Skin Care
-
హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!
తెరపై నవరసాలను అలవోకగా పలికించే నటి నయనతార. అంతటి అభినయాన్ని మ్యాచ్ చేసే ధైర్యం లేక.. ఆమె అందాన్ని మ్యాచ్ చేసే పోటీలో మేమూ నిలబడతామన్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. నా ముఖంలో వచ్చిన మార్పులకు చాలామంది ప్లాస్టిక్ సర్జరీ కారణమని అనుకుంటుంటారు. కాని, నాకు తరచు ఐబ్రోస్ చేయించుకోవటం ఇష్టం. అవి గేమ్ చేంజర్ లాంటివి. ఆహారం, బరువులో వచ్చే తేడాలతో పాటు నా డిఫరెంట్ ఐబ్రోస్ స్టయిల్స్ కూడా నా లుక్స్ని మారుస్తాయని చెబుతోంది లేడీ సూపర్ స్టార్ నయన తార.అందాల చేతులకు సెలబ్రిటీ టిప్చేతిగాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. కాని, అవి సంప్రదాయ దుస్తులకే సెట్ అవుతాయి. జీన్స్, వెస్టర్న్వేర్ దుస్తులకు గాజులు నప్పవు. అలాంటప్పుడు ఈ సింపుల్ సెలబ్రిటీ స్టయిల్ ఫాలో అయితే, మీ చేతులను అందంగా మార్చేయచ్చు. సింపుల్గా ఉండే బ్రాస్లెట్తో పాటు మరో రెండు, మూడు రకాల బ్రాస్లెట్స్ను ఒకేసారి ధరిస్తే మీ చేతులకు ఎలిగెంట్, ట్రెండీ లుక్ సొంతం అవుతుంది. ఇలా మీ రెండు చేతులకు లేదా ఒక చేతికి కూడా ధరించొచ్చు. ఈ విధంగా హెవీగా చేతులను స్టయిల్ చేసినప్పుడు మెడను, చెవులను కూడా సింపుల్గా స్టయిల్ చేసుకోవాలి. అప్పుడే మీ చేతులు హైలెట్ అయి అందంగా కనిపిస్తారు. ఈ టెక్నిన్నే నటి నయనతార కూడా ఫాలో అయింది. ఈ ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా జ్యూలరీ షాపింగ్ చేసేటప్పుడు మూడు నాలుగు రకాల బ్రాస్లెట్స్ను కూడా కార్ట్లో యాడ్ చేసుకోండి. (చదవండి: విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!) -
ముడతలు లేని ఆరోగ్యకరమైన చర్మం కోసం..!
చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా..?. అందుకోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. మొక్కల ఆధారిత ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంటాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. వీటిలో చర్మానికి కావాల్సిన విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు చర్మం ఆకృతికి, ఆర్థ్రీకరణను ప్రోత్సహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మరీ అందుకోసం తీసుకోవాల్సిన సూపర్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..!.జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ 2022లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం..నిర్దిష్ట పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు , పాలీఫెనాల్ అధికంగా ఉండే పానీయాలు తదితరాలు మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన చర్మంలో కీలకపాత్ర పోషిస్తాయని తేలింది. ఈ ఆహారాలు యవ్వనంతో నిగనిగలాడే చర్మాన్ని అందిస్తాయని పరిశోధన వెల్లడించింది. మరి యవ్వన చర్మానికి దోహదపడే మొక్కల ఆధారిత ఆహారాలు ఏవంటే..నారింజ: ఇది విటమిన్ 'సీ'కి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, చర్మం మరమత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ముదురుఎరుపు రంగు కండ కలిగిన బ్లడ్ ఆరెంజ్లతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 27 ఏళ్ల వయసు గల యువత 21 రోజుల పాటు ప్రతిరోజూ 600 ఎంఎల్ బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల డీఎన్ఏ నష్టం తగ్గడం తోపాటు విటమిన్ సీ, కెరోటినాయిడ్ల స్థాయిలు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.టమోటాలు..దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మానికి శక్తిమంతమైన యాంటీ ఆక్సీడెంట్లను అందిస్తుంది. పెద్దలు ప్రతిరోజు ఆలివ్నూనె తోపాటు 55 గ్రాముల టమోటా పేస్ట్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు గణనీయంగా తగగుతాయని పరిశోధనలో తేలింది. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.బాదంపప్పుబాదంపపపులో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు(ఎంయూఎఫ్ఏ), విటమిన్ ఈ, పాలీఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు 16 వారాల పాటు మొత్తం రోజువారీ కేలరీల్లో 20% బాదంపప్పులు తీసుకోవడంతో గణనీయమైన మార్పులు కనిపించాయని అన్నారు. సోయబీన్స్..దీనిలో ఐసోఫ్లేవోన్లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం తోపాటు చర్మం పొడిబారడం, గాయలయ్యే అవకాశాలు ఎక్కుగా ఉంటాయట. ఎప్పుడైతే సోయాబీన్ తీసుకోవడం మొదలుపెడతామో..అప్పటినుంచి చర్మ స్థితిస్థాపకతలో మంచి మార్పుల తోపాటు ఆర్థ్రీకరణ పెరిగి గీతలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోకోకోకోలో ఫ్లేవనోల్స్ నిండి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. పరిశోధనలో 24 వారాలపాటు ఓ వృద్ధ మహిళ ప్రతిరోజూ కోకో పానీయం తీసుకోవడంతో ఆమె చర్మంలో ముడతలు, గరుకుదనం తగ్గి యవ్వనపు కాంతి సంతరించుకుందని శాస్తవేత్తలు చెబుతున్నారు. అందువల్ల పోషకాలు అధికంగా ఉండే ఈ మొక్కల ఆధారిత ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆర్థ్రీకరణ, స్థితిపాకత తోపాటు మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన యవ్వన చర్మాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు చర్మ నిపుణులు. (చదవండి: మహిళల రక్షణకు ఉపకరించే చట్టాలివే..) -
'మే'నిగనిగలకు కేర్ తీసుకుందామిలా..!
ఒక మహిళ తాలూకు ఆరోగ్యం ఎలా ఉందన్నది ఆమె మేని చాయ, నిగారింపు లాంటి అంశాలు పట్టి చూపుతాయి. ఆమె వయసుకూ, హార్మోన్ల సమతౌల్యతకూ, ఆరోగ్యకరమైన జీవనశైలికీ ఆమె చర్మం ప్రతిబింబం. కౌమార దశ నుంచి మెనోపాజ్ వచ్చేవరకు ప్రతి దశనూ ఆమె చర్మం ఓ అద్దంలా చూపిస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ల చర్మమూ ప్రధానంగా (బ్రాడ్గా) జిడ్డు చర్మం, నార్మల్ లేదా పొడి చర్మం అనే మూడింట్లో ఏదో ఒకటిగా ఉంటుంది. ఓ మహిళది ఆయిలీ స్కిన్ అయితే... వయసు పెరుగుతున్న కొద్దీ అది క్రమంగా ఆయిలీ నుంచి నార్మల్కు మారవచ్చు. అదే... మరొకరి విషయంలో నార్మల్ స్కిన్ అయితే... అది నార్మల్ నుంచి పొడి చర్మానికి మారవచ్చు. ఆయా వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులేమిటి, ప్రతికూల మార్పుల నుంచి రక్షణ పొందడమెలా, సుదీర్ఘకాలం పాటు చర్మ రక్షణ ఎలాగో తెలుసుకుందాం. వేర్వేరు వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులెలా ఉంటాయో, వాటిని అధిగమించి మేనిని ఆరోగ్యంగా ఉంచుకునే రక్షణ చర్యలేమిటో చూద్దాం. టీనేజ్లో (అంటే 13 నుంచి 19 ఏళ్ల వయసు వరకు)...ఈ వయసులోనే అమ్మాయిల్లో రుతుక్రమం మొదలవుతుంది. ఈ టైమ్లో వాళ్లలో ఈస్ట్రోజెన్, యాండ్రోజెన్ హార్మోన్ల మోతాదులు మారిపోతాయి. దాంతో చర్మం కాస్తంత జిడ్డుగా (ఆయిలీగా) మారుతుంది. ఫలితంగా మొటిమలు, బ్లాక్హెడ్స్ కనిపిస్తాయి. కొందరిలో ఆ మొటిమలు పగిలిపోతాయి. ఇవి ముఖ్యంగా ముఖంలోని నుదురు, ముక్కు, చుబుకం వంటి టీ–జోన్లో ఇవి వస్తుంటాయి.రక్షణ ఇలా: ఇలాంటి మొటిమల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం... జిడ్డు తొలగి΄ోయేలా మైల్డ్ సోప్తో ముఖం కడుక్కుంటూ ఉండటం, అన్ని పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవడం, కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుండటం, వీలైతే డాక్టర్ సలహాతో జిడ్డు తొలగేందుకు తగిన క్లెన్సింగ్ ఉత్పాదనలు వాడటం చేయాలి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వరకు... హార్మోన్లలో సమతౌల్యత ఏర్పడే వయసు ఇది. ఈ సమయంలో జిడ్డు చర్మం చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశముంది. అయితే ఈ వయసులో కొన్ని రకాల ఒత్తిడులు పెరగడం జరుగుతుంది. మొదట్లో అంతగా క్రమబద్ధంగా లేని రుతుక్రమం కాస్త ఓ గాడిన పడి, క్రమం తప్పకుండా రావడం మొదలవుతున్నప్పటికీ అయితే అప్పుడప్పుడూ కొన్నిసార్లు క్రమం తప్పడమూ కనిపిస్తుంది. ఈ వయసులోనే మహిళల గర్భధారణ జరగడం మామూలు. అలాంటి సందర్భాల్లో కొందరిలో ముఖం మీద నల్లమచ్చల్లా వచ్చే ‘క్లోయాస్మా’ అనే పిగ్మెంటేషన్ (మెలాస్మా లాంటిదే) గోధుమరంగులో ముఖం మీద కనిపిస్తుంది. రక్షణ ఇలా: ప్రధానంగా ఈ వయసులో ఉండే ఒత్తిడిని రిలాక్సేషన్ టెక్నిక్స్తో అధిగ మించి ప్రశాంతంగా ఉండాలి. ఇక గర్భధారణ సమయంలో కనిపించే పిగ్మెంటేషన్ గురించి అంతగా ఆందోళన కూడా అక్కర్లేదు. ప్రసవం తర్వాత దానంతట అదే తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. ఒంటికి తగినంత ద్రవాహారం అందేలా మంచినీళ్లు, కొబ్బరినీళ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎండలోకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్ ప్రతి రెండు మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి. 40వ పడిలో... మహిళల్లో తమ నలభైల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రవించే మోతాదు క్రమంగా తగ్గడం మొదలవుతుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్ అనే ప్రోటీన్ తగ్గడం వల్ల చర్మం తమ బిగువు కోల్పోవడం మొదలై వదులుగా కనిపించడం ప్రారంభమవుతుంటుంది. ఈ కొలాజెన్, అలాగే దేహంలో ఉండే తేమ తగ్గుతుండటం వల్ల ముఖంలో, చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో సన్నటి గీతలుగా కనిపించడం మొదలవుతుంది. ఆ గీతలు క్రమంగా లోతుగా మారడం, చర్మం బాగా వదులయ్యాక ముడతలుగా కనిపిస్తుంది.రక్షణ ఇలా: అందుకే ఇలా చర్మం డల్గా, వేలాడటం మొదలవ్వడానికి ముందే దేహానికి కొలాజెన్ అందించే మంచి ఆహారం, వేలడకుండా మంచి వ్యాయామం అందించాలి. తాము తీసుకునే పోషకాల్లో కొలాజెన్ అందించే ఆహారాలైన చేపలు, నట్స్, విటమిన్–సి పుష్కలంగా ఉండే తాజాపండ్లు తీసుకోవాలి. దీంతో చర్మం ఈ వయసులోనూ బిగుతుగా, మేనిలో మంచి మెరుపుతో ఉంటుంది. మరికొంతకాలం చర్మం యౌవనంతో కనిపిస్తుంటుంది. 50వ పడి మొదలుకొని... ఆ పైన...ఈ వయసులో మెనోపాజ్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. దాంతో దేహంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదు తగ్గుతుంది. చర్మం పలుచబారడం, పారదర్శకంగా మారుతుండటం దాంతో లోపలి రక్తనాళాలు కనిపిస్తున్నట్లుగా ఉండటం, చర్మం పొడిబారడం జరుగుతుంది. చర్మంపైన గీతలు మరింత లోతుగా మారుతూ, క్రమంగా ముడుతలు కనిపిస్తుంటాయి. ఫలితంగా ఏజింగ్ వల్ల వచ్చే మార్పులు మరింత స్పష్టమవుతుంటాయి. వయసు పైబడటం వల్ల కనిపించే అన్ని మార్పులూ వ్యక్తమవుతుంటాయి. ఈ వయసు రాగానే చర్మం తనంతట తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గడం మొదలువుతుంది. రక్షణ ఇలా: ఈ ముడతలు కనిపించడం మరింత ఆలస్యమయ్యేలా చేసుకునేందుకు అవసరమైన కొన్ని ప్రక్రియలను అనుసరించాలి. ఇందులో భాగంగా... ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరికే చేపల వంటి ఆహారాలు, అన్ని పోషకాలు అందే సమతులాహారం అవసరం. ఈ వయసులో తేమ తగ్గి చర్మం పొడిగా మారడం వల్ల గీతలు మరింత లోతుగా మారడం, ముడుతలు స్పష్టంగా కనిపించడం జరుగుతుంటాయి కాబట్టి దేహానికి అవసరమైన తేమను అందించేలా మాయిశ్చరైజర్ క్రీములు వాడాలి. ఇక చర్మం బిగుతుగా మారడానికీ, కొలాజెన్ తగ్గే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడానికి బాగా తోడ్పడేది తగినంత వ్యాయామం. ఈ అన్ని వయసుల్లోనూ... ఆ వయసుకు తగినంత తీవ్రతతో శరీరానికి తగనంత శ్రమ తెలిసేలా వ్యాయామం చేయడం వల్ల చర్మం మరింత కాలం నిగారింపుతో, మరింత మెరుపుతో కనిపిస్తుంటుంది. వీటితోపాటు కాస్త ఏజింగ్ ఛాయలు కనిపిస్తుండగానే వాటిని ఆలస్యం చేయడానికి, చర్మం ఆరోగ్యంగా మంచి నిగారింపుతో కనిపించడానికి డర్మటాలజిస్టుల సలహా మేరకు వారికి సరిపడే కెమికల్ పీల్స్, మైక్రోనీడిలింగ్స్, ఆర్ఎఫ్, బొటాక్స్, ఫిల్లర్స్ వంటి పలు చికిత్సలు చేయించుకోవచ్చు.డా. విజయశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..? నెట్టింట వైరల్) -
చర్మం మృదువుగా కోమలంగా ఉండాలంటే..!
పొడి చర్మం గలవారు ఏ ఫేస్ ప్యాక్ పడితే అది వేసుకోవడం మంచిది కాదు. అందులోనూ వాళ్ల చర్మం డ్రైగా అయిపోయి, ర్యాషస్ ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి వారు చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేసే ఫేస్ ప్యాక్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీళ్లు ఆయిల్తో కూడిన ప్యాక్లు ఉపయోగిస్తే చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది. అందుకోసం హెల్ప్ అయ్యే బెస్ట్ ఫేస్ ప్యాక్లు ఏంటో చూద్దామా..!.పూలలోని పుప్పొడి, నల్లనువ్వులు, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్వాటర్తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతిమంతమవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. ఫలితంగా మృతకణాలు తొలగి΄ోయి, చర్మం మృదువుగా మారుతుంది. మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ΄్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్తో..) -
మసాజ్ రోలర్: వయసు పైబడినట్లు కనిపడనివ్వదు..!
వయసు ప్రభావం చర్మంపై కనిపించకుండా ఉండాలంటే, మర్దనను మించినది లేదు. రకరకాల తైలాలతో శరీరాన్ని మర్దన చేసే పద్ధతులు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఏ తైలాలను ఉపయోగించినా, ఇతర ద్రావణాలను ఉపయోగించినా, చర్మం లోలోతుల్లోకి చేరితేనే ఫలితం ఉంటుంది. ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన సాధనమే ఈ డెర్మా మసాజ్ రోలర్. మర్దనకు అవసరమైన తైలాలు లేదా సీరమ్లు నింపుకోవడానికి ప్రత్యేకమైన మినీకంటైనర్తో రూపొందిన ఈ పరికరం పైభాగంలో రోలర్ హెడ్కు అన్నివైపులా టిటానియం నీడిల్స్ ఉంటాయి. దీనిని చర్మానికి ఆనించి, మర్దన చేసుకునేటప్పుడు రోలర్ గుండ్రంగా తిరుగుతుంది. దాంతో దీనికి ఉన్న నీడిల్స్ చర్మాన్ని లోతుగా ఒత్తి, రక్తనాళాలను ఉత్తేజితం చేస్తాయి. ఈ రోలర్తో ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకోవచ్చు. ఇది ఎలాంటి నొప్పిని కలిగించదు. నుదురు, బుగ్గలు, ముక్కు, పెదవులు, గడ్డం, చేతులు, పొట్ట వంటి భాగాల్లో ఈ రోలర్తో కావలసిన నూనె లేదా సీరమ్ ఉపయోగించి, మర్దన చేసుకోవచ్చు. ఇది కేశసంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. తలపై కూడా దీనితో మర్దన చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగించిన తర్వాత రోలర్ను, కంటైనర్ను వేరుచేసి, శుభ్రం చేసుకున్న తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచి, ఆరబెట్టుకోవాలి. ఈ రోలర్తో ట్రాన్స్పరెంట్ క్యాప్ లభిస్తుంది. వాడకం పూర్తయ్యాక రోలర్కు క్యాప్ పెట్టుకున్నట్లయితే, దీనిపై దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి. (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
ముఖంలోని డల్నెస్ని తరిమేద్దామిలా..!
పర్యావరణ కాలుష్యం కారణంగా పెద్దవాళ్లకైన, యువతకి చర్మం డల్గా మారి అందవిహీనంగా కనిపిస్తోంది. దీంతోపాటు ముడతలు, కళ్లకింద నలుపు మరింత అసహ్యంగా మారిపోతుంది స్కిన్. అలాంటి డల్నెస్ చర్మాన్ని మిల మిల మెరిసేలా యవ్వనపు కాంతిని సంతరించుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి మరి...కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లై చేస్తూ, మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. నిస్తేజంగా మారిన ముఖ చర్మం జీవకళతో తొణికిసలాడుతుంది. టీ స్పూన్ టొమాటో గుజ్జు, శనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం, కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్లమీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని ముఖ చర్మం కళకళలాడుతుంది. ఉప్పు కంటెంట్ లేని టేబుల్ స్పూన్ బటర్ని బ్లెండ్ చేయాలి. అందులో స్ట్రాబెర్రీ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..) -
చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్లు..!
ఇంట్లో మనం అనునిత్యం ఉపయోగించేవే చక్కటి సౌందర్య సాధనాలుగా పనికొస్తాయి. వాటితో చక్కటి మెరిసే చర్మాన్ని పొందొచ్చు కూడా. అయితే ఎలాంటి చర్మం కలవారికి ఏది బెటర్ అనేది చాలామంది సరైన అవగాహన ఉండదు. అలాంటివారు సౌందర్య నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు ఫాలో అయితే సరి. మరి అవేంటో చూద్దామా..!..పాది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ద్రాక్షపండ్లను, నిమ్మ రసాన్ని, కోడిగుడ్డు తెల్లసొనను బ్లెండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డు చర్మానికి వేయాల్సిన ప్యాక్. నిమ్మరసం నేచురల్ క్లెన్సర్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానీయకుండా రక్షిస్తుంది. దీనిని పొడి చర్మానికి కాని నార్మల్ స్కిన్కు కాని వాడితే మరింత పొడిబారే అవకాశం ఉంది.రకరకాల పండ్లను, సౌందర్య సాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకోవడానికి సమయం, సహనం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది కూడా పొడి చర్మానికి పనికిరాదు.ఒక టీ స్పూన్ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటబుల్ ఆయిల్లను బాగా కలిపి ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు. (చదవండి: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..! సమస్యను బయటపెట్టిన ప్రియాంక చోప్రా -
గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో!
అందమైన, మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇది వారి వారి జీవన శైలి, జెనెటిక్ ప్రభావాలు, పని పరిస్థితులు, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్న రంగు, ప్రకాశవంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా శ్రమ, ఓర్పు అవసరం అనడంలో ఆశ్చర్యం లేదు. దీని కోసం సెలబ్రిటీలు చాలా కేర్ తీసుకుంటారు. వారిలో గ్లోబల్ పాప్ స్టార్, జెన్నీ కిమ్ ఒకరు. కిమ్ లాంటి షైనింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామా?గ్లోబల్ స్టార్, జెన్నీ కిమ్ ముఖం మచ్చలేని చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది. బ్లాక్పింక్గా పేరొందిన జెన్సీ మచ్చలేని, మెరిసే చర్మానికి పాపులర్. అసలు ఆమె స్కిన్ టోన్ చూసిన సౌందర్య నిపుణులు, అభిమానులు ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన ముఖ సౌందర్యం ఆమె సొంతం.చర్మ సంరక్షణకోసం ఆమె ఏం చేస్తుంది?జెన్నీ సహజమైన మెరుపు కోసం, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్కిన్కేర్కు ఆమె అనుసరించే పద్ధతులు చాలా సరళమైనవి, పైగా ప్రభావ వంతమైవి. ఏదైనా పెద్ద ఈవెంట్లకు ముందు ఆమె ముఖాన్ని ఐసింగ్ (ఐస్వాటర్లో ఫేస్ను ముంచడం) చేస్తుంది. డబుల్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్ వంటి ముఖ్యమైన పద్ధతులను పాటిస్తుంది. ప్రీ-ఈవెంట్ బ్యూటీ హ్యాక్ సందర్భంగా తన బ్యూటీ సీక్రెట్స్ను పంచుకుంది. ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు, కేవలం ఐస్-కోల్డ్ వాటర్ లాంటివి కూడా సరిపోతాయని తెలిపింది.ఐస్ వాటర్ ట్రిక్ఏదైనా ప్రధాన కార్యక్రమానికి ముందు తన ముఖాన్ని ఐస్ వాటర్ గిన్నెలో కాసేపు ఉంచుతుంది. ఈ చర్మ సంరక్షణలో పురాతన ట్రిక్ తనకు చాలా ఇష్టమైనదనీ, ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంతోపాటు, ఉబ్బును తగ్గించి, మెరుపును పెంచుతుందని తెలిపింది.ఈ టెక్నిక్ను స్కిన్కేర్ ప్రిపరేషన్ స్టెప్గా ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రయోజనాలు మేకప్కు మించి అందంగా చేస్తాయని పేర్కొంది. అలాగే చల్లని నీరు రక్త నాళాలను టైట్ చేస్తుందనీ, చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుందని చెప్పింది. తద్వారా ముఖంలోని చర్మానికి తక్షణ బూస్ట్ ఇస్తుందని వివరించింది.హైడ్రేషన్ కోసం ఫేస్ మాస్క్జెన్నీ ఫేస్ మాస్క్లకు పెద్ద అభిమాని, హైడ్రేషన్ , పోషణను నిర్వహించడానికి ఈమాస్క్ వేసుకోవడం దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటుందట. ఫేస్ మాస్క్లు, ముఖ్యంగా షీట్ మాస్క్లు, కొరియన్ స్కిన్కేర్లో ప్రధానమైనవి. ఇవి చర్మం తాజాగా ఉండటానికి సహాయపడతాయి.డీప్ క్లీన్ స్కిన్ కోసం డబుల్ క్లెన్సింగ్జెన్నీ స్కిన్కేర్ రొటీన్లో మరో ముఖ్యమైన భాగం డబుల్ క్లెన్సింగ్. దీని కోసం ముందుగా మేకప్, సన్స్క్రీన్ అదనపు నూనెలను తొలగించడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్ను ఉపయోగిస్తుందట. ఆ తరువాత మురికి మలినాలను తొలగించడానికి వాటర్ ఆధారిత క్లెన్సర్ను వాడుతుంది. డబుల్ క్లెన్సింగ్ చర్మం అవసరమైన తేమను తొలగించకుండా పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!స్మూత్ స్కిన్ కోసం రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్జెన్నీ తన చర్మాన్ని మృదువుగా , మృత చర్మ కణాలను తొలగించుకునేందుకు ఎక్స్ఫోలియేషన్ ( స్క్రబ్బింగ్) రొటీన్గా ఆచరిస్తుంది. ఎక్స్ఫోలియేటింగ్ పోర్స్ను ఓపెన్ చేసి, ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మనం వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణను మెరుగుపరుస్తుంది. అతిగా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పరిమితంగా ఈ పద్థతిని పాటిస్తుంది. ఐ క్రీమ్లు , సీరమ్లుజెన్నీ స్కిన్కేర్ రొటీన్లో కీలకమైన భాగం ఐ క్రీమ్లు ,సీరమ్. ఐ క్రీమ్లు ద్వారా కంటికింద మచ్చలు, కళ్ల ఉబ్బులాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మరోవైపు, సీరమ్స్ ద్వారా స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుందని, హెల్తీగా ఉంటుందని తెలిపింది. వీటిన్నితోపాటు, పుష్కలంగా నీరు తాగుతుంది. ఇక కొరియన్ చర్మ సంరక్షణలో ముఖ్య భాగమైన ప్రతీరోజూ సన్స్క్రీన్ను వాడుతుంది. దీని ద్వారా అకాల వృద్ధాప్యాన్ని కాకుండా ఉంటుందనీ, అలాగే హానికరమైన UV కిరణాల నుండి చర్మానికి రక్షణఉంటుందని వివరించింది.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
వయసును దాచేస్తుంది
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్. ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్లా, బ్రష్లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు. -
అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!
మెరిసే గ్లాస్స్కిన్ కోసం కే బ్యూటీ అంటూ రకరకలా బ్యూటీ ప్రొడక్ట్లు, సౌందర్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎలా ఉన్నా పూర్వకాలంలో కొందరు ప్రసిద్ధ రాణుల అందాల గరించి కవులు వర్ణించి చెప్పినట్లు కథకథలగా విన్నాం. అయితే ఆ రాణులు(Queens) ఆ కాలంలోనే తమ అందం కోసం ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో వింటే విస్తుపోతారు. అందుకోసం ఎలాంటి వాటిని సౌందర్య సాధనాలు(Beauty Secret)గా ఉపయోగించారో వింటో వామ్మో..! అని నోరెళ్లబెడతారు.క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం..ఈజిప్ట్ టోలెమిక రాజ్యం రాణి క్లియోపాత్రా(Cleopatra) చర్మ సంరక్షణ కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. అందుకోసం రోజు సేవకులు బిందెల కొద్ది గాడిద పాలను పితికి రెడి చేసేవారట. అవి విరిగిపోయాక వాటితో స్నానం చేసేదట. అందుకోసం దాదాపు 700 గాడిద పాలను వినియోగించేవారట. రోజంతో గాడిద పాల బాత్తో మునిగిపోయేదట. ఎలిసబెత్..దూడ మాంసం మాస్క్.. 'సిసి' అని పిలిచే ఆస్ట్రియా సామ్రాజ్ఞి ఎలిసబెత్(Elisabeth) 19 శతాబ్దంలో అందానికి ప్రసిద్ధి చెందిన రాణి. ఆమె మచ్చలేని తెల్లటి పింగాణీలా మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీల ప్యాక్ ముఖానికి రాసేదట. అలాగే చర్మ ఆరోగ్యం కోసం ఆలివ్ నూనెతో స్నానాలు చేసేదట. ముఖ్యం కాంతిగా కనిపించాలని దూడ చర్మాన్ని మాస్క్గా వేసుకుని నిద్రించేదట. ఇక ఆమె వొత్తైన జుట్టు గురించి కథలుకథలుగా చెప్పుకునేవారట. ప్రతి మూడు వారాలకొకసారి పచ్చి గుడ్లు, బ్రాందీల మిశ్రమాన్ని అప్లై చేసుకునేదట. అది ఆరిపోయే వరకు మారథాన్లా వాక్ చేస్తూ ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. మేరీ ఆంటోయినెట్: పావురాలు ఉడికించిన నీళ్లు..ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటోయినెట్(Marie Antoinette) అందం కోసం ఎన్నో విలక్షణమైన సౌందర్య సాధనాలను ఉపయోగించేది. ఆమె ముఖాన్ని యూ కాస్మెటిక్ డి పిజియన్తో కడుక్కునేదట. ఇది పండ్ల రసం, పూల సారం, మూడు ఫ్రెంచ్ రోల్స్, బోరాక్స్, 17 రోజల పాటు ఉడికించి పులియబెట్టిన ఎనిమిది పావురాల మిశ్రమం అట.ఎలిజబెత్ I: అత్యంత విషపూరితమైన సీసం..క్వీన్ ఎలిజబెత్ I(Elizabeth I) పాలనలో "వెనీషియన్ సెరూస్" అనే సీసాన్ని సౌందర్య సాధనంగా ఉపయోగించేవారట. ఈ సీసం(Lead), వెనిగర్ల మిశ్రమాన్ని తెల్లటి కాంతి వంతమైన రంగు కోసం చర్మానికి పూసేవారట. ఇవి చికెన్పాక్స్(తట్టు, అమ్మవారు) వంటి చర్మవ్యాధుల తాలుకా మచ్చలను నివారించి మచ్చలేని చర్మంలా ప్రకాశవంతంగా చేస్తుందట. అయితే ఈ రాణి చిన్నవయసులోనే అకాల మరణం చెందింది. అందుకు ఆమె ఉపయోగించిన ఈ సీసమే కారణమని అంటుంటారు. ఎందుకంటే లెడ్ సల్ఫైడ్(సీసం) ఖనిజ రూపమైన బ్లాక్ పౌడరే ఈ వెనీషియన్ సెరూస్. ఇది ముఖానికి పూస్తే లేత గులాబీ రంగు ఛాయతో మెరుస్తుంటుందట. అంతేగాదు కళ్లు చక్కగా కనిపించేలా ఐలైనర్లాగా కూడా వాడేవరట. అయితే ఇందులో ఉండే సీసం అత్యంత హానికరమైనది. ఇది అనారోగ్యం బారినపడేలా చేసి మరణానికి కారణమవుతుందంటూ ప్రస్తుతం బ్యాన్ చేశారు అధికారులు. (చదవండి: ఆ థెరపీ పేరెంట్స్ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!: ఇరాఖాన్) -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
వింటర్ ది డ్రాగన్: చలిపులి.. చర్మం వలుస్తోందా?
కొత్త ఏడాది తర్వాత క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయేమోగానీ... అందరూ బయటే ఎక్కువసేపు గడిపే సాయంత్రాలూ, పనులకు వెళ్లే ఉదయం వేళల్లో చలి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్లో వీచే కరకుగాలులు వాతావరణం నుంచి తేమను లాగేస్తాయి. అవి చర్మం నుంచి కూడా తేమను లాగేస్తుండం వల్ల మేను పొడిబారుతుంది. పొట్టుగా రాలుతుంది. ఇలాంటి సమస్యలన్నీ ఈ సీజన్లో అనివార్యంగా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరి చర్మ స్వభావం ఒక్కోలా ఉండటం వల్ల కొందరిలో చలికాలపు సమస్యలు ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ కనిపిస్తుంటాయి. ఈ చలి సమస్యల తీవ్రత చర్మంపై చాలా ఎక్కువగా ఉన్నవారిలో... వారి మేనిపై పగుళ్లు, చర్మం పొట్టుగా రాలడం వంటి లక్షణాలతో ఎక్జిమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సీజన్లో కనిపించే సమస్యల నుంచి రక్షణ పొందడమెలాగో తెలుసుకుందాం.కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులతో చలికాలపు తీవ్రత నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. అవి తెలుసుకునే ముందర ఈ కాలంలో వచ్చే కొన్ని సాధారణ చర్మ సమస్యలేమిటో చూద్దాం...ఇవీ సాధారణంగా కనిపించే చర్మ సమస్యలు... ఎక్జిమా ఫ్లేర్స్ : తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మం ప్రభావితమై ఎగ్జిమాలాంటి పగుళ్లు. చర్మం పొడిబారడం, పొట్టుగా రాలడం : బయటి చల్లగాలి కారణంగా దేహంలోని వేడిమి చర్మం నుంచి బయటకు వెళ్లడంతో తేమ కూడా బయటకు వెళ్తుంది. దాంతో చర్మం బాగా పొడిబారిపోవడమే కాకుండా, పొట్టుగా రాలుతుంది. పగిలే పెదవులు : సున్నితమైన పెదవుల చర్మమూ పగుళ్లువారుతుంది. చిల్ బ్లెయిన్స్ : చేతులూ, పాదాల మీద చర్మం కొన్నిచోట్ల (పగుళ్లు రాబోయే చోట) ఉబ్బెత్తుగా మారుతుంది. ఇలాంటి ఉబ్బెత్తు ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది. వీటిని చిల్ బ్లెయిన్స్ అంటారు. వింటర్ యాక్నె : జిడ్డు చర్మం వల్లనే మొటిమలు ఎక్కువగా వస్తాయన్న భావన చాలామందిలో ఉంటుంది. దీనికి భిన్నంగా వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడూ మొటిమలు వస్తాయి. వీటిని ‘వింటర్ యాక్నే’గా చెప్పవచ్చు.చర్మం ప్రభావితమైందని తెలిపే సూచనలివి... చలికాలపు చల్లగాలులకు చర్మం ప్రభావితమైనదనీ, దానికి ఇప్పుడు మరింత రక్షణాత్మక చర్యలు అవసరమని తెలియజేసేలక్షణాలివి... చర్మం ఎర్రబారడం, ఇలా ఎర్రబారిన చోట దురద రావడం ఏవైనా ఉపశమన చర్యలకోసం లేపనాల వంటివి రాసినప్పుడు ప్రభావితమైన చర్మభాగాలు మంటగా అనిపించడం చర్మం తీవ్రంగా పొడిబారినప్పుడు అక్కడ పొట్టులా రాలడం చర్మం నుంచి తేమ తొలగి΄ోవడంతో చర్మం బాగా బిగుతుగా ఉన్న ఫీలింగ్ ఏవైనా చర్మ సంరక్షణ లేపనాలు రాసినప్పుడు చర్మం ముట్టుకోనివ్వకపోవడం. చర్మంపై చలికాలపు దుష్ప్రభావాల నివారణ, రక్షణ చర్యలివి... తేమ పెరిగేలా చూసుకోవడం: చర్మం ఎప్పుడూ తేమ కోల్పోకుండా చూసుకునేందుకు క్రమం తప్పకుండా... హైలూరానిక్ యాసిడ్, షియా బటర్ లేదా సెరమైడ్స్ ఉండే మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మరవకూడని సన్ స్క్రీన్ : చలికాలపు ఎండవేడిమిలోనూ అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎండలోకి వెళ్లేముందర 30 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్ను చర్మంపై రాసుకోవడం మంచిది. హ్యుమిడిఫైయర్ వాడటం : గదిలోపల ఉండే పొడిదనాన్ని ఎదుర్కోవడం కోసం (మరీ ముఖ్యంగా బెడ్రూమ్ వంటి చోట్ల) క్రమం తప్పకుండా హ్యుమిడిఫైయర్ వాడాలి. గోరువెచ్చటి నీటితో స్నానం : వెచ్చటి నీళ్లతో స్నానం చేయడమన్నది స్నానం వేళ బాగున్నప్పటికీ ఆ తర్వాత చర్మం తీవ్రంగా పొడిబారి పగుళ్లుబారినట్లుంటుంది. దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే... స్నానం తర్వాత చర్మం బాగుంటుంది. గాఢమైన సౌందర్యసాధనాలు వద్దు చర్మంపై రాసుకునే ఉత్పాదనల్లో ఆల్కహాల్, రెటినాల్, మెంథాల్ వంటివి ఎక్కువ మోతాదుల్లో ఉన్నవి గానీ లేదా ఇతరత్రా గాఢమైన వాసనలు వచ్చే సౌందర్యసాధనాలకు బదులు తేలికపాటి సువాసన వెదజల్లే మైల్డ్ సౌందర్యసాధనాలు వాడుకోవడమే మంచిది. నీళ్లు తాగుతుండటం: చర్మం కోల్పోయే నీటి మోతాదులను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. మేని నిగారింపును పెంచే ఆహారాలు తీసుకోవడం: మేని నిగారింపును మరింతగా పెంచే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన... అన్ని రకాల ΄ోషకాలూ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకోవడం మేలు. వైద్యనిపుణులను సంప్రదించడం: పైన పేర్కొన్న అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్న తర్వాత కూడా చర్మంపై చలికాలపు దుష్ప్రభావాలు కనిపిస్తుంటే... తక్షణం చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. డా. బాల నాగ సింధూర కంభంపాటి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..! ) -
చర్మం పొడిబారుతోందా..?
చలికాలం చర్మం పొడిబారే సమస్య అధికంగా ఉంటుంది. పొడిచర్మం గలవారికి ఇది మరింత సమస్య. నూనె శాతం ఎక్కువ ఉండే క్రీములు, లోషన్లు ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అందుకు... ఇంట్లో చేసుకోదగిన సౌందర్యసాధనాలు..ఆలివ్ ఆయిల్తో... కోకోబటర్లో చర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టేబుల్ స్పూన్ కోకోబటర్– ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి, మెడకు రాసి 15–20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.పాల మీగడమీగడలో ఉండే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి. మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తే చర్మకాంతి పెరుగుతుంది.బొప్పాయివిటమిన్–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.బాదం నూనెకోకో బటర్, బాదం నరి సమపాళ్లలో తీసుకొని కలిపి, మిశ్రమం తయారు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. చర్మం పొడిబారే సమస్య దరిచేరదు. (చదవండి: గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది) -
ఎర్ర కలబందతో ఎన్నో ప్రయోజనాలు : తెలిస్తే, అస్సలు వదలరు!
కలబంద ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటివరకూ చాలా విన్నాం. తరతరాలుగా సౌందర్య పోషణలో,చర్మ సంరక్షణలో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోవలోకి ఇపుడు మరో కొత్త రకం కలబంద వచ్చి చేరింది. అదే రెడ్ కలబంద. ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తోంది. ముదురు ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందిన ఈ రకంలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.రెడ్ కలబంద ప్రయోజనాలు:ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబంద ఎక్కువ ఔషధ గుణాలు, ప్రయోజనాలున్నాయి. అందుకే ‘కింగ్ ఆఫ్ అలోవెరా’గా పేరు తెచ్చుకుంది. రెడ్ కలబంద వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.పోషకాలు: రెడ్ కలబందలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు, పాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిదట.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: ఎరుపు కలబంద ఆంథోసైనిన్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా దాని రంగు ఎర్రగా ఉంటుందని ర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జుష్యా భాటియా సారిన్ చెప్పారు. పర్యావరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి ఎరుపు కలబంద ఫేస్ సీరం ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొల్లాజెన్ చర్మం యవ్వనాన్ని కాపాడుతుంది. ఈ సమ్మేళనాలు కాలుష్యం, ఒత్తిడి, వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని. ఎర్ర కలబంద యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ మూలకాల శక్తివంతమైన మిశ్రమమని ఆమె తెలిపారు.రోగనిరోధక శక్తికి: ఎర్ర కలబంద రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.మేనికి మెరుపు : విటమిన్లు A, C , E చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా మారుస్తుంది. దీని ఆధారిత మాయిశ్చరైజర్ చర్మం యొక్క సహజ మెరుపును కాపాడుతుంది. చర్మానికి చల్లదనాన్నిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. రెడ్ కలడంద జ్యూస్తో శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలిన గాయాలు, గాయాలు, సోరియాసిస్ నివారణలో మేలు చేస్తుంది.గుండెకు మేలు : ఎర్ర కలబంద జ్యూస్తో గుండె ఆరోగ్యం బలపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్లో పరిమిత రూపంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా మారడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది ఎర్ర కలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. -
పిగ్మెంటేషన్ సమస్యా?!
చర్మంపై బ్లాక్ స్పాట్స్, మచ్చలు కనిపించడం అన్ని వయసుల వారిలోనూ వచ్చే సమస్యే. కానీ, ఇటీవల యువతలో ఈ సమస్యను ఎక్కువ చూస్తున్నాం. ఎవరిలో అధికం అంటే...అధిక బరువు ఉన్నవారిలో మెడపైన, వీపు పైన మచ్చలు కనిపిస్తుంటాయి. నేరుగా ఎండ బారిన పడేవారికి చేతులు, ముఖం, పాదాలపై ట్యాన్ ఏర్పడుతుంది. కొంతమందిలో విటమిన్ల లోపం వల్ల మంగు మచ్చలు కూడా వస్తున్నాయి. సాధారణంగా యుక్తవయసులో మొటిమలు వస్తుంటాయి. మొటిమలను గిల్లడం, వాటిలో ఉండే పస్ తీయడం.. వంటి వాటి వల్ల మచ్చలు, ఇంకొందరిలో చర్మంపై గుంటలు ఏర్పడవచ్చు. కొందరికి సరైన అవగాహన లేక బ్యూటీ ప్రొడక్ట్స్ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతిని మచ్చలు ఏర్పడతాయి. ఇంకొందరిలో చర్మం రకరకాల ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మచ్చలు ఏర్పడి, అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.త్వరగా గుర్తించి...ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. థైరాయిడ్, ఒబేసిటీ, పీసీఓడీ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి. ఎండ నేరుగా తాకకుండా సన్ స్క్రీన్ వాడటం ముఖ్యం. వీటిలో బ్లూ లైట్ కాంపొనెంట్ ఉండే సన్స్క్రీన్స్ బెటర్.మంగు మచ్చలు వస్తున్నాయనుకునేవారు వారి వంశంలో ఈ సమస్య ఉంటే, ముందే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మొటిమలు, యాక్నె వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని గిల్లకూడదు. పింపుల్స్ తగ్గే ఆయిట్మెంట్స్ను నిపుణుల సూచనల మేరకు వాడాలి. పింపుల్స్ ఉండేవారు పింపుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏజ్తోపాటు వస్తాయి అవే పోతాయి అనుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకొని, చికిత్స తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. క్యారట్, టొమాటో, విటమిన్– సి ఉన్న పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసి, ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వాడకూడదు. అవి మీ చర్మతత్త్వానికి సరిపడతాయా లేదా అని చూడాలి. ఇంట్లో సౌందర్య లేపనాలను ఉపయోగిస్తూ, పార్లర్ ఫేసియల్స్ చేయకూడదు. ఏదైనా ఒకదాని మీద మాత్రమే ఆధారపడాలి. (చదవండి: సక్సెస్ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!) -
వేడి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఏమవుతుందో తెలుసా?
వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటి (Hot water) స్నానం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖాన్ని (Face) వేడినీళ్లతో కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే వేడి వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందట. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందట. వేడి నీరు మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.వేడి-నీరు అకాల వృద్ధాప్యం వేడి నీరు ప్రశాంతంగా అనిపించినప్పటికీ, ముఖ చర్మంపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎలా అంటే.. మన శరీరంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే ముఖం చర్మం భిన్నంగా ఉంటుంది. చాలా సున్నితంగా, చిన్న కేశనాళికలతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత వంటి బాహ్య కారకాలకు తొందరగా ప్రభావితయ్యే ఉండే రంధ్రాలతో నిండి ఉంటుంది. వేడి నీరు అప్పటికపుడు ఊరటనిచ్చినా ఆ తరువాత అనేక సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.వేడి నీళ్లు ముఖంపై ఉండే సూక్ష్మకేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇరిటేషన్, చర్మం ఎర్రబారడం లాంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.నేచురల్ ఆయిల్స్కు నష్టంవేడి నీటి వలన ముఖంపై ఉండే సహజ నూనెలకు హాని కలుగుతుంది. ఇవి సెబమ్ను ఉత్పత్తి చేసి, తేమను కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. కానీ వేడి నీరు ఈ నూనెలకు నష్టం కలిగించి మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖం మీద చర్మం తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో చర్మం సహజత్వాన్ని కోల్పోయి, ముడతలు తొందరగా వస్తాయి. ఫలితంగా వయసుకుమించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్,ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అతినీలలోహిత (UV) కిరణాలు కొల్లాజెన్ ఎలాస్టిన్ను విచ్ఛిన్నం చేస్తాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు వంటి సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలలో, ఎండలేకపోయినా కూడా చర్మాన్ని రక్షించు కునేందుకు సన్ స్క్రీన్ వాడాలి. ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. అలాగే మొహాన్ని పదే పదే కడగడం వల్ల మెరుపు తగ్గిపోతుంది.కెమికల్స్తో కూడిన సబ్బులు, హానికరమైన రసాయన బ్యూటీ ప్రాడక్ట్స్ను అస్సలు వాడకూడదు.అలాగే అధిక కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ,చక్కెరలు, గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీయవచ్చు. కొల్లాజెన్ను దెబ్బతీసి, తొందరగా ముసలి తనం వచ్చేలా చేస్తుంది. అందుకే పిండి పదార్ధాలను తగ్గించి, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.ఎలాంటి మచ్చలు లేకుండా, మెరిసిపోతూ, ప్రకాశవంతమైన కాంప్లెక్షన్ రావాలంటే శుభ్రంగా తినాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారం, ముఖ్యంగా విటమిన్ సి, ఆకుకూరలు, సోయా, చిక్కుళ్ళు, చేపలు, చికెన్ తాజా పండ్లు తీసుకోవాలి. అవసరమైతే చర్మ ఆరోగ్యానికి, ముఖ్యంగా బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే సప్లిమెంట్లను తీసుకోవాలి. -
స్కిన్ గ్లో శాశ్వతంగా ఉండాలంటే..ఇలా చేయండి!
చర్మం నిగారింపును అందరూ కోరుకుంటారు. అందుకు సౌందర్య ఉత్పత్తుల వాడకం, ఫేషియల్స్, స్కిన్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో సరైన అవగాహన లేక ఉపయోగించే పద్ధతులు ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. ముఖ్యంగా.. మొటిమలు/యాక్నే సమస్య ఉన్నవారు పార్లర్లో ఫేషియల్స్ చేయించుకుంటారు. మళ్లీ ఇంట్లో కొన్ని రకాల మసాజ్లు చేస్తుంటారు. వీటివల్ల సమస్య మరింత పెరుగుతుంది. నిపుణుల ఆధ్వర్యంలో కెమికల్ పీల్ చేయించుకుంటారు. కానీ, ట్రీట్మెంట్కి ముందు–తర్వాత వాడే ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల సాధారణంగా ఉండే సమస్య మరింత పెరిగి, చర్మం దెబ్బతింటుంది.మచ్చలు తగ్గాలంటే..నలుపు/తెలుపు మచ్చలు కనిపించినప్పుడు మొదట సొంతంగా హోమ్ రెమిడీస్ చేస్తుంటారు. వీటి వల్ల కొన్ని రివర్స్ అవుతుంటాయి. దీర్ఘకాలపు సమస్యగా కూడా మారుతుంటాయి. క్రీములు, మెడిసిన్స్.. సమస్య మొదట్లోనే గుర్తించి, వాడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.లేజర్ చికిత్సమచ్చలకు, కొన్ని రకాల చర్మ సమస్యలకు లేజర్ చికిత్స అవసరం అవుతుంటుంది. చికిత్స తర్వాత సరైన క్రీములను ఉపయోగించకపోతే చర్మం పొడిబారుతుంది. కొత్త మచ్చలు కూడా పుట్టుకు వస్తుంటాయి. ఇదీ చదవండి: ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్ ప్రొడక్ట్స్ .. అలెర్జీలు ఆహారం పడకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో సరైనది ప్రొడక్ట్ ఉపయోగించక పోతే చర్మానికి అలాంటి అలెర్జీలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే, ఏదైనా కొత్త ప్రొడక్ట్ వాడాలనుకున్నప్పుడు ముందుగా చర్మంపై టెస్ట్ ప్యాచ్ చేసుకోవాలి. చలికాలం పొడి చర్మం గలవారికి స్కిన్ అలెర్జీ ఎక్కువ ఉంటుంది. క్రీములు, నూనెల వాడకంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాలి. చర్మం నిగారింపు, హెయిర్ సాఫ్ట్నెస్ కోసం పర్మనెంట్ గ్లో వంటి చికిత్సల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకునే ఆహారం, పానీయాలు, తమ శరీర తత్త్వానికి ఉపయోగపడే క్రీములను వాడుతూ ఉండాలి. – డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
కిడ్స్పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
చలికాలంలో మీ స్కిన్ మృదువుగా ఉండాలంటే.!
చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి. స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది. -
ఈ డివైజ్తో మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం..!
మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా టీనేజ్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. చిత్రంలోని ‘సోలావేవ్ లైట్ థెరపీ డివైస్’ ముఖంపై పేరుకున్న జిడ్డును, మొటిమలను, వాటి కారణంగా కలిగిన మచ్చలను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.ఈ డివైస్.. చర్మానికి పూర్తిగా సురక్షితమైనది. బ్లూ కలర్ లేదా రెడ్ కలర్ అనే రెండు ఆప్షన్స్తో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స అందిస్తుంది. దీన్ని సుమారు తొమ్మిదిసార్లు వినియోగిస్తే, 90 శాతం వరకు ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. పరికరాన్ని ఆఫ్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా ముందున్న బటన్ని ఒక సెకను పాటు ప్రెస్ చేసి ఉంచితే సరిపోతుంది. ఈ మెషిన్ని సుమారు 3 నిమిషాలు ఆన్ చేసి, ఆప్షన్ ఎంపిక చేసుకుని, సమస్య ఉన్న ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. నిజానికి ఈ డివైస్ ప్రతి మూడు నిమిషాలకొకసారి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇది వేలెడంత పొడవుతో చేతిలో ఇమిడేంత చిన్నగా ఉంటుంది. దాంతో దీన్ని పట్టుకోవడం, ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం చాలా సులభం. ముందుగా క్లీనింగ్ జెల్ని అవసరం అయిన చోట అప్లై చేసుకుని, మొటిమలు లేదా మచ్చలున్న భాగంలో ఈ డివైస్ హెడ్ని ఆనించి ఉంచితే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. దీని ధర 69 డాలర్లు (రూ.5,825). ఇలాంటి డివైస్లకు ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది. ముందే వినియోగదారుల రివ్యూస్ ఫాలో అయ్యి ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
మాయిశ్చరైజర్లు వాడుతున్నారా..!
చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. గోరువెచ్చని నీళ్లుఫుల్క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్లోనూ సన్స్క్రీన్ను ఉపయోగించాలి.రుద్దకూడదు..డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు. కొందరు స్నానానికి మైత్తటి కాయిర్ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం. పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి. కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి. సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.మేకప్కి ముందు మాయిశ్చరైజర్ మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్ను ఉపయోగించాలి. డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి. సూప్లు, జ్యూస్లు..ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్లు, జ్యూస్ల రూపంగా తీసుకోవచ్చు. – డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. -
శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?
శీతాకాలం అనంగానే అందరికి ఎందురయ్యే ప్రధాన సమస్య చర్య పొడిబారడం. దీని వల్ల దద్దుర్లు, ఒక విధమైన దురద మంట వస్తాయి. అలాగే చర్మం కూడా అసహ్యంగా మారిపోతుంది. తాకినప్పుడుల్లా గరుకుదనంతో మంటగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు . అదెలాగో చూద్దామా..!.టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. (చదవండి: పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ఆపిల్, అరటిపండ్లతో ఇలా చేయండి..!) -
అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికే ఐకానిక్గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ఇప్పటికి అంతే ఫిట్గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్. తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు. అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్కేర్లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్.(చదవండి: 'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?) -
మెరిసే మేని చాయను కాపాడుకోడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మేని ఛాయను కాపాడుకోవడం చాలాకష్టం. కాలుష్యం, సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షణ పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దామా! తక్షణ తాజాదనం కోసం రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మేనికి మర్దనా చేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పచ్చి పాలను కాటన్ బాల్తో అద్దుకొని, ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి కడిగేయాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడంతోపాటు శుభ్రపరుస్తుంది.చర్మంపై నుంచి సహజ నూనెలను ΄ోకుండా ఉండటానికి చర్మతత్వానికి సరి΄ోయే తేలిక΄ాటి, క్లెన్సర్ని ఉపయోగించాలి. ఓట్మీల్లో తేనె, కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ చేయాలి. మృత చర్మ కణాలను తొలగించడానికి, పోర్స్ను శుభ్రం చేయడానికి సున్నితంగా స్క్రబ్ చేయాలి.ప్రతిరోజూ కలబంద జెల్ను రాసి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం నునుపుగా, తేమగా ఉంటుంది. టేబుల్ స్పూన్ తేనెను, టేబుల్ స్పూన్ పెరుగుతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది.సగం అరటిపండును మెత్తగా చేసి, టీస్పూన్ తేనెతో కలపాలి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.కొద్దిగా గ్రీన్ టీని కాచి, చల్లబరచాలి. ఈ నీటిని దూదితో అద్దుకుంటూ, మేనికి పట్టించాలి. ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది. -
పండుగ వేళ ముఖం కాంతిగా, గ్లోగా కనిపించాలంటే..!
నవరాత్రులు, బతుకమ్మ సంబరాలతో కోలాహలంగా ఈ ఉండే ఈ సమయాన ముఖం డల్గా కాంతి విహీనంగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన ముఖంలో పండుగ కళ కనిపించేట్టుగా కాంతిగా కనిపించాలంటే ఈ చిన్ని టిప్స్ ఫాలో అయిపోండి. అందుకు పార్లర్ వెంట పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంట్లో దొరికే వాటితోనే ముఖం కాంతిమంతగా, గ్లోగా కనిపించేలా చెయ్యొచ్చు. అదె ఎలాగో సవిరంగా చూద్దాం..!పెరుగు మంచి ఎక్స్ఫోలియేటర్. ఇందులోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు టీ స్పూన్ పెరుగు తీసుకుని చర్మానికి పట్టించి వలయాకారంగా వేళ్లతో మర్దనా చేసి వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం మీద చారలా పట్టిన మురికి వదులుతుంది. దుమ్ముతో మూసుకు΄ోయిన చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం పొడిబారినట్లనిపిస్తే టీ స్పూన్ పెరుగు రాసి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. వార్ధక్యం దగ్గరయ్యే కొద్దీ చర్మం సాగేగుణాన్ని కోల్పోవడంతో చర్మం జారి΄ోతుంటుంది. పెరుగు రాయడం వల్ల చర్మంలో సాగేగుణం బాగుటుంది. చర్మం బిగుతుగా, కాంతివంతంగా యవ్వనంగా ఉంటుంది. పెరుగులోని యాంటీబయాటిక్ సుగుణాలు యాక్నేను తగ్గిస్తాయి. డీ విటమిన్, ప్రోటీన్, ప్రో బయాటిక్లు చర్మానికి పోణనిస్తాయి. పెరుగులో ఇవి కూడా ఉండడం వల్ల పెరుగు మంచి బ్యూటీ ప్రొడక్ట్. మార్కెట్లో దొరికే అనేకరకాల సాధనాలకు బదులు పెరుగును వాడడం మంచిది. శనగపిండి, తేనె వంటి పదార్థాలతో వేసుకునే ఫేస్ ఫ్యాక్లలో కూడా పెరుగును చేర్చుకోవచ్చు. చర్మం పొడిబారి మంటగా అనిపిస్తే ఓ కప్పు పెరుగు తీసుకుని చర్మమంతటికీ పట్టించి ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి. పిల్లలకు చర్మం మీద దద్దుర్లు వచ్చినప్పుడు క్రీమ్లు రాయడానికి ముందు ఒకసారి పెరుగు రాసి చూడండి. పెరుగు దేహ ఆరోగ్యానికి మంచి ఔషధం మాత్రమే కాదు, చర్మానికి మంచి పోషకం కూడా. రోజూ పెరుగుతో మర్దన చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు అందంగా మెరుస్తుంది. క్రమంగా తెల్లదనం సంతరించుకుంటుంది.చర్మం చాలాకాలం యౌవనంగా ఉండాటంటే... చక్కెర తక్కువగా తీసుకోవాలి. మిసమిసలాడే మేనికీ, చర్మానికీ సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్ను చక్కెర ఏం చేస్తుందో తెలియాలి. చక్కెరతో చేసిన తీపి పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో అది చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు సహాయపడే కొలాజెన్ను దెబ్బతీస్తుందనీ, దాంతో మితిమీరి తీపి తినేవాళ్ల చర్మం తన బిగువును కోల్పోవడం, దాంతో వయసుకంటే ముందరే సాగినట్లుగా అయిపోవడం జరుగుతుందని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ మెడికల్ స్కూల్ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అందుకే చాలాకాలం పాటు బిగువైన చర్మంతో యౌవనంగా కనిపించాలనుకునేవాళ్లు తీపి పదార్థాలు కాస్త తక్కువగా తీసుకోవడమే మేలు. (చదవండి: భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!) -
ఆరెంజ్ గింజలతో లాభాల గురించి తెలిస్తే, అస్సలు వదలరు!
ఆరోగ్యం కోసం నారింజ పండ్లను తింటాం. తొందరగా శక్తి రావాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. ఎందుకంటే ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్, మినరల్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలాగే నారింజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని సున్నిపిండిలో వాడతాం. హెర్బల్ టీలో కూడా వాడతామని మనకు తెలుసు. కానీ నారింజ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు న్నాయని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి!ఆరెంజ్ పండ్ల మాదిరిగానే, దాని గింజలు కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్, తాజాగా ఉంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇవి మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 116.2శాతం వీటిల్లో లభిస్తాయట. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్,అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడతాయి.ఎనర్జీ బూస్టర్ నారింజ గింజలలో పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల మానవ కణాలలో ఎక్కువ కాలం శక్తిని నిల్వ ఉంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిని వేగవంతం చేస్తాయి.గుండె ఆరోగ్యానికి మంచిది: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.జుట్టు: ఆరెంజ్ గింజల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను జుట్టుకు కండీషనర్గాపనిచేస్తుంది. నారింజ గింజలలో విటమిన్ సి, బయో-ఫ్లేవనాయిడ్స్కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. నారింజ గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)చర్మానికి మెరుపు: వీటిల్లో పుష్కలంగా లభించే విటమిన్ సీ చర్మానికి మేలు చేస్తుంది. సహజమైన మెరుపునిస్తుంది. అంతేకాదు ముడతలు, మచ్చలు తగ్గుతాయి. కంటి ఆరోగ్యం: వీటిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కళ్లలోని శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు-సంబంధిత కండరాల క్షీణతను నివారిస్తుంది. బీపీ నియంత్రణ: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కేన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్తో పోరాడడంలో సహాయ పడతాయి. ఇంట్లో చెడువాసన పోవాలంటేనారింజ గింజల నీటిని, కేక్ ఐసింగ్కు వాడతారు. అంతేకాదు సిట్రస్ సువాసన కోసం బాత్టబ్కు దీని ఆయిల్ వాడవచ్చు. ఇంట్లో అసహ్యకరమైన వాసనను పోగొట్టేందుకు డిఫ్యూజర్ నూనెగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.ఆరెంజ్ విత్తనాలను ఎలావాడాలి?చిరు చేదుగా ఉండే ఆరింజ గింజల నూనె, పొడి రూపంలో వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. -
వినాయక పందిళ్లలో సందడి చేసే మగువలూ.. మీకోసమే ఈ చిట్కాలు
వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ నవరాత్రులు గణనాథుని సేవలో మునిగిపోతారు..భక్తులు. గణేష్ మంటపాలలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చాలా హౌసింగ్ సొసైటీలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొలువుదీరే విఘ్ననాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలతోపాటు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. మగువలంతా శుభప్రదమైన ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగు దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మరీసందర్భంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులపై కూడా శ్రద్ధ పెట్టాలి. మరి అదెలాగో చూసేద్దాం.ఇంట్లో దొరికే వస్తువులతో మాస్క్, స్క్రబ్లను ప్రయత్నించాలి.ఓట్స్- పెరుగుటీ స్పూన్ ఓట్స్ను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులకు బాగా పట్టించాలి. ఆ తరువాత బాగా రుద్దుకని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. టొమాటో స్క్రబ్బాగా పండిన టొమాటో చక్కెర చల్లి, ముఖం, కాళ్లు, చేతులపై బాగా స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆర నిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలాగే చల్లని ఐస్ క్యూబ్తో మృదువుగా మసాజ్ చేసి, మాయిశ్చరైజర్ పూసుకోవాలి. టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది. టొమాట విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.శనగపిండి, పెరుగు,పసుపు శనగపిండిలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ లాగా పని చేస్తుంది.కీరదోసకాయ కీరదోసకాయ గుజ్జుని కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాల తరువాత వాష్ చేసుకోవాలి. కీర దోసకాయలలో ఉండే విటమిన్ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్ ని కంట్రోల్ చేస్తుంది. నిమ్మరసంలో కూడా సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం మెరిసే లాగా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.కాఫీ పౌడర్ఫిల్టర్ కాఫీ పౌడర్లో చక్కెర కలిపి మసాజ్ చేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే, ముఖానికి చేతులకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. చందమామలా మెరిసిపోతారు. -
పెరుగుతో అధిక బరువు చెక్, మేనికి మెరుపు
మారుతున్న జీవన శైలి రీత్యా అధిక బరువు, ఊబకాయం చాలామందిన వేధిస్తున్న సమస్య. అధిక బరువుతో బాధపడేవారికి ఏ ఆహారం తీసుకోవలన్నా భయంగానే ఉంటుంది. ఇది తింటే ఎన్ని కేలరీల బరువుపెరిగిపోతామో అని ఆందోళనపడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పెరుగు. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించే గుణాలుంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో వేగంగా బరువు తగ్గుతారుబరువు తగ్గాలని, ఆహారం తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. పోషకాలు ఎక్కువగా అందే ఆహారంపై దృష్టి పెట్టాలి. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినొచ్చు. పెరుగు తింటే బరువు బాధ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. పెరుగులో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ తినవచ్చు. దీంతో కడుపు నిండి ఉంటుందిన. పోషకాలు అందుతాయి. కీర, పుదీనా కలిపి తీసుకోవచ్చు. అలాగే కప్పు పెరుగుకు నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. వేడి చేసినపుడు పెరుగు, చక్కెర కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పెరుగు డీహైడ్రేషన్నుంచి కాపాడుతుంది. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.ఇలాంటి కొన్ని చిట్కాలతోపాటు రెగ్యులర్ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంఊ జంక్ ఫుడ్ ,ఆయిలీ ఫుడ్ జోలికి పోకూడదు. ఒత్తిడి లేని జీవనశైలికి అలవాటుపడాలి. సరిపడా నీళ్ళు నిద్రకూడా చాలా అవసరం అనేది గుర్తించాలి. -
బాడీ స్క్రబ్ : మీ శరీరానికి ఏది మంచిదో గుర్తించండి!
వాతావరణ పరిస్థితులు ,మారుతున్న జీవనశైలి కారణంగా శరీరం, ముఖ్యంగా ముఖం ట్యాన్కు గురవుతుంది. యూవీ కిరణాల ప్రభావంతో పాటు, ఫ్రీ రాడికల్స్ , కాలుష్యం కూడా దీనికి కారణం. కాబట్టి, ముఖంతో పాటు శరీరానికి కూడా సమానమైన శ్రద్ధ ,రక్షణ అవసరం. దీనికి క్రమం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అవసరం. కేవలం సబ్బు బార్ లేదా షవర్ జెల్ లాంటివాటికి మాత్రమే పరిమితం కాకుండా, సహజమైన ,యవ్వన రూపాన్ని తిరిగి పొందడానికి, శరీరానికి తగ్గట్టు బాడీ పాలిష్, బాడీ స్క్రబ్, ఎక్స్ఫోలియేషన్ లాంటి వాటిని ఎంచుకోవాలి.బాడీ పాలిషర్ లేదా బాడీ ఎక్స్ఫోలియేట్ ద్వారా రక్త ప్రసరణపెరుగుతుంది. బాడీ స్క్రబ్ డెడ్ స్కిన్ కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని శుభ్రపర్చి మెరిసేలా చేస్తుంది. కొల్లాజెన్ను ప్రేరేపిస్తుంది, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఎలా చేసుకోవాలి?అయితే చర్మం మీద మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్క్రబ్ను ప్రతిసారీ మార్కెట్లో కొనాల్సిన పనిలేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఓట్స్, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ పాలు, అర కప్పు నీరు తీసుకోవాలి. ఓట్స్ను నీటిలో ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత మిగిలిన అన్నింటినీ వేసి కలిపితే స్క్రబ్ రెడీ. ఈ ప్యాక్ వేసుకునే ముందు సబ్బుతో ముఖం, చేతులను కడిగి తుడుచుకోవాలి. ప్యాక్ను సమంగా పట్టించి పది లేదా పదిహేను నిమిషాల నాటు అలాగే ఉంచాలి. చర్మానికి పట్టినట్లు బిగుసుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా మర్దన చేయాలి. అలా పది నిమిషాల సేపు మర్దన చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి మార్కెట్లో దొరికే స్క్రబ్లాగ ఫ్రూట్ ఫ్లేవర్లతో కావాలనుకుంటే ఇష్టమైన పండ్ల గుజ్జును కూడా కలుపుకోవచ్చు. ఎలాంటి స్కిన్కు ఎలాంటి స్క్రబ్ వాడాలి?పొడిచర్మం వాళ్లు పుల్లటి పండ్ల జోలికి వెళ్లవకూడదు. పొడి (లేదా ఫ్లాకీ) చర్మానికి గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ను ఎంపిక చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ స్క్రబ్బింగ్ స్కిన్కేర్ రొటీన్కు దూరంగా ఉండాలి. వారానికి ఒకసారి, తేలికపాటి కెమికల్ ఎక్స్ఫోలియేటర్ను ప్రయత్నించవచ్చు. మెత్తగా, లాక్టిక్ యాసిడ్తో ఉండేలా చూసుకోవాలి.జిడ్డు చర్మం ఉన్నవారికి బాడీ స్క్రబ్ వలన ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్, బాంబూచార్కోల్ బెటర్. ఇవి కఠినమైన మచ్చల్న తొలగించి, మృదువైన వెల్వెట్ ఫీలింగ్ నిస్తాయి. ఇక సమస్య లేని, సాధారణమైన చర్మం ఉన్నవారికి pH బ్యాలెన్స్డ్ క్లెన్సర్ , స్క్రబ్ని ఉత్తమం. -
పచ్చిమిర్చితో బోలెడు ఆరోగ్యప్రయోజనాలు : కొవ్వును కరిగిస్తుంది కూడా
మన వంటకాల్లో పచ్చిమిర్చి లేదా గ్రీన్ చిల్లీ లేనిదే పని జరగదు. అయితే పచ్చి మిర్చితో కేవలం గూబ గుయ్యిమనే కారం, వంటకు రుచి వస్తుంది అనుకుంటే పొరపాటే. పచ్చిమిర్చితో బోలెడు లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. రోజూ ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందట. అవేంటో ఈ కథనంలో చూసేద్దామా! ఆరోగ్యానికి అద్భుతాలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి పచ్చి మిరపకాయలు కేవలం 100 గ్రాముల పచ్చిమిర్చిలో 109.1 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అంటే రోజులో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే. పొటాషియం కూడా లభిస్తుంది. పచ్చిమర్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులతో పోరాడుతుంది. వీటిల్లోని బయోయాక్టివ్ రసాయనం ‘క్యాప్సైసిన్’ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యాప్సైసిన్ అధిక రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు, తద్వారా గుండెపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.గట్ హెల్త్కు మంచిది క్యాప్సైసిన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ఆరోగ్యానికి సహజ నివారణగా చేస్తుంది.బరువు తగ్గడంలో గేమ్-ఛేంజర్లా పనిచేస్తుంది. క్యాప్సైసిన్ జీవక్రియను వేగవంతంచేసి కేలరీల బర్న్ను ప్రోత్సహిస్తుంది.విటమిన్ సీ, బీటా-కెరోటిన్తో నిండిన పచ్చి మిరపకాయ యాంటీఆక్సిడెంట్-రిచ్ ప్రొఫైల్, ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జలుబు , ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుందిసహజమైన 'ఫీల్-గుడ్' కెమికల్ పచ్చిమిర్చి. క్యాప్సైసిన్ ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక విటమిన్ సి మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను సంశ్లేషణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మార్చి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందివయస్సు-సంబంధిత కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పచ్చి మిరపకాయల్లో యాంటీమైక్రోబయల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ చర్మ వ్యాధుల నివారణలో ప్రభావవంతంగా చేస్తాయి. క్యాప్సైసిన్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. చర్మానికి సహజ మెరుపునిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్న వ్యక్తులు, పచ్చి మిరపకాయలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యమవుతుంది.పచ్చి మిరపకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి.కనుక వి ఇనుము గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. -
ఆరోగ్యంగా, అందంగా యంగ్ లుక్ కావాలా.. ఈ చిట్కాలు పాటించండి!
వయసు పైబడుతున్న కొద్దీ అందంగా, ఫిట్గా కనిపించమేమోననే బెంగ అందర్నీ పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే, కొన్ని సూచనలు పాటిస్తే ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మాన్ని కాపాడకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.వయసు 40 దాటే సరికి, ముఖ వర్చస్సు తగ్గడం, ముడతలు, చర్మం సాగడం వంటి సమస్యలు మొదలవుతాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ మార్పులు చాలా తొందరగా కనిపిస్తాయి. చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. పెళ్లి, పిల్లలు తరువాత స్త్రీలలో జరిగే శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం.జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని మాత్రమేకాదు, బయటికి మనం కనిపించే తీరును కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపించకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం కూడా కీలకమే. ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కటి ఆహారం, సరిపడా నిద్ర, క్రమం తప్పని వ్యాయామం. వ్యాయామం శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, ధ్యానం, ఏరోబిక్ వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం కొల్లాజెన్ ఉత్పత్తికి సాయం చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు ఆహారంలో చేర్చుకోవాలి.సరిపడా నీళ్లు తాగాలి.చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ అవసరం. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.ఎక్కువ ఎండకు, ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కాకూడదు. రసాయన రహిత క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖం చర్మం సాగిపోకుండా, బిగుతుగా ఉంచేందుకు ఫేషియల్ మాస్కులు కొంతవరకు పనిచేస్తాయి.అలాగే ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్ స్కిన్కేర్ ఉత్పత్తులు, యాంటీ ఏజింగ్ క్రీమ్లు, హైడ్రేటింగ్ సీరమ్లు, హైలురోనిక్ యాసిడ్, విటమిన్లు, నర్చరింగ్ ఆయిల్స్, షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్లను వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడవచ్చు.నోట్ : మనిషికి ముసలితనం రావడం, యవ్వనంలోని అందాన్ని కోల్పోవడం సహజం. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు, పోషకాలతో నిండిన ఆహారం, చక్కటి వ్యాయామం, ఇతర ఆరోగ్య సూత్రాలను పాటించాలి. మానసిక,శారీరక ఆరోగ్యం బాహ్య సౌందర్యాన్ని ప్రభావితం చేస్తాయి. -
వర్షాకాలంలోపాపాయి పువ్వులాంటి చర్మంకోసం : చిట్కాలివిగో!
మండించే ఎండల నుంచి ఉపశమనంగా వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షంతోపాటు కొన్ని రకాల ఇబ్బందులు, జలుబు, జ్వరం లాంటివి వెంటే వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్న పిల్లలు ఆరోగ్యం, చర్య సంరక్షణ చాలా అవసరం. ఈ నేపథ్యంలో మారికో లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా అందించే చిట్కాలను పరిశీలిద్దాం.పెద్దవారితో పోలిస్తే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది దాదాపు 30శాతం పల్చగా, సుకుమారంగా ఉంటుంది. పెళుసుగా , పొడిగా ఉండి తొందరగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం, ఇన్ఫెక్షన్లు లాంటి వివిధ చర్మ సమస్యలొస్తాయి. పాపాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత, మాయిశ్చరైజేషన్ రెండూ చాలా అవసరం. వర్జిన్(పచ్చి) కొబ్బరి నూతోనె పాపాయి మృదువైన చర్మానికి మసాజ్ చేయాలి.వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆధారిత నరిషింగ్ లోషన్ లేదా క్రీంతో క్రమం తప్పకుండా బేబీ బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. తల్లి పాలలో లభించే పోషకాలుండే ఈ ఆయిల్ శిశువు చర్మాన్ని 24 గంటలూ తేమగా ఉంచేలా సాయపడుతుంది. చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది.బలమైన ఎముకలు, కండరాల అభివృద్ధి , నరాల అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.దీనితో పాటు, బిడ్డకు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాలకి ఉష్ణోగ్రతలు తగ్గి, గాలిలో తేమ పెరుగుతుంది. దీంతో చిన్నారికి చెమటలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక వదులుగా ఉండే దుస్తులను వాడాలి. అలాగే సింథటిక్ దుస్తులు కాకుండా మెత్తటి కాటన్, చలికి రక్షణగా ఉలెన్ దుస్తులను వాడాలి. లేదంటే అధిక చెమటతో, పొక్కులు, దద్దుర్లు వస్తాయి. ఈ సీజన్లో డైపర్లను తరచుగా మార్చుతూ అక్కడి చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి. -
వర్షాకాలంలో చర్మ, ముఖ సౌందర్యం: ఈ పనులు అస్సలు చేయకండి!
మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్లేవాళ్లు, గొడుగు, రెయిన్కోట్ లాంటివి కచ్చితంగా తీసుకెళ్లాలి. ఈ సీజన్లో కూడా మాయిశ్చరైజర్ వాడాలా? నీళ్లు ఎక్కువ తాగాలా? తక్కువ తాగాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. వర్షాకాలం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు వర్షాకాలంలో హెవీ మేకప్ కాకుండా, తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి. ఫౌండేషన్ , కన్సీలర్ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్. టాక్సిన్స్ను బయటకు పంపడానికి, చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్ని వాడాలి.మేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్స్క్రీన్ని ఉపయోగించాలి.చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులుగా మీ చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్ను ఎంచుకోండి.తడి జుట్టును అలాగే వదిలేయకుండా సహజంగా ఆరేలా చూసుకోవడం. తప్పదు అనుకుంటే డ్రైయ్యర్ వాడాలి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కండీషనర్ లేదా హెయిర్ సీరమ్ని ఉపయోగించండి.అలాగే సున్నితమైన క్లెన్సర్ లేదా మేకప్ రిమూవర్ సాయంతో రాత్రి పడుకునేందుకు మేకప్ను పూర్తిగా తొలగించండి. లేదంటే ముఖంపై ఉన్న మేకప్ చర్మానికి హాని చేస్తుంది. మొటిమలు రావచ్చు. అందుకే తేనె వంటి ఇతర సహజ మాయిశ్చరైజర్ పదార్ధాలు ఉన్న సీరమ్ను ఎంచుకుంటే మంచిది. -
మాయిశ్చరైజర్లను ఇంజెక్ట్ చేయడం గురించి విన్నారా..?
చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడటం గురించి విన్నాం. ఇప్పుడూ ఏకంగా ముఖానికే నేరుగా ఇంజెక్ట్ చేస్తారట. దీనివల్ల ముఖం హైడ్రేటెడ్గా ఉండి మృదువుగా కనిపిస్తుంది. పైగా ఏజ్లెస్గా కనిపిస్తుందట. స్కిన్టోన్ కూడా చాలా బాగుంటదట . అసలేంటిది? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం!.ఇప్పుడూ చర్మ సంరక్షణపై విపరీతమైన అవగాహన, ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో బ్యూటీకి సంబంధించిన కొత్తకొత్త చికిత్సా విధానాలు వచ్చాయి. ఈ చర్మ సంరక్షణకు సంబంధించి సర్జరీలు, చికిత్సలు భారత్లో అతిపెద్ద మార్కెట్గా ఉంది. ముఖ్యంగా ఆసియ పసిఫిక్ ప్రాంతాలైన భారత్, చైనా, జపాన్లో బ్యూటీ ప్రొడక్ట్లు, చికిత్సలు మంచి ఆదాయాలు అందించే మార్కెట్. ఆ క్రమంలోనే కొత్త చర్మ సంరక్షణ ట్రెండ్ ఒకటి వచ్చింది. ఇంతకీ ఏంటీ ఇంజెక్షన్ మాయిశ్చరైజర్స్?ఇంజెక్ట్ చేసే మాయిశ్చరైజర్లను స్కిన్ బూస్టర్లుగా పిలుస్తారు. ఇవి హెలురోనిక్ యాసిడ్తో తయారు చేస్తారు. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మానికి హైడ్రేషన్, మృదుత్వాన్ని అందిస్తుంది. సాధారణ మాయిశ్చరైజర్ల మాదిరిగా కాకుండా సూదులతో ఇంజెక్ట్ చేయడం వల్ల ఇది చర్మం పొరల్లోకి లోతుగా చొచ్చుకునిపోయి కాంతిగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖాన్ని హైడ్రేటెడ్గా ఉంచి, ముఖంపై ఉండే గీతలు, ఆకృతి సమస్యలు, వృధాప్య ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని రిపేర్ చేసేలా తేమ స్థాయిని నింపుతుంది. ఇది యవ్వనపు ఛాయను అందించి, ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మాన్ని పునరుజ్జీవింపబడేలా చేస్తుంది. మిగతా కాస్మెటిక్ చికిత్స విధానాల కంటే ఇది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. చర్మం ఆకృతిని, రంగును మెరుగ్గా ఉంచుతుంది. ముఖం ఎప్పటికీ యవ్వనంలా కనిపించాలానుకునేవారికి ఈ పద్ధతి మేలు. వృధాప్య ఛాయలను నివారించాలనుకునే వారికి, యూబైలలో ఉన్న మహిళలకు ఈ చికిత్స విధానం బెస్ట్ ఆప్షన్. ఈ ఇంజెక్ట్ మాశ్చరైజర్లు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి. దీంతో చర్మానికి మంచి బూస్టింగ్ లభించడమే గాక మేను యవ్వనంగా మారేలా పునరుజ్జీవింప చేసి ముడతలను దూరం చేస్తుంది. అయితే ఈ చికిత్సను అర్హులైన నిపుణుల పరివేక్షణలో చేయించుకోవడం ఉత్తమం. (చదవండి: ఈ డివైజ్తో కాళ్లు నొప్పులు మాయం!) -
Post Holi skincare: హోలీ రంగులు వదిలించుకోండి ఇలా...
హోలీ పండుగ అంటే అందరీ సదరాగానే ఉంటుంది. పెద్దవాళ్లను సైతం చిన్నవాళ్లలా చిందులేసి ఆడేలా చేసే పండుగ ఇది. అయితే ఈ రోజు జల్లుకునే రకరకాల రంగుల వల్ల చర్మం ప్రభావితం కావొచ్చు. కొందరికి ఈ రంగులు రియాక్షన్ ఇస్తాయి. ర్యాషస్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ చక్కటి రంగులకేళిని ఆనందమయంగా జరుపుకునేలా మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిన్న చిట్కాలు పాటించండి. చక్కగా రంగులు జల్లుకుని ఎంజాయ్ చేసాక అసలైన సమస్య మొదలవ్వుతుంది. ముఖానికి రాసిన రంగులు ఓ పట్టాన పోక ఏం చేయాలో తోచక ఏడుపొచ్చేస్తుంది. అలాంటప్పడూ ఈ సింపుల్ చిట్కాలతో సమస్య నుంచి సులువుగా బయటపడండి. అవేంటంటే.. ముఖానికి ఆయిల్ని అప్లై చేస్తే సులభంగా రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది. అలాగే ముఖం క్లీన్ అయ్యాక కొన్ని గంటల వరకు ఏమి రాయకుండా ఫ్రీగా వదిలేయండి. అప్పుడు ముఖంపై రంధ్రాలు ఓపెన్ అయ్యి క్లీన్ అయ్యే అవకాశం ఉటుంది. హోలీ రంగులు రియాక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. హోలీ ఆడిన వెంటనే నేరుగా తలస్నానం అస్సలు చెయ్యొద్దు. ముందుగా రంగులు మీ చర్మం నుంచి పూర్తిగా పోయేలా చేయడం అనేది ముఖ్యం. అందుకోసం కొబ్బరి నూనె వంటి వాటితో క్లీన్ చేయండి. ఇది రంగుల నుంచి చర్మం ప్రభావితం కాకుండా చేయగలదు. అలాగే ముఖం ఆ రోజు కాస్త తేమగా ఉండేలా మంచి మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. పైగా సులభంగా రంగులు వచ్చేస్తాయి. (చదవండి: జాలీగా, హ్యాపీగా హోలీ : ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!) -
ఇలా చేస్తే చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది!
చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేగాదు వార్థప్యపు లక్షణాలకు కూడా చెక్పెట్టొచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్ చిట్కాలేంటంటే.. పాలతో చర్మ సౌందర్యం చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్లు లోషన్లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి. పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది. రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి. ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్థక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి. రెండు టీ స్పూన్ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్థక్య లక్షణాలు దూరమవుతాయి. (చదవండి: గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా? దానివల్ల ఎదురయ్యే సమస్యలివే..!) -
చలికాలంలో డైఫ్రూట్స్ తింటున్నారా? దీనిలోని విటమిన్-ఈ వల్ల..
చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. మామూలు సమయాల్లో కంటే చలికాలంలో చర్మానినికి ఎక్కువ కేర్ అవసరం. ఈ సీజన్లో చర్మంలో తేమ లేకపోవడంతో కాస్తంత గీరగానే తెల్లటి చారికలు పడటం కనిపిస్తుంది. అందుకే చలికాలంలో చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలంటే.. ►కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి. ► రెండు టేబుల్ స్పూన్ల తేనెలో, రెండు టీ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, గొంతుకు, మెడకు ప్యాక్ వేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ► చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా... మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం...స్మాగ్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తాజాగా మారుతుంది. ► స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు/గ్లిజరిన్ బేస్డ్ సబ్బు మంచిది. ► రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. అసలే చల్లటి వాతావరణం కారణంగా ఈ కాలంలో నీటిని తాగడం తగ్గుతుంది. కాబట్టి చర్మం పటుత్వాన్ని , తేమను కోల్పోయి మరింత గరుగ్గా కనిపిస్తుంది. అందుకే తగినంత నీరూ తాగాలి. పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు (గ్రీన్లీఫీ వెజిటబుల్స్) ఎక్కువగా తినాలి. ► ఈ సీజన్లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తాయి. ►డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ►చలికాలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ఫ్రీ రాడికల్స్తో పోరాడి, చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించే లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు, ఎండవల్ల కమిలిన చర్మానికి చికిత్సనందిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ను నిరోధించి ఇమ్యునిటీని పెంచడంతోపాటు చర్మ ఆరోగ్యాన్నిపెంపొందిస్తుంది. -
చర్మ సౌందర్యం కోసం 'ఆదిపురుష్' హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆ తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్కి వెళ్లిపోయిన కృతి అక్కడ వరుస హిట్స్తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలె ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించింది. సినిమా అంతగా ఆడకపోయినా సీతగా కృతికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే కృతి సినిమాల్లోలాగే బయట కూడా చాలా అందంగా మెరిసిపోతుంటుంది. తన స్కిన్కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ బ్యూటీ తాజాగా ఈమె తన చర్మ సౌందర్యం కోసం ఏం చేస్తుందో రివీల్ చేసేసింది. అంతేకాకుండా తాను స్కిన్కేర్లో ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతుందో కూడా బయటపెట్టేసింది. ఇందులో కొన్ని చాలా తక్కువ ధరకే ఉండటం విశేషం. సాధారణంగా హీరోయిన్లు చాలా బ్రాండెడ్ వస్తువులను, ఖరీధైన మేకప్, స్కిన్కేర్ను ఫాలో అవుతుంటారని అనుకుంటాం. కానీ కృతి రివీల్ చేసిన రొటీన్ చాలా సాధాసీదాగా ఉండటం నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం 7 స్టెప్స్ను ఎంచుకున్న కృతి తొలుత డబుల్ క్లెన్సింగ్తో మొదలుపెట్టి లిప్బామ్తో ముగించింది. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) -
పప్పులతో ఫేస్ప్యాక్.. ముఖం బంగారంలా వెలిగిపోతుంది
బ్యూటీ టిప్స్ ►ఎర్ర పప్పు మంచి ఎక్స్ఫోలియేటర్గా కూడా పనిచేస్తుంది. ఎర్రపప్పులోని పోషకాలు,విటమిన్లు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి. ఈ ఎర్రపప్పుతో ఫేస్ప్యాక్ వల్ల మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. ►కప్పు ఎర్రకందిపప్పు (మసూర్దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. ► మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. ► రెండుగంటలు నానిన నాలుగు టీస్పూన్ల పొట్టు పెసరపప్పుని పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్ పీల్ పొడి, టీస్పూను గంధం పొడి వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరవాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. హెయిర్ టిప్స్ ► టీస్పూను అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెవేసి అన్నిటినీ చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసి మర్దన చేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పలుచబడిన మాడు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతుంది. -
ఇది ఉంటే మేకప్ అవసరం లేదు. ఇంట్లోనే సెలూన్ లాంటి గ్లో
ఆరోగ్యవంతమైన మేని కాంతే అసలైన అందం. అందుకే చాలామంది మేకప్ ఇచ్చే మెరుపు కంటే .. సహజంగా వచ్చే గ్లోకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. చిత్రంలోని ఫేస్ రోలర్.. అలాంటి సౌందర్య సంరక్షణతో పాటు కండరాల నొప్పులనూ తగ్గిస్తుంది. బుగ్గలు, మెడ, నుదురు, కళ్లు, ముక్కు ఇలా ముఖంలోని అన్ని భాగాలను మసాజ్ చేసుకోవడంతో పాటు నిగారింపునూ పొందొచ్చు. అలాగే మెడ చుట్టు పేరుకుకున్న కొవ్వు తగ్గించి.. ముఖాన్ని V షేప్లోకి మార్చుకోవచ్చు.ఈ టూల్ ఇంట్లో ఉంటే.. బ్యూటీ సెలూన్కి వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాదు దీన్ని జిమ్కీ వెంట తీసుకెళ్లి.. మసాజ్ చేసుకోవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వినియోగించుకోవచ్చు. అవసరాన్ని బట్టి, ట్రీట్మెంట్ని బట్టి.. ఈ టూల్ చక్కగా యూజ్ అవుతుందని ఈ చిత్రాలను చూస్తే తెలిసిపోతుంది. వీల్స్, కొనలు, వంపులు ఇలా ఈ టూల్ అన్ని కోణాలతో .. చిత్రంలో చూపించిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. ధర సుమారు 16 డాలర్లు. అంటే 1,330 రూపాయలు. -
చలికాలంలో ఇలా చేస్తే చర్మం మృదువుగా, నిగనిగలాడుతుంది
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం మన చర్మంపై కూడా కనిపిస్తోంది. మార్పు, వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లు మొదలవుతుంది. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మన పెద్దలు కొన్ని గృహ చిట్కాలను పాటించేవారు. అవేమిటో తెలుసుకుందాం. పూర్వం చలికాలం రాగానే పెద్దవాళ్లు వంటికి వెన్నపూస లేదా నువ్వులనూనెను రాసుకుని ఎండలో కాసేపు నిలబడేవారు. దాంతో చర్మానికి తగిన పోషకాలు అంది తేమను కోల్పోకుండా మృదువుగా ఉండేది. ఇప్పుడు కూడా మనం అలా చేయవచ్చు. వాటితో పాటు మరికొన్ని చిట్కాలు చూద్దాం. చర్మానికి కలబంద: అలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎల్లప్పుడూ చర్మానికి మంచి నేస్తం వంటిది. అలోవెరాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ, గాయాలను నయం చేయడానికీ సహాయపడుతుంది. దీనికోసం చేయవలసిందల్లా రాత్రిపూట కాసింత కలబంద గుజ్జు... అదేనండీ... అలోవెరా జెల్తో ముఖానికి, శరీరానికి సున్నితంగా మసాజ్ చేస్తే సరి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరినూనె: తలకే కాదు. ఒంటికి కూడా... కొబ్బరినూనెను కేవలం తలకు మాత్రమే రాసుకునే తైలంగా చూస్తారు చాలామంది. అయితే కొబ్బరి నూనె చర్మానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. స్వచ్ఛమైన కొబ్బరినూనెను తీసుకుని ఒంటికి, ముఖానికి సున్నితంగా మసాజ్ చేయాలి. పడుకునే ముందు లేదా స్నానానికి అరగంట ముందు ఇలా చేస్తే చికాకు, అసౌకర్యం లేకుండా ఉంటుంది. అదేవిధంగా రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన నేతిని చర్మానికి రాసుకుంటూ ఉంటే కొద్దిరోజుల్లోనే చర్మం కోమలంగా... మృదువుగా నిగారింపును సంతరించుకుంటుంది. ఆవనూనె: పొడి బారిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా మార్చుకోవడానికి ఆవనూనెను చర్మంపై అప్లై చేయడం సర్వసాధారణం. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు ఏవీ రావు. పిల్లలకు రోజూ బేబీ ఆయిల్ లేదా వెన్న, నెయ్యి లేదా నువ్వులనూనెను ఒంటికి రాసి ఎండలో ఆరిన తర్వాత స్నానం చేయిస్తే చర్మం మృదువుగా ఉండడంతో పాటు ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. చలికాలంలో ఇలా చేయడం మంచిది. -
చలికాలంలో ఇలా చేస్తే.. మృదువుగా పాదాలు
చలికాలంలో చర్మంతో పాటు పాదాలు కూడా డ్రై అయిపోతాయి. దాని కారణంగా పగుళ్లు వస్తాయి. దాని ప్రభావం మరింత ఎక్కువైపోతుంది. నొప్పి ఎక్కువై.. ఒక్కోసారి రక్తం కూడా వచ్చేస్తుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యల కు ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టొచ్చు. అవేంటంటే.. ♦ రాత్రిపూట పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఆరిన తరువాత మసాజ్ క్రీమ్ లేదా నూనెతో ఐదు నిమిషాలపాటు మర్దనా చేస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి, పాదాలు మృదువుగా ఉంటాయి. ♦ అలాగే పాదాలు, మోచేతుల వద్ద చర్మం గట్టిపడి, గరుకుగా మారినప్పుడు... ఆరు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసంను సమపాళ్లలో కలిపి మర్ధనా చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే పాదాలు, మోచేతులు మృదువుగా మారుతాయి. ♦ మీ వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో గోరింట ఆకుల పేస్ట్ లేదా హెన్నా పొడిని నీటిలో కలుపుకుని పేస్టులా చేసుకుని పాదాలకు, వేళ్ల పగుళ్లలోనూ అప్లై చేయాలి. పూర్తిగా పొడిగా మారేంత వరకు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసి, టవల్తో తుడుచుకుంటే బాగుంటుంది. ♦ యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటివైరల్ లక్షణాల పరంగా పసుపు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే అతివలు కాళ్లకు పసుపు పూసుకోవడం మంచిది. పాదమంతటికీ రాసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం వేళ్లమధ్యలో రాసుకున్నా మంచిదే. ♦ పసుపు రాసుకోవడం కుదరని వారు ఉల్లిపాయ రసం తీసుకుని కాలి వేళ్ళ మధ్య మసాజ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువగా షూస్ ధరించే వాళ్ళకు ఉల్లిపాయ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది.. ♦ పుదీనా ఒక సహజ సిద్దమైన డియోడరెంట్ వలె ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మంచి క్రిమినాశక తత్వాలు కూడా పుదీనాకు ఉన్నాయి. పుదీనా రసాన్ని పాదాలకు, కాలి వేళ్లకు పూసుకుని ఆరిన తర్వాత సాక్స్ ధరించడం వల్ల పాదాలు పదిలంగా ఉంటాయి. -
బ్యూటీ టిప్స్: వేపాకుల పేస్ట్తో ఆ సమస్య తగ్గిపోతుంది
బ్యూటీ టిప్స్ ► టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది. ► ఒక టేబుల్ స్పూన్ కోకో బటర్కి రెండు టేబుల్ స్పూన్ల రోజ్వాటర్ని కలిపి పేస్ట్లా చేయాలి. ఆ పేస్ట్ని ఫేస్కి ప్యాక్లా వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్వాష్ చేసుకోవాలి. ► ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటే వేపాకులు బెస్ట్ సొల్యూషన్. వేపాకుల పొడిలో పసుపు, రోజ్వాటర్ కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. -
కిచెన్లో దొరికే వస్తువులతోనే అందంగా మెరిసిపోండిలా..
అందంగా కనిపించాలనే కోరికి ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందుకు తగ్గట్లు తగిన శ్రద్ద తీసుకోవాలి. స్కిన్ కేర్ కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అవగాహన చాలామందికి ఉండదు. చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. కానీ సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్టోన్ని సాఫ్ట్గా చేస్తుంది. ► ఒక బౌల్లో హాఫ్ కప్ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్ని మొహానికి అప్లయ్ చేసి.. 15 మినట్స్ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. ►ఒక కప్పు గ్రీన్ టీని బ్రూ చేసి చల్లారనివ్వండి. దీన్ని స్కిన్ టోనర్గా ఉపయోగించండి. ఇది స్కిట్టోన్ని పెంచుతుంది. ► అయితే ఎంత స్కిన్ కేర్ పాటించినా నిద్ర కూడా అంతకంటే ఎక్కువే ముఖ్యం. రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. -
పార్టీకి వెళుతున్నారా? ఈ ఫేస్ప్యాక్తో ఇన్స్టంట్ గ్లో
ఇన్స్టంట్ గ్లో ప్యాక్ ఎంత మంచి డ్రెస్, దానికి తగ్గ యాక్సెసరీస్ ధరించినా, ముఖం ప్రకాశవంతంగా ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటుంది. క్షణాల్లో మెరుపులీనేలా కనిపించే ఇన్స్టంట్ గ్లో ప్యాక్ను ప్రయత్నించి చక్కగా మెరిసిపోండి. ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, రెండు టేబుల్ స్పూన్ల చల్లటి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. -
అవిసె గింజలతో జుట్టు సిల్కీగా, స్ట్రెయిట్గా.. ఈ ప్యాక్ ట్రై చేయండి
బ్యూటీ టిప్స్ రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెలో టీ స్పూను పసుపు, టేబుల్ స్పూను పెరుగు, టేబుల్ స్పూను శనగపిండి, రెండు టీస్పూన్ల టొమాటో రసం, రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి ఐదునిమిషాలు రుద్దాలి. తరువాత నీటితో కడిగితే ట్యాన్ మొత్తం పోతుంది. స్ట్రెయిట్గా... సిల్కీగా... గ్లాసు నీటిలో రెండు టీసూన్ల అవిసె గింజలు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి పదినిమిషాలు మరిగించాలి. తరువాత వడగట్టి...పేస్టులాంటి పదార్థాన్ని తీసుకోవాలి. దీనిలో టేబుల్స్పూను కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి చివర్లవరకు పట్టించాలి. గంట తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ జుట్టుని స్ట్రెయిట్గా, సిల్కీగా మారుస్తుంది. -
ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బ్యూటీ టిప్స్ ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచండి. అనంతరం పేస్ట్ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్టోన్ని సాఫ్ట్గా చేస్తుంది. ►రెండు కర్పూరం బిళ్లలు, మూడు కప్పల వేపాకుల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి పేస్టుచేయాలి. ఈ మిశ్రమాన్ని చుండ్రు ఉన్న ప్రాంతంలో రాసి మర్దన చేయాలి. చుండ్రు బాధ క్రమంగా తగ్గిపోతుంది. కర్పూరం పొడిని ఆలివ్ నూనెలో వేసి కలిపి జుట్టుకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వారానికి మూడుసార్లు చేస్తే ఉపశమనం త్వరగా వస్తుంది. ► కాలివేళ్ల సందుల్లో గాలి తగలక పాచిపడుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...కాళ్లను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు టూత్పేస్టుని వేళ్ల సందులో రాయాలి. రోజూ పడుకునేముందు ఇలా చేస్తే కాళ్లు పాయవు. ► ఒక బౌల్లో హాఫ్ కప్ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్ని మొహానికి అప్లయ్ చేసి.. 15 మినట్స్ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. -
క్షణాల్లో ఫేస్మాస్క్ను రెడీ చేసే మెషీన్.. కొరియన్లు చేసేది ఇదే
నిజానికి ఫేస్ మాస్క్లతో స్కిన్ కేర్ పొందడం మంచి ప్రయత్నమే. కానీ వాటిని సిద్ధం చేసుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని సులభతరం చేస్తుంది ఈ లేటెస్ట్ ఫేస్ మాస్క్ డివైస్. ఇంట్లో తయారు చేసుకునే సాధారణ ఫేస్ మాస్క్ వేసుకుంటే.. అప్లై చేసుకునే సమయంలో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువవుతుంది. కొన్నిసార్లు సగం ఆరి.. సగం ఆరక ఇబ్బందవుతుంది. గుజ్జుమెత్తగా లేకుంటే ఉండాల్సిన సమయం కంటే ముందే రాలిపోతుంది. ఇలా ఒక్కటని కాదు.. ఫేస్ మాస్క్ విషయంలో అన్నీ సమస్యలే. అదే ఈ మెషిన్తో తయారైన మాస్క్ని క్లాత్ మాదిరి పట్టుకుని.. ముఖంపై సమాంతరంగా సులభంగా పరచుకోవచ్చు. పైగా ఈ మెషిన్ని మనం క్లీన్ చెయ్యాల్సిన పనిలేదు. సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఆన్ చేస్తే పది సెకన్లలో క్లీన్ అయిపోతుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని.. వైర్లెస్గా వాడుకోవచ్చు. ఎన్ని నీళ్లు పొయ్యాలి.. ఇన్గ్రీడియెంట్స్ ఏ మోతాదులో కలపాలి.. అనే సూచనలను వాయిస్ మోడ్లో ఇస్తూంటుంది ఈ మేకర్. అవసరం లేదనుకుంటే వాయిస్ రిమైండర్ ఆపేసుకోవచ్చు. ఇది సరిగ్గా రెండు నిమిషాల్లో మాస్క్కి కావాల్సిన పేస్ట్ని సిద్ధం చేస్తుంది. ఇందులో కూరగాయలు, పండ్లు, విటమిన్ టాబ్లెట్స్ వంటివి పేస్ట్లా చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 6 వేలరూపాయల పైమాటే. మాస్క్ ప్లేట్స్ని బట్టి.. అందులో లిక్విడ్ వేయగానే ఆయా షేప్ మాస్క్లు సిద్ధమవుతాయి. కళ్లు, ముక్కు, పెదవులకు ఇబ్బంది లేకుండా రూపొందిన ఫేస్ షేప్లో ఉండే ప్లేట్తో పాటు.. కళ్లు, ముక్కు, పెదవుల ఆకారంలో ఉండే ప్లేట్స్ కూడా డివైస్తో పాటు లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నింటిని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఫేషియల్ మెషిన్.. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది
స్కిన్ కేర్లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్లో ట్రీట్మెంట్లు.. ఇలా రకరకాల పద్దతులను పాటిస్తుంటారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్.. ఈ హ్యాండ్హెల్డ్ ఫేషియల్ మసాజర్. బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్లా ఉపయోగపడుతుంది.ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఫేస్ అండ్ స్కిన్ కేర్ థెరపీ టూల్.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్ఈడీ లైట్ థెరపీ హెడ్.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్ బ్యూటీ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. హాట్ అండ్ కోల్డ్ రింగ్స్తో పాటు క్లీనింగ్ రింగ్నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్ టెక్నాలజీతో ఈ ఫేషియల్ మెషిన్.. కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి.. స్కిన్ టోన్ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది.ఈ మెషిన్ ని భద్రపరచు కోవడానికి సాఫ్ట్ కేరింగ్ బ్యాగ్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బీ చార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇలాంటి డివైజెస్ను ఆన్లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్ని బట్టి.. అదనపు రింగ్స్ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. -
పిగ్మెంటేషన్, బ్లాక్హెడ్స్తో బాధపడుతున్నారా? ఈ ప్యాక్ వేసుకోండి
బ్యూటీ టిప్స్ ►అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేసి 20 నిమిషాల ΄ాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనితో పాటు ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి. ►ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను చక్కగా కలిపి ముఖానికి ΄్యాక్లా అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా తరచు చేస్తుండడం వల్ల. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ►పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. ఇది కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. బాగా తర్వాత తేలికపాటి క్లెన్సర్ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. -
నల్ల ద్రాక్షతో ఫేస్ప్యాక్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?
జిడ్డుతత్వం ఉన్న చర్మానికి గ్రేప్స్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డు పోతుంది. పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో టేబుల్ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొన్ని నల్ల ద్రాక్షపళ్లను బాగా స్మాష్ చేసిగుజ్జు తీయాలి. దానికి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై మృత కణాలన్నీ తొలగిపోతాయి. 5 వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతిమంతంగా.. యంగ్లుక్తో కనిపిస్తుంది. ఒక కప్పు ద్రాక్ష పళ్లు తీసుకుని చేతులతో పిసికి గుజ్జులా చేయాలి. వాటిలో రెండు చెంచాల పాలు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు తాలూకు మచ్చలు పోయి చర్మం మృదువుగా మెరుపులీనుతుంటుంది. చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. -
ముఖమంతా మొటిమలు, బయటకు వెళ్లలేకపోతున్నా.. ఏం చేయాలి?
‘బేబీ... పొద్దున లేచిందగ్గర్నుంచీ అద్దం ముందేనా? త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్లు’ అని అరిచింది అరవింద. ‘వెళ్తాలేమ్మా’ అని సమాధానమిచ్చింది మానవి. కానీ అద్దం ముందు నుంచి కదల్లేదు. తన మొహంపై మొటిమలు అసహ్యంగా ఉన్నాయని బాధపడుతూ కూర్చుంది. ‘బేబీ... కాలేజీ బస్ వచ్చిందమ్మా’ అని కేకేశాడు ఆనంద్. ‘వస్తున్నా డాడీ... కాస్త ఆగమని చెప్పు’ అని హడావుడిగా తయారై బస్సెక్కింది. ∙∙ ‘హాయ్... బేబీ’ అని పలకరించింది అర్పిత. ‘హాయ్.. అర్పీ’ ‘హేయ్... కరోనా పొయ్యి ఏడాదైందే. ఇంకా ఆ మాస్క్ ఏంటే బాబూ?’ ‘ఏం చెప్పమంటావే... మొహమంతా పింపుల్స్. ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా తగ్గడంలేదు. డాక్టర్ని కలిసి మెడిసిన్స్ కూడా వాడా. అయినా నో రిలీఫ్.’ ‘హ్మ్... వాటి గురించి అంత ఆలోచనెందుకే బాబూ! ఆ పింపుల్స్తో నువ్వు సాయిపల్లవిలా కనిపిస్తున్నావ్ తెలుసా?’ ‘నా మొహంలే’ అని బలవంతంగా నవ్వింది మానవి. క్లాసులో కూర్చుందన్న మాటే కాని మనసంతా పింపుల్స్ చుట్టూనే తిరుగుతోంది. వాటివల్లనే తాను అందంగా కనిపించడంలేదని, వాటివల్లనే తనను ఎవ్వరూ చూడటం లేదని అనుకుంటోంది. ఎలాగోలా క్లాసులు పూర్తిచేసి ఇంటికి వచ్చింది. ‘బేబీ.. త్వరగా స్నాక్స్ తిని రెడీ అవ్వు. మావయ్య వాళ్లింట్లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం’ అని చెప్పింది అరవింద. ‘నువ్వెళ్లు మమ్మీ... నేను రాను.’‘అదేంటే.. అన్నిటికీ, నేను రాను, నేను రాను అంటావ్. నువ్వు రాకపోతే మావయ్య ఫీలవుతాడు. మీ అత్త నిష్టూరమాడుతుంది.’ ‘వాళ్లతో నేను ఫోన్లో మాట్లాడతాలే, నువ్వెళ్లు.’‘ఏవిటో ఇది.. ఎక్కడికీ రానంటుంది’ అనుకుంటూ వెళ్లింది అరవింద. ∙∙ పింపుల్స్ సమస్య చిన్నదే. టీనేజ్లో చాలామంది అనుభవించేదే. కానీ మానవికి మాత్రం అదో పే...ద్ద సమస్యగా మారింది. ఎవ్వరూ ఏమీ అనకపోయినా, దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయాయి. నిత్యం ఆందోళనగా ఉంటోంది. దాన్ని అధిగమేంచేందుకు విపరీతంగా తింటోంది. దానివల్ల బరువు పెరుగుతోంది. దానివల్ల మళ్లీ ఆందోళన. ఇదో అందులేని నెగెటివ్ సైకిల్గా మారిపోయింది. పలకరిస్తే ఏడుస్తోంది. దీనికేదో అయ్యిందని అరవింద.. మానవిని కౌన్సెలింగ్కు తీసుకొచ్చారు. లేని సమస్య గురించే ఆలోచనలు మానవితో అరగంట మాట్లాడేసరికి... ఆమె మనసంతా మొటిమలపైనే ఉందని అర్థమైంది. మానవికి ఉన్న సమస్యను బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ) అంటారు. అంటే శరీరంలో ఇతరులకు కనిపించని లోపం ఉందని భావిస్తూ, దాని గురించే ఆలోచిస్తూ ఉండటం. ఇదో రకమైన మానసిక రుగ్మత. ఓసీడీలో ఇదో రకం. మానవి మొటిమల గురించి ఆలోచిస్తే, ఇంకొకరు ముక్కు గురించి లేదా రంగు గురించి లేదా బరువు గురించి లేదా ముడతల గురించి లేదా వక్షస్థలం కొలత గురించి ఆలోచించవచ్చు. టీనేజ్ కుర్రాళ్లు జుట్టు పలచబడటం లేదా రాలిపోవడం లేదా కండలు లేకపోవడం గురించి బాధపడుతూ ఉండవచ్చు. ఈ ఆలోచనలను నియంత్రించడం కష్టం. కారణాలు అనేకం... బీడీడీ ఎలా, ఎందుకు వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. జెనెటిక్స్ నుంచి కల్చర్, మీడియా వరకూ రకరకాల కారకాలు ఉంటాయి. బీడీడీ ఉన్న కుటుంబ సభ్యులుంటే ఇది వచ్చే అవకాశం మూడు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ. కల్చర్, మీడియా, మూవీస్ కలిసి ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. బాల్యంలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదా బెదిరించడం లేదా ఆటపట్టించడం లాంటివి కూడా కారణం కావచ్చు. బీడీడీ సంకేతాలు, లక్షణాలు ►ఇతరులకు కనిపించని లేదా మైనర్గా అనిపించే లోపాల గురించే ఆలోచిస్తూ ఉండటం .మీ రూపాన్ని అగ్లీగా మార్చే లోపం ఉందని బలమైన నమ్మకం ►మీ రూపాన్ని ఇతరులు ఎగతాళి చేస్తారనే నమ్మకం. ►తరచూ అద్దంలో చూసుకోవడం ∙స్టైలింగ్, మేకప్ లేదా దుస్తులతో లేని లోపాలను దాచడానికి ప్రయత్నించడం ►మీ రూపాన్ని నిరంతరం ఇతరులతో పోల్చడం ∙లోపాన్ని సరిదిద్దుకునేందుకు విస్తృతంగా కాస్మెటిక్స్ వాడటం ∙మీలో లోపం ఉందని, ఫంక్షన్స్కు వెళ్లకుండా తప్పించుకోవడం. సైకోథెరపీతో చెక్ పెట్టొచ్చు మొదటి సెషన్లో సైకో డయాగ్నసిస్ ద్వారా మానవి సమస్యను నిర్ధారణయ్యాక, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) ద్వారా చికిత్స ప్రారంభించాను. ప్రతికూల ఆలోచనలు, ఎమోషనల్ రియాక్షన్స్, ప్రవర్తనలు సమస్యకు ఎలా కారణమవుతాయో తెలుసుకోవడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పింపుల్స్ గురించి ఉన్న ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి, సరైన ఆలోచనా విధానాన్ని నేర్చుకునేలా చేస్తుంది. తరచూ అద్దం చూసుకోవడం, కాస్మెటిక్స్ తగ్గించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. అలా పది సెషన్లలో మానవి సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు తాను మొటిమల సమస్యను పక్కకు నెట్టేసి, కాన్ఫిడెంట్గా అన్ని ఫంక్షన్స్కు హాజరవుతోంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
వీకెండ్లో మెరిసిపోండి.. ఇలా చేస్తే జుట్టు తెల్లబడదు
ట్యాన్ తగ్గాలంటే... ► స్పూను కాఫీ పొడిలో స్పూను తేనె, స్పూను బంగాళ దుంప రసం, స్పూను గంధం పొడివేసి చక్కగా కలిపితే డీ ట్యాన్ ప్యాక్ రెడీ. ఈ ప్యాక్ను ముఖం, చేతులు, మెడపైన పూతలా వేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత తడి బట్టతో తుడిచేసి, నీటితో కడిగేయాలి. ► వారానికి రెండు–మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే నలుపు పోయి, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ప్యాక్ వేసుకునే సమయం లేనప్పుడు..టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే ట్యాన్ తగ్గుతుంది. ► నిమ్మరసంలో బంగాళదుంప రసం కలిపి ముఖానికి పెట్టుకున్నా ట్యాన్ పోతుంది ► ఈ ప్యాక్లు వేసుకున్నప్పటికీ రాత్రి పడుకునేముందు చేతులు, కాళ్లకు నైట్క్రీమ్ రాసుకుంటే ట్యాన్ తొలగి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. హెయిర్ కేర్ యాపిల్ సైడర్ వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. ఉసిరి పొడిలో నిమ్మరసం వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి క్యాప్ పెట్టుకోవాలి. గంట తరువాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ ప్యాక్లో విటమిన్ సి పుష్కలంగా ఉండి కురులను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. త్వరగా తెల్లబడదు. -
స్కిన్ కలర్ బెటర్ చేయగలం.. కానీ.. పూర్తిగా మార్చలేం..
-
మందార పువ్వులో ఇది కలిపి రాస్తే మొటిమలు, మచ్చలు మాయం
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ కాలుష్యం, పని ఒత్తిడి, పెరుగుతున్న వయస్సుతో సాధారణంగా కాస్త పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ముఖాన్ని వైట్గా, కాంతివంతంగా మార్చుకునేందుకు వేలకు వేలు పోగేసి క్రీములు, ఫేస్మాస్కులు కొనగోలు చేసినా పెద్దగా ఉపయోగం లేదా? అయితే ఇది మీకోసమే. పైసా ఖర్చులేకుండా మన పెరట్లో దొరికే మందార పూలతోనే ముఖ వర్చస్సును మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా మందారం పువ్వులను జుట్టు పెరుగుదలకు, ఒత్తుగా పెరిగేందుకు విరివిగా ఉపయోగిస్తుంటారన్నది అందరికి తెలిసిందే. దీనిని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలు దూరం అవుతాయి. కానీ ఈ పువ్వులు కేవలం జుట్టుకే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా? అదేలాగా? మందార పువ్వులతో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మందారంలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వయసు పెరిగినా యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. ఈమధ్య కాలంలో అందాన్ని కాపాడుకోవడం, మరింత బ్రైట్గా కనిపించేందుకు తరచూ బ్యూటీ పార్లర్కు వెళ్లి ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ వీటికన్నా మందార పూలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా రెండు-మూడు మందార పువ్వులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మిక్సీజార్లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.అంతేకాకుండా తరచూ ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది. చాన్నాళ్లుగా వేధిస్తున్న మొటిమలు, వాటి తాలూకూ మచ్చలు కూడా తొలిగిపోతాయి. -
‘మార్కెట్’లో సౌందర్యలహరి
అందానికి దాసోహమవని వారు ప్రపంచంలో ఉంటారా? సౌందర్యారాధన లేని వారు ఉంటారా? అందుకే సౌందర్య ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ బ్యూటీ పార్లర్లు, స్టైలిష్ హబ్లు వెలుస్తున్నాయి. ఫేస్వా ష్లు, మాయిశ్చరైజర్ల నుంచి కంటి క్రీమ్లు, ఫేస్ మాస్్కలు, సన్స్క్రీన్ లోషన్తో అన్నింటినీ మహిళలు, పురుషులు, పిల్లల కోసం కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. 2018లో ప్రపంచ వ్యాప్తంగా సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 134.8 బిలియన్ డాలర్లు ఉంటే, 2021 నాటికి 532 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024 నాటికి 893 బిలియన్ డాలర్లకు చేరుతుందని జియాన్ మార్కెట్ రీసెర్చ్(జీఎంఆర్) విభాగం అంచనా వేసింది. 2020 నుంచి భారతదేశంలో ప్రీమియం సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నట్టు గుర్తించింది. ప్రస్తుతం చర్మ, సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో పురుషుల సౌందర్య, గ్రూమింగ్ ఉత్పత్తులు కూడా భారీగా పెరుగుతాయని, దాంతో యునిసెక్స్ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తుందని జీఎంఆర్ అంచనా వేసింది. చర్మ సౌందర్య ఉత్పత్తులే అధికం ♦ 2021లో మొత్తం సౌందర్య ఉత్పత్తుల కొనుగోళ్లలో 148.3 బిలియన్ డాలర్లు కేవలం చర్మ రక్షణ ఉత్పత్తులదే. ♦ పర్సనల్ కేర్ మార్కెట్లో 42 శాతం స్కిన్ కేర్ ఉత్పత్తులే ఉన్నాయి. తర్వాత స్థానంలో హెయిర్ కేర్ 22 శాతం, బ్యూటీ అండ్ మేకప్ కేర్ 16 శాతం ఉన్నాయి. ♦ ప్రపంచ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్లో ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న భారత్.. వచ్చే మూడేళ్లలో 4వ స్థానానికి చేరుతుందని అంచనా. ♦ సర్వే ప్రకారం భారత్లో సహజ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 2022లో 15 బిలియన్ డాలర్లు ఉండగా, 2024 నాటికి 22 బిలియన్ల డాలర్లకు, 2028 నాటికి 38 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని జీఎంఆర్ తెలిపింది. -
చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా..
చర్మ, కేశ సంరక్షణకు ఉపయోగపడే సులువైన చిట్కాలు.. ఓ లుక్కేయండి మరి! ►చర్మం చిట్లి బిరుసెక్కినట్లుగా ఉంటే శరీరానికి పెరుగు రాసి, అరగంట ఆగి స్నానం చేయండి. ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ►చర్మం మీది ముడతలు పోవాలంటే కొద్ది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం చేమంతి పూలతో సున్నితంగా మర్దన చేయాలి. నిగనిగలాడే జుట్టు కోసం ►జుట్టు నిగనిగలాడుతూ మెరవాలంటే కోడిగుడ్డు సొనను, అరటి పండును బాగా కలిపి, ఆ పేస్టును తలకు పట్టించి పావుగంట తర్వాత మైల్ట్ షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ►జుట్టు బిరుసుగా ఉండి వెనకకు దువ్వడానికి వీలులేకుండా ఉంటే నీళ్ళలో కొంచం నిమ్మరసం కలిపి తలకి రాసి దువ్వండి. ►ఒక భాగం ఆపిల్ జ్యూస్, మూడు భాగాల నీరు కలిపి తలకి రాసి ఆరిన తరువాత తల స్నానం చేస్తే ఎరుపు రంగులోని జుట్టు నల్లగా మారడమే కాకుండా వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. గులాబీ రంగు పెదాల కోసం ►పెదవులు తరచు ఎండిపోవడం లేదా పగలడం జరుగుతుంటే పాలమీగడను, కుంకుమ పువ్వును బాగా కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు పెదవులకు పూయాలి. ఈ విధంగా వారం పదిరోజులు చేస్తే మీ పెదవులు గులాబీ రంగులోకి మారి అందంగా ఉంటాయి. ►తేనె, నిమ్మరసం, గ్లిసరిన్లో కలిపి రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసి మర్దన చేస్తే పెదాల నల్లదనం పోతుంది. గులాబీ రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి. ►పెదాలపైన మచ్చలు పోవాలంటే గ్లిసరిన్ లో కొంచం రోజ్ వాటర్ కలిపి దానిని పెదాలకు మర్దన చేయాలి. పిల్లలకు ►పిల్లలకి స్నానం చేయించడానికి సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడితే చర్మవ్యాధులు రాకుండా వుండడమే కాకుండా, శరీరంమీద వుండే నూగులాంటి వెంట్రుకలు కూడా పోతాయి. ►ఎండబెట్టిన పుదీనా ఆకుల్ని పొడిచేసి, తగినంత నీరు కలిపి బాగా కాచి, చల్లార్చిన కషాయాన్ని ప్రతిరోజూ పుక్కిలి బడితే నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం కారటాన్ని నివారించవచ్చు. చదవండి: Constipation: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే.. Health Tips In Telugu: పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? -
మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! డివైజ్ ధర?
స్కిన్కేర్లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్లో ట్రీట్మెంట్లు.. ఇలా అన్నిటినీ అవలంబిస్తారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్.. ఈ హ్యాండ్హెల్డ్ ఫేషియల్ మసాజర్. బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్లా ఉపయోగపడుతుంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఫేస్ అండ్ స్కిన్కేర్ థెరపీ టూల్.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్ఈడీ లైట్ థెరపీ హెడ్.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్ బ్యూటీ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. హాట్ అండ్ కోల్డ్ రింగ్స్తో పాటు క్లీనింగ్ రింగ్నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్ టెక్నాలజీతో ఈ ఫేషియల్ మెషిన్.. కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి.. స్కిన్ టోన్ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది. ఈ మెషిన్ను భద్రపరచు కోవడానికి సాఫ్ట్ కేరింగ్ బ్యాగ్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బీ చార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇలాంటి డివైజెస్ను ఆన్లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్ని బట్టి.. అదనపు రింగ్స్ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. చదవండి: CWS: డ్రైవర్ బబ్లూ.. అమెరికా డాక్టర్ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు? -
మొటిమలు, మచ్చల నివారణ.. ఈ ప్యాక్స్ ప్రయత్నించండి
బీట్రూట్ ఆరోగ్య పరిరక్షణకే కాదు, మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్ పింపుల్స్, వాటి మచ్చలను తొలగించడానికి చాలా సమర్థంగా పనిచేస్తాయి. మీకు పింపుల్స్ సమస్య ఉంటే.. ఈ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి. రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి. బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. (క్లిక్ చేయండి: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్తో లాభాలివే!) -
Winter: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తింటే..
Winter Skin Care Tips In Telugu: చలికాలంలో ఇంచుమించు అందరినీ వేధించే సమస్యలలో ప్రధానమైనది చర్మం పొడిగా మారడం. చలి ముదిరేకొద్దీ ఇది సహజమైనదే అయినా, తెలిసీ తెలియక మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం మరింత త్వరగా పొడిబారిపోతుంది. అవేమిటో తెలుసుకుని, వాటికి దూరంగా ఉందాం. వేడి నీటి స్నానం సాధారణంగా చలికాలంలో అందరూ వేడినీటి స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. నిజానికి బడలికగా ఉన్నప్పుడు వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర అలసట తొలగిపోతుందనేది చాలామందికి అనుభవమే. అయితే స్నానానికి ఉపయోగించే నీరు తగుమోతాదు వేడిలో మాత్రమే ఉండాలి. బాగా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది. వేడి నీరు చర్మంలో ఉన్న ఆయిల్ను, తేమను తొలగిస్తుంది. అందుకే వేడి నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మానికి అది మంచిది కాదు చాలా మంది మేకప్ వేసుకొని అలాగే నిద్రపోతారు. ఇది చర్మానికి మంచిది కాదు. నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని కడుక్కుని, మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోవాలి. రాత్రి చర్మ సంరక్షణ దినచర్య చాలా ముఖ్యం ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. చల్లబడిన ఆహారం తింటే చల్లబడిన ఆహారం తీసుకోవడం చలికాంలో ఆహారం తొందరగా చల్లారి పోతుంది. అలా చల్లారిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తొందరగా అరగదు. ఫలితంగా చర్మం డ్రైగా అవుతుంది. అందువల్ల వీలయినంత వరకు వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా తాగితేనే తక్కువ నీరు తాగడం చలికాలంలో దాహం ఎక్కువగా వేయదు. అందువల్ల చాలామంది మంచినీళ్లు తాగరు. అయితే దాహం వేసినా, వేయకపోయినా అరగంటకోసారి రెండు మూడు గుక్కలు నీటితో గొంతు తడుపుకుంటూ ఉండటం మంచి అలవాటు. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల చర్మం త్వరగా పొడిబారిపోకుండా ఉంటుంది. చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. Athiya Shetty: బొప్పాయి గుజ్జు, రోజ్ వాటర్.. పార్టీకి వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా! నా బ్యూటీ సీక్రెట్ Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో.. -
చర్మంపై మచ్చలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
చాలామందిలో ఒంటిపై మచ్చలు రావడం సాధారణం. కొద్దిమందిలో ఇవి తెల్లమచ్చల్లా, మరికొందరిలో కాస్తంత నల్లమచ్చలా కనిపిస్తుంటాయి. ‘టీనియా వెర్సికలర్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. ఇలాంటి మచ్చలు రాకుండా నివారించుకునేందుకు ఈ సూచనలు పాటించడం మేలు. చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. జిడ్డు చర్మం ఉన్నవారు... చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. అయితే చర్మాన్ని మరీ అతిగా పొడిబారనివ్వకూడదు. శరీరం మీద నూనెగానీ, ఇతరత్రా జిడ్డు పదార్థాలనుగాని పూయకూడదు. బిగుతుగా, గాలి ఏమాత్రం చొరబడకుండా ఉండే దుస్తులు ధరించకూడదు. తమ ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువచెమట పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. అప్పటికే మచ్చలు వచ్చిన వారు డాక్టర్ సలహా మేరకు కెటొకోనజోల్ ఉండే పౌడర్ డాక్టర్లు సూచించిన కాలానికి వాడాలి. -
Beauty: ఈ డివైజ్ను క్రమం తప్పకుండా 28 రోజుల పాటు వాడారంటే.. ముడతలు మాయం!
ఈ రోజుల్లో డ్రెస్కి తగ్గ మేకప్ కామన్ అయిపోయింది. మరి మేకప్ మెరుపులు సహజంగా ఉండాలంటే.. చర్మం మృదువుగా, ముడతల్లేకుండా ఉండాలి. అప్పుడే ఏ మేకప్ వేసినా చూడముచ్చటగా ఉంటుంది. వయసుతో వచ్చే ముడతలు పోగొట్టుకునేందుకు స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ పార్లర్స్, క్లినిక్స్కి తిరగాల్సిన పనిలేదంటోంది ఈ మసాజర్ (స్కిన్ లిఫ్టింగ్ మైక్రోకరెంట్ బ్యూటీ మెషిన్). న్యూ అప్గ్రేడ్ టెక్నాలజీతో రూపొందిన ఈ యాంటీ రింకిల్స్ డివైజ్.. 3.7 వోల్టేజ్తో పని చేస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే సరిపోతుంది. ఈఎమ్ఎస్ పల్స్ మోడ్, స్కిన్ టెండరింగ్ మోడ్, కొల్లాజెన్ మోడ్, లిఫ్టింగ్ ఫేస్ పర్మింగ్ మోడ్ అనే నాలుగు రకాల ఫంక్షన్స్తో పనిచేస్తుంది. ఈ డివైజ్ను క్రమం తప్పకుండా 28 రోజుల పాటు వాడితే మంచి ఫలితం ఉంటోందట. స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం, గ్లో (మెరుపు) కోసం, ఫిట్నెస్ కోసం కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి. ఇక చేతులు, కాళ్లు, తొడలు, పొట్ట, నడుము వంటి భాగాల్లో ముడతలు పోవాలంటే.. గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసినప్పుడు ఆప్షన్స్ని బట్టి రెడ్ లేదా బ్లూ కలర్స్లో లైట్స్ వెలుగుతాయి. దీని ధర 65 డాలర్లు. అంటే 5,156 రూపాయలు. ఇలాంటి డివైజ్లు కొనేటప్పుడు ముందుగా వినియోగదారుల రివ్యూలతో పాటు ఆయా సైట్స్ క్రెడిబిలిటీలనూ పరిగణలోకి తీసుకోవాలి. చదవండి: Aishwarya Rai Bachchan: నాలుగైదు పూటలు తింటా.. నీళ్లు బాగా తాగుతా.. నా బ్యూటీ సీక్రెట్ అదే! -
నిగనిగలాడే కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి..!
ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాల పొడి, ఒక టీ స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. వీటితో పాటు పొడిచర్మం అయితే కొద్ది చుక్కల గ్లిజరిన్, ఆయిలీ స్కిన్ అయితే పన్నీరు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లయ్ చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. -
పొటాటో పోషణ
బంగాళ దుంపలను తొక్కతీసి తురుముకుని రెండు టీస్పూన్ల రసం తీసుకోవాలి. ఈ రసంలో టీస్పూను రోజ్ వాటర్, ఐదు చుక్కలు నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి ఆరేంత వరకు మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడగాలి. వారంలో రెండు మూడుసార్లు ఈ ప్యాక్ను ముఖానికి అప్లై చేయడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దీనిలోని కాపర్, జింక్లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తాయి పొటాషియం, మెగ్నీషియంలు చర్మానికి పోషకాలను అందిస్తాయి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే చర్మంలో త్వరగా మంచి మార్పు కనిపిస్తుంది. -
Beauty Tip: సోప్ కాని సోప్.. ఈ మిశ్రమం చర్మ నిగారింపు పెంచడంతో పాటు..!
కప్పు శనగపిండిలో, పావు కప్పు పచ్చిపాలు, ఐదు టేబుల్ స్పూన్ల కల్లుప్పు, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసి బాగా కలపాలి. స్నానం చేసే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి రాసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. శుభ్రంగా తడి తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు వదిలి చర్మం కోమలంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని సబ్బుకు బదులుగా వాడుకోవడం వల్ల చర్మం సహజ సిద్ధమైన నిగారింపుని సంతరించుకుంటుంది. -
సమ్మర్ కేర్.. సింపుల్ టిప్స్
-
గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!
మనిషి తన కళా ప్రదర్శనకు చివరికి సొంత చర్మాన్ని కూడా వదలలేదు. గోరింటాకు (మెహందీల)తో తాత్కాలికంగా, పచ్చబొట్ల(టాటూల)తో శాశ్వతంగా దాన్ని అలంకరించడం మానలేదు. మెహందీ లేదా టాటూ అయితే అది ప్రయత్నపూర్వయంగా చేసే పని. కానీ కొందరు ఎదుర్కొనే ఓ వింత సమస్య చర్మంపై చాలా చిత్రమైన ప్రభావం చూపుతుంది. ఏమాత్రం గీరినా లేదా చేయి బలంగా తగిలినా దేహంపైన ఉండే చర్మం పైకి ఉబికి ఎంబోజింగ్ చేసినట్లుగా మారుతుంది. ఇలాంటి వారి చర్మంపై ఏదైనా రాసినప్పుడు అది పైకి ఉబికి కనిపిస్తుండటం వల్ల ఈ సమస్యను ‘స్కిన్ రైటింగ్’ అని అంటారు. వైద్యపరిభాషలో దీన్ని ‘డర్మటోగ్రాఫియా’గా పిలుస్తారు. కారణాలు: ►మనకు ఏదైనా సరిపడనిది దేహంలోకి గానీ, లేదా చర్మంపైన చేరితే... మన వ్యాధినిరధకత (ఇమ్యూన్ సిస్టమ్ / సిగ్నల్స్) దాన్ని ఎదుర్కొనేందుకు హిస్టమైన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. (అందుకే మనకు ఏదైనా సరిపడక రియాక్షన్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించేందుకు యాంటీహిస్టమైన్ మందులు వాడటం మనకు తెలిసిన విషయమే). ►ఒక్కోసారి మనపై ఉన్న తీవ్రమైన మానసిక/శారీరక ఒత్తిళ్ల (స్ట్రెస్/యాంగై్జటీల) వల్ల కూడా ‘డర్మటోగ్రాఫియా’ కనిపిస్తుంది. ∙కొన్ని సందర్భాల్లో సరిపడని మందుల వల్ల కూడా ఇది కనిపించవచ్చు. ►ఎక్కువసేపు మైక్రోఒవెన్ దగ్గర ఉండే కొంతమందిలో ఈ సమస్యను పరిశోధకులు గుర్తించారు. ముప్పు ఎవరిలో ఎక్కువ... ►యౌవనంలో ఉన్నవారిలో ∙పొడిచర్మం ఉన్నవారిలో ∙డర్మటైటిస్ లేదా థైరాయిడ్ వంటి మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో నివారణ ►దురద పుట్టించే బిగుతు దుస్తులు లేదా బెడ్షీట్స్ వాడకూడదు. అలాగే అలర్జీలకు కారణమయ్యే కంబళ్లు, ఊల్తో/ సింథటిక్ పద్థలుల్లో తయారయ్యే దుస్తులు, చర్మానికి అలర్జీ కలిగించేవి వాడకూడదు. ►అలర్జీ కలిగించే ఘాటైన వాసన సబ్బులు (సోప్స్ విత్ ఫ్రాగ్నెన్స్) వాడకూడదు. ►గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. (ఒక్కోసారి బాగా వేడిగా ఉండే నీళ్లు కూడా డర్మటోగ్రాఫియాను కలిగించవచ్చు.) ►చర్మంపై రోజూ మాయిష్చరైజింగ్ క్రీమ్ వాడుకోవడం మంచిది. ►ఇలాంటి సమస్య ఉన్నవారి చర్మంపై గీరడం, గీయడం చేయకూడదు. ►ఒత్తిడికి (స్ట్రెస్ / యాంగై్జటీలకు) దూరంగా ఉండాలి. చికిత్స ఇది చాలావరకు నిరపాయకరమైనదీ, హానికలిగించని సమస్య కావడంతో దీన్ని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అలర్జీలను ఎదుర్కొనే మందులైన కొన్ని డైఫిన్హైడ్రమైన్, యాంటీహిస్టమైన్ వంటి వాటితో చికిత్స అందిస్తారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఫొటోథెరపీనీ సిఫార్సు చేయవచ్చు. ఇక సంప్రదాయ చికిత్సలుగా టీట్రీ ఆయిల్, అలోవీరా వంటి వాటిని పూయడం వల్ల కూడా కొంతమేర ప్రయోజనం, ఉపశమనం ఉంటాయి. చదవండి: Prostate Gland: ఈ గ్రంథి లేనట్లయితే సంతానమే లేదు.. బాదంకాయంత సైజు నుంచి అమాంతం ఎందుకు పెరుగుతుంది? -
రోజూ జుట్టుకు ఆముదం పట్టిస్తే చుండ్రు తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది!!
Castor Oil Benefits for Skin and Hair: చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చర్మంతోపాటు జుట్టుకూడా పొడిబారుతుంది. దీంతో చుండ్రు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే చుండ్రు ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యలేవి రాకుండా ఉండాలంటే చలికాలం ఉన్నన్ని రోజులు జుట్టుకు ఆముదం పట్టిస్తే మంచిది. ►టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే..చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ►పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది. ►గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి. ►రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్లో ఆముదాన్ని పోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్బామ్లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారుతాయి. చదవండి: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
Beauty Tips: పెదవులు ఎర్రగా, సహజ కాంతితో మెరవాలంటే.. ఇవి పాటిస్తే సరి!
అరిచేతులు, అరికాళ్లు, పెదాలపై చమట గ్రంథులు ఉండవనే విషయం అందరికీ తెలుసు. అలాగే సహజ నూనెలు ఉత్పత్తి చేసే సేబాషియస్ గ్రంథులు కూడా ఉండవు. అందుకే వాటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఐతే శరీరంలోని ఇతర భాగాలకంటే పెదవులు త్వరగా పొడిబారిపోతాయి. సూర్యరశ్మి నుంచి వెలువడే యూవీ కిరణాలు వల్ల పెదవులు త్వరగా పొడిబారి దెబ్బతింటాయి. అదరాలు ఎల్లప్పుడు తేమగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు మీకోసం.. ►ఆరెంజ్ రసం కలిగిన లిప్బామ్ సూర్యుని నుంచి వెలువడే ప్రమాధకర కిరణాల నుంచి రక్షణ కల్పించి సహజ కండిషనింగ్లా పనిచేస్తుంది. ►పెదాలపై డెడ్ స్కిన్ పొరను తొలగించాలంటే వారానికి ఒకసారైనా టూత్ బ్రష్తో షుగర్ స్క్రబ్ను అప్లై చేయాలి. ►వెన్నను పెదాలపై రాయడం వల్ల ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా కనిపిస్తాయి. ►విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు ఆకుకూరలు తినాలి. అలాగే అధికంగా నీళ్లు తాగడం మంచిది. ►వేసవి వేడిలో పెదవులు నల్లగా మారతాయి. కాబట్టి మీ సహజమైన పెదాల రంగును కాపాడుకోవాలంటే.. కుంకుమపువ్వు, పెరుగును కలిపి రోజుకి 2, 3 సార్లు అప్లై చేస్తే, మీ పెదాల సహజ కాంతి చెక్కుచెదరదు. ►అర టీస్పూన్ గ్లిజరిన్, ఆముదం, నిమ్మరసం తీసుకుని, వీటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా చేయడం ద్వారా పెదాలపై పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోతుంది. ►రోజుకి 12 గ్లాసుల నీరు త్రాగడం వలన మీ శరీరం మాత్రమేకాకుండా పెదవులు హైడ్రేట్ అవుతాయి. చర్మం రక్త ప్రసరణను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది కూడా. చదవండి: Health Tips: జంక్ఫుడ్ తింటున్నారా? అల్జీమర్స్, డిప్రెషన్.. ఇంకా.. -
ముఖం తేటగా కనిపించాలంటే.. ఈ కొద్దిపాటి మార్పులు అవసరం..!
ముఖం తేటగా, ఆరోగ్యంగా, ప్రసన్నంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికి పాటించాల్సిన కొన్ని తేలికపాటి సూచనలివి. ఆహారపరంగా... ►రోజు క్రమం తప్పకుండా అన్ని రకాల పోషకాలు అందేలా సమతులహారాన్ని నియమిత వేళలకు తీసుకుంటూ ఉండాలి. అందులో ఆకుకూరలు, కూరగాయలూ, మునగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ►ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకుంటూ ఉండాలి. ►డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ను రోజూ నాలుగు పలుకులు తినడం మంచి ఫలితాలను ఇస్తుంది. ►రోజూ కనీసం నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఇతరత్రా జాగ్రత్తలు... ►తీక్షణమైన ఎండ/ చలి/ మంచు లేదా పొగ వంటి కాలుష్య ప్రభావాలకు ముఖం నేరుగా గురికాకూడదు. ►తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది. ►ప్రతిరోజూ ప్రాణాయాయం / ధ్యానం వంటివి చేస్తూ ఉంటే ఆందోళన, మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. దాంతో ముఖం ప్రశాంతంగా, ప్రనన్నతతో కనిపిస్తుంది. ప్రస్ఫుటమవుతాయి. ►రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల మర్నాడు ముఖం తేటగా కనపడుతుంది. రాత్రి జాగరణ వల్ల తీవ్రమైన అలసట, నిస్సత్తువలతో ముఖం కళాకాంతులు కోల్పోతుంది. స్నానం... మేకప్... ఇక చర్మానికి హాని కలిగించే గాఢమైన రసాయనాలు ఉండే సబ్బులు, షాంపూలకు బదులు దానికి మైల్డ్ సోప్ వాడటం మేలు. సాధ్యమైనంత వరకు క్రీములు వంటివి వాడకపోవడమే మంచిది. మహిళల విషయంలోనూ తేలికపాటి మేకప్తోనే మంచి ఫలితం ఉంటుంది. -
చర్మం యౌవనంగా ఉండాలంటే...
కాలం గడుస్తున్న కొద్దీ ప్రతివారి చర్మంలోనూ మార్పులు వస్తుంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులతో అది యౌవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. దానిలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలను పాటించండి. మనం స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత విషయంలో ఓ మాట గుర్తుంచుకోండి. మన శరీర ఉష్ణోగ్రత కంటే ఆ నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. మరింత ఎక్కువ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. మీరు వాడే సబ్బు మరింత సుంగధభరితమైనది కాకుండా చూసుకోండి. మైల్డ్ సోప్లు వాడటమే మంచిది. మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. పొగతాగే అలవాటును వెంటనే మానేయాలి. పొగలోని రసాయనాలు ఏజింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మార్పులన్నీ త్వరగా వచ్చేస్తాయి. రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. వారికి తగిన ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్)తో ఉండే సన్స్క్రీన్ కోసం ఓసారి డాక్టర్ను సంప్రదిస్తే మరింత మేలు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోండి. పెరుగుతున్న వయసుతో చర్మంపై ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపుతో నిగారిస్తూ ఉంటుంది. మన చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్కు వెంటనే చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అవి మరింత అవి ఇతర సమస్యలకు దారితీయవచ్చు. డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం చాలా రోజులు ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. -
అప్పుడు అలర్జీ టెస్ట్ చేయించుకోండి!
అందంగా కనిపించేందుకు కథానాయికలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చర్మ సౌందర్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి? అని కథానాయికల్ని అడిగితే వాళ్లు పాటిస్తున్న టిప్స్ చెబుతారు. రష్మిక మందన్నా కూడా తాజాగా చర్మ సంరక్షణ గురించి ఓ విషయం చెప్పారు. ‘ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ భామ స్కిన్ గురించి ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘మీ చర్మం రఫ్గా తయారవుతున్నా, డల్గా కనిపిస్తున్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే.. ‘అలర్జీ టెస్ట్’. రెండేళ్ల కిందట నా చర్మంలో ఏదో తేడా కనిపించింది. బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచించాను. నేను శాకాహారిని. ఒకవేళ నేను తీసుకునే ఆహారంలో నాకు పడనవి ఏమైనా ఉన్నాయా? అనిపించింది. అంతే.. అలర్జీ టెస్ట్ చేయించుకున్నాను. వైద్య పరీక్షలో నాకు అలర్జీ ఉందని తేలింది. అప్పటి నుంచి నా శరీరానికి అవసరం లేని, పడని ఆహారాన్ని పక్కన పెట్టడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నా చర్మ సమస్యలు మాయమయ్యాయి. అందుకే స్కిన్ బాగా లేనట్లు అనిపిస్తే, పరీక్షలు చేయించుకోవాలి. మనకు సరిపడే ఆహారం తీసుకోవాలి. రోజుకి కనీసం రెండు లీటర్లు నీళ్లు తాగాలి. ఓ రకంగా భారతీయులు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే అలర్జీ ప్రభావంతో దీర్ఘకాలికంగా బాధించే సమస్యలు ఇక్కడి వారిలో ఉండవు’’ అన్నారు. -
మెరిసే మేని కోసం ఇంటి ట్రీట్మెంట్
చర్మం మీద కొవ్వు కణాలు, మృత కణాలు పేరుకు పోవడం అనేది మహిళలకు ఎదురయ్యే అత్యంత సాధారణమైన సమస్య. కొవ్వు కణాలు చర్మం బయటకు పొడుచుకుని వచ్చి చర్మం మీద పేరుకుపోవడం అనేది మగవారిలో కనిపించదు. ఆడవాళ్ల చర్మం కంటే మగవాళ్ల చర్మం మందంగా ఉండడమే ఇందుకు కారణం. కొవ్వు కణాలను, మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నల్లగా, బిరుసుగా మారిపోతుంది. నడుమకు కింది భాగంలో, తొడల మీద ఈ సమస్య ఎక్కువ. ఎక్స్ఫోలియేషన్ (మృతకణాల తొలగింపు) కోసం స్పాలకు, బ్యూటీ పార్లర్లకు వెళ్లలేని వాళ్లు సొంతంగా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. కాఫీ స్క్రబ్ ఫిల్టర్లో వేయడానికి ఉపయోగించే కాఫీ పొడి (ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కాదు)ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని కొద్ది నీటితో పేస్టు చేయాలి. ఆ పేస్ట్ని ఒంటికి రాసి, ఐదునిమిషాల తర్వాత వలయాకారంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వు కణాలు, మృతకణాలు రాలిపోవడంతోపాటు చర్మం శుభ్రపడుతుంది. మృదువుగా మారుతుంది. నేచురల్ బాడీ బ్రష్ రోజూ స్నానం చేసేటప్పుడు బాడీ బ్రష్తో ఒకసారి రుద్దుకుంటే పొడిబారిన చర్మకణాలు ఏరోజుకారోజు రాలిపోతుంటాయి. కాబట్టి చర్మం మీద పేరుకునే ప్రమాదం ఉండదు. స్టెరిలైజ్ చేసిన కొబ్బరి పీచును చెక్క హ్యాండిల్కి అమర్చిన బ్రష్లు రెడీమేడ్గా దొరుకుతాయి. ఈ బ్రష్ను వేడి నీటితో శుభ్రం చేయాలి. ఆయిల్ మసాజ్ యాంటీ సెల్యులైట్ మసాజ్ ఆయిల్ను ఒంటికి పట్టించి మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ లెమన్ గ్రాస్, తులసి, రోజ్మెరీల మిశ్రమం. దీంతో మసాజ్ చేయడం వల్ల చర్మం మీదున్న కొవ్వు, మృతకణాలు తొలగిపోవడంతోపాటు దేహంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. ఈ ఆయిల్ దేహంలో గూడుకట్టుకుని పోయిన వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తుంది. -
సేఫ్టీ ఫస్ట్..సౌందర్యం నెక్ట్స్ !
సాక్షి, హైదరాబాద్ : పది మందిలో ప్రత్యేకంగా ఉండాలని అందరూ ఆరాటపడతారు. ముఖారవిందం మెరిసి పోయేలా సౌందర్య సాధనాలతో మెరుగులు అద్దుతారు.. ఇది నిన్నటి మాట.. మరి నేడు.. దుమ్ము, ధూళితో కాంతి విహీనంగా తయారవుతున్న తమ చర్మాన్ని కాపాడుకునేందుకు యువత ప్రయత్నిస్తోంది. దీంతో ఒకప్పుడు విరివిగా వాడిన సౌందర్య సాధనాల స్థానంలో.. చర్మ సంరక్షణ సాధనాలు వచ్చి చేరాయి. ఇటీవల ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో పలు మార్కెటింగ్ కంపెనీలు జరిపిన సర్వేల్లో ఈ విష యాలు వెల్లడయ్యాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య ఉద్గా రాలు అధికంగా ఉండటం వల్ల చర్మం పొడి బారుతుండటం, శిరోజాలు రాలిపోతుండటం వంటి కారణాల వల్ల కాంతి విహీనంగా పెరుగుతున్న వారి సంఖ్య అధిక మైందని వెల్లడైంది. దీంతో ఇప్పుడు మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఎండ వేడిమి, కాలుష్య కారకాల నుంచి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీన్ని గమనించిన కంపెనీలు రెండేళ్లుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులను గణనీయంగా పెంచాయి. అంతే కాదు అమ్మకాల్లోనూ భారీగా వృద్ధి రేటు నమోదైంది. 25 నుంచి 30 శాతం వృద్ధి కాలుష్యం, ఎండ వేడిమి నుంచి చర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతర ఆరోగ్య సంరక్షణ కోసం కంపెనీలు తయారు చేస్తున్న ఉత్పత్తుల అమ్మకాల్లో ఏకంగా 25 నుంచి 30 శాతం వృద్ధి చోటు చేసుకుందని నీల్సన్ తాజా సర్వేలో తేలింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇటీవల వెల్లడించింది. కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడం, ఎండవేడిమి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవాలన్న తపన వల్ల వాటి ఉత్పత్తుల అమ్మకాలు పెరిగి, సౌందర్య సాధనాల ఉత్పత్తుల గిరాకీ తగ్గిందని ఆ సర్వే తేల్చింది. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని హెచ్యూఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. సౌందర్య సాధనాల అమ్మకాల్లో 2 నుంచి 5 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే సౌందర్య సాధనాల కంటే విష వాయువుల నుంచి రక్షించే సౌందర్య సంరక్షణ సాధనాల వైపు ఎక్కువ ఆసక్తి చూపడమే దీనికి కారణమని ఓ మార్కెటింగ్ నిపుణుడు విశ్లేషించారు. కొంతకాలంగా చర్మ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసే బడా సంస్థలు కలర్ కాస్మొటిక్స్ కంటే.. ఫేస్వాష్, స్క్రబ్స్ తయారీపై దృష్టిసారించాయి. రాబోయే దశాబ్ద కాలంలో కాలుష్యం బారీ నుంచి కాపాడే ఉత్పత్తుల వినియోగం ఏటా కనీసం 5 శాతం వృద్ధి చెందుతుందని ఫ్యూచర్ మార్కెట్ ఇన్సైట్స్ అనే గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అంచనా వేసింది. ప్రకృతి, సహాజసిద్ధ (సేంద్రీయ) ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు.. కాస్మొటిక్స్లోనూ ఈ తరహా సాధనాలకు పెద్దపీట వేస్తున్నారు. -
ఎప్పుడూ యంగ్ గా
మనిషి అన్ని దశల్లోనూ యౌవనం అత్యంత కీలకం. అందరూ కోరుకునే దశ అది. ఎప్పటికీ నిలుపుకోవాలనే స్థితి అది. యౌవనాన్ని సూచించే తక్షణ అంశాలు ప్రధానంగా రెండు. మొదటిది తెల్లబడే జుట్టు. రెండోది వదులైపోతూ ముడుతలు పడే చర్మం. అందునా ఇలాంటి చలికాలంలో చర్మం ముడుతలు రావడం... అవి మరింత ప్రస్ఫుటంగా కనిపించడం ఎక్కువ. జుట్టుకు రంగేస్తే అది నల్లబడుతుంది. కానీ చర్మానికి పడే ముడతలను అరికట్టడం ఎలా? చర్మం బిగుతుగా, నిగారింపుతో దీర్ఘకాలం ఉండేలా చేయగలిగితే... మన దేహం మీద యౌవనాన్ని చాలాకాలంపాటు నిలుపుకోవచ్చు. చర్మంపై ముడుతలు నివారించుకొని, చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకుందాం. కాలం గడుస్తున్నకొద్దీ చర్మం మీద పడే ప్రభావాలకు గల కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి... దేహం లోపల అంతర్గతంగా వచ్చే మార్పులకు గల కారణాలు(ఇంట్రిన్సిక్). రెండోది బాహ్య కారణాలు(ఎక్స్ట్రిన్సిక్). అంతర్గత కారణాలు (ఇంట్రిన్సిక్): కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం జన్యువుల్లో ఉంటుంది. కొందరు... తమ ముఫ్ఫై, నలభైల్లో ఉన్నా వాళ్ల వయసు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంటారు. తమలోని అంతర్గత కారణాలతో జరిగే వయసు మార్పులను ‘స్వాభావిక వయసు మార్పులు’ (నేచురల్ ఏజింగ్) అంటారు. ఈ మార్పు 20లలోనే మొదలవుతుంది. మన చర్మం బిగుతుగా ఉండటానికి అందులో ఉండే కొలాజెన్ అనే పదార్థమే కారణం. చర్మ కణాలను ఈ కొలాజెన్ గట్టిగా పట్టి ఉంచి, బిగుతుగా కనిపించేలా చేస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. దాంతో చర్మంలో ఉండే ఎలాస్టిసిటీ తగ్గి చర్మం వదులైపోతూ ఉంటుంది. అలాగే వయసు పెరుగుతున్నకొద్దీ మృతకణాలు కూడా పెరుగుతుంటాయి. వయసు పెరగడం వల్ల చర్మంలో వచ్చే స్వాభావిక మార్పులివి... ►తొలుత చాలా సూక్ష్మమైన ముడుతలు స్కార్స్ మాత్రమే వస్తుంటాయి. (సాధారణంగా నుదుటి మీద ప్రస్ఫుటంగా కనిపిస్తాయి). ►చర్మం క్రమంగా పారదర్శకమవుతూ ఉంటుంది. (పెద్ద వయసు వారికి చర్మం బాగా పారదర్శకమైపోయి లోపలి రక్తనాళాలు స్పష్టంగా కనిపించడం గమనించవచ్చు). ►దేహంలోని ఇతర ప్రదేశాల్లో ఉండే చర్మం కంటే... అరచేతుల వెనక భాగంలోనూ, మెడ దగ్గర చర్మం తొలుత వదులవుతూ ఉంటుం ది. అందుకే మెడ దగ్గర గీతల వద్ద చర్మం వదులవుతూ కనిపిస్తుంటుంది. ►చర్మం కింద ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుండటంతో చెంపల భాగంలో క్రమంగా గుంట పడుతుంటుంది. ఇక కంటి చుట్టుపక్కల ఉన్న చర్మం కింది కొవ్వు కూడా తగ్గుతూంటుంది. ►మెడ దగ్గర, కంటి కింద ఉన్న చర్మం వదులు కావడం వల్ల భూమ్యాకర్షణ శక్తి కారణంగా అక్కడి చర్మం వేలాడుతున్నట్లు కనిపించడం క్రమంగా మొదలవుతుంది. ►కాలక్రమంలో ఎముక కాస్తంత కురచగా మారడంతో ఎముక చుట్టూ ఉండే చర్మం వదులవుతుంది. అందుకే వయసు పెరిగినవారిలో చేతుల చుట్టూ ఉండే చర్మం వేలాడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ►గ్రంథుల సంఖ్య తగ్గడం వల్ల పొడిగా ఉండే చర్మం వారికి దురద ఎక్కువగా ఉంటుంది. ►స్వేదగ్రంథుల సంఖ్య తగ్గడంతో చెమట తగ్గి శరీరాన్ని చల్లబరిచే గుణం క్రమంగా తగ్గుతుంది. ►శరీరంపై ఉండే వెంట్రుకలు క్రమంగా తెల్లబడతాయి. హార్మోనల్ మార్పుల వల్ల తలపై (మాడు భాగంలో) వెంట్రుకలు కూడా క్రమంగా పలచబడతాయి. ఈ మార్పు స్త్రీ, పురుషులిద్దరిలోనూ చోటుచేసుకుంటుంది. ►ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుదల వంటి మార్పుల కారణంగా మహిళల్లో అవాంఛిత రోమాలు ఎక్కువవుతాయి. అందుకే వయసు పెరిగిన మహిళల్లో ముఖం మీద, చుబుకం కింద వెంట్రుకలు పెరిగి కనిపిస్తాయి. ►గోళ్ల చివర అర్థచంద్రాకారంలో ఉండే తెల్లటి భాగం క్రమంగా మాయమైపోతూ ఉంటుంది. బయటి కారణాలు (ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్): వయసు పైబడినట్లుగా కనిపించడానికి అనేక బయటి కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి... సూర్యుడికి ఎక్స్పోజ్ కావడం : సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం వల్ల వయసు పైబడినట్లుగా మారడాన్ని ‘ఫొటో ఏజింగ్’ అంటారు. సూర్యుడి కిరణాల్లోని హానికారక రేడియేషన్కు ఎక్స్పోజ్ కావడం వల్ల చర్మం కమిలినట్లుగా మారడం, ప్రెకిల్స్ (చిన్న చుక్కల్లా కనిపించే గోధుమ రంగు మచ్చలు), ఏజ్ స్పాట్స్, చర్మంపై సన్నటి ముడుతలు కనిపిస్తాయి. సూర్యరశ్మివల్ల కలిగే ఏజింగ్ ప్రక్రియ నివారణకు... ►వీలైనంతవరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ►సూర్యరశ్మిలోకి వెళ్లినప్పుడు కిరణాలు చర్మాన్ని నేరుగా తాకకుండా, చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు (లాంగ్ స్లీవ్ అంటే పొడవు చేతుల చొక్కాల వంటివి) ధరించాలి. మహిళలైతే స్కార్ఫ్ కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ►రోజూ బయటికి వచ్చే ముందర సన్స్క్రీన్ రాసుకోవాలి. ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) 30 కంటే ఎక్కువ ఉండే సన్స్క్రీన్ను ఆరుబయటికి రావడానికి 20 నిమిషాల ముందర చర్మంపై రాసుకోవాలి. ఇలా బయటికి వచ్చాక కూడా ప్రతి మూడు గంటలకు ఒకమారు సన్స్క్రీన్ను రాసుకుంటూండాలి. స్విమ్మింగ్కు వెళ్తున్నప్పుడు లేదా చాలా ఎక్కువగా చెమట పడుతున్నప్పుడు.. తడికి తట్టుకోగల (వాటర్ రెసిస్టెంట్) సన్స్క్రీన్ను వాడాలి. చికిత్స : సూర్యరశ్మికి గురై నష్టపోయిన చర్మానికి లేజర్ టోనింగ్, మైక్రో డర్మా అబ్రేషన్, డర్మారోలర్, కెమికల్ పీలింగ్, లేజర్ రీ–సర్ఫేసింగ్ వంటి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మీసోథెరపీ, ఫైన్ థ్రెడ్ లిఫ్టింగ్ ప్రక్రియల వంటివి అత్యాధునికమైనవి. ఇక ఇలాంటి చికిత్స కోసం చాలా సమయం వెచ్చించలేనివారికి, త్వరితంగా చికిత్స అందించవచ్చు. అందుకు బొటాక్స్, ఫిల్లర్స్ అనే ప్రక్రియలు కూడా ఉన్నాయి. హైఫూ (హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్) టెక్నాలజీతో కూడా ఫేస్ లిఫ్ట్ చికిత్స చేయవచ్చు. భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ)కి గురికావడం : మనం ప్రతి నిత్యం భూమ్యాకర్షణ శక్తికి గురవుతూనే ఉంటాం. ఈ ప్రభావం వల్ల మన చర్మం లో కనిపించే మార్పులను 50 ఏళ్లకు పైబడిన వారిలో తేలిగ్గా, స్పష్టంగా చూడవచ్చు. వారిలో చర్మం భూమ్యాకర్షణ శక్తికి లోబడి కిందికి వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. నివారణ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పుష్టికరమైన సమతులాహారం తీసుకోవడం వల్ల ముఖంలోని చర్మం ఎలాస్టిసిటీని కోల్పోకుండా ఉంటుంది. ముఖంపై పడే సన్నటి ముడుతలు (రింకిల్స్)ను సరిచేయడానికి బొటాక్స్ చికిత్స, చెంపల వద్ద గుంటలు పడటాన్ని ఫిల్లర్స్ చికిత్సతో సరిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఫేస్లిఫ్ట్ ప్రక్రియను ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలతో సాధించవచ్చు. నిద్రలో ముఖం పొజిషన్ వల్ల కనిపించే ఏజింగ్ : మనం నిద్రపోతున్నప్పుడు తలగడపై ముఖాన్ని ఎప్పుడూ ఒక పక్కకు ఒరిగి ఉంచి, పడుకుంటుంటాం. ఇందువల్ల ముఖంపై పడే గీతలు పడతాయి. వీటిని ‘స్లీప్లైన్స్’ అంటారు. ఇవి ముఖం వాలి ఉన్న వైపునకు ఎక్కువగా ఉంటాయి. దాంతో ముఖంపై గీతలన్నీ ఒక సౌష్ఠవంతో (సిమెట్రికల్గా) ఉండవు. దీనివల్ల కూడా వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటుంది. దీన్ని నివారించడానికి ఎప్పుడూ ఒకే వైపు పడుకోకుండా జాగ్రత్త పడాలి. పొగతాగడం వల్ల : ఈ దురలవాటుతో దేహంలోకి ప్రవేశించే విషపదార్థాల కారణంగా శరీరంలో ఎన్నో జీవరసాయన మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లు తాగేవారిలో 10 ఏళ్ల తర్వాత ముఖం మీద రావాల్సిన ఏజింగ్ ముడుతలు పదేళ్ల కంటే ముందుగానే వస్తాయని తెలిసింది. పైగా సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ ముడుతల లోతు పెరుగుతూ పోతుంది. నివారణకు సంక్షిప్త సూచనలు : మనం సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారంలో రంగురంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. క్యారట్, బీట్రూట్, కలర్డ్ కాప్సికమ్, నిమ్మజాతి పండ్లు, స్ట్రాబెర్రీస్, బొప్పాయి పండ్లు, జామ, పుచ్చకాయల్లో ఏజింగ్ను తగ్గించే గుణం ఉంటుంది. ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల చర్మం దీర్ఘకాలం బిగుతుగా ఉంటుంది. ►రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. ►మరీ ఎక్కువ వేడినీటితోగానీ, మరీ చల్లగా ఉండే నీళ్లతో గానీ ముఖం కడుక్కోవడం, స్నానం చేయడాన్ని నివారించాలి. స్నానానికి, ముఖం కడుక్కోడానికి గోరువెచ్చని నీటిని లేదా చల్లటి నీటినే ఉపయోగించాలి. ►ప్రతిరోజూ మాయిశ్చరైజర్ను వాడాలి. ►ముఖానికి పూసుకునే ఓవర్ ద కౌంటర్ సౌందర్యసాధనాలను డాక్టర్ సలహాలతో మాత్రమే వాడాలి. డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చలికాలం... చర్మ సంరక్షణ
చలి అయినా, ఎండైనా దానిప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఇది నవంబరు నెల. రాబోయే నెలల్లో చలి మరింత పెరుగుతుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. అందుకే ఈ సీజన్లో చర్మంలో తేమ లేకపోవడంతో కాస్తంత గీరగానే తెల్లటి చారికలు పడటం అందరికీ అనుభవమే. చలికాలంలో చర్మ సంరక్షణకు సూచనలు. ఇటీవలి మారిన జీవనశైలిలో రాత్రుళ్లు సైతం చలిని లెక్క చేయకుండా ఔటింగ్స్కు వెళ్లడం మామూలే. టీనేజ్ పిల్లలు ఈ పని మరింత ఎక్కువగా చేస్తుంటారు. ఇలాంటివారు చర్మ సంరక్షణ ... ►రాత్రి చలిలో బయటికి వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా థిక్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇక ఈ సీజన్లో పగటి ఎండ కూడా ఒకింత తీక్షణంగానే ఉంటుంది. అందుకే ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్ను, ఎండ అలర్జీలను (సన్ అలర్జీస్) నివారించడానికి సన్స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. అయితే జిడ్డు చర్మం కలిగి ఉండే టీనేజ్ పిల్లలు మాత్రం నూనె లేని (ఆయిల్ ఫ్రీ) సన్స్క్రీన్స్ రాసుకోవాలి. ఇక పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే ఆయిల్ బేస్ సన్స్క్రీన్స్ రాసుకోవాలి. ►ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) 40–50 ఉన్న క్రీములు వాడటం మంచిది. చర్మానికి జాగ్రత్తలు: చలికాలంలో వాతావరణం తేమను లాగేస్తుందన్న విషయం తెలిసిందే. వేడినీటి స్నానం చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది. కానీ చన్నీళ్లు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే బాగా వేడిగా ఉండే నీళ్లకు బదులు గోరువెచ్చని నీటినే వాడాలి. ►స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు/గ్లిజరిన్ బేస్డ్ సబ్బు మంచిది. ►స్నానం చేసి, కాస్త తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజింగ్ క్రీమ్ను రాయాలి. ఇలా రోజుకు 3,4 సార్లు రాయడం మంచిది. ►తల స్నానానికి రెండు గంటల ముందర మాడుకు నూనె మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్గా పనిచేస్తుంది. పొడిజుట్టు ఉన్నవారైతే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి. ►తడి జుట్టును ఆరబెట్టుకోడానికి డ్రైయర్ వాడకూడదు. ఎందుకంటే అది మాడుపైని చర్మాన్ని, నుదుటినీ మరింత పొడిబారుస్తుంది. ►రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. అసలే చల్లటి వాతావరణం కారణంగా ఈ కాలంలో నీటిని తాగడం తగ్గుతుంది. కాబట్టి చర్మం పటుత్వాన్ని , తేమను కోల్పోయి మరింత గరుగ్గా కనిపిస్తుంది. అందుకే తగినంత నీరూ తాగాలి. పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు (గ్రీన్లీఫీ వెజిటబుల్స్) ఎక్కువగా తినాలి. ►పెదవులు పగలకుండా పెట్రోలియమ్ జెల్లీ లేదా లిప్ బామ్ను పెదవులపై రాస్తూ ఉండాలి. ►పాదాలకూ, చేతులకూ కాటన్ గ్లౌజ్ వేసుకోవడం చాలా మంచిది. అది పగుళ్లను నివారిస్తుంది. ఈ క్రీమ్స్ వాడండి: ఈ సీజన్లో చాలామంది కోల్డ్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే ఎలాంటి కోల్డ్ క్రీములు వాడాలో చాలామందికి తెలియదు. ఈ కోల్డ్ క్రిమ్స్ ఎలా ఉండాలంటే... ►ఈ సీజన్లో వాడాల్సిన కోల్డ్ క్రీమ్స్ వాసనలేనివై ఉండాలి. ఒకవేళ మంచి ఫ్లేవర్తో కూడిన వాసన ఉన్నవాటిని మీరు వాడాలనుకుంటే... అవి ఎంత తక్కువ వాసనతో ఉంటే అంత మంచివని గుర్తుపెట్టుకోండి. వాసన తక్కువైన కొద్దీ చర్మంపై వాటి దుష్ప్రభావం అంతగా తగ్గుతుంటుంది. ►అలర్జీ కలిగించని (హైపో అలర్జిక్) క్రీమ్లను ఎంపిక చేసుకోవాలి. అలర్జీ కలిగించే వాటితో ఆరోగ్యపరంగా మళ్లీ ఓ కొత్త సమస్య ఎదురుకావచ్చు. ►ఈ సీజన్లో చర్మానికి క్లెన్సర్లు వాడకూడదు. అవి మరింత పొడిబారేలా చేస్తాయి. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నిగారింపు ఇలా సొంతం
చర్మ సంరక్షణకు ఏ సౌందర్య ఉత్పాదనలు వాడాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ, ఇంట్లో రోజూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతోనే చర్మం నిగారింపును కాపాడుకోవచ్చు. ►కళ్ల కింద ఉబ్బు, వలయాలు ఏర్పడటం వంటివి గమనిస్తే.. రాత్రి పడుకునే ముందు వేలితో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తేనె మరీ జిడ్డుగా అనిపిస్తే టీ స్పూన్ నీళ్లు కలిపి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. ►రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్ చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్ డస్ట్ సులువుగా వదిలిపోతుంది. ఆ తర్వాత ముఖాన్ని ఫేస్వాష్తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం నిగారింపు పెరుగుతుంది. -
బ్యూటిప్స్
జిడ్డు పోవాలంటే.. వేసవిలో చర్మం త్వరగా జిడ్డు అవుతుంది. దీని కోసం పదే పదే ముఖం కడుగుతుంటారు. సబ్బుల వాడకం పెరిగితే చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. అందుకని.. ►స్పూన్ తేనె, పావు టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి రెండు–మూడు నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చందనం, ముల్తానీమిట్టి, తేనె, రోజ్వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. -
బ్యూటిప్స్
ఆరు టీ స్పూన్ల పెట్రోలియమ్ జెల్లీలో రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మాయిశ్చరైజర్ని రాత్రి పడుకోబోయే ముందు శరీరానికంతటికీ పట్టించాలి. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా చేస్తే చర్మం పొడిబారడం తగ్గి మృదువవుతుంది. అర టీ స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా గంధం తీసుకుని పే‹స్ట్లా కలుపుకోవాలి. ఇందులో బొప్పాయి గుజ్జుని కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇది స్క్రబ్లా ఉపయోగపడడమే కాకుండా, చర్మకాంతి కూడా మెరుగవుతుంది. -
సెల్ఫోన్ అధికంగా వాడితే మీ చర్మం..
సాక్షి, ముంబై : సెల్ఫోన్ అధికంగా వాడటం వల్ల కళ్లు దెబ్బతింటాయి.. మానసినక రుగ్మతలకు దారితీస్తుంది.. ఇవి అందరికీ తెలిసిన విషయాలే! అయితే సెల్ఫోన్లను ఎక్కువసేపు వాడటం వల్ల దానినుంచి విడుదలయ్యే బ్లూలైట్ కారణంగా చర్మం దెబ్బతింటుందని చర్మవైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా త్వరగా వయసు మీదపడిన ఛాయలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ముంబైకి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్టు డా. షెఫాలి ట్రాసీ నెరూర్కర్. ఎవరైతే గంటల తరబడి సెల్ఫోన్లు వాడుతుంటారో వారు పిగ్మెంటేషన్, ఇన్ఫ్లమేషన్, చర్మ బలహీనపడటం వంటి వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సెల్ఫోన్లు మాత్రమే కాకుండా కంప్యూటర్ తెరలనుంచి విడుదలయ్యే బ్లూలైట్ కారణంగా మన చర్మానికి రక్షణగా నిలిచే కొల్లజన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుందని తెలిపారు. బ్లూలైట్ కారణంగా చర్మంలోని కణాలు దెబ్బతిని త్వరగా వయసు మళ్లిన వారిలా కనపడేలా చేస్తాయన్నారు. చర్మంపై ముడతలు, నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరి రాత్రుళ్లు ఎక్కువగా సెల్ఫోన్లు ఉపయోగించే వారి నిద్రకు అటంకాలు ఏర్పటం మూలాన మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు సెల్ఫోన్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. -
కాంతివంతమైన మెరుపు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మసంరక్షణ కష్టంగా మారుతోందా? మార్కెట్లో దొరికే లోషన్స్, ఫేస్క్రీమ్స్ రాసుకుంటున్నా సమస్య తాత్కాలికంగానే అనిపిస్తోందా? అయితే సహజసిద్ధమైన చిట్కాలని ప్రయత్నించి చూడండి. కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. స్క్రబ్, క్లీనప్ చేసుకుంటే జిడ్డు, మృతకణాలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి. ఆవిరి పట్టించడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇక ఫేస్ప్యాక్ వేçసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారి మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి. కావల్సినవి : క్లీనప్ : ఎగ్ – 1(తెల్లసొన), పాలు – 2 టీ స్పూన్లు స్క్రబ్ : ఆలీవ్ నూనె – 2 టీ స్పూన్లు, పంచదార – అర టీ స్పూన్లు ఓట్స్ – 2 టీ స్పూన్లు, బాదం గుజ్జు – అర టీ స్పూన్ మాస్క్ : జామకాయ గుజ్జు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ టమాటా జ్యూస్ – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా గుడ్డు తెల్లసొన, పాలు ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలివ్ నూనె, పంచదార, ఓట్స్, బాదం గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జామకాయ గుజ్జు, టమాటా జ్యూస్, తేనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
సౌందర్యరాశిలా
చర్మసంరక్షణకు కాసింత సమయం కేటాయిస్తే చాలు.. ఎలాంటి ఫేస్క్రీమ్స్, లోషన్లతో పనిలేకుండా సౌందర్యరాశిలా మెరిసిపోవచ్చు. ఇంటిపట్టున దొరికే పసుపు, పెరుగు వంటి మిశ్రమాలతోనే చర్మకాంతిని రెట్టింపు చేసుకోవచ్చు. మచ్చలు, మొటిమలు లేని అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఇలా క్లీనప్, స్క్రబ్లతో పాటు ఫేస్ప్యాక్ని కూడా ప్రయత్నించండి. అందాన్ని రెట్టింపు చేసుకోండి. కావల్సినవి: క్లీనప్ : కీరదోస రసం(జ్యూస్) – 3 టీ స్పూన్స్, తేనె – 1 టీ స్పూన్, పెరుగు – అర టీ స్పూన్ స్క్రబ్ : కోకో పౌడర్ – అర టేబుల్ స్పూన్, ఓట్స్ – అర టేబుల్ స్పూన్, వెన్న – అర టీ స్పూన్, రోజ్ వాటర్ – 1 టేబుల్ స్పూన్ మాస్క్ : అవొకాడో – సగం ముక్క (మీడియం సైజ్), తేనె – 1 టేబుల్ స్పూన్, పెరుగు మీగడ – అర టీ స్పూన్, పసుపు – కొద్దిగా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని కీరదోస రసం, తేనె, పెరుగు బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్,ఓట్స్, వెన్న ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అవొకాడో శుభ్రం చేసుకుని గుజ్జులా చేసుకుని, అందులో తేనె, పెరుగు మీగడ, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
చర్మానికి చమక్కు
ఖరీదైన సౌందర్య ఉత్పాదనలే చర్మ సంరక్షణకు వాడాలి అనే నిబంధన ఏమీ లేదు. సాధారణ జాగ్రత్తలతోనే వానాకాలం ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు. ∙రోజూ ఉదయం సాయంత్రం యాంటీబ్యాక్టీరియల్ లేదా క్లెన్సింగ్ సబ్బు/లోషన్ను శరీర శుభ్రతకు ఉపయోగించాలి. వీటి వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే గాక ఈ కాలపు బ్యాక్టీరియా దాడిని అడ్డుకోవచ్చు. ∙ చర్మంపై పొలుసులుగా కనిపించే మృతకణాలను సహజపద్ధతులతో తొలగించుకోవాలి. దీనికి నలుగుపిండి మేలైన ఎంపిక. మృతకణాల తొలగింపునకు నిమ్మరసం, పసుపు కూడా బాగా పనిచేస్తాయి. ∙చర్మంపై మలినాలను తొలిగించడానికి ఆల్కహాల్ లేని టోనర్ని ఉపయోగించాలి. దీని వల్ల స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. ఫలితంగా చర్మం తేమను కోల్పోదు. (క్లెన్సింగ్ ఉత్పత్తులను కోనుగోలు చేసే ముందు ప్రొడక్ట్ వెనకవైపు ఇచ్చే లేబుల్ పరిశీలించాలి) ∙ చల్లగా, మబ్బుగా వాతావరణం ఉంటుంది కదా అని వదిలేయకుండా బయటకు వెళ్లడానికి ముందు సన్స్క్రీన్ లోషన్, ఎస్.పి.ఎఫ్ 15 నుంచి 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్ను సూర్యకాంతి పడే శరీరభాగాలకు ఉపయోగించాలి. అధిక ఎస్.పి.ఎఫ్ ఉన్న లోషన్ని ఉపయోగిస్తే చర్మం మరీ జిడ్డుగా అనిపిస్తుంది. అందుకని తగినంత మోతాదులో రాసుకోవాలి. ∙ క్రీమ్ తరహా కాకుండా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్/సీరమ్ వాడితే చర్మం డీహైడ్రేట్(నిస్తేజం) కాకుండా, కాంతిమంతంగా కనిపిస్తుంది. -
సమ్మర్ బాత్
ఒక లీటరు నీటిలో మల్లె, జాజి వంటి పూలకు లేదా గులాబీ రెక్కలను వేసి మరిగించి చల్లారిన తర్వాత స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా తాజాగా, హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇది నాచురల్ డియోడరెంట్గా పనిచేస్తుంది. తాజా పూలు సాధ్యం కానప్పుడు ఈ పూల తాలూకు సువాసనతోకూడిన ఎసెన్షియల్ ఆయిల్ వాడవచ్చు. స్నానం చేసే నీటిలో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్స్ వాడేటప్పుడు ముందుగా అర మగ్గు నీటిలో ఆయిల్ వేసి బాగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం నీటిలో పోయాలి. -
ఆ సమస్యతో గర్భస్రావమా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ని. నాకు రక్తహీనత సమస్య ఉంది. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? – బి.ఎల్, నర్సరావుపేట రక్తహీనత అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తక్కువ ఉండటం. మనం తినే ఆహారం జీర్ణమై, దాని నుంచి విడుదలయ్యే పదార్థాలను, ఆక్సిజన్ను ఈ హిమోగ్లోబిన్, రక్తంలోని అన్ని కణాలకు, అవయవాలకు చేరవేస్తుంది. దాని వల్ల శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు సరిగా జరుగుతాయి. గర్భిణీలలో తల్లి నుంచి కడుపులోని శిశువుకు రక్తం ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా అవుతాయి. గర్భిణీలలో రక్తహీనత ఉన్నప్పుడు బిడ్డకు ఆక్సిజన్, పోషక పదార్థాల సరఫరా తగ్గే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల తల్లిలో ఇన్ఫెక్షన్స్, నెలలు నిండకుండా కాన్పులు, కాన్పు తర్వాత కూడా సమస్యలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ సమస్యలు రక్తహీనత తీవ్రతనుబట్టి ఉంటాయి. రక్తహీనత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పైన చెప్పిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేవలం రక్తహీనత వల్ల అబార్షన్లు అవ్వవు. రక్తహీనత బాగా తీవ్రంగా ఉన్నవారిలో ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ వంటి బయటికి కనిపించని ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కలిసినప్పుడు వీరిలో కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత కొద్దిగా ఉండేవాళ్లు దాని తీవ్రతను బట్టి ఐరన్ ట్యాబ్లెట్స్, పౌష్టికాహారంతో పాటు అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన స్కిన్ కేర్ టిప్స్ తెలియజేయగలరు. మా బంధువుల అమ్మాయి ఒకరికి అనీమియా సమస్య ఉందని విన్నాను. ఇది గర్భిణీలకు ఎందుకు వస్తుంది? – పి. రేఖ, రామన్నపేట వేసవి కాలం ప్రెగ్నెన్సీ సమయంలో.. ఎండల వల్ల శరీరంలో నీరు తగ్గడం, ఎక్కువగా చెమట పట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో శరీరంలో చెమ్మ తగ్గి చెమట పొక్కులు, దురద, మంట, చిరాకు వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగి జావ వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో తేమ తగ్గకుండా ఉంటుంది. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలాగే గొడుగును తీసుకెళ్లడం కూడా మంచిది. గర్భిణీలలో రక్తంలో నీటి శాతం పెరగడం, పెరిగే బిడ్డ అవసరాలకు, తల్లి శరీరంలో మార్పులకు సంబంధించి హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. దీనివల్ల గర్భిణీలలో అనీమియా ఎక్కువగా కనిపిస్తుంది. గర్భంలో శిశువు పెరుగుదలకు, తల్లి రక్తం నుంచి బిడ్డ ఆహారం, ఐరన్ వంటివి తీసుకోవడం వల్ల, తల్లిలో రక్తం తగ్గుతుంది. గర్భిణీలలో తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, ఆహారంలో ఉన్న ఐరన్, విటమిన్స్, మినరల్స్ సరిగా రక్తంలోకి చేరకపోవడం వల్ల కూడా వీరిలో అనీమియా వస్తుంది. గతంలో నాకు చక్కగా నిద్ర పట్టేది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రం నిద్ర పట్టడం చాలా కష్టం అవుతోంది. మా ఫ్రెండ్ ఒకరు ‘ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా’ కావచ్చు అన్నారు. ఇది నిజమేనా? దీని గురించి తెలియజేయగలరు. ‘ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా’ నివారణకు ఏమైనా మందులు ఉన్నాయా? చెప్పగలరు. – యస్. లావణ్య, కొత్తగూడెం గర్భిణీ సమయంలో అనేక కారణాల వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి ఇబ్బంది ఎదురవుతుంది. దీన్నే ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా అంటారు. గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. వీటిలో హార్మోన్ల మార్పులు, నడుమునొప్పి, అసిడిటీ, అజీర్తి వంటివి వస్తాయి. పొట్ట పెరిగే కొద్దీ ఇబ్బంది, ఆందోళన, భయం, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లవలసి రావడం, కాళ్లనొప్పులు వంటి అనేక కారణాల వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా పట్టకపోవడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు నిద్ర పట్టడానికి మందులు వాడటం మంచిది కాదు. వీరు నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలు పాటించడం శ్రేయస్కరం. రాత్రిపూట తొందరగా భోజనం చేసి, కొంతసేపు అటూఇటూ నడవాలి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి. నీళ్లు ఎక్కువగా పగటి పూట తీసుకొని, రాత్రి తక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిపూట మూత్రం కోసం నిద్ర లేవడం తగ్గుతుంది. కాళ్ల కింద, నడుము కింద, పొట్ట కింద, మోకాళ్ల మధ్యలో దిండు పెట్టుకొని పడుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, మంచి పుస్తకాలు చదవడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొందరికి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. పీరియడ్ బ్లడ్ కలర్తో ఆరోగ్య లక్షణాల గురించి తెలుసుకోవచ్చని ఎక్కడో చదివాను. ఏ రంగు ఏ లక్షణాన్ని సూచిస్తుందో తెలియజేయగలరు. – రజిత, హైదరాబాద్ పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అలాగే వారిలోని హార్మోన్ల అసమతుల్యతని బట్టి వారి రక్తస్రావంలో రక్తంలోని రంగు ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్న వారిలో మొదటి రెండు మూడు రోజులు ముదురు ఎరుపులో, కొందరిలో చిన్న ముక్కలుగా ఉంటుంది. తర్వాత రెండు రోజులు బ్లీడింగ్ తగ్గేకొద్దీ రక్తం గడ్డకట్టి కొద్దిగా బ్రౌన్ రంగులో, ఎండోమెట్రియం పొర ఊడిపోతుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రక్తం బ్రౌన్ రంగులోకి మారి, వాసనతో ఉంటుంది. రక్తస్రావంలో బ్లీడింగ్ రంగు రోజురోజుకి మారుతుంది. మొదట నీళ్లలాగా ఎర్రగా రావచ్చు. తర్వాత రోజు ముక్కలు ముక్కలుగా రావచ్చు. ఆ తర్వాత బ్రౌన్ కలర్లో వస్తూ కొద్దికొద్దిగా తగ్గిపోవచ్చు. రక్తానికి ఎక్కువ గాలి తగలడం వల్ల అది రంగు మారుతుంది. ఎక్కువసేపు ఉన్నప్పుడు అది నల్లగానూ మారవచ్చు. బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవుతూ, గడ్డలు గడ్డలుగా పోతున్నప్పుడు గర్భాశయం, అండాశయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం డాక్టర్ని సంప్రదించడం మంచిది. రక్తం రంగు కంటే బ్లీడింగ్ ఎంత, ఎన్ని రోజులు అవుతుందనేదే ముఖ్యం. ఇది కూడా కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
శరీర దుర్వాసనను గుర్తించే యాప్
న్యూయార్క్: సాధారణంగా మన శరీరం నుంచి వచ్చే దుర్వాసనను, చెమట కంపును మనం గుర్తించలేం. ఆ వాసనకు మన ముక్కు అలవాటుపడటమే అందుకు కారణం. దీంతో చుట్టుపక్కలవారు ఇబ్బంది పడుతుంటారు. ఈసమస్యను తీర్చే యాప్ను చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారుచేసే సంస్థ నివియా తయారు చేసింది. ‘నోస్’ అనే పేరున్న ఆ యాప్ మన శరీర దుర్వాసనను గుర్తించి మనల్ని హెచ్చరిస్తుంది.యాప్ను మరింత పరీక్షించి, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. -
స్టైల్గా హోలీ!
బ్యూటిప్స్ ఏడురంగులు.. ఏ రంగు ఎటువైపుగా మన మేనిని తడుముతుందో తెలియదు. కానీ, తెలుపు రంగు దుస్తులను ధరిస్తే ఊహించనన్ని రంగులు డిజైన్లు డిజైన్లుగా ఆనందపు కెరటాల్లా అంటుకుపోతాయి. అందుకని తెల్లని సల్వార్, రంగుల బాందినీ ప్రింటెడ్ చున్నీ ధరిస్తే చాలు పండగ సంబరం రెట్టింపు అవ్వాల్సిందే! కాలే జీ యువతులైతే షార్ట్స్, వదులుగా ఉండే టీ షర్ట్ లేదా కుర్తా ఈ పండగకు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే, తప్పనిసరిగా లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ దుస్తులను ఇందుకోసం ఎంచుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్: హోలీ ఆడటానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ను మేనికి రాసుకోండి. ఇలా చేయడం వల్ల రంగుల వల్ల కలిగే మంట, దురద సమస్యలు ఉండవు. నూనె వల్ల కాసేపు చర్మం జిడ్డుగా అనిపిస్తుంది కానీ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. చర్మకాంతి కూడా తగ్గదు. హోలీ రంగునీళ్ల నుంచి, ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు వాటర్ప్రూఫ్ సన్స్క్రీన్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని ఉపయోగించవచ్చు. హెయిర్ స్టైల్: జుట్టును లూజ్గా వదిలేస్తే రంగులు అంటుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. హోలీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకని ఫ్రెంచ్ పోనీటెయిల్ వేసుకుంటే స్టైల్గా కనిపిస్తారు. జుట్టు గురించిన ఆందోళనా తగ్గుతుంది. పండగ కళ రావాలంటే పోనీటెయిల్కు పూసలు, కుందన్స్ ఉన్న క్లిప్ లేదా బ్యాండ్ను వాడచ్చు. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు కండిషనర్ వాడితే ఆ తర్వాత పాడవుతుందనే బెంగ ఉండదు. లేదంటే ముందుగా వెచ్చని కొబ్బరి నూనెను తలకంతా బాగా పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మాయిశ్చరైజర్ను కోల్పోవు. -
ఇలా చేస్తే... వేసవిలోనూ వన్నె తగ్గదిక!
సమ్మర్ స్కిన్కేర్ స్వేదం చిందించే వేసవిలో చర్మసంరక్షణ నిజంగా ఒక పరీక్షే. బయటకు వెళితే చుర్రుమనే ఎండకు తోడు దుమ్ము, ధూళి, వాహనాల నుండి వెలువడే కాలుష్యం గాలిలో తేలుతూ వచ్చి ముఖానికి మాస్క్ వేసినట్లు కప్పేస్తాయి. ఎప్పటికప్పుడు ఈ మలినాలను తొలగించుకోకపోతే చర్మం నల్లబడడమే కాకుండా రాష్ వస్తుంది. ఈ బాధల నుండి బయటపడి ముఖాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి స్టీమింగ్ బాగా పని చేస్తుంది. ఎండాకాలంలో ముఖానికి తరచు ఆవిరి పట్టాలి. పొడి చర్మానికి రెండు వారాలకొకసారి ఆవిరి పడితే సరిపోతుంది, జిడ్డు చర్మానికి మాత్రం వారానికొకసారి పట్టాలి. ఆవిరి పట్టడానికి బ్యూటీపార్లర్కే వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో స్టీమింగ్ గాడ్జెస్ దొరుకుతాయి. వాటిలో నీళ్లు పోసి స్విచ్ వేస్తే ఒకటి రెండు నిమిషాలలోనే ఆవిరి వస్తుంది. బయటకు విడుదలయ్యే ఆవిరి నేరుగా ముఖానికి తగిలేటట్లు పట్టాలి. లేదా ఒక పాత్రలో నీరు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తర్వాత మూత తీసి ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి బయటకు పోకుండా మందపాటి టవల్ను తలమీద నుండి పాత్రను కవర్ చేస్తూ కప్పుకోవాలి. నాలుగైదు నిమిషాల సేపు ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే చర్మరంధ్రాలలో ఓపెన్ అయి చేరిన దుమ్ము, ధూళి బయటకు వచ్చేస్తాయి. టిష్యూ పేపర్తో కానీ మెత్తని టవల్తో కానీ మెల్లగా అద్దాలి. తర్వాత ఐస్ క్యూబ్తోగానీ, చల్లని నీళ్లతో కానీ ముఖం కడుక్కుంటే చర్మరంధ్రాలు తిరిగి యథావిధిగా మారుతాయి. ఈ సీజన్లో క్రమం తప్పకుండా ఆవిరి పడితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖం, మెడ భాగాలను క్లెన్సింగ్ మిల్క్తో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మానికి క్లెన్సింగ్ మిల్స్ బదులుగా ఆస్ట్రింజెంట్ వాడాలి.రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని మసాజ్ ఆయిల్తో కానీ క్రీమ్తో కానీ లైట్గా మసాజ్ చేసుకోవాలి. వేసవిలో స్వతహాగా చర్మగ్రంధులు ఉత్తేజితమవుతాయి కాబట్టి క్రీమ్ కొద్ది మోతాదులో వాడితే సరిపోతుంది. ఇంట్లోనే ఈజీగా... చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసు కుంటే అందాన్ని ఆరోగ్యాన్ని ఏకకాలంలో కాపాడుకోవచ్చు. కొబ్బరి నూనెలో రోజ్మెరీ, లావెండర్ లాంటి మీకు నచ్చిన సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దోసకాయ చెక్కుతీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అరటీస్పూన్ గ్లిజరిన్, అరటీస్పూన్ రోజ్వాటర్ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంతవరకు ఉంచి శుభ్రపరుచు కోవాలి. ఇలా రోజూ చేస్తే క్రమేణా కమిలిన భాగం మామూలుగా అయిపోతుంది. ఆరు టీ స్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు పొడిబారిన చర్మానికి, చేతులకి, కాళ్లకి రాస్తే సున్నితంగా తయారవుతాయి.పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్ను కరిగించి, కొంచెం మస్టర్డ్ ఆయిల్ కలపాలి. పగుళ్లు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాయాలి. పది, పది హేను రోజులపాటు ఈ విధంగా చేస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.కొబ్బరి నూనెతో కాళ్లకు మర్ధనా చేసి గోరువెచ్చని నీటిలో కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత పాదాల్ని తడిలేకుండా తుడిచి పది మందారపూలు, గుప్పెడు గోరింటాకు, అరచెక్క నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసి పాదాలకు పట్టించాలి. అది ఎండిన తరు వాత కడిగెయ్యాలి. చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్క్యూబ్తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. -
ఎండల్లో హెయిర్కేర్
ఎండకాలంలో చర్మసంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో కేశసంరక్షణకు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం శ్రద్ధపెడితే తీవ్రమైన ఎండల్లోనూ అలల్లా ఎగిసిపడే కేశాలు సాధ్యమే. * ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి రాసినట్లే జుట్టుకు లేదా మాడుకు కొంచెం సన్స్క్రీన్ లోషన్ అప్లయ్ చేయాలి. ఈ లోషన్లు రాసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లేదా రాత్రి పడుకునే లోపుగా తలస్నానం చేయాలి. అలా సాధ్యం కానప్పుడు లోషన్లకు బదులుగా మాడుకు కొబ్బరినూనె రాయాలి. * ఈ కాలంలో స్విమ్మింగ్పూల్స్ అన్నీ నిండుగా ఉంటాయి. ఈతప్రియులు ఎండవేడి నుంచి సాంత్వన పొందడానికి ఎక్కువ సేపు నీటిలో ఉండడానికి ఇష్టపడతారు. అయితే స్విమ్మింగ్పూల్స్లో ఉండే నీటిలో క్లోరిన్ కలుపుతారు, ఉప్పునీరు కూడా ఉంటుంది. కాబట్టి పూల్లో దిగే ముందు తలను మంచినీటితో తడపాలి. జుట్టు తగినంత నీటిని పీల్చుకున్న తర్వాత ఎంత సేపు పూల్లో ఉన్నా ఆ నీటిని పీల్చుకోదు. కాబట్టి అందులోని రసాయనాల ప్రభావం జుట్టుపై పడదు. స్విమ్మింగ్ పూర్తయిన తర్వాత తప్పని సరిగా తలస్నానం చేయాలి. * తలస్నానం పూర్తయిన తర్వాత కండిషనర్ వాడకాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. సమ్మర్ కోసం ప్రత్యేకంగా సన్స్క్రీన్ ఉన్న హెయిర్ కండిషనర్లు మార్కెట్లో దొరుకుతాయి. * తలస్నానం చేసేటప్పుడు చివరగా నిమ్మరసం కలిపిన నీటితో జుట్టును తడపాలి. ఇలా చేయడం వల్ల కేశాలు దృఢంగా మారతాయి. కాని ఎండకాలంలో పొడిజుట్టుకు నిమ్మరసం వాడితే మరింత నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పొడిజుట్టుకు కాఫీ డికాషన్ వంటి కండిషనర్లను వాడడం మంచిది. * మూడు కప్పుల మంచినీటిలో రెండు కప్పుల ఆపిల్సైడర్ వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక చివరగా జుట్టుకు పట్టించాలి. చుండ్రు ఉంటే ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు కూడా పట్టించాలి. -
స్కిన్ కౌన్సెలింగ్
ఇటీవలి ఎండలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. నేను ఎండలో వెళ్లేప్పుడు సన్స్క్రీన్ రాసుకోవచ్చా? సన్స్క్రీన్లో ఎంత ఎస్పీఎఫ్ ఉన్నది వాడాలి? - రేఖరాణి, సికింద్రాబాద్ ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ కింది సూచనలు పాటించండి.... చర్మరక్షణ కోసం సన్ స్క్రీన్స్ ఉపయోగించడం అన్నది ఎప్పుడూ మంచిదే. మన దేశంలో ఎస్పీఎఫ్ 25 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్స్క్రీన్స్ వాడటం మంచిది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటి ఎండ నేరుగా పడేలా తిరగవద్దు. అలాగని అస్సలు ఎండలో తిరగకపోవడం వల్ల వైటమిన్ డి లోపం క్యాల్షియమ్ లోపం కూడా రావచ్చు. అందుకే అప్పుడప్పుడూ ఎండ తగులుతూ ఉండాలి. అయితే ఇలాంటి ఎండ కోసం మధ్యాన్నం పూట బయట తిరగకండి. కేవలం ఎండపొడ లేతగా ఉన్న సమయంలో మాత్రమే బయట తిరగండి. డాక్టర్ మేఘనారెడ్డి కె. డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్ స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్ -
కూల్ వెదర్.. హాట్ బ్యూటీ
‘చలికాలం కదూ... స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. మాయిశ్చరైజర్స్ బాగా యూజ్ చేస్తాను’ అంటూ చెప్పింది అప్కమింగ్ అందాల తార నిఖితా నారాయణ్. గచ్చిబౌలిలోని విప్రోలేక్ సమీపంలో గురువారం బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో మరో నటి సుచిత్రాఆనందన్తో మెరిసిన నిఖిత... చలికాలంలో పాటించాల్సిన టిప్స్ని ‘సిటీ ప్లస్’తో పంచుకుంది. సిటీలో వెదర్ బాగా కూల్గా ఉందంటూ... ఇలాంటి సీజన్లో చాలా మంది నీళ్లు తాగడం మానేస్తారని, అయితే అది సరికాదంది. నీళ్లు సరిపడనంత తాగకపోతే అది స్కిన్పై ప్రభావం చూపుతుందని చెప్పింది. చల్లని వెదర్లో హాట్ కాఫీ తాగుతుంటే ఆ మజాయే వేరంటున్న ఈ కన్నడ సుందరి... వైన్లూ, విస్కీలకు తాను చాలా దూరం అంది. వైన్ టేస్ట్ చేయవచ్చని ఇంట్లోవాళ్లే ప్రోత్సహించినా... తనకు ఆ టేస్ట్ నచ్చలేదంది. పైగా తనలాంటి లో బీపీ పేషెంట్స్కి అవి న ప్పవు కూడా అంటూ నవ్వేసింది. మన సంప్రదాయ ఆహారంలోనే సీజనల్ సమస్యలకు సమాధానాలు లభిస్తాయని, ఈ సీజన్లో ఇంటి వంటకాల్లో పెప్పర్ వంటివి విరివిగా వినియోగిస్తారని మీకు తెలుసు కదా అంటూ ఉదహరించింది. గ్రిల్డ్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమన్న నిఖిత... బార్బెక్యూ గచ్చిబౌలిలో ప్రారంభించడంతో తను ఉంటున్న చోటుకి అది చాలా దగ్గరగా ఉందంటూ సరదా పడిపోయింది. బాయ్ఫ్రెండ్ గురించి అడిగితే... ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లే అయిందనీ, అప్పుడే అలాంటివి అడిగితే ఎలా? అని చిన్నబుచ్చుకుంది. అంతకీ కావాలంటే మీరే ఎవరితోనైనా ముడిపెట్టేయండంటూ చమత్కరించిందీ మాజీ మిస్ హైదరాబాద్. -
‘అందమే’ ఆనందం..
అందచందాలపై మగువుల మక్కువ బాహ్యసౌందర్యం కోసం భారీగా వ్యయం బ్యూటీపార్లర్ల వైపు నగర మహిళల చూపు తెలంగాణ ప్యారిస్ దిశగా ఖమ్మం ! అందం గురించి ఒక్కో సినీ కవి ఒక్కో విధంగా వర్ణించారు. ఒకరు ‘అందమే ఆనందం..’ అంటే మరొకరు ‘అందం అంటే ఆడది..’ అంటూ మగువల అందచందాలను ఆకాశానికెత్తారు. ఎవరెలా నిర్వచించినా అందం ప్రస్తావన వస్తే ఆడవాళ్లను విస్మరించలేమనేది యదార్థం. ఖమ్మం నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా నగర మహిళల సౌందర్యాభిరుచి పెంపొందుతోంది. బాహ్యసౌందర్యం కోసం భారీగానే వెచ్చిస్తున్నారు. అందుకే ఇక్కడ బ్యూటీపార్లర్లు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. నగరంలో బ్యూటీపార్లర్ లేని వీధి లేదంటే అతిశయోక్తికాదు. సుమారు 200 వరకు బ్యూటీపార్లర్లు ఉన్నట్టు ఓ అంచనా. హెయిర్, స్కిన్కేర్ విషయంలో నగర మహిళలు కనబరుస్తున్న శ్రద్ధను గమనిస్తే కొద్దిరోజుల్లో ‘తెలంగాణ ప్యారిస్’గా ఖమ్మం పేరుగడిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఖమ్మం హవేలి: అందచందాలకు నగర మహిళలు ఇస్తున్న ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, ఇతర పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే భారీ స్థాయి బ్యూటీపార్లర్లు... అభివృద్ధి, వ్యాపార రంగంలో రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఖమ్మం నగరంలోనూ పదుల సంఖ్యలో దర్శనం ఇస్తున్నాయి. నగరంలో సుమారు ఇరవై వరకు భారీ స్థాయి బ్యూటీ పార్లర్లు వెలిశాయి. ఇక చిన్నాచితక బ్యూటీపార్లర్లయితే లెక్కలేవు. దాదాపు ప్రతి వీధికి ఒకటి చొప్పున అయినా ఉన్నాయి. మొత్తంగా 200కు పైగా ఉన్నట్టు ఓ అంచనా. సౌందర్యం విషయంలో మహిళలు, యువతులు పెద్ద నగరాల వారికి దీటుగా ప్రాధాన్యత ఇస్తుండడంతో ఖమ్మంలో బ్యూటీ పార్లర్ల వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మగవాళ్లు సైతం హెయిర్, స్కిన్ కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం గమనార్హం. నలుగు నుంచి పార్లర్ దాకా... భారతీయ సంప్రదాయంలో అలంకరణకు మహిళలు ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకు అందం తోడైతే ఆ ఆకర్షణే వేరు. పూర్వం ప్రతి వారంలో మహిళలు రెండుసార్లు చర్మానికి నలుగు పెట్టుకునేవారు. నేటి ఉరుకులపరుగుల యుగంలో అది ఒకింత కష్టమే. కాబట్టి పార్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని సౌందర్యం పోషణ కోసం అనేక రకాల హెర్బల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. బ్యూటీషియన్ సలహాతో వీటిని వినియోగిస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. అందుకే తప్పనిసరిగా బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తున్నారు. ప్యాకప్లేని మేకప్ మేకప్ విషయంలో స్త్రీ, పురుషులు విపరీతమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వెడ్డింగ్ మేకప్, వివిధ వేడుకల మేకప్, మేకోవర్ ఫర్ పార్టీ మేకప్, రిసెప్షన్ మేకప్, క్లాసికల్ డాన్స్ మేకప్, సంగీత ప్రదర్శన మేకప్ తదితర మేకప్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక మహిళలు డ్రెస్సింగ్, చర్మ రంగుకు అనుగుణంగా మేకప్లు వేస్తున్నారు. ఇక వెడ్డింగ్ (వివాహ వేడుకలు) విషయంలో అన్నిరకాల వారు తమ స్థాయితో సంబంధం లేకుండా డ్రెస్ సెన్స్, పెళ్లికూతురు అందం విషయంలో బ్యూటీషియన్ సలహాలు పాటిస్తున్నారు. ఆర్థికస్తోమత ఉన్నవారైతే ఓ బ్యూటీషియన్నే శుభకార్యాలప్పుడు అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఆకర్షణీయంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.. ఆకర్షణీయంగా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పలువురి యువతులు, మహిళల అభిప్రాయం. నలుగురిలో మనం ఉండాలన్నా..నలుగురు మనని చూడాలన్నా ఆకర్షణ ముఖ్యమంటారు. చదువుకొనేవారు, ఇంటర్వ్యూలకు వెళ్లేవారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం అందంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగం చేసేవారు, ఇతర రంగాల వారు తమ రూపానికి అనుగుణంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి వారు తమ జీవనవిధానం (లైఫ్స్టైల్)కు అనుగుణంగా బాహ్య సౌందర్యం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెయిర్ స్టైల్కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువతులు బ్యాహ్యా సౌందర్యం, 30 సంవత్సరాల పైబడినవారు చర్మం పొడిబారడం లాంటి ఇతర సమస్యలను అధిగమించేందుకు శ్రద్ధ చూపిస్తున్నారు. అధికభాగం విద్యార్థినులు మొటిమలు రాకుండా, హెయిర్ పొడిబార కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సేవలు అనేకం బ్యూటీ పార్లర్ల ద్వారా స్కిన్కేర్, హ్యాండ్, ఫుట్కేర్, హెయిర్ డిజైనింగ్, హెయిర్ ట్రీట్మెంట్, ఫేషియల్, ఐబ్రోస్, బాడీ స్పా, తదితరాల్లో అనేకమైన రకాలు ఉన్నాయి. కొన్ని రకాల సేవలు ధర ఎక్కువ ఉన్నా వెనుకాడడం లేదు. మహిళలు ఎక్కువగా ఆర్గానిక్, మినరల్, ఆక్సిజన్ ఫేషియల్ చేయించుకుంటున్నారు. వీటికి ఒక్కసారికి రూ.2వేలకు పైగానే వెచ్చిస్తున్నారు. చర్మానికి తేమ తీసుకొచ్చే స్కిన్ హైడ్రేటింగ్ కోసం రూ.1500కు పైగానే ఖర్చు చేస్తున్నారు. నెయిల్ కేర్కు రూ. 500వరకు వెచ్చిస్తున్నారు. బిజీ లైఫ్లో బ్యూటీపార్లర్స్తో సమయం ఆదా ప్రస్తుతం ప్రతి విషయంలో బిజీ జీవితాన్ని గడపాల్సి వస్తోంది. పిల్లలను పాఠశాలకు పంపే దగ్గర నుంచి అన్ని పనుల్లోనూ హడావుడి . ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా బయటకు వెళ్లినప్పుడు, ఆఫీస్లో సైతం బిజీగా గడపక తప్పడం లేదు. ఇలాంటి సమయంలో స్కిన్, హెయిర్ కేర్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్లు అందిస్తున్న సేవలు బాగుంటున్నాయి. ఎవరికి అనుకూలంగా ఉన్న సమయంలో వారు వచ్చి తమకు అవసరమైన సేవలు పొందుతున్నారు. ఖమ్మంలో కూడా హైదరాబాద్ తరహా బ్యూటీపార్లర్లు అందుబాటులోకి రావడం ఆనందించదగిన విషయం. - గోళ్ల చంద్రకళ, టప్పర్వేర్ మార్కెటింగ్ మేనేజర్ ఆహారం.. అందానికే ప్రాధాన్యం ఖమ్మం నగర ప్రజల జీవనశైలిలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రజలు అనేక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు, ఆహారపు అలవాట్ల విషయంలో కేర్ తీసుకుంటున్నట్లుగానే సౌందర్య పరిరక్షణకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు, యువతులు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖర్చుకూ వెనుకాడడం లేదు. వివిధ రంగాల్లో పనిచేసేవారు వారి జీవన విధానానికి అనుగుణంగా సౌందర్య పరిరక్షణలో శ్రద్ధవహిస్తున్నారు. మగవాళ్లు సైతం స్కిన్, హెయిర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. - సిద్ధి పరిమళ, పరిమళ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు ఖర్చుకు వెరిసేది లేదు.. సౌందర్య సంరక్షణ కోసం నగర మహిళలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. బ్యూటీషియన్స్ అంచనా ప్రకారం ప్రతిరోజూ సుమారు వెయ్యి మంది మహిళలు బ్యూటీపార్లర్లకు వస్తున్నారు. కొంతమంది మహిళలు సగటున నెలకు రూ.5 నుంచి 8వేల వరకు అందానికి మెరుగులు దిద్దేందుకు ఖర్చుచేస్తున్నారు. పలువురు ఉద్యోగరీత్యా నిరంతరం ఏసీలో ఉంటున్నారు. చెమట బయటకు వెళ్లే అవకాశం లేక కొందరు, దుమ్ముధూళిలో తిరగడం వల్ల వచ్చే చుండ్రు తదితర సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే చర్మం, కేశ సంక్షరణ కోసం వీరు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తున్నారు. మగవాళ్లు కూడా హెయిర్, స్కిన్ కేర్ విషయంలో శ్రద్ధ కనబరుస్తుండటం గమనార్హం. ఏసీలో ఉండే పురుషులు బాడీ స్టీమ్కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మహిళల సౌందర్య పోషణకు కోసం మార్కెట్లో సుమారు 200 నుంచి 300 వరకు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.