Sri Rama Navami Festival
-
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం (ఫొటోలు)
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ధూల్పేట్ సీతారాంబాగ్లో శ్రీరాముని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి శ్రీసీతారామ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా యోగి స్వామి హాజరయ్యారు. కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కువ వాహనాలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతించారు. శోభాయాత్ర జరిగే పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరించి భక్తులు ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోషామహల్, సుల్తాన్బజార్ ఠాణాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటలకు వరకు అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. 21 ప్రాంతాల్లో శోభా యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటలకు హనుమాన్ వ్యాయామశాలకు శోభా యాత్ర చేరుకోనుంది. -
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
Sri Ramanavami Asthanam: తిరుమల : కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం (ఫొటోలు)
-
Bhadrachalam Sri Rama Navami: భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు (ఫొటోలు)
-
Ayodhya Video: బాలరాముడికి సూర్య తిలకం
Live Updates ►బాల రాముడికి తిలకం దిద్దిన సూర్య కిరణాలు.. మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై పడిన సూర్య కిరణాలు.. #WATCH | ‘Surya Tilak’ illuminates Ram Lalla’s forehead at the Ram Janmabhoomi Temple in Ayodhya, on the occasion of Ram Navami. (Source: DD) pic.twitter.com/rg8b9bpiqh — ANI (@ANI) April 17, 2024 ►భక్తజన సంద్రంగా మారిన అయోధ్య. ►బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు श्री राम जन्मभूमि मंदिर, अयोध्या से प्रभु श्री रामलला सरकार के मंगल जन्मोत्सव का सीधा प्रसारण LIVE webcast of Mangal Janmotsav of Prabhu Shri Ramlalla Sarkar, from Shri Ram Janmabhoomi Mandir, Ayodhya https://t.co/WQKw2u10pe — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 17, 2024 ►ప్రాణప్రతిష్ట తరువాత తొలిసారి అయోధ్యలో శ్రీరామనవమి #WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/MTGzGvcbud — ANI (@ANI) April 17, 2024 ►భారీ ఏర్పాట్లు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ►ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం వేడుక ►అయోధ్యలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు. #WATCH | Pooja performed at the Ram Temple in Ayodhya, Uttar Pradesh on the occasion of #RamNavami Ram Navami is being celebrated for the first time in Ayodhya's Ram Temple after the Pran Pratishtha of Ram Lalla. (Source: Temple Priest) pic.twitter.com/3sgeuIdXBB — ANI (@ANI) April 17, 2024 ఇక, శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బాలరాముడు. పద్మపీఠంపై స్వర్ణాభరణాలతో బాల రాముడు మెరిసిపోతున్నాడు. కాసేపట్లో బాలరాముడికి సూర్యతిలకం దిద్దనున్న సూర్యభగవానుడు. ఈ సందర్భంగా నాలుగు నిమిషాలపాటు బాలరాముడి నుదుటిపై కిరణాలు పడతాయి. భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ఆలయ నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. This is the first #RamNavami after 496 years since 1528 when Lord Shri Ram is in his grand #AyodhyaRamTemple after 5 centuries of sacrifice, penance and struggle of his devotees..!! The Lord tests his devotees and it takes many generations for the collective power and strength… pic.twitter.com/6LFsPuPEPE — Megh Updates 🚨™ (@MeghUpdates) April 17, 2024 దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. #WATCH | Uttar Pradesh: Devotees take holy dip in Saryu River as they arrive at Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ET582pvoT6 — ANI (@ANI) April 16, 2024 ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు..(ఫొటోలు)
-
నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తారు..? నవమి నాడే కళ్యాణం ఎందుకంటే.. ఆగమ శాస్త్రం ప్రకారం... శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. అందువల్ల గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే.. ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించబడింది. శ్రీరామ చంద్రుడు, జానకి దేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి. చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కళ్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు. తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు. "శ్రీ సీతారామాభ్యాంనమ:" అంటూ పూజలు కూడా చేస్తారు. ఈ శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. శ్రీరామచంద్రుడిని తెలుగు వారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. అంతేకాదండోయ్ రామాలయం లేని ఊరే ఉండదు కూడా. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. మరో కథనం ప్రకారం.. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంటా.. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారట. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడాది భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ చరితార్థం అవుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. (చదవండి: Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..) -
భద్రగిరికి కళ్యాణ శోభ.. ఎదుర్కోలు వేడుకలో సీతా, రాముడు (ఫొటోలు)
-
అయోధ్యలో తొలి శ్రీరామ నవమి వేడుకలు..ప్రత్యేకతలు ఏంటంటే..!
అయోధ్యలో ప్రారంభమైన కొత్త రామాలయం తొలి శ్రీరామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. అవేంటో సవివరంగా చూద్దామా..! శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేలా రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకునేలా అనుమతించింది. సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. అందువల్ల ఈ రోజున వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. మళ్లీ ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి. దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. బాల రాముడికి సూర్యుడి తిలకం.. శ్రీరామ నమమి రోజున అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి కిరణాలు నుదిట మీద పడే విధంగా ఏర్పాటు చేశారు. పురాణల ప్రకారం..చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాల రాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి తిలకించే విధంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంతేగాదు అయోధ్య నగరం అంతటా దాదాపు వంద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి. ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
తొలి శ్రీరామనవమికి అద్భుతంగా ముస్తాబవుతున్న రామ్ లల్లా (ఫొటోలు)
-
భద్రాచలం: రామా కనవేమిరా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భద్రాచలంలో వసతి, సౌకర్యాలకు నోచుకోవడంలేదు. అధికారులు దశాబ్దాలుగా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు తప్ప సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదు. ఒక్కరోజులోనే ఏసీ గదులు బుకింగ్.. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు దేవస్థానానికి చెందిన సత్రాలు, కాటేజీలతోపాటు ప్రైవేటు లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గదులను బుక్ చేసుకునేందుకు దేవస్థానం ఆన్లైన్లో అవకాశం కల్పించింది. ఈ నెల 17,18 తేదీల్లో కల్యాణం, పట్టాభిషేకం ఉండగా, 11 నుంచి ఆన్లైన్ బుకింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇలా బుకింగ్స్ మొదలయ్యాయో లేదో ఇటు దేవస్థానం, అటు ప్రైవేటు లాడ్జీల్లో ఉన్న ఏసీ గదులన్నీ బుక్ అయిపోయాయి. సింగిల్ రూమ్ మొదలు సూట్ వరకు ఏ ఒక్కటీ అందుబాటులో లేవు. వేసవిలో భద్రాచలంలో నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. దీంతో ఏసీ రూమ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. నాన్ ఏసీలదీ అదే బాట నాన్ ఏసీ గదులకు సంబంధించి దేవస్థానం ఆధ్వర్యంలోని కుటీరాలు, సత్రాల్లోని గదులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. కేవలం ప్రైవేటు లాడ్జీల్లో నాన్ ఏసీ గదులే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఈ నెల 16 సాయంత్రం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల ప్యాకేజీతో లభిస్తున్నాయి. ఇవి సింగిల్ రూమ్కి రూ.1,732 మొదలు ట్రిపుల్ రూమ్కు రూ. 3,464 వరకు చార్జీలుగా ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇంత ధర చెల్లించేందుకు కూడా భక్తులు పోటీ పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ గదులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భద్రాచలంలో ఉన్న గదులన్నీ ఆన్లైన్లో ముందుగానే బుక్ అయిపోతే నవమి రోజు ఇక్కడికి చేరుకునే సామాన్య భక్తులు, అడ్వాన్స్ రిజర్వ్ చేసుకోని వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. డార్మిటరీలు కరువే నవమి వేడుకలు చూసేందుకు యాభై వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఇలా వచ్చే భక్తుల్లో సగం మంది ఉదయమే (ఏప్రిల్ 17) భద్రాచలం చేరుకుని కల్యాణం చూసుకుని, దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఇలాంటి వారికి వసతితో పెద్దగా అవసరం పడదు. కానీ స్నానాలు చేసేందుకు, సామన్లు దాచుకునేందుకు అనువుగా నామామాత్రపు సౌకర్యాలను ఈ భక్తులు ఆశిస్తారు. ప్రస్తుతం భద్రాచలంలో ఈ సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు గోదావరి నదినే స్నానాలకు దిక్కవుతోంది. తమతో పాటు తెచ్చుకున్న లగేజీని దాచుకోవడం కష్టంగా మారుతోంది. బొమ్మలు, కొబ్బరికాయల దుకాణాలే క్లోక్రూమ్ సేవలు అందిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భద్రాచలంలో ఎప్పుడో దశాబ్దాల కిందట కట్టిన సత్రాలు, ప్రైవేటు లాడ్జీలే ఆశ్రయం కల్పిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలో 32 గదులు, జానకీ సదనంలో 32 గదులు తప్ప మరో నిర్మాణం జరగలేదు. మరోవైపు ప్రైవేటు సెక్టారులో ఒకటి రెండు హోటళ్లు, కుల సంఘాల ఆధ్వర్యంలో సత్రాలు అందుబాటులోకి వచ్చాయి. హోం స్టే పద్ధతి అమల్లోకి తెస్తే.. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా భద్రాచలంలో మౌలిక సదుపాయలు మెరుగుపరచడంపై దేవస్థానం, ప్రభుత్వం, భద్రాచలం పంచాయతీలు ప్రయత్నించడం లేదు. ఫలితంగా శ్రీరామనవమి, ముక్కోటి, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దాతల ద్వారా నిధులు సమీకరించి కొత్తగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. ఇతర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్టుగా ‘హోం స్టే’ పద్ధతిని భద్రాచలంలో అమల్లోకి తీసుకురావడంపై కనీస స్థాయిలో కూడా ప్రయత్నాలు జరగడం లేదు. భద్రాచలంలో ఉన్న స్థానికులకు హోం స్టే విధానంపై అవగాహన కలిగిస్తే పైసా ఖర్చు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం సాధ్యం అవుతుంది. కానీ ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఎంత సేపు అరకొర సౌకర్యాల నడుమ ఉన్న మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేయడం, సెక్టార్లుగా విభజించి టిక్కెట్ల అమ్మకాలు సాగించడంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చివరికి భద్రాద్రిలో తమ ఇబ్బందులు తీర్చాలంటూ ఆ రామయ్యకే మొర పెట్టుకుని వెళ్లిపోతున్నారు. -
అయోధ్యలో శ్రీరామ నవమి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపారు. శ్రీరామ నవమినాడు ఆలయంలో జరిగే పూజాదికార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనుందని అన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నామన్నారు. రామాలయంలో భక్తుల దర్శనం కోసం ఏడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయని, మరో మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులు తమ వెంట ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. దర్శనం త్వరగా జరిగేలా పలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల పాటు 24 గంటలూ తెరిచివుంచేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశప్రజలంతా ప్రసార భారతి ద్వారా, ఇంట్లో నుంచే రామ్లల్లాను దర్శించుకోవచ్చన్నారు. -
శ్రీరామనవమి వైభవంగా జరిగే ఒంటిమిట్ట రామాలయం స్పెషల్ ఫొటోలు
-
శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతున్న భద్రాద్రి (ఫొటోలు)
-
రూపం ధరించిన ధర్మమే రాముడు
-
రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి
-
సీతారాముల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు
-
వెండితో సీతమ్మ వారికి సిరిసిల్ల చీర
-
రామతీర్థంలో శ్రీరామ నవమికి పోటెత్తిన భక్తులు
-
వైజాగ్ లో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు
-
భద్రాద్రిలో ఘనంగా జరగనున్న శ్రీరామ నవమి వేడుకలు
-
శివ ధనుస్సు ఇది రాముని బలం శివ ధనుస్సు ఇది రాముని బలం
-
భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
-
సీతారాముల కల్యాణంలో "యజ్ఞోపవీత ధారణ"
-
సీతారాముల కళ్యాణంలో వరపూజ
-
సీతారాముల కళ్యాణం లో కన్యాదానం
-
సీతారాముల కల్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు
-
సీతారాముల కళ్యాణం లో తలంబ్రాలు
-
రాముని మార్గంలో మనం నడిస్తే
-
మహా సంకల్పం
-
తిరుపతిలో వైభవంగా శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం
-
Dil Raju : రాములోరి కళ్యాణంలో ఆటపాటలతో సందడి చేసిన దిల్ రాజు దంపతులు ( ఫొటోలు)
-
16 నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి నూతన ఆర్జిత సేవలు ప్రారంభించనున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను గతంలో వెల్లడించిన ఆలయ అధికారులు.. భక్తులు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచే నూతన సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జాప్యం జరిగింది. సేవల వివరాలు ఇవీ.. వేదాశీర్వచనం: స్వామివారి దర్శనానంతరం బేడా మండపంలో (ఒక్కొక్కరికి లేదా దంపతులు) రూ.500 టికెట్తో ఉదయం 9.30, 10, 10.30, 11 గంటల స్లాట్స్లలో ఆశీర్వాదాలు అందజేస్తారు. ఇందులో పాల్గొన్న భక్తులకు కండువా, జాకెట్పీసు, 100 గ్రామల లడ్డూ అందజేస్తారు. స్వామివారికి తులసీమాల అలంకరణ (ప్రతి శనివారం) రూ.1,000 టికెట్తో దంపతులు లేదా ఒకరికి ఉదయం 7 గంటలకు ఉభయదాత శిరస్సుపై తులసీమాల ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత అంతరాలయంలో భక్తుల సమక్షంలో ధ్రువమూర్తులకు అలంకరణ చేస్తారు. ఇందులో పాల్గొన్న వారికి కండువా, జాకెట్ పీసు, 100 గ్రాముల లడ్డూలు రెండు, అంతరాలయ అర్చనతో రామకోటి పుస్తకాన్ని బహూకరిస్తారు. స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ రూ.5 వేల టికెట్తో ప్రతి రోజూ జరిగే అన్ని సేవలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దంపతులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రోజు 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొనే భక్తులకు సుప్రభాతం, అభిõషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీ అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయ స్వామి వారి అర్చన, నిత్యకల్యాణం, వేదాశీర్వచనం, సచిత్ర రామాయణ పుస్తకం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, అదనంగా ఐదుగురికి అన్నప్రసాదం, దర్బారు సేవ, పవళింపు(ఏకాంత) సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాల సమర్పణ రూ.10 వేల టికెట్తో శ్రీరామనవమి కల్యాణ టికెట్ సెక్టార్ – 2లో రెండు సంవత్సరాలకు టికెట్లు (ఉభయం), కల్యాణ వ్రస్తాలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు అందజేస్తారు. నిత్య పూల అలంకరణ సేవ రూ. 5 వేల టికెట్తో సోమవారం నుంచి శనివారం వరకు జరిగే పూజల్లో స్వామి వారికి, ఉపాలయాల్లో అవసరమైన పూల దండల సమర్పణ. ఇందులో పాల్గొనే వారికి కండువా, జాకెట్ పీసు, రెండు చిన్న లడ్డూలు, నలుగురికి అన్నప్రసాదం అందజేస్తారు. తులాభారం రూ.100 టికెట్ ధరతో ప్రతి రోజూ తులాభారం (భక్తులు మొక్కుకున్న చిల్లర నాణేలు, లేదా బియ్యం.. తదితర వస్తువులు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు అందించవచ్చు. -
లండన్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు, శ్రీరామకోటికి సహకారం
లండన్: యునైటెడ్ కింగ్డమ్ లండన్ , ఇతర నగరాలలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంతకుమునుపు మరెప్పుడూ లేని రీతిలో ప్రవాస భారతీయులు, ఎన్నారైలు ఒక మహత్ కార్యాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు - శ్రీరామ కోటి రాసే కార్యక్రమానికి పట్టం కట్టారు. వందలాది భక్తులు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ శ్రీరామ కోటి రాసే మహా యజ్ఞంలో ఎంతో ఉత్సంగా, ఆనందంగా పాల్గొన్నారు. శ్రీరాముడి భద్రాచల క్షేత్రం నుంచి ఆలయ కమిటీ ఏఈఓ (AEO) శ్రీ శ్రవణ్ గారి సహకారంతో, గౌతమ్ గారి సహకారంతో రామకోటి పుస్తకాలు, ముత్యాల తలంబ్రాలు, పసుపు-కుంకుమ, లడ్డు ప్రసాదం, కండువలు, రామమాడ అన్నీ శ్రీ రామకోటి రాసిన భక్తులకి ఇవ్వడం జరిగింది. వీటిని ప్రసాదంగా అందుకున్న భక్తులు ఆనంద శిఖరాలను చూశారు ఈ కార్యక్రమన్ని చేపట్టిన శ్రీ సంతోష్ కుమార్, లావణ్య బచ్చు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో శ్రీరామ కోటి రాయడం అనేది వృద్దులకు, పెద్ద వాళ్లకు మాత్రమే సంబంధించింది అన్నట్టుగా అయిపోయింది, కానీ, శ్రీ రామకోటి రక్ష మనందరికీ అవసరమని, ముఖ్యంగా రాబోయే తరానికి దీన్ని ప్రాముఖ్యతను తెలుపుతూ, వారికి అందింంచాల్సిన బాధ్యత మనదని, అందుకు అనుగుణంగా భద్రాచలం నుంచి ప్రసాదాలు తెప్పించి లండన్, రీడింగ్, అమెర్షం, ఇతర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరామ కోటి రాయించే కార్యక్రమాన్ని చేపట్టామని ఉచితంగా వీటిని ఇస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సహకరించిన కార్యవర్గ సభ్యులను అభినందించారు. యూకేలోనే కాకుండా ప్రపంచం నలుమూలల శ్రీరామ కోటి రాయించే కార్యక్రమాన్ని విస్తరించాలని కోరారు. ఎవరికైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా, సహకారం కావాలన్నా, బీఎస్కుమార్.కాంటాక్ట్ అనే జిమెయిల్ అడ్రస్ను సంప్రదించవచ్చని వివరించారు. -
ఓఐసీ ప్రకటనపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత్ అంతర్గత వ్యవహారాలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా జరిగిన ఘర్షణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఓఐసీ. అయితే.. దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వాళ్ల కమ్యూనల్ మైండ్సెట్(మతపరమైన ఆలోచనాధోరణికి) ఇది మరో ఉదాహరణ అని, భారత్ వ్యతిరేక ఎజెండాను ఆ దేశాలు మరోసారి బయటపెట్టాయని భారత్ మండిపడింది. భారత్ అంతర్గత వ్యవహారాలలో ఓఐసీ జోక్యం అక్కర్లేని అంశమని భారత్ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా ముస్లింలు లక్ష్యంగా హింస, విధ్వంసం చోటుచేసుకున్నాయని ఒక ప్రకటనలో ఆరోపించింది. అధికారులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారత్లో ముస్లింల భద్రతకు, హక్కులకు భరోసా ఇవ్వాలని ఓఐసీ తన ప్రకటనలో భారత్ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే.. భారత్ తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య జనరల్ సెక్రటేరియెట్ పేరిట రిలీజ్ అయిన ప్రకటనను, బాగ్చీ ఖండించారు. అలాగే జమ్ము కశ్మీర్ అంశంలోనూ ఓఐసీ(ఇందులో పాక్ కూడా ఉంది) జోక్యాన్ని అవసరమైన అంశంగా తేల్చారు ఆయన. -
శోభా యాత్రలో ఘర్షణ.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు చల్లారడం లేదు. శ్రీరామ నవమి వేడుకల కోసం తాజాగా నిర్వహించిన శోభా యాత్రలోనూ హింస చెలరేగింది. ఆదివారం హూగ్లీలో బీజేపీ నిర్వహించిన శోభా యాత్రలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ ఎమ్మెల్యే బీమన్ ఘోష్ గాయపడగా, ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన పోలీసులు.. 24 గంటలపాటు జనాలు గుమిగూడడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రారంభించిన ఈ యాత్రలో.. ఒకవైపు నుంచి ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో అంతా తలోపక్క పారిపోవడం సీసీటీవీలో రికార్డు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ నవమి ఊరేగింపులో భాగంగా భారీగా డీజే సౌండ్తో కొందరు కత్తులు దూస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఓ మసీదు వద్దకు రాగానే.. చాలాసేపు అక్కడే డీజే నడిపించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యంగా శోభా యాత్రను ప్రారంభించి.. సమయం ముగిశాక కూడా కొనసాగించారు. ఆ సమయంలో మసీదును లక్ష్యంగా చేసుకుని యాత్ర ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కొందరు గట్టిగట్టిగా అరవడంతో.. ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ క్రమంలో చెరోవైపు నిల్చుని ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఈలోపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భద్రతా బలగాలతో స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే యత్నం చేశాయి. అంతలోనే రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యే బీమన్ గాయపడడంతో.. అనుచరులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిస్థితికి అధికార టీఎంసీ పనేనని బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజూందార్ ఆరోపిస్తున్నారు. హూగ్లీ బీజేపీ శోభా యాత్రపై దాడి జరిగింది. కారణం స్పష్టంగా తెలుస్తోంది. మమతా బెనర్జీకి హిందువులంటే ద్వేషం అంటూ మజూందార్ ట్వీట్ చేశారు. బెంగాల్లో పరిస్థితిపై జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది బెంగాల్ బీజేపీ. ఇక ఈ రాళ్లదాడిలో పలువురు పోలీస్ సిబ్బంది సైతం గాయపడ్డారు. మరోవైపు అక్కడి పరిస్థితిపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. కారకులు ఎవరైనా 24 గంటల్లో అరెస్ట్ అవుతారంటూ మీడియాకు తెలిపారాయన. . @abhishekaitc, who are these stone pelters? Remove your lenses and watch. You will get clearer picture. Public knows everything. pic.twitter.com/yEr8j3zoGA — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 2, 2023 Bengal is going out of control. Mamata Banerjee is unable to control the riots. She is protecting a particular community and targeting Hindus. Wrote to Union Minister @AmitShah ji for immediate help in West Bengal. pic.twitter.com/pVnwh6mAaL — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 2, 2023 ఇదిలా ఉండగా.. హూగ్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని హౌరాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. దీంతో ఆంక్షలు ఎత్తేసి.. అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు పోలీసులు. గురువారం హౌరాలో కాజిపారా ప్రాంతంలో నవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హింసకు బీజేపీ, హిందూ సంఘాలే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించగా.. ఎన్ఐఏ ద్వారా దర్యాప్తు చేయిస్తే అసలు కారకులు ఎవరో బయటపడుతుందని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. మరోవైపు బీహార్లోనూ శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసలో ఒకరు చనిపోగా, వంద మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలందలో 144 సెక్షన్ విధించడంతో పాటు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు స్కూల్స్కు బంద్ ప్రకటించారు. ఇదీ చదవండి: అల్లర్లకు పాల్పడ్డవారిని తలకిందులుగా ఉరి తీస్తాం-అమిత్ షా -
ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముద్దుముద్దుగా పసిపిల్లలు అమ్మా.. అని పిలిస్తే చిలక పలుకులంటూ.. మురిసిపోతాం. అలాంటిది, నిజంగానే రామచిలుకే అమ్మా.. అంటుంటే.. కుటుంబ సభ్యుల్ని వారి పేర్లతో పిలుస్తుంటే.. ఆ ఆనందమే వేరు. వివరాలివి. సిద్దిపేట హౌసింగ్ బోర్డుకాలనీలోని జర్నలిస్ట్ వీధిలో కూతురు రాజిరెడ్డి, వనజ రెడ్డిల ఇంటి పైకి రోజూ ఓ రామచిలుక వచ్చి సందడి చేస్తోంది. నెల రోజులుగా రోజూ ఉదయం 6గంటలకే వచ్చి కుటుంబ సభ్యులను నిద్ర లేపుతుంది. చిన్నారులతో ఆడుకుంటుంది. వనజరెడ్డిని అమ్మా.. అని, పిల్లలను టింకు.. అని పిలుస్తుంది. ఎత్తుకో, టాటా, బాయ్ అంటుంది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, కాలనీవాసులు సంబరపడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 7.30 గంటల వరకు ఉండి పాలు, నీరు తాగుతుంది. జామ, మామిడి, ఆపిల్, తదితర పండ్లు, బిస్కెట్లు తిని వెళ్లిపోతుంది. సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి మళ్లీ 6 గంటల వరకు తిరిగి వెళ్లిపోతుంది. ఈ చిలుక ఎక్కడి నుంచి వస్తుంది...ఎక్కడికి పోతుందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నెల రోజులుగా ఈ రామచిలుక రాజిరెడ్డి, వనజరెడ్డిల కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోయింది. శ్రీరాముడే వచ్చినట్టుంది రామచిలుక రోజూ మా ఇంటికి వచ్చి అమ్మా. అని పిలుస్తుంటే సంతోషంగా ఉంది. శ్రీ రామనవమి ముందు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి.. శ్రీ రాముడే వచ్చినట్టు అనిపిస్తోంది. – వనజరెడ్డి, సిద్దిపేట -
శ్రీరామ నవమి వేడుకల్లో విషాదం
-
బెంగాల్, మహారాష్ట్రల్లో ‘నవమి’ ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/హౌరా: రామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగాల్లోని హౌరా నగరంలోని కాజీపారా ప్రాంతంలో గురువారం సాయంత్రం రామనవమి ర్యాలీ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. రెచ్చిపోయిన దుండగులు వాహనాలకు నిప్పుపెట్టారు. పలు ఆటోలు, దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కిరాద్పురా రామాలయం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించడంతోపాటు కాల్పులు కూడా జరిపారు. సుమారు 500 మందితో కూడిన గుంపు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ సందర్భంగా 10 మంది పోలీసులు సహా 12 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి ఇదే ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తులు 13 వాహనాలకు నిప్పుపెట్టాయి. రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శ్రీరామ్భగవాన్ ప్రతిమ యాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే, కొందరు నిషేధాజ్ఞలు ధిక్కరిస్తూ యాత్ర నిర్వహించారు. గత ఏడాది ఇక్కడే హనుమాన్ జయంతి వేడుక రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. గుజరాత్లోని వడోదరాలో రెండు రామనవమి ర్యాలీలపై దుండగులు రాళ్లు రువ్వారు. అయితే, ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి (ఫొటోలు)
-
HYD: వేలాది భక్తుల నడుమ సాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఆకాష్పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీతారామ్బాగ్ నుంచి సుల్తాన్బజార్ వరకు 6.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగునున్న శోభాయాత్రను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. శోభాయాత్ర ప్రాంతాల్లో ఆక్టోపస్, రిజర్వ్ పోలీస్ మోహరించారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ ఖారే తెలిపారు. చదవండి: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే.. -
శ్రీరామనవమి వేడుకల్లో ప్రమాదం.. బావిలో పడి 13 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా.. ఓ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న భక్తులంతా.. కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 30 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది భక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 17 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు. పైకప్పు శిథిలాల కింద బావిలో భక్తులు ఇరుక్కుని ఉండడంతో.. వాళ్లను రక్షించడం కష్టతరంగా మారిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తొలుత స్థానికులు వాళ్లను బయటకు తీసేందుకు యత్నించారు. కొందరిని రక్షించగలిగారు. ఈలోపు పోలీసులు, వైద్య సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. #WATCH | Madhya Pradesh: Many feared being trapped after a stepwell at a temple collapsed in Patel Nagar area in Indore. Details awaited. pic.twitter.com/qfs69VrGa9 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023 -
HYD: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శ్రీరామనవమి సందర్బంగా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారామ కళ్యాణ వేడుకలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కాగా, శ్రీరామనవమి సందర్బంగా శోభాయాత్ర జరగనుంది. నేడు(గురువారం) మధ్యాహ్నం 1 గంటలకు శోభాయత్ర ప్రారంభం కానుంది. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా. రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. In view of Sri Rama Navami shobha yatra traffic diversions will be imposed in Hyderabad City on 30-3-2023 శ్రీరామ నవమి శోభ యాత్ర దృష్ట్యా 30-3-2023న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించబడతాయి.#sriramvavami2023 #TrafficDiversions #hyderabadcity pic.twitter.com/m4CBwmcC8C — Hyderabad City Police (@hydcitypolice) March 29, 2023 -
నేటి నుంచి ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మార్చి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాటు చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం అంకురార్పణతో ప్రారంభమై.. ఏప్రిల్ 9వ తేదీ పుష్పయాగంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్ 5న ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. -
Srirama Navami 2023: పరిపూర్ణ పురుషోత్తముడు..
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు మనకోసం ఒక రూపంలో ఒదిగిపోయి దివి నుంచి భువికి దిగి వస్తే, దాన్ని అవతారం అంటారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మానవ జీవితానికి అతి దగ్గరగా ఉండే అవతారం రామావతారం. చైత్ర శుద్ధ నవమి రోజు, లోకాలన్నిటి చేత నమస్కరింపబడే రాముడు ఈ భూమి మీద జన్మించాడు. పుట్టింది మొదలు ధర్మాన్నే అనుసరించాడు. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం... ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా... ఆ పరిపూర్ణ పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం. అప్పటికి కౌసల్యాసుతునికి పదిహేను పదహారేళ్ల వయసుండొచ్చు. ఒకానొక రోజు దశరథమహారాజు రాముణ్ణి పిలిచి విశ్వామిత్ర మహర్షివైపు చూపిస్తూ ‘‘ఈ మహర్షితోపాటు నువ్వు అడవులకు వెళ్లాలి నాయనా...’’ అని అంటాడు. మరో పిల్లాడయితే ఏమనేవాడో ఏమో కానీ, రాముడు మాత్రం తండ్రి చెప్పాడు కాబట్టి కిమ్మనకుండా బయలుదేరాడు. అనుగు సోదరుడు లక్ష్మణుడు తోడు రాగా అడవుల్లోకి దారితీశాడు. తాటక సంహారం చేశాడు. అహల్యకు విమోచన ప్రసాదించాడు. రాముడు ఎంతటి క్రమశిక్షణ కలవాడంటే అంతఃపురంలో ఉన్నంత కాలమూ కన్నవారి మాట జవదాటలేదు. అరణ్యాల్లో ప్రవేశించాక విశ్వామిత్రుని ఆజ్ఞ మీరలేదు. సీతాస్వయంవరానికి తీసుకువెళతానని ఆ గురువర్యుడంటే∙మారు మాట్లాడకుండా అనుసరించాడు. పెద్దల మాటకే ప్రాధాన్యం జనకమహారాజు నెలకొల్పిన స్వయంవరమంటపంలో శ్రీరాముడు అడుగుమోపినా శివధనుస్సు ఉండే చోటికి హడావుడిగా వెళ్లిపోలేదు. దాన్ని భళ్లున ఎత్తేసి, ఫెళ్లున విరిచేసి, చేతులు దులిపేసుకోలేదు. ఎలాంటి తొందరపాటూ పడకుండా సభాభవనంలో నిమ్మళంగా కూర్చున్నాడు. శివధనువును ఎత్తాలంటూ విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాకనే రాముడు ఆ పనికి పూనుకున్నాడు. ధనస్సును సున్నితంగా ఎత్తిపట్టుకుని, నారి సారించి, విరిచాడు. ఇదంతా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా చేశాడు. అంత పెద్దపనీ పూర్తిచేశాక ధీర గంభీరంగా అడుగులు వేస్తూ తన ఉచితాసనానికి చేరుకున్నాడు. చిన్నపాటి విజయాన్ని సాధిస్తేనే మురిసి మెరిసిపోయే మనం, ఆ సందర్భాన రాముడి వర్తన నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. చిన్న కష్టానికే కన్నీరొలికించడం. అల్పమైన సుఖాలకే అతిగా స్పందించడం.. లాంటి లక్షణాలను మరెంత సునాయాసంగా తొలగించుకోవచ్చో! వినయ విధేయతలు తొందరపాటు...తొట్రుపాటు అనేవి రాముడి నిఘంటువులోనే లేదు. శివధనువును విరవగానే సీతను రాముడికిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పిన మాట విని ఎగిరి గంతేయలేదు. వెంటనే సీత మెడలో మూడు ముళ్లూ వేసేయలేదు. జనకుని ప్రతిపాదనను తన కన్నవారికి తెలియజేయాలని, అందుకు వారి అనుమతి అవసరమనీ వినమ్రంగా చెప్పాడు. ఎవరి పట్ల ఏవేళ ఎలా ఆదరం చూపాలో రామునికి బాగా తెలుసుననడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. అలా ఆ పెద్దలందరి సమక్షంలోనూ మైథిలి చేయి అందుకున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగి ఎంతోసేపు అవనే అవదు. పరశురాముడు వేంచేశాడు. పెళ్లివేదిక వద్దకు వస్తూనే ఆ మహాశయుడు వీరావేశాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలో రాముడంటే పరశురాముడేనని, మరో రాముడికి లోకాన చోటు లేనేలేదని వీరవిహారం చేశాడు. అటు జనకుడు, ఇటు దశరథుడు పరశురాముని క్రౌర్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే రాముడు ఏమాత్రం తొందరపడలేదు. పరశురాముడు ఎంతగా పేట్రేగిపోతుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడు అందించిన విష్ణుధనువును సునాయాసంగా పైకెత్తాడు. తను శ్రీహరి ప్రతిరూపమని చెప్పకనే చెప్పాడు. దీంతో పరశురాముడికి కమ్మిన పొరలు తొలగిపోయాయి. తారుమారైనా... మర్నాడు పొద్దున్నే పట్టాభిషేకం జరగాల్సి ఉంది. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. కైకమ్మ స్వయంగా పిలిచి, తన మాటల్ని దశరథుని ఆదేశాలుగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసం చేయాలని ఆజ్ఞాపించింది. మారు తల్లి మాటలను మన్నించాడు. అడవుల్లోకి పోయేందుకు సిద్ధమేనంటూ అందుకు రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. మంగళస్నానాలు చేసి రాజదండాన్ని చేపట్టాల్సిన వేళ పత్నినీ, సోదరునీ వెంటబెట్టుకుని గుహుని పడవమీద నది దాటుకుంటూ పోయాడు. అడవుల్లోనూ ఆ రామునికి ప్రశాంతత లేనే లేదు. కష్టాలూ కన్నీళ్లే! సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాక మానసికంగా నలిగిపోయాడు. చివరికి లంకలో అమ్మవారు ఉన్నారన్న సంగతి తెలిసి కొంత స్థిమితపడ్డాడు. తన ప్రియపత్నిని తన వద్దకు తెచ్చుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విభీషణునితో చెలిమిచేశాడు. ఓరిమితో వ్యవహరించాడు. తగిన సమయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. సముద్రం మీద సేతువును నిర్మించాడు. అందుబాటులో ఉన్న వానర సేన సహకారంతోనే అమిత బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేశాడు. విజేత తానే అయ్యాడు. స్థితప్రజ్ఞావంతుడు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాస క్లేశాలు ముదిరిపోయాయి. సరసరాజాన్నభోజనాల స్థానంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు. అయినా చలించలేదు. స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. మరి ఇప్పటికాలాన మనం ఎలా ఉన్నాం..? బస్సు దొరక్కపోతే ఆందోళన. సినిమా టికెట్టు అందకపోతే అశాంతి. పరీక్షలో మార్కులు తక్కువయితే ఆవేదన. అన్నింటికీ తొందరే. ప్రేమ తొందర. పెళ్లి తొందర. ఇలా అయితే ఎలా. రాముని వంటి వారినే కష్టాలు కాల్చుకు తిన్నాయి. అన్నింటినీ ఆయన ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతటి వారం? ఆయన పడ్డ కష్టాలతో పోల్చి చూసుకుంటే మన కష్టాలు ఏపాటివి?ఎప్పటి త్రేతాయుగం? రాముడు పుట్టి రెండు యుగాలయింది. మనమిప్పుడు కలికాలంలో ఉన్నాం. అయినా ఆ ఆదర్శనీయుణ్ణి నేటికీ మరువలేకపోతున్నాం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే మానవుడిగా పుట్టినా, రాముడు మనకు దేవుడయ్యాడు. ఆయన నడిచిన బాట అయిన రామాయణం పఠనీయ కావ్యం అయింది. అందుకే రామాయణాన్ని పారాయణం చేయాలి. అందులోని మంచిని ఒంటబట్టించుకోవాలి. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరువని సద్గుణ సంపన్నత రామునిది. అందుకే సీతమ్మ జాడతెలుసుకున్న ఆంజనేయస్వామిని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. తన ప్రేమను పంచాడు. సుగ్రీవుడికి పట్టం కట్టాడు. విభీషణునికి లంకేశునిగా మకుటం తొడిగాడు. ..జననీ జన్మభూమిశ్చ.. రావణ సంహారం జరిగాక ఆ రాక్షస రాజు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించాడు. విషయాన్ని అన్నతో చెప్పాడు. యావత్ లంకానగరమే మణిమయ నిర్మితమైనది. అందులోని రాజ సౌధం సామాన్యమైంది కాదు. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ఆయన ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు. అంటే పరాయి ప్రదేశం ఎంతటి గొప్పదైనా, సుందరమైనదైనా దానిని చూసి మనసు పారేసుకోలేదు. మాతృభూమిని మరువలేదు. పుట్టిన గడ్డపై ప్రేమను పోగొట్టుకోలేదు. రామ నైవేద్యం పానకం కావలసినవి: బెల్లం పొడి– పావు కేజీ; నీళ్లు– లీటరు; యాలకుల పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; శొంఠిపొడి– చిటికెడు తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్; మామిడి కాయ తురుము– టేబుల్ స్పూన్ తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ. వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈనెల 30న హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకుహైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని తెలిపారు. పండగ రోజు రాములవారి శోభాయాత్ర ఉండనున్న నేపథ్యంలో ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్, మంగళ్హాట్ పోలీస్స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకుయాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు .పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. -
ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు.. సీఎం జగన్కు టీటీడీ ఆహ్వానం
తాడేపల్లి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్కు టీటీడీ చైర్మన్, ఈవోలు అందజేశారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. అదే సమయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 09 తేదీ వరకూ ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా సీఎం జగన్ను టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి ఆహ్వాన శుభ పత్రికను అందజేశారు. -
సీతా రాముల కల్యాణానికి ముహూర్తం
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహణకు ముహూర్తం నిశ్చయించారు. కాగా, 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం మార్చి 31న జరగనుండగా, బ్రహ్మోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవం షెడ్యూల్ను వైదిక కమిటీ, ఆలయ ఈవో శివాజీ సోమవారం ప్రకటించారు. ఉగాది పర్వదినాన... మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, మార్చి 22 నుంచి మార్చి 31 వరకు పుష్కర పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద సహిత శ్రీరామాయణ మహాక్రతువు ఉత్సవాలను జరపనున్నారు. మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కర పట్టాభిషేకం క్రతువుకు అంకురార్పణ జరగనుంది. 26న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 28న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను జరుపుతారు. 30న శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహనసేవ, 31న పుష్కర పట్టాభిషేక మహోత్సవం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, రథోత్సవం ఉంటాయి. ఏప్రిల్ 5న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల సమయాన రోజువారీ ప్రత్యేక పూజలు నిలిపివేయనున్నారు. ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం భద్రా చలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంతోపాటు మరుసటి రోజే జరిగే రామయ్య పట్టాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడికి భద్రాచలంలో ప్రతీ 60 ఏళ్లకు ఒక్కసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో 1927, 1987ల్లో జరగగా, మళ్లీ 2047లో మాత్రమే కళ్లారా చూసేందుకు అవకాశముంది. ఇది కాకుండా ప్రతీ 12 ఏళ్లకోసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపుతారు. 1999, 2011లో ఈ పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 31న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ బాధ్యులు స్వామివారి వాహన సేవలకుగాను నూతన వాహనాలను తయారు చేయిస్తున్నారు. -
సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు
షిరిడి సాయిబాబా దేవస్థానం ఆస్టిన్, వెంకటేశ్వర దేవస్థానం ఆస్టిన్ (టెక్సాస్) ఆధ్వర్యములో అంగరంగ వైభవముగా శ్రీ సీతారామ కళ్యాణం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సుమారుగా 6000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగం సాయిబాబాకి చందన, చావడి ఉత్సవం నిర్వహించగా సీతారాములుకి మంగళ స్నానం చేయించారు. సీతారామ కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. వచ్చిన ప్రతీ భక్తునికి బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కల్పన నూకవరపు, రవి బురుజులు, మల్లిక్ ఆవుల, కేథార్నాధ్ ముండ్లురూ, పూర్ణేశ్ సవితాల, విజయ్ దొడ్ల, సౌజన్య , బాలాజీ ఆత్యంలు ఈ వేడుకులు నిర్వహించడంలో పాలు పంచుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, వలంటీర్స్కు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు. -
పూజలకు హింసతో సంబంధం ఏంటి?: సీఎం నితీశ్కుమార్
పాట్నా: తాజా మత ఘర్షణల మీద బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఘర్షణలను ప్రతీ వర్గం పక్కనపెట్టాలని, అసలు దేవుడి ప్రార్థనలకు హింసతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. శ్రీ రామ నవమి సందర్భంగా దేశంలో పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిపై స్పందించాల్సిందిగా మీడియా.. సోమవారం సీఎం నితీశ్కుమార్ను కోరింది. ‘‘వర్గాల మధ్య శాంతి, సామరస్యం వెల్లివిరియాలి. దేవుళ్లను ఆరాధించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతేగానీ మనలో మనం కొట్టుకోవడం కాదు. పూజించడం మీద అంత నమ్మకం ఉంటే.. సరిగ్గా పూజలు చేసుకోవాలి. అంతేగానీ పూజల పేరుతో ఘర్షణలకు పాల్పడడం ఏంటి? ప్రార్థనలకు హింసకు ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటివి బీహార్లో జరిగితే ఊరుకునేదే లేదు’’ అని సీఎం నితీశ్ కామెంట్ చేశారు. एक दूसरे से झग़ड़ा का पूजा से कोई सम्बंध हैं ??आपको पूजा करना हैं तो पूजा कीजिएगा ना कि झगड़ा ये कहना हैं @NitishKumar का @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/LA4xWtMKG0 — manish (@manishndtv) April 18, 2022 మరోవైపు మసీదుల వద్ద ఆజాన్, లౌడ్ స్పీకర్ల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్న వారికి మతంతో సంబంధం లేదని, ప్రజలు తమ మతాన్ని అనుసరించాలని, వారిని అడ్డుకోవద్దని నితీష్ కుమార్ అన్నారు. ప్రతి మతానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయి. దీని గురించి మనలో మనం గొడవ పడకూడదు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించాలి. ఎవరైనా ఈ విషయాలపై వివాదాలు సృష్టిస్తే, అతనికి మతంతో సంబంధం లేదు అని అన్నారాయన. ఇదిలా ఉండగా.. రామ నవమి సందర్భంగా రాళ్లు రువ్విన వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారడంతో పాటు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ తరుణంలో బీజేపీ మిత్రపక్షం హిందుస్థాన్ అవామ్ మోర్చా చీఫ్, బీహార్ మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ.. శ్రీ రాముడిపై ప్రతికూల కామెంట్లు చేయగా, ఇప్పుడు మరో మిత్రపక్ష నేత, సీఎం నితీశ్ సైతం పూజల పేరుతో అల్లర్లకు పాల్పడుతున్న వాళ్లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. -
యూపీలో ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి
లక్నో: శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా.. పలు రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ అల్లర్లను ప్రస్తావిస్తూ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా.. ఉత్తర ప్రదేశ్లో ఒక్క అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని, కనీసం నువ్వా-నేనా అనే స్థాయి కొట్లాట ఘటనలు వెలుగులోకి రాలేదని అన్నారు. ‘‘పాతిక కోట్ల జనాభా ఉన్న యూపీలో శ్రీరామ నవమి ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 800 ఉరేగింపు ఉత్సవాలు జరిగాయి. అదే సమయంలో రంజాన్, ఉపవాసాలు, ఇఫ్తార్ కార్యక్రమాలు జరిగాయి. అయినా కూడా ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఇది ఉత్తర ప్రదేశ్ కొత్త అభివృద్ధి ఎజెండాకు గుర్తు. ఇక్కడ అల్లర్లకు, శాంతిభద్రతల విఘాతానికి స్థానం లేదు. గుండాగిరి ఊసే లేదు’’ అని సీఎం యోగి పేర్కొన్నారు. यहां दंगा-फसाद के लिए कोई जगह नहीं है... pic.twitter.com/LWkPZznsVx — Yogi Adityanath (@myogiadityanath) April 12, 2022 ఈ ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా.. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే యూపీలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం జరగకుండా.. ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి. అయితే.. సీతాపూర్ జిల్లాలో భజరంగ్ ముని అనే మహంత్.. ముస్లిం అమ్మాయిలను ఉద్దేశిస్తూ.. చేసిన రేప్ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన్ని అరెస్ట్ చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
లాస్ ఏంజిల్స్లో ఘనంగా సీతారాముల కల్యాణం
లాస్ ఏంజిల్స్లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్ఏంజెసెల్ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో లాస్ఏంజెలెస్ నగర వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. సిమీ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కల్యాణం అచ్చంగా భద్రచల శ్రీరాముల కల్యాణ మహోత్సవాన్ని తలపించింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించి అమెరికాకు తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో మేళతాళాల సాక్షిగా పెళ్లి జరిగింది. అనంతరం ఆడ పడుచుల కోలాటాల మధ్య సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకుంది. దాదాపు 50 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదుకలకు పట్టాభిషేకం నిర్వహించారు. గోవింద, రామ నామా స్మరణతో ఆ ప్రాంగణం అంతా మార్మోగి పోయింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. దాదాపు 700 మందికి పైగా భక్తులు కల్యాణోత్సవంలో భాగమయ్యారు. 70 కి పైగ జంటలు సామూహికంగా కళ్యాణం లో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలకు పైగా ఈ వేడుకలు జరిగాయి. ఈ కల్యాణోత్సవానికి సహాకరించిన ప్రతీ ఒక్క స్వచ్చంధ సంస్థకి నిర్వాహకులు రామ్ కొడితాల, నంగినేని చందు, టీ కుమార్, ఏ మనోహార్లు కృతజ్ఞతలు తెలిపారు. -
స్కాట్లాండ్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని యూకేలోని స్కాట్లాండ్ దేశంలో గల అబర్డీన్ ప్రాంతంలోని హిందూ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటి సారిగా తెలుగు ప్రాంత ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు కన్నుల పండగగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవ ప్రాంతానికి తరలివచ్చారు. స్కాటిష్ ప్రజలు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. రామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సీతాసమేత రాములోరిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులు తీరారు. శ్రీరామ జయరామ, జయ జయ రామ అంటూ తెలుగు ప్రాంత భక్తులు నినాదాలతో హోరెత్తించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు పడకంటి వివేక్, గోల్కొండ వేద, రమేశ్ బాబు, డాక్టర్ నాగ ప్రమోద్, బోయపాటి హారి లు అట్టహాసంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్కాట్ లాండ్ లోని చుట్టుపక్కల ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహరాష్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయ భక్తులు దాదాపు 350 మంది వరకు తరలివచ్చారు. భక్తులు స్వామివారికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణ అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు.. భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది. బుక్ చేసుకున్నవారు రూ.80 చెల్లించా లి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉం టుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్ చేసుకున్నారు. మహబూబ్నగర్ రీజియన్ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు. -
రామయ్య సన్నిధికి తమిళిసై: వెంట ఎవరూ లేకున్నా..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రామయ్య పట్టాభిషేకంలో పాల్గొనడంతోపాటు దమ్మపేట, మణుగూరు మండలాల పర్యటన నిమిత్తం ప్రత్యేక రైల్లో సోమవారం తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులెవరూ స్వాగతం పలకలేదు. భద్రాచలంలోని శ్రీరాముడి పట్టాభిషేక వేడుకలో, తర్వాత స్థానిక కార్యక్రమాల్లో ఏ అధికారీ వెంట లేకుండానే గవర్నర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు, ఎస్పీ సునీల్దత్ గవర్నర్ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ముగ్గురు ఉన్నతాధికారులూ రెండ్రోజుల వ్యక్తిగత సెలవు పెట్టినట్లు సమాచారం. అంతా రాముడే చూసుకుంటాడు: గవర్నర్ రాముడి పట్టాభిషేకానికి హాజరు కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రామయ్యను ప్రార్థించానన్నారు. తన పర్యటనకు జిల్లా యంత్రాంగం గైర్హాజరుపై విలేకరులు ప్రశ్నించగా ‘ఇది ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే. రాముడి పట్టాభిషేకానికి వచ్చాను. అంతా రాముడే చూసుకుంటాడు’ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
మతసామరస్యం.. ముస్లిం మతపెద్ద చేతులమీదుగా రాములోరి పెళ్లి
జగిత్యాల జోన్: జగిత్యాల మండలం లక్ష్మీపూర్ రామాలయంలో ఆదివారం మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. గ్రామ ఆదర్శ బలహీన వర్గాల సంఘం ఆధ్వర్యంలో రామాలయం నిర్మించి ఏటా సీతారాముల కల్యాణం ఘనంగా జరిపిస్తున్నారు. సంఘం అధ్యక్షుడు స్వామివారి కల్యాణం దగ్గరుండి జరిపించడం ఆనవాయితీ. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన వేదమంత్రాల సాక్షిగా రాములోరి పెళ్లి జరిపించారు. అనంతరం జరిగిన శోభాయాత్రలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా తమ గ్రామంలో అన్ని పండుగలు జరుపుకుంటామన్నారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ పాలు పంచుకుంటామని చెప్పారు. -
హ్యూస్టన్లో శ్రీరామ నవమి వేడుకలు
-
హ్యూస్టన్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
హ్యుస్టన్ టెక్సాస్ లో ని స్థానిక శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అష్టలక్ష్మి దేవాలయం, కేటీ హిందూ కమ్యూనిటీ సంయుక్తంగా జరిపిన జరిపిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో సుమారు 800 మంది పాల్గొన్నారు. వేదపండితులు సీత రాములకు కళ్యాణంతో పాటు ,పట్టాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. కల్యాణం అనంతరం అర్చన, మంగళ శాశనం కార్యక్రమాలని ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిరాఉ. జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలు, వలంటీర్లకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు. -
తీరని శోకం.. రాములవారి భజనలో అపశ్రుతి..
కొణిజర్ల: పండుగపూట విషాదం నెలకొంది. ఆలయంలోకి బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లి పాడులో ఆదివారం రాత్రి చోటు చేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వా మి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనకు తుమ్మలపల్లికి చెందిన 25 మంది వచ్చారు. కొందరు పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. పెద్ద లు భజన చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటున్నా రు. రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్తున్న బొలేరో ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కన ఉన్న వి ద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, అదేవేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గో డ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్రగాయాలైన చిన్నారులను ఖమ్మం తరలిస్తుండగా దేదీప్య, సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయట పడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీ వ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు. తీరని శోకం.. తుమ్మలపల్లికి చెందిన పగడాల ఆదినారాయణ, శిరీష దంపతులకు ఇద్ద రూ ఆడపిల్లలే. ఆదినారాయణ పెయింటర్గా పనిచేస్తూనే ఆలయాల్లో భజనలకు తబలా వాయిద్యకారుడిగా వెళ్తుం టాడు. పల్లిపాడులో భజనకు భార్యాభర్తలు వెళ్తూ, కుమార్తెలు దేదీప్య, సహస్రను కూడా వెంట తీసుకెళ్లారు. ఊహించని విధంగా జరి గిన ప్రమాదంలో చిన్నారులిద్దరూ మరణించడంతో ఆ దంప తుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. -
రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం
వేములవాడ: హరిహరక్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాజా తరను తలపించేలా దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. శివపార్వతులు (జోగినులు, హిజ్రాలు) చేతిలో త్రిశూలం పట్టుకుని రాజన్నను వివాహమాడారు. -
నేత్రపర్వం.. సీతారామ కల్యాణం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తితో గత రెండేళ్లుగా ఆంతరంగికంగానే సాగిన ఈ వేడుక తిరిగి ఎప్పటిలాగానే మిథిలా స్టేడియంలో భక్తుల జయజయ ధ్వానాల నడుమ కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో కల్యాణ మండపం మార్మోగింది. స్వామి వారి కల్యాణం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచారు. రామయ్యకు సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళా శాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షణ నిర్వహించి కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం రాగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాలకు మాంగల్య పూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగల్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం తరఫున ఆలయ వైదిక కమిటీ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకలో మంత్రు లు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ పాల్గొన్నారు. ఇక భద్రగిరి, బాసర అభివృద్ధి:మంత్రి రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యాన భద్రాచలంతోపాటు బాసర క్షేత్రం అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. రామయ్య కల్యాణోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. నేడు భద్రాచలానికి గవర్నర్ శ్రీరామ నవమి తర్వాత రామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుక నిర్వహించడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర (ఫొటోలు)
-
రామా! ఇది నిజమేనా!
హిమాలయాలలో నిదురిస్తున్న చిరంజీవి అయిన హనుమంతుడికి మెడలో ముత్యాల హారం చేతికి తగలగానే ఏదో జ్ఞప్తికి వచ్చినట్టుగా ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. నేడు నా రామయ్య కల్యాణం, నా సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు, నా రాముడు సీతమ్మ మెడలోల ముడి మీద ముడి అంటూ మూడు ముళ్లు వేసే శుభదినం. ఎన్నాళ్లుగానో ఆ కల్యాణం కన్నులారా తిలకించడానికి వెళ్లాలనుకుంటున్నాను, కాని రామనామస్మరణతో మరచిపోతున్నాను. ఈ సంవత్సరం కూడా మరచిపోతాననుకున్నాను. కాని సరైన సమయానికి ఈ ముత్యాల హారం, అదే ఆ నాడు పట్టాభిషేక సమయంలో సాక్షాత్తు సీతమ్మ నాకు బహూకరించిన ఈ ముత్యాల హారం, నా చేతికి తగిలి, గుర్తుకు వచ్చింది. ఇది నా భాగ్యం. రామనామ మంత్రం జపిస్తూ అయోధ్యకు... కాదు కాదు... భద్రాద్రికి బయలుదేరతాను. ఏ శుభ ముహూర్తాన కంచర్ల గోపన్న నా రాముడికి మందిరం కట్టించాడో కాని, ఆయన రామదాసు అయ్యాడు, నాటి నుంచి ఆయనకు వైభోగంగా కల్యాణం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం నేను అక్కడకు వెళ్లి, కన్నులపండువుగా సీతారామకల్యాణం వీక్షిస్తాను. త్రేతాయుగంలో నా రాముడి కల్యాణం జరిగేనాటికి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు కదా. ఆ వైభోగం ఇలా చూడగలగడం నా భాగ్యమే కదా... అనుకుంటూ... ‘రామ రామ రామ...’ అని స్మరిస్తూ, భద్రాద్రి చేరుకునే సమయానికి, కల్యాణం ప్రారంభమవుతోంది. కల్యాణం కన్నులారా వీక్షించాడు. పరవశించిపోయాడు. తన్మయంలో మునిగితేలాడు. కల్యాణం పరిసమాప్తమైంది. భక్తులంతా ఎక్కడివారక్కడ సర్దుకున్నారు. రామయ్య సీతమ్మతో ఏకాంత మందిరంలోకి ప్రవేశించి, ముచ్చట్లు ప్రారంభించాడు. వారి వెంటే హనుమ కూడా అంతఃపురం వరకు వచ్చి, బయట నిలబడి, దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు. కొద్దిసేపటి తరవాత వారిని సమీపించి, ‘‘తండ్రీ! మీరు ఏకాంత మందిరంలో ఉన్నా కూడా, ఎవరి అనుమతి లేకుండా మీ దగ్గరకు వచ్చే చనువు నాకుంది కనుక, ఇలా వచ్చాను’ అన్నాడు. ఏమిటి హనుమ! ఇలా వచ్చావు, నేను నెరవేర్చవలసిన కార్యం ఏదైనా ఉందా?’ అని మృదుమధుర గంభీర గళంతో అడిగాడు రాముడు. ‘అటువంటిదేమీ లేదు తండ్రీ! మీ జంట చూడముచ్చటగా ఉంది. ఏనాడో త్రేతాయుగంలో శివధనుర్భంగం చేసి, సీతమ్మను చేపట్టావు. ద్వాపరం గడిచింది, కలియుంగలో కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. నేటికీ నీ కల్యాణం ఇంత వైభోగంగా జరుగుతోంది. తండ్రీ! నిన్ను వేనోళ్ల కొనియాడినా నా తనివి తీరదు...’ అంటూ పరవశించిపోతుంటే, స్థితప్రజ్ఞుడైన రాముడు నిశ్చలంగా కూర్చున్నాడు. అంతలోనే హనుమ... నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికి అందించు’ అన్నావు. సీతమ్మవారు... కాదు కాదు... నా కన్నతల్లి... ఆ హారాన్ని అందుకుని సింహాసనం మీద నుంచి లేచి, మెట్లు అవరోహించి, సభలో అందరి మధ్యగా అడుగులు వేస్తూ, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ వచ్చి, నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది. ఒక తల్లి తన కుమారుడిని చూసినంత ఆప్యాయంగా నా వైపు చూస్తూ, ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు. సీతమ్మ ఎంపిక ఎంత చక్కగా ఉందో అంటూ సంబరపడ్డారు. ఆ తల్లిని వేనోళ్ల కొనియాడారు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే జరిగిందమ్మా, ఆయన అనుజ్ఞ లేనిదే నేను ఇంత ఘనకార్యం సాధించలేకపోయేవాడిని’ అన్నాను... ఇదంతా నాటి గాథ. ‘తండ్రీ! నీ కథ జరిగిన ఇన్ని వేల సంవత్సరాల తరవాత నిన్ను కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. నువ్వు నా తండ్రివి కనుక, నేను ఏది అడిగినా నువ్వు చిరునవ్వుతోనే సమాధానాలు చెబుతావని నాకు తెలుసు కనుక ధైర్యంగా అడుగుతున్నాను. అయితే ఇవి నా సందేహాలు కాదు. నీ గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటుంటే ఆ మాటలు నన్ను బాధపెడుతున్నాయి. నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు. ఇతరులు నిన్ను శంకిస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. అందుకే సందేహ నివృత్తి కోసం నిన్ను ప్రశ్నిస్తున్నాను. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో సంవత్సర కాలం ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని, అగ్ని ప్రవేశం చేయించావని అందరూ అనుకుంటున్నారు. నీ వంటివానికి అనుమానించే లక్షణం లేదు కదా తండ్రీ. అందునా నీ గాథ రచించిన వాల్మీకి అలా రాసి ఉంటాడనుకోవట్లేదు.... అంటుండగానే... మధ్యలోనే సీతమ్మ అందుకుని, హనుమా! నీ రామయ్య ఎటువంటివాడో నీకు తెలియదా. నా ప్రభువు రాముడికి అపవాదు రాకూడదనే నేనే, స్వయంగా చితి పేర్చుకుని అగ్నిప్రవేశం చేశాను. భార్యను అనుమానించేంత చిన్నబుద్ధి లేదు రామునికి. రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కొన్ని కోట్లమందికి ప్రభువు. ఆయన అందరికీ ఆదర్శంగా ఉండాలే కాని, నియంతలా శాసించకూడదు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను అని పలికింది జనకరాజ పుత్రి. రాముడు చిరునవ్వుతో, హనుమా! ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఊహలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించి ఉందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో అన్నాడు. హనుమ మరో ప్రశ్న అడిగాడు... తండ్రీ! నువ్వు భార్యను అనుమానించావని, నిండు చూలాలని కూడా చూడకుండా, ఒక చాకలివాని మాట పట్టుకుని, అరణ్యాలపాలు చేశావని, అక్కడ కుశలవులు పుట్టారని, సీతమ్మ తల్లి భూదేవి ఒడిలో చేరిపోయిందని, ఎన్నెన్ని మాటలు అన్నారయ్యా నిన్ను... అంటూ కన్నీరుమున్నీరవుతుంటే, ‘హనుమా, మనమంతా మనుషులం. మనుషులలో అన్నిరకాల మనస్తత్వాలవారు ఉంటారు. అందరి అభిప్రాయాలను సహృదయంతో స్వీకరించాలి. ఆ విషయం కల్పితం అని వాల్మీకం చదివితే అర్థం అవుతుంది.. మా కథ రచించిన మహర్షి రామాయణ ఆరంభంలోనే... కుశలవుల చేత ఈ కథను గానం చేయించినట్లు వివరించాడు. నేనంటే భక్తి ప్రపత్తులు ఉన్న మరో కవి, నా సీత దూరమైతే ఎలా ఉంటుందో ఊహించి ఆ కథా రచన చేశాడని పండితులే స్వయంగా ఘోషిస్తున్నారు కదా ... అన్నాడు. రామా! నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వేమిటో, నీ సత్ప్రవర్తన ఏమిటో, నీ ఏకపత్నీవ్రతమేంటో అర్థమైపోయిందయ్యా. నీ సునిశిత మనస్తత్వం కూడా అర్థమైందయ్యా. ఇందుకు సంబంధించి నేను ఒక్క మాట చెప్పాలయ్యా. నువ్వు సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ గురించి అడిగావు. నేను నగల మూటను తీసుకువచ్చి చూపించాను. నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు నన్నీళ్లు అడ్డపడుతున్నాయి. నగలు నేను గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలు నువ్వు గుర్తించవయ్యా... అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా. అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, ఆయన సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. నిత్యం ఆ తల్లి పాదాలకు నమస్కరించేవాడు నీ తమ్ముడు. ఎంత ఉత్తములయ్యా మీరు. చివరగా ఒక్క మాట తండ్రి... ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గతించినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యను చెప్పుకుంటూనే ఉంటారు. అది నాకు ఎంతో సంతోషం రామా! నాకు ఇంతకంటె ఏం కావాలి. నాడు మీ కల్యాణం స్వయంగా చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. నీ భక్తుడు రామదాసు చేసిన పుణ్యం కారణంగా ప్రజలంతా ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటారు. ఇంక నాకు సెలవు ఇప్పించు రామా! హిమాలయాలకు వెళ్లి, నీ నామస్మరణ చేస్తూ తపస్సులోకి వెళ్లిపోతాను... అని సీతారాముల ఆశీస్సులు తీసుకుని హనుమ నిష్క్రమించాడు. సృజన రచన – డా. వైజయంతి పురాణపండ -
అభిజిత్ ముహూర్తం... అంటే ఏమిటి?
మనకు అభిజిత్ ముహూర్తం అనే మాట శ్రీరామ నవమి సమయంలోనే ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకీ అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? రాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించాడు. దీనినే అభిజిత్ లగ్నమనీ, అభిజిత్ ముహూర్తమనీ అంటారు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని పండుగగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి వసంతోత్సవం తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ రోజు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. అందుచేత శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహం పొందిన వారమవుతాం. అంతేగాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. – డి.వి.ఆర్. భాస్కర్ -
నైవేద్యంగా పానకం... వడపప్పు ఎందుకు?
శ్రీరామనవమి రోజు దేవుడికి పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది. అంతేకాదు... ఇది దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక కూడా. పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి వడపప్పు తినడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది. పానకం కావలసినవి: నీళ్లు – ఆరు కప్పులు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు, మిరియాలు – ముప్పై, యాలకులు – ఆరు, శొంఠి – ముప్పావు టీస్పూను, నిమ్మకాయ – మూడు చెక్కలు, తులసి ఆకులు – గుప్పెడు, ఉప్పు – చిటికెడు, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ... ► ముందుగా మిరియాలు, యాలకులను విడివిడిగా దంచి పొడిచేసుకుని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. ► పానకం తయారీ గిన్నెలో నీళ్లు పోసి అందులో ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం వేయాలి. బెల్లం నీటిలో కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి ► ఇప్పుడు మిరియాలపొడి, ఉప్పు, పచ్చకర్పూరం వేయాలి. తులసి ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేయాలి. ► నిమ్మరసం, శొంఠి పొడి వేసి బాగా కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పొట్టుతీసిన పెసర పప్పు – ఒకటిన్నర కప్పులు, పచ్చిమిర్చి – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చికొబ్బరి తురుము – మూడు టేబుల్ స్పూన్లు, మామిడికాయ ముక్కలు – పావు కప్పు, కీరా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – టీస్పూను, నిమ్మరసం – టీస్పూను. తయారీ... ► ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. ► నానబెట్టిన పప్పులో నీళ్లు వంపేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి తురుము, మామిడికాయ ముక్కలు, కీరా తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి ► చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపితే వడపప్పు రెడీ. చలిమిడి కావలసినవి: రాత్రంతా నానబెట్టిన బియ్యం – కప్పు, పంచదార పొడి – ముప్పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అరటీస్పూను, పాలు – మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూను. తయారీ.. ► తడిబియ్యాన్ని వడగట్టుకుని..మిక్సీజార్లో వేసి పొడిచేసుకోవాలి. ఈ పిండిని మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. ► జల్లెడ పట్టి తీసిన మెత్తటి బియ్యప్పిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. ► ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ► ఈ ముద్దను పానకం, వడపప్పుతో దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
రారండోయ్ రాములోరి వేడుక చూద్దాం!
సాక్షి, అబిడ్స్/బహదూర్పురా: శ్రీరామ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. సీతారామ్బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి వేలాది మందితో శోభాయాత్ర ప్రారంభం కానుంది. అధికారుల సంయుక్తాధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చేసినట్లు భాగ్యనగర్ శ్రీరామ నవమి శోభాయాత్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు తెలిపారు. శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకొని నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులు, సిబ్బందితో శనివారం సాలార్జంగ్ మ్యూజియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీసీ టీవీలు, డ్రోన్లు, సమస్యాత్మక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నామన్నారు. శోభాయాత్ర కొనసాగే దారి పొడవునా సీసీ కెమెరాలతో నిఘా ముమ్మరం చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ ‘100’ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్ సూచించారు. రూట్మ్యాప్ ఇలా.. సీతారామ్బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి సీతారామ్పేట్ మీదుగా బోయిగూడ కమాన్, ప్రకాష్ టాకీస్, మంగళ్హాట్ పోలీస్స్టేషన్ మీదుగా ధూల్పేట్ ప్రధాన రోడ్డు వెంబడి శోభాయాత్ర కొనసాగుతుంది. పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ధి అంబర్ బజార్, గౌడలిగూడ, కోఠి మీదుగా హనుమాన్ టేక్డీకి చేరుకుంటుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ గంగాబౌలి నుంచి శోభాయాత్ర నిర్వహిస్తారు. ధూల్పేట్ మాగ్రా నుంచి ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో పాల్కి యాత్ర నిర్వహిస్తారు. (చదవండి: శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవం: సీఎం) -
శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవం: సీఎం
సాక్షి, హైదరాబాద్: సామాజిక విలువలను తూ.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడైన సీతారామచంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని సీఎం కేసీఆర్ కీర్తించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు. -
ఆదర్శ గుణాల ధర్మమూర్తి శ్రీరాముడు
సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ‘పునర్వసు’జన్మ నక్షత్రంలో జన్మించిన శ్రీరాముడు తన ఆదర్శ గుణాలతో ధర్మమూర్తిగా పేరుగాం చాడని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతటా భక్తి, అంకితభావంతో ఉత్సవాలను జరుపుకొంటారని పేర్కొన్నారు. ధర్మావతారమైన శ్రీరాముడి నుంచి మనమంతా సన్మార్గంలో బతకడానికి ప్రేరణ పొందామని తెలిపారు. -
అందరి బంధువయా రామయ్యా
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో విష్ణుమూర్తి ఏడవ అవతారంగా త్రేతాయుగంలో జన్మించాడు. యుగాలు గడిచినా ఆ మహనీయుని పుట్టినరోజును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందంటారు. శ్రీ సీతారాముల కల్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకు గుర్తుగా ఈనాడు దేశమంతటా సీతారామ కల్యాణాన్ని తమ ఇంటిలో పెళ్లేనేమో అన్నంత శ్రద్ధాభక్తులతో సంబరంగా జరుపుకుంటారు. అయితే మానవుడిగా పుట్టిన రాముడు దేవుడిగా ఇన్ని కోట్ల గుండెల్లో కొలువై ఉండటానికి కారణం క్లిష్ట పరిస్థితులలోనూ ఆయన అనుసరించిన ధర్మమే. ఈ శ్రీరామ నవమి పర్వదినాన మనం రాముడి ధర్మనిరతిని గురించి తలచుకుందాం. రామ రసాంబుధిలో ఓలలాడదాం. రాముడు మన నిత్యజీవితంలో మమేకమైన వాడు. తెల్లవారి లేస్తే రామ శబ్దం వినకుండా ఉండలేము. శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు. శ్రీరామ అని రాయకుండా ఇదివరకటి రోజుల్లో ఉత్తరం రాసేవాళ్లు కాదు. ఇద్దరి మధ్య సఖ్యత చెడితే, నీకు నాకు రామ్ – రామ్ అంటారు. నచ్చని విషయం చెబితే ‘రామ రామ’ అంటారు. రాముడు మంచి బాలుడు అంటారు. రామబంటు అంటారు, ఆకలి వేస్తే ఆత్మారాముడు అల్లరి చేస్తున్నాడంటారు. ఈ విధంగా అందరి జీవనంతో విడదీయరానిదిగా మారిపోయింది రామ శబ్దం. రాముణ్ణి ఎందుకు తలచుకుంటున్నామంటే... ఆయన జీవితం చాలా వరకు సమస్యలతోనే కూడుకుంది. అయితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని విధాలైన కష్టాలు వచ్చినా ఒక్కసారి కూడా ధర్మాన్ని తప్పలేదు. శరణన్న శత్రువును కూడా క్షమించి వదిలిపెట్టిన ఉదార మనస్తత్వం ఆయనది. ఆయన ధర్మాన్ని అనుసరించడం కాదు... ఆయన అనుసరించిన మార్గమే ధర్మంగా మారింది. అదే మానవుడిగా పుట్టిన వాడిని మహనీయుణ్ణి చేసింది. చివరికి దేవుణ్ణి చేసింది. అందుకే ఆయన అనుసరించిన మార్గం రామాయణ మహాకావ్యంగా రూపు దిద్దుకుంది. తరతరాలుగా పఠనీయ కావ్యంగా.. పారాయణ గ్రంథంగా మారిపోయింది. మూర్తీభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడు ధర్మజ్ఞుడు. తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, సహధర్మచారిణి, సేవకులు, స్నేహితులు, సన్నిహితులు, ప్రజలు, రుషులు, రాక్షసులు, పశుపక్ష్యాదులు... ఇలా ఎవరితో ఏ విధమైన ధర్మాన్ని అనుసరించాలో అన్ని ధర్మాలు తెలిసిన వాడు, ఆచరించినవాడు. అందుకే మారీచుడి వంటి రాక్షసుడు కూడా రావణునితో ‘రాముడంటే ఎవరనుకున్నావ్, సాక్షాత్తూ నడిచొచ్చే ధర్మస్వరూపమే’అని అన్నాడంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. తార చెప్పింది రాముడు ధర్మజ్ఞుడని. రాముడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. ధర్మాన్ని విడువ లేదు అందాల రాముడు పురుషులను కూడా మోహింప చేసేంతటి అందమైన రూపం శ్రీరాముడిది. మునులు రాముణ్ణి ఎంతగానో ఆరాధించారు. అభిమానించారు. ప్రేమించారు. రాముణ్ణి చూడకుండా హనుమ క్షణం కూడా ఉండలేకపోయేవాడట. ముక్కు, చెవులు కోయించుకున్న శూర్పణఖ, అన్నగారైన రావణుడి దగ్గరకి వెళ్లి శ్రీరాముని సౌందర్యాన్ని వర్ణిస్తుంది. అదేపనిగా పొగుడుతుంది. సౌశీల్యవంతుడు ఎదుటివారిని ముందుగా తానే చిరునవ్వుతో పలకరించే సౌశీల్యం రామునిది. పడవ నడిపే గుహుడు, రామునికి ప్రాణమిత్రుడు. కేవలం నిషాద రాజ్యానికి రాజు అయిన గుహుడు ఎక్కడ? చక్రవర్తి అయిన రాముడెక్కడ? అదేవిధంగా సుగ్రీవుణ్ణి ఆదరించాడు. విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు. రాజనీతిజ్ఞుడు రాజనీతిలోనూ, వ్యూహ రచనలోనూ రామునికి మించిన వారులేరని పేరు. ప్రజలకు ఏమి కావాలో రాముడికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదేమో అన్నంతగా ఆయన కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే ఇప్పటికీ రామరాజ్యాన్ని, రాముడి పాలననీ తలచుకుంటారు. శ్రీరామ నవమి నాడు ఆచరించ వలసినవి... రామనవమి పర్వదినాన ప్రతి ఒక్కరినీ కొన్ని పనులు చేయమంటుంది శాస్త్రం. 1 . సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి. 2. వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్థాలతో రాముడికి నివేదన చేసి అందరికీ పంచి పెట్టాలి. 3. రోజంతా శ్రీరామ నామం స్మరిస్తూ ఉండటం. 4. శక్తి కొలదీ దానధర్మాలు చేయాలి. ఎందుకంటే రామనవమి తిథి లాంటి మహా పర్వదినం నాడు చేసే ఏ పుణ్యకర్మయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. 5. రామనవమి నాడు పగలు ఉపవాసం, రాత్రికి జాగరణ చెయ్యమంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యం సహకరించినంత వరకు పాలు, పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం తీసుకుని రామనామాన్ని స్మరిస్తూ, వీలయితే రాత్రికి జాగరణ చెయ్యడం మంచిది. 6. దగ్గర్లోని రామాలయానికి వెళ్లి, భగవద్దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే సీతారాములవారి కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించడం.. లేదా టీవీలలో చూపించే ప్రత్యక్ష ప్రసారాలను అయినా భక్తి భావంతో చూడాలి. 7. వీలయితే రామాయణ పారాయణం లేదా శ్రవణం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందరూ భక్తిశ్రద్ధలతో రామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలని, రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరి మీదా ప్రసరించాలని కోరుకుందాం. శ్రీ రామ జయ రామ జయ జయ రామ! విష్ణు సహస్ర నామంతో సమానం కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుడిని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు ‘ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!’ అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు . శ్లో : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !! ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ‘రామ’ అంటే రమించడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ‘రా’ అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. ‘మ’ అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు. భద్రగిరి రామయ్య భద్రోభద్రయా అంటూ వేదం ఉపదేశించిన సుభద్రకరమైన భద్రబీజాక్షరాలకు సాకారం– భద్రాచల రాముడు. త్రేతాయుగంలో రాముడు తన అవతార లక్ష్యాన్ని జయప్రదంగా నిర్వహించాడు. ద్వాపరయుగం తరవాత, ఈ కలియుగాన భద్రుడనే భక్తుడి కోసం భద్రకరమూర్తిగా వైకుంఠం నుంచి తరలి వచ్చి భద్రాద్రి రాముడిగా భద్రగిరిపై కొలువయ్యాడు. భవబంధాల్ని సునాయాసంగా అధిగమించడానికి భద్రాచల రాముణ్ని సేవించాలని బ్రహ్మాండ పురాణోక్తి. శ్రీరాముడు నెలకొన్న భద్రగిరి– తెలుగువారి అయోధ్యాపురి. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను సేదతీర్చిన, శిలారూపంలో ఉన్న భద్రుణ్ని అనుగ్రహించాడంటారు. వసంత నవరాత్రి ప్రయుక్తంగా భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రానందకరంగా జరుగుతాయి. వసంత రుతుశోభకు నవ్యసౌకుమార్యాన్ని ఆపాదించే సీతారామ కల్యాణోత్సవం నవనవోన్మేషం... మధురాతి మధురం. ‘సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి’ అనే ప్రేమాస్పద అనుభూతితో భక్తుల హృదయం ఉప్పొంగుతుంది. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ధర్మానికి నిలువెత్తు రూపమైన రాముడు చూపిన మార్గంలో పయనిస్తామని, ధర్మనిర్వహణలో సదా మమేకమవుతామని భక్తులు ప్రతినబూనడమే శ్రీరామ పట్టాభిషేక వేడుకలోని అంతరార్థం. రామాయణంలో ఏముంది? రామాయణం ఓ విలువల ఆయనం.. విలువైన కావ్యం. వేదతుల్యమైన రామాయణం సామాజిక అభ్యున్నతికి ఉపకరించే సూత్రాల్ని నిర్దేశించింది. సత్యం, ధర్మం అనే రెండు చక్రాల జీవనరథంలో ఎలా ముందుకు పయనించాలో రామాయణం చాటిచెప్పింది. ఏడు కాండలు, ఐదువందల అధ్యాయాలు, ఇరవైనాలుగువేల పద్యాల మహాకావ్యం. అధ్యాయాన్ని ‘సర్గ’ అంటారు. పద్యాన్ని ‘శ్లోకం’ అంటారు. పేరుకు మాత్రమే రామకథ కానీ.. అందులో రకరకాల పాత్రలు కనిపిస్తాయి. నదులూ, పర్వతాలూ, అడువులూ, వివిధ దేశాలూ, అనేకానేక లోకాలూ కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. భిన్న జాతుల మనుషుల్నీ, వృక్షాల్నీ, పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి. ఎంతోమంది రాజులు తారసపడతారు. వారి వంశాలూ తెలుస్తాయి. విజ్ఞాన సర్వస్వం రామాయణంలో భూగోళం ఉంది, జీవ–జంతుశాస్త్రాలు ఉన్నాయి. ఇక మంచిచెడుల విషయానికొస్తే ఇది అచ్చమైన విలువల వాచకం. యుద్ధ వ్యూహాలూ, రణ తంత్రాలూ ఉన్నాయి. వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకుని రాజనీతి శాస్త్రానికో, ప్రజాపరిపాలన శాస్త్రానికో అనుబంధంగా చేర్చుకోవచ్చు. సీతాన్వేషణలో భాగంగా వాల్మీకి విశ్వాన్ని కూడా వర్ణించాడు కాబట్టి, అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు. మొత్తంగా రామాయణం సమగ్ర విజ్ఞాన సర్వస్వం! సకల శాస్త్రాల సారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామపట్టాభిషేకానికో, రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్నీ, ఉపనిషత్తుల రహస్యాల్నీ ఒడుపు గా ఇమిడ్చాడు. వ్యక్తిధర్మం, రాజధర్మం, పుత్రధర్మం... అన్నింటికీ మించి మానవ ధర్మం – రామకథలో అంతర్లీనం. అద్భుతమైన భావ వ్యక్తీకరణలు! రాముడు అరణ్యవాసానికి వెళ్లిపోగానే దశరథుడు దుఃఖంలో మునిగిపోతాడు. అనారోగ్యం కబళిస్తుంది. చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఓ మాట అంటాడు ‘రాముడు నా కనుపాప. తనతోపాటు నా చూపూ వెళ్లిపోయింది’. హనుమంతుడు అశోక వృక్షం మీద వాలే సమయానికి సీతాదేవి ‘వక్కలైన విశ్వాసంలా ఉంది’ అంటాడు వాల్మీకి. ఎంత గొప్ప వ్యక్తీకరణ? ఆ వర్ణనలూ అంతే. రావణుడు అపహరించే సమయానికి పసుపు పచ్చని చీరలో ఉంది సీతాదేవి. ఆకాశంలో పుష్పక విమానం ఎగిరిపోతుంటే.. ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతున్నది. పక్కనే నల్లగా అంతెత్తున రావణుడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్టుగా ఉందట. ఎంత గొప్ప వర్ణన! తెలుగులో గొప్ప రచనలు చేయాలనుకునేవారు రామాయణం చదివితే చాలు... అద్భుతమైన వాక్యాలు... అంతకన్నా అద్భుతమైన వర్ణనలు దొరుకుతాయి. కలం ముందుకెళుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
సీతారాముల అనుగ్రహంతో అందరికీ శుభాలు కలగాలి
సాక్షి, అమరావతి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన, లోక కల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం. ఆ ఆదర్శ మూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిలషించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన, లోకకల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం. ఆ ఆదర్శమూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2022 చదవండి: (తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కొనసాగింపు) -
రామయ్య!.. ఆ అవతారంతో పాటే నడిసంద్రంలో మునిగిపోయాడా?
సాక్షి, వెబ్డెస్క్: రాముని పాదాల దగ్గర ఆయన పరమ భక్తుడు శ్రీ ఆంజనేయుడు కచ్చితంగా ఉండాల్సిందే!. అలాంటిది ఆ ఆలయంలో మాత్రం ఉండడు!. తెలంగాణ మెదక్ జిల్లా గుమ్మడిదలలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని ‘కళ్యాణ రాముడ’ని పిలుస్తారు. సీతారామకళ్యాణ ఘట్టం సమయానికి.. శ్రీ రామాంజనేయులకు పరిచయం లేదు. కాబట్టే ఇక్కడ మారుతి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాలు చెప్తున్నాయి. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఇది. 45 ఏళ్ల కిందట ఆలయాన్ని పునరుద్ధరించారు. సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు- ఊర్మిళ, భరతుడు-మాండవి, శత్రుఘ్నుడు-శ్రుతకీర్తిల విగ్రహాలు గర్భగుడిలో కనిపించడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తుంటాడు. అందుకే ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు. -------- ► తమిళనాడులోని అతిపెద్ద రామాలయాల్లో ఒకటి తిరువణ్ణమలై జిల్లాలోని నెడుంగుణమ్ శ్రీ రామ టెంపుల్. ఈ గుడిలో రాములోరి చేతిలో బాణం ఉండదు. గుండెపై కుడి చేయి వేసుకుని యోగముద్రతో శాంతమూర్తిగా కనిపిస్తాడు ఇక్కడ. ప్రశాంతతకు నెలవుగా ఈ ఆలయాన్ని భావిస్తారు భక్తులు. హనుమంతుడి విగ్రహం శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూనే.. స్వామి చెబుతున్నది వింటున్నట్లు కనిపిస్తుంది. లక్ష్మణుడు మాత్రం విల్లు ధరించి ఉంటాడు. ఇక సీతమ్మ కుడిచేతితో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తున్నట్లు ఉంటుంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఇక్కడ విడిది చేశాడని, శుక మహర్షిని దర్శించుకున్నాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయ రాఘవన్’ అని అంటారు. రాముడు యోగముద్రతో కనిపించే ఆలయాలు ఇంకా ఉన్నప్పటికీ.. వాటిల్లో బాగా పేరున్నది ఇదే. -------- ► సాధారణంగా సీతారాముల విగ్రహంలో సీతమ్మ రాముడికి ఎడమ వైపు ఉంటుంది. కానీ, తిరుపతి కోదండ రామాలయంలో మాత్రం కుడివైపున సీతమ్మ విగ్రహం, ఎడమవైపున లక్ష్మణుడి విగ్రహం ఉంటుంది. వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా ఉండాలట!. ఆ ప్రకారమే ఈ విగ్రహం కుడివైపు ఏర్పాటు చేయించినట్లు పండితులు చెబుతున్నారు. ఇలా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. తిరుపతి సిటీ సెంటర్లో ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని స్థల పురాణం. అంతేకాదు సీతను అన్వేషించే క్రమంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది. -------- ► త్రిప్రాయర్ శ్రీ రామస్వామి టెంపుల్.. కేరళలోని త్రిస్సూర్లో తీవ్ర నది ఒడ్డున ఉంది. ఎక్కడా కనిపించనట్లుగా ఆ గుడిలో శ్రీరాముడు.. విష్ణుమూర్తి అవతారంతో కనిపిస్తాడు. ‘త్రిప్రా దేవర్’గా ప్రసిద్ధుడైన ఈ శ్రీరాముడికి నాలుగు భుజాలు ఉంటాయి. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో విల్లు, నాలుగో చేతిలో జపమాల ఉంటాయి. వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతంగా భావిస్తారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందుకే త్రిమూర్తుల స్వరూపమైన ఆలయంగా త్రిప్రాయర్ని భావిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, అవతారం ముగిశాక ద్వారకతో పాటు ఈ విగ్రహం కూడా సముద్రంలో మునిగిపోయిందనీ స్థల పురాణం చెబుతోంది. సముద్రంలో దొరికిన విగ్రహానికి మత్స్యకారులు ప్రతిష్ఠ జరిపారని చెప్తారు. -------- ఫొటోల్లో తప్పించి శ్రీరామ పట్టాభిషేకం తరహా విగ్రహాలు ఏ ఆలయంలో కనిపించవు.. ఒక్క తమిళనాడులో తప్ప. సేలంకు దగ్గర్లోని అయోధ్యాపట్నంలోని శ్రీ కోదండపాణి రామాలయం ఉంది. ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు. ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని దర్శనమిస్తాడు. ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా, సైన్యం సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చాడట. అయోధ్య పట్టాభిషేక ముహూర్తం ఆలస్యం అవుతుండడంతో.. ఈ ప్రాంతంలో పట్టాభిషేకం జరిపారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ఊరికి అయోధ్యపట్నం అని పేరొచ్చిందని భావిస్తుంటారు. ::శ్రీరామ నవమి సందర్భంగా.. -
తెలంగాణ సరిహద్దులో శ్రీరామనవమి.. అదిగో భద్రాద్రి.. ఎటపాక ఇదిగో..
సాక్షి, ఎటపాక: సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సరిహద్దున ఉన్న ఎటపాక మండలంలో జటాయువు మండపం, గుండాల గ్రామంలోని ఉష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావిని భక్తుల దర్శనార్థం సిద్ధం చేశారు. ఏటా భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం,ముక్కోటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు జటాయువు మండపం,ఉష్ణగుండాలను దర్శించుకుంటారు. ఈనెల 10న శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం, 11న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాలకు భద్రాచలంలోని రామాలయంలో నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిగో భద్రాద్రి..గౌతమి అదిగో చూడండి... అంటూ శ్రీరామదాసు పిలుపునందుకుని సీతారాముల కల్యాణానికి భక్తులు తరలివస్తున్నారు. శ్రీరామనవమి అంటే చాలు భక్తిపారవశ్యంతో పులకించే భక్తులు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే వేలాది మంది భద్రాద్రికి ఏటా వస్తుంటారు. అంతేకాకుండా రామయ్య పెళ్లి వేడుకల్లో అన్నీ తామై ముందుంటారు. తలంబ్రాల తయారీ, పెళ్లి తంతులో ఉపయోగించే కొబ్బరి బొండాలు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు ఉభయగోదావరి జిల్లాల నుంచే తీసుకెళుతుంటారు. కరోన కారణంగా స్వామి వారి కల్యాణాన్ని గత రెండేళ్లుగా వీక్షించే భాగ్యాన్ని భక్తులు నోచుకోలేదు.అయితే ఈఏడాది జరిగే వేడుకలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో పాల్గొనేందుకు లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియాన్ని సుందరంగ అలంకరించారు. పట్టణంలోని ప్రధానకూడల్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఉçష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావి ఉష్ణగుండాల ప్రాశస్త్యం సీతమ్మ వారు వనవాస సమయంలో గోదావరిలో స్నానమాచరించే క్రమంలో చన్నీళ్లు పోసుకునేందుకు కొంత అసౌకర్యానికి గురైనట్టు చరిత్ర. ఆ సమయంలో లక్ష్మణుడు తన విల్లంబును ఇసుక తిన్నెల్లో ఎక్కుపెట్టి సంధించగా అక్కడ వేడి నీళ్లు వచ్చాయని ప్రతీతి. ఆ ప్రాంతంలోని గోదావరి ఇసుక తిన్నెల్లో బావి తీస్తే ఇప్పడు కూడా వేడి నీళ్లు వస్తుంటాయి. ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేడినీటిని తలపై చల్లుకుంటారు. జటాయువు విశిష్టత సీతారాముల వనవాస సమయంలో సీతమ్మ వారు పర్ణశాల కుటీరంలోనే తలదాచుకున్నారు. రావణాసురుడు ఇక్కడనే సీతమ్మ వారిని అపహరించారు. ఆకాశ మార్గాన ఎత్తుకెళ్తున్న సమయంలో జటాయువు అనే పక్షి రావణాసురున్ని నిలువరించేందుకు భీకర పోరాటం చేసిన క్రమంలో రెక్క ఒకటి తెగి పడిన ప్రదేశమే ఎటపాక. మొదట్లో జటాయుపాక, ఆ తరువాత జటపాక, కాలక్రమంలో ఎటపాకగా రూపాంతరం చెందింది. పక్షి కాలుపడిన గుర్తులు నేటికీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. చిన్నపాటి మండపాన్ని గ్రామస్తులే నిర్మించారు. యోగరాముడు (శ్రీరామగిరి క్షేత్రం) ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రదేశం. నిండుగా ప్రవహించే గోదావరి నదీతీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం. ఆ కొండకే శ్రీరామగిరి అని పేరు. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించినట్టు స్థలపురాణం చెబుతోంది. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం (వనక్షేత్రం) చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెదుకుతూ ఈప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని తెలుస్తోంది. ఆ శబరి మాత పేరుతోనే ఇక్కడి నదిని శబరి నది అంటారు. సబరియే నదిగా మారిపోయిందనే కథ కూడా ఉంది. ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహితసంబంధం గల పవిత్రప్రాంతమిది. ఈప్రాంతానికి సమీపంలో రేఖ పల్లిలో (రెక్కపల్లి)(జటాయువు యొక్క రెండవ రెక్క పడిపోయిన చోటు) రెక్కను చూసి జటాయువును చూశారు. రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలుచేశారు. గోదావరి తీరంలో ఓపెద్ద శిలపై దానికి పిండ ప్రదానం చేసినట్టు స్థల చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ శిలను మనం దర్శించవచ్చు. ముందు ఈ కొండపై రామలక్ష్మణుల రెండు విగ్రహాలే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో మాతంగి మహర్షి వంశీయులైన మహర్షులు సీతమ్మ తల్లివారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు స్థల చరిత్ర చెబుతోంది. ఇక్కడి స్వామిని సేవించిన వారికి అన్ని రకాల మానసిక చింతలు తొలగి ధైర్య స్థైర్యాలు, స్థితి ప్రజ్ఞత ఏర్పడతాయని పెద్దలు చెబుతుంటారు. -
సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసా
రాజాం సిటీ: సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసాను చెక్కి ప్రతిభ నిరూపించుకున్నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, స్వర్ణకారుడు ముగడ జగదీశ్వరరావు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా రజత పుస్తకం రూపొందించానని తెలిపారు. మొత్తం 22 పేజీలు గల 11 వెండి రేకులలో 40 హనుమాన్ చాలీసా శ్లోకాలను చేతితో చెక్కినట్లు పేర్కొన్నారు. 1.060 మిల్లీ గ్రాముల బరువుతో 3.2 సెంటీమీటర్ల పొడవు, 2.3 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ పుస్తకం తయారు చేశానని తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం పట్టిందన్నారు. పుస్తకం మొదటి పేజీలో ఆంజనేయుడు, ఆఖరి పేజీలో శ్రీరాముడు చిత్రపటాలను చెక్కినట్లు చెప్పారు. గతంలోనూ దేశనాయకులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఫొటోలను వెండి కాయిన్లపై చెక్కి అబ్బురపరిచారు. గిన్నిస్బుక్ లక్ష్యం.. గిన్నిస్బుక్లో చోటు సంపాదించేందుకు ఈ మైక్రో ఆర్ట్ను ఎంచుకున్నాను. ప్రతి రోజు ఏదో ఒక చిత్రాన్ని వెండి కాయిన్పై రూపొందిస్తున్నా. భారతదేశ చిత్రపటాన్ని పెన్సిల్ ముల్లుపై 50 సెకన్లలో వేసినందుకు క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు లభించింది. మరింతగా సూక్ష్మమైన ఆర్ట్వేసి గిన్నిస్బుక్లో చోటు సంపాదిస్తా. – ముగడ జగదీశ్వరరావు, మైక్రో ఆర్టిస్ట్, రాజాం -
ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే
సాక్షి, తిరుపతి, తిరుమల: కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలే రామభక్తుడైన ఆంజనేయుడి జన్మస్థలం అని టీటీడీ ఆధారాలతో సహా నిరూపించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఈ మహత్తర, పురాణ, చారిత్రక ఆవిష్కరణను బుధవారం శ్రీరామనవమి రోజు టీటీడీ ప్రకటించటం విశేషం. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో టీటీడీ వెలుగులోకి తెచ్చింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. శాస్త్రబద్ధంగా నిరూపణ: తమిళనాడు గవర్నర్ పురోహిత్ భక్త హనుమ జన్మస్థలాన్ని నిర్ధారిస్తూ పండితుల కమిటీ రూపొందించిన నివేదికను నవమి రోజు తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ హాజరయ్యారు. హనుమ జన్మస్థలాన్ని టీటీడీ శాస్త్రబద్ధంగా నిరూపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్గా తనకు బాగా తెలుసన్నారు. నాలుగు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఆయన అభినందించారు. త్వరలో పుస్తక రూపంలో నివేదిక: ఈవో జవహర్రెడ్డి భగవత్ సంకల్పంతోనే శ్రీరామనవమి నాడు హనుమంతుడి జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వాజ్ఞయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ఆధారాలతో కూడిన నివేదికను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, త్వరలో పుస్తక రూపంలోకి తెస్తామని ప్రకటించారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని కూడా హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండవచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవుడికి సాయం చేసినట్లుగా భావించవచ్చన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణాలో హనుమంతుడు జన్మించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు.. కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధరశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ విజయ్కుమార్, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మలను ఈవో అభినందించారు. పండితుల కమిటీ నాలుగు నెలల పాటు విస్తృతంగా పరిశోధించి బలమైన ఆధారాలు సేకరించిందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇవీ ఆధారాలు.. శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, అనేక పురాణాలు, వేంకటాచల మహాత్యం, ఎన్నో కావ్యాల్లో హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వర్ణించి ఉందని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. కంబ రామాయణం, వేదాంత దేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజనాద్రిగా అభివర్ణించారని తెలిపారు. బ్రిటీష్ అధికారి స్టాటన్ క్రీ.శ.1800లో తిరుమల ఆలయం గురించి సంకలనం చేసిన అంశాలతో సవాల్–ఏ–జవాబ్ పుస్తకాన్ని రాశారని, అందులో అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టినచోటు కావడం వల్లే అంజనాద్రి అనే పేరు వచ్చిందని ప్రస్తావించారని తెలిపారు. బాలాంజనేయుడు సూర్యదేవుడిని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మళ్లీ చూడడం, వానరవీరులు వైకుంఠగుహలో ప్రవేశించడం.. లాంటి అనేక విషయాలు వేంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తున్నాయన్నారు. ఈ గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో ఉన్నాయన్నారు. మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీ నాటిది కాగా రెండో శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదని వివరించారు. శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం కూడా దీన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్జెట్టి, ఎస్వీబీసీ సీఈవో సురేష్కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామ నవమి స్పెషల్: కొత్త సినిమాల పోస్టర్లు చూశారా
పండగ వచ్చిందంటే చాలు.. సినిమాలకు సంబంధించి కొత్త కబుర్లు, ఫస్ట్లుక్ పోస్టర్లు, స్పెషల్ పోస్టర్లు విడుదల అవుతుంటాయి. పండగ పూట కొంతమంది హీరోల సినిమాల విడుదలైతే.. మరికొన్ని సినిమాల టీజర్స్, ట్రైలర్లు అంటూ సందడి చేస్తాయి. అయితే కరోనా పుణ్యమా అని ఈ శ్రీరామ నవమికి సినిమాలు అయితే విడుదల కాలేదు కానీ, కొత్త పోస్టర్లు మాత్రం సందడి చేశాయి. శ్రీరామ నవమి పురస్కరించుకొని చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ విడుదల చేసారు. అవేంటో చూసేద్దాం. -
సర్వంగా సుందరంగా ముస్తాబైన భద్రగిరి
-
శ్రీరామనవమి ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా?
శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది. అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. అదే రామాయణం. 12 గంటలకు ఎందుకు పూజ చేయాలి? రాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో ఎలా జరుపుకోవాలి? శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి, తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాలను పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు (నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయి. పానకం, వడపప్పు ఎందుకు? భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్ రుతువు, వసంత రుతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధోవికాసం కలుగుతుంది. -
రామాయణం: రమణీయం చిరస్మరణీయం
ఉపనిషత్తులు కీర్తించే నిర్గుణ పరబ్రహ్మమే సగుణ సాకార రూపంలో శ్రీరామచంద్రుడుగా, మానవుడిగా, దశరథ మహారాజుకు కుమారునిగా జన్మించాడు. రావణాసురుని సంహరించాలంటే పరమాత్మ మనిషిగానే పుట్టాలి. నరునిగా జన్మించి, వానరాల సహాయంతో మాత్రమే దుష్ట రావణ రాక్షస సంహారం చెయ్యగలుగు తాడు. కనుక పరిపూర్ణ మానవునిలా పుట్టి, మానవులలో ఉత్తమోత్తమ గుణ సమన్వితుడై, మానవునిలాగా సకల భావాలను అనుభవిస్తూ, బంధాలను, అనుబంధాలను, అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉత్తమంగా పాటిస్తూ, మంచి కుమారునిలా, సోదరునిలా, భర్తగా, స్నేహితునిలా, రాజుగా అనేక విధాలుగా మానవుని లాగానే ప్రవర్తించాడు. భరద్వాజ మహర్షి రచించిన భరద్వాజ రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎవరెవరికి ఎలా కనిపిస్తున్నాడో, ఎవరు ఎలా అనుకుంటారో ఈ శ్లోకంలో చెప్పారు. రామః పిత్రోః పుత్రభావం రావణాయ మనుష్యతాం ! ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచచారహ!! శ్రీరాముడు దశరథునికి పుత్రునిలా, రావణాసురునికి మనిషిలా, మహర్షులకు భగవంతునిలా కనిపించాడు. విశ్వామిత్ర మహర్షి దశరథుని రాజసభకు వచ్చి, తను చేస్తున్న యాగ రక్షణకు రాముడిని పంపమని అడిగినప్పుడు దశరథ మహారాజు పసిబుగ్గలతో పాలుతాగే వయస్సులో ఉన్న నా రాముడు రాక్షసులతో యుద్ధం చెయ్యటమా !! రాముడిని పంపలేను, నా సైన్యంతో నేను వస్తాను, యాగరక్షణ చేస్తానంటాడు. కానీ విశ్వామిత్రుడు అంగీకరించడు. రాముడినే పంపమంటాడు. పైగా నీ కుమారుని గురించి నీకు తెలీదు. మమకారంతో మోహపడుతున్నావు. రాముడెవరో నాకు తెలుసు, వసిష్ఠ మహర్షికి తెలుసు, తపస్సులో ఉన్న మహర్షులకు తెలుసు అన్నాడు. తనకు రాముడెవరో తెలుసునన్నాడే కానీ ఆయనే పరమాత్మ అని చెప్పలేదు. అతీంద్రియ దర్శన శక్తి కల మహర్షులందరికీ శ్రీమన్నారాయణుడే శ్రీ రామునిలా వచ్చాడని తెలుసు. కానీ రావణ వధ అయేవరకు ఈ రహస్యం బైట పడరాదనీ, రాముడే తాను మానవుడిలా ప్రవర్తిస్తుంటే, ఆయన దేవుడని చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. కానీ రాముడు జన్మించింది మొదలుకొని, అవతార పరిసమాప్తి వరకు మానవుడిలాగే జీవించాడు. రావణ వధే రామావతార ఉద్దేశ్యం కాదు... కేవలం రావణ వధ, దుష్ట రాక్షస సంహారము మాత్రమే శ్రీరామావతార ప్రయోజనం కాదు. ధర్మమంటే ఏమిటి? ధర్మాన్ని ఎలా ఆచరించాలి? సత్యమంటే ఏమిటి? ఎలా సత్యనిష్ఠ కలిగి ఉండాలన్నవి బోధించటానికి, ఒక సుస్థిరమైన సత్యమైన సత్పాలనను అందించి, ఆదర్శ రాజ్య పాలనను అందించటానికి, సర్వమానవ బంధాలను ఏ విధంగా పాటించాలో, అన్నింటినీ తాను ఆచరించి చూపించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. మానవుడు సత్యనిష్ఠతో, ధర్మ బుద్ధితో, సద్గురువుల ఆదేశంతో సత్యపథంలో పయనించి దేవుడుగా మారగలడని ప్రత్యక్షంగా ఆచరించి చూపించాడు, అన్ని విధాల ఆదర్శ వంతుడయ్యాడు. నరునిగానే ప్రవర్తిస్తూ, నరునిగానే ఆచరిస్తూ, సాధారణ మానవులకు సాధ్యం కాని ఎన్నింటినో సుసాధ్యం చేసి చూపించాడు. రావణ వధానంతరం పరమేశ్వరుడే శ్రీరామ చంద్రుని దగ్గరికి వచ్చి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, రావణ వధ కోసం నరునిలా అవతరించావు, ఆ కార్యం పూర్తయింది కనుక ఇంక వైకుంఠానికి వచ్చెయ్యమంటాడు. అప్పుడు రాముడు ‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం’ అని చెప్పాడు. అంటే ‘నీవు నన్ను ఎవరనైనా అనుకో, నేను మటుకు నన్ను దశరథుని కుమారుడైన రాముడిని, మనిషిని అనే అనుకుంటున్నాను’ అని అర్థం. శ్రీరాముడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై రామరాజ్యాన్ని స్థాపించాడు. సృష్టి ఉన్నంత వరకూ సర్వ మానవులూ ఆదర్శంగా భావించే ఆదర్శ పురుషుడయ్యాడు. అందరూ భక్తితో ఆరాధించే దేవుడయ్యాడు. అందుకే రామాయణం రమణీయం. చిర స్మరణీయ కావ్యం అయింది. – డాక్టర్ తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు -
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ...
‘జానకి కలగన లేదు రాముడి సతి కాగలనని ఏనాడు’... తెలుగు సినిమా పాటలో సీత ఉంది. ‘సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం’ తెలుగు సినిమా పాటలో రాముడు ఉన్నాడు. ‘కల్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కల్యాణమే’... వెండి తెర ఆ ఇరువురి కల్యాణానికి పాట కట్టింది. ‘జానకి రాముల కల్యాణానికి జగమే ఊయల లూగెనులే’ అంటూ పరవశించింది. సీతను, రాముణ్ణి ప్రస్తావిస్తూ తెలుగు పాట కొనసాగుతూనే ఉంది. సీతను రాముణ్ణి పోలికకై తేకుండా కళ ఎలా మనగలుగుతుంది? శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ‘సీతారాముల పాటలు’. తెలుగువారికి పెళ్లి అంటే అది సీతారాముల పాటతోనే మొదలవ్వాలి. ఆ దివ్యజంట వివాహం ఎంత వైభోగంగా జరిగిందో అంత వైభోగంగా తమదీ జరగాలని లేదంటే ఆ జంట దివ్యాశీస్సు తమపైనా ఉండాలని కాంక్షించని వధూవరులు ఉండరు. అందుకే పచ్చని పందిరి కట్టగానే గతంలో గ్రామ్ఫోన్ రికార్డు మోగించేవారు. ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ’... ఎన్.టి.ఆర్ది ఎంత గొప్పతనమో. తాను తీసే సినిమాలో రాముడిగా తాను ఉండగలిగినా ఉండకుండా, అంతమంచి పాటను తన కోసం రిజర్వ్ చేసుకోకుండా హరనాథ్, గీతాంజలిలపై చిత్రీకరణ చేశారు. ‘సీతారామ కల్యాణం’ సినిమా రెండోసారి చూడని వారు చాలామంది ఉంటారు. కాని వందసార్లయినా ఈ పాట వినని వారు ఉండరు. రాముడు ఆది పురుషుడు హైందవ విశ్వాసాలలో. సీత మహాసాధ్వి. వీరి కథ వేల సంవత్సరాలుగా జనవాళికి తీపిని పంచుతూనే ఉంది. జంట అంటే సీతారాముల జంటే. ఆమె కోసం అతను విల్లు విరిచాడు. అతని కోసం ఆమె వనవాసానికి బయలుదేరింది. ఇరువురూ తమ వియోగానికి ఎంతగా అలమటించారో నేటికీ వారి భక్తులు ఆ సందర్భాన్ని వింటూ కంటూ అంతగా అలమటిస్తారు. వారికి సీతారాములు పటం కట్టినట్టు సదా పక్కపక్కనే ఉండాలి. కాంతులీనుతూ ఉండాలి. వారిని పాట కట్టుకుని తాము పరవశిస్తూ ఉండాలి. తాము ఏదైనా మొరపెట్టుకోవాలంటే సీతమ్మ ద్వారా ఆయనకు మొర పెట్టుకోవాలి. భక్త రామదాసు నుంచి నేటి భక్తుని వరకూ పాడేది అదే. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’... ఆ తల్లి చెబితే ఆయన వినకుండా ఉంటాడా? చిత్తూరు నాగయ్య గారి నుంచి నాగార్జున వరకు ఆ పాటతో సీతను వేడుకున్నవారిలో ఉన్నారు. ‘లవకుశ’లో సీతకూ రాముడికీ కలిపి పాటలు లేవు. కాని వారు నగర ప్రవేశం చేయనున్నారన్న వార్త వినగానే ప్రజలు సంభ్రమం చెందుతారు. ఆడిపాడుతారు. ‘విరిసే చల్లని వెన్నెల’ పాట ప్రేక్షకుల మదిలో పిండారబోస్తుంది. దర్శకుడు బాపు రామభక్తులు. ఆయన ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతా కల్యాణం’ సినిమాలు తీశారు. ఆయన చివరి సినిమా ‘శ్రీరామరాజ్యం’ కావడం రాముడు ఆయనకు ఇచ్చిన కానుక అనుకోవచ్చు అభిమానులు. ‘శ్రీరామరాజ్యం’లో సీతాసమేతుడైన రాముడు అయోధ్యకు తిరిగి వస్తుండగా ఇళయరాజా చేసిన ‘జగదానంద కారకా’... పాట రామభక్తులకు కన్నులపండువ. సోషల్ సినిమాలు వచ్చాక ఆధునిక హీరో హీరోయిన్లు తెర మీదకు వచ్చినా ఆ ఇరువురిని తలవకుండా లేరు. రెండు పెళ్లిచూపుల పాటలు సీతారాముల ప్రస్తావనతో హిట్ అయ్యాయి. ‘మగమహారాజు’లో ‘సీతే రాముడి కట్నం’ పాట వాణి జయరామ్ పాడగా నటి తులసి అభినయించారు. ‘అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం’ అనే లైను ఈ పాటలో ఎంతో లోతైనది. నిజమే కదా అనిపించేది. ఇక ‘సంసారం ఒక చదరంగం’లో కూడా ‘జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే’ పాట పెళ్లిచూపుల సందర్భంగా వస్తుంది. ఆ పాటను ఆ సినిమాలోని అన్నపూర్ణ, సుహాసిని, కల్పనల మీద విడివిడిగా చిత్రీకరించడం చిన్న సరదా. ఇళయరాజా తెలుగువారికి మరో అందమైన సీతారాముల పాట ఇచ్చారు ‘రాజ్కుమార్’ సినిమా లో. శోభన్బాబు, జయసుధ నటించిన ఆ పాట ‘జానకి కలగన లేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’... ఈ పాటలో వేటూరి ‘తొలి చుక్కవు నీవే... చుక్కానివి నీవే’ అని రాస్తారు రాముడు సీతతో అన్నట్టు. రాముడికి సీత చుక్కాని కావడం ఒక మంచి భావన. ‘సాగర సంగమం’ తర్వాత వేటూరి కొన్నాళ్లు అలిగి కె.విశ్వనాథ్తో కలిసి పని చేయలేదు. ఆ సమయంలో విశ్వనాథ్ సినారె, సిరివెన్నెలలతో పాటలు రాయించారు. కాని ఎస్.పి. బాలు నిర్మాత కావడం వల్ల ‘శుభ సంకల్పం’లో పాట రాశారు. సీతారాముల తలంపు కావచ్చు. అందుకే ‘సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు’ వంటి అందమైన పాట పుట్టింది. జంధ్యాల తీసిన ‘సీతారామ కల్యాణం’లో కెవి మహదేవన్ చేసిన ‘కల్యాణ వైభోగమే శ్రీసీతారాముల కల్యాణమే’... పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. అందులో భద్రాద్రి కల్యాణం రియల్ ఫుటేజ్ వాడటం ఆ రోజుల్లో విశేషమనే చెప్పాలి. ఆ తర్వాతి రోజుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన వచ్చిన అవకాశాలలో సీతారాముల జంట ప్రస్తావనను సుందరంగా తెస్తూ వచ్చారు. ‘స్వయంకృషి’లో ‘సిగ్గూపూబంతి యిసిరే సీతామాలచ్చి’ మనోహరంగా ఉంటుంది. ‘రాముడి సిత్తంలో కాముడు చింతలు రేపంగా’ అని బహుశా మొదటిసారి రాముని శృంగార తలపులను జానపదుల శైలిలో ప్రస్తావనకు తెచ్చారాయన. ‘మురారి’లో ‘అలనాటి రామచంద్రుడికన్నింట సాటి’ పాట ‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి’కి సరిసాటిగా ఉండే ప్రయత్నం చేస్తుంది. రాముడిని ఎల్లవేళలా తలిచేవారు ఉంటారు. కాని శ్రీరామ నవమి అంటే సీతారాములను కలిపి తలుస్తారు. ఆ జంట సుందర చరితను స్మరించుకుంటారు. వారి ప్రస్తావన ఉన్న పాటలు రేడియోల్లో మారుమోగుతాయి. రాముడి పాటలో తప్పక భక్తి ఉంటుంది. కాని సీతారాముల పాటలో బాంధవ్యం ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమే అని ఈ సందర్భంగా వారి పాటలన్నీ మనకు చెబుతూ ఉంటాయి. శ్రీరామ నవమి శుభాకాంక్షలు. - సాక్షి ఫ్యామిలీ -
శ్రీరామ నవమి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి?
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ రామనామ వైభవాన్ని ఈశ్వరుడు చెప్పాడు. చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో పగలు పన్నెండుగంటల సమయంలో యజ్ఞఫలంగా శ్రీరామచంద్రుడు దశరథుని భార్య కౌసల్యకు జన్మించాడు. శ్రీరాముడిగా ఆయన అవతరించి నేటికి ఒక కోటీ ఎనబైయొక్క లక్షల ఏడువేలసంవత్సరాలు గడిచాయి. ఆ నాటి నుంచి శ్రీ రామ నవమిని దేశ విదేశాల్లోని భక్తులందరూ పవిత్రమైన పర్వంగా జరుపుకుంటున్నారు. సచ్చీలత, సమర్ధత, బుద్ధి కుశలత, శరణు జొచ్చినవారికి అభయమివ్వడం, పెద్దలను, మిత్రులను గౌరవించటం, అసత్య మాడకుండటం, ఏకపత్నీ వ్రతం మొదలైనవి శ్రీరాముని గుణాలలో పేర్కొన తగినవి. శేషతల్ప సుఖ నిద్రితుడు, సర్వ చరాచర పాలకుడు, శుద్ధబ్రహ్మ పరాత్పరుడు, సమస్త లోకనాథుడు అయిన శ్రీమహావిష్ణువు ధర్మమార్గానికి గ్లాని సంభవించినప్పుడు, దుర్మార్గుల ఆగడాలు మితిమీరినప్పుడు, మంచివారికిరక్షణ కరువైనప్పుడు అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేస్తాడని భగవద్గీతలో స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. ముఖ్యంగా మనకు తెలిసిన దశావతారాలలో వామన, శ్రీరామ, పరశురామ, శ్రీ కృష్ణ అవతారాలు మాత్రం మానవ రూప అవతారాలు. ఎత్తినది మానవావతారమైనా మాధ వుడిగా అతని కీర్తి సర్వ జగత్తులోనూ వ్యాపించింది. యుగాలు గడిచినా శ్రీరామచంద్రుడు ప్రజల మనస్సుల్లో మర్యాదా పురుషోత్తమునిగా నేటికీ నిలిచి ఉన్నాడు. ఆదికవి వాల్మీకి మహాముని ముఖపద్మం నుండి వచ్చిన రామకథా మకరందాన్ని గ్రహించిన వారు జన్మ దుఃఖాన్ని, వ్యాధుల వల్ల వచ్చే బాధలను, ముసలితనంలో కలిగే బాధలను మరణ భయాన్ని పొందరు. శ్రీరామకథా పఠనం వల్ల అంతంలో విష్ణులోక ప్రాప్తి తథ్యమని మన పూర్వులు చెప్పారు. ఈ మహీతలంలో (భూమి) పర్వతాల, నదులూ ఎంత కాలం వరకు నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీరామాయణం కూడా లోకాల న్నింటిలోనూ ప్రచారంలో ఉండగలదు. ఎందుకంటే రామాయణం లో హృదయాన్ని ద్రవింపచేసే చక్కని కథ ద్వారా మానవాళికి మార్గదర్శనం చేసే సుభాషిత రత్నాలు ఎన్నో చెప్పారు. మానవజాతి మనుగడ ఉన్నన్నాళ్ళూ ఈ కథ నిలిచి ఉంటుంది. పాతబడడమంటూ ఏ నాటికీ జరగదు. ఈ గ్రంథం మానవ జీవితాన్ని సుఖప్రదం చేసుకునేందుకు ఇతోధికంగా ఉపకరిస్తుంది. అంతటి మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షికి ధన్యవాదాలు తెలుపవలసిన దినం శ్రీరామ నవమి పర్వదినం. ఈ పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి? ఈ రోజున ఉపవాసవ్రతమాచరించాలి. వీలు కాని పక్షంలో ఏకభుక్తం చేయవచ్చు. ఉదయాన్నే స్నానాదికాలు పూర్తి చేసి ‘నవమ్యా అంగభూతేన ఏకభుక్తేన రాఘవ, ఇక్ష్వాకు వంశ తిలక ప్రీతి భవభవ ప్రియ’ అని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత విధి విధానంగా పూజ చేసి గంధం పుష్పాక్షితలు కలిపిన నీటితో అర్ఘ్యమీయాలి. వడపప్పు పానకం ప్రసాదంగా స్వీకరించాలి. చైత్రశుద్ధ నవ రాత్రులు ఈ తొమ్మిది రోజులు రామాయణ గ్రంథ పఠనం చేయడం ముక్తికి సోపానం. లేదా సుందరాకాండ పారాయణ చేసినా అంతే ఫలితం ఉంటుంది. సుందరకాండ పారాయణం సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం * * * * * * * * సుందరాకాండ మంత్రం కూడా సుందరమైనదే. మహిమాన్వితమైనదే. శ్రీరామాయణ పారాయణం వేద పారాయణంతో సమానం. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడే. ఆపదామపహర్తారం, దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం * * * * * * * * ఆపదలను పోగొట్టి సంపదలను కలిగించే లోకాభి రాముడైన శ్రీరామునికి పదే పదే నమస్కారం. ప్రస్తుతం కరోనా ఉధృతి వేళ ఆలయాలకు స్వయంగా వెళ్లలేని వారు శ్రీరామ కల్యాణ వేడుకలను ప్రసార మాధ్యమాలలో తిలకించడమూ ఫలదాయకమే. – గుమ్మా ప్రసాదరావు -
రామ నామము తలచి...గోటితో వలిచి..
భద్రాచలం: సీతమ్మవారి మెడలో జగదభిరాముడు మంగళసూత్రాలు కట్టే క్షణం కోసం భక్తులు ఎదురు చూస్తారు. ఈ సందర్భంగా ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా..’ అంటూ శ్రీ సీతారాముల కల్యాణాన్ని వర్ణించే క్రమంలో తలంబ్రాలకు గల ప్రత్యేకతను వివరిస్తారు. అలాంటి తలంబ్రాలను భక్తితో, అకుంఠిత దీక్షతో, వడ్లను గోటితో ఒలిచి రామయ్య కల్యాణానికి తీసుకొస్తున్న కోరుకొండ భక్త సైన్యంపై ప్రత్యేక కథనం.. 2012లో శ్రీకారం.. శ్రీ సీతారాముల కల్యాణానికి నాడు శచీదేవి, అహల్యతో పాటు శబరి కూడా శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని ప్రతీతి. అప్పట్లో రామయ్యకు ముత్యాల తలంబ్రాలతో పాటు గోటి తలంబ్రాలు కూడా అందేవని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వాసులు తరతరాలుగా గోటి తలంబ్రాలు అందించేవారని, కొంత కాలం తర్వాత అది నిలిచిపోయిం దని తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన కల్యాణం అప్పారావు ఓ బృహత్కార్యానికి 2012లో శ్రీకారం చుట్టారు. తానొక్కడే కాకుండా రామ భక్తులందరినీ ఏకం చేసి ‘శ్రీకృష్ణ చైతన్య సంఘం’ ఏర్పాటు చేసి గోటి తలంబ్రాల యజ్ఞాన్ని ప్రారంభించారు. ‘శ్రీరామ క్షేత్రం’లో గోటి తలంబ్రాల పంట.. తలంబ్రాలకు వినియోగించే వరి నారు వేసేటప్పటి నుంచి పంట కోత కోసే వరకు ఆధ్యాత్మిక కార్యక్రమంగానే భక్తులు భావిస్తుంటారు. నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి గోకవరం మండలం అచ్యుతాపురంలోని ఎకరం పొలంలో.. భక్తులు ఆంజనేయస్వామి, వానరుల వేషధారణలో పొలం దున్ని, నాటు వేస్తారు. పొట్ట దశకు వచ్చాక భక్తిశ్రద్ధలతో సీమంతం చేస్తారు. వరి కోసేటప్పుడు కూడా రాముడి వేషధారణలో ఉన్న భక్తుడికి మొదట అందజేస్తారు. శ్రీరామనవమికి 2 నెలల ముందు నుంచే గోటితో వడ్లను ఒలుస్తారు. పరిసర గ్రామాల మహిళలు, భక్తులు శ్రీరామ చిత్ర పటం ముందు రామ నామస్మరణ చేస్తూ ‘వడ్లు వలుపు–శ్రీరాముని పిలుపు’ పేరిట గోటితో ఒలుస్తారు. ఆ బియ్యాన్ని కలశాలలో పెట్టి రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ‘రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు’ కార్యక్రమం నిర్వహించి భద్రాచ లం తీసుకొస్తారు. తలంబ్రాలతో భద్రగిరి ప్రదక్షిణ చేసి రామాలయంలో అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు విస్తరణ.. గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలోని పలు జిల్లాల భక్తులు కూడా గోటి తలంబ్రాలు ఒలుస్తున్నారు. కర్ణాటకకు చెం దిన భక్తులు సైతం ఈ ఏడాది ఈ యజ్ఞంలో పాల్గొంటుండడం విశేషం. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో మహిళా ఖైదీల్లో మార్పు రావడం కోసం గోటి తలంబ్రాలను ఒలిపించారు. ఒంటిమిట్ట రామాలయానికి.. భద్రాచలం కల్యాణానికి అందిస్తున్న ఈ గోటి తలంబ్రాలను రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట రామాలయంలో జరిగే కల్యాణానికి సైతం పంపిస్తున్నారు. -
భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో 15 రోజులుగా కొనసాగుతున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు బధవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణిమ సందర్భంగా ఆలయంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రోలు, రోకలికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచారు. స్వామివారికి ముందుగా చూర్ణోత్సవం, జలద్రాణి ఉత్సవం, నవకలశ స్నపనం జరిపించారు. అనంతరం ఆచార్యులు సుదర్శన చక్రాన్ని శిరస్సుపై ధరించి వైదిక పెద్దలతో కలసి ఆలయంలో ఏర్పాటు చేసిన గంగాళంలో అభిషేకం నిర్వహించారు. చక్రతీర్థంగా అభివర్ణించే ఈ కార్యక్రమం పవిత్ర గోదావరిలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వైరస్ ప్రభావంతో ఆలయంలోనే అర్చకుల మధ్య నిరాడంబరంగా పూర్తి చేశారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ 12 రకాలుగా ప్రదక్షిణ నిర్వహించి, 12 రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. రాత్రికి ఆలయంలోని ఉత్సవ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ‘ఫృథవీశాంత’ అనే మంత్రంతో మహా కుంభ ప్రోక్షణ నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి నిత్య కైంకర్యాలు.. బ్రహ్మోత్సవాలు ముగియడంతో గురువారం నుంచి స్వామివారికి యథావిధిగా నిత్య కైంకర్యాలు, దర్బార్ సేవ, దశవిధ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. పవళింపు సేవ మాత్రమే నిలిపివేస్తామని చెప్పారు. 16 రోజుల పండుగ రోజున మాత్రమే స్వామివారికి ఏకాంత సేవలు చేస్తామని, ఈనెల 16న నూతన పర్యంకోత్సవం, ఎడబాటు ఉత్సవం ఉంటాయని వివరించారు. -
భద్రాచలం : ఏకాంతంగా శ్రీ సీతారాముల కల్యాణం
-
శాస్త్రోక్తంగా రామయ్య కల్యాణం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే పరిమిత సంఖ్యలో వేదపండితులు, అర్చకులు, ఇద్దరు మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కొద్దిమంది అధికారులు మాత్రమే కల్యాణ వేడుకలో పాల్గొన్నారు. ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రికి భక్తులు భారీ గా తరలివచ్చేవారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో భక్తులను కల్యాణ వేడుకలకు అనుమతించకపోవడంతో ఆలయం బోసిపోయింది. అయితే కోట్లాది మంది భక్తులు టీవీల ద్వారా ఈ కమనీయ ఘట్టాన్ని వీక్షించి తరించారు. భద్రాచలంలో భక్తరామదాసు కాలం నుంచి ఏటా శ్రీరామ నవమి వేడుకలను మిథిలా స్టేడియం లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించే బేడా మండ పంలోనే కల్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు లేకుండా రామయ్య కల్యాణం నిర్వ హించడం ఇదే తొలిసారని అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు.. శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ క్రతువు గురువారం తెల్లవారుజామున రెండు గంటలకే ప్రారంభమైంది. మొదట స్వామివారికి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, ధ్రువమూర్తులకు అభిషేకం నిర్వహించారు. తరువాత అంతరాలయంలోని మూలమూర్తులకు కల్యాణం జరిపించారు. అనంతరం మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్చరణలతో సీతారాముల ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. రజత సింహాసనంపై ఆశీనులను చేశారు. పవిత్ర జలాలతో పుణ్యాహవచనం చేశారు. భక్త రామదాసు చేయించిన దివ్యాభరణాలను అలంకరించారు. వేదికపై ఆసీనులైన శ్రీసీతారాములకు అర్చకులు ముందుగా తిరువారాధన, విష్వక్సే న పూజ నిర్వహించి మంటప శుద్ధి చేశారు. ఆ తర్వాత మోక్షబంధన, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణ గావించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేసి, సంకల్పం చెప్పారు. అనంతరం కన్యాదానం, గోదానం, భూదానం నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం లో స్వామి, అమ్మవార్ల ఉత్స వ విగ్రహాలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. భక్త రామదాసు చేయించి న మంగళసూత్రాల తో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంత రం తలంబ్రాల వేడుకను జరిపించారు. ఈ కార్యక్రమంలో ప్ర భుత్వ సలహాదారు రమ ణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు.. శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు, ర వాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్న సుముహూర్తాన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు స్వా మి, అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టారు. భద్రాద్రిలో సీతమ్మవారికి మూడు మంగళసూత్రాలు ఉండటం విశేషం. ఇందులో ఒకటి పుట్టింటిది, రెండోది మెట్టినింటిది కాగా, మూ డోది భక్త రామదాసు (కంచర్ల గోపన్న) చేయించినది. భక్త రామదాసు చేయించిన ఆభరణాలు కల్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాముడికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణుడికి రామ మాడ అలంకరించారు. ఏపీలోని తూర్పుగోదావరి నుంచి భక్తులు ఈసారీ గోటి (కోటి) తలంబ్రాలు పంపించారు. -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి,ముంబై: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా నేడు(గురువారం,ఏప్రిల్ 2) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. ఈ నేపథ్యంలో బులియన్, మెటల్ తదితర హోల్సేల్ కమోడిటీ మార్కెట్లకూ సెలవు ప్రకటించారు. కమోడిటీ ఫ్యూచర్స్లో సైతం ట్రేడింగ్ను అనుమతించరు. ఇక ఫారెక్స్ మార్కెట్లయితే నేటితో కలిపి రెండు రోజుపాటు పనిచేయవు. ఏప్రిల్ 1(బుధవారం) ఖాతాల వార్షిక(2019-20) ముగింపు రోజు సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఈక్విటీ మార్కెట్లు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి శుక్రవారం(3న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. కాగా బుధవారం కీలక సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. కరోనా వైరస్ వ్యాప్తి, విదేశీ మదుపరుల భారీ అమ్మకాల మధ్య ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ఆరంభించాయి. చివరికి1203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 28,265 వద్ద, నిఫ్టీ 344 పాయింట్లు కుప్పకూలి, 8253 వద్ద స్థిరపడినసంగతి తెలిసిందే. -
భక్తజనం లేకుండానే రాములోరి కల్యాణం
సాక్షి, భద్రాచలం : శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు జరగనున్నాయి. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరుగుతోంది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగుతోంది. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు ఈ వేడుకకి హాజరయ్యారు. భక్తులు లేకుండానే కోదండరాముని బ్రహ్మోత్సవాలు కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే పాల్గొన్నారు.ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం వేదపండితులు ధ్వజారోహనం నిర్వహించారు. -
కల్యాణ వేళాయె..
భద్రాద్రి రామయ్యకు పెళ్లికళ వచ్చింది. రామాలయంలోని బేడా మండపం వేడుకలకు సిద్ధమైంది. నేటి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ మహోత్సవం జరగనుంది. రేపు రామయ్య పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ సారి వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. శుక్రవారం పట్టాభిషేకం జరుపుతారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మాత్రం కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు జరగనున్నాయి. ప్రతీ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వీక్షిస్తుండగా అట్టహాసంగా వేడుకలు జరుగుతాయి. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం భక్తులు ఎవరూ లేకుండా ఇలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఈ సమయంలో భద్రాచలం చుట్టుపక్కల ఆధ్యాత్మిక సందడి ఉండేది. ఈసారి మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతీసారి కల్యాణం మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లతో నిర్వహించేవారు. ప్రస్తుతం ఆలయంలోని బేడా మండపంలో కల్యాణ క్రతువు నిర్వహించనున్నారు. ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్ర లక్ష్మణ స్వాముల బ్రహ్మోత్సవాలను సైతం ఆలయానికే పరిమితం చేశారు. గత నెల 25న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గత నెల 20వ తేదీ నుంచి ఆలయంలో నిత్యకల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో భక్తుల సర్వదర్శనాలను సైతం నిలిపేశారు. భక్తులెవరూ ఆలయానికి రావద్దని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీరామనవమి కల్యాణం కోసం అప్పటివరకు ఆన్లైన్ ద్వారా అమ్మిన టికెట్ల డబ్బులను కూడా ఆయా భక్తులకు తిరిగి ఇవ్వనున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు. సీతారామచంద్ర కల్యాణాన్ని, పట్టాభిషేకాన్ని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ భక్తలకు సూచించారు. వేడుకలకు అర్చకులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. భద్రాచలంలో నేడు జరిగే శ్రీరామనవమి వేడుకలను ఇంటి నుంచే వీక్షించాలని కలెక్టర్ ఎం.వి. రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. లాక్డౌన్ను పాటించని వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం భద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్ర ప్రభువుల వారికి ఎదుర్కోలు ఉత్సవం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను దివ్యాభరణాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్దకు తీసుకువచ్చారు. రామయ్యను, సీతమ్మను ఎదురెదురుగా ఆశీనులను చేశారు. అర్చకులు రామయ్య తరఫున కొందరు, సీతమ్మ తరఫున మరికొందరు ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు. ఎదుర్కోలు ఉత్సవ ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. రామయ్య గుణగణాలను, విశిష్టతను, సీతమ్మ అందచందాలను, గుణగణాలను, యోగ్యతను మంత్రోచ్ఛరణల మధ్య వివరిస్తూ రెండు గంటల పాటు తంతును కొనసాగించారు. ఈ ఉత్సవంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ అనిల్కుమార్, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, దేవస్థానం ఈఓ జీ నర్సింహులు తదితరులు, అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు. -
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
ప్రజలకు సీఎం శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ శ్రీరామనవమి వేడుకలు ఇంటింటా జరుపుకోవాలని కోరారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలకు శుభాలకు కలగాలని సీఎం వైఎస్ జగన్ అభిలాషించారు. తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. కరోనా నేపథ్యంలో ఈ పండుగను ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉంటూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2020 -
శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబు
-
రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ దీక్షలు
విజయవాడ : మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో మార్చి 25 నుండి ఏప్రిల్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహా విద్యాపీఠం వ్యవస్ధాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శ్రీరామ దీక్ష చేపట్టడానికి దాదాపు లక్షమంది సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షకు సంబంధించిన శ్రీరామ రక్షా స్తోత్రం కరపత్రాలు, జపమాలలు, బ్యానర్లు, జెండాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు పంపిణీ చేశారన్నారు. తొలి ఏడాదే లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనన్నట్లు తెలిపారు. దీక్షలో భాగంగా ఏప్రిల్ 4న శ్రీరామ జన్మస్థానమైన అయోధ్యలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, ఏలూరు : పవిత్రమైన పండుగ రోజున... కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు కలకలం సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ నవమి రోజున రికార్డింగ్ డాన్సులు హోరెత్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు మండలం గుడివాడ లంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్పై అశ్లీల నృత్యాలు కొనసాగాయి.శ్రీరామ నవమి ఉత్సవాల పేరుతో..గ్రామ పెద్దలు రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టించారు. ఇందుకోసం వేల్పూరు నుంచి కొంతమంది మహిళలను రప్పించారు. వారితో స్టేజ్పై రికార్డింగ్ డాన్సుల పేరుతో అశ్లీలంగా నృత్యం చేయించారు. కాగా పండుగ పూట రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడంపై స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినా...గ్రామ పెద్దలు పట్టించుకోలేదు. దీనిపై పోలీసులుకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అయిదుగురు మహిళలు సహా 11మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమెదు చేశారు. -
సీటీఏ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
చికాగో : వికారినామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చికాగోలోని బాలాజీ దేవస్థానం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి 600మందికి పైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా గాంధీ-కింగ్ స్కాలర్షిప్ అవార్డులను ప్రదానం చేశారు. సీటీఏ డైరెక్టర్ సుజనా ఆచంట అతిథులను ఆహ్వానించి, తెలుగు భాష కోసం సీటీఏ చేస్తున్న సేలను, ఈ ఏడాదిలో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణంతోపాటూ, కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, ఉగాది పచ్చడి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుభద్రాచార్యులు శ్రీనివాసులు, డా.శారదా పూర్ణ సొంటి, ఆజాద్ సుంకవల్లిలకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి చికాగో స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ స్కాట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ల పేరు మీదుగా విద్యార్థులకు సీటీఏ స్కాలర్షిప్లను ఇవ్వడాన్ని అభినందించారు. ఈ ఏడాదికిగానూ మనస్వి తుమె, రిషితా వజ్జాల, స్పందన్ రామినేని, భాస్కరాచారిలకు స్కాలర్షిల్లను స్కాట్ అందజేశారు. సీటీఏ వ్యవస్థాపకులు రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు, ప్రెసిడెంట్ నాగేంద్ర వేగె, బోర్డు సభ్యులు రావు ఆచంట, శేషు ఉప్పటపాటి, చుండు శ్రీనివాస్, అశోక్ పగడాల, శ్రీని యెరమాటి, వెంకట గ్యాజంగి, రాహుల్ వీరటపు, రాణి వేగె, సుజనా ఆచంట, అనిత గోలి, వ్యాపారవేత్త రమేశ్ తూము, దేవాలయ ట్రస్టీలు ఎమ్. రావు, హరినాత్ కోనేరు, ఆటా వ్యవస్థాపకులు హనుమంత్ రెడ్డి, తాతా ప్రకాశంలు విజేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ విజయవంతంగా నిర్వహించడంలో సీటీఏ సాంస్కృతిక విభాగం సభ్యులు సుజనా, రాణి వేగె, అనితా గోలి, అనూష విడపలపాటి, భవాని సరస్వతి, రత్న చోడ, తనూజ సజ్జ, సుధా కుంచనపల్లి, సుభద్ర బల్ల, సురేష్ బాదం, వాలంటీర్లు భూషణ్ భీమిశెట్టి, హరీష్ జన్ను, అదిల్, నవీన్ లగుడు, నవీన్ గార్గ, వినయ్ చెన్నుపాటి, బాల చోడ, నరేన్ సుంకర, మురళి కలాగారాలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. సీటీఏ ప్రెసిడెంట్ నాగేంద్ర వేగె ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
వైభవంగా శ్రీరామ నవమి శోభాయాత్ర
-
త్రిశూలమే భర్త,రుద్రాక్షమాలే మంగళసూత్రం
-
స్వామివారి పెళ్లి పనులు షురూ..
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం హోలీ సందర్భంగా నిర్వహించే డోలోత్సవం, వసంతోత్సవానికి బుధవారం అంకురార్పణ చేశారు. ముందుగా పవిత్ర గోదావరి నది నుంచి మేళతాళాల నడుమ రామాలయానికి తీర్థపు బిందెను తీసుకొచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న రామయ్యకు కల్యాణం జరిపిస్తారు. కాగా, హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామికి నేడు సహస్ర ధారతో ప్రత్యేక స్నపన కార్యక్రమం ఉంటుంది. అనంతరం అందంగా అలంకరించిన స్వామి వారిని ఊయలలో ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలను ఆలపిస్తుండగా నక్షత్ర, కుం¿భ హారతులను స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించనున్నారు. ముందుగా అంతరాలయంలోని మూలవరులకు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మీతాయారమ్మ వారికి, అభయాంజనేయ స్వా మివారికి వసంతాన్ని చల్లి భక్తులపై పసుపునీళ్లను చల్లుతారు.సాయంత్రం మేళతాళాల నడుమ తాత గుడి సెంటర్ వరకు తిరవీధి సేవ నిర్వహిస్తారు. తలంబ్రాల తయారీ... శ్రీరామనవమి రోజున స్వామివారి కల్యాణోత్స వానికి వినియోగించేందుకు 150 క్వింటాళ్ల తలం బ్రాల తయారీకి గురువారం శ్రీకారం చుట్టనున్నా రు. ప్రతియేటా 100క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తుండగా అవి సరిపోవడం లేదు. దీంతో ఈఏడాది 150 క్వింటాళ్లు తయారు చేయా లని నిర్ణయించారు. 100 క్వింటాళ్ల బియ్యం చీరాలకు చెందిన భక్తులు సమర్పిస్తుండగా, మరి కొందరు దాతల ఇంకొన్ని బియ్యం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మిగిలిన బియ్యాన్ని దేవస్థానం వారు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా గురువారం నిర్వహించనున్నారు. చిత్రకూట మండపంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, స్వామివారి కల్యాణంలో పాల్గొనే ఆచార్య బ్రహ్మ ఋత్విక్ల సతీమణులు పసుపు దంచుతారు. తలంబ్రాలను సైతం వారితోనే మొదట కలిపిస్తారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్క, గులాల్, అత్తరు, పన్నీరు, నూనె, సుగంధ ద్రవ్యాలను కలిపి 508 మంది భక్తురాళ్లచే తలంబ్రాలను తయారు చేయిస్తారు. రేపు సామూహిక శ్రీలక్ష్మీ పూజలు.. ఆలయప్రాంగణంలోనిశ్రీలక్ష్మీతాయారమ్మవారి సన్నిధిలో శుక్ర వారం ఫాల్గుణోత్తర బహుళ విదియను పురస్కరించుకొని శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మ వారికి సామూహిక పూజలు నిర్వహించనున్నా రు. రూ.500 రుసుం చెల్లించిన భక్తులకు దేవస్థానం వారు లక్ష్మీ అమ్మవారివెండిప్రతిమ, ప్రసా దం, అమ్మ వారి పూజా కుంకుమను అందజేస్తారు. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
చికాగో: చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని స్ట్రీమ్వుడ్ హై స్కూల్ ఆడిటోరియంలో ఏప్రిల్ 14న జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1000మంది తెలుగు వారు పాల్గొన్నారు. 325 మంది స్థానిక కళాకారులు వివిధ కార్యక్రమాలతో అతిథులను అలరించారు. కిడ్స్ కామెడీ స్కిట్, బాల రామాయణం, దివంగత నటి శ్రీదేవికి నివాళి, ఉగాది, శ్రీరామనవమికి సంబంధించి కార్యక్రమాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, కల్చరల్ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి లెంకల, కో ఛైర్స్ ఉమా అవదూత, శ్వేత జనమంచి, మాధవి కొనకొల్లలు, కల్చరల్ కమిటీ సభ్యులు, కో ఆర్డినేటర్స్ గత 6 వారాలుగా ఈ వేడుకల కోసం అహర్నిశలు కృషి చేశారు. వేడుకల డెకరేషన్ పనులను వాణి యెంట్రింట్ల దగ్గరుండి చూశారు. టీఏజీసీ మెంబర్షిప్ కమిటీ, ప్రవీణ్ వేములపల్లి, మమత లంకల, విజయ్ బీరం, మమత లంకలలు అతిథులను సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎంఎస్ఐకి చెందిన అశోక్ లక్ష్మణన్, టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, మాజీ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ల, యూత్ ఛైర్ అవినాష్ లటుపల్లి ఎంపిక చేసిన యువతకు ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్(పీవీఎస్ఏ) సర్టిఫికెట్స్ అందజేశారు. ఫుడ్ కమిటీ ఛైర్ శ్రీనివాస్ కంద్రు ఉగాది పచ్చడితోపాటూ, రుచికరమైన వంటకాలను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంజి రెడ్డి కందిమల్ల, సంపత్ సప్తగిరిలు ఆహారం సరఫరా, ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాలంటీర్లకు జ్యోతి చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. -
దక్షిణ కొరియాలో ఉగాది, శ్రీరామ నవమి సంబరాలు
సియోల్ : దక్షిణ కొరియాలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఆదివారం ఉగాది, శ్రీరామ నవమి పండగలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దేశ రాజధాని సియోల్ సమీపంలోని సువన్ నగరంలో గల సంగుక్వాన్ (ఎస్కేకేయూ) విశ్వవిద్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. దక్షిణ కొరియా తెలుగు సంఘం(టీఏఎస్కే) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక తెలుగు విద్యార్థులు, పలు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఉగాది పచ్చడి రుచి చూసి, పంచాగ శ్రవణం చేశారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పానకం పంచారు. ఆటపాటలతో అలరించారు. టాస్క్ కోర్ కమిటీ సభ్యలు డాక్టర్ సుశ్రుత కొప్పుల, డా. వేణు నూలు, అనిల్ కావల, డా. కొప్పాలి స్పందన రాజేంద్ర, అంకంరెడ్డి హరినారాయణ, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటి నేతృత్వం వహించారు. అనంతరం మహిళలు కోలాటంతోను, చిన్నారులు ఫ్యాషన్ షోతోను అలరించారు. -
ఒంటిమిట్టలో గాలివాన బీభత్సం
-
ఒంటిమిట్ట వేడుకల్లో అపశ్రుతి.. నలుగురి మృతి
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన మృత్త్యువాత పడ్డ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ నలుగురు మృత్యువాత పడ్డారు. ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురుస్తుండటంతో నవమి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోదండరాముడి వేడకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షం కారణంగా ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. ఆలయం వద్ద ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడుతుండటంతో ఆలయ సమీపంలో ఉన్న చెట్టు నేలకొరిగింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ షార్ట్సర్క్యూట్ కావడంతో బద్వేలుకు చెందిన చిన్న చెన్నయ్య మృత్యువాత పడ్డాడు. పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య తొక్కిసలాటలో మరణించగా, దక్షిణ గోపురం వద్ద బారికేడ్స కొయ్యలు పడి వెంకట సుబ్బమ్మ అనే మహిళ మృతి మరణించింది. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీనా అనే మహిళ సైతం ప్రాణాలు కోల్పోయింది. ఆలయానికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ గాలికి ఎగిరిపడి బోయినపల్లికి చెందిన భాస్కర్, నందలూరుకు చెందిన ధనుంజయ్ నాయుడులకు స్వల్పగాయాలయ్యాయి. అయితే వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పక్కనే ఉన్న హరిత హోటల్కు వద్దకు చేరుకుంటున్నారు. బలమైన గాలుల వీస్తుండంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లా చెదరుయ్యాయి. కల్యాణం వీక్షించడానికి వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడగండ్లు, ఈదురు గాలులు కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఒంటిమిట్ట, ఆలయంలో అంధకారం అలముకుంది. రేకులు మీద పడటంతో గాయపడిన భక్తుడు పోలీసుల ఓవర్ యాక్షన్ : ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లా పర్యటన సందర్భంగా కడప పోలీసులు స్వామి భక్తి చాటుకొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. గురువారం నుంచే కడపలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రయల్ రన్ అంటూ గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పరచారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి బస చేసే ప్రాంతంలో దుకాణాలు అన్నింటినీ బలవంతంగా మూసేయించారు. ఈ విషయాన్ని స్థానిక నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో కర్నూలు రేంజ్ డీఐజీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సంతాపం తెలిపిన వైఎస్ జగన్ ఒంటిమిట్ట శ్రీరామ నవమి వేడుకలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. -
భద్రచలంలో దొంగల హల్చల్
-
ముస్లింల రథంలో శ్రీరాముడి ఊరేగింపు!
కోల్కతా: శ్రీరామ నవమి సందర్భంగా కోల్కతా నగరంలో నిర్వహించే సీతారాముల విగ్రహాల ఊరేగింపులో ఎక్కువగా గుర్రపు బగ్గీలను ఉపయోగిస్తారు. శ్రీరాముడి శోభాయాత్రలో ప్రత్యేకంగా అలరించిన ఈ గుర్రపు బగ్గీలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే, ఈ గుర్రపు బగ్గీలను అద్దెకు ఇచ్చేవారిలో 90 శాతం ముస్లింలే ఉండడం గమనార్హం. వారికి ఈ గుర్రపు బగ్గీలే జీవనాధారం. హిందువులు ఘనంగా జరుపుకునే శ్రీరామ నవమి పండగ రోజున భక్తులు శ్రీ సీతారాముల విగ్రహాలను, వారి వేషాధారణ కలిగిన కళాకారులను ఈ గుర్రపు బగ్గీ రథాలలోనే ఊరేగిస్తారు. అయితే ఈ గుర్రపు బగ్గీలను పూలతో అలంకరించి, గుర్రలను శుభ్రంగా కడిగి ఊరేగింపులో గుర్రాలను అదుపుచేస్తూ, శోభాయాత్రను ఘనంగా నిర్వహించడంలో స్థానిక ముస్లిం కార్మికుల పాత్ర ప్రముఖమైనది. సాధారణ సమయంలో అంతగా పని ఉండదని, పెళ్లిళ్లు, ఊరేగింపుల సమయంలోనే తమకు ఇంత పని దొరుకుతుందని గుర్రపు బగ్గీలు నడిపేవారు తెలిపారు. గతంలో ఉన్నంత గిరాకీ ఇప్పడు లేదని అన్నారు. శ్రీరామ నవమి ఊరేగింపుల్లో మాత్రం భలే గిరాకీ ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు షిఫ్టుల్లో పని చేస్తామని, ఒక్క శ్రీరామ నవమి రోజు నాడే మూడు, నాలుగు నెలలకు సరిపడ ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. -
పట్టాభిరాముడు
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట కోదండరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, సీతారామచార్యులు శాస్త్రోక్తంగా ఘనంగా జరిపించారు. ప్రతి ఏటా నిర్వహించే పట్టాభిషేక మహోత్సవాన్ని కటంగూరి రంజన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పూజారులు సీతా రాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి, సీతమ్మ తల్లికి నగలను అలంకరించి మహోత్సవాన్ని వందలాది మంది భక్తులు వీక్షిస్తుండగా జరిపించారు. అన్నదానం నిర్వహించా రు. సీతారాములను పల్లకిలో ఊరేగించారు. ఆలయ నిర్వహణాధికారి రాజ్కుమార్, చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి, సర్పంచ్ పెద్ది స్వరూపకుమార్, ఎంపీటీసీ రామ్స్వరణ్రెడ్డి, సీఐ నారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు. హంస వాహన సేవ ఇల్లందకుంట శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సీతారాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హంస వాహనంపై డప్పు చప్పుళ్ల మధ్య దేవాలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. హనుమాన్ స్వాములతోపాటు భక్తులు పల్లకి ఎత్తుకొని రామ నామం జపిస్తూ సేవలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
నవమి వేడుకల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, కాకినాడ : భక్తి ముసుగులో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అసాంఘీక కార్యాకలాపాలను ప్రోత్సహించారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇలాకలో అశ్లీల నృత్యాలను నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామంలోలో శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అశ్లీల నృత్యాలు, గుండాటలు నిర్వహించినప్పటికీ తెలుగు తమ్ముళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
‘లవ్ జిహాద్’ హంతకుడితో రథయాత్ర
జోధ్పూర్ : దేశమంతా శ్రీరామ నవమి రోజు రామున్ని పూజిస్తుంటే, కొంతమంది మాత్రం ఓ నేరస్థుడ్ని రామునిలా కొలుస్తూ వేడుకను జరుపుకున్నారు. గత ఏడాది రాజస్థాన్లో జరిగిన లవ్ జిహాద్ హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అఫ్రజుల్ అనే వ్యక్తిని దారుణంగా హత మార్చిన శంభు లాల్ ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్నాడు. (మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!) అయితే ఓ వ్యక్తిని శంభు లాల్ వేషధారణతో రథంపై కూర్చోబెట్టి జోధ్పూర్లో శివసేన ర్యాలీ నిర్వహించింది. సదరు వ్యక్తి చేతిలో అఫ్రజుల్ని చంపడానికి వినియోగించిన గోడ్డలిని కూడా ఉంచడంతో పాటు, దారి పొడవునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై ‘హిందు మిత్రులారా మేల్కొండి. మీ ఆడబిడ్డలను కాపాడుకోండి. దేశానికి లవ్ జిహాద్ నుంచి విముక్తి కల్పించండి’ అని రాసి ఉంది. శంభు లాల్కు మద్ధతు తెలిపేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు శివసేన నేత హరి సింగ్ పన్వార్ తెలిపారు. ‘హిందుత్వంపై అతని నిబద్ధత నాలో స్ఫూర్తిని రగిల్చింది. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయటం ఈ యాత్ర ఉద్దేశం కాదు’ అని పన్వార్ తెలిపారు. ఇక ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంతో జోధ్పూర్ డీసీపీ స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నామని.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్ బంద్
సాక్షి, నిర్మల్: శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాముని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాముని విగ్రహాన్ని పగలగొట్టడాన్ని నిరసిస్తూ హిందూవాహిని నాయకులు, కార్యకర్తలు నిర్మల్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో నిర్మల్, ఖానాపూర్, భైంసాలో బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంక్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కనుల పండువగా శోభాయాత్ర
-
నిర్మల్లో ఉద్రిక్తత
నిర్మల్/నిర్మల్టౌన్ : జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్న శ్రీరామ రథయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాత్ర ముగింపు సమయంలో స్థానిక పెద్దమార్కెట్లో ప్రాంతంలో ఓ వర్గం ప్రార్థన మందిరంపై మరో వర్గం రాళ్లు రువ్వారంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఆందోళనలను సద్దుమనుగింపజేయడానికి వచ్చిన ఏఎస్పీ దక్షిణమూర్తి, క్యూఆర్టీ కానిస్టేబుల్కు రాళ్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని కోరారు. -
అందరికీ ఆ రాముడి దీవెనలు : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రాముడి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పలు ఆలయాలు ప్రత్యేక అలంకరణతో శోభయమానంగా, కనులవిందుగా అలరారుతున్నాయి. భక్తులు కిక్కిరిసిపోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ట్విటర్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు వారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ రాముడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ రాముడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) 26 March 2018 -
తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు
-
ఉప్పర్గూడ శ్రీరామ మందిరంలో శ్రీరామ నవమి
-
కన్నుల పండువగా శ్రీరామ శోభాయాత్ర
ఎదులాపురం(ఆదిలాబాద్) : శ్రీరామనవమి పురస్కరించుకుని హిందూవాహిని ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర ఆధ్యంతం కన్నుల పండువగా సాగింది. యువకుల నృత్యాలు, భజనలు, శ్రీరామ సంకీర్తనలతో పట్టణం మారుమోగింది. వినాయక్చౌక్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి శోభాయాత్రను మఠాధిపతి యోగానంద సరస్వతి పూజలు నిర్వహించి ప్రారంభించారు. యాత్ర నేతాజీచౌక్, అంబేద్కర్చౌక్, గాంధీచౌక్, దేవీచంద్ చౌక్ల మీదుగా అశోక్ రోడ్ నుంచి తిరిగి మఠానికి చేరుకుంది. అంతకు ముందు పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ నర్సింహారెడ్డి శోభాయాత్రను పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాయలశంకర్, సుహాసినీరెడ్డి, భార్గవ్దేశ్పాండే, అన్ని హిందూ సమాజ్ ప్రతినిధులు, సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
వైభవంగా కొనసాగుతున్న శ్రీరాముని శోభాయాత్ర
-
పాతబస్తీలో శోభాయాత్ర: 20వేలమందితో బందోబస్తు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించే శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శ్రీరామనవమి శోభాయాత్రకు 20 వేలమంది పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. ధూల్పేట్ నుంచి మొదలైన శోభాయాత్ర గౌలిగూడ దగ్గర ముగుస్తుందని, శోభాయాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 9 గంటలకు శోభాయాత్ర పూర్తి అవుతుందని తెలిపారు. -
భద్రాద్రి రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
-
అందుబాటులో ఉండాలి.. వసతులు కల్పించాలి
ఇల్లందకుంట(హుజూరాబాద్): అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈనెల 24నుంచి ప్రారంభం కానున్న సీతారాముల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను హుజూరాబాద్ ఆర్డీవో చెన్నయ్య పరిశీలించారు. ఇల్లందకుంటలోని కల్యాణ మండపం, అన్నదానం, భక్తుల క్యూలైన్లతోపాటు వాహనాల పార్కింగ్, పలు అంశాల గురించి అధికారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కల్యాణం మొదలుకొని పెద్ద రథోత్సవం ముగిసేవరకు అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. తహసీల్దార్లు రమేశ్, బావ్సింగ్, ఆలయ కమిటీ చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి, నిర్వహణాధికారి రాజ్కుమార్, ఎస్సై నరేష్కుమార్, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
‘భద్రాద్రి’కి తుదిరూపు!
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుంది. శ్రీరాముడు జన్మించిన విళంబినామ సంవత్సరం వచ్చే మార్చిలో నిర్వహించే శ్రీరామనవమికి ఎంతో ప్రత్యేకత ఉన్న దృష్ట్యా అదే రోజున భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చినజీయర్ సూచనలతో దేవాదాయశాఖ రూపశిల్పి ఆనందసాయి నేతృత్వంలో ఇప్పటికే మూడు నమూనాలను సిద్ధం చేశారు. ఆ నమూనాలను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లనున్నారు. సీఎం ఆమోదంతో వచ్చే నెలలో పనులు ప్రారంభించే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 65 ఎకరాల్లో ఆలయాభివృద్ధి భద్రాచలం ఆలయాభివృద్ధికి 65 ఎకరాల భూమి అవసరం ఉంటుందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నివేదించారు. రామాలయం చుట్టూ 28 ఎకరాలు, అదే విధంగా కల్యాణ మండపం, దీనికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలు ఇలా మిగతా 37 ఎకరాలను రెండు చోట్ల సేకరించేలా నివేదికలో చూపించారు. రామదాసు కాలంలో నిర్మించిన గర్భగుడిని అలాగే ఉంచి, చుట్టూ రెండు ప్రాకారాలను శిల్పికళా శోభితంగా నిర్మించాలని డిజైన్లో పేర్కొన్నారు. నిత్య కల్యాణ మండపం, స్వామి వారి తిరువీధి సేవ కోసం మాడవీధులతో పాటు, భక్తులు ఆలయం చుట్టూ తిరిగేలా మరో దారిని కూడా ఏర్పాటు చేయాలని, ఆలయం నలువైపుల నుంచి స్వామి వారి దర్శనం చేసుకునేలా ద్వారాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వేయికాళ్ల మండపం వేయికాళ్ల (శిల్పాలతో చెక్కిన వేయి ఫిల్లర్లు కలిగిన)మండప నిర్మాణానికి డిజైన్లో ప్రాధాన్యం కల్పించారు. శ్రీరామనవమి నాడు శ్రీసీతారాముల వారికి పెళ్లి వేడుక జరిగే కల్యాణ మండపం, దీనికి ఆనుకొని ఉన్న స్థలంలో వేయి కాళ్ల మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. వేయికాళ్ల మండపం అంతర్భాగంలోనే కల్యాణ మండపం కూడా ఉండేలా డిజైన్ తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందుబాటులో కల్యాణ మండపంలో మొత్తంగా 35 వేల మంది శ్రీరామనవమి రోజున స్వామి వారి పెళ్లి వేడుకను ప్రత్యక్ష్యంగా తిలకిస్తున్నారు. భవిష్యత్లో 80 వేల మంది మండపంలో కూర్చొనేవిధంగా డిజైన్ తయారు చేశారు. 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం గోదావరి తీరంలో 108 అడుగుల ఎత్తైన అభయాంజనేయస్వామి వారి విగ్రహాన్ని నిర్మించేలా డిజైన్లో పొందుపరిచారు. రామాలయం నుంచి నేరుగా గోదావరి తీరం వరకూ నేరుగా వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ? ఆలయాభివృద్ధిలో భాగంగా రామాలయం చుట్టూ ఉన్న వందకు పైగా ఇళ్లను కూల్చివేయాల్సి వస్తోంది. ఈ లెక్కన రామాలయం వెనుక ఉన్న జీయర్ మఠం నుంచి గోదావరి కరకట్ట వరకూ చుట్టు పక్కల ఇళ్లవారిని వేరే చోటకు తరలించాల్సి ఉంటుంది. భద్రాచలంలో ప్రభుత్వ స్థలం లేకపోవటంతో వీరికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారనేది చర్చనీయాంశమైంది. పట్టణానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నంలో ఆలయానికి సంబంధించిన వెయ్యి ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఇవి రాష్ట్ర విభజనతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో వీరికి అక్కడ పునరావాసం కల్పించటం వల్ల వారిని వేరే రాష్ట్రంలోకి పంపించినట్లౌతుంది. ఇది పెద్ద సమస్యగా మారనుంది. ఈ ప్రాంత వాసుల డిమాండ్ మేరకు భద్రాచలానికి సమీపంలో ఉన్న ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణకు వస్తేనే ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసే క్రమంలోనే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని శ్రీరామ నవమికి ఆహ్వానించేలా ఆలోచన చేస్తుందనే ప్రచారం ఉంది. అంతా సిద్ధం చేశాం ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శ్రీరామనవమికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఆ దిశగానే దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతితో ఏర్పాట్లు చేస్తున్నాం. మరోవైపు శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభాకర శ్రీనివాస్, దేవస్థానం ఈఓ -
ఘనంగా ముగిసిన శ్రీరామనవమి ఉత్సవాలు
► వాడవాడలా వసంతోత్సవాలు రాజంపేట టౌన్: గత తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. నవమి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో, పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయం కావడంతో శుక్రవారం అనేక ప్రాంతాల్లో వసంతోత్స కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీతారాముల కళ్యాణ ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో వయోబేధం లేకుండా అన్ని వయస్సుల వారు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు, రంగునీళ్ళు చల్లుకున్నారు. పలు ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా వసంతోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు వెంబడి యువకులు బ్యాండు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అలాగే పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. పలువురు కర్రసాము వంటి కార్యక్రమాలను చేసి అబ్బురపరిచారు. -
నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం
-
కన్నుల పండువగా శ్రీరామ పట్టాభిషేకం
-
కన్నుల పండువగా శ్రీరామ పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాద్రిలో శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం గురువారం ఉదయం కన్నులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వేదపండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. -
భద్రాచలంలో సీతారాముల కల్యాణ శోభ
-
భద్రాచలంలో సీతారాముల కల్యాణ శోభ
ఖమ్మం: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రగిరి సీతారాముల కల్యాణ శోభతో వెలిగిపోతుంది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీడీడీ తరఫున ఈవో సాంబశివరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వేడుకలకు హాజరయ్యారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. అధికారులు మిథిలా ప్రాంగణంలో చలువ పందిళ్ల నిర్మాణం గావించారు. ప్రాంగణాన్ని సెక్టార్ల వారిగా విభజించి భక్తులు కనులారా తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. -
భద్రాచలంలో సీతారాముల కల్యాణ శోభ
-
ప్రజలకు వైఎస్ జగన్ నవమి శుభాకాంక్షలు
-
ప్రజలకు వైఎస్ జగన్ నవమి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రిలోను, ఇటు ఒంటిమిట్టలోను, రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ.. ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో ఆహ్వానం
అమరావతి: ఈ నెల 10వ తేదీన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టీటీడీ ఈవో సాంబశివరావు ఆహ్వానించారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన ఈవో సీఎంను కలిసి ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరారు. శ్రీరామనవమి బ్రహోత్సవాలలో భాగంగా రాష్ట్రంలో పురాతన ప్రసిద్ధ రామ మందిరమైన ఒంటిమిట్ట దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు ఈవో తెలిపారు. -
సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
భద్రాచలం (ఖమ్మం జిల్లా) : భద్రాచలం రామక్షేత్రం కల్యాణ శోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో ప్రతీ ఏటా సంప్రదాయబద్దంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. 5న తేదీ బుధవారం శ్రీసీతారాముల కల్యాణం, 6న గురువారం శ్రీరామపట్టాభిషేకం జరగనుంది. ఈ ఏడాది ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వంసిద్ధం చేసింది. ఇందుకుగాను మిథిలా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. చలువ పందిళ్ల నిర్మాణం గావించారు. ప్రాంగణాన్ని సెక్టార్ల వారిగా విభజించి భక్తులు కనులారా తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రామాలయాన్ని విద్యుదీపాలంకరణ గావించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. రామాలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి. పట్టణ ప్రధాన వీధులన్ని స్వాగతద్వారాలతో నిండిపోయాయి. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దారు. గత ఏడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 3లక్షల మందికి పైగా భక్తులు కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకాలకు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తుల కోసం 3లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్దం చేస్తున్నారు. 100క్వింటాల కళ్యాణం తలంబ్రాలను సిద్ధంచేశారు. పట్టణంలోని వివిధ కూడళ్లల్లో భక్తులు విశ్రాంతి పొందుటకు ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీల టిక్కెట్ల విక్రయాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకానున్నారు. ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ముందుగా సీఎం కేసీఆర్ రాములోరిని దర్శించుకొని మిథిలా ప్రాంగణానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని స్థానిక పురుషోత్తపట్నం సమీపంలో హెలీప్యాడ్ను సిద్దం చేశారు. పోలీస్లు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రితో పాటు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ ఏడాది పెద్దఎత్తున కల్యాణానికి హాజరుకానున్నారు. గురువారం జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ కే.నర్సింహన్ దంపతులు హాజరుకానున్నారు. శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా భద్రాచలం తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో రామాలయ పరిసరాలు నిండిపోయాయి. గతేడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య భాగా పెరుగుతోంది. ఎండను సైతం లెక్కచేయకుండా రాములోరి కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా సమీప ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున భద్రాద్రికి చేరుకుంటున్నారు. మరికొంత మంది భక్తులు కాలినడకన ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. వీరు విశ్రాంతి పొందేందుకు గాను పట్టణ పలు ప్రాంతాల్లో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. 3లక్షల మందికి పైగా భక్తులు ఈ ఏడాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. భక్తులకు కల్పించే సౌకర్యాలు పూర్తికావచ్చాయి. భద్రాచలం పట్టణంతో పాటు పర్ణశాలలో కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా పట్టణాలను అందంగా ముస్తాబు చేశారు. భద్రాచలానికి నేటి నుంచి బస్సులు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు 580 ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలుప్రాంతాల నుంచి భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. -
5న శ్రీరామనవమి ఆస్థానం
8 నుంచి వార్షిక వసంతోత్సవాలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 5న శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆస్థానం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీరామచంద్ర మూర్తి రూపంలో ఆంజనేయునిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఇక 6న రాత్రి 8 గంటలకు ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించ నున్నారు. తిరుమల ఆలయంలో ఈ నెల 8 నుంచి 10 వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం, ఇతర శాస్త్రోక్తంగా పూజల నిర్వహించనున్నారు. 9వ తేదీ ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. ఇక 10వ తేదీ స్నపన తిరుమంజనంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, సీతారామ లక్ష్మణ, ఆంజనేయుడు, రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ స్వామి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. ఇందులో భాగంగా ఈ మూడు రోజులూ కల్యా ణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. రెండో రోజు సహస్రకళశాభిషేకం, మూడో రోజు తిరుప్పావడసేవ కూడా రద్దు చేశారు. -
ఒంటిమిట్టలో శ్రీరామ నవమి సందడి
-
వేగంగా రాములోరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
► రూ.3 కోట్ల టీటీడీ నిధులతో పనులు ► 70వేల మంది వీక్షించేలా కల్యాణ వేదిక ► పనులు వేగవంతానికి ఈఓ ఆదేశాలు ► గతంలో జరిగిన లోపాలు సరిదిద్దుకునేనా? రాష్ట్రంలో రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టపై టీటీడీ అధి కారులు ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల ను వైభవంగా నిర్వహించాలని, అం దుకోసం ముందస్తుగా అన్ని ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇప్పటికే కల్యాణ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. కల్యాణోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్న దృష్ట్య తగిన ఏర్పాట్లు చేయడంలో ముందుండాలని టీటీడీ ఈఓ అధికారులకు ఆదేశించారు. ఒంటిమిట్ట్ట రామాలయం(రాజంపేట): వచ్చేనెల 4 నుంచి 14 వరకు జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ఒంటిమిట్టపై దృష్టి సారించింది. బ్రహ్మోత్సవాల పనుల వేగవంతానికి సంబంధించి ఆయా శాఖల అధికారులకు టీటీడీ ఈఓ సాంబశివరావు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు టీటీడీ ఏడీ బిల్డింగ్లోని ఈఓ అధికారులతో రాములోరి కల్యాణోత్సవం..ఆన్గోయింగ్ పనులు, ఉత్సవ విడిది, గార్డెనింగ్, కల్యాణవేదిక అభివృద్ధి అంశాల పురోగతిపై సమీక్షించారు. 70 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు: వచ్చేనెల 10న జరిగే రాములోరి కల్యాణానికి టీటీడీ భారీ సన్నహాలే చేస్తోంది. 70 ఎకరాల స్థలంలో కడప–రేణిగుంట రహదారి వెంబడి వివిధ రకాల మొక్కలను నాటారు. కల్యాణవేదిక వద్ద చదును పనులు పూర్తి చేశారు. 70వేల మందికిపై భక్తులు వీక్షించడానికి అనుకూలంగా ఆధునికమైన పద్ధతిలో చలువపందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కల్యాణ వేదికను రూపొందిస్తున్నారు. రామాలయం చుట్టూ హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణానికి తరలిరానున్న సీఎం, గవర్నరు: రాములోరి కల్యాణానికి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, గవర్నరు నరసింహన్తోపాటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు తరలివచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఆ దిశగా టీటీడీ అవసరమైన ఏర్పాట్లుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. విడిది, వసతి సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ ముందుగానే సమాయత్తమవుతోంది. యాత్రీకుల కోసం విడిది సముదాయ భవనం: కోదండరాముని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, యాత్రీకులు, పర్యాటకుల కోసం రూ.5కోట్లతో యాత్రీకులు విడిది సముదాయభవనం నిర్మిస్తున్నారు. దేవుని మాన్యంలో ఈ భవనం నిర్మాణం పూర్తికావస్తోంది. ఈ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ భవనం మొదటి అంతస్తులో 8 గదులు, మీల్స్ హాల్, రెండవ అంతస్తులో 7 గదులను వందమంది యాత్రీకులు విశాంత్రి తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మూడవ అంతస్తులో ఏడు గదులను నిర్మిస్తున్నారు. వివిధ స్టోరేజి కోసం గ్రౌండ్ఫ్లోర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గత సంవత్సరం నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటచేసుకున్న పొరపాట్లను టీటీడీ సరిదిద్దుకునేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సరైన రీతిలో భోజన వసతి కల్పించలేదు. ఆర్టీసీ బస్సులను ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేయలేదు. ఎంతో మంది భక్తులు కల్యాణం చూడలేక వెనుదిరిగారు. భక్తులు మరుగుదొడ్లు, మంచినీటి వసతి పుష్కలంగా కల్పించలేకపోయారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఖాకీలకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం పోలీసువర్గాలు పెదవి విరిచాయి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీటీడీ ముందుస్తు ప్రణాళికతో ముందుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏమేరకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే. -
శ్రీరామ నవమి వేడుకల్లో దొంగాట
♦ ఈ ఆటాడితే గ్రామంలో దొంగతనాలు ♦ జరగవని.. పంటలు సుభిక్షంగా ఉంటాయని నమ్మకం ♦ నల్లగొండ జిల్లా తుర్కపల్లిలో విచిత్ర ఆచారం తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏటా నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గ్రామస్తులందరూ కలసి దొంగ.. పోలీసు వేషధారణల్లో ఆటాడుతారు. ఇలా ఆడి తే గ్రామంలో దొంగతనాలు జరగవని.. పంటలు పుష్కలంగా పండుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. తుర్కపల్లి మండల కేంద్రంలో రాములగుట్ట ఉంది. ప్రత్తిపాటి వంశస్తులు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఆ గుట్టపై నాలుగు రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తుంటారు. మొదటి రోజు సీతారాముల కల్యాణం, రెండోరోజు వనభోజనాలు, మూడో రోజు శ్రీసీతారామలక్ష్మణ మూర్తుల ఊరేగింపు, నాలుగో రోజు దొంగాట (దోపు) తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామంలో పాడిపంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆ శ్రీరామచంద్రుడు కాపాడుతున్నారని ఇక్కడి ప్రజల విశ్వాసం. గ్రామంలో వడగండ్ల వర్షం పడి పంటలు నష్టపోరుున దాఖ లాలు ఇప్పటివరకు లేవని స్థానికులు చెబుతుంటారు. దోపు ఆట ఇలా.. రాత్రి ఎనిమిది గంటలకు శ్రీసీతారామలక్ష్మణ మూర్తుల సేవను ఊరేగింపుగా దోపు ఆట కొనసాగే స్థలం వద్దకు తీసుకువస్తారు. అప్పటికే గ్రామస్తులు, పత్తిపాటి వంశస్తులు అక్కడ ఓ పోలీస్స్టేషన్లా ప్రాంగణాన్ని తయూరు చేసి ఉంచుతారు. వివిధ వేషధారణల్లో ఉన్నవారంతా వేదికపై కూర్చుంటారు. దేవుడి దగ్గర పూజారిగా గ్రామస్తులే ఉంటారు. ఆ తర్వాత దొంగలుగా వేషాలు వేసుకున్న వాళ్లు ఆటలోకి ప్రవేశిస్తారు. వీరు శ్రీసీతారామచంద్రస్వామిని దోచుకుంటారు. అనంతరం వీరిని పోలీసు వేషధారణల్లో ఉన్నవారు పట్టుకుని స్టేషన్కు తీసుకువస్తారు. దొంగతనం ఎందుకు చేశారని సబ్ఇన్స్పెక్టర్, పట్వారీ, పటేల్ విచారించే తీరు అందరికీ నవ్వులు తెప్పిస్తుం టుంది. చివరగా దోచుకున్న వస్తువులను పోలీస్స్టేషన్లో అప్పగిస్తారు. ఆ తరువాత కుండలో నీళ్లు తెచ్చి ప్రేక్షకుల మధ్యలో ఎత్తి వేయడంతో ఈ దోపు ఆట ముగుస్తుంది. ఆ తరువాత శ్రీసీతారామలక్ష్మణ మూర్తుల సేవను ప్రత్తిపాటి వంశస్తుల ఇంటి ముందు ఉంచి మంగళహారతులిచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. నేటికీ ఈ ఆచారం కొనసాగుతోంది. -
102 తలలు.. తెగిపడ్డాయి!
* పోలీసుల పహారాలోనే దున్నపోతులు బలి * నల్లగొండ జిల్లాలో సామాజిక దురాచారం * శ్రీ రామనవమి పేరిట వింత ఆచారం సాక్షి, హైదరాబాద్: అదో గిరిజన తండా.. అనాదిగా కొలుస్తున్న అమ్మవారి కోసం అక్కడ ఏటా పెద్ద సంఖ్యలో జంతు బలులు జరుగుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాలుగా ఈ బలి కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది.. ఒక్క వేటుకు ఒక్కో దున్నపోతు తల తెగి పడాల్సిందే. ఆ దున్నపోతు తలను వచ్చే ఏడాది వరకు గుంతలో పూడ్చి ఉంచాల్సిందే. మళ్లీ మరుసటి ఏడాది కొత్త తలలు తెగినప్పుడు.. పాత తలలు బయటకు తీస్తారు. అలా బలి ఇస్తే అమ్మవారు తాము కోరిన కోర్కెలు తీర్చుతుందని భక్తుల నమ్మకం. కంకాళి భవానీ (అంకాలమ్మ) జాతర పేరుతో శ్రీరామనవమి మరుసటి వేకువజామున నిర్వహించే ఈ మూఢాచార కార్యక్రమం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. ఈ ఒక్క ఏడాదే 102 దున్నపోతులు తెగిపడ్డాయంటే భక్తుల నమ్మకం ఎలా ఉందో.. శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతున్న నవీన యుగంలో కూడా మూఢాచారాల పట్ల ప్రజల విశ్వాసం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లా పెదవూర మండలం రామన్నగూడెం తండా పరిధిలోని కంకాళి భవానీ అమ్మవారికి ఇచ్చే బలులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అసలు కథ ఇదీ.. గిరిజనులు ఆరాధ్యదైవంగా భావించే పెదవూర మండలంలోని రామన్నగూడెంలో కొలువై ఉన్న కంకాళి భవానీ (అంకాలమ్మ), లాల్సాద్, గురునానక్ల జాతరను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండగ తర్వాతి రోజున ఘనంగా నిర్వహించటం పరిపాటి. లాల్సాద్ అనే గిరిజనుడు ప్రతి ఏటా మహారాష్ట్రలోని నాందేడ్లో ఉన్న కంకాళి భవానీ ఆలయానికి వెళ్లి వచ్చేవాడు. అప్పట్లో రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడికి వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీంతో రామన్నగూడెంలో 1944వ సంవత్సరంలో కంకాళి భవానీ అమ్మవారిని ప్రతిష్టించి గుడిని నిర్మించాడు. దీంతో పరిసర తండాల్లోని గిరిజనులు ఈ గుడికి వచ్చి పూజించేవారు. అలా రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాలకు పాకింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి పర్వదినం మరుసటి రోజున కంకాళి భవానీ జాతర జరుగుతోంది. లాల్సాద్ మరణానంతరం ఆయన కుటుంబికులే వంశపారంపర్యంగా ఈ గుడికి పూజారులుగా ఉంటున్నారు. అయితే, ఇక్కడి ఆచారమేమిటంటే.. తాము కోరుకున్న కోర్కెలు తీరితే దేవతకు దున్నపోతులను బలిస్తామని మొక్కుకుంటారు. గిరిజనులే కాకుండా ఇతరులు కాకుండా ఇలా దున్నపోతులను బలి ఇచ్చి మొక్కులను తీర్చుకుం టున్నారు. జాతర రోజు వేకువ జామున కంకాళి భవానీ దేవాలయం ముందు ఈ తతంగం ప్రారంభించి, సూర్యుడు ఉదయించే వరకు పదునైన పెద్ద కత్తులతో దున్నపోతులను నరుకుతారు. దున్నపోతుల కళేబరాలను మాత్రం స్థానికులు కొందరు వండుకుని తింటారని సమాచారం. అయితే. ఈ తతంగమంతా పోలీసు పహారాలోనే జరుగుతుండ డం గమనార్హం. కనీవినీ ఎరుగని రీతిలో బలి.. అంకాలమ్మ దేవాలయం ముందు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో శనివారం వేకువజామున 102 దున్నపోతులను బలి ఇచ్చారు. వీటి మొండేలను సమీప గ్రామాలకు చెందిన ప్రజలకిస్తారు. పక్క గ్రామానికి చెందిన 40 కుటుంబాల వారు కంకాళి భవానీకి బలి ఇచ్చిన దున్నల కళేబరాలను పంచుకుంటారని తెలుస్తోంది. దేవాలయం వద్ద నుంచి దున్నపోతుల మొండేలను ట్రాక్టర్లో తరలించి పంపకాలు చేసుకుని వాటిని ఆరగిస్తారు. గిరిజన భక్తులు దేవతలకు బెల్లం, రొట్టెలను, పరమాన్నాన్ని సమర్పించారు. కొందరు భక్తులు తలనీలాలు సైతం ఇస్తుంటారు. దున్నపోతులను బలి ఇవ్వడం పూర్తికాగానే.. మేకపోతులు, గొర్రెపోతులను కూడా దేవతామూర్తి ముందు బలియిచ్చి మొక్కులు తీర్చుకుని అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేస్తారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈ సామాజిక అనాచారంపై స్థానికుడొకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కష్టకాలం వచ్చినప్పుడు అభయమిచ్చే కంకాళి భవానీ మాతకు మొక్కుకుంటే తప్పక కష్టాలు తీరుతాయని చెప్పాడు. ఇన్నేళ్లలో ఎన్నడూ రానన్ని దున్నపోతులను ఈ ఏడాది భక్తులు అమ్మవారికి బలి ఇచ్చారని, ఏటేటా జాతరకు జనం పెరుగుతున్నారని ఆయన వెల్లడించారు. -
రాములోరి కల్యాణం
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో వేదికపైకి తీసుకువచ్చారు. వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం మూడు గంటలపాటు వైభవంగా జరిపించారు. ప్రభుత్వం పక్షాన ఆలయ ఈవో దూస రాజేశ్వర్ దంపతులు పట్టువస్త్రాలను అందించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన శివపార్వతులు ఆనవారుుతీ ప్రకారం నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలం పట్టుకుని అంక్షింతలు చల్లుకుంటూ రాజన్నను వివాహమాడారు. ఓవైపు సీతారాముల కల్యాణం జరుగుతున్న సమయంలో మరోవైపు హిజ్రాలు నెత్తిన అక్షింతలు చల్లుకుంటూ పెళ్లిచేసుకున్నారు. మహాశివరాత్రి జాతరను తలపించే విధంగా దాదా పు మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. గురువారం రాత్రంతా స్వామి వారి దర్శనానికి అనుమతించినా ఐదు నుంచి ఆరు గంటలకు పైగా పట్టింది. సాయంత్రం యువకులు, హిజ్రాల నృత్యాలు, శివపార్వతుల పూనకాల మధ్య రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. కాగా.. తెలంగాణ వచ్చినా తమకు కనీస ప్రాధాన్యం కల్పించలేదని, ఇలాగైతే వచ్చే ఏడాది ఉత్సవాలకు తాము వేములవాడకు రాబోమని జోగిని శ్యామల అధికారుల తీరుపై మండిపడ్డారు. యాదాద్రిలో కల్యాణం కమనీయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయసన్నిధిలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. సీతారాములను పట్టువస్త్రాలు, నగల తో అలంకరించి ముత్యాల పల్లకిపై కల్యాణవేదిక వద్దకు చేర్చారు. మధ్యాహ్నం అర్చకుల వేద మంత్రాల మధ్య సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. దేవస్థాన ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సిం హమూర్తి దంపతులతోపాటు భక్తులు పాల్గొన్నారు. - యాదగిరికొండ ఒక్కటైన ఫ్యాక్షన్ గ్రామం ఐదు దశాబ్దాలుగా పగ, ప్రతీకారాలతో అట్టుడుకుతున్న ఆ గ్రామం సీతారాముల కల్యాణంలో ఒక్కటైంది. పోలీసుల కృషి ఫలితంగా ఫ్యాక్షన్ గొడవలకు బ్రేక్ పడింది. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో యాభై ఏళ్లుగా తరచూ ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో సీపీఎం, సీపీఐ పార్టీలదే ఆధిపత్య పోరు. శ్రీరామ నవమి కల్యాణోత్సవాలకు నిర్వహించినవారు మాత్రమే హాజరయ్యేవారు. - మఠంపల్లి -
శ్రీరామనవమి శోభాయాత్ర వైభవం
-
రామాలయాల్లో ఎమ్మెల్యే గడికోట పూజలు
వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి శుక్రవారం రామనవవి సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు చేశారు. వీరబల్లి మండలం గడికోట, సంబేపల్లి మండలం మోటకట్లలోని ఆలయాల్లో జరిగిన నవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
రామతీర్థంలో ఘనంగా నవమి వేడుకలు
విజయనగరం: ఆంధ్రా భద్రాద్రి రామతీర్థంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం 10.30 గంటలకు సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజితలగ్న సమయంలో సీతారాముల కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. 11.50 గంటలకు జీలకర్ర,బెల్లం కార్యక్రమం జరిగింది. 12.10 గంటలకు ముత్యాల తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కల్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామనవమి నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే స్వామివారి కళ్యాణం తిలకించేందుకు పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
అంగరంగ వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావించారు. పురోహితులు పవిత్రమైన అభిజిత్ లగ్నంలో కల్యాణ రాముడి చేత జగన్మాత వైదేహి మెడలో మాంగల్యధారణ చేయించారు. అంతకు ముందు వేద పండితులు మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం ఇలలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములోరి పెళ్లి జరిగినా భద్రాద్రి కల్యాణోత్సవం కనులారా చూసిన వారిదే వైభోగం. నీలమేఘశ్యాముని నామస్మరణతో భద్రాద్రి పరవశించింది. రామాయణ రసరమ్య సన్నివేశాలతో పులకించిన దివ్యధాత్రి భద్రాచలంలో రామయ్య కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తజనులు తరలి వచ్చారు. దాంతో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది. సీతారాముల కల్యాణానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కాగా శనివారం జరిగే శ్రీరాముడి మహాపట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారు. -
రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్
భద్రాచలం: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్నారు. శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా కేసీఆర్ కుటుంబసభ్యులు గతరాత్రే భద్రాచలం చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న రాములోరి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మరోవైపు భద్రాచలం భక్తజన సందోహం అయింది. శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోతుంది. -
ఒంటిమిట్టలో రాములోరి బ్రహ్మోత్సవాలు
వైఎస్ఆర్ జిల్లా : ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనాయి. అందులోభాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామి,అమ్మవార్లకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నేటి మధ్యాహ్నం శ్రీరామ జయంతి, సాయంత్రం భక్త పోతన జయంతిని నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 20వ తేదీన స్వామి వారికి కళ్యాణం, 21వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించేందుకు పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఒంటిమిట్ట రామాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ జేఈవో పి.భాస్కర్ హాజరయ్యారు. -
భద్రాద్రి బయల్దేరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయల్దేరారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కేసీఆర్తో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా భద్రాచలం బయల్దేరారు. షెడ్యూల్ ఇలా... ఉదయం 9.30గం.లకు మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో బయలుదేరారు. ఉదయం 10.30గం.లకు భద్రాచలంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి ఐటీడీఏ సమీపంలోని గహ నిర్మాణ శాఖ గెస్టుహౌస్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం 11గం.లకు సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి వస్తారు. సుమారు 20 నిమిషాలు పాటు ఆలయంలో పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11.30గం.లకు ఆలయం నుంచి కల్యాణ మండపానికి చేరుకుంటారు. l11.30 గం.ల నుంచి 12.30గం.ల వరకు సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అక్కడ నుంచి మళ్లీ రామాలయాన్ని 12.40గం.లకు దర్శించుకుంటారు. తరువాత హౌసింగ్ గెస్ట్హౌస్కు చేరకుంటారు. మధ్యాహ్నం 12.50గం.ల నుంచి 1.15గం.ల వరకూ విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15గం.ల నుంచి 1.45 గం.ల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. ఆ తరువాత భద్రాచలం నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి వెళతారు. -
ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రిలోను, ఇటు ఒంటిమిట్టలోను, రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ.. ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆయన కోరుకున్నారు. -
'శ్రీరాముడే మనకు ఆదర్శం కావాలి'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాష్ట్రంలో జరుపుకుంటున్న ఈ తొలి నవమిని ఊరూరా వేడుకగా జరుపుకోవాలని అభిలషిస్తున్నట్టు సీఎం చెప్పారు. లోక కల్యాణం కోరుకునే ఒంటిమిట్ట శ్రీరాముడు కొత్త రాష్ట్రంలో మన సమస్యల్ని ఒడ్డున పడేస్తారని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రుడే మనకు ఆదర్శం కావాలని, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లే శ్రీరామరాజ్యాన్ని మనం మళ్లీ దీక్షాదక్షతలతో సాధించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
రామయ్య పెళ్లికి..మండపేట బోండాలు
శ్రీరామ నవమినాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలో వినియోగించే కొబ్బరి బొండాలు తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి తరలనున్నాయి. రంగులను అద్ది, రంగురంగుల రాళ్లు, పూసలు, రిబ్బన్లతో అలంకరించిన ఈ బొండాలు వివాహ వేడుకలో సీతారాముల పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మండపేటకు చెందిన కాజులూరి వెంకట అచ్యుతరామారెడ్డి 16 ఏళ్ల నుంచి ఏటా క్రమం తప్పకుండా కొబ్బరి బొండాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి వివాహానికి కానుకగా అందజేస్తున్నారు. రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వతహాగా వివాహాది శుభకార్యాల్లో వినియోగించే కొబ్బరి బొండాలను అందంగా అలంకరిస్తుంటారు. అలా అలంకరించిన బొండాలను సీతారాముల కల్యాణ వేడుకకు కానుకగా అందజేయాలన్న రామారెడ్డి ఆకాంక్షే 2001 నుంచి భద్రాద్రికి బొండాలను తీసుకువెళ్లడాన్ని ఆనవాయితీగా చేసింది. శ్రేష్టమైన బొండాలను సేకరించి, వాటికి ఎనామిల్, వాటర్ పెయింట్లు వేసి, పూసలు, రాళ్లు, రిబ్బన్లవంటివాటితో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అలంకరణ పూర్తయ్యేందుకు దాదాపు 15 రోజులు పడుతుందని రామారెడ్డి తెలిపారు. ఎప్పటిలాగానే.. శంఖుచక్రాలు, తిరు నామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా కొబ్బరి బొండాలను ముస్తాబు చేశామని, తాము తయారుచేసిన బొండాలను సీతారాముల పాదాల చెంత గొప్ప అనుభూతి కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మొదట్లో భద్రాద్రికి మాత్రమే బొండాలు పంపగా, ఇప్పుడు జిల్లాలో ప్రసిద్ధి చెందిన గొల్లలమామిడాడ, సత్యవాడ తదితర పది ఆలయాలకు కానుకగా అందజేస్తున్నామన్నారు. గత ఏడాది నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకకు కూడా పంపుతున్నామని, ఈ ఏడాది విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగే కల్యాణోత్సవానికీ పంపామని తెలిపారు. కాగా రామారెడ్డి దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన బొండాలతో గురువారం సాయంత్రం భద్రాద్రి బయలుదేరి వెళ్లారు. -
నవమికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15వ తేదీన జరుగనున్న సీతారామచంద్రుల కల్యాణమహోత్సం, 16వ తేదీన జరుగనున్న పటాభిషేకం వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు బీహెచ్ఈఎల్, కూకట్పల్లి, ఎంజీబీఎస్ల నుంచి నేరుగా భద్రాచలంకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. నగరంలోని అన్ని ఏటీబీ కేంద్రాల నుంచి, బస్స్టేషన్ల నుంచి అడ్వాన్స్ టిక్కెట్లు పొందవచ్చు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ 7382856644,7382858517 నెంబర్లను సంప్రదించవచ్చు. -
రాజన్న సన్నిధిలో నవరాత్రోత్సవాలు ప్రారంభం
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఈ నెల 15న శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజ అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామి వార్లకు పుణ్యహావచనం, రుత్విక్హరణం, పంచోపనిషత్, మహాభిషేకం నిర్వహించారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి త్రిరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తుల రథోత్సవం ఉంటుంది. రాజన్న సన్నిధిలో జరిగే రాములోరి పెళ్లికి వేలాది మంది శివపార్వతులు తరలివచ్చి రాజన్నను కల్యాణమాడటం ఇక్కడి విశేషం. -
మిన్నెసోటాలో శ్రీరామనవమి వేడుకలు
అమెరికా: 'శ్రీరామ నవమి' మనందరికీ తెలిసిందే. ఇదొక హిందువుల పవిత్ర పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం నవమి రోజున ఈ పండుగను చేస్తారు. ఈ శ్రీరామ నవమి మహోత్సవాలు శనివారం యూఎస్ఏలోని మిన్నెసోటాలో ఘనంగా జరిగాయి. అక్కడ మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాతా) ఆధ్వర్యంలో హిందూ దేవాలయంలో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి 600 పైగా భక్తులు హాజరయ్యారు. ఈ వేడుకను ఆలయ పూజారులు ఆరంభించారు. వందలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఆలయ పూజారి మురళి భత్తార్ కన్యదానం, మాంగల్యధారణ, తలంబ్రాల సేవ, అర్చన, ఆరతి ర్యక్రమాలను నిర్వహించారు. మాతా అధ్యక్షుడు సుధాకర్ జపా, ఆయన కుటుంబ సభ్యులు, మాతా బోర్డు సభ్యులు శ్రీరామ దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. వేంకట దేవులపల్లి గ్రూపు అందించిన రామభజన, రామదాసు కీర్తనలతో భక్తులు ఆనందించారు. పూజ తర్వాత ఆర్గనైజర్లు భక్తులకు పానకం(తేనీరు) ప్రసాదించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులకు, ఆలయ యాజమాన్యానికి, కమిటీ సభ్యులకు మాతా ప్రెసిడెంట్ సుధాకర్ జపా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతా బోర్డు సభ్యులు జి.మహిందర్, నెల్ల నాగేందర్, అల్లమనేని నిరంజన్, బచ్చిగారి రాజశేఖర్, రవ్వా రమేష్, సాగి రవి, భగవాన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, కోమకుల రమేష్, కంజుల రాకేష్, కోయాడ పవన్, సక్రు, కపిడి కవిత, మద్దిశెట్టి శివాని, పట్టూరి యుగేందర్, తాళ్ల సారథి, బుచ్చిరెడ్డి, సురేష్, శ్రీపాద దేవరాజు, ఆదిత్య, కాదర్ల అనుష్క, గూనుగంటి అశ్విని, కూర మాలతి, భవాని చేపూరి, కౌకోటి రాజ్, చిన్నోల అమర్ తదితరులు పాల్గొన్నారు.