Sekhar Kammula
-
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
Anand Movie: చిరంజీవి సినిమాతో పోటీ.. ఏడు నంది అవార్డులు సొంతం
ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ అంటే ఏంటో తెలియాలంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆనంద్’ను చూడాలి. ఇది ఓ మంచి కాఫీ లాంటి మూవీ. ఫీల్ గుడ్ మూవీస్ తీసే దర్శకుడిగా పేరున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన రెండో సినిమా. ఆత్మాభిమానం, ఇండిపెండెంట్ భావాలు కొంచెం ఎక్కువ గల ఓ యువతి తన లైఫ్లో ఎదుర్కొనే సవాళ్లు, లవ్, ఫ్రెండ్షిప్ వంటి వాటిని తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా యూత్కు చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. వారి ఆలోచనలు, డ్రీమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో ప్రతిబింబిస్తాయి. హీరోగా రాజా, హీరోయిన్గా కమలినీ ముఖర్జీ అద్భుతంగా నటించారు.పరిణతి గల ప్రేమఈ మూవీలో లవ్ స్టోరీ చాలా నేచురల్గా, హానెస్టీగా ఉంటుంది. అన్ని సినిమాల్లోలా కాకుండా ఇద్దరు మెచ్యూర్డ్ యూత్ మధ్య లవ్ను అద్భుతంగా చూపించారు డైరెక్టర్. కేవలం కోటిన్నర బడ్జెట్తో ఎటువంటి భారీ కాస్టింగ్ లేకుండా సాదా సీదా స్టోరీతో రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల తొలుత 2000లో ‘డాలర్ డ్రీమ్స్’ తీశారు. ఇది విమర్శకుల మెప్పు రూపొందింది. సెకండ్ మూవీ ‘ఆనంద్’ కోసం చాలా మంది నిర్మాతల్ని కలవగా ఎవరూ ఇంట్రస్ట్ చూపలేదు. చేసేది లేక నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సాయం కోరగా ఆ సంస్థ కొంత ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించింది. తెలుగులో ఓ కమర్షియల్ మూవీకి ఇన్వెస్ట్ చేయడం ‘ఎన్ఎఫ్డీసీ’కి ఇదే తొలిసారి.పద్మారావ్ నగర్లోనే...ఆనంద్ స్టోరీని పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయన్ను ఎప్పుడూ సంప్రదించలేదని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పారు. హీరోయిన్ గా తొలుత ఆసిన్, సదాను అనుకున్నారు. చివరికి రాజా, కమలినీ ముఖర్జీతో పూర్తి చేసేశారు. హైదరాబాదులో తానుండే పద్మారావ్ నగర్లోనే ఓ ఇంటి స్థలంలో దాదాపు సినిమా మొత్తం పూర్తి చేసేశారు డైరెక్టర్. కమలి పాత్రకి సింగర్ సునీతతో డబ్బింగ్ చెప్పించగా ఎంత సహజంగా వచ్చిందంటే అందుకు సునీతని కూడా అవార్డు వరించింది. శేఖర్ కమ్ముల హోవర్డ్ యూనివర్శిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్గా ఈ సినిమా స్క్రీన్ ప్లేనే సబ్మిట్ చేసారనే విషయం చాలా మందికి తెలియదు. ‘ఆనంద్’ సినిమాను తమిళంలో ‘నినైత్తాలే’ పేరుతో రీమేక్ చేశారు.ఫార్ములా సినిమాలకు భిన్నంగా...ఆనంద్ మూవీ, చిరంజీవి భారీ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ఒకే రోజు రిలీజయ్యాయి. అయినా... ఆ పోటీకి నిలబడి ఇంచుమించు అంతే పేరు తెచ్చుకుంది ‘ఆనంద్’. ఫార్ములా సినిమాలకు భిన్నంగా తీసిన ఆనంద్ ఏడు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ చాలా మంది ఇష్టంగా చూస్తారు. మీరు ఇప్పటికీ చూడక΄ోతే కచ్చితంగా ఓ సారి చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
అర్థాలే వేరులే!
ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
కాంబినేషన్ కుదిరేనా?
హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ కొత్త కథను సిద్ధం చేశారట. ఈ కథలోని హీరో పాత్రకు నాని అయితే సరిపోతారని ఆయన భావిస్తున్నారట. దీంతో ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన అధికారికంగా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.కాగా ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నారు నాని. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. మరోవైపు నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్న ‘కుబేర’ సినిమాతో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా నాని, శేఖర్ల ప్రస్తుత కమిట్మెంట్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమా గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి.. ఈ కాంబి నేషన్ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. -
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా కింగ్ నాగార్జున లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కుబేర సినిమాలో ధనుష్ కొంత సమయం పాటు రిచ్గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్ ఫస్ట్ లుక్లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పారు. -
పాన్ ఇండియా సినిమా.. ఆసక్తిగా 'కుబేర' ఫస్ట్ లుక్ పోస్టర్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. దీన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. ఈమేరకు తాజాగా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. ధనుష్ టైటిల్కు భిన్నమైన లుక్లో చిరిగిన బట్టలు, మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ఆసక్తికరంగా కనిపించారు. అదే పోస్టర్లో ధనుష్ వెనక అన్నపూర్ణ దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా ఉన్న పెయింటింగ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్ను పూర్తి చేశారు మేకర్స్. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లోప్రారంభం కానుందని తెలిసింది. తాజాగా విడుదలైన పోస్టర్ను బట్టి ఈ సినిమాలో ధనుష్, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
‘హ్యాపీడేస్’లాగే ‘పాషన్’ ఉంటుంది: శేఖర్ కమ్ముల
సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్జ్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. "పాషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్ లో "పాషన్" సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా...దర్శకుడు వేణు ఊడుగుల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం...నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్ళతో తీసిన హ్యాపీడేస్ లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు నిర్మాత అరుణ్ మొండితోక మాట్లాడుతూ - ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం. అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ - పాషన్ నవల చదివాను. నాకు బాగా నచ్చింది మంచి వాక్యం, భావం ఉన్న రచయిత అరవింద్. డైరెక్టర్ గా కూడా అదే ప్రభావవంతమైన సినిమా తీస్తాడని ఆశిస్తున్నా. అన్నారు.నిర్మాత ఏ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా స్క్రిప్ట్ నాకు నెరేట్ చేసినపుడు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. అందుకే భాగస్వామిని అవుతున్నాను. అన్నారు. -
అడ పిల్లల పై ఇలాంటి ఘటనలు చాలా దారుణం
-
ధనుష్ తో ఎలాంటి సినిమా తీస్తున్నానంటే.. ఎవరు ఊహించలేరు
-
కథ చెప్పడానికి వెళితే అవమానించేవారు: శేఖర్ కమ్ముల
-
అదృష్టవంతుడు ఎందుకంటే ఆ సినిమాలో లాభ పడింది దిల్ రాజు
-
ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకున్న కానీ..!
-
బాహుబలి లాంటి సినిమాలు తీయాలంటే..!
-
సమాజంలో మార్పు కోసమే నా సినిమాలు..!
-
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడ్ని: శేఖర్ కమ్ముల
-
ఏదో ఒక రోజు మన దేశం మారుతుంది అని అనుకుంటున్నా
-
పోస్టర్ లో చూసి విజయ్ సేతుపతి అనుకున్నాను..!
-
సాయి పల్లవిని పాన్ ఇండియా స్టార్ ని చేస్తున్న శేఖర్ కమ్ముల
-
శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్రెడ్డి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ను దక్కించుకున్న విజయ్కు లైగర్ డిజాస్టర్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. దీంతో తాను తర్వాత చేయబోయే సినిమాల విషయంలో విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటికే శివ నిర్వాణతో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ ఈ సినిమా అనంతరం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాకు సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. చదవండి: తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ -
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
దర్శకుడు శేఖర్ కమ్ముల కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా ?: ఎస్వీ కృష్ణారెడ్డి
‘ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలలో కమర్షియల్ హంగులతో పాటు పిల్లలకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’ మూవీ కృష్ణారెడ్డికి మంచి కమ్బ్యాక్ సినిమా అని ప్రముఖ దర్శఖుడు శేఖర్ కమ్ముల అన్నారు. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత సీ.కల్యాణ్ మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్గానిక్ మామ ` హైబ్రిడ్ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆర్టిస్ట్ల విషయంలో కూడా నేను బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్ సంపాదించారు. సోహైల్ కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది?. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాలోని టాలెంట్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ప్రతి సినిమా కోసం ఇలానే కష్టపడతాను’అన్నారు సోహైల్. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి , నటుడు అలీ, హేమ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక
తమిళసినిమా: తక్కువ సమయంలోనే నటిగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న నటి రష్మిక. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తన మాతృభాషలో పెద్దగా చిత్రాలు చేయలేదు. టాలీవుడ్లో తొలి చిత్రమైన ఛలో మార్కులు తెచ్చుకోవడం, గీత గోవిందం ఊహించని విజయాన్ని సాధించడం చకాచకా జరిగిపోయాయి. దీంతో అమ్మడు బాలీవుడ్ వరకు వెళ్లింది. అక్కడ తొలి చిత్రం గుడ్ బై ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కూడా. అయితే ఆ చిత్రం మంచి వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ రష్మికకు నటిగా మంచి వర్కులే పడ్డాయి. ఇంకా అక్కడ రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో తనను బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన పుష్ప చిత్రం సీక్వెల్లో నటించడానికి రెడీ అవుతోంది. ఇదేవిధంగా ద్విభాషా చిత్రం వారీసు చిత్రంలో విజయ్తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం రష్మికకు కీలకం. ఎందుకంటే కోలీవుడ్లో ఇంతకు ముందు కార్తీ సరసన సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా అది ఆమె కెరీర్కి పెద్దగా ప్లస్గా కలసిరాలేదు. అయితే అవకాశాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. ఇప్పటికే మరోసారి కార్తీతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. తాజాగా మరో స్టార్ హీరో ధనుష్కు జంటగా నటించే అవకాశం కూడా ఈ బ్యూటీ తలుపు తట్టినట్లు సమాచారం. ధనుష్ హీరోగా టాలీవుడ్ ప్రామినెంట్ దర్శకుడు శేఖర్ కమ్ముల ద్విభాషా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి రష్మికను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సి ఉంది. -
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి(సెప్టెంబర్ 24) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ నాగచైతన్య ఓ ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి స్పెషల్ చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్కి, బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం నాకెన్నో విషయాలను నేర్పించింది. ‘లవ్స్టోరీ’ సినిమా జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’అని చైతన్య ట్వీట్ చేశాడు. (చదవండి: సలార్’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్కి ప్రభాస్ హాజరు) కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి 2021లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. Thank you so much to the entire team and audience for making this one special ! A film that taught me in so many ways .. memories I will always cherish https://t.co/gGWbzmZbT0 — chaitanya akkineni (@chay_akkineni) September 24, 2022 -
రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. తనదైన స్టైల్తో క్లాసిక్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల రీసెంట్గా లవ్స్టోరీతో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్లో తీసిన బెస్ట్ మూవీస్లో లీడర్ ఒకటి. రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: కూతురి కోసం చిరంజీవి ఊహించని బహుమతి శేఖర్ కమ్ముల కోసం ఈ సినిమా సీక్వెల్ తప్పకుండా ఉంటుందని గతంలోనే వెల్లడించారు. తాజాగా ఈ సీనిమా సీక్వెల్పై ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తమిళ స్టార్ హీరో సూర్య లీడర్-2లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కెనున్న ఈ చిత్రానికి సూర్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. చదవండి: అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్ -
రానా.. శేఖర్ కమ్ముల 'లీడర్' 2 ఎప్పుడంటే..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన చిత్రం 'లీడర్'. ఆ చిత్రంతోనే 2010వ సంవత్సరంలో రానా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. శేఖర్ కమ్ముల మార్క్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్ చిత్రాల్లోనే ఓ మంచి క్లాసిక్ అని చెప్పొచ్చు. 'లీడర్' కథని చాలా మంది హీరోలకి శేఖర్ కమ్ముల వినిపించినట్టు అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హీరోలు కథలో కొన్ని మార్పులు చేయాలని కోరడంతో చివరికి రానాతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రానాకి 'లీడర్' మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మరేమో అనేలా అతను అంత మెచ్యూర్డ్గా నటించి అందరినీ మెప్పించాడు. ఇక రానా తప్ప ఆ పాత్రకి మరెవ్వరూ న్యాయం చేయలేరనేలా అర్జున్ ప్రసాద్ పాత్రలో జీవించాడు. అయితే ఇదిలా ఉండగా 'లీడర్' చిత్రానికి సీక్వెల్ ఉంటుందని 'అరణ్య' 'లవ్ స్టోరీ' సినిమాల రిలీజ్ సమయంలో శేఖర్ కమ్ముల తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 'భీమ్లా నాయక్' ప్రమోషన్లలో భాగంగా దీని గురించి ఆ చిత్ర హీరో రానా స్పందించాడు. "శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది" అంటూ రానా బదులిచ్చాడు. ఇక దీని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శేఖర్ కమ్ముల మొదలు పెట్టేశాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సాయి పల్లవిని పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల ఇటీవల డైరెక్ట్ చేసిన రెండు బ్లాక్ బస్టర్స్ ఫిదా, లవ్ స్టోరీలో సాయి పల్లవి నటన హైలైట్ గా నిలిచింది. రెండు సినిమాల్లోనూ ఈ నేచురల్ బ్యూటీ తనదైన నటనతో ఆకట్టుకుంది. డ్యాన్స్ విషయంలోనూ వావ్ అనిపించింది. మొత్తంగా ఫిదా, లవ్ స్టోరీస్ సూపర్ సక్సెస్ లో తనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. లవ్ స్టోరీ తర్వాత ప్రస్తుతం ధనుష్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ రైటింగ్స్ లో బిజీగా ఉన్నాడు డైరెక్టర్. ధనుష్ తో లవ్ స్టోరీ కాకుండా ఒక సీరియస్ సబ్జెక్ట్ ను డీల్ చేస్తాడట. అంతే కాదు తన కొత్త చిత్రంలో సాయి పల్లవి కాకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ కు అవకాశం ఇవ్వనున్నాడట. శేఖర్ కమ్ముల మూవీతో సాయి పల్లవి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టడం ఖాయం అనుకుంటుండగా మరో హీరోయిన్ ఆ అవకాశం అందుకుంటుండటంతో, సాయి పల్లవి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. -
శేఖర్ కమ్ముల మేకింగ్ లోనూ నటిస్తున్నధనుష్
-
తెలుగులో ధనుష్ స్ట్రయిట్ సినిమా
Dhanush Straight Telugu Film: కోలీవుడ్ స్టార్ ధనుష్కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవడమే కాక ఇక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాయి. దీంతో అతడు టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. స్ట్రయిట్ తెలుగు సినిమా చేయడానికి అంగీకరించాడు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రాజెక్టుకు ధనుష్ పచ్చజెండా ఊపాడు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. 'తమిళంలో నా నెక్స్ట్ మూవీ, తెలుగులో నా తొలి సినిమా.. రేపు(గురువారం) ఉదయం 9 గంటల 36 నిమిషాలకు టైటిల్ వెల్లడిస్తాం' అంటూ హీరో ధనుష్ ట్వీట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించనున్నారు.తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. My next Tamil film and my first direct telugu film .. title announcement tom 🙏🙏 Om Namashivaaya pic.twitter.com/cnaeMXO2h0 — Dhanush (@dhanushkraja) December 22, 2021 -
ఓటీటీలో ‘లవ్స్టోరి’.. విడుదల ఎప్పుడంటే
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్స్టోరి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో(సెప్టెంబర్ 24) విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ సరికొత్త ట్రైలర్ని విడుదల చేసింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. -
Love Stories: ప్రేమ అదే ప్రాబ్లం వేరు
ఉన్నోళ్లు లేనోళ్లు... పట్నం పల్లె... ఆ మతం ఈ మతం... వెజ్ నాన్వెజ్... సమాజంలో సినిమాల్లో ప్రేమకు ప్రాబ్లమ్స్ సృష్టించాయి. ప్రేమ అలాగే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంకా సీరియస్ సమస్యలను చర్చిస్తోంది. మొన్నటి ‘ఉప్పెన’ నిన్నటి ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇవాళ్టి ‘లవ్స్టోరీ’ ఆ సంగతే చెబుతున్నాయి. కె.బాలచందర్ ‘మరో చరిత్ర’తో ప్రేక్షకులకు ప్రేమ అలల ప్రతాపం చూపించాడు. నిప్పులోన కాలదు నీటిలోన నానదు అని క్లయిమాక్స్ చేశాడు. మీరు ప్రేమికుల్ని నాశనం చేయగలరు... ప్రేమను కాదు అని చెప్పాడు. ఆ సినిమాలో హీరోయిన్ తెలుగు, హీరో తమిళం. పెద్దవాళ్లు వారిని ఎన్ని బాధలు పెట్టాలో అన్నీ పెట్టారు. చివరకు వాళ్లు ప్రాణం తీసుకునేదాకా ఊరుకోలేదు. శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’లో ‘పంచాయితీల్లో పడాలని ఎవరనుకుంటారు. ప్రేమ అయిపోతుంది. అంతే’ అనే డైలాగ్ ఉంది. నిజం. ప్రేమ అయిపోతుంది. ఆ వయసు, ఆ ఆకర్షణ, ఆ శక్తి, ఆ సహనం ప్రేమికుల్ని వివశుల్ని చేస్తాయి. ప్రేమను తెగించే స్థాయికి తీసుకెళతాయి. ప్రేమికులు మారలేదు. పెద్దలే ఒక సమస్యను వదిలి ఇంకో సమస్యను ముందుకు తెస్తూ వెళుతున్నారు. భారతీరాజా ‘సీతాకోకచిలుక’ కూడా భారీగా హిట్ అయ్యింది. దానిలో హిందూ క్రిస్టియన్ల మధ్య ప్రేమ. క్లయిమాక్స్లో ఊరే తగలబడే స్థాయికి వెళుతుంది. ఆర్థికంగా శక్తిమంతుడైన శరత్బాబు తన చెల్లెలు ముచ్చర్ల అరుణ ప్రేమను సంగీత పాఠాలు చెప్పుకునే ఇంటి కార్తీక్కు ఇవ్వడానికి ఇష్టపడడు. ఇక్కడ మతంతోపాటు ఆర్థిక స్థాయి కూడా విలన్ కావడాన్ని దర్శకుడు చూపిస్తాడు. అయితే ఆ కథ సుఖాంతం అవుతుంది. చదవండి: (చై-సామ్ విడాకులు: సమంతకు భరణం ఎన్ని కోట్లు ఉంటుందంటే..!) ‘కులం’ ప్రేమకు అడ్డం కారాదని, ప్రేమ అలాంటి సంకుచితాల కంటే ఉన్నతమైనదని కె.విశ్వనాథ్ ‘సప్తపది’ తీసినప్పుడు ఆయన నుంచి అలాంటి ప్రేమకథ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన పద్ధతికి కన్విన్స్ అయ్యారు. సినిమాను హిట్ చేశారు. అందులో అగ్రహారం అమ్మాయి దళిత కుర్రాడిని ప్రేమిస్తుంది. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన’ పాట ఉంది ఇందులో. పశువు రంగుకీ పాల రంగుకీ సంబంధం లేదు. ఆరాధనకు వర్ణం లేదు. ప్రేమకు కులం లేదు. కలిసిన ఏ రెండు మనసులైనా సప్తపదికి అర్హమైనవే అని దర్శకుడు చెబుతాడు. ఆ తర్వాత చాలారోజులకు హిందీ ‘బాబీ’ స్ఫూర్తితో తేజ ‘నువ్వు నేను’ తీశాడు. ఇందుకు సాంస్కృతిక తారతమ్యం ప్రధానంగా విభేదం తెస్తుంది. డబ్బు రెండు వర్గాల దగ్గర ఉంది. కాని ఒకరు సూటూ బూటూ వేసే బంగళావాళ్లైతే మరొకరు పాడీ పశువూ యాస ఉన్నవారు. ‘మీపెద్దోళ్లున్నారే’ అని హీరో ఉదయ్కిరణ్ అన్నట్టు పెద్దోళ్ల లెక్కలు పెద్దోళ్లవి. పిల్లలకు ఆ లెక్కలు పట్టవు. వారి దృష్టిలో వాటి విలువ గుండుసున్నా. చదవండి: (సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్) కులపట్టింపు ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక కూడా వెంటాడుతుందని తమిళంలో నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమిస్తే’ చెప్పింది. అందులో పారిపోయిన ప్రేమికులను వెంటాడి విడదీస్తారు. మరాఠిలో ‘సైరా’ ఇదే పాయింట్ను పట్టుకుని పరువు హత్యను చూపించి భారీ విజయం నమోదు చేసింది. అందులో పారిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా ఆ ప్రేమికులను కుల అహంభావులు చంపుతారు. ఇప్పుడు ఈ కుల అహంభావం తెలుగు సినిమాల్లో చర్చకు వస్తోంది. ‘మంచివాడే కానీ మనవాడు కాడు’ అనే డైలాగ్ ఉంది కరుణ కుమార్ తీసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో. ఈ ‘మనవాడు’ కాకపోవడమే హీరోయిన్ తండ్రికి సమస్య. అతనిది సోడా వ్యాపారం. కాని కుల పట్టింపు విషయంలో రాజీ పడడు. చివరకు కన్నకూతురినే పరువు కోసం హత్య చేస్తాడు. ‘ఉప్పెన’లో కూడా అంతే. హీరోయిన్కు ఆస్తి ఉంది. కులం ఉంది. హీరో కులం వాళ్లకు ‘చాల్లేదు’. సముద్రం మీద సాహసంగా వెళ్లి వేట చేసే కుర్రాడు ఎంత యోగ్యుడైనా హీరోయిన్ తండ్రి అహానికి సరిపోడు. చివరకు హీరో మగతనానికే నష్టం కలిగించే స్థాయికి వెళతాడు. ‘లవ్స్టోరీ’లో హీరో కులం హీరోయిన్ ఇంటికి బయట చెప్పులు విడిచి వచ్చే స్థాయికి ‘నెట్టబడిన’ కులం. ఊళ్లో ఉన్న వివక్షను తట్టుకోలేక సిటీకి వచ్చి బతుకుతుంటే ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో ఊరు హీరోను తరుముతూనే ఉంటుంది. చివరకు శ్మశానం కూడా అగ్రకులాలకు ఒకటి... అణగారిన కులాలకు ఒకటి. ‘తిరగబడి ప్రేమను సాధించుకుందాం’ అనుకుంటాడు హీరో. తిరగబడే తెగింపుకు నెడుతున్నది ఎవరు? సమాజం అయినా సినిమా అయినా ప్రేమను తప్పించుకోలేదు. సమాజం ప్రేమికులకు ఎన్నో సవాళ్లు విసురుతున్నా ప్రేమికులు ఓడిపోతుండవచ్చు కాని ప్రేమ ఓడిపోవడం లేదు. అది మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంది. ఇవాళ చాలా కుటుంబాల్లో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో కులాంతరం, మతాంతరం, ఖండాంతరం ఉన్నాయి. ఒప్పుకునే మనసుంటే ఎంత పెద్ద సమస్యా సమస్య కాకుండా పోతుంది. ఒప్పుకోకపోతే చిన్న సమస్య కూడా సమస్యే. ప్రేమ పుట్టనే కూడదు. పుట్టాక దానిని సఫలం చేసుకోవడానికి ప్రేమికులు చేసే ప్రతి పోరాటం ఇక ముందు కూడా సినిమా కథే అవుతుంది. -
నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల
Sekhar Kammula: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరీ’సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. అసలు లవ్స్టోరీ సినిమా కథ ఎలా మొదలైంది? ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లోనే షూటింగ్ చేయడానికి కారణం ఏంటి? బాలీవుడ్లో సినిమా ఎప్పుడు ఉండబోతుంది?లవ్స్టోరీ రిలీజ్ అనంతరం శేఖర్ కమ్ముల అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను సత్తితో 'గరం గరం ముచ్చట్లు'లో చూసేయండి.. -
హైదరాబాద్లో ‘లవ్ స్టోరీ’ మ్యాజికల్ సక్సెస్ మీట్
-
'లవ్స్టోరీ' సినిమాపై మహేశ్బాబు రివ్యూ
Mahesh Babu Comments On Love Story Movie: టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు 'లవ్ స్టోరీ' మూవీ టాపిక్కే వినిపిస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్స్టార్ మహేశ్ బాబు లవ్స్టోరీపై రివ్యూ ఇచ్చారు. చదవండి : డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున 'శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్స్టోరీ టీంపై మహేశ్ ప్రశంసలు కురిపించాడు. చదవండి : Love Story Review: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ @Sai_Pallavi92 sensational as always... does the lady have any bones??? Haven't seen anyone dance like this ever on screen!!! Moves like a dream 🤩🤩🤩 — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 @pawanch19.. you'll be hearing a lot more of him... what a music score... Just sensational! Heard he's a disciple of @arrahman.. Rahman sir, you'll be proud of him. — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 -
Love Story Review: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్స్టోరి నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాతలు : కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు దర్శకత్వం: శేఖర్ కమ్ముల సంగీతం : పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ : విజయ్.సి.కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్స్టోరి సినిమా చేశాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు( సెప్టెంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘లవ్స్టోరి’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. ‘లవ్స్టోరీ’కథేంటంటే? అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్లో పార్ట్నర్గా జాయిన్ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మధ్యలో కులం అడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? కులాల అడ్డంకి దాటుకొని చివరకు మౌనిక, రేవంత్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ. ఎలా చేశారంటే.. ? రేవంత్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప చైతూ, సాయి పల్లవిలు అస్సలు కనిపించరు. హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ తనది. హీరోయిన్ తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరి’ మూవీని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ చాలా మంది సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సున్నితమైన పాయింట్ని తీసుకొని, తెరపై అతి సున్నితంగా చూపించాడు శేఖర్ కమ్ముల. పాత్రల నేపథ్యం చాలా నేచురల్గా ఉంటుంది. సినిమాల్లో కొన్ని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసినా.. స్లోగా సాగే సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్లో హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది, సెకండాఫ్ వచ్చేసరికి కథలో ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం పవన్ సీహెచ్ సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్కి ప్రాణం పోశాడు. విజయ్.సి.కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లెటూరి విజువల్స్ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బ్యానర్ స్థాయికి తగినట్లుగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే ‘లవ్స్టోరి’ ఓ మంచి సందేశాత్మక చిత్రం. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
అందుకే 'లవ్స్టోరీ' చూడాలనే క్యూరియాసిటీ పెరిగింది.
Reasons To Watch Love Story Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్స్టోరీ’ ఒకటి. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్24న ప్రేక్షకల ముందుకు రానుంది. లవ్స్టోరీతో థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని సినీ ప్రముఖులు సైతం భావిస్తున్నారు. లవ్స్టోరీ సినిమా చూసేందుకు ఉన్న ప్రధాన కారణాలను ఓసారి పరిశీలిస్తే.. సాయి పల్లవికి సమానంగా.. సాయి పల్లవికి నటిగానే కాకుండా, మంచి డ్యాన్స్ర్గానూ పేరుంది. అందుకు తగ్గట్లుగానే ప్రతీ సినిమాలో అంతకంతకు ఢిపరెంట్ డ్యాన్స్ స్టెప్స్తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే సాయిపల్లవికి సమానంగా నాగ చైతన్య డ్యాన్స్ ఉండనుందని ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్ చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సెన్సిటివ్ సబ్జెక్ట్ లవ్స్టోరీ సినిమా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కులం, పరువు హత్య లాంటి సెన్సిటివ్ అంశాలను తెరపై ఎలా చూపించారన్నది చాలామందిలో ఉన్న క్యూరియాసిటీ. శేఖర్ కమ్ముల స్టైల్ ఫీల్గుడ్ సినిమాలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది ఢిఫరెంట్ స్టైల్. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి సినిమాలు ఎప్పుడూ చూసినా అదే ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇదే ఆయన సినిమాల్లో మ్యాజిక్. అలాంటిది లవ్స్టోరీగా మన ముందుకు వస్తున్నారంటే కశ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పొచ్చు. చైతూ-పల్లవిల కెమిస్ట్రీ నాగ చైతన్య, సాయి పల్లవి ఈ సినిమా కోసం తొలిసారి నటించారు. ట్రైలర్లో చూపించినట్లుగా ఇద్దరి మధ్యా వచ్చే డైలాగ్స్, కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా వర్కవుట్ అవుతుందని చాలామంది సినీ ప్రేక్షకుల ఫీలింగ్. జుంబా డ్యాన్సర్గా నాగ చైతన్య ఈ సినిమాలో నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది ఆయన డ్యాన్స్. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్ పైనే ఫోకస్ పెరిగింది. ఈ సినిమాలో చైతూ జుంబా డ్యాన్సర్గా కనిపించడం, తెలంగాణ యాస టచ్ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. -
'లవ్స్టోరీ' నన్ను మార్చేసింది: నాగ చైతన్య
Naga Chaitanya About Love Story: నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్స్టోరీ'. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పన్నేండేళ్ల వెండితెర ప్రయాణం తర్వాత తనలో వచ్చిన మార్పులేంటి ? కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలా ఉండబోతున్నాయి ? లవ్స్టోరీలో రేవంత్గా తాను ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పుడు తప్పు చేశాను గతంలో నా సినిమా ఒకటి హిట్ అవగానే... దాని తర్వాత వచ్చే సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని ఆలోచించే వాడిని. దానికి తగ్గట్టుగా సినిమాకు మంచి ప్యాకేజీ రావాలని కోరుకునే వాడిని. అందులో భాగంగా మంచి కాంబినేషన్, మంచి లోకేషన్లు, పాటలు, పెద్ద ఫైట్లు అంటూ ఆలోచించే వాడిని. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఆ గిమ్మిక్కుల చుట్టూ తిరుగుతూ కథను పక్కన పెట్టాను. సినిమా పట్ల నిజాయితీగా లేకుండా కమర్షియల్ లెక్కల వెంట పరిగెత్తాను. కొన్ని సార్లు ఈ లెక్కలు వర్కవుట్ అవుతాయి, కొన్ని సార్లు కావు. నాకైతే ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఆ సమయంలో సినిమా పట్ల, తీసే కథ పట్ల హానెస్ట్గా ఉండాలని డిసైడ్ అయ్యాను. మజిలీతో మారిపోయింది వరుస ప్లాప్స్ తర్వాత లో కాన్ఫిడెన్స్ లెవల్స్లో ఉన్నాను. ఎలాంటి కథ ఎంచుకోవాలనే సందిగ్థదంలో ఉన్నప్పుడు మజిలీ వచ్చింది. కథతో ఎమోషనల్ జర్నీ చేశాను. కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా కథే ముఖ్యమని ఆ సినిమా చేశాను. నా జడ్జిమెంట్కి అదొక లిట్మస్ టెస్ట్ అనుకున్నా. రిజల్ట్ బాగానే వచ్చింది. తాత, నాన్న గారే స్ఫూర్తి మజిలీ తర్వాత నా పాత సినిమాలను ఒకసారి చూసుకుంటే చాలా సినిమాలో నేను, నాలా లేను. కెరీర్ కొత్తలో మనం చాలా వింటాం. ప్రేక్షకులకు ఇది కావాలి, ఆ సెంటర్ వాళ్లకి అది కావాలి, హీరో అంటే ఇలా ఉండాలి, ఫ్యాన్ బేస్ ఇలా చాలా ఉంటాయి. వాటిని బట్టే ముందుకు వెళ్తాం. కానీ ఒకసారి తాతాగారు, నాన్న కెరీర్లో చేసిన సినిమాలు చూస్తే స్కిప్ట్లో ఫ్రెష్నెస్ , కొత్తదనం ఉన్నాయి. అందువల్లే ప్రేక్షకులు వాళ్లని ఆదరించారని అర్థమైంది. న్యూ పాయింట్ ఫస్ట్ శేఖర్ కమ్ములతో సినిమా అనగానే ఫిదా లాంటి ఎంటర్టైనర్ సినిమాలా ఉంటుందని అనుకున్నా. కానీ శేఖర్ కమ్ముల క్యాస్ట్ , జెండర్ వివక్ష మీద కథ చెప్పడంతో చాలా కొత్తగా అనిపించింది. ఈ ఇష్యూస్ మీద చాలా వార్తలు చదువుతున్నాం, కానీ సినిమాగా రావడం లేదు అనేది నా మైండ్లో ఉండేది. శేఖర్ అదే పాయింట్పై కథ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను. రేవంత్ అర్థం కావడానికి లవ్స్టోరీలో రేవంత్ క్యారెక్టర్ నాకు చాలా కొత్త. ఈ సినిమాలో రేవంత్ ఎదుర్కొన్న కష్టాలేమీ నిజ జీవితంలో నాకు ఎదురుకాలేదు. కానీ రేవంత్ క్యారెక్టర్ అలా కాదు. అతనికి ఉన్న ఇబ్బందులు, పరిమితులు గురించి శేఖర్ టీమ్ చాలా డిటెయిల్డ్గా వివరించారు. ఈ ప్రయాణం మూడు నెలలు జరిగింది. ఆ క్యారెక్టర్లో డెప్త్ అర్థమైన తర్వాత శేఖర్ కోసం ఎలాగైనా రేవంత్లా మారిపోవాలని డిసైడ్ అయ్యాను. యాస పట్టుకోవడమే కష్టం రేవంత్ క్యారెక్టర్ పట్టుకోవడం, అందులో జుంబా ఇన్స్ట్రక్టర్గా నటించడం కంటే తెలంగాణ యాసలో పర్ఫెక్ట్గా మాట్లాడం కష్టమనిపించింది. పద్దెనిమిదేళ్లు చెన్నైలో ఉండటం కొంతైతే, ఇక్కడ హైదరాబాద్లో ఇంగ్లీష్ కలిపిన తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ ఎక్కువ. అయితే మధ్యలో కరోనా లాక్డౌన్ రావడంలో చాలా సమయం దొరికింది. అప్పుడు బాగా ప్రాక్టీస్ చేశాను. పైగా డబ్బింగ్కి ముందు సెకండ్ వేవ్ రావడంతో మరోసారి యాస మీద దృష్టి పెట్టాను. షూటింగ్ జరిగేప్పుడు కొన్నేళ్ల పాటు ఓ తరహాలో నటించడానికి అలవాటయ్యాం. లార్జర్ దాన్ లైఫ్ అన్నట్టుగానే హీరో క్యారెక్టర్లు చేశాను. దీంతో లవ్స్టోరీలో రేవంత్గా కెమెరా ముందు ఉన్నప్పడు పాత ఛాయలు కనిపించగానే శేఖర్ గారు వెంటనే చెప్పేవారు. డౌన్ఇట్ డౌన్ ఇట్ అని. సహాజంగా నటించమని చెప్పారు. ఓ పదిహేను రోజలు తర్వాత షూటింగ్లో మ్యాజిక్ స్టార్టయ్యింది. కెమెరా ఆన్ కాగానే చైతన్య పోయి పూర్తి రేవంత్ వచ్చే వాడు. లవ్స్టోరీతో నన్ను మార్చేసింది నాగచైతన్యగా నా లైఫ్ వేరు, రేవంత్ క్యారెక్టర్ వేరు. ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే కరోనా వచ్చింది. లాక్డౌన్ వచ్చింది. జీవితం అంటే ఎంటీ ? డబ్బు, హోదా, గ్యాడ్జెస్ట్ ఇవేమీ కాదనిపించింది. ఈ మార్పు రేవంత్ క్యారెక్టర్కే కాదు నా జీవితంలో కూడా మార్పు తెచ్చింది. మార్పు వస్తోంది ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా మేకింగ్, ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు వస్తోంది. ఇకపై ఇటు సినిమాలు, అటు ఓటీటీలకు సమాన ప్రాధాన్యం ఇస్తాను. అయితే కథకు, బౌండెడ్ స్క్రిప్టు మాత్రం కంపల్సరీ. హిందిలో అలా జరిగిపోయింది తెలుగు సినిమాలకే నా తొలి ప్రాధాన్యం. అయితే ఊహించని విధంగా అమీర్ఖాన్తో లాల్సింగ్ చద్ధాలో నటించే అవకాశం వచ్చింది. హిందీలోకి మంచి ఎంట్రీ వచ్చింది. చెన్నైలోనే పెరగడం వల్ల తమిళ భాష , తమిళ్ సెన్సిబులిటీస్ మీద ఐడియా ఉంది. ఓటీటీలో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
పెళ్లెప్పుడు... అని అడిగేవారు: సాయి పల్లవి
‘‘సమాజంలో మహిళలపై జరిగే దాడులు విని, చదివి బాధపడతాను. మనం ఏం చేయలేమా? అనుకుంటాను. ‘లవ్ స్టోరీ’లో మౌనిక పాత్ర చేస్తున్నప్పుడు కనీసం నా సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగాను అనే సంతృప్తి కలిగింది’’ అని సాయిపల్లవి అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి చెప్పిన విశేషాలు. డ్యాన్స్ చేయాలంటేనే నాకు భయం వేస్తుంటుంది. ‘రౌడీ బేబీ..’ పాట కష్టంగా అనిపించింది. ‘ఎమ్సీఏ’ చిత్రంలో ‘ఏవండోయ్ నానిగారు..’ పాటకు బాగా కష్టపడ్డా. వెనక్కి వంగి డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. వెన్నెముక దెబ్బతిందేమో? అనుకునేదాన్ని. ►శేఖర్ కమ్ములగారి నుంచి ‘లవ్స్టోరీ’కి పిలుపు వచ్చినప్పుడు కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యాను. కథలో మౌనిక పాత్ర విన్న తర్వాత నటించాలనే కోరిక ఇంకా గట్టిగా కలిగింది. మౌనిక తన డ్రీమ్స్ను ఫాలో అవుతుంది. నేను ఎందులో తక్కువ? అనే ఆత్మవిశ్వాసం మౌనిక పాత్రలో కనిపిస్తుంది. ►మన కుటుంబంలో, సమాజంలో లింగ వివక్షను చూస్తుంటాం. ఈ సమస్యలను టచ్ చేస్తూ ఆలోచింపజేసేలా ‘లవ్స్టోరీ’ని తీశారు శేఖర్ కమ్ముల. మా సినిమా చూశాక ప్రేక్షకుల్లో కచ్చితంగా ఒక ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది. ►మనలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు.. కానీ సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నాగచైతన్య, నా క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. నాగచైతన్యతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా అనిపించింది. ►చిరంజీవి సార్కు పెద్ద మనసుంది.. అందుకే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావని కితాబిచ్చారు. నాతో డ్యాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారు. నా డ్యాన్స్ చూసి ప్రేక్షకులు సంతోషపడితే అదే చాలు. నాకంటే బాగా డ్యాన్స్ చేసేవాళ్లు ఉంటారు. చాన్స్ వస్తే వాళ్లూ నిరూపించుకుంటారు. ►‘ఫిదా, లవ్స్టోరీ’ సినిమా షూటింగ్స్ దాదాపు పల్లెటూరిలోనే జరిగాయి. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు మరచిపోలేను. ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అమ్మానాన్న ఏం చేస్తారు?’ ఇలాంటి వ్యక్తిగత విషయాలు అడిగేవారు. ‘లవ్స్టోరీ’ షూటింగ్ పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తుంటే వారు పండించిన పసుపును బహుమానంగా ఇచ్చారు. -
ఆ విధంగా నాకీ సినిమా ఓ కొత్త అనుభవం!
‘‘నేనే కాదు.. ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోయే సినిమాలనే తీయాలనుకుంటారు. అందుకే నేను పాత్రలను ప్రేమిస్తూ కథ రాసుకుంటాను. ప్రతి సినిమాను, అందులోని ప్రతి సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా ఎవరూ తీయలేరన్నట్లుగా భావించి తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాను. ఓ పదేళ్ల తర్వాత కూడా నా సినిమాలను నా పిల్లలు చూడగలిగేలా, వారు గర్వంగా ఫీలయ్యేలా తీయడానికి కష్టపడుతుంటాను. ఇలాగే ‘లవ్స్టోరీ’ తీశాను. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు. ►‘లవ్స్టోరీ’ ఓ మంచి ఫీల్గుడ్ ఎంటర్టైనర్. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండాల్సిన రొమాన్స్, ప్రేమ.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో కుల వివక్ష, స్త్రీ వివక్ష అనే రెండు బలమైన అంశాలను బ్యాలెన్స్ చేస్తూ చూపించాను. జనరల్గా నా సినిమాల్లో కొత్తవారు ఎక్కువగా ఉంటారు. కానీ ‘లవ్స్టోరీ’లో ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసిన ఆర్టిస్టులే ఉంటారు. ఆ విధంగా ఈ సినిమా నాకు కొంత కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ►‘లీడర్’ చిత్రంలో కుల వివక్షపై ఓ చిన్న సీన్ ఉంది. ఆ సన్నివేశం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ పాయింట్నే కొంచెం ఎక్కువగా చూపిస్తూ ‘లవ్స్టోరీ’ తీశాం. శతాబ్దాలుగా ఉన్న కుల వివక్ష సమస్యలకు ఎవరు పరిష్కారాలు చూపించారు? అది మన దౌర్భాగ్యమే. ఒకటో తరగతి పుస్తకాల్లోనే మనమంతా ఒక్కటే అని ఉంటుంది. ఇది చెప్పడానికి ఇంకా ఎన్ని సినిమాలు రావాలి? ఇంకా ఎంత సాహిత్యం కావాలి? కుల వివక్ష గురించి పరిష్కార మార్గాలు కాదు కానీ .. నాకు తెలిసింది, నాకు వచ్చింది నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాను. అలాగే సమాజంలో స్త్రీల పట్ల కనిపించే వివక్ష చూపించాం. ‘లవ్స్టోరీ’ చూసిన అమ్మాయిల్లో కొందరైనా ఇది మా కథ అని స్ఫూర్తి పొందినట్లయితే మేం విజయం సాధించినట్లే. ►లాక్డౌన్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ చిత్రనిర్మాతలు నాకు బలాన్ని ఇచ్చారు. వేరే నిర్మాతలు అయితే ఓటీటీకి ఇచ్చేసేవారేమో. వీరికి థియేటర్స్ ఉన్నాయని కాదు... సినిమాను థియేటర్స్లో చూడాలని, ప్రేక్షకులకు చూపించాలని తపన. లాక్డౌన్ ప్రతి ఇంట్లో ఏదో రకమైన విషాదాన్ని నింపింది. ఈ సమయంలోనే మా నాన్నగారు దూరమయ్యారు. ►‘లవ్స్టోరీ’లో తెలంగాణ కుర్రాడు రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. జుంబా డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా కనిపిస్తాడు చైతు. తెలంగాణలోని ఆర్మూర్ బ్యాక్డ్రాప్లో కథ సాగుతుంది. ఈ సినిమా కోసం చైతూయే కాదు చిత్రయూనిట్ అందరూ చాలా కష్టపడ్డారు. తెలంగాణ యాస, మేనరిజమ్, డ్యాన్స్ వంటి అంశాల్లో చైతూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొత్త చైతూను చూస్తారు. సాయిపల్లవి మంచి పెర్ఫార్మర్. ‘ఫిదా’లోలానే ఈ సినిమాలోనూ తను బాగా చేసింది. అయితే ‘ఫిదా’లో సాయిపల్లవి చేసిన ‘భానుమతి’ పాత్రకు మౌనిక పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. మౌనిక క్యారెక్టర్లో ఓ స్ట్రగుల్ కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయి. ►అక్కినేని నాగేశ్వరరావుగారి ‘ప్రేమ్నగర్’ విడుదలైన రోజునే ‘లవ్స్టోరీ’ విడుదలవుతోందని నాగార్జునగారు అన్నారు. ‘ప్రేమ్నగర్’ సక్సెస్ అయిన దాంట్లో 30 శాతం మా సినిమా సక్సెస్ అయినా నేను హ్యాపీ ఫీలవుతాను. ►నా తర్వాతి చిత్రం ధనుష్తో ఉంటుంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో అనుకున్నాం. కానీ ఓటీటీల వల్ల ఆడియన్స్ రీచ్ ఎక్కువగా ఉంది. హిందీలో కూడా ధనుష్కు మంచి మార్కెట్ ఉంది. అందుకే మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్గా తీస్తున్నాం. రానా హీరోగా నా డైరెక్షన్లో వచ్చిన ‘లీడర్’కు సీక్వెల్ చేస్తాను. -
సాయి పల్లవి నా సినిమాను తిరస్కరించింది: చిరంజీవి
Chiranjeevi At Love Story Pre Release Event: సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు. 'లవ్స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘భోళా శంకర్’ సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు. 'సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు' అంటూ చమత్కరించారు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఎంగ్ స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్గా, కంపోసుడ్గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్ ఫాదర్కి కూల్ సన్' అని చిరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తనకు రీమేక్ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి పేర్కొంది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. ఈ సందర్భంగా స్టేజ్పై చిరుతో సాయిపల్లవి వేసిన స్టెప్పులు హైలెట్గా నిలిచాయి. -
స్టేజ్పై 'సారంగదరియా' అంటూ సాయి పల్లవి స్టెప్పులు
Aamir Khan As A Special Guest For Love Story Pre Release Event: నాగ చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంగ్లీ సారంగదరియా పాటను ఆలపించగా,సాయి పల్లవి స్టెప్పులతో హోరెత్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించిన ఈ పాట ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 కోట్లకు పైగా వ్యూస్లో యూట్యూబ్ సెన్సేషన్ను క్రియేట్ చేసింది ఈ పాట. మంగ్లీ గాత్రంతో పాటు సాయిపల్లవి డ్యాన్స్ సారంగదరియాకు హైలెట్ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి, అమీర్ ఖాన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. -
టాలీవుడ్పై ధనుష్ స్పెషల్ ఫోకస్.. మరో ఇద్దరితో చర్చలు!
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ధనుష్ తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని, దాదాపు రూ. 50 కోట్లకు పైగా పారితోషికం బాగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ రెమ్యూనరేషన్ రూమర్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. అయితే శేఖర్ కమ్ములతో తెలుగు మూవీ చేసేసి,మళ్లీ కోలీవుడ్ వెళ్లిపోదాం అనుకోవడం లేదు ధనుష్. (చదవండి: పెళ్లి తర్వాత కూడా నయన్ నటిస్తుందా?, హీరోయిన్ స్పందన) తెలుగులో ధనుష్ మొత్తం మూడు చిత్రాలు చేయనున్నాడని సమాచారం.శేఖర్ కమ్ములతో మూవీ తో పాటు,వెంకీ అట్లూరి, అలాగే ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో కూడా చర్చలు జరుపుతున్నాడట. అజయ్ భూపతి మేకింగ్ చాలా వరకు కోలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరగా ఉంటుందనీ అందుకే తనకోసం స్టోరీ రేడీ చేయమని చెప్పాడట. ఆర్ ఎక్స్ 100 తర్వాత మహా సముద్రం తెరకెక్కిస్తున్నాడు అజయ్. ఈ మూవీ పూర్తైన తర్వాత డైరెక్ట్ గా ధనుష్ తో ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కించినా ఆశ్చర్యం లేదు. -
ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ: కథ కాన్సెప్ట్ అదేనట!
Dhanush- Sekhar Kammula Movie: యూత్ఫుల్, ఫ్యామిలీ, లవ్, పాలిటిక్స్.. ఇలా కాన్సెప్ట్ ఏదైనా ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తారు దర్శకుడు శేఖర్ కమ్ముల. కథాంశం ఎలాంటిదైనా అందులోని పాత్రకు తగ్గట్టు మారిపోతారు ధనుష్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్యాన్ ఇండియా మూవీ అనగానే సబ్జెక్ట్ ఏదై ఉంటుందా? అనే చర్చ ఇటు టాలీవుడ్లోనే కాదు.. అటు కోలీవుడ్లోనూ జరుగుతోంది. మద్రాస్ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్ననాటి కథతో ఈ సినిమా ఉంటుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ఆరంభం కానుంది. నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
‘లవ్స్టోరీ’కి 10 ఓటీటీ ఆఫర్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Love Story Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్స్టోరీ’ ఒకటి. ఫిదా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీనిపై తాజాగా నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ స్పందించారు. ఈ సినిమాకు ఏకంగా 10 ఓటీటీ ఆఫర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఐతే తమ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వలేదని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. జూలై 30న ‘లవ్స్టోరీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
నాగచైతన్య- సాయి పల్లవి ‘లవ్స్టోరీ’విడుదలకు ముహుర్తం ఫిక్స్!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే రెండు రాష్ట్రాలలో థియేటర్లు మొదలుకానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉన్నారు. అసలే మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్ కూడా నెలకొనడంతో అసలు ఇప్పుడే సినిమాలను విడుదల చేయాలా వద్దా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు కూడా నెలకొనగా లవ్ స్టోరీ మేకర్స్ మాత్రం సినిమాను విడుదల చేసేందుకే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది. జూలై 23న ‘లవ్స్టోరీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ విషయంపై నిర్మాత నారాయణ దాస్ నారంగ్ పరోక్షంగా స్పందించారు. జూలై 23న తమ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ 24న వెంకటేశ్ ‘నారప్ప’ఓటీటీలో రాబోతుందని తెలియడంతో కాస్త ఆలోచనలో పడ్డామని తెలిపారు. మరోవైపు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
ధనుష్ని కలిసిన శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకంపై ప్రొడక్షన్ నెం.4గా నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ధనుష్ ఓ తమిళ చిత్రం షూటింగ్ చేస్తూ, హైదరాబాద్లో ఉన్నారు. ఈ సందర్భంగా తమ హీరోను శేఖర్ కమ్ముల, నారాయణ్ దాస్, సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు కలిశారు. యూనివర్సల్ అప్పీల్ మరియు అత్యంత ప్రతిభావంతులైన నటుడు-దర్శకుడితో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సోనాలి నారంగ్ సమర్పకురాలు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్నతమైన నటులు,టెక్నీషియన్స్ తో చర్చలు జరుపుతోంది చిత్ర యూనిట్. త్వరలోనే వారి వివరాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. -
తమిళనాడు రియల్ పాలిటిక్స్ ఆధారంగా ధనుష్ మూవీ!
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం, అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఇక సినిమా నేపథ్యం ఏమై ఉంటుందన్న క్యూరియాసిటీ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. పొలిటికల్ టచ్తో సినిమా ఉండనుందని తెలుస్తోంది. గతంలో రానాను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ శేఖర్ కమ్ముల లీడర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రానాకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు హీరోగానూ నిలబెట్టింది. ఇప్పుడు మరోసారి పొలిటికల్ టచ్తో మెప్పించేందుకు శేఖర్ కమ్ముల కథ సిద్ధం చేశారట. చదవండి : మరోసారి రిపీట్ కానున్న ధనుష్-సాయిపల్లవి జోడీ శేఖర్ కమ్ముల సినిమా: ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..! -
మరోసారి రిపీట్ కానున్న ధనుష్-సాయిపల్లవి జోడీ
ప్రముఖ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన ఇప్పటికే అధికారిక ప్రకటన ఊడా వెల్లడైంది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం, అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరలవుతుంది. ఈ సినిమాలో ధనుష్కు జోడీగా హీరోయిన్ సాయిపల్లవి నటించనుందని సమాచారం. ఇప్పటిఏ మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారని, సాయిపల్లవి కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఇప్పటికే సాయిపల్లవి ధనుష్తో కలిసి 'మారి 2' తమిళ చిత్రంలో జతకట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందట. లేటెస్ట్గా సాయిపల్లవి శేఖర్ కమ్మలు దర్శకత్వంలో లవ్స్టోరీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్కు బ్రేక్ పడింది. చదవండి : శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా: ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..! -
శేఖర్ కమ్ముల సినిమా: ధనుష్ రెమ్యునరేషన్ ఎంతంటే..!
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని మేకర్స్ తెలియజేశారు. ఎవరు ఊహించని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఈ మూవీ కోసం ధనుష్ భారీ రెమ్యునరేషన్ తీసుకోతున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గాను ధనుష్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియ రావట్లేదు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ధనుష్ బాలీవుడ్లో ‘అత్రాంగి రే’, హాలీవుడ్లో ‘ది గ్రే మ్యాన్’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. చదవండి: శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్ ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ' -
శేఖర్ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి ఓ త్రిభాష చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుపై ధనుష్ స్పందించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ‘నేను ఆరాధించే దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ములతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను. వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి. బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ త్రిభాషా చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ ధనుష్ ట్వీట్ చేశారు. ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో చూడాలి మరి. చదవండి: ఇట్స్ అఫిషియల్: ధనుష్తో శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ -
ఇట్స్ అఫిషియల్: ధనుష్తో శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం
పుకార్లే నిజమయ్యాయి. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అఫీషియల్ ప్రకటన ఈ రోజు వెలువడింది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని మేకర్స్ తెలియజేశారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. ధనుష్ బాలీవుడ్లో ‘అత్రాంగి రే’, హాలీవుడ్లో ‘ది గ్రే మ్యాన్’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. The two Men who crossed the barriers to Celebrate Cinema 🎥 The National Award Winners @dhanushkraja 🤩 & @sekharkammula 🔥 collaborating for a Tamil-Telugu - Hindi Trilingual FILM Proudly Produced by #NarayanDasNarang & #PuskurRamMohanRao under @SVCLLP Banner ! pic.twitter.com/GcBkGqzd1R — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) June 18, 2021 -
శేఖర్ కమ్ములకు కోపం వస్తే... సీక్రెట్ చెప్పిన చై.. నవ్వులే నవ్వులు
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఖాలీ సమయంలో దొరకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ మొదలెట్టాడు శెఖర్ కమ్ముల. అందులో భాగంగా హీరో రానా హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘నం.1 యారి’షోలో ‘లవ్స్టోరీ’ టీమ్ సందడి చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమయ్యే ఈ షోలో శేఖర్ కమ్ముల గురించి హీరో చైతన్య, హీరోయిన్ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సెట్లో ఆయన ఎలా ఉంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడు తదితర విషయాలను బయటపెట్టారు. శేఖర్ కమ్ముల ప్రత్యేక ఏంటని సాయిపల్లవిని అడగ్గా.. ఆయన విషయంలో తాను కొంచెం పొసెసీవ్ అని చెప్పింది. నేను సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైని మెచ్చుకుంటే నేను శేఖర్ కమ్ములగారి వైపు కోపంగా చూస్తుంటా. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సలహాలు ఇస్తాను. ఆయన దానికి ఎలా స్పందిస్తారా..? అని ఎదురుచూస్తుంటా’అని సాయిపల్లవి చెప్పింది. ఇక శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తాను ఎవరిని ఎక్కువగా పొగడనని, గుడ్ అని చెప్పానని, నచ్చకపోతే మానిటర్ దగ్గర నుంచి వెళ్లిపోతానని శేఖర్ చెబుతుండగా నాగచైతన్య కల్పించుకొని ‘దాదాపు గుడ్ అంటారు. ఈ మధ్య ‘యాక్’అనే పదం కూడా నేర్చుకున్నాడు’ అని అనడంలో అంతా ఘొల్లున నవ్వారు. ఇక రానా స్పందిస్తూ.. ఇది కొత్త పదం అని, తాను మాత్రం ‘యాక్’ అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ చేయలేదనడంతో షోలో నవ్వులు పూశాయి. -
సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల భావోద్వేగం..
క్లాసిక్ చిత్రాలతో హిట్ కొట్టే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి కమర్షయల్ ఎలిమెంట్స్ లేకున్నా విజయవంతమైన సినిమాలు తీయడంలో ఆయనది ప్రత్యేక స్టైల్. ఆయన రూపొందించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న శేఖర్ కమ్ముల తాను డైరెక్ట్ చేసిన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఫిదా మూవీని మహేశ్బాబు, రామ్చరణ్లకు చెప్పానని, వాళ్లు ఆ కథను రిజెక్ట్ చేశారని దీంతో ఆ ప్రాజెక్ట్ వరుణ్తేజ్ దగ్గరకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇక తన ఫస్ట్ మూవీ ఆనంద్ తనకు ఎంతో స్పెషల్ అని, ఈ సినిమా చిరంజీవి నటించిన 'శంకర్ దాదా' ఒకే రోజు రిలీజ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత పలువురు పొగడ్తలతో ముంచేశారని, ఆ సినిమా సూపర్హిట్ అవుతుందనే నమ్మకం తనకు ముందు నుంచీ ఉందని పేర్కొన్నాడు. ఇక లవ్స్టోరి సినిమాలోని సారంగదరియా వివాదంపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: చిత్రం సీక్వెల్.. మరో ఉదయ్కిరణ్ దొరికేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్, ఆ వార్తల్లో నిజం లేదు -
తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా?
సాయిపల్లవి.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పాట 'వచ్చిండే, మెల్ల మెల్లగ వచ్చిండే..' కానీ 'లవ్ స్టోరీ' సినిమా పుణ్యాన ఇప్పుడామె పేరు చెప్తే చాలు 'దాని పేరే సారంగదరియా..' అంటూ ఫోక్ సాంగ్ను గుర్తు చేసుకుంటూ స్టెప్పులేస్తున్నారు. ఆ జానపద పాట, అందులో సాయిపల్లవి డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందోనని సినిమా రిలీజ్ అయ్యే ఏప్రిల్ 16 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'ఫిదా' వంటి బ్లాక్బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ 'లవ్ స్టోరీ' మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్రా హక్కులు రూ.15 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. నైజామ్లో కూడా మంచి ధర పలికేది కానీ ఇక్కడ ఆసియన్ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తుందట. మొత్తంగా ఈ సినిమా అప్పుడే 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇవి కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాగా, ఇవి కాకుండా నాన్ థియేటర్ హక్కులు ఉండనే ఉన్నాయి. మరి ఓవరాల్గా ఈ సినిమా ఎంత మార్కెటింగ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది -
సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది
నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. తాజాగా ‘లవ్ స్టోరి’ నుంచి మూడో పాటను స్టార్ హీరోయిన్ సమంత ఆదివారం విడుదల చేసింది. ‘ఈ సీజన్లో డాన్స్ సాంగ్ను విడుదల చేస్తున్నాను. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్ చేశావు’ అంటూ సాయిపల్లవిని పొగుడుతూ సమంత ఈ పాటను విడుదల చేసింది. ‘సారంగ దరియా’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్కు నాచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి అదిరిపోయే స్టెప్పులేసింది. ‘ఫిదా’ సినిమాలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’ మాదిరి ఈ పాట కూడా సినిమాకు హైలెట్గా నిలవనుంది. ఈ పాట ఎంత బాగుందో.. సాయి పల్లవి ఫెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంది. తెలంగాణ ఫోక్ జానపదం మాదిరి సాగే ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా, మంగ్లీ ఆలపించింది. పవన్ సీహెచ్సంగీతం అందించారు. ఏప్రిల్ 16న చైతూ, సాయి పల్లవిల ‘లవ్స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గుండెల్ని పిండేస్తున్న ‘లవ్స్టోరీ’ మెలోడీ
యంగ్ హీరో నాగచైనత్య, నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఒక పాట, టీజర్ మంచి ఆదరణ అభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నీ చిత్రంచూసి’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదలైన ఈ మెలోడి సాంగ్ గుండెల్ని పిండేస్తుంది. ఈ అద్భుతమైన పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు కులకర్ణి ఆలపించారు. పవన్ సీహెచ్సంగీతం అందించారు. ఏప్రిల్ 16న చైతూ, సాయి పల్లవిల ‘లవ్స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హైదరాబాద్ను నిజంగా ప్రేమిస్తే : దర్శకుడు శేఖర్ కమ్ముల
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటి(ఆదివారం)తో ముగియనున్న సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచార హోరు సాగుతోంది.అటు సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందేశాల జోరు కూడా పెరిగింది. ఓటు హక్కు వినియోగంపై ఉత్సాహాన్ని రేకెత్తించేలా విడియోలను పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉరుకుపరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపే నగరవాసుల్లో ఓటు హక్కు వినియోగం శాతం పెంచేలా చైతన్యాన్ని కలిలిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ యాంకర్ ఉదయ భాను ముందు వరుసగా నిలిచారు. తాజాగా మంచి కాఫీ లాంటి ‘ఆనంద్’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన శేఖర్ కమ్ముల ఎన్నికలకు సంబంధించి మంచి సందేశంతో ముందుకొచ్చారు. మన నగరాన్ని నిజంగా ప్రేమిస్తే.. మనం తప్పకుండా డిసెంబరు 1 వతేదీన తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. (లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో) -
బర్త్డే స్పెషల్ : నాగ చైతన్య న్యూ లుక్
సాక్షి, హైదరాబాద్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పల్లెటూరి గెటప్లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చేతూ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''లవ్ స్టోరి'' స్పెషల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లుంగీ, బనియన్తో పల్లెటూరి యువకుడి పాత్రలో నాగ చైతన్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొందరితో స్నేహాలు చాలా బావుంటాయి. చైతూతో అసోసియేషన్ అలాంటిదే.. థ్యాంక్యూ.. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అంటూ 'లవ్ స్టోరి'' చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల చేకు శుభాకాంక్షలు తెలిపారు. నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగ చైతన్య తన శ్రీమతి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేనితో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నారు. అయితే తన హబ్బీ పుట్టినరోజు సందర్భంగా, సమంతా బీచ్లో ఎంజాయ్ చేస్తున్న అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అంతకుముందు స్కూబా డైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Some associations are meant to be cherished ...... Thank you .. Happy Birthday Chaitanya ...#HBDNagaChaitanya @chay_akkineni#lovestory #nagachaitanya #saipallavi pic.twitter.com/bfJYFXn4PR — Sekhar Kammula (@sekharkammula) November 23, 2020 . View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం
ప్రముఖ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం 6 గంటలకు ఆస్సత్రిలో కన్నుమూశారు. కాగా ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్ర బన్సీలాల్ పేట స్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖుల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. -
కాంబినేషన్ కుదిరిందా?
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరు వెంకటేష్. తన కథలో ప్రేక్షకులను లీనం చేయగలుగుతారు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు మొదలు కాబోతున్నాయనేది ఫిల్మ్నగర్ టాక్. ఈ లాక్డౌన్ సమయంలో ఓ స్క్రిప్ట్ను రెడీ చేశారట శేఖర్ కమ్ముల. ఈ కథలో వెంకటేష్ హీరోగా నటించబోతున్నారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ ‘నారప్ప’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం ఫిక్స్
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్స్టోరీ’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. మరో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగా లాక్డౌన్తో అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ చిత్రం నిర్మాణదశలో ఉండగానే తన తర్వాతి సినిమాను కన్ఫార్మ్ చేశారు శేఖర్ కమ్ముల. అది కూడా ‘లవ్ స్టోరీ’ చిత్ర నిర్మాతతోనే. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించనున్నారని సమాచారం. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈ సారి లాక్డౌన్ విరామంలో తన తర్వాతి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను పూర్తి చేసుకున్నారు. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది. చదవండి: నాగబాబు మరో సంచలన ట్వీట్: వైరల్ అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం -
తెరపై ‘గోదావరి’ : అందరి మనసుల్లో పదిలంగా
సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా తెరపై కనిపించిన చిత్రం ‘గోదావరి’. విభిన్న శైలి కలిగిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఆర్ట్స్పై జివిజి రాజు నిర్మించారు. రాజమండ్రి నుంచి లాంచీలో భద్రాచలం వరకు జరిగిన ఈ రీల్ ప్రయాణంలో, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని అతి సుందరమైన అందాలను చూపిస్తూ, సున్నితమై మనసులు, కుటంబాల మధ్య ఉండే భావోద్వేగాలను సహజత్వానికి దగ్గరగా, కమర్షియల్ పంథాకు దూరంగా ఉండే ‘గోదావరి’ చిత్రం విడుదలై నేటికి పద్నాలుగేళ్లు పూర్తయింది. సున్నితమైన ఎమోషన్స్, సహజత్వానికి దగ్గరంగా ఉండే సంభాషణలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ అందించిన ప్రతి పాట సుమధురమైనదే. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఆయువుపట్టు అనే చెప్పాలి. ఈ చిత్రం పూర్తిగా శేఖర్ కమ్ముల స్టైల్లో మంచి సంగీతంతో కూడిన ఓ ఫీల్గుడ్మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విశేష ప్రేక్షకాదారణ లభిస్తూనే ఉంది. విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఈ చిత్రం టీవీల్లో వచ్చిందంటే రిమోట్ పక్కకు పడేసి ఛానల్ మార్చకుండా ఆసక్తిగా చూస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ పద్నాలుగేళ్ల కిత్రం వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ తన చల్లదనాన్ని అభిమానులకు పంచుతూ వారిని రిలాక్స్ మూడ్లోకి తీసుకెళుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం సినిమా ఘన విజయం సాంధించడంతో పాటు ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకుంది. On its anniversary today, remembering #Godavari (May 19, 2006) pic.twitter.com/poayRKoEn2 — Sumanth (@iSumanth) May 19, 2020 చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్కు డౌట్ -
హిజ్రాలకు శేఖర్ కమ్ముల చేయూత
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న హిజ్రాలను ఆదుకునేందుకు తన వంతు సాయాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఆయన జీహెచ్ఎంసీ, కర్నూలు పారిశుద్య కార్మికులకు నెలరొజుల పాటు బాదం పాలు, మజ్జిగ అందజేసి తనవంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శకంగా నిలుస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిజ్రాలను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. అంతేకాకుండా వీళ్లకు సహాయం చేయడానిఇక మరికొంతమంది ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘ఈ లాక్డౌన్ సమయంలోలో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ట్రాన్స్జెండర్లు. వాళ్లు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి గూడు దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఇవి కాక సమాజంలో వారి పట్ల ఉండే వివక్ష, అపోహలతో వాళ్ల ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్లకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. హెల్త్కేర్ పథకాలు వర్తించవు. సెన్సిటివ్ గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే rachanamudraboyina@gmail.comకు మెయిల్ చేయండి’అంటూ శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు. ఇక శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ఞతగా హిజ్రాలు ‘థాంక్యూ శేఖర్ కమ్ముల’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు. #rachanamudraboyina pic.twitter.com/YKQ12IjKpY — Sekhar Kammula (@sekharkammula) May 15, 2020 చదవండి: హరీష్పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా -
ఇది నాకు అతి పెద్ద బహుమతి: శేఖర్ కమ్ముల
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు తమకు శీతల పానియాలు అందిస్తున్నందుకుగానూ గాంధీ ఆస్పత్రి వద్ద ఆయన పేరుతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ట్విటర్ వేదికగా దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల ‘‘ గాంధీ ఆస్పత్రి వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నా కోసం ఇలా చేయటం వెలకట్టలేనిది. ఇది నాకు అతి పెద్ద బహుమతి. నేను చేసిన ఓ పని మిమ్మల్ని కదిలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ, మీరు రాత్రింబవళ్లు మా కోసం చేస్తున్న దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ( రానా పెళ్లిపై సురేష్ బాబు క్లారిటీ ) I'm overwhelmed....... This is a priceless guesture from the GHMC sanitation workers at Gandhi Hospital ......my biggest award. I feel extremely happy that I could do something that touched you but it's nothing compared to what you do for us, day in and day out. pic.twitter.com/EkYAz8Wbnf — Sekhar Kammula (@sekharkammula) May 13, 2020 కాగా, మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధీ ఆస్పత్రి పరిధిలోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం శీతల పానియాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు శేఖర్ కమ్ముల. దాదాపు 1000 మందికి బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ అందిస్తున్నారు. ఓ నెల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అంతేకాకుండా కర్నూల్ టౌన్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా శీతల పానియాలను అందిస్తున్నారాయన. -
ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్స్టోరి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే పాట ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యకు ముద్దు పెట్టిన అనంతరం ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవిల మధ్య వచ్చే కొన్ని సీన్లను ఈ మ్యూజికల్ ప్రివ్యూలో ప్రధానంగా చూపెట్టారు. సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్ మంచి పాటను అందించినట్టుగా అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం.. వేసవిలో విడుదల కానుంది. -
కొత్త కాంబినేషన్
‘మజిలీ, వెంకీ మామ’ సినిమాల సక్సెస్తో జోష్ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది నాగచైతన్య కెరీర్లో 20వ చిత్రం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత పరశురామ్ తెరకెక్కించనున్న చిత్రమిదే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చిత్రబృందం తెలిపింది. -
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం
-
శేఖర్ కమ్ముల కొత్త సినిమా ప్రారంభం
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో జరిగాయి. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా రూపొందుతుండటంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. సెప్టెంబర్ తొలివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
మళ్లీ ఫిదా చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ!
క్లాస్ సినిమాలను తీస్తూ.. ప్రతీ ఫ్రేమ్లో ఆయన మార్క్ను కనపడేలా చిత్రాన్ని తెరకెక్కించడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. గతేడాది ఫిదాతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల ఇంతవరకు మరో ప్రాజెక్టును చేపట్టలేదు. అయితే రీసెంట్గా తన కొత్త మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్దమవుతున్నాడు. మళ్లీ కొత్తవారితో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో ఓ మంచి ప్రేమకథా చిత్రంగా మలచబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది. -
‘విరాజ్ మంచి హీరో అవుతాడు’
విరాజ్ జె అశ్విన్ను హీరోగా పరిచయం చేస్తూ టి.ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. కె.సతీష్ కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్.రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్ ,రాధా బంగారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర సంబంధించిన టైటిల్ సాంగ్ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..‘అనగనగా ఓ ప్రేమకథ లోని టైటిల్ సాంగ్ ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగుంది. మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారితో నేను చాల సినిమాలు పని చేశాను. తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్కి బెస్ట్ విషెస్ చెపుతూ, ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న’ అన్నారు . తమ చిత్రంలోని పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు. -
మరో రికార్డ్ ‘ఫిదా’
మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా బడ్జెట్ కు మించి ఎన్నో రెట్లు కలెక్ట్ చేసిన భారీ రికార్డులు నమోదు చేసింది. చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం గడుస్తున్నా ఇప్పటికే ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. సినిమాలోని ‘వచ్చిండే.. ’ పాట ఏకంగా 150 మిలియన్ల (పదిహేను కోట్ల) వ్యూస్ సాధించి సత్తా చాటింది. శక్తికాంత్ కార్తీక్ సంగీత సారధ్యంలో మధుప్రియ, రాంకీలు ఆలపించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యమందించారు. -
చిత్ర నిర్మాణ రంగంలోకి ఏషియన్ గ్రూప్
యాభైఏళ్లుగా 600ల సినిమాలకు ఫైనాన్స్ అందించి, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సంస్థ ఓ చిత్రం నిర్మించనుంది. ఈ లవ్ స్టోరీకి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు (తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్) వ్యవహరించనున్నారు. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే ప్రాజెక్ట్పై అటు ఇండ్రస్టీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్ని తప్ప క్రేజ్ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న ఈ ప్రేమకథకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: విజయ్ భాస్కర్. -
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ శేఖర్ కమ్ముల
-
టాలీవుడ్కి ధృవ్?
కోలీవుడ్, టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్. ఆయన తనయుడు ధృవ్ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్రెడ్డి’ రీమేక్ ‘వర్మ’తో ధృవ్ కోలీవుడ్కి హీరోగా పరిచయమవుతున్నారు. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో ధృవ్ టాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో అని సమాచారం. ‘ఫిదా’ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా తర్వాతి చిత్రంపై శేఖర్ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ‘ఫిదా’ తర్వాత ఓ స్టార్ హీరోతో పనిచేయనున్నట్లు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం ధృవ్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. డ్యాన్స్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’తో శేఖర్ కమ్ముల..!
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో ధృవ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ధృవ్ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. విక్రమ్కు తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన వారసుడ్ని రెండు భాషల్లో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తమిళ్లో బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ధృవ్, తెలుగులో అందుకు భిన్నంగా ఓ క్లాస్ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధృవ్ టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
నాకేం సంబంధం లేదు : శేఖర్ కమ్ముల
సాక్షి, హైదరాబాద్: ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. వెంటనే సైబర్ నేరగాళ్లు దీన్ని క్యాష్ చేసుకున్నారు. శేఖర్ పేరుతో క్వికర్లో నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చి అందినకాడికి దండుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘నేను రూపొందిస్తున్న కొత్త సినిమాలో నటించడానికి యువతీయువకులు కావాలి’ అంటూ శేఖర్ పేరుతో నెల క్రితం క్వికర్లో ఓ ప్రకటన వెలువడింది. సాధారణంగానే శేఖర్ కమ్ముల రూపొందించే చిత్రాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రకటన నిజమని నమ్మిన రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఆ పోస్ట్లో ఉన్న నంబర్ను సంప్రదించారు. ఫోన్లు రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి రూ.4 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించాడు. ముందుగా రూ.2 వేల వరకు తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని, ఆపై ఈ నెల 25న తుది ఇంటర్వ్యూ హైదరాబాద్లో ఉంటుందని నమ్మబలికాడు. ఆ రోజు మిగిలిన మొత్తం చెల్లించాలని చెప్పాడు. దీనికి స్పందించిన వేలాది మంది మోసగాడు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశారు. విషయం వెలుగులోకి వచ్చిందిలా.. సోమవారం(25న) ఒంగోలుకు చెందిన ప్రదీప్ నగరానికి వచ్చి శేఖర్ కమ్ములను కలిశారు. మొదట డిపాజిట్ చేసింది పోగా మిగిలిన మొత్తం చెల్లిస్తానని, తనను ఇంటర్వ్యూ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో అవాక్కైన శేఖర్ ఆరా తీయగా ప్రదీప్ అసలు విషయం చెప్పారు. అది మోసపూరిత ప్రకటన అని, తనకు సంబంధం లేదని చెప్పిన శేఖర్ కమ్ముల సైబర్ క్రైమ్స్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ను కలసి ఫిర్యాదు చేశారు. -
మనందరి కథలా ఉంది : శేఖర్ కమ్ముల
విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం ప్రత్యేకం ప్రదర్శించారు. సినిమా చూసిన శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సమాజానికి అవసరమైన కథను ఎంతో అందంగా రూపొందించిరనందుకు యూనిట్ సభ్యులకు హ్యాట్సాఫ్ అన్నారు. ప్రస్తుతం సొసైటీలో గెలిచిన వాళ్లకే కెరీర్ ఉంటుందని, ఓడిపోయిన వాళ్లను ఎందుకు పనికి రానివారిగా చూస్తున్నారని.. అలాంటి సంఘటనలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారని తెలిపారు. శ్రీవిష్ణు యాక్టింగ్ గత చిత్రాల కన్నా ఇంకా బాగుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శేఖర్ కమ్ముల
-
బిగ్హిట్