ
సాక్షి, హైదరాబాద్ : కరోనాతో మనం సహ జీవనం చేయాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో లాక్డౌన్ ముగిశాక కూడా సానిటేషన్ మాస్క్లు తప్పనిసరిగా వాడాల్సి వస్తుందన్నారు. కరోనాతో ఎక్కువ దెబ్బతింటున్నది ట్రాన్స్పోర్ట్ విభాగమేనని, కేంద్రం నుండి సపోర్ట్ కావాలని అన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇబ్బందులు ఉన్నప్పటికి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. (కరోనా కలవరం : వీడని విషాదం) కోవిడ్ కిట్స్ను రవాణా శాఖలో పని చేస్తున్నవారికి అందిస్తున్నామని, మొదట రాష్ట్రాల సరిహద్దుల వద్ద పని చేస్తున్నవారికి ఇస్తున్నామని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. 5వేల కోవిడ్ కిట్లను డ్రైవర్లకు రవాణా శాఖ ద్వారా అందజేశామన్నారు. డ్రైవర్లకు కొవిడ్పై అవగాహన కల్పిస్తున్నామని, ప్రజా రవాణాపై రేపు కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలా, వద్దా అనే విషయంపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. లాక్డౌన్ వల్ల అన్ని రంగాలకు నష్టం జరిగిందని, కేంద్రం అన్ని రంగాలను ఆదుకోవాలని కోరామని చెప్పారు. (21దాకా లాక్డౌన్..?) -
కరోనా : పొరుగు జిల్లాతో సమస్యే
సాక్షి, ఖమ్మం : జిల్లాకు ఆనుకుని ఉన్న పొరుగు జిల్లా సూర్యాపేటలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు 50 దాటడం, అక్కడి నుంచి కొందరు అధికారులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ వణుకు మొదలైంది. ఇప్పటికే మన వద్ద ఏడు పాజిటివ్ కేసులు ఉన్న విషయం విదితమే. గత నాలుగు రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కూడా నమోదు కాకపోవడంతో అంతా ఊరట చెందుతున్నారు. ఇకపై కేసులు పెరగకుండా అధికారులు మరింత అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే..సూర్యాపేట ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఆఫీసులోనే ఖమ్మం నగరానికి చెందిన ఒక అధికారి విధులు నిర్వహిస్తున్నారు. రోజూ ఖమ్మం నుంచి డ్రైవర్ను తీసుకుని కారులో మరో అధికారితో కలిసి అక్కడికి వెళ్లి వస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కు కరోనా పాజిటివ్ అని తేలగానే గురువారం రాత్రి..వీరు ముగ్గురు ఖమ్మంలోని కరోనా ఐసోలేషన్ వార్డుకు పరీక్షల కోసం వచ్చారు. శుక్రవారం వారి స్వాబ్ శాంపిళ్లను వరంగల్ ల్యాబ్కు పంపగా..నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరిని 14 రోజుల క్వారంటైన్కు తరలించారు. ఆ తర్వాత మరో సారి టెస్టులు చేస్తారు. నగరంలోని పెద్దతండా, మోతీనగర్, ఖమ్మం ఖిల్లా ప్రాంతాల్లో కలిపి మొత్తం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా..ప్రభుత్వం కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు పేపట్టింది. ఈ క్రమంలో రాకపోకలు సాగించవద్దని, ఇంకా ఇతర ఉద్యోగులెవరైనా ఉంటే..పాటించాలని అంతా కోరుతున్నారు. ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ప్రజల కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఉభయ జిల్లాల్లో తీసుకున్న చర్యల గురించి శనివారం ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఆ వివరాలు మంత్రి మాటల్లోనే ఇలా.. శ్రీరామనవమి స్ఫూర్తితో.. ప్రభుత్వ సూచనలతో, ప్రజల సహకారంతో భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణమహోత్సవాన్ని పరిమిత సంఖ్య భక్తులతో సంప్రదాయబద్ధంగా విజయవంతంగా నిర్వహించాం. ఇదే స్ఫూర్తితో ఉభయ జిల్లాల్లో కరోనా వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం నిమగ్నమై చర్యలు తీసుకుంటోంది. మరో నాలుగు రోజులు ఇలానే ఉంటే.. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కావకపోవడం శుభపరిణామమే. మరో నాలుగు రోజులు ఇలానే ఉంటే భద్రాద్రికొత్తగూడెంలో లాక్డౌన్ను సడలించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఖమ్మంలో కట్టుదిట్టం.. ఖమ్మం జిల్లాలో 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరంతా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి నివాస ప్రాంతాల్లోని అనుమానితులను క్వారంటైన్కు తరలించాం. ముమ్మరంగా వైద్యపరీక్షలు సాగుతున్నాయి. కటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు అమలవుతున్నాయి. అందరినీ ఆదుకుంటాం.. తెల్లరేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాల వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. రూ.1500చొప్పున నిరుపేదల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే జమ అయ్యాయి. లాక్డౌన్తో నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహకారం తోడైంది. ఇది అభినందనీయం. నిత్యావసరాల కొరత అస్సలు రానీయం. -
కరోనా: సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు
సాక్షి, ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలపాలని, సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇచ్చిన పిలుపునకు భారీగా విరాళాలు వచ్చాయి. ఖమ్మం నుంచి వివిధ రంగాల వ్యాపారులు, విద్య, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.1.75 కోట్లను మంత్రికి అందించారు. మమత వైద్య విద్యాసంస్థ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భారీ మొత్తంలో రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఆ మొత్తం రూ.2 కోట్లకు సంబంధించి మంత్రి అజయ్కుమార్ సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను నేరుగా కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ను సీఎం కేసీఆర్ అభినందించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను మంత్రి సీఎంకు వివరించారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం జరిపే పోరాటానికి అండగా నిలవడంలో దాతల సహాయం ఎంతో తోడ్పడగలదన్నారు. సీఎం పిలుపుతో తాను చేసిన విన్నపం మేరకు ఖమ్మం జిల్లాలో ముందుకొచ్చి విరాళాలను అందించిన దాతలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి మార్గ నిర్దేశాలతో కరోనా నియంత్రణకు డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు తెలంగాణ సమాజం మొత్తం హ్యాట్సప్ చెబుతోందన్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. -
నల్లమల పర్యాటకానికి రూ.56.84 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అక్కడ ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు అవకాశముందని, ఆ దిశగా ప్రణాళిక లు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మల్లెల తీర్థం వెళ్లడానికి రహదారి నిర్మించాల్సి ఉన్నా.. అటవీ చట్టాలు ప్రతిబంధకంగా ఉన్నా యన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. నల్లమల పర్యాటకాభివృద్ధికి రూ.56.84 కోట్లు మంజూరు చేశామని, ఇందులో అక్క మహాదేవి గుహలకు రూ.1.25 కోట్లు, కడలివనం కోసం రూ.11.04 లక్షలు, ఈగలపెంటకు రూ.25.94 కోట్లు, ఫర్హాబాద్కు రూ.13.81 కోట్లు, మల్లెల తీర్థానికి రూ.5.35 కోట్లు, ఉమామహేశ్వర దేవాలయానికి రూ.10.35 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఓవర్సీస్ విద్యానిధికి ఆర్థిక సాయం పెంచం ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం పెంచే యోచన లేదని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. అలాగే సీఎం ఓవర్సీస్ విద్యానిధి కింద నిర్దేశించిన కోటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలేదని, దీంతో కొత్తగా పెంచాల్సిన ఆవశ్యకత లేదన్నారు. సభ్యులు షకీల్ అమీర్ మహ్మద్, మెతుకు అనంద్, స్టీఫెన్సన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. లాభాల బాట పడితే కొత్త డిపోల మాట ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని, ఇదే ఒరవడిని కొనసాగిస్తే కొత్త డిపోలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. గత మూడు నెలలుగా అనేక సంస్కరణలు తీసుకురావడంతో ఆర్టీసీ క్రమంగా లాభాల్లోకి వస్తోందని, నిర్వహణావ్యయం తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల స్థానంలో 1,334 అద్దెబస్సులను ప్రవేశపెడుతామన్నారు. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాలను తొలగించడానికి ఇటీవల చార్జీలను పెంచామని నష్టాలనుంచి గట్టెక్కామని చెప్పారు. -
క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ
సాక్షి, హైదరాబాద్ : కార్మిక శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం శాసన మండలిలో క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ అధికారులు... ప్రజా ప్రతినిధుల ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారికి సమాచారం అందివ్వకపోవడం తప్పేనని ఆయన అంగీకరించారు. మండలిలో ఆర్టీసీపై మంత్రి పువ్వాడ మాట్లాడుతూ...ఆర్టీసీ పార్సిల్ సర్వీసుల ద్వారా సంవత్సరానికి రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. నెలాఖరుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తామని అన్నారు. ఆర్టీసీకి రోజుకు కోటిన్నర లాభం వస్తోందని, మంత్రి పేర్కొన్నారు. గతంలో రూ. 11 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 12.50కోట్ల ఆదాయం వస్తుందన్నారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఆర్టీసీ సమ్మె కాలపు జీతాలు రూ. 235 కోట్లు చెల్లించడంపై ఆర్టీసీ జెఏసీ నాయకులే కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని అధికారులకు సూచించామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామని, జూలై నాటికి రూ. 20 కోట్లతో ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన బస్టాండ్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా ఎమ్మెల్సీల సీడీసీ నిధుల కోసం అందరూ సభ్యులకు లేఖలు రాయాలని మంత్రికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. వరంగల్ను టూరిస్ట్ సర్క్యూట్గా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ‘త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధిలో నిర్లక్ష్యం లేదు. రామప్ప ఐలాండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాము. తెలంగాణలోని అనేక ప్రాంతాలను పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తోంది. బోగత, మేడారం, తాడ్వాయి, సోమశిల, నాగార్జున సాగర్ వద్ద కాటేజ్ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం కల్పించాం. భద్రాచలం రాముని కల్యాణం సందర్భంగా హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటాము’. అని పేర్కొన్నారు -
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ స్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం మరోమారు రుజువైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చెప్పిన విధంగా సమ్మె కాలానికి సంబంధించిన జీతాల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం శుభపరిణామం అన్నారు. (ఒక్క కార్మికుడిని సస్పెండ్ చేయలేదు) కాగా.. సమ్మె కాలానికి జీతాల చెల్లింపుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేసి ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని పువ్వాడ తెలిపారు. ఇది ఆయన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. ఒకే దఫాలో నిధులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. మార్చి 31వ తేదీలోగా సమ్మె కాలం జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లించనున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ అభ్యున్నతి కోసం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల బాగోగుల కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, సంస్థ ఆర్థిక స్థితిని మరింత మెరుగు పరచడానికి సమిష్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో చెప్పినట్లుగానే బడ్జేట్లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. సంస్థ పురోగతికై అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసి సీఎం ఆశించిన ఫలితాలు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
నటుడు శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తండ్రి మరణంతో విషాదంలో ఉన్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ను తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం పరామర్శించారు. ఫిలింనగర్లోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మంత్రి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా శ్రీకాంత్ను పరామర్శించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పరమేశ్వరరావు మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. హీరోలు చిరంజీవి, గోపీచంద్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. (శ్రీకాంత్కు పితృవియోగం)